Suryapet
-
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
శ్రీరామయ్య జీవితం స్ఫూర్తిదాయకం
నేరేడుచర్ల : కమ్య్టూనిస్టు ఆశయాల కోసం తుది శ్వాస విడిచేంత వరకు కొనసాగిన గొప్పనేత శ్రీరామయ్య అని, ఆయన జీవితం నేటి కమ్యూనిస్టులకు స్ఫూర్తి దాయకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండలం మూడారం గ్రామంలో శ్రీరామయ్య భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే భూమి కోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర నేత మల్లు లక్ష్మి మాట్లాడుతూ శ్రీరామయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు పారేపల్లి శేఖర్రావు, కోదమగుండ్ల నగేష్, అనంత్ ప్రకాశ్, సిరికొండ శ్రీను, పోశనబోయిన హుస్సెన్, మర్రి నాగేశ్వర్రావు, కట్ట మధు బాబు, నాగ సైదులు, శ్రీధర్, బాబురావు,. రాణమ్మ, జానకిరాములు, రామ్మూర్తి, హఫీజ్, నర్సింహ్మ, పాతూరి శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
సూర్యాపేటటౌన్ : అతి కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన సమానమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సాధించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విదేశీ పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాములు మాట్లాడుతూ జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టు, తరగతికొక టీచర్ను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి. వెంకటయ్య ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, ఉపేందర్రెడ్డి, మంజుల, శ్రీనివాసరావు, అనిల్కుమార్, బాల్రాజ్, వెంకటేశ్, సత్తిరెడ్డి, వేణుగౌడ్, పింగల్రెడ్డి పాల్గొన్నారు. ఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరి పారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. 24న కలెక్టరేట్ ఎదుట నిరసనసూర్యాపేటటౌన్ : ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించలేదని విమర్శించారు. పీఆర్సీ ఫిట్మెంట్ వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు యాకయ్య, సుభాని, రమేష్, లాలయ్య, హనుమంత్, మల్లికార్జున్, సాల్మన్, మహేష్, మధు కుమార్, మహేందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, నర్సయ్య, రవి కుమార్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం
ఫ ముఖ్య అతిథులుగా హాజరైన గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ భువనగిరిటౌన్ : పీఎం సంసద్ పోటీల్లో విజేతలకు ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్, కేంద్ర మంత్రికి అదనపు కలెక్టర్ భాస్కర్రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు. -
డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదు
నల్లగొండ టౌన్ : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండికి అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు వస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ను సీపీఐ ఆద్వర్యంలో సందర్శిస్తామన్నారు. ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం పరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో బొల్గూరి నర్సింహ, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రవణ్కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు గవర్నర్, కేంద్ర మంత్రి రాక
భువనగిరిటౌన్ : పీఎం సంసద్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ఆదివారం భువనగిరి పట్టణానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రానున్నారు. ఇందుకు గాను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేస్తున్న వేదిక ఏర్పాట్లను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేంద్గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. -
ఫూలే, జగ్జీవన్రామ్ చూపిన మార్గాలే దిక్సూచి
తుంగతుర్తి : మహాత్మా జ్యోతిబాఫూలే, జగ్జీవన్రామ్ చూపిన మార్గాలే మనకు దిక్సూచి అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే విగ్రహావిష్కరణ, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. అనంతరం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్, చింతకుంట్ల మిట్టల్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), మందుల నరేష్, చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రేగటి రవి, సుంకరి జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే మందుల సామేల్ -
కట్టెల పొయ్యితో కుస్తీ !
కోదాడ : వంటగ్యాస్ కొరతతో కోదాడలోని ఓ హోటల్ యజమాని కట్టెల పొయ్యితో వంటకాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో వంట చెరకు క్వింటా రూ.700 ఉండగా ప్రస్తుతం వీటి ధర కూడా వెయ్యి రూపాయలకు చేరింది.శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి నిత్య కల్యాణం వైభవంగా చేశారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
జీడీడీపీలో మెరుగు
స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో సూర్యాపేట 9వ స్థానం 2025 డిసెంబర్ 22వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చిన్న తరహ పరిశ్రమల్లో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 2,38,879 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, 64,723 పరిశ్రమలతో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 38,113 పరిశ్రమలతో సూర్యాపేట 10వ స్థానంలో ఉండగా, 25,469 పరిశ్రమలతో యాదాద్రి భువనగిరి జిల్లా 17వ స్థానంలో ఉంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రై జెస్ (ఎంఎస్ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్ పోర్టల్లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది. స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది. తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది. జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వే –2023 వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధిక రేషన్ షాపులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 1051 రేషన్ షాపులు ఉండగా, 5,38,650 రేషన్ కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 611 రేషన్ షాపులు ఉండగా, 3,69,926 కార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉండగా, 2,50,292 రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడి జిల్లాలోనే చాలా తక్కువ భూములు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో సగటున 5,30,742 మంది చేతుల్లో (ఇండివిడ్యువల్స్) 5,14,402.40 ఎకరాలు ఉండగా, సూర్యాపేటలో 2,86,897 మంది చేతుల్లో 2,64,521.06 ఎకరాల భూమి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,33,535 మంది చేతుల్లో 2,32,250.67 ఎకరాలు ఉంది. అందులో నల్లగొండలో వ్యవసాయం చేసే 66,876 మంది ఎస్సీల చేతుల్లో 42,125 ఎకరాలు ఉండగా, 75,264 మంది ఎస్టీల చేతుల్లో 58,186 ఎకరాలే ఉంది. సూర్యాపేట జిల్లాలో 29,970 మంది వ్యవసాయం చేసే ఎస్సీల చేతుల్లో 16,159 ఎకరాలు ఉండగా, 43,713 మంది ఎస్టీల చేతుల్లో 31,968 ఎకరాల భూమి మాత్రమే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 28,223 మంది ఎస్సీలకు 16,487 ఎకరాలు, 14,542 మంది ఎస్టీల చేతుల్లో 9542 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు వర్షపాతంలో వ్యత్యాసం నమోదవుతోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 76 శాతం వ్యత్యాసం నమోదైంది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం వ్యత్యాసం ఉండగా, సూర్యాపేటలో 30 శాతం వ్యత్యాసం నమోదైంది. ఫ పరిశ్రమల్లో పది.. తలసరి ఆదాయంలో 14వ స్థానం ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే ఫ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న ఔత్సాహికులు సోషియో ఎకనామిక్ ఔట్లుక్–2026 వెల్లడి -
దోచుకుని పంచుకునేందుకే బడ్జెట్
ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శ సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడారు. రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ సిటీ పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయానికి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు నిధులు కేటాయించలేదని, ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు కూడా నిధులు లేవన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు బడ్జెట్లకు రూ.12వేల కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్ళు అయిందని, ఇక ఉన్నది రెండు బడ్జెట్లు కాబట్టి వచ్చినవన్నీ దోచుకుందాం పంచుకుందాం అన్న రీతిలో ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, తూడి నర్సింహారావు, ఆకుల లవకుశ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాలకు ప్రతీక రంజాన్
సూర్యాపేటటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు పలించాలని, త్యాగా లకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్ది అని, ఆయన హయాంలోనే పండుగల ప్రాధాన్యత పెంచుకున్నామని, అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రమాద స్థలాల పరిశీలనతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పోలీస్స్టేషన్ను ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను, తిరుమలగిరి క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యత తీర్చేందుకు ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాపారులు రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడతారని తెలిపారు. అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత కార్యాచరణ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణ రహదారులకు మహర్దశ
బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గ్రామాలను కలుపుతూ ఉండే లింక్ రహదారులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించినట్లుగా నిధులు విడుదల చేస్తే ఈ రహదారులన్నీ బాగుపడి రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాయితీలపై రుణా లను మంజూరు చేసేందుకు గతేడాది ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆయా వర్గాల నుంచి దాదాపు 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిధులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ బడ్జెట్లో సుమారుగా రూ.6వేల కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. -
సమతుల్యంగా ఉంది
కోదాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమతుల్యంగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. విద్యారంగానికి 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. ఇది 10 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ఆహ్వానించదగిన పరిణామం. ఉద్యోగులకు, పెన్షనర్లకు డిజిటల్ ఆరోగ్య కార్డులు, ద్యివాంగ విద్యార్థులకు వాహనాలు ఇస్తామనడం మంచి నిర్ణయం. – బడుగుల సైదులు, ఆర్థిక విశ్లేషకుడు, కోదాడ -
మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్య కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, విష్వక్సేనారాదన, పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. మాంగల్యధారణ తంతు కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
2,38,464 కుటుంబాలకు ధీమా
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పధకాలకు తోడుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో కుటుంబ పెద్ద ఏదైనా కారణంతో మృతిచెందితే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు. ఈ పథకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలో 2,38,464 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రభుత్వం అమలు చేయనుంది. విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుండగా.. జిల్లాలో 2వేల మందికి పైగా ఇంటర్ విద్యార్థుల ఆకలి తీరనుంది. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్ఓ
మునగాల : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్ ప్రసీద్కుమార్, మండల వైద్యాధికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో 230మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రవీందర్ తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ నల్లపాటి ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్, రిటైర్డ్ ఎంఈఓ ఓరుగంటి రవి, డాక్టర్ మణికుమారి, రేఖ, బడుగుల యశ్వంత్, రంజిత్ కుమార్, రాజు, రవీందర్, పుష్ప పాల్గొన్నారు.సబ్స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలనగరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం శివారులో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రాయినిగూడెం, ముత్యాలనగర్, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ గుండు రామాంజిగౌడ్, ఏఈ గన్న సాయికృష్ణ, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఎల్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను తగ్గించింది. గతేడాది బడ్జెట్లో రూ. 297.95 కోట్లను ఇచ్చిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.195.85 కోట్లకే పరిమితం చేసింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇక మూసీకి గతేడాది రూ. 50 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.30.15 కోట్లకే పరిమితం చేసింది. జిల్లాలో ఉన్న శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) స్టేజ్–2 కాలువల విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకోనుంది. దీంతో జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టనుంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ పనులకు గతేడాది కంటే భారీగా పెంచింది. జిల్లాలో దీనికోసం గతేడాది రూ.34.01 కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి రూ. 276.86 కోట్లు కేటాయించింది. దాదాపు రూ. 242.85 కోట్లు అదనంగా ఇచ్చింది. కాలువుల, డిస్ట్రిబ్యూటరీల కోసమే ఈ నిధులను కేటాయించింది. -
మక్క సాగుపై మక్కువ
మేళ్లచెరువు : ఖరీప్లో సాగుచేసిన పత్తి, కంది, పెసర వంటి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఈ యాసంగి సీజన్లో మొక్కజొన్న పంటపై దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. ప్రస్తుతం మేళ్లచెరువు మండల వ్యాప్తంగా సుమారు 1020 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. తక్కువ రోజుల్లోనే దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణమైంది. ధర ఆశాజనకం..బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు 2,100 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు ధర లభిస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొక్కజొన్నసాగు ద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామని ఆశిస్తున్నారు. మొక్కజొన్న సాగుకు వ్యయం ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కవ. ఎకరాకు కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. తెగుళ్ల బెడద మొక్కజొన్నకు నామమాత్రంగానే ఉండడంతో పురుగుమందుల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పంట దిగుబడి కూడా ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకు వస్తుండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.ఫ తక్కువ పెట్టుబడి.. మెరుగైన దిగుబడి ఫ గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల ఆసక్తి -
పెన్షన్లకు మోక్షం..
చేయూత పెన్షన్ పథకం కింద.. సాధారణ పెన్షన్లు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల చొప్పున అందిస్తున్నారు. చివరిసారిగా 2022లో కొత్త పెన్షన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు రూ.500 వరకు ఉంటుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో సుమారుగా 15వేలకు మందికి లబ్ధి చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంత కానుంది. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే దాదాపు రూ.5500 కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 5,400 ఇళ్లకు బిల్లుల చెల్లింపు జరగనుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి కానున్నాయి. ఇక రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నిరాశ చెందారు. -
‘లవ్వాలా’ సినిమా డైరెక్టర్ అడ్లూరు వాసి
శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్కుమార్ డైరెక్టర్గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లోగల కాకతీయహిల్స్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్వాలా’ అనే సినిమాకు రంజిత్కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. రంజిత్కుమార్ సినిమా డైరెక్టర్ కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సీతారాంరెడ్డి
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. పశు సంతతి గుర్తించాలిపశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి. మేలు జాతి పశువుల శరీర లక్షణాలుపాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పొదుగు లక్షణాలుపశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి. పశువుల కొనుగోలులో గుర్తుంచుకోవాల్సిన విషయాలుఅక్టోబర్, నవంబర్ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి. చూడాల్సిన అంశాలు● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి. ● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి. ● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి. ● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి. ● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి. ● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి. ● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి. ● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే పశువులను కొనకూడదు● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే) ● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం ● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు ● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.పశువుల బరువు తెలుసుకోవడం పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు. కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు. ఎల్ అనగా పశువు ముందు జబ్బ పాయింట్ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో. జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది. పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు -
రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొడ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం
నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
‘యూనిటీ’కి గద్దర్ అవార్డు
● కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ తీసిన భూదాన్పోచంపల్లి వాసి ● డిప్యూటీ సీఎం చేతులమీదుగా అవార్డు అందుకున్న దర్శకుడు, నిర్మాతభూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలి ఉద్యమనేత, మాజీ మంత్రి దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్పోచంపల్లికి యువ దర్శకుడు బడుగు విజయ్కుమార్ దర్శకత్వంలో, చౌటుప్పల్కు చెందిన చిత్ర నిర్మాత ధనుంజయ్య రూపొందించిన ‘యూనిటీ’ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డు–2026 దక్కింది. ఈమేరకు గురువారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు చేతుల మీదుగా దర్శకుడు బడుగు విజయ్కుమార్ అవార్డు, రూ.5లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యతను పెంచింది దర్శకుడు విజయ్కుమార్ మాట్లాడుతూ.. గద్దర్ ఫిల్మ్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చిత్ర విజయంలో అండగా నిలిచిన నిర్మాత చిరందాస్ శ్రీకాంత్, ధనుంజయ్య, చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ్య మాట్లాడుతూ.. తాము రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే 12 అవార్డులు లభించాయని తెలిపారు. కాగా.. పోచంపల్లి వాసి రాష్ట్రస్థాయిలో గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం పట్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, భారత లవకుమార్, కొండా లక్ష్మణ్బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, అడ్వకేట్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎంఏ షరీఫ్, కార్టూనిస్ట్ దయానంద్, రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం
సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు. 60 మంది బాధితుల నుంచి రూ.కోటి 85లక్షల వసూలు నిందితుడి అరెస్టు, రిమాండ్ -
ఆటోను ఢీ కొట్టిన కారు
మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యాపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ● ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు -
అన్న ప్రసాదానికి రూ.6 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు. గంజాయి పట్టివేత సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
దేవరకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యవసాయ కూలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మంతు తిరుపతి(45) గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగానే పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే గల ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంతిప్పర్తి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తిప్పర్తి మండలంలోని గడ్డికొండారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరమళ్ల చంద్రయ్య(55) ఓ వ్యక్తికి సంబంధించిన తోటలో కాపలాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పడిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం చంద్రయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మహిళ అదృశ్యంనల్లగొండ: నల్లగొండలోని అన్సారీ కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. ఈమేరకు కుటుంబసభ్యులు శుక్రవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్సారీ కాలనీకి చెందిన బోధ (45) తాను నందిగామకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆమె నందిగామకు చేరుకోలేదని తెలిసింది. ఈమేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోధ ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ ఎస్ఐ 87126 70176కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. -
నూనెల ధరలు సలసల..
ఫ కిలో రూ.170కి చేరిన పల్లీ, సన్ఫ్లవర్ ఆయిల్ ఫ గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 పెరుగుదల ఫ యుద్ధం సాకుతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఆందోళనలో సామాన్య ప్రజలునల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ప్రీడమ్ ఆయిల్, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి హోల్సేల్, రిటేల్ వ్యాపారులు వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరను పెంచుతూ పోతున్నారు. జిల్లా అంతటా వంట నూనెల పరిస్థితి ఇలాగే ఉంది. హోల్సేల్ డీలర్లు సిండికేట్గా మారి..గత నెలలో పామాయిల్ కిలో ప్యాకెట్ ధర రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.140కి చేరింది. ప్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ గత నెలలో కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.170 అయ్యింది. వేరుశగన (పల్లీ) నూనె గతంలో రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.170కి చేరింది. హోల్సేల్ డీలర్లు సిండికేట్గా ఏర్పడి యుద్ధాన్ని సాకుగా చూపుతూ నూనెల ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట నూనెల ధరలు నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో హోల్సేల్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం శుభాకార్యాల సీజన్ కావడంతో పాటు ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి. – ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ -
మరో ఇద్దరికి విప్ హోదా
సాక్షి ప్రతినిది, నల్లగొండ : శాసన సభ, శాసన మండలిలో పలువురి సభ్యులకు విప్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్గా తుంగతుర్తికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ హోదా దక్కింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా వచ్చింది. వేముల వీరేశం, అద్దంకి దయాకర్కు ప్రభుత్వ విప్ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు విప్ హోదా -
నెలాఖరు నుంచి..
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. జిల్లాలో సాగైన వరి ఎంత.. ఎంత దిగుబడి రానుంది.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది.. ఈ మేరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న అంచనాలతో జిల్లా యంత్రాంగం కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో వరి కోతలు ఊపందుకోనుండడంతో ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.82 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇందులో సన్నాలు 2 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిగతాది దొడ్డు రకం ఉండగా.. మొత్తంగా ధాన్యం దిగుబడి దాదాపు 8 నుంచి 9 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే సన్నరకం ధాన్యానికి, దొడ్డురకం ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతంలో మొదటగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి.. అక్కడ సాగైన వరి ఏ రకం.. అన్న ఆధారంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఇందులో ఏ శాఖ నుంచి ఎన్ని సెంటర్లు నడపనున్నాయని.. ఎక్కడ అన్నది క్షేత్ర స్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిల్లుల కేటాయింపు నుంచి రవాణా దాకా..యాసంగి ధాన్యం కేటాయింపుల కోసం మిల్లుల గుర్తింపు ప్రక్రియను సైతం అధికారులు చేపట్టారు. బ్యాంకు గ్యారెంటీలు, అగ్రిమెంట్ సమర్పించిన మిల్లులకే ఈ సీజన్లో ధాన్యం కేటాయించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు కావాల్సిన వాహనాలకు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ మండల స్థాయి కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతుల డిమాండ్ మేరకు కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంటుంది. రైతులకు రవాణా చార్జీలు సైతం తగ్గి.. అందుబాటులో సెంటర్లు ఉండనున్నాయి. ఇక గన్నీ బ్యాగులను మిల్లర్ల నుంచి సేకరించి కేంద్రాల ప్రారంభం నాటికి సిద్ధం చేయనున్నారు. దాదాపు కోటి ఐదు లక్షల మేర గన్నీ బ్యాగులు ఈ సీజన్లో అవసరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.యాసంగి వరి సాగు విస్తీర్ణం 04.82 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం 4.10 లక్షల మెట్రిక్ టన్నులు ఫ యాసంగి ధాన్యం సేకరణకు సన్నాహాలు ఫ 4.10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం ఫ గన్నీ బ్యాగులు, ఇతరత్రా సౌకర్యాల కల్పనకు కార్యాచరణ -
ప్రభుత్వ భవనాలకు మోక్షమెప్పుడో..
కోదాడరూరల్ : మండలంలో పలు ప్రభుత్వ భవన నిర్మాణాలు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. ఏళ్ల తరబడి భవనాల పనులు ఆగుతూ.. సాగుతూ నత్తనడకన సాగుతున్నాయి. కోదాడ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్తో పాటు గణవపరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు ముందుకు సాగడం లేదు. ఎనిమిదేళ్లైనా అసంపూర్తిగా.. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీ వద్ద ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.42 లక్షల నిధులు మంజూరు చేసింది. 2018లో నాటి అధికారులు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టిన మూడు నెలలకే బేస్మెంట్ వరకు చేపట్టిన పనులకు నిధులు విడుదల కావడం లేదని నిలిపివేశాడు. ఆరేళ్ల తర్వాత 2024 లో నిధులు విడుదల కావడంతో స్లాబ్ వేశాడు. ఆ తర్వాత మళ్లీ నిధులు విడుదల రాలేదని పనులు ఆపాడు. ఎనిమిదేళ్లైనా భవన నిర్మాణం పూర్తికాలేదు. దీంతో అద్దె భవనంలో స్టేషన్ స్టేషన్ను కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకై ్సజ్ సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం స్టేషన్కు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ ఖర్చులు పెరిగాయని.. మండలంలోని గణపవరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలకు 2022లో ఒక్కో భవనానికి జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. అదే సంవత్సరంలో అధికారులు, నాటి పాలకులు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటన పనులు ప్రారంభించారు. కానీ నిధులు విడుదల కావడం లేదని బెస్మెంట్ లెవల్లోనే పనులు నిలిపివేశాడు. ఆ తర్వాత చేసిన పనులకు నిధులు విడుదలైన తర్వాత పనులు ప్రారంభించి స్లాబ్ వేసి గోడలు కట్టి ప్లాస్టింగ్ పనులను సగం వరకు చేపట్టి వదిలేశారు. పనులకు సంబంధించి మెటీరియల్ ఖర్చులు పెరిగాయని మరికొంత నిధులు అదనంగా మంజూరు చేయిస్తేనే పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్లు చెప్పడంతో ఆ నాలుగు భవనాలు గత నాలుగేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో గణపవరంలో పంచాయతీ భవనంలోని ఓ గదిలో, తొగర్రాయిలో ఓ అద్దె భవనంలో, దోరకుంటలో పురాతన భవనంలో, నల్లబండగూడెంలో ఓ ప్రభుత్వ భవనంలో ఓ గదిని తీసుకొని వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు కలుగజేసుకొని నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆయా గ్రామాల ప్రజులు, సిబ్బంది కోరుతున్నారు.ఫ ఎనిమిదేళ్లైనా పూర్తికాని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ నిర్మాణం ఫ అసంపూర్తిగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -
దివ్యాంగుల నిరసన
చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెఓచ్పీఎస్) ఆధ్వర్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన పెన్షన్లు పంపిణీ చేయాలని, లేనియెడల ఈ నూతన సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి సర్కార్కు ‘పరాభవం’ తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి ఈదయ్యబాబు, మున్న మధుసూదన్, పిట్ట వెంకట్రెడ్డి, మున్న మల్లయ్య, ఖాదర్, రత్తమ్మ, ఇమాంబీ, వెంకటమ్మ, సత్యం, పాషా, నారయణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
గోదావరి జలాల నిలిపివేత
ఫ మళ్లీ 27 నుంచి వదలనున్న అధికారులు అర్వపల్లి : యాసంగి సీజన్కుగాను వారబందీ విధానంలో 5వ తడిగా విడుదల చేసిన గోదావరి జలాలను గురువారం నిలిపివేశారు. ఈసారి వారబందీ విధానంలో మూడురోజులపాటు అదనంగా వదిలారు. తిరిగి వారబందీ విధానంలో 6వతడి చివరి విడతగా ఈ నెల 27 నుంచి వదలనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. మట్టపల్లిలో గరుడ వాహన సేవ మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో గురువారం గరుడవాహన సేవను ఊరేగించారు. అంతకుముందు శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కావడంతో గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సమాజ సేవతోనే గుర్తింపు చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన దాసరి శ్రీరాములు(విద్యారంగం), డాక్టర్ మూడ సుదర్శన్ (వైద్యరంగం), యేళ్ల భయ్యన్న(జర్నలిజం), కొంతం సత్తిరెడ్డి(వ్యవసాయం)లకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, ఏఎంసీ చైర్మన్ వినోదమోహన్రెడ్డి, శ్రీకనకదుర్గా ఆలయ చైర్మన్ ఆంజనేయులు, సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ పాల్గొన్నారు. -
బత్తాయి ధర మందగమనం
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్పై ప్రభావం పడింది. దీంతో ప్రస్తుత వేసవిలో బత్తాయి ధర పెరగకపోగా కోతలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా బత్తాయి, నిమ్మ కాయలకు అంతగా విదేశీ ఎగుమతులు ఉండవు. ఎగుమతులకు అవసరమయ్యే లారీల కొరత కారణంగా మార్కెట్ స్తంభించింది. సొంత ప్రాంతాలకు వెళ్లిన లారీలుఢిల్లీ పరిసర ప్రాంతాల లారీల డైవర్లు హోలీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి ఇంకా తిరిగా రాలేదు. ఈసారి కురిసిన అధిక వర్షాలకు కశ్మీర్లో ఆపిల్ పంట దెబ్బతినడంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం వల్ల విదేశాల నుంచి విమానాల ద్వారా ఆపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో లారీలకు కిరాయిలు దొరకక అక్కడే నిలిచిపోవడంతో ఇక్కడ లారీల కొరత ఏర్పడింది. రంజాన్ పండుగ కారణంగా కూలీల కొరత, మార్కెట్లో క్రయవిక్రయాల్లో మందగమనం నెలకొంది. కత్తెర పంట కోతలోనూ జాప్యంబత్తాయి కత్తెర దిగుబడులు సాధారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమమవుతాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కత్తెర ముందు సీజన్ కాయల కోతలు పూర్తికాలేదు. ఆ కాయలకు కత్తెర దిగుబడుల్లో కలిసి అధిక ధర వస్తుందని ఆశిస్తున్నా కోయడంలో జాప్యం జరిగి కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే రేటు కుదుర్చుకున్న వ్యాపారులు పలు కారణాల వల్ల కాయలు కోయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలేని కత్తెర పంట ఫ వరుస పండుగలు.. లారీల కొరతే కారణం ఫ యుద్ధ ప్రభావంతో నిలిచిన ఎగుమతులు -
ఉగాది.. ప్రత్యేకం
● మోత్కూరులో ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ● నేడు బోనాలు, ఎడ్ల బండ్లతో నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకనున్న ప్రజలుమోత్కూరు: ఉగాది పండుగను ఏటా మోత్కూరు పట్టణంలో ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. డప్పు చప్పుళ్లు.. పూనకాలతో వీధి వీధి నుంచి బయలుదేరే బోనాలు ఓ పక్క.. రంగు రంగుల పూలు, కాగితాలు, కొబ్బరి మట్టలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, కార్లు, ట్రాక్టర్లు మరో పక్క వేగంగా పరుగెత్తుతుండగా నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకడం చాలా కాలంగా వస్తున్న ఆచారం.తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాది పండుగకు ఎక్కడున్నా మోత్కూరుకు వెళ్లాల్సిందేనని స్థానిక ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా మోత్కూరులో విభిన్న రీతిలో ఉగాది పండుగ జరుపుకుంటారు. పూర్వ కాలంలో ఇక్కడ వేసవిలో మశూచి సోకి పలువురు చనిపోయే వారు. దీంతో గ్రామంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురయ్యారని గ్రామస్తులు భావించారు. ఉగాది పండుగ రోజున అమ్మ వారికి ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లతో బోనాలు సమర్పించి, జంతువులను బలిఇచ్చి శాంతింపజేయడంతో మశూచి మాయమైనట్లు పలువురు పెద్దలు తెలిపారు. నాటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తారు. ఎడ్ల బండ్లకు ఆకు పచ్చని కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు కట్టి ఊరేగింస్తారు. ఎడ్ల బండ్లు, బోనాలతో ప్రదర్శన నిర్వహించిన అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనలు చేయిస్తారు. అనంతరం స్థానిక చెరువు కట్టపై కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి, అంగడి బజార్లో ఉన్న చిన్న ముత్యాలమ్మ తల్లి ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ద్విచక్ర వాహనదారులు, యువకులు ఆనందోత్సాహాలతో విన్యాసాలు ప్రదర్శిస్తారు. -
కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలి : మంత్రి ఉత్తమ్
హుజూర్నగర్ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర ఆరంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ ఉగాది అని పేర్కొన్నారు. కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. రైతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
శ్రీలక్ష్మీనరసింహునికి విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణంలో భాగంగా బుధవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట
అక్రమ రవాణాపై పటిష్ట నిఘాగురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026సూర్యాపేటటౌన్ : అక్రమ రవాణా, అసాంఘిక చర్యలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డితో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సామాజిక రక్షణ, శాంతి భద్రతల అంశాలు, చట్టాల అమలు, సామాజిక భద్రతలో పౌరుల బాధ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, యువత భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. సోదరభావంతో నిర్వహించుకోవాలి ఉగాది, రంజాన్ పండుగను ప్రజలందరూ సోదరభావంతో నిర్వహించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భానుపురి (సూర్యాపేట) : వేసవి తాగునీటి ప్రణాళికలు ఖరారయ్యాయి. రానున్న మూడు నెలల పాటు ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా యంత్రాంగం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మాసంలోనే ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిషన్ భగీరథ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో తాగునీటి వనరుల వివరాలను సర్వే ఆధారంగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు 2,662 పనులకు గాను రూ.6.46 కోట్లు అవసరమవుతాయని భావించి తాగునీటి ప్రణాళిక తయారు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు, 836 ఆవాసాలు ఉన్నాయి. దాదాపు 2.28 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఏటా గ్రామాల్లో వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. దీన్ని నివారించేందుకు గాను వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. తాగునీటి వనరుల మరమ్మతులకు పంచాయతీ నిధులనే వెచ్చించనున్నారు. ఇందుకు రూ.6.42 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆయా గ్రామాల్లో సింగిల్, త్రీఫేజ్ మోటార్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు నీరు తక్కువగా పోస్తున్న బోరు బావులకు ప్రెషింగ్ చేయించాలని నిర్ణయించారు. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని చేతి బోర్లను కూడా బాగుచేయించాలని ప్రతిపాదనలు పంపించారు. అవసరాన్ని బట్టి అద్దె బోర్లుఆయా గ్రామాల్లో అవసరమైన చోట అద్దె బోర్లను మాట్లాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం యాసంగి పంటల సాగుకు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. మరో నెల తర్వాత పంటలు కోత దశకు వస్తాయి. అప్పుడు నీటి అవసరం తగ్గుతుంది. భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో రైతుల నుంచి అద్దె బోర్లను మాట్లాడుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక మేరకు అన్నిరకాల సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు రైతుల నుంచి అద్దె బోర్లు తీసుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గుర్తించిన పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.కోదాడ: వాయిదా పడిన కోదాడ పబ్లిక్క్లబ్ ఎన్నికలు తిరిగి ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్ఆర్కే మూర్తి బుధవారం క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఉందని తెలిపారు. 25న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని, 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఆయన వివరించారు. సభ్యులు సకాలంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.సర్వేలో గుర్తించిన అంశాలుసమస్య ప్రాంతాలు నిధులు(రూ.లలో)చేతిపంపు రిపేర్లు 420 1.07 కోట్లు సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు 23 12.50 లక్షలు త్రీ ఫేజ్ బోరు మోటార్లు 83 55.09 లక్షలు పైప్లైన్ లీకేజీలు 488 1.29 కోట్లు నీటిట్యాంకుల మరమ్మతులు 188 56.76 లక్షలు ఇంటినల్లాలు బిగించాల్సింది 1460 2.85 కోట్లు మొత్తం 2662 6.46 కోట్లు -
దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు
నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని, మరోసారి దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు హెచ్చరించారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చండూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్రెడ్డి, కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్ తదితరులు ఉన్నారు. డ్రగ్స్పై సిట్తో ఒరిగేదేమీ లేదుహైదరాబాద్ శివారులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫాంహౌస్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినవన్నీ ఉత్తమాటలే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఫామ్హౌస్కు డ్రగ్స్కు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో నాయకులే పాల్గొనడటం బాధాకరమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణ సమాజంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూర్యాపేట : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇరాన్పై యుద్ధం మూలంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరకకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విజయ్ కన్వెన్షన్ హాల్లో సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు – దాని పర్యవసానాలు’ అంశంపై జరిగిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై 60 రూపాయలు పెంచిందని, మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా ఇరాన్పై యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా.. ఇరాన్ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోటే ఇజ్రాయిల్తో కలిసి దాడులకు పాల్పడిందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా కలిసి పాలస్తీనాను స్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్పై గురిపెట్టాయన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను హతమార్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసినా భారత ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం అన్యాయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే నూతనకల్: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూముల రీసర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా సహాయ సంచాలకుడు, సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల పరిధిలోని యడవెల్లి, పెద నెమిల గ్రామాల్లో భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ప్రకాష్, సర్పంచ్లు చురుకంటి లావణ్య మధుసూదన్రెడ్డి, జటంగి సరితకృష్ణ, ఆర్ఐ హాసన్ పాల్గొన్నారు. -
మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
హుజూర్నగర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్లో మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు చింతా బాబు, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం హుజూర్నగర్లో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 30న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం చింతా బాబు మాట్లాడుతూ.. ఈ నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబ్బ రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి, జిల్లా యువసేన అధ్యక్షులు బి. నాగరాజు, ఎం. వెంకటయ్య, పి. కాటమయ్య, కే. నాగేశ్వరరావు, రాము, సైదులు, రవీందర్ పాల్గొన్నారు. -
సేంద్రియ పద్ధతిలో సాగుతో లాభాలు
పెద్దవూర : బత్తాయి రైతులు సేంద్రియ సాగుతో లాభాల బాట పట్టవచ్చని రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఆరీఫ్ఖాన్ తెలిపారు. బుధవారం పెద్దవూర మండలం పర్వేదుల రైతు వేదికలో బత్తాయి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విచ్చలవిడిగా రసాయన మందులు, ఎరువులు వాడటం వలన భూమిలో సారం తగ్గి, సాగు ఖర్చులు పెరిగి, సరైన దిగుబడి రాక బత్తాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని అదిగమించేందుకు ప్రతి రైతు సేంద్రియ పద్ధతిలో బత్తాయి సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా జీవ ఎరువులైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమొనాస్, పిఎస్బి, కెఎస్బి, వేస్ట్ కంపోజర్ తదితర కల్చర్లను క్షేత్రస్థాయిలోనే తయారు చేసుకుని బత్తాయి తోటలకు వాడుకోవాలని సూచించారు. దీంతో భూమిలో మేలైన బ్యాక్టీరియా పెరిగి మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. అనంతరం అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి కె. మురళి మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన బత్తాయి మొక్కలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న పథకాలను రైతులకు వివరించారు. మండల వ్యవసాయాధికారి సందీప్రెడ్డి మట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం కూరగాయలు సాగు చేసే రైతులకు వెజిటెబుల్ మినీ కిట్స్ అందజేశారు. సమీపంలోని బత్తాయి తోటలోకి వెళ్లి బత్తాయి చెట్లకు వచ్చిన తెగుళ్లను పరిశీలించి, వాటి నివారణకు పలు సూచనలు చేశారు. పెద్దవూరలో మిట్టపల్లి శ్రీనివాస్ సమీకృత సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న ఆయిల్ ఫామ్, మునగ, పుచ్చ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎరీస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్రావు, బత్తాయి అభ్యుదయ రైతు కట్టెబోయిన శ్రీనివాస్యాదవ్, ఉద్యాన విస్తరణ అధికారులు రాంప్రసాద్, జనార్దన్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవిచందర్, దేవ, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు -
పథకాలతో ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్భానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పన కింద 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రాయితీలపై అందించే పథకాలను పొంది ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టర్లో షెడ్యూల్డ్ కులాల కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, బ్యాంకర్లతో కలెక్టర్ వెబ్ఎక్స్ మీటింగ్ నిర్వహించారు. ఎస్సీ యువత నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 24వ తేదీలోగా http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కార్యనిర్వాహక సంచాలకులు దయారాణి, జిల్లా ట్రాన్స్ఫోర్ట్ అధికారి జయప్రకాశ్రెడ్డి, ఎల్డీఎం ఎంవీఎన్ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏడీ అశోక్ వ్యవసాయ శాఖ అధికారి ప్రణవి పాల్గొన్నారు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి : కలెక్టర్ ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వేడుకలను నిర్వహించాలని పేర్కొన్నారు. -
పశుపోషణపై రైతులకు అవగాహన
పెన్పహాడ్ : పశు సంపదతో రైతులు లాభాలు పొందవచ్చని జిల్లా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు బి.వెంకన్న అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని జల్మాలకుంట, గూడెపుకుంట తండాల్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో పశువైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు లాభసాటి పశు పోషణ, పాడిలో అవలంభించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామానాయక్, పశువైద్యాధికారి యర్రంశెట్టి కిరణ్కుమార్, అనంతుల వెంకన్న, జయసుధ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నిషేధంపై ఆగ్రహం
ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రిభువనగిరి జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన ఇళ్లు, నివేశన స్థలాలను తొలగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం శాసనసభలో ప్రఽశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 39400 ఇళ్లను రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22 ఏలో చేర్చారన్నారు. దీంతో ఆయా ఇళ్లు క్రయ విక్రయాలు నిలిచిపోయాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ప్రభుత్వం వెంటనే పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితానుంచి తొలగించి పేదలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ నిషేధిత జాబితాపై ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులపై క్రిమినల్ కేసులునమోదు చేయాలని ఐలయ్య కోరారు. సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా జిల్లాలో చిచ్చురేపుతోంది. నిషేధిత జాబితాలో చేర్చిన నివేశన స్థలాలు, ఇళ్లను తొలగించాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది. దీనిని ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలు సవాల్గా తీసుకొని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో పోరాడుతుండగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈఅంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. జాబి తానుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరారు. భారీగా నిషేధిత ఆస్తులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాను రూపొందించారు. ఇందులో మొత్తం 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22 ఏ పీవోటీ చట్టంలో చేర్చారు. మొత్తం 2,450 సర్వే నంబర్లలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వీటితో పాటు సీఐడీ, సిట్, ఏసీబీ కేసుల్లో ఉన్న 258 ఎకరాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు నిలిచిపోయి, ఆస్తుల విలువలు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కలెక్టర్కు వినతి నిషేధిత జాబితా నుంచి పేదల పేర్లు తొలగించాలని కోరుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఆలేరులోని సర్వే నంబర్లు 7, 46, 526, 589, 961, 1019, 1026, 1044, 1106, 1115తోపాటు, ఆలేరు మండలంలోని తొమ్మిది గ్రామాలలో తెచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని సెక్షన్ 22ఏ కింద భూములను నిషేధిత ఆస్తుల రిజిస్టర్లో చేర్చడాన్ని రద్దు చేయాలని కలెక్టర్ను కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారని, ఆ ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఉన్నాయని, హౌస్ టాక్స్, నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు క్రమంగా చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ జాబితా నుంచి తొలగించాలని కోరింది.కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే సునిత, బీఆర్ఎస్ ప్రతినిధులుఫ నిషేధిత జాబితా నుంచి పేదల ఇళ్లు, స్థలాలు తొలగించాల్సిందే ఫ క్షేత్రస్థాయిలో పోరుబాటపట్టిన బీఆర్ఎస్, బీజేపీ ఫ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన విప్ బీర్ల ఐలయ్య ఫ కలెక్టర్కు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే సునీత -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
చెర్వుగట్టులో ఘనంగా లక్షపుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈఓ మోహన్బాబు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ఈ పూజల్లో అర్చకులు సతీష్శర్మ, సురేష్శర్మ, శ్రీకాంత్శర్మ పాల్గొన్నారు. -
అధిక వడ్డీ పేరిట మోసగించిన వ్యక్తుల అరెస్టు
పెద్దవూర : అధిక వడ్డీ ఆశచూపి పలువురిని మోసగించిన నలుగురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ బి. శ్రీనునాయక్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం హాజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్తండాకు చెందిన వడ్త్య భీమా అధిక వడ్డీ ఇస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించాడని పెద్దవూర మండలంలోని పాల్తీతండాకు చెందిన పాల్తి కోటేష్ ఈ నెల 7న పెద్దవూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం వడ్త్య భీమాతో పాటు దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజానగర్తండాకు చెందిన నేనావత్ రమేష్, డిండి మండలం హజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్తండాకు చెందిన ఆంగోతు సురేష్, రాత్లావత్ గణేష్ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. లక్షల రూపాయలు సేకరించి పరారీ.. అయితే వడ్త్య భీమా, అతడి సహచరులు శేఖర్బాబు (డైరెక్టర్), నేనావత్ రమేష్(అకౌంటెంట్), ఆంగోతు సురేష్(సహాయకుడు) తదితరులు కలిసి హైదరాబాద్లో ఎస్బీవీ గ్రీన్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్, బీకాయిన్ వరల్డ్ డెవలపర్స్ పేర్లతో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్లు ఏర్పాటు చేశారని సీఐ పేర్కొన్నారు. పెట్టుబడులపై అధిక వడ్డీ, డబ్బు డబుల్ అవుతుందని నమ్మబలికి అమాయక ప్రజలను మోసగించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడు పాల్తీ కోటేష్ నుంచి రూ.1,94,50,000తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది నుంచి కూడా లక్షల రూపాయలు సేకరించినట్లు వివరించారు. అనంతరం కంపెనీలను మూసివేసి, సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారయ్యారని పేర్కొన్నారు. తమ విచారణలో నిందితులు కుట్రపూరితంగానే నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపి మోసం చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. మొదట కొంతమందికి వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించి, అనంతరం పెద్దఎత్తున పెట్టుబడులు సేకరించినట్లు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. ఈవిధంగా చందంపేట, పెద్దఅడిశర్లపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి తదితర మండలాలకు చెందిన అనేక మంది నుంచి సుమారు రూ.40 కోట్ల వరకు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇలా సేకరించిన డబ్బులతో భూములు కొనుగోలు చేసి, ఆన్లైన్ ట్రేడింగ్ చేసి నష్టపోయినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఒక పెన్డ్రైవ్, భూములకు సంబందించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
ఇసుక అక్రమ నిల్వలపై దాడులు
అనంతగిరి : మండల పరిధిలోని పాలారం గ్రామంలో కొందరు వ్యక్తులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచరం అందడంతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్లను గుర్తించారు. సుమారు 43 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యదర్శికి అప్పగించినట్లు తహసీల్దార్ కె. హిమబిందు పేర్కొన్నారు. కాగా.. ఇసుక డంప్ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియలేదని ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐ వెంకటనగేష్, సిబ్బంది పాల్గొన్నారు. 43 ట్రాక్టర్ల ఇసుక సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు -
భార్యను కత్తితో పొడిచిన భర్తకు రిమాండ్
ఆత్మకూరు(ఎం) : భార్యను కత్తితో పొడిచిన భర్తను పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన దేవికి, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన వెంపటి మహేష్తో 2012లో వివాహం జరిగింది. వీరు బీబీనగర్లో ఉంటూ తాపీ మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే దేవి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మహేష్ అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల దేవి తన పుట్టిల్లు ఆత్మకూరు(ఎం)కు వచ్చింది. దేవిని తీసుకెళ్లడానికి మహేష్ సోమవారం ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా.. మహేష్ కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దేవిని విచక్షణారహితంగా పొడిచాడు. దేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం మహేష్ను రిమాండ్కు తరలించినట్లు సీఐ హనుమంతు తెలిపారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి అదృశ్యం మునుగోడు : కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన బొజ్జ వంశీ మంగళవారం కుటుంబ సభ్యులపై అలిగి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. వంశీ ఆచూకీ తెలిస్తే 99120 68559, 95050 02559 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి లింగాలఘణపురం : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం –పాలకుర్తి రోడ్డులో చీటూరు సమీపంలో అప్పిరెడ్డిపల్లి గ్రామ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరికి చెందిన డ్రైవర్ మహ్మద్ జహీర్ (55) డీసీఎంలో మొక్కజొన్న లోడ్తో పాలకుర్తి నుంచి జనగామ వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో చీటూరు సమీపంలోని అప్పిరెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన మహ్మద్ జహీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ ఊర చెరువులో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవని సీఐ పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కారోబార్ పర్వతం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన 87126 62744, 87125 53699 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది
దరఖాస్తులు ప్రారంభం : 2026 మార్చి 18చివరి తేదీ : 2026 మే 10ఎంపిక జాబితా ప్రకటన : 2026 మే 30మొదటి విడత కౌన్సిలింగ్ : 2026 జూన్ 05పెద్దవూర : తెలంగాణలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. బాసర ట్రిపుల్ ఐటీలో 1500 సీట్లు, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో 180 సీట్లు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు www.rgukt.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1500, ఎన్ఆర్ఐ విద్యార్థులు 100 యూఎస్ డాలర్లు ప్రవేశ రుసుం చెల్లించాలి. రిజర్వేషన్లు ఇలా.. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఎ 7, బీసీ–బి 10, బీసీ–సి 1, బీసీ–డి 7శాతం, బీసీ–ఈ 4 శాతం, ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు 1, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు. వేరే రాష్ట్రాల వారికి, భారతీయ పౌరసత్వం కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.33శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రవేశ విధానం.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జెడ్పీహెచ్ఎస్లలో చదివిన విద్యార్థులకు 4 శాతం మార్కులు(ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు మొత్తం 24 మార్కులు) విద్యార్థికి వచ్చిన పదో తరగతి మార్కులకు కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. మార్కులు సమానమైతే.. ఒక వేళ పదో తరగతిలో విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మొదట గణితం, తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లిష్, సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ కూడా సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజీలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయినా కూడా మార్కులు సమానమైతే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ఇవీ సమానంగా ఉంటే హాల్టికెట్ నంబర్ను పరిగణలోకి తీసుకుని ఫైనల్ లిస్ట్కు ఎంపిక చేస్తారు. ఫీజుల వివరాలు.. ● మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.36వేలు, ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40వేల చొప్పున చెల్లించాలి. ● ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అర్హులైలే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ● ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.37 లక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3,01,000 ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అన్నీ ఉచితమే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్నీ ఉచితంగా అందజేస్తుంది. ల్యాప్టాప్, మూడు జతల షూ, హాస్టల్లో అవరమైన వస్తువులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. బాసర, మహబూబ్నగర్ క్యాంపస్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే 10వ తేదీ వరకు అవకాశం పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సువర్ణావకాశంఅర్హతలు ఇవీ..2026లో నిర్వహించిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 2025 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలలో మొత్తం 1680(1500+180) సీట్లకు గాను 85శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించారు. మిగతా 15శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. -
జూదరుల అరెస్ట్
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి 8 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పెండింగ్ ఎక్స్గ్రేషియా చెల్లించాలినల్లగొండ టౌన్ : గీత కార్మికులకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలని గీత పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం ఏర్పాటు చేయాలని, గీత వృత్తికి నష్టం కలిగిస్తున్న మద్యం బెల్టు షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొడిగె సైదులు, సురిగి చలపతి, పుల్లయ్య, లాలు, పల్లె శంకర్, జోగు సురేందర్, మాదగోని మల్లయ్య, దేవేందర్, లెనిన్, గంగాదేవి, గ్యాలయ్య పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి పెద్దవూర: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన పెద్దవూర మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్భాంజ్ జిల్లాకు చెందిన రామ్రే ఎంబర్రం(23) రెండు నెలలుగా పెద్దవూర మండల కేంద్రంలోని కార్తికేయ టెక్స్టైల్ కాటన్ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కాటన్ మిల్లు నుంచి తన స్నేహితులైన రూపానాయక్, మంజు పూర్తిలతో కలిసి కూరగాయలు కొనుగోలు చేయడానికి జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి వెంట పెద్దవూర మండల కేంద్రానికి నడుచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో కొండమలేపల్లి వైపు నుంచి పెద్దవూర వైపు అతివేగంగా వస్తున్న కారు రామ్రే ఎంబర్రంను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో రామ్రే ఎంబర్రం ఎగిరి రోడ్డు పక్కన పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువు డుంబీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
శాలిగౌరారం : రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలో 365 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన మల్లెపాక స్వామి, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే స్వామి మృతిచెందడంతో సైదమ్మే పిల్లలను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడికి, కుమార్తెకు వివాహాలు చేసింది. చిన్న కుమారుడు శ్రీకాంత్(29)కు వివాహం కాలేదు. శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ తిరిగి రాలేదు. అయితే మంగళవారం తెల్లవారుజామున పెర్కకొండారం గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై శ్రీకాంత్ రక్తపుమడుగులో పడి ఉండటం గమనించిన స్థానిక రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. వెంటనే విషయాన్ని వంగమర్తి గ్రామస్తులకు చెప్పి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీఐ హరిబాబు నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. తన కుమారుడికి పెర్కకొండారం గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన కుమారుడిని రాత్రి సమయంలో పిలిపించి హత్యకు పాల్పడిందని మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. శరీరంపై దెబ్బలు.. తలపై నరికిన ఆనవాళ్లు శ్రీకాంత్ శరీరంపై బలంగా కొట్టిన దెబ్బలు ఉండడంతో పాటు తల వెనుక భాగంలో రెండు చోట్ల పదునైన ఆయుధంతో నరికిన గాయాలు ఉన్నాయి. దీంతో శ్రీకాంత్ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో వివాహిత..?శ్రీకాంత్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్కకొండారం గ్రామానికి చెందిన వివాహితను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే కారణమంటున్న మృతుడి కుటుంబ సభ్యులు శాలిగౌరారం మండలం పెర్కకొండారం సమీపంలో ఘటన -
సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన
మిర్యాలగూడ : దామరచర్ల రైతు వేదికలో ఆత్మ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి. శ్రీధర్ సమగ్ర వ్యవసాయం, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటల సాగుతో పాటు పాడి, కోళ్లు, చేపలు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలను చేపట్టినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. అంతేకాకుండా రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని, కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుందని, ఒక దాని వ్యర్థం మరొకదానికి ఆహారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ రుషేంద్రమణి, హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా, ఆత్మ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, బీటీఎం గిరి, ఏటీఎం కృష్ణ, ఏఈఓలు పార్వతి, ప్రియాంక, రైతులు మల్లేష్, బాలు, నగేష్, ధనలక్ష్మి, సర్పంచ్ మంగ్తా, ఉప సర్పంచ్ గాలి ప్రియాంక పాల్గొన్నారు. -
వేసవిలో ఆయిల్పామ్ సాగులో జాగ్రత్తలు
● ఎదిగిన ఆయిల్పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ను, ఒక కిలో బోరాక్స్ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వలన సమయం, ఎరువుల ఖర్చు ఆదా చేయవచ్చు. ● ఆయిల్పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపించినట్లైతే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కొరకు పంపాలి.పెద్దవూర : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడంతో రైతులు ఆయిల్పామ్ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే పంట దిగుబడిలో తగ్గి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్పామ్ రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఆయిల్పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుము, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన వెంటనే చిన్నచిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్(30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉన్నట్లైతే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్ఫామ్ తోటల్లో వేసవి కాలంలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాధనంతో రెండుసార్లు తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను మాత్రమే తొలగించాలి. ● ఆయిల్పామ్ తోటలలో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఆయిల్పామ్ రైతులకిచ్చిన డైరీలలో సిఫారసు చేసిన పద్ధతిలో పోషకాలను తప్పనిసరిగా అందించి అట్టి వివరాలను డైరీలలో నమోదు చేయాలి. ● ఎదిగిన ఆయిల్పామ్ తోటల్లో గెలలు కోసిన తర్వాత ముక్కలు చేసిన ఆయిల్పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఆయిల్పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తితో కోయాలి. -
60 కిలోల గంజాయి పట్టివేత
రామన్నపేట : ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నలుగురిని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద మంగళవారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేట, మోత్కూరు సీఐలు ఆర్. బాలాజీనాయక్, కె. రవిచంద్రారెడ్డి తమ సిబ్బందితో పంతంగి టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా 6.685 కిలోల ఎండు గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒడిశాలోని బరంపురం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు ఆటో, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన గంగాబాయ్ పాండురంగ చౌహాన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ అసరం గోరపడే, నల్లగొండకు చెందిన పల్లపుదాసు వేణుకుమార్ను అదుపులోకి తీసుకోని రామన్నపేట ఎకై ్సజ్ కార్యాలయాలని తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు ఎన్. శంకర్, బి. శివకృష్ణ, పి. సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నలుగురి అరెస్ట్ -
మారిషస్ పర్యటనలో పటేల్ రమేష్రెడ్డి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రంలో పర్యాటకం, వ్యవసాయంలో ఆధునాతన సాంకేతిక వినియోగం కోసం మారిషస్ దేశంతో కలిసి పనిచేసేందుకు గాను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డితో కలిసి మంగళవారం మారిషస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మారిషన్ ప్రధాని ధరం గోకుల్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, పెట్టుబడుల అవకాశాలు, పరస్పర సహకారంతో చేపట్ట గల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు హెవిన్ గురయ్య, సమన్వయ కర్త విశ్వకర్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్నగర్కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్లోని ఫిల్మ్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్గౌడ్కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సహాయకురాలితో ‘పది’ పరీక్షకు హాజరుమిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. -
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీకోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఎండుతున్న ఆశలు
భానుపురి (సూర్యాపేట) : ముదిరిన ఎండలు, అడుగంటుతున్న జలాలు, మొదలైన కరెంటు కష్టాలతో జిల్లా రైతాంగం తిప్పలు పడుతోంది. ప్రధానంగా వరి పంట ఎండుతోంది. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ నీటిని నమ్ముకుని చాలావరకు సాగు చేసిన పొలాలు కూడా ఎండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోనున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4.82లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగే 4.82 లక్షల ఎకరాలు ఉంది. సాగర్, మూసీ ఆయకట్టుతో పాటు ఎస్సారెస్సీ రెండోదశకు నీటిని విడుదల చేశారు. అలాగే బోరుబావుల కింద రైతులు వరినే అధికంగా సాగు చేశారు. ఆరుతడి పంటలు రైతులు పెద్దగా సాగు చేయలేదు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తాయని, బోరుబావుల్లో నీరు సమృద్ధిగానే ఉండడంతో మొదట్లో పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి వరి సాగు చేసిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరి పంటకు నీటి వాడకం పెరగడమే ఇందుకు కారణం. భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోయి బోరుబావులు సగానికి తగ్గాయి. సాగుకు కరెంట్ కష్టాలు రైతాంగానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గతంలో 15 గంటలకు పైగానే వ్యవసాయానికి కరెంటు అందగా.. ప్రస్తుతం ఒకట్రెండు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగం కాస్త పెరగడంతో ఓవర్లోడ్ కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు ఫీజులు కొట్టివేస్తున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వరి పొలాలకు నీటిని అందించడం గగనంగా మారింది. దీనికి తోడుగా చాలామంది రైతులు బోర్లు వేసినా కరెంటు డీడీలు కట్టకుండానే ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉండడంతో ఓవర్లోడ్ కారణంగా గంటకోసారి ఫీజులు పోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఫ ఎండల తీవ్రతకు అడుగంటుతున్న భూగర్భ జలాలు ఫ కరెంట్ కోతలతో నీరందక ఎండిపోతున్న వరి చేలు ఫ చివరి దశలో ఉన్న వరి పంట దక్కకుండా పోతుండడంతో ఆవేదన చెందుతున్న రైతులు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో వరి పంట అధికంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ బోరుబావులతో పాటు ఎస్సారెస్పీ రెండోదశ నీళ్లు వస్తాయన్న ఆశతో చాలామంది రైతులు వరి సాగు చేశారు. కరెంటు ఇబ్బందులు, ఎండలు ఉన్నప్పటికీ ఈ నీళ్లు వస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందని భావించినా.. ఆయకట్టు రైతాంగాన్ని జిల్లా యంత్రాంగం మర్చిపోయినట్లుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేజర్ కాలువలను దాటలేని పరిస్థితి ఉన్నప్పటికీ నీటి సరఫరాలో మిన్నకుండిపోవడం గమనార్హం. గతంలో ఆయకట్టు భూములకు నీళ్లు అందగా.. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం ఎండలతో పాటు కరెంటు కోతలు, ఎస్సారెస్పీ నీళ్లు రాకుండా పోతే దాదాపు 10వేల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుకు సంబంధించి 6 సెమిస్టర్లు ఉంటాయని, మొత్తం సీట్లు 60 ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశం పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. 10+2 పూర్తి చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని, గరిష్టంగా 23 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ల అర్హత ఉండాలని తెలిపారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2,500 స్టైఫండ్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు klbiiht.telangana.gov.in, ఈమెయిల్ iihthyderabad@gmail.com, 040–29367009 నంబర్ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణభానుపురి (సూర్యాపేట) : 2025–26 సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక ను ప్రభుత్వం ఆమోదించిందని, వివిధ పథకాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం నిమిత్తం అర్హులైన షెడ్యూల్డ్ కులాల వారు ఆన్లైన్ ద్వారా http://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాచరణ ప్రణాళిక ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష యూనిట్లకు (90) శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లకు (80) శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విలువ చేసే యూనిట్లకు (70) శాతం సబ్సిడీ, రూ.4లక్షలకు పైచిలుకు విలువ చేసే యూనిట్లకు (60) శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.5 లక్షలు) ఉంటుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలకు (100) శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మిగిలిన శాతం బ్యాంక్ లోన్ ద్వారా పొందాలని పేర్కొన్నారు. విశేషంగా లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి, శ్రీఆంజనేయస్వామి, గోదాదేవి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. నిత్య కల్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తిగట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి సూర్యాపేటటౌన్ : వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ కేటాయించింది మాత్రం 7 శాతం లోపే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగాలంటే బడ్జెట్ పెంచాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, సుదర్శన్, వెంకటయ్య, దేవేందర్, షేక్ ఉమర్, నాగన్న పాల్గొన్నారు. -
నిమ్మ.. బస్తా రూ.2500
నేను రెండు ఎకరాల్లో నిమ్మ సాగు చేశాను. వంద చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాకున్న వంద చెట్లకు గాను ఈ సీజన్లో 100 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా 20 బస్తాలకు మించి రాలేదు. దీర్ఘకాలిక పంట అయిన నిమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిలడక ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి. – యానాల శ్రీనివాస్రెడ్డి, నిమ్మ రైతు నెల్లిబండ, నకిరేకల్ మండలం నకిరేకల్ : నిమ్మకాయల రేటు ఒక్కసారిగా పెరిగింది. వేసవికాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలను ప్రజలు ఎక్కవగా వాడుతుండడంతో నిమ్మకు మంచి ధర వస్తోంది.. తెలంగాణలో ఏకై క నిమ్మ మార్కెట్ ఉన్న నకిరేకల్లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చైన్నె, కలకత్తా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం నకిరేకల్మార్కెట్లో నిమ్మ బస్తా (23 కేజీల టిక్కి) రూ.2000 నుంచి రూ.2500 పలుకుతోంది. కానీ నిమ్మ తోటలను తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు పెరిగినా రైతులకు ప్రయోజనం ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూమారు 30 వేల ఎకారాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20 వేల రైతు, కౌలుదారు కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు, మంచుతో పాటు చెట్లకు ఎర్ర తెగులు వ్యాపించాయి. దీంతో నిమ్మ చెట్లపైన పూత రాలిపోవడంతోపాటు పిందె కూడా లేకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఏటా మార్చి నుంచి మే వరకు నిమ్మకు మొదటి విడత మంచి సీజన్ ఆ తరువాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండో విడత సీజన్ ఉంటుంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే నిమ్మ ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు లాభం లేకుండా పోయింది. ప్రసుత్తం మార్కెట్ వచ్చేది 5 వేల బస్తాలే.. రెండు నెలల క్రితం నకిరేకల్ మార్కెట్కు రోజూ 10 వేల నుంచి 15 వేల బస్తాల దిగుమతులు వచ్చేవి. అప్పట్లో బస్తా ధర రూ.500 నుంచి రూ.700 ధర పలికింది. ఇప్పుడు 5 వేల బస్తాలకు మించి నిమ్మ దిగుమతులు రావడం లేదు. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల ధర రూ.2000 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది. మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోడంతో తోటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఒక్క చెట్టు నుంచి 3 నుంచి 4 బస్తాల దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఒక్క బస్తాకు మించి రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో భారీగా పెరిగిన నిమ్మ ధర ఫ వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులు ఫ ధర పెరిగినా రైతులకు దక్కని ప్రయోజనం -
రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలి
మునగాల: రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి కోరారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మునగాల యూనిట్ ఆధ్వర్యంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మునగాల యూనిట్ అధ్యక్షుడు శాకమూడి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఈనెల చివరి నాటికి ఈహెచ్ఎస్ కార్డులు ఇప్పించే బాధ్యత చేపడతానని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి భావజాలాన్ని ప్రజల్లో కలిగించేందుకు నడుం బిగించాలని ఆకాంక్షించారు. మునగాలలో భవన నిర్మాణానికి రూ.10లక్షల విరాళాన్ని అందజేసిన విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మి తులిసమ్మను అభినందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ లింగయ్య, అసొసియేట్ ప్రెసిడెంట్ రావెళ్ల సీతరామయ్య, పత్రికా సంపాదకుడు శరత్బాబు, రాష్ట్ర సెక్రటరీ అక్కిరాజు లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్ రెడ్డి, మండల బాధ్యులు, వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి -
అమెరికాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు
సూర్యాపేట అర్బన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలో భాగమేనని, దానికి మోదీ సర్కార్ వత్తాసు పలకడం సిగ్గుచేటని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శిక్షణ తరగతులు శనివారం సూర్యాపేటలో కే సూర్యం అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాజన్న, రామయ్య, హన్మేష్, వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముత్తెన్న, యాకుబ్ షావలి, ప్రవీణ్ రాష్ట్ర కోశాధికారి కిరణ్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, సుధాకర్, రాము, మధుసూదన్, పుల్లన్న, నరసింహ, రామ్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సన్న, సయ్యద్ హుస్సేన్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి
సూర్యాపేట అర్బన్: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని ఆపాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర కోశాధికారి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు. -
మొదటి రోజు 12,342 మంది హాజరు
ఫ ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 69 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొదటి రోజు తెలుగు పరీక్షకు 12355 మంది విద్యార్థులకు 12342 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ప్రైవేట్ విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, అడిషనల్ కలెక్టర్, డీఈఓ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిశీలన పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ నరసింహ -
వర్గరహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే
సూర్యాపేట అర్బన్: దోపిడీ నుంచి కార్మిక వర్గం విముక్తి చెందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దవ్వాలని, సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలని చెప్పిన సిద్ధాంతకర్త కార్ల్మార్క్స్ అని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు అన్నారు. సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్ల్మార్క్స్ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. ఉన్నవారే లాభాల పేరుతో అనుభవిస్తున్నారని , కార్మిక వర్గం శ్రమజీవులుగా, దోపిడీకి గురయ్యే వారుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికి కారణం శ్రమజీవులే అన్నారు. శ్రమ దోపిడీ విముక్తి సిద్ధాంతాన్ని మార్క్స్ తన పెట్టుబడి గ్రంథం ద్వారా సమాజం ముందు పెట్టారన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే సూర్యం, ఎస్ఎల్ పద్మ, జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ పార్టీ జిల్లా నాయకుడు పేర్ల నాగయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసయ్య పాల్గొన్నారు. -
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి : గోదావరి జలాలను 1200 క్యూసెక్కుల నుంచి 1600 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీటిని అందించడానికి పెంచినట్లు చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని కోరారు. కల్తీ నూనె దందాపై కదిలిన యంత్రాంగం కోదాడ: పట్టణంలో కల్తీ నూనె దందాపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోదాడకు వచ్చిన అధికారులు స్తానికి పోలీస్ అధికారులతో కలిసి.. అయిల్ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. లారీలో రవాణా అవుతున్నది రైస్బ్రాన్ అయిల్గా గుర్తించామని, లారీ డ్రైవర్ అక్రమంగా ట్యాంకర్ సీలు తొలగించి చిన్న డబ్బాలలో నింపి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించామని, కోదాడలో దీన్ని ఎవరి వద్దకు తరలిస్తున్నారన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ట్యాంకర్కు లైసెన్స్ ఉన్నప్పటికి రవాణా సమయంలో సీల్ పటిష్టంగా లేకపోవడాన్ని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత నూనెలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పుడ్ సేప్టీ అధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సమర్థవంతంగా సేవలందించాలిసూర్యాపేటటౌన్ : గర్భిణులు, తల్లులకు ఆరోగ్య కార్యకర్తలు సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. జిల్లాలో పనిచేస్తున్న 301 మంది ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీల్డ్ స్థాయి ఆరోగ్య సిబ్బంది.. గర్భిణుల నమోదు, ప్రసవానికి ముందు పరీక్షలు, శిశు టీకాలు, నవజాత శిశు సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ శిక్షణ ద్వారా తల్లి, శిశు ఆరోగ్య సేవలు గ్రామ స్థాయిలో మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా తబస్సుమ్, జిల్లా శిక్షణ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం విశేషంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నిత్య కళ్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
ఇంటర్ ముగిసింది
సూర్యాపేట టౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 26 న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన పరీక్షలకు మొత్తం 7,224 మంది విద్యార్థులకు 6,951 మంది హాజరు కాగా 273 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,960 మందికి 5,800 మంది హాజరు కాగా 160 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 1,264 మందికి 1,151 మంది హాజరు కాగా 113 మంది హాజరు కాలేదని డీఐఈఓ భానునాయక్ తెలిపారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, ఆటో స్టాండ్లు సందడిగా కనిపించాయి. -
సౌండ్ బాక్స్లు పెడితే కేసులే..
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెంలలో మూసీనది ఇసుక క్వారీల నుంచి ప్రతిరోజు దాదాపు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోంది. ఇక్కడి క్వారీల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లకు సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేయడం, అతివేగంగా నడపడం, కొన్ని ట్రాక్టర్లకు సరైన పత్రాలు లేకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం మూలంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో నాగారం సీఐ నాగేఽశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాక్టర్ల సౌండ్బాక్స్లను తొలగించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేసుకోవాలన్నారు. -
సుధా బ్యాంకుకు పురస్కారం.. గర్వకారణం
సూర్యాపేట : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ.. సుధా బ్యాంకుకు ఫైవ్ స్టార్ రేటింగ్ పురస్కారం ప్రదానం చేయడం తెలంగాణకే గర్వకారణమని ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంకు 52వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న సుధా బ్యాంకు అగ్రశ్రేణి బ్యాంకుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బ్యాంకు మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు వైస్ చైర్మన్ కక్కిరేణిచంద్రశేఖర్, డైరెక్టర్స్ ఏపూరి శ్రవణ్కుమార్, డాక్టర్ మీలా సందీప్, అప్పం శ్రీనివాస్ తోట శ్యాంప్రసాద్, డాక్టర్ మిన్న విజయలక్ష్మి, అనంతుల శారద, బాణావత్ సుజాత, స్వామి వెంకటేశ్వర్లు ఇరుకుల్లా చెన్నకేశవ రావు వెంపటి వెంకటరమణ, రింగు లక్ష్మీనారాయణ, భువనగిరి భాస్కర్, గండూరి శంకర్, పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు
69 కేంద్రాలు.. 12,403 మంది విద్యార్థులుసూర్యాపేట టౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు వేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఐదు నిమిషాలు(9.35గంటల) వరకు హాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. జిల్లాలో 357 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. వీటిలో 12,403 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు జరగనున్నాయి. ఐదు పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30గంటల నుంచి 11.30గంటల వరకు ఉంటాయి. ఫీజు చెల్లించలేదని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకున్నా.. విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్లను పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో విద్యార్థుల పుట్టిన తేదీ నమోదుచేసి హాల్ టికెట్ పొందవచ్చు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా సెంటర్లకు సీఎస్, డీఓలతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో సంబంధిత సీఎస్, డీఓలు ప్రశ్నపత్రాల సీల్ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేయనున్నారు. -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
భానుపురి(సూర్యాపేట) : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4,15,509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుతం 17,647 డొమెస్టిక్ సిలిండర్లు, 552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ను ఎవరైనా కమర్షియల్గా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్ను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడామని, త్వరలోనే సర్వర్ సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం గ్యాస్ సిలిండర్ సరఫరాపై మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడారు. కమర్షియల్ సప్లయ్ కొరత నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాగే జిల్లాలోని సాగునీటి అవసరాల కోసం సాగర్, మూసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్బాబు, డీఎం రాము తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హుజూర్నగర్ : మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ తదితర అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్ ఎస్.రాధాదుర్గా అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరగాలన్నారు. మహిళల పట్ల అక్కడక్కడ చూపుతున్న వివక్షను రూపుమాపాలని కోరారు. మహిళల సాధికారతకు పురుషులు సహకరించాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే వివక్ష రూపుమాపబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత మహిళా పెన్షనర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. నకార విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహిళా పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మహిళా పెన్షనర్లు ఎస్.లలిత, టి.విజయ మేరీ, చెన్న సౌభాగ్య, ఏ.సుధారాణి, బి.రామలక్ష్మి, థెరిసా, శ్రీలత, అంకతి అప్పయ్య, రఘునాథ్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, ఎంఎస్ఎన్ రాజు, సైదులు, లక్ష్మయ్య, చంద్రయ్య, దేవదానం పాల్గొన్నారు. -
విద్యార్థులకు ‘రవాణా’ భరోసా
చిలుకూరు: మారుమూల గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేవు. ఇక్కడి విద్యార్థులు ఆటోలు, బస్సులు, సైకిళ్లపై ఇతర గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండదు. ఉన్న గ్రామంలో చదువుకొనే అవకాశం లేక, ఇతర ప్రాంతాల్లోని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా భత్యం అందజేస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం రవాణా చార్జీల కింద ఈ ఏడాదికి సంబంధించి రూ.62.52 లక్షలు మంజూరు చేసింది. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 950 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఒక కిలోమీటరు దూరం, 6 నుంచి 10వ తరగతికి సంబంధించి 3 కిలోమీటర్లు దూరంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఈ చొప్పున అందుబాటులో పాఠశాలలు లేని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు చెందిన మొత్తం 1042 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. వీరందరూ రవాణా చార్జీలు పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది. వీరందరికీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ నుంచి ఒక్కక్కరికి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రవాణా చార్జీలు మంజూరయ్యాయి. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా మొత్తం 1042 మంది విద్యార్థులకు రూ.62 లక్షల 52 వేలు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫ 1,042 మందికి రూ.62.52 లక్షల రవాణా చార్జీలు మంజూరు ఫ ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 చొప్పున 10 నెలలకుగాను నగదు జమ -
వంట నూనె అక్రమ దందా!
కోదాడ: కోదాడ కేంద్రంగా వంట నూనె అక్రమ దందా సాగుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ– హైదరాబాద్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ నుంచి నూనె తీసి డబ్బాల్లో నింపి ఆటోల్లో తరలిస్తుండగా స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్తో పాటు నూనెను తరలిస్తున్న ఆటో పోలీసుల అదుపులో ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ట్యాంకర్ల సీల్ తీసి 20 లీటర్ల డబ్బాల ద్వారా తరలింపు విజయవాడ నుంచి కోదాడ మీదుగా ప్రతిరోజు హైదరాబాద్కు వంటల్లో వాడే నూనెను ట్యాంకర్లలో తరలిస్తుంటారు. ఈ క్రమంలో కోదాడలోని ఓ నూనె డిపో వ్యాపారి ట్యాంకర్ల డ్రైవర్లతో కుమ్మకై ్క ప్రతిరోజు కోదాడ బైపాస్ వద్ద, సమీపంలోని వెంచర్లలో ఈ ట్యాంకర్లను నిలిపి వాటికి వేసిన సీల్ తీసి ఆయిల్ను 20 లీటర్ల డబ్బాల్లో నింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్ను ఆటోల్లో డిపోకు తరలించి అక్కడ ఇతర నూనెలు కలిపి కల్తీ చేసి, వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు నేరుగా సరఫరా చేస్తున్నారని సమాచారం. మార్కెట్లో ధర ఉన్న సన్ప్లవర్, రైస్బ్రాన్, పామాయిల్ను ఇలా తక్కువ రేట్కు డ్రైవర్ల వద్ద కొనుగోలు చేసి ఇతర నూనెల్లో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. కోదాడ కేంద్రంగా సంవత్సరాల తరబడి వంట నూనె అక్రమ దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ డిపోల్లో లూజ్ ఆయిల్ అమ్మకూడదు. కానీ కోదాడలో మాత్రం లూజ్ ఆయిల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తూనికల కొలతల శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని పట్టణవాసులు అంటున్నారు. పట్టణంలోని పలు హోటళ్లకు ఈ కల్తీ నూనెను సరఫరా చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొంటున్నారు. ఈ కల్తీ దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో వంట నూనె డిపో వ్యాపారుల కుమ్మక్కు ఫ ట్యాంకర్ల నుంచి ఆయిల్ తీసి ఆటోల్లో డిపోకు తరలింపు ఫ ఈ నూనెను నేరుగా హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఇటీవల ఆయిల్ రవాణా చేస్తుండగా స్థానికులు పట్టుకోవడంతో బయటపడిన వ్యవహారం -
15న కోదాడ పబ్లిక్ క్లబ్ ఎన్నికలు
కోదాడ: కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకోనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన 200 మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతిసారి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండగా ఈ సారి పలువురు పోటీ పడుతుండడంతో ఎన్నిక అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కోదాడ పబ్లిక్ క్లబ్కు చెందిన కొత్త భవనం అమ్మడంతో రూ.మూడున్నర కోట్ల నిధులు క్లబ్ ఖాతాలో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉందని పలువురు క్లబ్ సభ్యులు పేర్కొంటున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుత అధ్యక్షుడు పట్టాభిరెడ్డితో పాటు ముడియాల భరత్రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, మేకల వెంకట్రావ్, పారా సీతయ్య, పయిడిమర్రిత్య బాబు, తీగల కరుణాకర్ పోటీపడుతున్నట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలో కోదాడ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేల నిర్ణయం కీలకం కానున్నట్లు తెలుస్తోంది. శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలికోదాడరూరల్ : భూసారాన్ని కాపాడుకునేందుకు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత రైతులకు సూచించారు. గురువారం కోదాడ మండల పరిధిలోని అల్వాలపురంలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్పీఎల్ శిక్షాణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు సాగులో రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమి సారాన్ని కోల్పోయి భవిష్యత్ తరాలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను వాడాలన్నారు. పంటల సాగుకు ముందు పచ్చిరొట్చె సాగు చేసుకొని దుక్కిలో కలిపి దున్నుకోవాలన్నారు. పశువుల ఎరువుల తప్పకుండా భూమిలో తోలుకోవాలన్నారు. నానో యూరియా, డీఏపీని పంటలకు స్ప్రే చేసుకోవాలని రైతులకు సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ సాగు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త, ఏడీఏ ప్రశాంతి, ఏఓ రజిని, ఆత్మ చైర్మన్ లింగయ్య, దేవప్రసాద్, ఏఈఓలు నగేష్, ఝూన్సీ, వినోద్, అన్వేష్, సల్మా ఉన్నారు. -
కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దు
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి ముస్తాబు చేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజలు చేసి మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం శ్రీత్రిదండి చినజీయర్స్వామి భక్తులనుద్దేశించి ప్రవచించారు. కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దని, ఆహారంలో షడ్రుచుల వల్లే జీవితంలో అన్ని ఎదుర్కొనే విధంగా మనసును స్థిరత్వం చేసుకోవాలన్నారు. దేవుడు గుడిలో, మనసులో రెండు రూపాల్లో కొలువై ఉన్నాడని రెండుచోట్లా దైవాన్ని స్మరించాలని తెలిపారు. అనంతరం తెలుగు సంవత్సరాది క్యాలెండర్, పంచాంగం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మై హోం సంస్థ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, రామ్మోహన్రావు, అరుణ దంపతులు, వినోద్రావు, రామురావు, శ్యాంరావు, జగపతిరావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఫ శ్రీత్రిదండి చినజీయర్స్వామి -
సుధా బ్యాంకుకు 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ పురస్కారం
సూర్యాపేట : సుధా బ్యాంకు అత్యుత్తమ నిర్వహణ, పనితీరు ఆధారంగా అంతర్జాతీయ హై క్వాలిటీ హైమ్ రేటింగ్ సంస్థ 5స్టార్ రేటింగ్ పురస్కారం ప్రకటించినట్లు సుధాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం త్రివేణి గార్డెన్లో సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరవుతారని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం కోదాడరూరల్ : బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 26 ఏళ్లుగా రూ.300 కోట్ల టర్నోవర్తో తమ 9శాఖల ఖాతాదారులకు నమ్మకంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా బంగారం, గృహ, వ్యాపార , వ్యక్తిగత రుణాలను తక్కువ వడ్డీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, డైరెక్టర్లు తోట శ్యామ్, స్వామి వెంకటేశ్వర్లు, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, వెంపటి వెంకటరమణ, బ్యాంకు మేనేజర్ చెన్నూరి రవికుమార్, సిబ్బంది ఉన్నారు. -
ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు అవి చేరేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, రైతుల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.20వేల కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీవైఎస్ఓ వెంకటరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ : హుజూర్నగర్లోని మోడల్ హౌసింగ్ కాలనీని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా హిళ్ల బ్లాక్లు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, విద్యుత్ డీఈ వెంకట కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు తదితరులున్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
బ్లాక్ మార్కెట్కు తరలిస్తే డీలర్షిప్ రద్దు చేస్తాం
సూర్యాపేట: ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే సదరు గ్యాస్ ఏజెన్సీల డీలర్షిప్లు రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై మీడియాతో మాట్లాడారు ఉత్తమ్,. ‘ గ్యాస్ కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయిల్ కంపెనీలకు రెఫరెన్స్ చేసి సామాన్య జన జీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ గ్యాస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఎల్పీజీ డీలర్లు సామాజిక సామాన్య ప్రజానికం వద్ద అక్రమాలకు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని డీలర్ షిప్ రద్దు చేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. -
సరిపడా నీళ్లొదలాలని రైతుల ఆందోళన
గోదావరి జలాల విడుదలలో ఆలస్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సరిపడా నీళ్లొదలాలని ఆత్మకూర్(ఎస్) మండల రైతులు మండలంలోని రామోజీతండా వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. రామోజీతండా ఎస్సారెస్పీ 22–ఎల్ కాలువ వద్ద ఏపూర్ ప్రధాన రహదారిపై 8 గ్రామాలకు చెందిన రైతులు సుమారు రెండు గంటలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చివరి పంటలకు నీళ్లు ఇస్తామంటూ చెబుతున్నా.. కనీసం కాలువల వెంట ఉన్న పంట పొలాలకు కూడా నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కలగజేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రామోజీ తండా, పుప్పాలగూడెం, కోటపాడ్, ఆత్మకూరు, నసీంపేట, రామన్నగూడెం, తేట్టకుంట తండా, కాశీగూడెం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం
మునగాల : నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మునగాల మండలం ఆకుపాములలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బినాన్స్, క్రిఫ్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యాశతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ప్రస్తుత సమాజాన్ని డ్రగ్స్ అనే చీడపీడ పట్టి పీడిస్తుందని.. డ్రగ్స్ను నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవత్తి పెరిగిపోతునుందన్నారు. యువత డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ రణబోతు శ్రీనివాస్రెడ్డి, గ్రామ సర్పంచ్ విలాసకవి ఇందిర, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మునగాల, కోదాడ టౌన్, సూర్యాపేట టౌన్ సీఐలు డి.రామకృష్ణారెడ్డి, శివశంకర్, వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్, రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీస్ సిబ్బంది, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం నడిగూడెం : మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం నడిగూడెం మండలం వల్లాపురంలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తప్పుడు మార్గంలో నడిచే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించాలన్నారు. అనంతరం వల్లాపురం గ్రామ సర్పంచ్ కేశగాని సరిత ఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతోపాటు ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్, వల్లాపురం సర్పంచ్ కేశగాని సరిత పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
రెండు దశల్లో జనగణన
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. 2011లో చివరిసారి జిల్లాలో జనగణన జరిగింది. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం ఇప్పటి నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. మొదటగా జిల్లాలోని ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామకం పూర్తి చేసి జనాభా లెక్కలను తీయనున్నారు. ఈ సారి జనగణనను డిజిటల్ విధానంలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రజల నుంచి సేకరించాల్సిన సమాచారంతో పాటు వివరాల నమోదు, తదితర విషయాలపై స్పష్టత కోసం జిల్లా నుంచి మండల స్థాయి అధికారుల వరకు శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం బుధవారం ప్రారంభించింది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి దశలో ఇళ్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ఎంతగానో దోహదపడుతోంది. ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా.. చివరిసారిగా 2011లో చేపట్టింది. అయితే 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఈ క్రమంలో 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయనున్నారు. జిల్లాలో ఈ గణన రెండు దశల్లో జరగనుంది. మొదటగా ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరగనుంది. ప్రత్యేక పోర్టల్ ద్వారా.. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టర్లను ఉపయోగించి గణన ప్రక్రియ ఉండనుంది. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి..? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న.. ? అనే అంశాలపై అధికారులకు శిక్షణతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అధికారులు బ్లాక్లను గుర్తించి ఎంపిక చేసిన ఎన్యూమరేటర్ల ద్వారా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం జనాభా 10,99,560 పురుషులు 5,49,560 మహిళలు 5,50,000 ఇళ్ల సంఖ్య 3 లక్షలకుపైగా.. ఫ మే 11 నుంచి ఇళ్ల లెక్కింపు ఫ 2027 ఫిబ్రవరిలో జనగణన షురూ ఫ ఈసారి డిజిటల్ విధానంలో వివరాల సేకరణ ఫ సిబ్బందికి శిక్షణ ప్రారంభం ఫ నేరుగా వివరాల నమోదుకు ప్రజలకూ అవకాశం -
అందని ఎస్సారెస్పీ నీళ్లు
అర్వపల్లి : ప్రస్తుత యాసంగి సీజన్కు గాను జిల్లాకు వారబందీ విధానంలో గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పునరుద్ధరించారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 8న నీటిని వదలాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగు రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. తొలిరోజు జిల్లాకు 1,200 క్యూసెక్కుల నీటిని వదిలారు. గురువారం నీటిని పెంచనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) : మండలంలో వరిసాగు చేసిన రైతులు అరిగోస పెడుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వరిసాగు చేసిన రైతులు నిన్నటి వరకు యూరియా కోసం నానా తిప్పలు పడగా ఇప్పడు పంట చేతికొచ్చే సమయంలో నీళ్లందక తమ వరిపొలాలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభమై భూగర్భ జలాలు తగ్గడంతోపాటు శ్రీరాంసాగర్ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నీళ్లు రాకపోవడంతో చేతికందేపంట కళ్లెదుటే ఎండిపోతుందని మండల రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 33 వేల ఎకరాల్లో వరిసాగు మండల వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో 33 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రధానంగా బోరు బావులు చెరువుల ఆధారంతోపాటు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి వరిపంట సాగు చేపట్టారు. కాగా ఎస్సారెస్పీ నీరు సక్రమంగా రాకపోవడంతో రైతుల ఆశలు గల్లంతవుతున్నాయి. వారబందీతో చివరికి చేరని నీరు మండల వ్యాప్తంగా 69, 71 డీబీఎంలతోపాటు దాని ఉపకాల్వలు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీ నీరు మండలంలోని పలు గ్రామాలకు చేరడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం వారాబంధి ద్వారా సాగునీరు వదులుతుండటంతో మధ్యలోనే నీరు ఆగిపోతుందని తాము ఎస్సారెస్పీ నీటిని నమ్ముకొని సాగు చేయడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో వరిపొలాలు మండలంలో సాగుచేసిన వరి పొలాలు ప్రస్తుతం పొట్ట దశలోకి వచ్చాయి. మరో 20 రోజులు నీటిని అందిస్తే పంట చేతికి వస్తుందని అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని ఎక్కువ మోతాదులో విడుదల చేయాలని మండల రైతులు కోరుతున్నారు. ఫ ఎండుతున్న వరిపొలాలు ఫ వారబందీ విధానంతో ఇబ్బందులు ఫ ఆందోళనలో అన్నదాతలు -
పెండింగ్ సీఎంఆర్ సకాలంలో ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : యాసంగి 2024–25, వానాకాలం 2025–26 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 యాసంగి సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లులు, అవసరమైతే బయట ప్రదేశాల్లో కూడా ధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్, అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందన్నారు. ఈ సీజన్కు అవసరమైన గన్నీలను మిల్లర్లు రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. గత సీజన్ సీఎంఆర్ డెలివరీ కొంతమేర పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మోహన్బాబు, జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లయ్ శాఖ సిబ్బంది, 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలిసూర్యాపేట : అంగన్వాడీలు, ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన తీరు గమనించి, అభిరామ్, నాగశ్రీ, లాస్య, శివకుమార్, శృతి అనే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వంట గదిని పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్
2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని, జనగణన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం శిక్షణ నిర్వాహకులు, సీపీఓ కిషన్ నాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనాభా గణాంక అధికారులు యువేందర్ బాబు, రవీంద్ర నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసు, మాస్టర్ ట్రైనర్ రమేష్, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 6 గంటలకు పట్టణానికి చేరుకుని స్థానిక రామస్వామి గుట్ట వద్ద హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 6.30 గంటలకు మంత్రి ఉత్తమ్ కోదాడ వెళతారు. ‘దక్కన్ సిమెంట్స్’లో కొనసాగుతున్న విచారణపాలకవీడు : మండల పరిధిలోని దక్కన్ సిమెంట్స్ కర్మాగార యాజమాన్యం అటవీ భూమిని ఆక్రమించినట్టు ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. కమిటీ ఆదేశాలతో సర్కిల్, జిల్లా అటవీ అధికారులు మూడు రోజులుగా విచారణ చేపడుతున్నారు. విచారణలో భాగంగా హైదరా బాద్ సర్కిల్ అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (సీసీఎఫ్) శర్వానంద్ బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) సతీష్కుమార్తో కలిసి దక్కన్ సిమెంట్స్ కర్మాగారం, సైదులునామా రిజర్వ్ ఫారెస్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమకు కేటాయించిన భూములు, అటవీ భూముల హద్దులు గుర్తించారు. త్వరలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధి కారులు వెల్లడించారు. ఈ విచారణలో ఫారెస్ట్ రేంజ్ ఆదిత్య, పాలకవీడు సెక్షన్ అధికారి నవీన్, బీట్, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయంచిలుకూరు : ఉద్యాన పంటల సాగుతో స్వల్వ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదా యం వస్తుందని జిల్లా ఉద్యాన వన అధికారి తీగల నాగయ్య అన్నారు. బుధవారం చిలు కూరు మండలం చెన్నారిగూడెంలో తీగ పందిరి ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన సాగుకు అందించే సబ్సిడీలను ఉపయోగించుకోవాలన్నా రు. కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి అనిత, విస్తరణాధికారి రంగు ముత్యం రాజు, శ్రీనివాస్, బ్రహ్మం పాల్గొన్నారు. నోడల్ బృందం తనిఖీగరిడేపల్లి : మండల కేంద్రలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా నోడల్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజనం, గ్రంథాలయం, ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షా ఫలితాలు, సీసీఈ రిపోర్టులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ టీమ్ అధికారి కె.గోపిరెడ్డి, నోడల్ సభ్యులు చారుగుండ్ల రాజశేఖర్, రఘునాయక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ప్రధానోపాధ్యాయులు హైమావతి, ఉపాధ్యాయులు కిషోర్బాబు, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
చర్చా వేదికలు.. భవిష్యత్కు పునాదులు
సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు చర్చా వేదికలు నిర్వహించడం ద్వారా వారి భవిష్యత్కు పునాదులు వేయవచ్చని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్ అన్నారు. సర్వశిక్ష అభియాన్, తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో విద్యార్థులకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇందులో జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో పీఎం శ్రీ పాఠశాల నుంచి విద్యార్థులు ఒక్కో దేశానికి ప్రాతినిధ్య వహిస్తూ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. విజేతలుగా 11 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలను దేశ రాయబారులుగా, దౌత్యవేత్తలుగా తయారు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు ఏలె హరికృష్ణ, శ్రవణ్ కుమార్, సోషల్ ఫోరం అధ్యక్షుడు వేముల సైదులు, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, న్యాయ నిర్ణేతలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కినపల్లి నాగమణి, డీఆర్పీ ఎ.సుదర్శన్రావు, కాకి సీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధర పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం
నూతనకల్ : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై రూ.60లు పెంచడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల రాజేశ్వరి, కంచర్ల నర్సమ్మ, నాయకులు కునుకుంట్ల సైదులు, దేసోజు మధు, దగ్గుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి
సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత శూన్య హస్తం చూపిస్తుందని విమర్శించారు. రైతు భరోసా నిధుల కోసం ఈ నెల 12న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కందాల శంకర్రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, రజిత, అప్పయ్య పాల్గొన్నారు. -
పతా్తలేని..చేయూత
భానుపురి (సూర్యాపేట) : చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు కావస్తున్నా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది. నాలుగేళ్లుగా ఒక్కటీ లేదు..! గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022, ఆగస్టులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు అర్హులైన వారికి ఒకేసారి అప్పటి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఆ తరువాత కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఎవరైనా మృతి చెందితే వారి పెన్షన్లు నిలిపేస్తున్నారే తప్పా కొత్తవి మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం 20వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో వృద్ధ్దాప్య, వితంతు పెన్షన్ల దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. పెంపు కోసం నిరీక్షణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా చేయూత పెన్షన్లను పెంచుతామంటూ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తమ పింఛన్లు పెరుగుతాయని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయూత పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఇతర పెన్షన్లు రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లు రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. ప్రభుత్వం పెన్షన్లు పెంచితే లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.ఫ కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూపులే ఫ నాలుగేళ్లుగా నిలిచిన పెన్షన్ల మంజూరు ఫ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు ఫ జిల్లాలో సుమారు 20వేల దరఖాస్తులు పెండింగ్ -
మోడల్ కాలనీ పనులు పూర్తి చేయాలి
హుజూర్నగర్ : మోడల్ హౌసింగ్ కాలనీలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్ పరిధిలోని రామస్వామి గుట్టవద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు. ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు నాటింపు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హతలేని వారి పేరు జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. జాబితాను సూక్ష్మంగా పరిశీలించి అవకతవకలకు తావు లేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్రెడ్డి, ట్రాన్స్కో డీఈ వెంకటకృష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత పాల్గొన్నారు -
ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట సబ్ జైలును ఆమె సందర్శించారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, వంట గదులు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలను ఆరోగ్యం విషయమై అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదా ల వల్ల, కుటుంబాలకు దూరంగా జైలులో ఉండాల్సి వస్తుందని అన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని ఖైదీలు డీఎల్ఎస్ఏలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆమె వెంట జైలు సూపరిండెంట్ సుధాకర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలిఅర్వపల్లి : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగారం మండలం ఫణిగిరిలో మంగళవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర సావిత్రియాదగిరి, పంచాయతీ కార్యదర్శి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్లు షురూచివ్వెంల(సూర్యాపేట) : ఈ నెల 26న జరుగునున్న బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తోగటి మురళి తెలిపారు. అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాక్షుడు, గేమ్స్ అండ్ కల్చరల్, ఈసీ సభ్యుడు స్థానాలకు ఒక్కో నామినేషన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతపై రైతులను ప్రోత్సహించాలి గరిడేపల్లి : సాగులో వస్తున్న నూతన సాంకేతిక అంశాలపై శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలని దక్షిణ తెలంగాణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్. కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్నారు. కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి డి. నరేష్, సీహెచ్ నరేష్, కిరణ్, ఆదర్శ్, అక్షిత్సాయి, సుగంధి 2025–26 సంవత్సరంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం డి.రవీందర్, ప్రొఫెసర్ ఎన్.ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి, కంపసాగర్ కేవీకే హెడ్ పి. చంద్రశేఖర్, ఉద్యాన అధికారి ఎం. మహేష్, మండల వ్యవసాయ అధికారి ప్రీతంకుమార్, రైతులు పాల్గొన్నారు. -
ఐదు నిమిషాలు దాటితే నో ఎంట్రీ
సూర్యాపేటటౌన్ : ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం సాక్షికి ఆయన ఇచ్చిన ఇంటర్ూయ్వలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. పదో తరగతి పరీక్షకు 12,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారి కోసం జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కోసం సిబ్బంది ఇలా అన్ని మౌళిక వసతులు కల్పించాం. ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లాకు రాగా వాటిని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల్లో భద్రపరిచాం. సీసీ కెమెరాల నిఘాలోనే సీఎస్, డీఓలు పరీక్ష పత్రాల సీల్ తీస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత కూడా అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి పోస్టాఫీస్ ద్వారా వారికి కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు. లేటుగా వస్తే నో ఎంట్రీ పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయం కంటే ఐదు నిమిషాల వరకు మాత్రమే (9:35) పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఐదు నిమిషాల దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తవులు అనుమతించరు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎస్, డీఓతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాము. దాంతో పాటు నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున నియమించాం. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లు మూసివేసి ఉంచాలి. ఆరు సబ్జెక్టులు.. ఏడు పరీక్షలు పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జ్క్టులు ఉండగా ఏడు పరీక్షలు జరుగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ప్రతి పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజులు విరామం ఉంటుంది. ఈ విషయమై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పించాం. ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకున్నా.. లేదా విద్యార్థులు హాల్ టికెట్ పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో తమ పుట్టిన తేదీ నమోదు చేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా అవగాహన కల్పించి పరీక్షకు సిద్ధం చేశాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ను కూడా అందించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. ఫ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలు ఫ పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ఫ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ -
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
భానుపురి (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ప్రతి మహిళ తోటి మహిళకు అండగా నిలువాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం మహిళలు విద్య, విజ్ఞానం, సాంకేతికత, ఉద్యోగం, వ్యాపారం వంటి అన్ని రంగాలలో ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపాలిటీ డిప్యూటీ చైర్పర్సన్ మల్లీశ్వరి, డిప్యూటీ సీఈఓ శిరీష, పంచాయతీరాజ్ ఈఈ రమాదేవి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీటీఓ రవికుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వైన్స్ నిర్వాహకుల ఆధిపత్యపోరు
కోదాడ : కోదాడ నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పట్టణం, రూరల్ పరిధిలోని బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో పొత్తులు కుదరక పోవడంతో రగడ కొనసాగుతోంది. ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మరొకరు ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూరల్ వర్సెస్ టౌన్ కోదాడ నియోజకవర్గలోని ప్రతి గ్రామంలో పది చొప్పున బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. వాటికి సమీపంలోని వైన్స్ల నుంచి మద్యం సరఫరా అవుతోంది. కోదాడ మండలంలోని తెలంగాణ–ఏపీ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద మూడు మద్యం దుకాణాలకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే అక్కడ వ్యాపారం సరిగా సాగడం లేదని గతంలోనే అధికారుల అనుమతితో ఓ దుకాణాన్ని తాత్కాలికంగా గుడిబండకు మార్చారు. కొత్త దుకాణాలకు వేలం నిర్వహించినపుడు నల్లబండగూడెంలో రెండు, గుడిబండలో ఒక దుకాణాన్ని గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. తమ వద్దకు రాకుంటే సమాచారం లీక్ కోదాడ రూరల్ పరిధిలోని వైన్స్లు ఏడు గ్రామాలకు, కోదాడ పట్టణంలోని దుకాణాలు ఇతర గ్రామాలకు మద్యం సరఫరా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. గతంలో గుడిబండ గ్రామానికి సమీపంలో ఉన్న పలు గ్రామాల బెల్ట్ దుకాణాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తీసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం గుడిబండలో వైన్స్ ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడి నుంచే మద్యం తీసుకెళ్లాలని, రూరల్ పరిధిలోని గ్రామాల వారు టౌన్ నుంచి మద్యం తీసుకెళ్లవద్దని రూరల్ షాపుల వారు షరతు పెట్టారు. వారి మాటలను బేఖాతరు చేస్తూ ఇటీవల కొందరు గ్రామాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తెచ్చుకోవడంతో రూరల్ పరిధి షాపుల నిర్వాహ కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆటోలో తీసుకెళ్తున్న మద్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ విషయమై పట్టణంలోని వైన్స్ల యజమానులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను ఇరకాటం పెడుతోంది. ఇంతలా మద్యం అక్రమ వ్యాపారం జరుగుతుంటే పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుడిబండ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యంతో వెళ్తున్న వాహనం దొరకడంతో పట్టుకొని కేసు నమోదు చేశాం. మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులకు అప్పగించాం. – గోపాల్రెడ్డి, కోదాడ రూరల్ ఎస్ఐ ఫ బెల్ట్ షాపులకు మద్యం సరఫరాపై రగడ ఫ తమ అనుచరులతో తనిఖీలు ఫ కోదాడలో హాట్ టాపిక్గా మద్యం వ్యవహారం -
మహిళలు.. ఉన్నతస్థాయికి ఎదగాలి
చివ్వెంల (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మహిళా న్యాయవాదులు గాయత్రి, నెండెం వాణి, కాసం సరిత, శశిరేఖ, జుష్మిత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలి పెన్పహాడ్ : అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు చెప్పాలని జిల్లా అగ్నిమాపక అధికారి జానయ్య అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలం అనాజీపురంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు, భద్రతా చర్యలపై పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అగ్ని మాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వరలక్ష్మి ఆశయాలు సాధిద్దాం మునగాల : మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం మునగాలలోలోని రఘునాథం మిల్లు ఆవరణలో ప్రముఖ విద్యావేత్త అర్వపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన వరలక్ష్మి సంతాప సభలో ఆయన మాట్లాడారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులు.. విద్యార్థులకు పాఠశాల డ్రెస్, పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సభలో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నంద్యాల రామిరెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, బద్ధం భద్రారెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, సీహెచ్ .సీతారామ్, మామిడి చినరామయ్య, ములకలపల్లి రాములు, బుర్రి శ్రీరాములు, సుంకర అజయ్కుమార్, ఉప్పుల యుగంధర్రెడ్డి, కందిబండ సత్యనారాయణ పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలు మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. అనంతరం విష్వక్సేనారా ధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రంలోగల శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహా న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపా రు. ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ముస్లింలకు అండగా ఉంటాం
భానుపురి (సూర్యాపేట) : ఢిల్లీ నుంచి గల్లీ దాకా ముస్లింలకు అండగా నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొనడడం సంతోషంగా ఉందన్నారు. సూర్యాపేటలో షాదీఖానా, కమ్యూనిటీ హాల్, ఖబరస్తాన్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదితా లక్షాది, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు శంకుస్థాపనరహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నూతనంగా రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, భవనాల అతిథి గృహానికి (గెస్ట్హౌస్) మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఆర్డీఓ వేణు మాధవరావు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
భూ ఆక్రమణపై ‘డెక్కన్’ లో విచారణ
పాలకవీడు : మండలంలోని రావిపహాడ్ గ్రామం భవానీపురంలో గల డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) సతీష్కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఉన్న శాశ్వత నిర్మాణా లను పరిశీలించామని డీఎఫ్ఓ తెలిపారు. వీటి ఫొటోలు, వీడియోలు, పత్రాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు పసుపులేటి సురేష్ మీడియాతో మాట్లాడారు. అటవీ, మైనింగ్ భూముల మధ్య హద్దురాళ్లు ఏర్పాటు చే యలేదని ఆరోపించారు. డీఎఫ్ఓ నివేదికపై తనకు విశ్వాసం లేదని.. ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. విచారణలో అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, ఫిర్యాదుదారుడు పాల్గొన్నారు. వివాద నేపథ్యం ఇదీ..డెక్కన్ సిమెంట్ కంపెనీ అటవీ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు గతంలో వచ్చిన ఫిర్యాదులతో కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించింది. సదరు పరిశ్రమ 8.02 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి రైల్వేలైన్తో పాటు ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. అయితే ఆ భూమిని తాము పట్టాదారుల నుంచే కొనుగోలు చేశామని కంపెనీ ప్రతినిధులు వాదించారు. చివరకు 2023లో కేంద్ర అటవీ శాఖకు రూ.8 కోట్లు చెల్లించి ఆ భూమిని పరిశ్రమ క్రమబద్ధీకరించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం జిల్లా అటవీశాఖ అధికారి సతీష్కుమార్ -
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రజా వాణిలో వివిధ సమస్యలకు సంబంధించి 80కిపైగా అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, డీఈఓ శ్రీధర్రెడ్డి, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నిధుల ‘పంచాయితీ’!
మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలిభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిధుల పంచాయితీ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో విడుదల చేసింది. వచ్చిన నిధులు తమవేనంటూ ఇటు మాజీ సర్పంచ్లు, అటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పట్టుబడుతున్నారు. అక్కడక్కడా మాజీ సర్పంచ్లకు తెలియకుండానే గ్రామ కార్యదర్శులు డ్రా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. దీంతో నిధుల పంచాయితీ రచ్చకెక్కింది. సందట్లో సడేమియాగా కొందరు అధికారులు రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధులు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించడమేంటని మాజీ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఎంబీలు కాక.. నిధులు ఆలస్యం జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు 2019లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన వారంతా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, వీధిలైట్లు, సీసీ రోడ్లు నిర్మాణం, రైతు వేదికలు, బతుకమ్మ ఘాట్లు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా పలు రకాల పనులు చేశారు. ఈ సర్పంచ్ల పదవీకాలం దగ్గర పడిన సమయంలో చేసిన పనులకు ఎంబీలు వెంటనే కాకపోవడం, ఇతర కారణాలతో ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆలస్యమైంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, తిరిగి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనతో నెట్టుకొచ్చింది. దీంతో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. సర్పంచ్లు పదవీకాలం ముగిసే సమయానికి దాదాపు జిల్లాలో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. నిధుల విడుదలతో కొత్త పంచాయితీ!జిల్లాలోని 486 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగి సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటి వరకు జిల్లాకు రెండు విడతల్లో నిధులు విడుదల చేసింది. మొదటి విడత 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11.45 కోట్లు, రెండో విడతలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇందులో 2023–24 నిధులు మాజీ సర్పంచ్లు చేసిన పనులకు సంబంధించిన నిధులు రాగా.. 2024–25 నిధులు కార్యదర్శులకు రావాల్సి ఉంది. అయితే కొందరు నిధుల విషయంలో స్పష్టత లేకుండా కార్యదర్శులు, ప్రస్తుత సర్పంచ్లు కొన్నిచోట్ల డ్రాలు చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మాజీ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన విషయాలను సరిచేస్తుండగా.. కొందరు ఇంకా అలాగే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తమకు నిధుల వచ్చేలా చూడాలని మాజీ సర్పంచ్లు కోరుకుంటున్నారు.జిల్లాకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు..విడత నిధులు ఏ సంవత్సరానివి (రూ.కోట్లలో..)మొదటి 11.45 2023 – 24 రెండవ 10 2024 – 25ఇటీవలే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఈ నిధులు తమయేనంటున్న మాజీ సర్పంచ్లు, కార్యదర్శులు అక్కడక్కడా డ్రా చేస్తున్న కార్యదర్శులు అధికారులకు సమస్యగా మారిన నిధుల కేటాయింపుసర్పంచ్లు లేకపోవడంతో.. పంచాయతీలకు సర్పంచ్లు లేకపోవడంతో కార్యదర్శులే దాదాపు రెండేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా వేసవిలో మంచినీటి ఎద్దడికి, ట్రాక్టర్ల డీజిల్, పారిశుద్ధ్యం, వీధిలైట్ల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు చోట్ల నిధుల పంచాయితీలు వచ్చాయి. ఈ విషయంలో స్పష్టత ఇచ్చి వివాదాలు లేకుండా చూస్తున్నాం. త్వరలోనే మరికొన్ని నిధులు రావాల్సి ఉంది. ఎవరికి రావాల్సిన బిల్లులు వారికే వస్తాయి. – యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారిమాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ముందు సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.247 కోట్ల నిధులను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మాజీ సర్పంచ్లను మోసం చేసేలా ప్రకటనలు చేస్తోందన్నారు. మాజీ సర్పంచ్లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్ల య్య, నూతనకల్ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చూడి లింగారెడ్డి, తుంగతుర్తి మండల ఫోరం ఉపాధ్యక్షులు లాకావత్ యాకు నాయక్, రామన్నగూడెం మాజీ సర్పంచ్ గంధం మల్లారెడ్డి, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, గోవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీను, వీరన్న, పుణ్యనాయక్, శంకర్, పాముల ఉపేందర్, రమేష్, శ్రీను, నవీన్ రెడ్డి, నర్సింహ, జగపతి తదితరులు పాల్గొన్నారు. -
అసమానతలు లేని సమాజం కావాలి
సూర్యాపేట అర్బన్ : అసమానతలు లేని సమాజ నిర్మాణానికి పోరాడుదామని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు. సోమవారం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుంచి లయన్స్ క్లబ్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల పట్ల వివక్ష పోవాలన్నారుఉ. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, కట్టా కల్పన, చందనబోయిన లక్ష్మి, ఐతరాజు పద్మ,పేర్ల బయ్యక్క, వేమనూరు పావని, శ్యామల, ఎల్లమ్మ,గౌరమ్మ, సత్తెమ్మ మాలంబి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు ప్రశంసనీయం
కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా పశుపోషకులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడెపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కోదాడ పశువైద్యశాలను సందర్శించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశుఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి రూ.1.55 లక్షల రివాల్వింగ్ ఫండ్తో రూ.9.43కోట్ల సంపదను సృష్టించడం గొప్ప విషయమన్నారు. 20 ఏళ్ల క్రితం కోదాడ పశువైద్యశాలలో తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సిరిపురపు సురేంద్ర, పశువైద్య కేంద్రం సిబ్బంది ఉన్నారు. జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు -
పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ..
నడిగూడెం : మండలంలోని కరివిరాలలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడు కేశగాని భద్రయ్య ఆదివారం పనులను అడ్డుకున్నాడు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అధికారులెవరూ రాకపోగా పనులు అడ్డుకున్న తనపైనే కొందరు సిమెంట్ కాంక్రీటు పోశారని భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ సూర్యాపేటటౌన్ : గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ కోసం 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సి న్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కోటిరత్నం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో కూచిపూడి నృత్య ప్రదర్శనయాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతి కళాక్షేత్రం స్కూల్ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అభినందించారు. -
దేశంలో మహిళలకు ప్రత్యక స్థానం
అనంతగిరి : భారతదేశ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, దానిని పునికి పుచ్చుకున్న వారంతా మహిళలను గౌరవించాలని ‘మా ఊరు– మహాలక్ష్మి’ కార్యక్రమ వ్యవస్థాపకుడు నెల్లూరి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో నిర్వహించిన ‘మా ఊరు– మహాలక్ష్మి’ వార్షికోత్సవ సభలో ఐదుగురు ఆడశిశువులకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మా ఊరు మహాలక్ష్మి కానులను అందిస్తున్నట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో పుట్టిపెరిగి వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 మందిని ఘనంగా సన్మానించారు. షూటింగ్ బాల్ క్రిడలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీషను గ్రామస్తులు సన్మానించారు. చుంచులక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ తల్లాడ శ్రీనివాస్, మా ఊరు మహాలక్ష్మి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాదగిరీశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ మాడవీధులతో పాటుగా, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, ప్రధానాలయం క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తజనం సందోహం కనిపించింది. శ్రీస్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 35 వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.45,46811 నిత్యాదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
25 శాతం పెనాల్టీని ఎత్తివేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని డీఫాల్ట్ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీని ఎత్తివేయాలని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవింద రావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ తగిన సమయంలో ఇవ్వలేక పోయారన్నారు. దాంతో అధికారులు వారిని డీఫాల్ట్ లిస్టులో ఉంచడంతో పాటు కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల బెదిరింపులకు భయపడి ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన మిల్లర్ తణుకు సురేష్ భార్య స్వప్న ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా మిల్లర్ వ్యవస్థ ఉందన్నారు. ప్రభుత్వం మరోసారి పెనాల్టీని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. 12 ఏళ్లుగా మిల్లర్లకు ఇవ్వాల్సిన కస్టోడియన్ చార్జీలు, డ్రైయేజ్, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, ఎఫ్ఆర్కే మిక్సింగ్ చార్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బకాయిలను పెనాల్టీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు అనూప్ రెడ్డి, శంకర్రావు, సైదులు, రంగిశెట్టి నరసింహా రావు, శంకర్, కె.రాజేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఫీజుల పిడుగు
కోదాడ : తల్లి దండ్రుల నుంచి ఫీజులు దండుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు సరి కొత్త విద్యా వ్యాపారానికి తెర తేశాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తి కాక ముందే శ్రీజూనియర్ టెన్త్శ్రీ పేరుతో పదో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. స్టడీ మెటీరియల్, ఫీజుల పేరుతో వారి వద్ద నుంచి వేల రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా9వ తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షలు రాశాక, వారి ప్రగతిని పరీశీలించాకే పదో తరగతిలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కానీ అకడమిక్ ఇయర్ పూర్తి కాక ముందు వారికి జూనియర్ టెన్త్ అంటూ పేరు పెట్టి ఏకంగా తరగతులే బోధిస్తున్నారు. దీని కోసం ప్రైవేట్ పబ్లికేషన్ల మెటీరియల్ను విద్యార్థులకు అంట గడుతూ తల్లిదండ్రలు నుంచి రూ. 15 వేల నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు. మరి కొన్ని పాఠశాలలు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక యూనిఫాం అంటూ అందుకు రూ. 2 నుంచి 3 వేలు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆతృతే పెట్టుబడిసంక్రాంతి సెలవుల అనంతరం జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్లో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ వద్ద 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ పాఠాలు బోధించడం ఆపేశారు. జూనియర్ టెన్త్ పేరుతో వారికి 10వ తరగతి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. 9వ తరగతి అంత ముఖ్యం కాదని పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మీ పిల్లలు మంచి మార్కులు సాధించాడానికే ముందుగా పాఠాలు బోధిస్తున్నామని చెబుతూ తల్లిదండ్రులు, పిల్లలలో ఆతృత కలిగిస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారో అనే ఆందోళనతో తల్లిదండ్రులు నిర్వాహకులు చెప్పిన విధంగా తలూపుతున్నారు. భారమైనప్పటికీ వేల రూపాయలను ముందస్తుగా చెల్లిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ.100కు దొరికే పుస్తకం అట్టలపై తమ సంస్థ పేరు ముద్రించి రూ.4 వందలకు అంటగడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న విద్యా వంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా 9వ తరగతి పూర్తి కాక ముందే 10వ తరగతి పాఠాలు ఎలా మొదలు పెడతారని అడిగిన పాపాన పోలేదు. ఆర్థిక భారంసూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 9వ తరగతిలో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా 6 వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇదే రీతిని అనుసరిస్తుండడంతో సుమారు 5వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఒక్కరి నుంచి పుస్తకాలకే రూ.15 వేల వరకూ వసూలు చేస్తున్నారు. దీనికి తోడు వచ్చే సంవత్సరం చెల్లించాల్సి మొత్తం ఫీజులో సగం ఇప్పుడే చెల్లించాలని శరతు విధిస్తుండడంతో తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది. పట్టించుకోని అధికారులుజిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఆవరణలోనే దుకాణాలు తెరిచి పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, బ్యాగ్లు, యూనిఫాం విక్రయిస్తూ వేల రూపాయల వ్యాపారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనఖీ చేస్తున్నా ప్రైవేట్ వైపు వెళ్లక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రైవేట్ పాఠశాలలను కూడ తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.నిబంధనల ప్రకారం 9వ తరగతి విద్యార్థులకు జూనియర్ టెన్త్ పేరుతో తరగతులు నిర్వహించ కూడదు. అలా చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాము. – సలీం షరీఫ్, ఎంఈఓ కోదాడ జూనియర్ ‘టెన్త్’ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారం మెటీరియల్ కొనుగోలు చేసేందుకు రూ.15 వేల నుంచి 20 వేలు మొత్తం ఫీజులో సగం అడ్వాన్స్గా చెల్లించాలని డిమాండ్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ముందస్తు వసూళ్లుకోదాడలో కార్పొరేట్ దందా.. కోదాడలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాల జూనియర్ టెన్త్ పేరుతో నెల రోజుల నుంచి 10వ తరగతి పాఠాలు బోధిస్తున్నారు. తమ మూడు బ్రాంచ్లలో ఉన్న సుమారు 150 మంది విద్యార్థులకు తమ సంస్థకు చెందిన ప్రత్యేక మెటీరియల్ అంట గడుతున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.18 వేల వసూలు చేస్తున్నారు. తమ సంస్థలో చదివే వారు ఈ పుస్తకాలు కొనాల్సిందేనని చెప్పడంతో తల్లిదండ్రులు విధిలేక కొంటున్నారు. దీంతో పాటు ఐపీఎల్, టెక్నో పేరుతో సెక్షన్లను ఏర్పాటు చేసి మరికొన్ని అదనపు పుస్తకాలను అంటగడుతున్నారు. ఇందుకోసం పట్టణంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని లారీల్లో పుస్తకాలను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరిని చూసి మిగిలిన ప్రైవేటు పాఠశాలలు తామేమి తక్కువ కాదన్నట్లు విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. -
15న పీఎన్ఎం మహాసభ
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలను ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి రాంబాబు తెలిపారు. ఆదివారం మండలంలోని బి.చందుపట్ల గ్రామంలో సభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన విష్కరించి మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహారావు, ఉపాధ్యక్షుడు సాంబరాజు యాదగిరి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పిడమర్తి అశోక్, ధరావతు చిరంజీవి, బచ్చలకూరి వెంకటేశ్, ప్రియాంక, నవీన్, కల్యాణ్, ఉప్పమ్మ, అలివేలు, దేవమ్మ, కోలాటం మాస్టర్, శంకర్ నాయక్, శ్వేత, ప్రమీల, సతీష్ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, బాలమురళీకృష్ణ, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే పాల్గొన్నారు. -
ఆర్టీసీని కార్పొరేట్ పరం చేస్తున్న ప్రభుత్వం
భానుపురి : పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో పెడుతోందని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఈ నెల 12న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సులో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, మేథావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం సూర్యాపేట డిపో ఎదుట రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ బస్సుల విధానంతో ఆర్టీసీ, ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పిచ్చయ్య, రవి, భాను, పూర్ణచందర్, సైదులు, నరసింహ, మధుసూదన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల విస్తరణకు మోక్షం
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరుకోదాడ : కోదాడ నియోజకవర్గంలోని పలు రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం మూడు ఆర్అండ్బీ రోడ్ల విస్తరణకు మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ (ఎండీఆర్) కింద రూ.68 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్ గురువారం పాలనాపరమైన జీఓ జారీ చేశారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 22.60 కిలోమీటర్ల రహదారులను విస్తరించనున్నారు. కోదాడ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి అనంతగిరి వరకు 6.60 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉండగా 10 మీటర్లకు విస్తరించనున్నారు. మునగాల మండలంలోని జాతీయ రహదారి నుంచి నేలమర్రి వరకు పది కిలోమీటర్ల సింగిల్ రోడ్డును రూ.24 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. కోదాడ మండలం దోరకుంట నుంచి కాపుగల్లు వరకు 6 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించనున్నారు. అనంతగిరి రోడ్డుకు మోక్షంకోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రోడ్డు పట్టణ పరిధిలో అర కిలోమీటర్ మేర ఇరుకుగా ఉంది. దాంతో నిత్యం ట్రాఫిక్ జాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న నాగార్జున లాడ్జి నుంచి పెద్దచెరువు అలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా భవనాలు ఉన్నాయి. రోడ్డు విస్తరించాలంటే వీటిని పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6 మీటర్లు ఉన్న రోడ్డును 10 మీటర్ల మేర విస్తరించాలంటే రోడ్డుకు ఇరు వైపులా ఐదు అడుగుల మేర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.హుజూర్నగర్ : నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చేసిన కృషి ఫలితంగా నియోజకవర్గంలో 26.5 కిలో మీటర్ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులతో పాటు మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ కింద రూ. 62 కోట్లు మంజూరు చేసింది. తక్షణమే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. -
‘పరిశుభ్రత’లో భాగస్వాములవ్వాలి
సూర్యాపేట అర్బన్ : ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మార్చి 15 వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపు నిచ్చారు. ప్రజా పాలన– ప్రగతి కార్యాచరణలో మొదటి థీమ్గా చేపట్టిన ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్పై దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఈఈ కిరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలిసూర్యాపేట : 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్డు, స్టోర్ రూమ్, వంటశాల, కంప్యూటర్ రూమ్ ల్యాబ్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ లింగారెడ్డి, హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పెద్దిరెడ్డి గణేష్కు సాహితీ పురస్కారం
సూర్యాపేట : తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రముఖులకు అందించే ధర్మనిధి సాహితీ పురస్కారానికి సూర్యాపేట జిల్లాకు చెందిన కవి, రచయిత, సాంస్కృతిక కార్యకర్త పెద్దిరెడ్డి గణేష్ను ఎంపిక చేసింది. తెలంగాణ సాంస్కతిక వైభవానికి పాటుపడిన ప్రముఖుల పేరు మీద ఇచ్చే ఈ అవార్డును బూర్గుల రంగనాథరావు పేరున పెద్దిరెడ్డి గణేష్కు ఇస్తున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్లో అవార్డును అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నేడు హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి శనివారం హుజూర్నగర్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్నగర్కు చేరుకొని స్థానిక రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 5 గంటలకు చింతలపాలెం మండలంలోని దొండపాడులో జరుగుతున్న తిరుపతమ్మ జాతరలో మంత్రి పాల్గొంటారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జరిగే వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్కు వెళతారు. నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని శుక్రవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తలు పాల్గొన్నారు. రివర్షన్తో ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం మద్దిరాల : రివర్షన్ పొందిన, క్రమశిక్షణ చర్యలకు గురైన ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఏ స్థానాలు కేటాయించకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు అనివార్య కారణాలతో రివర్షన్ తీసుకున్నారన్నారు. ప్రమోషన్ ఇష్టం లేకపోతే ముందే నాట్ విల్లింగా అని ఇస్తే మరో 30 మంది ఎస్జీటీలకు ప్రమోషన్ అవకాశం వచ్చేదన్నారు. అధికారులు ఈ విషయమై సమీక్ష జరిపి ఎస్జీటీలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షులు జి.రాములు, కె.ఉమేష్రెడ్డి, సభ్యులు జి.శివప్రసాద్, పి.సురేష్, ఎండీ.అలీమొద్దీన్, షరీఫ్ పాల్గొన్నారు. ఇరాన్పై దాడులను నిలిపివేయాలి సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై అమెరికా –ఇజ్రాయిల్ దేశాల దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరబ్ దేశాలలో ఉన్న ఆయిల్, సహజ వాయువులను దోచుకోవడం ట్రంప్కు అలవాటై పోయిందన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను మరచి, కనీసం పాఠశాలలను కూడా వదిలిపెట్టకుండా మిస్సైల్స్తో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య, నాయకులు పాల్గొన్నారు. నకిలీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలుగరిడేపల్లి : నకిలీ మందులు విక్రయించే మెడికల్ షాపు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామంలోని మెడికల్ స్టోర్ను ఆయన తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉంచిన ఔషధాలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో షాపును తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
శ్మశాన వాటికలో టేకు చెట్లు మాయం
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామ శ్మశాన వాటికలో టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి దుంగలను మాయం చేశారు. బేతవోలు శ్మశాన వాటికలో 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పచ్చదనం పెంపొందించడం కోసం సుమారు 50 టేకుతో పాటు వివిధ రకాల మొక్కలను నాటింది. ప్రస్తుతం అవన్నీ పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఇందులో నుంచి 30కి పైగా టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి దుంగలను తరలించారు. టేకు చెట్లు మాయమైనట్లు తెలియకుండా ఉండేందుకు చెట్ల మొదలు భాగాన్ని మట్టితో కప్పివేశారు. లావుగా ఉన్న దుంగలను తరలించి అనుమానం రాకుండా ఉండేందుకు మిగిలిన చెట్ల కొమ్మలను నరికి అక్కడే పడేశారు. దాంతో పాటు మరి కొన్ని చెట్లను కూడా నరికారు. అయితే, శ్మశాన వాటికలోని టేకు చెట్లు మాయమైనట్లు అనుమానం వచ్చిన కొంత మంది గ్రామస్తులు శుక్రవారం లోపలికి వెళ్లి పరిశీలించారు. టేకు చెట్లను నరికి మొద్దులను తీసుకెళ్లి, కొమ్మలు అక్కడే పడేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ స్పందిస్తూ.. శ్మశాన వాటికలో టేకు చెట్లు నరికిన విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. 30 చెట్లను నరికిన గుర్తుతెలియని వ్యక్తులు -
పది పరీక్షలకు 69 కేంద్రాలు
చిలుకూరు : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 357 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న 12,630 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వారి కోసం విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాశాఖ ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించింది. పకడ్బందీగా పర్యవేక్షణపదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రతి కేంద్రంలో ఒక సీఎస్ను, ఒక డీఓ చొప్పున 138 మందిని నియమించారు. సీఎస్, డీఓలకు ఇప్పటికే పరీక్షల నిర్వహణపై శిక్షణ కూడ ఇచ్చారు. వీరితో పాటు నలుగురిని ఫ్లయింగ్ స్కాడ్స్గా నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దానికి తోడు పరీక్ష కేంద్రం పరిధిలోని అన్ని జిరాక్స్ షాపులను మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సిబ్బందితో కూడిన క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలుజిల్లాలో పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహింస్తున్నారు. గతేడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 96.81గా ఉండగా.. ఈ ఏడాది 100 శాతం సాధించేలా జిల్లా కలెక్టర్, డీఈఓ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.పోలీస్ స్టేషన్కు చేరిన ప్రశ్నపత్రాలు పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా కేంద్రానికి చేరాయి. పరీక్ష పేపర్లను రూట్ ఆఫీసర్ల ద్వారా మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో భద్ర పరిచారు. పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పెట్టల్లో భద్రపర్చి సీలు వేశారు. ఈ నెల 14 నుంచి పరీక్షలు హాజరు కానున్న 12,630 మంది విద్యార్థులు పర్యవేక్షణకు 138 మంది అధికారులు, సిబ్బంది -
‘ఉద్యమం’ రిజిస్ట్రేషన్తో అనేక ప్రయోజనాలు
సూర్యాపేట : ఉద్యమం రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు లభిస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బెనర్జీ తెలిపారు. ఉద్యమం రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు. దీని ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చన్నారు. దాంతో పాటు శిక్షణ, మార్కెటింగ్ సహాయం వంటి ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ యువత, మహిళలు, చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలెంల కెనరా బ్యాంక్ మేనేజర్ వీరేంద్ర, రైతులు, యువత, మహిళలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి హెచ్పీవీ టీకా
సూర్యాపేటటౌన్ : మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ)ను నియంత్రించేందుకు 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేసే కార్యాక్రమాన్ని జిల్లాలో ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణహెచ్పీవీ టీకాను వేసేందుకు ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లతో పాటు వైద్యులకు శిక్షణ ఇచ్చారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదట సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ఏరియా ఆసుపత్రులలో నడిగూడెంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా వ్యాక్సిన్ను అందిస్తారు. ఈ వ్యాక్సిన్పై ఏమైనా అపోహలు, సందేహాలు ఉంటే వాటిని సంబంధిత పీహెచ్సీ వైద్యధికారులు నివృత్తి చేయనున్నారు. బాలికల గుర్తింపు..జిల్లాలో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు 11,964 మంది ఉంటారని అధికారులు గుర్తించారు. వీరికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 01, 2011 నుంచి మార్చి 31, 2012 మధ్య పుట్టిన ఆడపిల్లలకు తలిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ వేయించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. వారు తమ పరిధిలోని పీహెచ్సీకి ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని తల్లి లేదా తండ్రిని వెంట తీసుకొని రావాలని సూచిస్తున్నారు.100 శాతం పూర్తి చేస్తాం ఈ నెల 8వ తేదీ నుంచి బాలికలకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే నెల నుంచి అన్ని పీహెచ్సీల్లో టీకాలు వేస్తాం. అందరూ సహకరించి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా చూడాలి. 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు టీకా వేయించుకొని క్యాన్సర్ను పారదోలాలి. –డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా జిల్లాలో 11964 మంది గుర్తింపు -
వికసిత్ భారత్ మనందరి లక్ష్యం
సూర్యాపేటటౌన్ : వికసిత్ భారత్ ప్రతిఒక్కరి లక్ష్యమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవ పథకం కోఆర్డినేటర్ ఆర్.వెంకటనారాయణ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 163 ఎన్ఎస్ఎస్ యూనిట్ సెల్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 102 మంది విద్యార్థులు పాల్గొనగా ఐదుగురు విద్యార్థులను వికసిత్ భారత్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వెంకటేశులు, కళాశాల వైస్ చైర్మన్ కే.రాజేందర్ రెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి ఎస్.రవికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్ఎస్ఆర్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జిల్లా అధికారులతో దిశానిర్దేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ యాదగిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి హుజూర్నగర్ : హుజూర్నగర్లోని మోడల్ హౌసింగ్ కాలనీలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌసింగ్ కాలనీలోని ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సీఎం సభాస్థలిని, పార్కింగ్ సౌకర్యం తదితరాలను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను వారంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్ రెడ్డి కాలనీని ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
రామగిరి(నల్లగొండ) : భారతదేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని ఎంజీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం రమణారెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో శ్రీ50 సంవత్సరాలకు ముందుగా అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యానికి పాఠాలుశ్రీ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమన్నారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే యువత వినూత్న ఆలోచనలతో ముందు సాగాలన్నారు. కార్యక్రమంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నోడల్ కో ఆర్డినేటర్ కోటయ్య, జ్యూరీ మెంబెర్స్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ భగవంత్రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ శీలం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ మంజుల చకిలం, కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు గురవయ్య, పర్యావరణ శాస్త్రవేత్త సురేష్ గుప్తా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
పందెం గిత్తల జోరు
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలు గురువారం రెండవ రోజు కొనసాగాయి. ఈ పోటీలను, అన్నదాన కార్యక్రమాలను సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, చెన్నకేశి రామారావు, లక్ష్మీనారాయణ భక్తులు పాల్గొన్నారు. బండ లాగుతున్న గిత్తలు -
కాల్వలకు లష్కర్ల కొరత
ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పనిభారంనడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో గల పలు మేజరు కాల్వలకు ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులకు కాల్వల నిర్వహణ భారంగా మారింది. నీటి విడుదల, పలు చోట్ల కంపచెట్లు తొలగింపు, రాళ్ల తొలగింపు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నడిగూడెం, అనంతగిరి, కోదాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారానే వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్నారు. లష్కర్ల కొరత కారణంగా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పని ఒత్తిడి పడుతుందని వాపోతున్నారు. అధ్వానంగా కొమరబండ మేజరు కాల్వనడిగూడెం మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 121 కిలోమీటరు వద్ద కొమరబండ మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దాదాపు 2520 ఎకరాల ఆయకట్టుకు మేజరు, మైనరు కాల్వల ద్వారా 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వ రామాపురం, యఖలాస్ఖాన్పేట, తెల్ల బల్లి గ్రామాల మీదుగా కొమరబండ వరకు దాదాపు 8.50 కిలో మీటర్ల వరకు వెళ్తుంది. ఈ కాల్వపై పలు చోట్ల మైనరు కాల్వలున్నాయి. పలు చోట్ల కంపచెట్లమయంగా, నాచు, పిచ్చిచెట్లు పెరిగి ఉండడంతో చివరి భూములకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ కాల్వపై ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండగా ఒక ఏఈ ఉన్నారు. ఈ కాల్వపై కనీసం ముగ్గురు లష్కర్లు ఉండాలి, కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. బలహీనంగా కాల్వ కట్టలుమండల పరిధిలోని చాకిరాల 123 కిలోమీటరు వద్ద ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొమరబండ మేజరు కాల్వ శ్రీరంగాపురం, రత్నవరం, వసంతాపురం, వాయిలసింగారం, గోల్తండా, అనంతగిరి, శాంతినగర్, గోండ్రియాల, కొత్తగూడెం, మంగళితండా వరకు 26.81 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ కాల్వ కింద 16,896 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వకు కనీసం 5 నుంచి 8 మంది లష్కర్లు ఉండాలి. కానీ ముగ్గురు లష్కర్లు, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. చివరి భూములకు నీరందని పాలారం మేజరు కాల్వసిరిపురం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 128.40 కిలో మీటరు వద్ద పాలారం మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ కింద సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, పాలారం, చనుపల్లి గ్రామాల పరిధిలో 4967 ఎకరాల ఆయకట్టు ఉంది. 13 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాల్వ నిత్యం సమస్యల వలయంగా మారింది. లైనింగ్ సరిగ్గా లేకపోవడం, కాల్వ కట్టల బలహీనంగా ఉండడం, మేజరు, మైనరు కాల్వల్లో నిత్యం నాచు, కంపచెట్లు పెరుగుతుండడంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ కాల్వకు ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి మేజరు కాల్వకు సరిపడా సిబ్బందిని నియమించి, చివరి భూములకు నీరందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.సిబ్బందిని నియమించాలి రత్నవరం వద్ద ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ కట్టలు, మైనరు కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. గతంలో పలుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. కాల్వలను పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బందిని నియమించి చివరి భూములకు నీరందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – కురాకుల కృష్ణమూర్తి, రైతు, రత్నవరం -
టమాటా రైతు దిగాలు
చివ్వెంల(సూర్యాపేట) : టమాటా రైతులు దిగాలు చెందుతున్నారు. పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్నారు. చివ్వెంల మండల వ్యాప్తంగా సుమారు 100 ఎకరాల వరకు రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మండలంలోని లక్ష్మణ్ నాయక్తండా, పాశ్చ్యానాయక్తండా, జయరాం గుడితండా, సేవాలాల్ తండా వట్టిఖమ్మంపహాడ్,, రోళ్లబండ తండా, పిల్లలజెగ్గు తండాల్లో సాగు చేస్తున్నారు. వరి స్థానంలో టమాటా పండిస్తున్నా ప్రస్తుతం ధర లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి అధికమే..రైతులు ఎకరా టమాటా సాగుకు పెట్టుబడి ఖర్చు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మూడు నెలల 15లకు పంటకాలం పూర్తవుతుంది. నారు పెట్టిన సమయం నుంచి కాత సమయం వరకు పంటను పురుగు, తెగుళ్లు, ఆశిస్తుంది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. కాత కాసిన మొదటి వారంలో రెండు రోజులకు ఒకసారి పంట సుమారు 2.5 క్వింటాళ్లకు పైగా వస్తుంది. చిన్న సైజు టమాటా 25 కిలోల పెట్టె రూ.120, పెద్ద సైజు వాటికి 25 కిలోల పెట్టెకు రూ.160 పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. చిన్న సైజు టమాటా ధర కిలో రూ.5, ఉండగా, పెద్ద సైజు టమాటా కిలో రూ.6 మాత్రమే ఉందని, ధర ఇలాగే కొనసాగితే తాము నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర లేక నష్టాలు ఆందోళనలో అన్నదాతలు -
అంధుల గ్రంథాలయంప్రారంభం
సూర్యాపేట : అంధుల గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వంగవీటి రామారావు కోరారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా గ్రంథాలయంలో అంధుల గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయంలో అంధులు బ్రెయిలీ లిపితో చదువుకునేందుకు సుమారు 50మందికి సరి పోయే విధంగా స్పీకర్లు, రెండు కంప్యూటర్లు, రామాయణం, భాగవతం, 5నుంచి 10 తరగతుల పుస్తకాలు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సూర్యాపేటలో అంధుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్యాంసుందర్ రెడ్డి, శ్రవణ్, సిబ్బంది సజన, భవాని, నిర్మల తదితరులు పాల్గొన్నారు. రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్: జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ హాల్లో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో టీయూసీఐ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కుమ్మరి వెంకట్ నారాయణ, మూడ్ వీరన్న, పవన్, సాయి, నరేష్, సాయిబాబా, కిషోర్ పాల్గొన్నారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన విద్యార్థులకు అభినందన నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులు ఇండియా పేమెంట్స్ బ్యాంకులో 45 రోజుల ఇంటర్న్షిప్ పూర్తిచేసి రావడం అభినందనీయమని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులను గురువారం యూనివర్సిటీలో ఆయన అభినందించి మాట్లాడారు. బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, అవగాహన కార్యక్రమాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు, వీధి వ్యాపారుల రుణ సదుపాయాలు తదితర అంశాలపై విద్యార్థులు శిక్షణ పొందారని పేర్కొన్నారు. సబీనా హెరాల్డ్, విద్యార్థులు ఉప్పరి మహేష్, నవీన్ పాల్గొన్నారు. -
ధర పెరిగితే లాభం
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర పడిపోయింది ధర పెరిగితే లాభం వస్తుంది. లేదంటే నష్టపోతాం. ప్రస్తుతం వస్తున్న రేటు ఆటో కిరాయికి కూడ సరిపోవడం లేదు. – ధరావతు రవి, రైతు, లక్ష్మణ్ నాయక్ తండా, ఎకరంలో సాగు చేశానుఎకరం వ్యవసాయ భూమిలో టమాటా సాగు చేశా. ఇప్పటి వరకు రూ.60 వేలు పెట్టుబడి ఖర్చు అయింది. ప్రస్తుతం టమాటా ధర పడిపోయింది. ధర ఇలాగే కొనసాగితే నష్టాల పోవాల్సి వస్తుంది. – కొండ వెంకన్న, రైతు, వట్టిఖమ్మంపహాడ్, -
వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం నిర్వహించనున్న మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం పట్టణంలోని సంఘం భవనంలో వైద్యశిబిరం కరపత్రాన్ని సంఘ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వారి సౌజన్యంతో నిపుణులైన వైద్యం బృందంతో ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరంలో న్యూరో, గుండె, ఆర్థోపెడిక్ వైద్యులు ఉంటారని, ఈసీజీ, టూడీ ఎకో, ఎముకల సాంద్రత పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ వైద్యశిబిరానికి హాజరు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, రఘువరప్రసాద్, జానయ్య, విద్యాసాగర్, భ్రమరాంబ ఉన్నారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డు దారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవితో పాటు గోదాంలలో బియ్యం నిల్వలను తగ్గించేందుకు ఏప్రిల్లోనే మే, జూన్కు సంబంధించిన కోటాను కూడా పంపిణీ చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం రవాణాకు సంబంధించిన ఖర్చులు కొంత మేర ఆదా కానున్నాయి. గత జూన్లోనూ మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చారు. జిల్లాలో 3,55,057 రేషన్ కార్డులుసూర్యాపేట జిల్లాలో 610 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గతంలో 3.26 వేల రేషన్ కార్డులు ఉండగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరో 30వేల కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం 3,55,057 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందిస్తోంది. గత ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. నిల్వలు పేరుకు పోవడంతో..కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తిరిగి ఆహార భద్రత కార్డు దారులకు అందిస్తోంది. ప్రస్తుతం ఎఫ్సీఐ గోదాంలలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. బియ్యం ముక్కి పోకుండా ఉండేందుకు లబ్ధిదారులకు ఇవ్వడమే మేలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది కూడా జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి బియ్యం కోటాను జూన్లోనే పంపిణీ చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి మూడుసార్లు వేలిముద్రలు తీసుకున్నారు. దుకాణాల వద్ద రద్దీ కారణంగా సర్వర్ సమస్యలు తలెత్తడంతో డీలర్లు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బియ్యం క్వాలిటీలోనూ తేడాలు వచ్చాయి.బియ్యం నిల్వలపై ఆరా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో బియ్యం నిల్వలపై జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు సీఎంఆర్ కేటాయింపులు ఉండడంతో మూడు నెలలకు సరిపడా బియ్యం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఏప్రిల్, మే, జూన్ కోటా ఏప్రిల్ నెలలోనే.. ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం వేసవితో పాటు గోదాముల్లో నిల్వలు తగ్గించేందుకే ముందస్తుగా పంపిణీ సర్వర్ సమస్యలు రాకుండా చూడాలంటున్న లబ్ధిదారులు -
ఉగాదికి వేపపూత కరువే
కోదాడ : ఆకులు, కాయలు, కాండం, బెరడు ఇలా అన్నిట్లో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లకు సుస్తి చేసింది. ఇండియన్ హెర్బల్ డాక్టర్గా పిలుచుకునే వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శిలింధ్ర వ్యాధి కారణంగానే చెట్లు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవిలో పచ్చటి ఆకులు, పూతతో కనిపించాల్సిన వేపచెట్లు ప్రస్తుతం ఎండిపోయి, ఆకురాలి మోడువారి దర్శన మిస్తున్నాయి. డైబ్యాక్ తెగులువేపచెట్లు ఎండిపోవడానికి డైబ్యాక్ అనే శిళీంధ్ర వల్ల కలిగిన తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలంలోకి మారే సమయంలో సోకుతుందని తెలుపుతున్నారు. వేపచెట్లకు ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం సోకడంతో చెట్టు చివరి భాగాల నుంచి ఎండిపోవడం ప్రారంభమై కొద్ది రోజుల్లోనే మొత్తం వ్యాపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే చెట్టుమొత్తం ఎండిపోతుందని, గాలి వల్ల ఈ వ్యాధి ఒక చెట్టు నుంచి మిగతా వాటికి వ్యాపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మళ్లీ మూడు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దాంతో ఈ సంవత్సరం ఉగాది పచ్చడికి వేపపూత దొరకడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీవ్ర నష్టంవేపచెట్లు వ్యాధి బారిన పడడంతో పూత, కాత పూర్తిగా తగ్గిపోతోంది. వేప కాయలు, దాని నుంచి వచ్చే నూనెను వ్యవసాయరంగంలో విరివిగా ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో వేపనూనే, వేప పిట్టుకు అధిక ప్రాధాన్యత ఉంది. కూరగాయలు, పండ్లమొక్కలకు వచ్చే వ్యాధుల నివారణలో వేప కాయలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వేపచెట్లు వ్యాధి బారిన పడడంతో దిగుబడి 80 నుంచి 90 శాతం వరకు తగ్గిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నివారణ చేపట్టాలివేపచెట్లకు వచ్చిన ఈ వ్యాధి నివారణకు ఎవరు చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు ఈ విషయమై పట్టించుకోవడం లేదు. గాలి ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఒకటి, రెండు చెట్లకు మందులు పిచికారీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వమే సామూహిక నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చిన్న చెట్లు వ్యాధి బారిన పడినట్లు గుర్తిస్తే ఆ కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలని, శిలీంధ్రనాశక ఔషఽధమైన కార్బెండజిమ్ పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద చెట్లకు మందు పిచికారీ చేయడం కష్టమైతే శిలీంధ్ర నాశక ఔషధాన్ని నీటిలో కలిపి చెట్ల మొదళ్లలో పోయాలి. వేసవిలో చెట్లకు నీరు పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి నుంచి బయటపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.ఆపదలో ఔషధి ఎండిపోతున్న వేపచెట్లు శిలీంధ్ర తెగులే కారణమంటున్న శాస్త్రవేత్తలు నివారణ చర్యలు చేపట్టాలంటున్న పర్యావరణ వేత్తలు -
14న హుజూర్నగర్కు సీఎం రేవంత్రెడ్డి
హుజూర్నగర్ : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 14న మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీ పనులను ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవాలతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గృహ కాలనీ ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. సీఎం ప్రసంగించేందుకు ప్రత్యేక సభా వేదికను సిద్ధం చేస్తున్నామన్నారు. వారంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేశారని, ఈ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చారని ఆరోపించారు. అదృష్ట వశాత్తు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన, అత్యంత పేద కుటుంబాల కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలనే ఆర్డీఓ ఆధ్వర్యంలో అధికారుల బృందానికి బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. మొదటి విడతలో వేయి మంది లబ్ధిదారులను ఖరారు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా, నిజమైన లబ్ధిదారులకు అందేలా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్పీ కె. నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్రావు, మున్సిపల్ ఫోర్ల్ లీడర్ కోతి సపంత్రెడ్డి, తహసీల్దార్ కవిత, డీసీసీ అధ్యక్షుడు జి నరసయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు. మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి -
నేడు వాహనాలకు వేలం
సూర్యాపేటటౌన్ : ఎకై ్సజ్ అధికారులు వివిధ కేసులలో సీజ్ చేసిన 24 వాహనాలను గురువారం సూర్యాపేట ఎకై ్సజ్ స్టేషన్లో జిల్లా ఎకై ్సజ్ అధికారి లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల వేలంలో పాల్గొన దల్చిన వారు ఉదయం 9 గంటలకు ముందుగా ధరావతు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 264 మంది గైర్హాజరుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 5,927 మంది విద్యార్థులకు 5,764 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,467 మంది విద్యార్థులకు 1,366 మంది హాజరయ్యారు. మొత్తం 264 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి లేదుసూర్యాపేటటౌన్ : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదని, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరైన విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఉప్పల ఆనంద్, పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్ష, జీడీ భిక్షం, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లి ఆలయంలో సంప్రోక్షణమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పార్వతీ రామలింగేశ్వర ఆలయాల ద్వారాలను అర్చకులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. అనంతరం ఆలయాలలో సంప్రోక్షణ నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం మాత్రం గురువారం వరకు నిలుపుదల చేశామని, 6వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్ట పల్లిరావు, విజయ్కుమార్, ఇన్చార్జి ఈఓ జ్యోతి తెలిపారు. -
సీఎంఆర్ ధాన్యంతో
కోదాడ : మిల్లులకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)తో పలువురు మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం తమదే అని చెప్పి పలు బ్యాంకుల నుంచి ఓపెన్ క్యాష్ క్రెడిట్ (ఓసీసీ) రుణాలను కోట్లలో తీసుకుంటున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమచారం ప్రకారం.. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మిల్లర్లు సీఎంఆర్ ధాన్యం హామీగా చూపి పలు జాతీయ బ్యాంకుల నుంచి రు.100 కోట్ల వరకు రుణాలు ఈ విధంగా తీసుకున్నారు. బ్యాంకులు కూడా ఈ ధాన్యం ఎవరిదన్న విషయాన్ని పట్టించుకోకుండా కోట్ల రూపాయల రుణాలను సులువుగా ఇస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మరాడించి.. బియ్యం తిరిగి అప్పగించాల్సిన మిల్లర్లు సంవత్సరాల తరబడి బియ్యం ఇవ్వకుండా వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఈ ధాన్యం హామీగా చూపి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సైతం ఎగవేతకు పాల్పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో ధాన్యం ఉందా లేదా అని నిత్యం పరిశీలించాలి. కానీ, వేల టన్నుల ధాన్యం మిల్లుల నుంచి బహిరంగ మార్కెట్కి తరలి వెళ్లినా ధాన్యం కేటాయించిన అధికారులు గానీ, కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన బ్యాంకులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. ఒక జిల్లా మిల్లుకు మరో జిల్లాలోని బ్యాంకు రుణం..జనగామ జిల్లాలో ఉన్న ఓ మిల్లుకు 2022–23 యాసంగి, 2024–25 వానాకాలం సీజన్లకు సంబందించిన ధాన్యం సీఎంఆర్ కింద కేటాయించింది. దీన్ని హామీగా చూపి సదరు మిల్లు యాజమాన్యం యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.3 కోట్ల రుణం పొందింది. ఈ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి సీఎంఆర్ ఎగవేతకు పాల్పడడంతో పాటు, బ్యాంకు నుంచి తీసుక్ను రుణాన్ని కూడా చెల్లించలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 మిల్లులపై అధికారులు ఆర్.ఆర్ యాక్ట్, బ్యాంకులు సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రయోగించినప్పటికీ.. ఏ ఒక్కరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి వసూలు చేయలేకపోయారు. మిల్లర్లు ముందస్తుగానే తమ ఆస్తులను బినామీల పేరుతో ఉంచడంతో ఈ చట్టాలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయి.మాఫియాగా మారిన ముఠా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మిల్లులు సీఎంఆర్ ధాన్యం తీసుకుంటున్నప్పటికి వారిలో కేవలం 15 మంది మిల్లర్లే ప్రతి సంవత్సరం అవకతవకలకు పాల్పడుతున్నారు. కోదాడ, నల్లగొండ ప్రాంతాల్లోని వీరంతా ముఠాగా ఏర్పడి ఇబ్బందులున్న మిల్లు యాజమాన్యాలకు రుణాలిప్పిస్తామని దానిలో భాగస్వాములుగా చేరుతారు. అధికారులతో తమకు ఉన్న సంబంధాలతో భారీ మొత్తలో సీఎంఆర్ ధాన్యం కేటాయింపజేసుకొంటారు. దీనిపై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంటారు. ఇక తమ ప్లాన్ ప్రకారం సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తారు. దీంతో మిల్లును అధికారులు బ్లాక్లిస్ట్లో పెడతారు. బ్యాంకులు మిల్లును బహిరంగ వేలం వేస్తారు. విచిత్రంగా ఈ ముఠానే వేలంలో మిల్లును తమ అనుచరులతో కొనిపించి కొత్త ఫర్మ్ పేరుతో మళ్లీ ధాన్యం కేటాయింపజేసుకుంటారు. ఇక.. మిల్లు అసలు యజమానులు రోడ్డున పడుతున్నారు. దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ జరపాలని పలువురు మిల్లర్లు కోరుతున్నారు. వీరి వల్ల తమందరికి చెడ్డపేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని హామీగా చూపి రుణాలు తీసుకున్న మిల్లర్లు సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా రూ.100 కోట్ల రుణాలు ధాన్యం పక్కదారి పట్టించి రుణాలు ఎగవేత రికవరీ చట్టాలున్నా ఏమీచేయలేకపోతున్న బ్యాంకులు -
పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
భానుపురి (సూర్యాపేట) : ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్ధవంతంగా అందించడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూత్ వీక్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి టెలి కమ్యూనికేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక నుంచి అన్ని ఫైళ్లు ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, టాస్క్ ద్వారా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణ, పిల్లల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించాలని సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు – మనబడి పెండింగ్ బిల్లులపై నివేదిక సమర్పించాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలిహుజూర్నగర్ : హుజూర్నగర్ పట్ట ణ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద కాలనీ ఇళ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుజూర్నగర్ పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారంలోనే సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. బ్లాక్ల మధ్య గల అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తాగునీరు, మొక్కలు నాటడం, పెయింటింగ్ పనులు, స్ట్రీట్ లైట్స్ మొదలైన అన్ని రకముల పెండింగ్ పనులు ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, హార్టికల్చర్ పీడీ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కొడుకు గెంటేశాడు.. న్యాయం చేయండి
సూర్యాపేట : కన్న కొడుకే తనను ఇంటి నుంచి గెంటేశాడు. తనకు న్యాయం చేయాలని 76 ఏళ్ల వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం జి.కొత్తపల్లికి చెందిన వృద్ధురాలు గంగుల రమణమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణమ్మకు గ్రామంలో 3.10 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంది. కుమారుడు ప్రభాకర్ ఎస్బీఐలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూనే రమణమ్మ పేరుమీద ఉన్న భూమిలో రెండెకరాలు తన పేరుపై రాయించుకున్నాడని పేర్కొంది. మిగతా 1.10 ఎకరాలను తన ఆడపిల్లకు ఇవ్వకుండానే ఇచ్చానని తనను ఇబ్బందుల పాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తలేని నా బిడ్డ నా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఉంటుంటే నన్ను, నా బిడ్డను ఇంటి నుంచి గెంటేసి తాళం వేశాడని తెలిపింది. గ్రామంలో కరువు పనికి వెళ్తూ నేను నా బిడ్డ బతుకీడుస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కూడా తన కుమారుడు తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేశాడని, కోడలు కూడా దుర్భాషలాడుతోందని కన్నీటి పర్యంతమైంది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది. -
ఇసుక సరఫరా పునరుద్ధరణ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం,నాగారం మండలం పేరబోయినగూడెంలోని మూసీనది క్వారీల నుంచి మూడు రోజుల క్రితం మళ్లీ ఇసుక సరఫరా ప్రారంభమైంది. ట్రాక్టర్ల యజమానులకు సుమారు నెలన్నరకు సంబంధించిన బిల్లులు ఇవ్వాల్సి ఉండడంతో వారు తమ ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లడం లేదు. పైగా క్వారీల వద్ద నిఘా లేకపోవడంతో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో నెల రోజుల క్రితం ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా 45 రోజుల నుంచి ట్రాక్టర్ యజమానులకు రావాల్సిన బిల్లులు ఎట్టకేలకు విడుదల చేయడంతోపాటు గతంలో ఇసుక సరఫరా బాధ్యతలు రెవెన్యూ శాఖకు ఉండగా ప్రస్తుతం మైనింగ్ శాఖకు అప్పగించారు. దీంతో మైనింగ్ శాఖ ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను పునరుద్ధరించింది. ఈ రెండు క్వారీల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసింది. ఆ శాఖ అధికారులు ఆ రెండు క్వారీల చుట్టూ సీసీ కెమెరాలను బిగించి సాండ్ టాక్సీ విధానంలో ఇసుక సరఫరా చేయిస్తున్నారు. మూడువేల ట్రిప్పులకు పైగానే బుకింగ్తుంగగూడెం, పేరబోయినగడెంలోని రెండు క్వారీల పరిధిలో ఇప్పటి వరకు 3 వేల ట్రాక్టర్ ట్రిప్పులకు పైగానే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం క్వారీలకు సెలవు ప్రకటించారు. తిరిగి బుధవారం క్వారీల నుంచి ఇసుక సరఫరా ప్రారంభంకానుంది. రెండు క్వారీల నందు రిజిస్టరైన సుమారు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా మొదలుకానుంది. అయితే ఈ రెండు క్వారీల నుంచి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ఇసుక తరలించనున్నారు. ఇందుకుగాను స్థానిక రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. తుంగగూడెం, పేరబోయినగూడెం క్వారీల నుంచి మళ్లీ మొదలు పలు కారణాలతో నెలక్రితం నిలిపివేత బిల్లుల విడుదలతో యథావిధిగా సరఫరా మైనింగ్ శాఖకు బాధ్యతలు అప్పగింత ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లతో క్వారీల వ ద్దకు రావాలంటున్న అధికారులుఅక్రమాలకు పాల్పడొద్దుజిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఇసుక–మన వాహనం పథకంలో ట్రాక్టర్ యజమానులు అవకతవకలకు పాల్పడొద్దు. ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లాలి. అక్రమాలకు పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేసి రిజిస్ట్రేషన్ రద్దుచేస్తాం. – బాషపాక శ్రీకాంత్, తహసీల్దార్, జాజిరెడ్డిగూడెం -
ఇక్కడ సీఎంఆర్ ఎగ్గొట్టి.. మరో జిల్లాలో పాగా
ముందే ఎగవేతకు ప్లాన్.. సాధారణంగా వ్యాపారం చేసిన తరువాత నష్టం వస్తే దాన్ని తప్పించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. జిల్లాలో సీఎంఆర్ దందాకు పాల్పడుతున్న మిల్లర్లు ప్రభుత్వం తమకు ధాన్యం కేటాయించే సమయంలోనే ఎగవేతకు ప్లాన్ సిద్ధం చేసుకుంటారని తోటి మిల్లర్లు అంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కేటాయించిన సమయంలోనే మిల్లర్లు ధాన్యం బాగాలేదని.. దీనివల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని అధికారులకు ఓ వినతిపత్రం ఇస్తారు. దానిమీద వారి సంతకం తీసుకుంటారు. ఈ విధంగా రెండు, మూడు వినతి పత్రాలు ఇచ్చి అధికారుల చేత వాటిమీద రిసీవ్డ్ సంతకం తీసుకుంటారు. ఇక వెంటనే తమ ప్లాన్ అమలు చేస్తారు. ఈ ధాన్యం మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటారు. ప్రభుత్వం సీఎంఆర్ ఇవ్వమని అడిగిన సమయంలో గతంలో తాము ఇచ్చిన వినతిపత్రాలను బయటకు తీస్తారు ‘మాకు మంచి ధాన్యం కేటాయించలేదు.. దీనిపై మీకు చెప్పినా పట్టించుకోలేదు.. దీంతో ఆ ధాన్యం మొత్తం పాడైపోయింది. కాబట్టి మేము సీఎంఆర్ ఇవ్వలేము’ అని చెబుతారు. ఇదే కాకుండా అధికారులు ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించినప్పుడు ఈ వినతిపత్రాలను కోర్టుకు సమర్పించి ఊరట పొందుతున్నారని అధికారులు అంటున్నారు. దీనికి తమలో కొందరు అధికారులు సహకరించడం వల్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోలేక పోతున్నామని, వారు దొడ్డిదారిని మళ్లీ ఇదే దందాకు పాల్పడుతున్నారని వారు అంటున్నారు. కోదాడ : కష్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టించి ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన మిల్లర్లు తమ దందాను కొనసాగించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నప్పటికీ అదే మిల్లర్ మరో జిల్లాకు వెళి్ల్ అక్కడ మూతపడిన రైస్ మిల్లులను లీజుకు తీసుకోవడం, కొనుగోలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తమకు అండగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించి భారీగా సీఎంఆర్ ధాన్యం కేటాయింప చేసుకుంటున్నారని ఇతర మిల్లర్లే ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దందా ఇలా..● కోదాడలో సుమారు రూ.60 కోట్లకుపైగా విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం బయట అమ్ముకోవడంతో సదరు మిల్లుపై ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించడంతో, మిల్లర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతోపాటు ఆస్తులను ఇతరుల పేర్లపై బదలాయించారు. దీంతో ప్రభుత్వం సదరు మిల్లరు నుంచి పైసా కూడా వసూలు చేయలేక పోయింది. ఇదే మిల్లర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూతపడిన ఓ మిల్లును కొనుగోలు చేసి గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి సాయంతో తాజాగా రూ.కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం తన మిల్లుకు కేటాయింపజేసుకొని దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. ● కోదాడ మండల పరిధిలోని ఓ మిల్లర్ రూ.34 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించడంతో ఆయన మిల్లును అధికారులు బ్లాక్లిస్ట్లో పెట్టారు. ఇతను కూడా తమ కుటుంబ సభ్యుల పేరుమీద ఆస్తులను భారీగా కొనుగోలు చేశాడని సమాచారం. ఇక ఈ మిల్లుకు రుణం ఇచ్చిన బ్యాంక్ బకాయి రాబట్టుకోవడానికి మిల్లును వేలం వేయగా గరిడేపల్లి, నేరేడుచర్ల, తుంగతుర్తిలో సీఎంఆర్ ఎగవేతకు పాల్పడిన మిల్లర్లు ఓ ఫోరం పేరుతో వేలంలో దక్కించుకొని సదరు మిల్లుపై మరో బ్యాంక్లో రుణం తీసుకొని సీఎంఆర్ దందాకు సిద్ధమమవుతున్నట్టు తెలిసింది. తెర వెనుక ఉండి..గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లు వాటి ఎగవేతకు పాల్పడి తాజాగా తెర వెనుక ఉండి ఈ దందాను సాగిస్తున్నారు. జిల్లాను దాటి పక్క జిల్లాలో మూత పడిన మిల్లులను, వ్యాపారం సరిగా చేయని మిల్లులను తమ బంధువులు లేదా గుమస్తాల పేరుతో కొనుగోలు చేస్తూ మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. ఎక్కడ తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లర్ల ఎత్తుగడ అక్కడ మూతపడిన మిల్లులను బంధువుల పేర్లతో కొనుగోలు మళ్లీ సీఎంఆర్ దందా కొనసాగింపు


