breaking news
Suryapet
-
సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు. సుపారీ గ్యాంగ్ను వైన్స్లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది. -
అమెరికా నుంచి వచ్చి.. ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై
కోదాడరూరల్: తన మిత్రుడు మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను సోషల్ మీడియాలో చూసి అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కోదాడకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు ఓ ఎన్నారై. వివరాలు.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ పి. పెంటయ్య, హైదరాబాద్కు చెందిన డాక్టర్ చప్పిడి సుధాకర్ 30 ఏళ్ల కిందట హైదరాబాద్లోని పశువైద్య కళాశాలలో కలిసి చదువుకున్నారు.చదువు పూర్తయిన తర్వాత పెంటయ్య కోదాడ (Kodad) ప్రాంతంలో పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా.. సుధాకర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. డాక్టర్ పెంటయ్య కోదాడ పశువైద్యాశాలలో రైతులకు ఉపయోగపడేలా పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను కాలిఫోర్నియాలో ఉంటున్న అతడి స్నేహితుడు సుధాకర్ సోషల్ మీడియాలో చూశాడు. పెంటయ్య ఫోన్ నంబర్ తీసుకున్న సుధాకర్ త్వరలో కలుస్తానని అడ్రస్, లోకేషన్ షేర్ చేయమని చెప్పాడు.కాలిఫోర్నియా (california) నుంచి హైదరాబాద్కు వచ్చిన సుధాకర్ బుధవారం కోదాడకు వచ్చి తన మిత్రుడు పెంటయ్యను కలిసి సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఆనందంలో మునిపోయారు. అనంతరం పశుఔషధ బ్యాంక్కు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్తో పలు రకాల పండ్ల మొక్కలను నాటించారు.చదవండి: తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి -
సీనియర్ సిటిజన్స్ను గౌరవించాలి
చివ్వెంల : సీనియర్ సిటిజన్స్ను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్కౌసర్ అన్నారు. ప్రపంచ సీనియ ర్ సిటిజన్స్ డే సందర్భంగా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని శ్రీఅన్నపూర్ణ చాటిటబుల్ ట్రస్ట్లో వృద్ధులను కలిసివారి సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. వృద్ధుల సమస్యలతోపాటు ఆశ్రమానికి దారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.రాజు, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్పీ కె.నరసింహతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మండపాల్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మారావు, రాజేశ్వరరావు, రమేష్, నరసింహారావు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కారింగుల ఉపేందర్, కార్యకర్తలు, షేక్ ఫారూక్ పాల్గొన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ భూమికి సంబంధించి పహాణీలో ఇతరుల పేరు రాసి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఇదేవరకే అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ విషయమై తాను రెండు రోజుల క్రితమే గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ను ఆదేశించామని పేర్కొన్నారు. సూర్యాపేట : సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు పక్కన ఖాళీ ప్రదేశంలో పిచ్చిమొక్కలను తొలగించి అందమైన పూల మొక్కలు పెంచాలన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం సద్దల చెరువు పరిధి ఎక్కడ వరకు ఉందో మున్సిపల్ కమిషనర్ను, చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడకు ఉందో ఇరిగేషన్ అధికారులు, ఖాళీ ప్రదేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పర్యాటక శాఖ ఏఈని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఇరిగేషన్ డీఈ పాండునాయక్, టూరిజం ఏఈ మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఉత్సవం.. అప్రమత్తం
సూర్యాపేటటౌన్ : ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీల సభ్యులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సూచిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను జారీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికోసం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించే విగ్రహాల ఎత్తు, మండపం ప్రదేశం, నిమజ్జనం తేదీ, నిమజ్జనం ప్రదేశం తదితర వివరాలతో దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉంటే అనుమతితోపాటు క్యూ ఆర్ కోడ్ను జారీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో.. మండపం ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతికి పోలీస్ స్టేషన్ తిరగాల్సిన పని లేదు. https-://po liceportal.tspolice.gov.in వెబ్సైట్లో అనుమతి కోసం వివరాలను నమోదు చేసుకోవాలి. ఇదిరకంగా దరఖాస్తు ప్రక్రియ. వీటి ఆధారంగానే అనుమతులు జారీ అవుతాయి. అనంతరం ఆయా మండపాల్లో పోలీసుల అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలను విధిగా ప్రదర్శించాలి. పోలీసుల సూచనలు ఇవే..● గణేష్మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే. ● ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ● నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తిచేయాలి. ● గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ● మండపం స్థలం కోసం సంబంఽధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. ● రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. ● డీజేలు ఏర్పాటు చేయరాదు. ● గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగించడం, పాటలు పాడటం పూర్తిగా నిషేధం. ● ఎవరికై నా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీస్వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. గణేష్ నవరాత్రులకు జాగ్రత్తలు తప్పనిసరి ఫ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి పొందాల్సిందే.. ఫ ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం ఫ రూ.500 డీడీ చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఫ సూచనలు పాటించాలంటున్న పోలీసులు -
స్వచ్ఛ పాఠశాలలకు ప్రోత్సాహం
తిరుమలగిరి (తుంగతుర్తి): సర్కారు పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛ పాఠశాలలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేస్తోంది. ప్రతి సంవత్సరం పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపికై న వాటికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పురస్కారాలకు 2025–26 విద్యా సంవత్సరానికి పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్వచ్ఛ పాఠశాలలను ఎంపిక చేసేందుకు నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకొని రేటింగ్ ఇవ్వనున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు దరఖాస్తు చేసుకునే స్కూళ్లు వివిధ అంశాలను నమోదు చేయడంతో పాటు సౌకర్యాలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత– పచ్చదనం పెంపు, తాగు నీటి వసతి, ఇంకుడు గుంతలు–మూత్రశాలల నిర్మాణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డించడం వంటి నాలుగు అంశాలపై ఇచ్చిన 60 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలి. మొత్తం 125 మార్కులు కేటాయించనున్నారు. 90 శాతానికిపైగా మార్కులు సాధించిన పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు బృందాలు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపనున్నారు. పరిశీలించి మార్కులు ఖరారు చేసి రేటింగ్ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయి పరిశీలనకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేసి 5 స్టార్ రేటింగ్లు సాధించిన 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. నగదు పురస్కారం కోసం దరఖాస్తు చేసుకునేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ కోసం మోడల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేశాం. మా పాఠశాలలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. స్వచ్ఛతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు చేయడానికి కృషి చేస్తున్నాం. – సంజీవ్కుమార్, అనంతారం మోడల్ స్కూల్, తిరుమలగిరి మండలం ఫ నగదు పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం ఫ ఉత్తర్వులు జారీచేసిన విద్యా శాఖ ఫ రిజిస్ట్రేషన్కు సెప్టెంబర్ 30 వరకు గడువు ఫ ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి -
జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి అరెస్టు
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ జాన్పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలంటే పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు వైరల్ కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్యదర్శి వెంకయ్యను అదుపులోకి తీసుకుని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపుమద్దిరాల : ఇంకుడు గుంతలతో భూగర్భజల నీటిమట్టం పెరుగుతుందని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గురువారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించిన ఇంకుడు, రీచార్జ్ గుంతలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, బోరుబావుల చుట్టూ రీచార్జ్ గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఏపీఓ గుండు వెంకన్న, ఈసీ చారి, పంచాయతీ కార్యదర్శి ఉమ, టీఏ మురళి ఉన్నారు. -
కొత్త కార్డులకు సన్న బియ్యం
సూర్యాపేట : కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. ఎన్నికల హామీలో భాగంగా గతనెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 36,812 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. పదేళ్ల తర్వాత కార్డులు వచ్చాయని సంబరపడిన లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ఒకేసారి కోటా పంపిణీ చేసింది. అయినప్పటికీ కొత్త కార్డుదారులకు రేషనన్ బియ్యం తీసుకునే అవకాశం దక్కలేదు. దీంతో కొత్తకార్డుదారులకు సెప్టెంబర్ నుంచి మొదటి సారిగా కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రేషన్ షాపులకు కోటా సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందనున్న పథకాలు జిల్లా వ్యాప్తంగా గతంలో 3,26,057 రేషన్ కార్డులు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 36,812 కార్డులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డులేక ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి చాలా మంది పేదలు దూరమవుతున్నారు. దీంతోపాటు వారి పిల్లల చదువుల విషయంలోనూ రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు కూడా దక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. చివరికి ఆపద సమయంలో ఆరోగశ్రీ ద్వారా వైద్యసేవలను కూడా పొందలేక పేదలు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పేదల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అడ్డంకులు తప్పాయి. సెప్టెంబర్ ఒక టవ తేదీ నుంచి పంపిణీ ఫ మొదటిసారి 36,812 కుటుంబాలకు బియ్యం ఫ కొత్త కార్డుల మంజూరుతో పథకాల వర్తింపునకు తొలగిన అడ్డంకులు -
విద్యార్థి భవితకు ‘విజ్ఞాన్ మంథన్’
తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు శ్రీవిద్యార్థి విజ్ఞాన్ మంథన్శ్రీ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందజేస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షలో పాల్గొనేందుకు అర్హులు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. పరీక్ష రుసుం రూ.200 చెల్లించాలి. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలు జూనియర్, సీనియర్ విభాగాలుగా నిర్వహిస్తారు. 6 నుంచి9వ తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు 14 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. టెలిఫోన్, ట్యాబ్, ల్యాప్ట్యాప్, డెస్క్టాప్ దేనినైనా వినియోగించుకోవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయోలజీ 50 శాతం, భారతదేశం కృషిపై 20, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20, లాజికల్ రీజనింగ్పై 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్లకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, సీనియర్లకు నవంబర్ 19 నుంచి 23 తేదీల్లో వారికి నచ్చిన రోజు పరీక్ష రాయొచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయి, జనవరి 30న జాతీయ స్థాయి పోటీలు ఉంటాయి. ఫ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాల అందజేత ఫ 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు అవకాశం ఫ వచ్చేనెల 30లోపు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఫ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ముగ్గురికి నగదు బహుమతులు ఫ ఏడాదిపాటు రూ.2వేల చొప్పున ‘ఉపకారం’పాఠశాల స్థాయిలో 18 మందిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున గుర్తిస్తారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా ఇస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురికి రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశంతోపాటు ఏడాది పాటు నెలకు రూ.2వేల ఉపకార వేతనం అందజేస్తారు. -
టెండర్ ఫీజు రూ.3 లక్షలు
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు సూర్యాపేటటౌన్ : కొత్త మద్యం దుకాణాల (వైన్స్)కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. ఈ సారి మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ఫీజు ఒక్కటే పెంచిన ప్రభుత్వం మిగతా విధానాలు పాత పద్ధతుల్లోనే కొనసాగించేందుకు సిద్ధమైంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి 99 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో సూర్యాపేట సర్కిల్లో 30 దుకాణాలు, తుంగతుర్తి సర్కిల్లో 17, కోదాడలో 24, హుజూర్నగర్ సర్కిల్లో 28 దుకాణాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయింపు.. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ విధానం అమలు చేయనున్నారు. ఈసారి రిజర్వేషన్లు 30 శాతంగా నిర్ణయించారు. అందులో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఆయా దుకాణాలకు జనాభా ప్రాతిపదికన రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్లలో లైసెన్స్దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సెప్టెంబర్ 2వ వారంలోపే షెడ్యూల్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నెలలో దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన పూర్తిచేసి అక్టోబర్లో డ్రా పద్ధతిన దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎకై ్సజ్ శాఖ కమిషన్ ఆదేశాల మేరకే దుకాణాల లైసెన్స్ల జారీకి దరఖాస్తుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. లాటరీ పద్ధతిన ఎంపిక.. మద్యం దుకాణాలను గతంలో మాదిరిగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు తీసుకుని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన దరఖాస్తులను ఆయా మద్యం దుకాణాల వారీగా డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ డ్రా తీస్తారు. ఫ 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు ఫ 5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు ఫ 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు ఫ లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు ఫ 5 లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.85లక్షలు ఫ 20 లక్షల పైచిలుకు జనాభాకు రూ.1.10కోట్లు మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం ఫ గతంలో రూ.2లక్షలు.. ఈ సారి అదనంగా మరో రూ.లక్ష పెంపు ఫ డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు కాలపరిమితి ఫ గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వుడ్ ఫ జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్లు -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల: గ్రామాల్లో ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో పలు వీధులు, మురుగు కాలువలను పరిశీలించారు. ఇంటి ముందు ఇంకుడు గుంతల లేకుండా ఇళ్లలో వాడుకున్న నీరు వీధుల్లో ప్రవహించడాన్ని గమనించి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జ్వరాల బారిన పడిన పలువురిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. పలు వీధులు లోతట్టు ప్రాంతంలో ఉండడం, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిసరాల పరిశుఽభ్రత లోపించడం, కొన్నిచోట్ల చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయడం, జనావాసాల మధ్య పిచ్చిమొక్కలు పెరగడం, ఇంకుడు గుంతలు లేకపోవడాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతి వీధిలో డెమోపాస్ స్ప్రే, బ్లీచింగ్ చల్లాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. ఇందు కోసం రూ.50వేల చెక్కును ఎంపీడీఓకు అందజేశారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పైలెట్ గ్రామంగా ఎంపికై న తాడువాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, తహసీల్దార్ చంద్రశేఖర్, వైద్యాధికారులు శ్రీశైలం, వినయ్కుమార్, వైష్ణవి, పంచాయతీ కార్యదర్శి రాము, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ తాడువాయిలో పర్యటించిన కలెక్టర్ -
అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు
తుంగతుర్తి : ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిని తనిఖీ చేసి మాట్లాడారు. ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ గదిలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ డాక్టర్ల నేమ్ స్టాంప్స్లు, కన్సల్టెన్సీ డాక్టర్ల పేరుతో గల ఐడీ కార్డులు, లెటర్ ప్యాడ్స్, ఆపరేషన్ కోసం వాడుతున్న యాంటీబయాటిక్ మందులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జయ, డాక్టర్ నజియా, డాక్టర్ జి చంద్రశేఖర్, రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ లింగమూర్తి ఉన్నారు. 30, 31 తేదీల్లో శిక్షణ తరగతులుసూర్యాపేట : ఈ నెల 30, 31 తేదీల్లో మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు కోరారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం బలోపేతానికి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిన విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు పిడమర్తి భరత్, జిల్లా నాయకులు బోర లెనిన్, సంతోష్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా స్టాలిన్సూర్యాపేట : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన మామిడి స్టాలిన్ నియామకమయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నట్లు బుధవారం ఆయన తెలిపారు. స్టాలిన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మగౌరవ సభకు తరలిరావాలిసూర్యాపేట : సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆత్మ గౌరవసభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో జీవించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శిరందాసు రామదాసు, జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజు, టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, జానయ్య, శివమూర్తి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
కోదాడ: కోదాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పనిచేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న కలప వ్యాపారి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రామాపురంతండాకు చెందిన సెనావత్ హరినాయక్ కలప వ్యాపారం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం పనికిరాని చెట్లను కలప కోసం కొడుతుండగా అక్కడికి వెళ్లిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న వారిని అడ్డుకున్నాడు. తాను ప్రభుత్వానికి చలానా కడతానని కలప వ్యాపారి చెప్పాడు. ప్రభుత్వానికి రూ.60 వేలు చలానా కట్టాల్సివస్తుందని, తనకు రూ.50 వేలు ఇస్తే అన్నివిధాలా సహకరిస్తానని వెంకన్న చెప్పాడు. వ్యాపారితో చివరకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో అక్రమంగా కలప వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు తట్టుకోలేక హరినాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం కోదాడ సమీపంలోని ఒక హోటల్ వద్ద బాధితుడి నుంచి బీట్ ఆఫీసర్ వెంకన్న లంచం తీసుకొని తన బైక్ కవర్లో పెడుతుండగా అక్కడే మాటు వేసిఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని వెంకన్నను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ కలప వ్యాపారి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత -
రిజర్వేషన్లకు మించి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు, వారు గెలుపొందిన స్థానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వారికి కేటాయించిన స్థానాలతోపాటు, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా అమలు చేసే యోచనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని పార్టీలు అమలు చేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో 23శాతం రిజర్వేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 ఎన్నికల్లో బీసీలు తమకు ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానాలను దక్కించుకున్నారు. రిజర్వు అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో అధిక సీట్లను కై వసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 23 శాతం రిజర్వేషన్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లోనూ 35 శాతం వరకు, జెడ్పీటీసీ స్థానాల్లోనూ 25 శాతం వరకు స్థానాలను సాధించారు. జనరల్ స్థానాల్లో గెలుపు ఇలా.. ● నల్లగొండ జిల్లాలో 844 సర్పంచ్ స్థానాలు ఉండగా.. బీసీ రిజర్వేషన్ కింద 209 స్థానాలతోపాటు 79 జనరల్ స్థానాల్లోనూ బీసీలే పోటీ చేసి విజయం సాధించారు. మొత్తంగా 288 స్థానాలను (35 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 346 ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 93తోపాటు 23 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. మొత్తంగా 121 స్థానాలను బీసీలు దక్కించుకున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ రిజర్వుడ్ స్థానాలు 4తో పాటు మరో 4 జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి.. 8 స్థానాల్లో గెలుపొందారు. ● సూర్యాపేట జిల్లాలోనూ 475 సర్పంచ్ స్థానాలకు గాను బీసీ రిజర్వుడ్ స్థానాలు 171తోపాటు మరో 52 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. 233 స్థానాలను (47 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 255 ఎంపీటీసీ స్థానాల్లో 29 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 50 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 79 స్థానాలను కై వసం చేసుకున్నారు. 23 జెడ్పీటీసీ స్థానాల్లో 3 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 2 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 5 జెడ్పీటీసీ స్థానాలను సాధించారు. ● యాదాద్రి భువనగిరి జిల్లాలోని 420 సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వుడ్ 117 స్థానాలతోపాటు 59 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి.. 176 స్థానాలను (42 శాతం) కై వసం చేసుకున్నారు. 117 ఎంపీటీసీ స్థానాల్లో 39 రిజర్వుడ్ స్థానాలతోపాటు 12 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తం 51 స్థానాలను బీసీలు సాధించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో 4 బీసీ రిజర్వుడ్ స్థానాలతోపాటు మరొక జనరల్ స్థానంలో పోటీ ఐదింటిని దక్కించుకున్నారు. ఫ ఈసారి బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు ఫ ప్రభుత్వ పరంగా కుదరకపోతే పార్టీ తరఫున అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ఫ మిగతా పార్టీలూ బీసీలకు ప్రాతినిధ్యం పెంచక తప్పని పరిస్థితి ఫ రిజర్వేషన్ల అమలుపై పార్టీల్లో విస్తృత చర్చ గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పరంగా చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకపార్టీ 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు సీటు కేటాయించినా, అక్కడ మరో పార్టీ జనరల్ అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేసేందుకు తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. జాతీయస్థాయిలో కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామిఅమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులతో స్నేహపూర్వకంగా మెలగండి
పెన్పహాడ్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసు స్టేషన్ ఆవరణలో సిబ్బంది కవాతు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు, పోలీస్ స్టేషన్ మ్యాప్, గ్రామాల హద్దులు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో నిరంతరం పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా కేసుల్లో ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మానవ అక్రమ రవాణా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ గోపికృష్ణ, డీసీఆర్బీ ఎస్ఐ యాకూబ్, డీసీఆర్బీ సిబ్బంది అంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
‘కసరత్తు’కు కషా్టలు
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్లు నిర్వహణ లేక నీరసించిపోతున్నాయి. పర్యవేక్షణ లోపంతో పరికరాలు మూలనపడుతున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో ఏర్పాటు చేయలేదు. అయితే ఓపెన్ జిమ్లు ఉన్న మున్సిపాలిటీల్లోనూ వాటి పరిస్థితి గాలిలో దీపంలా మారింది. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వ్యాయామ పరికరాలు పాడైపోతున్నాయి.సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో 2018లో సీడీఎంఏ ఆధ్వర్యంలో రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉండడంతో ప్రభుత్వం 2022లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో మరో ఏడు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. మొత్తంగా సూర్యాపేట పట్టణంలో తొమ్మిది ఓపెన్ జిమ్లు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణను అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. కొత్తగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిన చోట సిమెంట్ ఫ్లోరింగ్పై రబ్బర్ షీట్లు వేశారు. వాటిని గమ్తో అతికించడంతో కొన్నాళ్లకే ఊడిపోయాయి. వర్షం పడితే పైకి తేలుతున్నాయి. వీటిపై విమర్శలు రావడంతో అధికారులు మెత్తటి టైల్స్ వేయడం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో ప్రస్తుతం కొన్ని వస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓపెన్ జిమ్కు వచ్చే వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినా పార్కుకు తాళాలు వేస్తుండడంతో అక్కడికి వెళ్లే స్థానికులు ఓపెన్ జిమ్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.కోదాడ: నాలుగు సంవత్సరాల క్రితం కోదాడలోని గాంధీ పార్కు ఆవరణలో రూ.5లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నాణ్యతలేని పరికరాలు కావడంతో సంవత్సరం లోపే అవి పాడైపోయాయి. కింద వేసిన ఫ్లోర్ కూడా పాడైపోయింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించి గాంధీ పార్కును ఆధునీకరిస్తున్నామని మరో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓపెన్జిమ్ స్థానంలో పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. దీంతో ఓపెన్జిమ్ ఆనవాలు లేకుండా పోయింది.పరికరాల్లో లోపించిన నాణ్యత హుజూర్నగర్: హుజూర్నగర్లో గత ప్రభుత్వ హయాంలో రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్లో, ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో ఈ జిమ్లు ఉన్నాయి. ఒక్కో జిమ్లో దాదాపు రూ. 10 లక్షలు వెచ్చించి వ్యాయామ పరికరాలు, నేలపై మ్యాట్లను ఏర్పాటు చేశారు. నాణ్యత లేని వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ లేక పరికరాలు చాలావరకు సరిగా పనిచేయడం లేదు. ఫ్లోర్ మ్యాట్లు కూడా పాడైపోయాయి. ప్రస్తుతం ఆయా జిమ్లలో నేలపై ఏర్పాటు చేసిన మ్యాట్లు మాయమయ్యాయి. జిమ్కు వచ్చే ప్రజలు గత్యంతరం లేక సరిగా పనిచేయని వ్యాయామ పరికరాలను అలాగే ఉపయోగిస్తున్నారు.ఆధునీకరణ పేరిట ఆట వస్తువుల ఏర్పాటు నిర్వహణ లేక నీరసించిపోతున్న ఓపెన్జిమ్లు పర్యవేక్షణ లోపంతో పాడైపోతున్న పరికరాలు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలంటున్న పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఓపెన్ జిమ్లు జనాభా సూర్యాపేట 09 1,33,339 కోదాడ తొలగించారు 75,093 హుజూర్నగర్ 02 35,850 -
పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ
నాగారం : ప్రస్తుతం సమాజంలో పిల్లలకు ఇంటా, బయట రక్షణ కొరవడింది. ఈవ్ టీజింగ్, ఇతర వేధింపులు, గృహ హింసకు గురవుతున్నారు. దీంతో పిల్లల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి పి ల్లల భద్రత, మానవ అక్రమ రవాణా, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జిల్లాస్థాయిలో మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఈ శిక్షణకు ఎంపిక చేశారు. శిక్షణ వివరాలు.. జిల్లాలోని 181 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాల్లో మొదటి విడత శిక్షణ అక్టోబర్ 6, 7 తేదీల్లో, రెండో విడత అక్టోబర్ 8, 9 తేదీల్లో, మూడో విడత అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు అవగాహనపిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా పిల్లలకు అవగాహన కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక స్థితి, ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తున్నారు. కుటుంబంలో, బయట భద్రత పొందేలా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. గృహ హింస, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో సూచిస్తారు. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు.ఫ ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒకరి ఎంపిక ఫ మూడు విడతల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ఫ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్న ప్రభుత్వం పిల్లల భద్రత అంశంపై ఉపాధ్యాయులకు జిల్లాలో మూడు విడతలో్ల్ శిక్షణ ఇప్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ శిక్షణ అక్టోబర్ 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. సమాజంలో పిల్లలు భద్రత పొందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. –అశోక్, డీఈఓ, సూర్యాపేట -
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
పొనుగోడు పీఏసీఎస్ గోదాంను పరిశీలిస్తున్న కలెక్టర్ గరిడేపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్గరిడేపల్లి : యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని పరిశీలించి యూరియా నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. పలు రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పొనుగోడు పాఠశాలలో ఒకే ఆవరణంలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు ఉండడంతో రెండు పాఠశాలలకు కలిపి వంటలు వండించాలని సూచించారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, సహకార సంఘం, ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ, ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆరోగ్య కేంద్రానికి ఎంత మంది అవుట్ పేషెంట్స్ వస్తునా ్నరని వైద్యాధికారి నరేష్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా అసంపూర్తిగా ఉన్న సీ్త్రశక్తి భవనం విషయం విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండ కవిత, ఎంపీడీఓ సరోజ, ఎస్ఐ చలికంటి నరేష్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ ఏఈలు కళ్యాణ్, సిద్ధార్థ, ఆర్ఐలు ప్రవీణ్, రాంబాబు, ఏపీఎం అజయ్, ఏపీఓ సురేష్, ఎంపీఓ ఇబ్రహీం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గరిడేపల్లి మండలంలో నాలుగు గంటలకుపైగా సమయాన్ని కేటాయించిన కలెక్టర్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గరిడేపల్లిలో ఎరువుల దుకాణం ఎదుట మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్ వాహనం నుంచి దిగుతున్న సమయంలో వాహనం కదలడంతో ఆయన కాలిపై వాహనం టైర్ ఎక్కడంతో గాయమైంది. దీంతో ఆయనకు దగ్గరుండి చికిత్స చేయించాలని ఆర్ రాంబాబుకు కలెక్టర్ సూచించారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సీఎంఆర్ బకాయిలు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్ బకాయిలు 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించినవి సెప్టెంబర్ 12 నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం వేగవంతంగా మిల్లింగ్ చేసి ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేపట్టాలని, రోజువారీ నివేదికలను తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్బాబు, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, డీటీ రాజశేఖర్, ఆర్ఐలు శ్రీకాంత్, ప్రమోద్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినడిగూడెం : పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంట గది, హాస్టల్ స్టోర్ను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట కోదాడ డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎంపీఓ విజయకుమారి, ప్రిన్సిపాల్ వాణి, డాక్టర్.హరినాఽథ్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, ఏఎన్ఎం సుజాత, ఆశా కార్యకర్తలు సైదమ్మ, సునిత, స్టాఫ్నర్స్ నాగలక్ష్మి, ఉన్నారు. మెడికల్ షాపు తనిఖీతుంగతుర్తి: అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో గల మెడికల్ దుకాణాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మహిళకు వైద్యం చేసేటప్పుడు ఎలాంటి మందులు ఉపయోగించారో పరిశీలించారు. వారివెంట సీఐ నరసింహారావు, ఎస్ఐ క్రాంతికుమార్ ఉన్నారు. -
మరమ్మతులు చేపట్టాలి
ప్రతిరోజు జూనియర్ కాలేజీలోని ఓపెన్ జిమ్కు ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తుంటాం. కసరత్తు చేసే పరికరాలు పాడైపోయాయి. అవి సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి. – బొర్ర పుల్లయ్య, చర్చి కంపౌండ్, సూర్యాపేట చందాలు వేసుకుని పరికరాలకు రిపేర్ చేయించాం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యాపేటలోని ఓపెన్ జిమ్కు వస్తుంటాం. పరికరాలు పాడవడంతో తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి కష్టమవుతోంది. ఒకసారి ఓపెన్ జిమ్కు వచ్చే వాళ్లం చందాలు వేసుకొని రిపేరు చేయించాం. అవి మళ్లీ పాడైపోయాయి. అధికారులు స్పందించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి బిగించి వినియోగంలోకి తేవాలి. – పడిశాల ఊశయ్య, సూర్యాపేట -
పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా
సూర్యాపేటటౌన్ : ఏఆర్లో హెడ్ కానిస్టేబుల్ రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ బీమా చెక్కు అందజేశారు. అదేవిధంగా నూతనకల్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సోమాని నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా.. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు చేయూత పథకం ద్వారా రూ.2లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
పంట.. వంట.. మనదే
ప్రభుత్వం సరఫరా చేసిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లు పంపిణికి సిద్ధం ఉన్నాయి. ఈ విత్తనాలను ఎంపిక చేసిన కేంద్రాలకు సరఫరా చేస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లోని ఆయాలు, టీచర్లకు తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఉద్యానశాఖ అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ●నాగారం : ఖాళీ స్థలాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకు కూరలు పండించాలని ప్రభుత్వం నిర్ణయించించి. బయట కూరగాయల ధరలు పెరగడం, నాణ్యత కొరవడడం, సమయానికి సరిపడా లభించకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాల ప్యాకెట్లను పంపిణీకి సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ పోషణ్ వాటిక పథకం కింద జిల్లాలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఇందుకోసం ఎంపిక చేశారు. టమాట, వంగ, బెండ, పాలకూర, తోటకూర, మెంతి కూర విత్తనాల ప్యాకెట్లు ఇవ్వనున్నారు. ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా..పోషణ్ వాటికను తొలి విడతలో జిల్లాలో 150 కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టమాట, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, మెంతికూర సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైన విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 180 కేంద్రాల్లో తోటలు పెంచుతుండగా తాజాగా మరో 150 అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు వచ్చాయి. వీటిని ఎంపిక చేసిన కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో సాగుచేస్తారు. ఐదేళ్లపాటు పెంపకం, నిర్వహణకు ప్రభుత్వం రూ.10వేలు అందజేస్తుంది. వీటిని ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఫ పోషణ్ వాటిక పథకం కింద కూరగాయల సాగు ఫ నూతనంగా 150 అంగన్వాడీ కేంద్రాల్లో సాగు చేసేలా ప్రణాళిక ఫ ఒక్కో కేంద్రానికి త్వరలో విత్తనాల ప్యాకెట్లు పంపిణీఅద్దె భవనాల్లోనే అధికం.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 313 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 435 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 461 ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్స్లో కొనసాగుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 0–6 నెలల పిల్లలు 3669, 7నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 25,669 మంది, 3–6 సంవత్సరాల పిల్లలు 18,066 మంది, గర్భిణులు 5,947 మంది, బాలింతలు 3,888 మంది నమోదై ఉన్నారు. సొంత భవనాల్లోనూ స్థలాలు లేనిచోట పెరటి సాగు చేయడం లేదు. ఇక అద్దె భవనాల సంగతి చెప్పనక్కర్లేదు. మొత్తానికి స్థలాలు లేవన్న కారణంగా అత్యధిక కేంద్రాలు పెరటి సాగును పక్కన పెట్టారు. కూరగాయలను బయటే కొంటున్నారు. నాణ్యత లేకపోవడం, ధరలు విపరీతంగా ఉన్నా కొనుగోలు చేయక తప్పడం లేదు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సూర్యాపేట: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని సోమవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో కలిసి మాజీ మంత్రి జగదీష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ రమేష్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చి న ఎంఎస్కే ప్రసాద్కు అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో సూర్యాపేట ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని, పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా విజయం తధ్యమన్నారు. ఈ క్రికెట్ అకాడమీ రెండో సెక్షన్ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి సూర్యాపేట పేరును జాతీయ స్థాయిలో నిలపాలని కోరారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగల్యధారణ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నిక సూర్యాపేట : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వెంకన్న, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాదెండ్ల బాలకృష్ణ, జిల్లా కార్యదర్శిగా యాదగిరి నాయుడు, జిల్లా అదనపు కార్యదర్శిగా నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్● సోషల్మీడియాలో వైరల్గా మారిన పంచాయతీ కార్యదర్శి ఆడియో పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు మంజూరు కావాలంటే తనకు కొంత డబ్బు ముట్టజెప్పాలని, లేదంటే వాటిని నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తూ స్వయంగా లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకట్ స్పందిస్తూ గ్రామంలో తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, లబ్ధిదారులే త్వరగా బిల్లు మంజూరయ్యేలా చూడాలని, అందుకు కొంత డబ్బు ఇస్తామని తనను ట్రాప్ చేశారని పేర్కొన్నారు. ఎంపీడీఓ లక్ష్మిని సంప్రదించగా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో బిల్లు మంజూరుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా లింగయ్యసూర్యాపేటటౌన్ : డీటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని హైదరాబాద్లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన రేపాక లింగయ్య, ఆడిట్ కమిటీ సభ్యుడిగా సీహెచ్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కౌన్సిల్కు, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీ కోటాపై ఆశలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే ఈసారి పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వపరంగా అమలు విషయంలో అడ్డంకులు ఉండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ ముందుకు సాగేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో దీనిపై పక్కా అభిప్రాయానికి రానుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎన్ని పెరిగే అవకాశం ఉంటుందో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. భారీ అంచనాల్లో అధికార పార్టీ ఆశావహులు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు 2019లో జరిగాయి. 2024లో పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఇందుకు చాలా అడ్డుంకులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల పెంపుపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నా, పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ముందుకెళ్లే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏయే మండలాల్లో ఏయే గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు అవకాశాలు దక్కుతాయన్న విషయంలో అధికార పార్టీ నేతలు, ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం ఫ పార్టీ పరంగా ఓకే.. ప్రభుత్వ పరంగా తప్పని చిక్కులు ఫ త్వరలోనే పీఏసీ, కేబినెట్ సమావేశాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఫ సెప్టెంబర్ మొదటి వారంలోపే రానున్న ఎన్నికల షెడ్యూల్ -
యూరియాకు ఎలాంటి కొరత లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటివరకు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, ఈ నెలలో 3800 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 6, 7 రోజుల్లో స్టాక్ రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రతిరోజు 600 నుంచి 700 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించాలివీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రతిరోజు మండలాల వారీగా యూరియా, ఇతర ఎరువులకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని, అలాగే టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతులు నానో యూరియా వాడే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలి భానుపురి (సూర్యాపేట) : భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, సీపీఓ కిషన్ పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
హుజూర్నగర్ : పేదలకు విలువైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ 3.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఓపీ బ్లాక్ నూతన విభాగం, ధోబి ఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. రూ 1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో నిర్మించిన డయాలసిస్, రక్త నిధి కేంద్రాలను ప్రారంభించారు. రూ.3 కోట్లతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, డీసీహశ్రీచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక న్యాయం వైపు ప్రభుత్వం అడుగులు హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ ఎలక్ట్రిసిటి ఉద్యోగుల ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ ప్రాంక్లిన్, డీఈలు వెంకట కిష్ణయ్య, శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
జలదిగ్బంధంలో కోడూరు
అర్వపల్లి: కురుస్తున్న వర్షాలకు జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం–సంగెం రహదారిపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా కోడూరు గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఆదివారం కురిసిన వర్షానికి కోడూరు వద్ద వాగు వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు వాసులు అటు సంగెం మీదుగా, ఇటు కోడూరు, కొమ్మాల మీదుగా ఎటు వెళ్లాలన్నా వాగులు అడ్డంకిగా మారాయి. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ను ఏర్పాటు చేసి అత్యవసర పనులు ఉన్నవారిని వాగు దాటిస్తున్నారు. సోమవారం గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. ట్రాక్టర్పై వాగు దాటించి సూర్యాపేటకు తీసుకెళ్లారు.ఫ వాగు దాటేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఏర్పాటు -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్పై విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్ ఒకరి మృత్యువాతచందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఏడుగురు వ్యక్తులకు గాయాలు చివ్వెంల, గుండాల, చందంపేట, డిండి మండలాల పరిధిలో ఘటనలుఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. -
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీకాంత్గౌడ్
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు నార్కట్పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్తో గొడవ పడి హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూజలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఫ్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ఫ్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. -
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలిసంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు. బైక్ అపహరణఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్ను లాకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఆర్ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ వైద్యుడు కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్ఓ తెలిపారు. -
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలు కేసుల దర్యాప్తులో కీలకం ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతాపం తెలిపారు. -
కొడుకు ప్రేమ వివాహం.. కుమార్తెల పేర ఆస్తి రాసిన తండ్రి
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కుమార్తెల పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కుమార్తెల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్గా మారింది. దుకాణం ఎదుట బైఠాయించిన నవ దంపతులు పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన కుటుంబ పంచాయితీ -
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలిమిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్టౌన్ పోలీస స్టేషన్కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన -
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
సిబ్బందిపై ఓవర్ లోడ్
నాగారం : విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడక్కడా సిబ్బంది సర్దుబాటు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో వినియోగదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఏటా కనెక్షన్లు పెరుగుతున్నా.. జిల్లాలో ఏటా గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించడం లేదు. జిల్లాలో సూర్యాపేట, హుజూర్నగర్ రెండు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలో ప్రతి 1,500 సర్వీసులకు ఒక జూనియర్ లైన్మెన్ పోస్టు ఉండాలి. ప్రతి 3వేల కనెక్షన్లకు అసిస్టెంట్ లైన్మెన్, ప్రతి 4,500 కనెక్షన్లకు లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ ఉండాలి. రెండు డివిజన్ల పరిధిలో క్షేత్రస్థాయిలో సిబ్బంది 534 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 405 మంది పనిచేస్తున్నారు. 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యవసాయ బావుల వద్ద ఫ్యూజులు పోతే విద్యుత్ సిబ్బంది రావడం ఆలస్యం అవుతోంది. గ్రామాల్లోనూ రాత్రిపూట ఫ్యూజులు పోతే పెట్టడానికి ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. వారు వచ్చేలోపు రైతులు, గ్రామస్తులే సరిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ ప్రమాదాల బారిన పడుతున్నారు. జేఎల్ఎం, ఏఎల్ఎంల ఖాళీలే అధికం.. జిల్లాలో జేఎల్ఎం, ఏఎల్ఎం పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 2019లో జేఎల్ఎం పోస్టులు భర్తీ కాగా, ఏడాది విధులు పూర్తిచేసుకున్న వారంతా ఏఎల్ఎంలుగా పదోన్నతులు పొందారు. దీంతో జేఎల్ఎం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిపై పనిభారం పడడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఏ రాత్రయినా విద్యుత్ పునరుద్ధరణకు క్షేత్రస్థాయి సిబ్బందే పనులు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో వెళ్లాలంటే మరో సిబ్బందికి అదనంగా పని కల్పించాల్సి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖలో పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయి సిబ్బంది ఖాళీల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – శ్రీనివాస్, ట్రాన్స్కో డీఈఈ సూర్యాపేట విద్యుత్ శాఖలో భర్తీకాని ఖాళీ పోస్టులు ఫ నాలుగేళ్లుగా నియామకాల్లేవు ఫ ఉన్నవారిపై అదనపు పనిభారం ఫ జిల్లా వ్యాప్తంగా 129 పోస్టులు ఖాళీగృహ విద్యుత్ కనెక్షన్లు 4,51,501వ్యవసాయ కనెక్షన్లు 1,54,270 ఉండాల్సిన సిబ్బంది 534 ప్రస్తుతం ఉన్నవారు 405పోస్టు మొత్తం పనిచేస్తున్నవారు ఖాళీలుజూనియర్ లైన్మెన్ 172 110 62 అసిస్టెంట్ లైన్మెన్ 130 80 50 లైన్మెన్ 170 159 11 లైన్ ఇన్స్పెక్టర్ 50 48 02 ఫోర్మెన్ 12 08 04 -
వైద్యశాల స్థలంపై పట్టింపేది..!
ఫ ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మున్సిపల్ అధికారులు ఫ అభ్యంతరం వ్యక్తం చేయని వైద్యశాఖ ఫ ప్రజల పోరాటాన్ని పట్టించుకోని పాలకులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటలు తక్కువగా ఉంది. దీనిపై మేము 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అందువల్ల వైద్యశాల స్థలంలో ఇతరుల భవనాల నిర్మాణానికి వైద్యశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయాలి. రెండు ఎకరాల స్థలం ఎక్కడ ఉందో చూపిన తరువాతే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి. –కుదరవళ్లి బసవయ్య, కోదాడ. కోదాడ: ఏళ్లుగా కొనసాగుతున్న వైద్యశాల స్థల వివాదంపై పాలకులకు, అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వైద్యశాలకు దాత ఇచ్చిన స్థలంపై ఎన్నో సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నా నేటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఆ స్థలంపై అభ్యంతరాలు ఉన్నాయిని పట్టణ ప్రజలు చెబుతున్నా దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటల స్థలం తక్కువగా ఉన్నప్పటికీ పక్కన ఉన్న రోడ్లతో సహా కొలిచి దాత వారసుడికి 500 గజాల స్థలాన్ని అక్రమంగా కేటాయించారని కోదాడ పట్టణ ప్రజలు 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ నుంచి రాష్ట్ర అధికారుల వరకు వినతులు ఇస్తూ వస్తున్నారు. దీంతో రెండుసార్లు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసిన అధికారులు.. మూడోసారి మళ్లీ కేటాయించారు. పరాధీనం ఇలా.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు నాగుబండ పద్మయ్య 1963లో రిజిస్టర్ దానపత్రం ద్వారా 2 ఎకరాల స్థలాన్ని దానం ఇచ్చారు. 1998లో దాత మనవడు తాము దానం ఇచ్చిన స్థలం కన్నా వైద్యశాలలో ఎక్కువగా ఉందని కోర్టుకు వెళ్లాడు. ఎక్కువగా ఉంటే ఇవ్వాలని కోర్టు చెప్పడంతో.. అధికారులు భూమిని సర్వే చేసి రెండు ఎకరాలకు ఎక్కువగా ఉందని తెల్చారు. 500 గజాలు దాత వారసుడికి ఇచ్చారు. ఈ సమయంలో వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డును కూడా కలిపి కొలవడంతో ఎక్కువ స్థలం వచ్చిందని, వైద్యశాల కాంపౌండ్ లోపల 2 ఎకరాలకు తక్కువగా ఉందని పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి కొలిచి వైద్యశాల లోపల 15 కుంటలు తక్కువగా ఉందని తేల్చి మొదటి కేటాయింపును రద్దు చేశారు. మరోసారి దాత వారసుడు కోర్టుకు వెళ్లడంతో సర్వే అధికారులు అతడితో కుమ్మకై ్క రోడ్డును కలిపి మరోసారి కొలిచి ఎక్కువగా ఉందని తెల్చి మరోసారి స్థలాన్ని కేటాయించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డు తనదేనని దాత వారసుడు అంతకు ముందు సూర్యాపేట సబ్కోర్టుకు వెళ్లాడు. అది పంచాయితీకి చెందిన రోడ్డు అని కోర్టు తీర్పు చెప్పడంతోపాటు దాత వారసుడికి కోర్టు ఫైన్ కూడా వేసింది. 100 పడకల వైద్యశాల నిర్మాణం.. ప్రస్తుతం 30 పడకల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 పడకల వైద్యశాల నిర్మిస్తున్నారు. కాగా దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో వైద్యశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి రాబట్టుకోవాలని పట్టణవాసులు అధికారులకు చేస్తున్న విజ్ఞప్తులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణ విషయం పట్టించుకోకుండా ఎకరం 25 కుంటల స్థలంలో 100 పడకల వైద్యశాల నిర్మాణం సరిపోతుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం. దాత వారసుడికి కేటాయించిన స్థలాన్ని అతడు వెంటనే ఇతరులకు అమ్ముకున్నాడు. కొన్నవారు ఈ స్థలంలో భవన నిర్మాణాలకు వారు దరఖాస్తు చేయగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడిచిన పది సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతున్నారు. తాజాగా వారు కోర్టుకు వెళ్లడంతో మున్సిపల్ అధికారులు 23 జూన్ 2025న వైద్యశాల అధికారులకు నోటీసు ఇచ్చారు. ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆరు వారాల్లోగా చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సమయం మించి పోతున్నా నేటి వరకు వైద్యశాఖ అధికారులు స్పందించిన దాఖాలాలు లేవు. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే వైద్యశాల స్ధలం శాశ్వతంగా పరాధీనమై 20 సంవత్సరాల పట్టణ ప్రజల పోరాటం బూడిదలో పోసిన పన్నీరవుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకుందాం
కోదాడ: ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా కాపాడుకోవడం మన బాధ్యత అని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఆ సంస్థఽ జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి నివాసంలో జరిగిన సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, పాఠశాలలను ఇరుకై న గదుల్లో కాకుండా విశాలమైన భవనాల్లో ప్రారంభించాలని కోరారు. విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కోరారు. సమావేశంలో వీరారెడ్డి, వెంకట రమణ, వీరబాబు, ఖాజామియా,రాంమూర్తి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటనారాయణ, కరుణాకర్ పాల్గొన్నారు. ఫ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి -
పోరుబాటను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న సీపీఎం పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన సీపీఎం సూర్యాపేట రూరల్, త్రీ టౌన్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, సీపీఎం త్రీ టౌన్ కార్యదర్శి చిట్లంకి యాదగిరి, సీపీఎం రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యులు నారాయణ వీరారెడ్డి, నల్ల మేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనువైన స్థలంలోనే వ్యవసాయ కళాశాల
హుజూర్నగర్ : ప్రజలకు అన్ని రకాలుగా అనువుగా ఉన్న స్థలంలోనే వ్యవసాయ కళాశాల నిర్మిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 1041లో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల విస్తీర్ణం, వాటి స్థితిగతులను మంత్రికి, అధికారులకు ఆర్డీఓ శ్రీనివాసులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1041లో గల ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయని, రోడ్డు సౌకర్యం కూడా ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఈ భూములకు సాగు నీరు సైతం అందుతోందని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య, డీన్ ఝాన్సీరాణి, డీఎస్ఎ వేణుగోపాల్రెడ్డి, లింగయ్య, ఎస్పీ కే నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఏఓ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్కు 6,191 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 5,060 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల(3.84 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. -
పులిచింతల ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,73420 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. ఎనిమిది గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి దిగువకు 2,90,526 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వైభవంగా నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో ఉట్ల పండుగమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రెండో రోజు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉట్ల పండుగను వైభవంగా నిర్వహించారు. పెదవీడు గ్రామానికి చెందిన యాదవులు ఆలయ కల్యాణ మండపం వద్ద ఉట్లు గొట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో నవీన్కుమార్, అర్చకులు, యాదవులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక మేళ్లచెరువు: మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు రాగుల నరేష్యాదవ్ మరోసారి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అక్టోబర్ 8 నుంచి అమెరికాలో జరగనున్న పారా ఒలింపిక్ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తాను ఎంపికై నట్లు నరేష్యాదవ్ ఆదివారం తెలిపారు. గతంలో వివిధ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన నరేష్,.. 2014లో చైనాలో జరిగిన ప్రపంచ పారా బీచ్ వాలీబాల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. తన ప్రతిభను గుర్తించి అమెరికాలో జరగనున్న పోటీలకు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా తనను ఎంపిక చేసినట్లు నరేష్ వెల్లడించారు. చిన్నతనంలో కాలుకు పోలియో సోకడంతో నరేష్ దివ్యాంగుడయ్యారు. నరేష్ చిన్నతనం నుంచి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో వివిధ విభాగాల్లో ఎన్నో పతకాలు సాధించారు. -
అబార్షన్ చేసి గర్భిణి ప్రాణం తీసిన ఆర్ఎంపీ
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని తుంగతుర్తిలో కొందరు ఆర్ఎంపీలు మాఫియాగా మారి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. తాజాగాఆర్ఎంపీ శ్రీనివాస్ అక్రమాలు వెలుగుచూశాయి. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్ చేశాడు. అయితే అబార్షన్ వికటించి ఐదు నెలల గర్భిణి విజేత మృతి చెందింది. గత కొంతకాలంగా వైద్యం ముసుగులోఆర్ఎంపీ శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. బాలాజీ ఆస్పత్రి పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేసి, కొందరు ఆర్ఎంపీలు కలిసి ఓ మాఫియాలాగా మారారు శ్రీనివాస్. తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో పేద గర్భిణీలే టార్గెట్గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేస్తూ ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులోనే బిడ్డను చిదిమేస్తున్నారు. వైద్యం ముసుగులో శ్రీనివాస్ ముఠా చేస్తున్న భ్రూణ హత్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుకు సమాచారం ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు స్థానికులు. శ్రీనివాస్ ముఠా చేస్తోన్న అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపై రాజకీయ పలుకుబడి ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగారని ఆరోపిస్తున్నారు. -
భవితకు పునాది ‘బాలబడి’
ఫ కృష్ణమ్మ కాంతులునాగారం : బుడిబుడి అడుగుల దశలోనే చిన్నారులను బడిబాట పట్టించి వారి ఉజ్వల భవితకు పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్) కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఆకట్టుకునేలా బాలబడి కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందించారు. సృజనాత్మకతను పెంచేలా కొత్త సిలబస్ను అమలు చేస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య సజావుగా సాగేలా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరదీపికలు పంపిణీ చేశారు. సులువుగా అర్థమయ్యేలా.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా ‘ప్రియదర్శిని’ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. నూతన పాఠ్యాంశాలు, వినూత్న అంశాలు ఇందులో పొందుపర్చారు. గత విద్యా సంవత్సరంలో ‘తంగేడు పువ్వు’ పేరుతో నాలుగు పుస్తకాలు పంపిణీ చేయగా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా వచ్చిన ప్రియదర్శిని పుస్తకాలతో చిన్నారుల్లో విజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. పర్యవేక్షణ పెంచితే సత్ఫలితాలు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. అంగన్వాడీలపై పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి, సిలబస్ ప్రకారం బోధిస్తేనే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన సిలబస్ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో భాషపై ప్రాథమికంగా పట్టు సాధించేందుకు వీలుంటుంది. కొత్త సిలబస్ ద్వారా లోతైన విజ్ఞానం పొందవచ్చు. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఫ అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు కొత్త కార్యక్రమం ఫ చిన్నారులను ఆకట్టుకునేలా కరదీపికలు ఫ ప్రియదర్శిని పేరుతో పాఠ్యపుస్తకాలు ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 అంగన్వాడీ కేంద్రాలు 1,209 3–6 ఏళ్లలోపు చిన్నారులు 18,066 -
వీడని వరద.. తీరని వ్యథ!
సూర్యాపేట అర్బన్ : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో ఇళ్ల చుట్టూ, వరిపొలాల మీదుగా వరదనీరు పారుతోంది. మళ్లీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు, పిల్లలమర్రి చెరువు అలుగు పోస్తున్నారు. ఆయా చెరువుల వరదంతా పట్టణంలోని ఎస్వీ కాలేజీ వెనుక నుంచి ప్రియాంక నగర్, ఆర్కే గార్డెన్ మీదుగా ఎస్పీ ఆఫీస్ దగ్గర గల ఈదులవాగు నుంచి నల్ల చెరువులోకి చేరుతోంది. ఆయా కాలనీలను వరద వదలడం లేదు. ఫలితంగా ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరద ముప్పు తప్పేలా శాశ్వత పరిష్కారం చూడాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలగిరి, మోతె, ఇతర మండలాల్లోనూ చెరువులు అలుగు పోస్తూ వరిపొలాలను ముంచెత్తుతున్నాయి. ఫ అలుగు పోస్తున్న చెరువులు ఫ సూర్యాపేటలో పలు కాలనీలు జలమయం ఫ ఇతర మండలాల్లో నీట మునిగిన వరిపొలాలు -
నేడు, రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్రెడ్డి ఆది, సోమవారం రెండు రోజుల పాటు హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పాలకవీడు మండలం రాఘవాపురంలో, సాయంత్రం 4:15 గంటలకు హుజూర్నగర్ శివారులోని మగ్దుం నగర్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు స్ధల పరిశీలన చేస్తారు. అనంతరం 5 గంటలకు హుజూర్నగర్లోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 6 గంటలకు పట్టణంలోని మంత్రి తన ఇంటికి చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం 8:40 గంటలకు పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్ను మంత్రి ప్రారంభించి, నూతన ఓపీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంప్లో నీటిపారుదల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి కోదాడకు వెళతారు. సీఎం, మంత్రులందరిదీ కమీషన్ పాలనే..మఠంపల్లి: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులందరిదీ కమీషన్ పాలనేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో రుణమాఫీ, రైతు భరోసా వందశాతం పూర్తిచేసినట్టు నిరూపించాలన్నారు. గతంలో ఎత్తిపోతల పథకాలను అడ్డుకున్న మంత్రి ఉత్తమ్ ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్పై ప్రజలకు ఎంత ప్రేమ ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తెలిసిపోతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మాజీ జెడ్పీటీసీ జగన్నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహరాజు, నాయకులు బీవీ రామారావు, హఫీజ్ఖాన్, పుల్లారెడ్డి, బాలాజీనీయక్, లక్ష్మీనరసింహారెడ్డి, సైదులు, కోటా నాయక్, జాలకిరణ్, నాగయ్యయాదవ్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు కార్యాలయాలకు సౌర వెలుగులు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యుత్ ఆదా చేయడంతోపాటు ఆయా శాఖలకు భారంగా మారుతున్న విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ఊరట కలగనుంది. ఈ క్రమంలో తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సౌర విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు వివరాల సేకరణ పక్కాగా భవనాలు ఉన్న కార్యాలయాల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పక్కాగా భవనాలు ఉన్న కార్యాలయాల వివరాలను టీజీ రెడ్కో అధికారులు సేకరిస్తున్నారు. ఏ భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది..? అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయన్న వివరాలను మండల స్థాయి నుంచి సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాల భవనాలు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా.. పక్కాగా భవనాలు కలిగిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం నెలకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది? ఎంత విద్యుత్ బిల్లు వస్తోందన్న వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. ఈ లెక్కన తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న భవనాలకు హెచ్టీ సర్వీస్ కింద సోలార్ ప్లాంట్లను బిగించనున్నారు. రూ.2 వేల నుంచి రూ.3 వేల కరెంట్ బిల్లులు వచ్చే కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద మూడు నుంచి ఐదు కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాలమైన భవనాలతో ఎక్కువ విద్యుత్ వినియోగించే వాటికి హెచ్టీ సర్వీస్ కింద 100 కిలోవాట్లకుపైగా సోలార్ ప్లాంట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కేటాయిస్తే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశముంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు ఉన్నాయి. ఈ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఎంత మేర ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న వివరాలు సేకరిస్తున్నాం. ఇంకా మండలాల నుంచి వివరాలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. – సంతోష్, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ ఫ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం ఫ ఇప్పటికే కలెక్టరేట్లో వినియోగం ఫ తప్పనున్న బిల్లుల భారం ఫ వివరాలు సేకరిస్తున్న టీజీ రెడ్కో అధికారులు -
పొదుపు సంఘాల్లోకి కిశోర బాలికలు
నాగారం : ఇందిరా మహిళా శక్తి మిషన్లో భాగంగా చిన్నప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయడం, బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు 15–18 ఏళ్ల లోపు కలిగిన కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితోపాటు దివ్యాంగ మహిళలు, 60 ఏళ్లు పైబడిన మహిళలతో కొత్తగా పొదుపు సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు రోజు వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు, సలహాలు అందజేశారు. అయితే మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఇప్పటి వరకు 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన మహిళలకు మాత్రమే సభ్యత్వం ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దివ్యాంగులు, కిశోర బాలికలతోపాటు అరవై ఏళ్లు దాటి మహిళలకు ఆర్థిక చేయూత లభించే అవకాశం కలిగింది. ఈ వారంలో సంఘాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలో ఇప్పటికే 17,976 స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ)లు ఉన్నాయి. మహిళా శక్తి కింద అర్హులైన మహిళందరితో కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సంఘాల్లో చేర్చనున్నారు. దీంతో అదనంగా మరిన్ని సంఘాలు ఏర్పాటు కానున్నాయి. దివ్యాంగులు, కిశోర బాలికలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు అవకాశం కల్పిస్తారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేసింది. ఇటీవలే జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మండల స్థాయి సదస్సులతో అర్హులను గుర్తిస్తున్నారు. ఈనెల మూడో వారంలో కొత్తగా సంఘాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటిలో అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల మూడు, నాలుగో వారంలో బ్యాంకు పొదుపు ఖాతాలు తెరిపించనున్నారు. ఈ నెల 30న సంఘాల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసి అనంతరం బ్యాంకు లింకేజీ తదితర రుణాలు మంజూరు చేయనున్నారు. ఫ కొత్తగా దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన మహిళలకూ అవకాశం ఫ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం ఫ మరింత మందికి చేయూతనిచ్చేలా కార్యాచరణ ఫ నెలాఖరులోగా ఆన్లైన్లో వివరాల నిక్షిప్తం ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో అర్హులైన వారందరినీ చేర్పించేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. ఏపీఎం, సీసీలకు అవగాహన కల్పించాం. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. – వీవీ.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట మొత్తం సభ్యుల సంఖ్య 1,84,774 స్వయం సహాయక సంఘాలు 17,976 -
ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేయాలి
సూర్యాపేట అర్బన్ : కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని వీఎన్ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా కె.చైతన్య, ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ వర్మ, కోశాధికారిగా ఎస్.రమేష్, ఉపాధ్యక్షుడిగా ఎన్.జానయ్య, సహాయ కార్యదర్శిగా త్రివేణి, పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నెమ్మాది మాట్లాడారు. -
చంద్రబాబు స్క్రిప్ట్నే రేవంత్ వినిపించారు
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు. -
సాక్షి ఎఫెక్ట్: కటకటాల్లోకి సీఎంఆర్ఎఫ్ స్కాం నిందితులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ముఠా బాగోతాన్ని ఆధారాలతో సహా సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. కోదాడ కేంద్రంగా సాగిన ఈ స్కాంలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏ1 చెడపంగు నరేష్, ఏ2 మర్ల వీరబాబు, ఏ3 ఉప్పల మధు, ఏ4 సురగాని రాంబాబు, ఏ5 గుంటక సందీప్, ఏ6 రంగశెట్టి వెంకట్రావులను కటకటాల్లోకి పంపించారు.మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులను ముఠా విత్ డ్రా చేసింది. మరో ఆరు చెక్కులను విత్ డ్రా చేసేందుకు ప్లాన్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.9.30 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద ఇద్దరు నిందితులు వీరబాబు, మధు పీఏలుగా చేశారు.నరేష్ మల్లయ్య యాదవ్ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్గా పనిచేశాడు. సూరగాని రాంబాబు మునగాల మండలం నారాయణపురం స్థానిక నేత. గుంటక సందీప్ శాసనమండలిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. నకిలీ అకౌంట్స్ ద్వారా నగదు కొట్టేసిన ముఠా వాటాలు పంచుకుంది. నకిలీ అకౌంట్స్ దారులకు నిందితులు పర్సంటేజ్ ఇచ్చారు. కాగా, ముఠా సభ్యులు, బాధితులు ఇంకా ఉన్నట్లు సమాచారం.కొద్దిరోజుల కిందట సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కల్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణం బయటపడగా.. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగు చూసింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను కొంత మంది ముఠాగా ఏర్పడి పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని వాయిలసింగారం గ్రామానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని.. నిరుపేద కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ 2023 లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు లక్షా యాభై వేల రూపాయలు మంజూరయ్యాయి. చెక్కును కూడా ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపింది. కానీ ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి బాధితుడికి ఈ చెక్కును ఇవ్వకుండా గడ్డం వెంకటేశ్వరరావు అనే మరో వ్యక్తికి ఇచ్చి దానిని ఏపీలోని జగ్గయ్యపేటలో మార్చుకున్నారు.అనంతరం ఆ డబ్బును ముఠాగా ఏర్పడిన వ్యక్తులు పంచుకున్నారు. తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెక్కు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు దీనిపై విచారణ చేయగా చెక్కును జగ్గయ్యపేటలో మార్చుకున్నట్లు తేలడంతో కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ముఠా సభ్యులు అదే పేరుతో ఉన్న వ్యక్తులను స్థానికంగా వెతికి పట్టుకునేవారు.చెక్కులపై ఇంటిపేరు పూర్తిగా కాకుండా ఇంగ్లిష్ అక్షరాల్లో వస్తుం డటంతో నిందితులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చెక్కుల మీద బ్యాంక్ అకౌంట్ నంబర్ బాధితులది కాకుండా తాము ఎంపిక చేసిన వ్యక్తుల అకౌంట్ నంబర్ వచ్చే విధంగా హైదరాబాద్ సచివాలయంలో పనిచేసే వ్యక్తి సాయంతో తారుమారు చేసేవారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్పై తెలంగాణ బెబ్బులి పులి - ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
భానుపురి (సూర్యాపేట) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిన ఘనత భారత దేశానికే దక్కిందన్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3.48 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా రూ.191.78 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. రూ.500లకే గ్యాస్ పథకం కింద జిల్లాలో 4,05,898 మంది వినియోగదారులకు 5,52,043 సిలిండర్లు పంపిణీ చేసి సబ్సిడీ కింద రూ.15.26 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు ఇక నుంచి ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో కమీషన్ సొమ్మును ప్రతినెలా జమ చేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం పేదలకు ఆహార భద్రత కల్పించామని, ఇందుకోసం గత ఉగాది నుంచి సన్నబియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 3,26,057 రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీకగా నిలిచే రేషన్ కార్డులను పదేళ్ల తర్వాత అర్హులందరికీ ఇచ్చామన్నారు. కొత్తగా జిల్లాలో 36,812 కార్డులు మంజూరు చేయడమే కాకుండా 70,932 మంది సభ్యుల పేర్లను చేర్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి పరిమితులు లేకుండా ప్రతి రైతుకు సాయం చేశామని చెప్పారు. ఈ పథకంలో 2,87,234 మంది రైతుల ఖాతాల్లో రూ.366.50 కోట్లు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పధకం కింద జిల్లాలో 2024–25లో మృతిచెందిన 817 మంది రైతుల నామినీలకు రూ.35 కోట్లను చెల్లించామని తెలిపారు. సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాకు రూ.500ల చొప్పున బోనస్ చెల్లించి సన్నవడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఎత్తిపోతలకు అధిక నిధులు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా జిల్లాలో తక్కువ ఖర్చుతో లిఫ్టులు నిర్మించి ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చామన్నారు. జిల్లాలో మొత్తంగా 5,85,464 ఎకరాల ఆయకట్టు ఉందని, ఎత్తిపోతల పథకాలకు రూ.కోట్లాది నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా లైనింగ్ పనులకు రూ.29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్కు రూ.184.60, , జాన్పహాడ్ మేజర్ లైనింగ్ పనులకు రూ.52.11 కోట్ల చొప్పున మంజూరు చేశామన్నారు. ఇవేకాకుండా మూసీ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని, చెక్డ్యామ్లనిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగేలా చేస్తున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరిచ్చి రెండు సీజన్లలో పంటలు పండేలా చేసి తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో టీజీ ఎస్ఆర్డబ్ల్యూఎస్, వైష్ణవి పాఠశాల, బాల భవన్, జెడ్పీహెచ్ఎస్ చివ్వెంల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభినందించి వారితో ఫొటోలు దిగారు. అనంతరం పలువురికి బహుమతులు అందించారు. గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిస్వాతంత్య్ర సమర యోధులను సన్మానిస్తున్న మంత్రి ఉత్తమ్తొలి విడతగా జిల్లాలో 12,868 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా 1,050 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటికి రూ.22 కోట్లను లబ్దిదారులకు చెల్లించామన్నారు. విద్యాపరంగా కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయం, హుజూర్నగర్కు వ్యవసాయ కళాశాల మంజూరు చేయించినట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులైన గరిడేపల్లికి చెందిన గంట లక్ష్మారెడ్డి, నడిగూడెంకు చెందిన భిక్షమయ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఫ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి ఫ ఇక నుంచి రేషన్ డీలర్లకు నేరుగా కమీషన్ డబ్బులు ఫ 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
కూలిన గుండ్లసింగారం బ్రిడ్జి
నూతనకల్ : వరద ఉధృతి కారణంగా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామం వద్ద బ్రిడ్జి స్వల్పంగా కూలింది. వర్షాలకు దెబ్బతిన్న ఈ బ్రిడ్జిని తక్షణ చర్యల్లో భాగంగా గతేడాది రూ.3లక్షల నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టారు. అధికారులు కూడా పర్యవేక్షించకపోవడంతో బ్రిడ్జి మరమ్మతులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ప్రస్తుత కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి అధికంగా రావడంతో గతంలో మరమ్మతులు చేసిన ప్రాంతంలో బ్రిడ్జి కూలింది. విషయం తెలుసుకున్న ఆర్అండ్బీ డీఈ పద్మావతి సంఘటన స్థలాన్ని సందర్శించారు. వాహనాలదారులు ప్రమాదం బారిన పడకుండా బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని గుర్తు పట్టేలా మార్కింగ్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఫ మూణ్నాళ్ల ముచ్చటగా మరమ్మతులు ఫ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం -
సాగర్కు స్వలంగా తగ్గిన వరద
ఫ 14గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్: ఎగువ నుంచి సాగర్కు వరద స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా 26గేట్లను ఎత్తిన అధికారులు.. శుక్రవారం 14గేట్లకు తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. వద్ద పద్నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,44,694 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి 14 గేట్ల నుంచి, విద్యుదుత్పాదనతో కలిపి 1,38,244 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.90 అడుగులు ఉంది. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చివ్వెంల : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళల కోసం తెచ్చిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లను ప్రారంభించారు. అనంతరం బధిరుల పాఠశాలకు చెందిన మూగ విద్యార్థి చేసిన యోగాసనాలు, బాలసదన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యాపకుల కృషితోనే అడ్మిషన్లు పెరిగాయి నేరేడుచర్ల : అధ్యాపకుల కృషితోనే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాధికారి(డీఐఈఓ), నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భానునాయక్ అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ విద్యార్థులలకు బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు. ఈ కళాశాలలో పనిచేసి రిటైరైన రామానుజాచార్యులు జ్ఞాపకార్థంగా ఆయన సతిమణీ మంగతాయారు ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు రూ.2,500 చొప్పున లయన్స్క్లబ్ ద్వారా నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గున్రెడ్డి, సైదిరెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, కార్యదర్శి యూసుఫ్, సభ్యులు విశ్వనాథం, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, అధ్యాపకులు వెంకటరమణ, మద్దిమడుగు సైదులు, ప్రణతి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, అంజయ్య, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఐదు గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 1,55,464 క్యూసెక్కుల వరద వస్తుండగా ఐదు గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి 1,67,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల : సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదమున్నందున ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్ఓ జి.చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం ఆయన మునగాల మండలం కలకోవలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో సేవలందించాలన్నారు. డెంగీ సోకిన వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, సూపర్వైజర్ జయమ్మ, ఏఎన్ఎంలు నాగమణి, శాంతమ్మ, లలిత, నర్సమ్మ, హెల్త్ అసిస్టెంట్లు లింగం రామకృష్ణ, కొర్రా లింగయ్య సిబ్బంది పాల్గొన్నారు. -
రెండో జత యూనిఫాం ఎప్పుడో!
సూర్యాపేటటౌన్ : విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటికీ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందజేశారు. రెండో జత యూనిఫామ్ కోసం జిల్లాల వారీగా వస్త్రాన్ని జూలైలో ఉన్నతాధికారులు అందించారు. 15 ఆగస్టు వరకు రెండో జత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా నేటికీ అతిగతీ లేదు. ఒక్క జతతోనే విద్యార్థులు రోజూ పాఠశాలలకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు చేరని చొక్కా వస్త్రం.. అయితే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రెండో జతకు సంబంధించి వస్త్రం వచ్చి కుట్టుపని సైతం పూర్తి కావచ్చినట్టు సమాచారం. అయితే మన జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు రెండో జత కోసం బాలబాలికలకు పైజామా, నిక్కర్లు, ఫ్యాంట్ వస్త్రాలు మాత్రమే వచ్చాయి. చొక్కా వస్త్రం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు రెండో జత అందే అవకాశం లేకుండా పోయింది. రోజు ఒక్క జతే వాష్ చేసుకొని అదే వేసుకొని స్కూల్కు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో ఒకే జత ఉతికితే మళ్లీ అది ఆరకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు సివిల్ డ్రెస్లోనే వస్తున్నారు. కొత్తవారికీ అందని యూనిఫామ్ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 23,547 మంది బాలురు, 25,827 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక్కో జత చొప్పున 49,374 జతలు కుట్టించి పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు అందజేశారు. అయితే జూన్లో ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో 5,500 మంది విద్యార్థుల వరకు అడ్మిషన్లు వచ్చాయి. వీరికి కూడా అదనంగా యూనిఫామ్స్ అందించాల్సి ఉంది. ప్రస్తుతం రెండో జతకు సంబంధించి నిక్కర్, పైజామా, ఫ్యాంట్లకు సంబంధించి వస్త్రం వచ్చింది. ఆయా మండలాల ఎంఈఓలకు పంపించాం. చొక్కా సంబంధించి కూడా త్వరలోనే వస్తుంది. రెండో జత యూనిఫాం కూడా సకాలంలోనే అందిస్తాం. – రాంబాబు, జిల్లా సెక్టోరియల్ అధికారిఫ ఇప్పటి వరకు ఒక్క జతే పంపిణీ ఫ ఈనెలలో రెండో జత అందించాలని ప్రభుత్వం ఆదేశం ఫ వస్త్రం రాకపోవడంతో ఆగిన ప్రక్రియ ఫ జిల్లా వ్యాప్తంగా 950 స్కూళ్లు.. 49,374 మంది విద్యార్థులు -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపా రు. అనంతరం శ్రీసామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం తంతు చేపట్టారు. ఆ తర్వాత గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
భానుపురి : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిఒ క్కరూ సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కోరారు. సూర్యాపేటలో రూ.1.5 కోట్ల వ్యయంతో చేపడుత్ను గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. భావితరాలకు మంచి విద్యను అందజేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలో మౌలిక వసతుల కల్పనకు మరో కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి అదనంగా మరో రూ.కోటి మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, గ్రంథాలయాల సెక్రటరీ బాలమ్మ పాల్గొన్నారు. -
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉద యం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూ సెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటిమట్టం 645 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఉదయం తెరిచిన ఆరు క్రస్టు గేట్లకు అదనంగా సాయంత్రం మరో మూడు క్రస్టు గేట్లను(మొత్తం 9 గేట్లు) రెండు అడుగుల మేర ఎత్తి 14,910 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
సాగర్ ఎడమ కాలువలో బోల్తాపడ్డ కారు
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నెరేడుచర్ల మండలం కల్లూరులో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలో కారు బోల్తా పడింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఆపై కారును రెస్క్కూ టీమ్ సహాయంతో బయటకు తీశారు. -
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు. -
సేంద్రియ సాగులో మేటి ‘వాసికర్ల’
నడిగూడెం : ఎకరంన్నర విస్తీర్ణం కలిగిన భూమిలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడాదంతా రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా వివిధ రకాల పంటల(సమీకృత)ను సాగు చేస్తున్నాడు నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వాసికర్ల శేషు కుమార్. ఒక ప్రత్యేక షెడ్డులో పైన గొర్రెలు, కింద నాటుకోళ్లు పెంచుతున్నాడు. రెండు గుంటల భూమిలో చేపల పెంపకం చేపట్టాడు. ఇక మిగతా స్థలంలో ఉద్యానవన పంటలైన కొబ్బరి, నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ, దానిమ్మ, సపోట, అరటి, డ్రాగన్ ఫ్రూట్, లీచి, అంజీర, చింత, బంతి, కూరగాయల పంటలైన సొర, బీర, కాకర, బొంతు కాకర, వంగ, గోరుచిక్కుడు, పొట్ల, కీర, మిర్చి, టమాట, దోస, ప్రస్తుత సీజన్లో పెసర పంటను సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగుతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఈ పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పశువుల పేడ, నీమాస్త్రం, వేప నూనె తదితర వాటిని వాడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనతో పాటు, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వరికి బదులుగా సమీకృత వ్యవసాయ చేయాలి. తక్కువ స్థలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాను. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధ పద్ధతులు పాటిస్తున్నాను. – వాసికర్ల శేషు కుమార్, రైతు, సిరిపురం -
అవినీతి లేని దేశంగా మారాలి
స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లు అవుతున్నా దేశంలో అవినీతి తగ్గడం లేదు. పొలిటికల్ పార్టీలు అధికారంలోకి రాగానే వారి అండదండలతో అధికారులు అవినీతిపరులుగా మారుతున్నారు. అవినీతి రహితంగా మారినప్పుడే భారతదేశం ప్రపంచంలో ఇంకా ముందంజలో ఉంటుంది. అలాంటి వ్యవస్థ ఏర్పడాలి. – ఎం.కల్యాణి, ఇంజనీరింగ్ విద్యార్థిని మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం చేయాలి దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు అత్యాచారాలు, కిడ్నాప్లకు గురవుతున్నారు. దీంతో ఆడపిల్ల బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. దేశంలో మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలి. – లలిత, ఇంజనీరింగ్ విద్యార్థినిదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం ఐటీ హబ్లను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేము భవిష్యత్లో ఈ దిశగా కృషి చేస్తాం. – వినూత్న, ఇంజనీరింగ్ విద్యార్థిని వందేళ్లకు చేరువలో ఉన్న భారతదేశంలో మరింతగా పోలీస్ సంస్కరణల అమలు జరగాలి. పోలీస్ శాఖను రాజకీయ ఒత్తిడుల నుంచి దూరంగా ఉంచాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. నాణ్యమైన విద్య, వైద్యం వీలైనంత తక్కువ ధరకు ప్రభుత్వమే అందించాలి. ఉచిత వైద్యం, విద్య పేరిట నాసిరకంగా సేవలు వెంటనే ఆపేయాలి. – సాయితేజ, ఇంజనీరింగ్ విద్యార్థి -
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది. అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో అమలు చేశా ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం. – సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్ -
వరద జోరు..
సూర్యాపేట : రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్నిచోట్ల వరద లోలెవల్ బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాలుగు రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన ఉండగా మూడోరోజు కాస్త విరామం ఇచ్చింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కోదాడలోని షిరిడీసాయినగర్ కాలనీలోకి.. సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం వద్ద కల్వర్టుపై ప్రవహిస్తున్న నీళ్లలోంచి ఓ వ్యక్తి బైక్పై వెళ్లగా.. అదుపు తప్పడంతో బైక్ను అక్కడే వదిలి వచ్చాడు. మఠంపల్లి మండలం యాతావాకిళ్ల – హనుమంతులగూడెం ప్రధాన రహదారిపై వేములూరు వాగు బ్రిడ్డి పైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు అలుగు కారణంగా గోపాలపురం – బూరుగడ్డ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. కోదాడ మండలం నల్లబండగూడెం – మంగల్తండా మధ్యలో వంతెనపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూర్ (ఎస్) నుంచి నెమ్మికల్ వెళ్లే దారిలో లోలెవల్ బ్రిడ్జిపై బుధవారం రాకపోకలు నిలిచిపోగా గురువారం సాగాయి. మేళ్లచెర్వు – కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. కోదాడ పెద్దచెరువు అలుగు పోయడంతో తమ్మర వాగునుంచి షిరిడీ సాయినగర్ కాలనీలోకి వరద చేరింది. పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. కాలనీలోని పలు ఇళ్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడారు. -
స్వాతంత్య్ర వేడులకు ముస్తాబు
భానుపురి (సూర్యాపేట) : స్వాత్రంత్య దినోత్సవానికి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముస్తాబయింది. శుక్రవారం ఉదయం 9గంటలకు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9:40కి ప్రసంగిస్తారు. 10 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులు, అతిథుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. 10.05కి విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 10.20కి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 11.15కు స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ .. హుజూర్నగర్కు వెళ్లి వ్యవసాయ కళాశాల స్థలం విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. సాయంత్రం హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భరద్రత పాటించడంలో నిర్లక్ష్యం వద్దుభానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ప్రమాదకర పరిశ్రమలపై వివిధ విభాగాల ఉన్నత స్థాయి అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూర్యాపేటలోని సువెన్ ఫార్మా, నామవారంలోని పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, చివ్వెంలలోని రావూస్ ఫార్మా, నల్లబండగూడెంలోని ఫోరస్ ఫార్మా, కోదాడలోని మేఘ గ్యాస్లకు సంబంధించిన తనిఖీ వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం సీతారాం నాయక్, లేబర్ డిప్యూటీ కమిషనర్ అరుణ, బాయిలర్ ఇన్స్పెక్టర్ భీమారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలిసూర్యాపేటటౌన్ : బంగారం షాపుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. బ్యాంకులు, బంగారం దుకాణాల భద్రతపై అధికారులు, బంగారం షాప్ యజమానులతో గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వ్యాపారులు స్వీయ భద్రత చర్యలు పాటించాలన్నారు. బలమైన లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలోజిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, నాగేశ్వరరావు, శివ శంకర్, నర్సింహారావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, బ్యాంకర్స్, యజమానులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలురాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు. బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకంమీడియాకులవివక్ష6చట్టసభలు అధికార యంత్రాంగం21 న్యాయ వ్యవస్థ3924కొద్దిగాలేదుఅవును78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. 1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ? ఫ అవినీతి, పేదరికమే అసలు సమస్య ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే.. ‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం 3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ? -
కరువు తీరేలా వర్షం
జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం ఫ అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ ఫ పొంగిపొర్లిన వాగులు ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం సూర్యాపేట : కరువుతీరేలా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో సరాసరి 43.1 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ, తిరుమలగిరిలో 180.4 మి.మీ, తుంగతుర్తిలో 132.3 మి.మీ, జాజిరెడ్డిగూడెంలో 121.3 మి.మీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగిపొర్లి చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. పలుచోట్ల లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతంగా ప్రవహించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ పి.రాంబాబులు సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రజలకు ధైర్యం చెప్పారు. ● నాగారం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఫణిగిరి, పసునూర్, పస్తాల, లక్ష్మాపురం, వర్థమానుకోట, నాగారం, డి.కొత్తపల్లి, ఈటూరు గ్రామాల్లోని చెరువులు అలుగులు పోస్తున్నాయి. వర్థమానుకోటలోని బిక్కేవారు అలుగుపోస్తోంది. పస్తాల, లక్ష్మాపురం, డి.కొత్తపల్లి గ్రామాల్లో ఉన్న బంధంల వద్ద(కల్వర్టులు) ప్రమాదకంగా నీరు ప్రవహిస్తోంది. నాగారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వరద తాకిడికి నాగారం–తుంగతుర్తి ప్రధాన రహదారి వెంట ఉన్న 11 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ● అర్వపల్లి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సూర్యాపేట – జనగాం హైవేలో పోలీస్స్టేషన్ రోడ్డు జలమయంగా మారింది. సుమారు 50 ఇళ్లు నీటమునిగాయి. కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ ఆవరణలు చెరువును తలపించాయి. కేజీబీవీ నుంచి 60మంది బాలికలను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కోడూరు – తిమ్మాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. అర్వపల్లిలో కలెక్టర్ పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ● తిరుమలగిరి మండలవ్యాప్తంగా అతిభారీ వర్షం పడింది. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు జలమయం కాగా.. వలిగొండ – తొర్రూర్ రూట్లో తొండ గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం సాగుతుండడంతో భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. తొండ గ్రామంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలోకి నీళ్లు చేరాయి. అంగన్వాడీ కేంద్రంలో బియ్యం, కోడిగుడ్లు తడిసిముద్దయ్యాయి. పలు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ● మద్దిరాల మండలంలో భారీ వర్షం పడడంతో కుక్కడం, గుమ్మడవెల్లి, పోలుమళ్ల, చిననెమిల, కుంటపెల్లి గ్రామాల్లోని చెరువులు మత్తడి దూ కాయి. పలు కాలనీల్లో ఇళ్లు చుట్టూ నీళ్లు చేరాయి. ● సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, ప్రియాంక కాలనీ, ఆర్కే గార్డెన్స్, శ్రీరాంనగర్, తిరుమలనగర్ కాలనీల్లోకి వరద చేరింది. ఆయా ప్రాంతాలను అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ హనుమంతరెడ్డి పరిశీంచారు. ● ఆత్మకూర్ మండలం చివ్వెంల – ముకుందాపురం రోడ్డులో ఏపూరు బ్రిడ్జిపై నుంచి బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి. ● తుంగతుర్తి మండలంలో చాలా గ్రామాల్లో చెరువు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. సంగెం – కోడూరు రహదారిపై వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.)మండలం వర్షపాతం నాగారం 187.9 తిరుమలగిరి 180.4 తుంగతుర్తి 132.3 జాజిరెడ్డిగూడెం 121.3 నూతనకల్ 80.9 మద్దిరాల 69.7 సూర్యాపేట 49.2 చిలుకూరు 28.3 ఆత్మకూర్ (ఎస్) 23.8 గరిడేపల్లి 22.2 నేరేడుచర్ల 16.8 కోదాడ 6.9 మునగాల 9.8 హుజూర్నగర్ 11.2 పెన్పహాడ్ 7.8 మోతె 7.2 మేళ్లచెర్వు 7.3 చింతలపాలెం 5.5 చివ్వెంల 12.0 పాలకీడు 2.9 అనంతగిరి 1.9 మఠంపల్లి 1.9 నడిగూడెం 2.3 -
ప్రథమ సంవత్సరంలో 450మంది చేరిక
కోదాడ: కొన్నేళ్లుగా అడ్మిషన్లులేక వెలవెలబోతున్న కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం వచ్చింది. కళాశాల స్వయంప్రతిపత్తిగా మారడం.. కోదాడలోని నాలుగు ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్లు తీసుకోకపోవడం ఈ కాలేజీకి కలిసి వచ్చింది. కొంతకాలంగా 200 మంది చేరడమే గగనమవుతున్న తరుణంలో ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్లో వివిధగ్రూపుల్లో కలిపి ఇప్పటి వరకు 450 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషం. బీఏ గ్రూప్లో 189 మంది, బీకాంలో 95 మంది, బీఎస్సీ పిజికల్ సైన్స్లో 101 మంది, లైఫ్ సైన్స్లో 48 మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరినప్పటికీ కళాశాలలో సరైన సౌకర్యాలు లేవనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్లు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వర్షానికి షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కొందరు విద్యార్థులు తెలిపారు. వసతులను మెరుగు పర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఫ కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం -
గణేశ్ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం
సూర్యాపేటటౌన్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, భద్రతా పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలు పాటించాలని కోరారు. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. పరిసరాలు అపరిశుభ్రంగా చేయవద్దని, డీజేలు పెట్టొదని, బాణసంచా పెల్చొద్దని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రయాణికులు, సామాన్యులతో పాటు ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.అన్ని శాఖలు టార్గెట్ పూర్తి చేయాలిమోతె: వనమహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు మొక్కలు నాటి లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(డీఆర్డీఓ) వి.వి. అప్పారావు సూచించారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో ఫీల్డ్అసిస్టెంట్లతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ సైట్లో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు.‘కళ్యాణ లక్ష్మి’ కుంభకోణంలో షోకాజ్ నోటీసులు జారీకోదాడ: అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణంలో మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు కోదాడ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ మండల పరిధిలోని కొత్తగూడెంలో కూడా భారీ ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కులు పక్కదారి పట్టిన విషయంలో అధికారులు విచారణ చేయకుండా మండలానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.14న వాలీబాల్ చాంపియన్షిప్ సెలక్షన్స్సూర్యాపేట : చైనాలో జరిగే అండర్–15 వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్ షిప్ కోసం తెలంగాణ టీం సెలక్షన్ ట్రయల్లో భాగంగా సూర్యాపేట జిల్లా సెలక్షన్లను ఈనెల 14న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం.కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రిపోర్ట్ చేయాలని కోరారు. వివరాలకు సెల్ నంబర్ 9848804353లో సంప్రదించాలని సూచించారు.కానిస్టేబుల్ సస్పెన్షన్సూర్యాపేటటౌన్ : నిత్యపెళ్లికొడుకుగా అవతారమెత్తిన కానిస్టేబుల్ కృష్ణంరాజును ఎస్పీ కె.నరసింహ మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజుకు 2012లో కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. మొదట సూర్యాపేటకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల కాపురం అనంతరం దంపతుల మధ్య వివాదం నెలకొంది. ఆమెతో విడిపోయేందుకు కృష్ణంరాజు రాజీ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఆరు నెలలు కాపురం చేసి విడాకులు ఇవ్వకుండానే పరిష్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలల క్రితం సూర్యాపేటకు చెందిన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా విడిపోయేందుకు ప్రయత్నాలు చేసి నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కానిస్టేబుల్ బాగోతం వైరల్గా మారడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కృష్ణంరాజు కలెక్టరేట్లో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నాడు. -
కార్పొరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో మంత్రులు సిద్ధం చేసిన జాబితాలను రాష్ట్ర పార్టీకి పంపించారు. అందులో కొందరికి త్వరలోనే డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు వందవరకు ఉండగా, ఒక్కో దాంట్లో నాలుగైదు డైరెక్టర్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు జాబితాలు ఇవ్వాలని గతంలోనే మంత్రులకు రాష్ట్ర పార్టీ సూచించింది. అందుకు అనుగుణంగా ఆయా పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున పేర్లను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. అందులో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశంలభించనుంది. స్థానిక ఎన్నికలకు ముందే భర్తీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. పార్టీలో పనిచేసే వారికే పదవులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. అంతకంటే ముందుగానే కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బాగా పని చేస్తుందనే అంచనాల్లో ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడి పని చేస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అందుకే ముందుగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. చైర్మన్ పదవులు ఎప్పుడు...? ప్రస్తుతం కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆశావహులు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో చైర్మన్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తామన్నది ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది. ఫ రాష్ట్ర పార్టీకి జాబితాలను పంపించిన జిల్లా మంత్రులు ఫ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి దక్కనున్న డైరెక్టర్ పదవులు ఫ వీరి నియామకం తర్వాతే స్థానిక ఎన్నికలు ఫ చైర్మన్ పదవులపై వీడని సందిగ్దం -
చట్టవ్యతిరేక పనులు చేయవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : చట్ట వ్యతిరేక పనులు చేయకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సబ్ జైలును ఆమె తనిఖి చేశారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైలు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఖైదీల తరఫున వాదించడానికి న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. లేకుంటే లీగల్ ఎయిడ్ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి, న్యాయసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
జిల్లా మంత్రులు దద్దమ్మలు
ఫ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ పరిధిలో నీరిచ్చే సోయి లేదు ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శనల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఏపీకి నీరు వదిలేంత ఆతృత జిల్లాలో రైతులకు ఇవ్వడంలో లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏఎమ్మార్పీ కింద కనగల్, నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 70 వేల ఎకరాలకు నీరందించిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డికి పట్టింపు లేదని మండిపడ్డారు. కృష్ణానది జలకళ సంతరించుకున్నా.. జిల్లాలోని చెరువులు ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మోటార్లు మరమ్మతుకు గురైతే సమీక్షించే బాధ్యత జిల్లా మంత్రి కోమటిరెడ్డికి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ నడిబొడ్డున ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రి సొంత క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు. నిజాం కాలం నాటి అతిథి గృహాన్ని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అంతకు ముందు పానగల్ ఉదయసముద్రాన్ని నాయకులతో పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, సింగం రామ్మోహన్, చీర పంకజ్యాదవ్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, బోనగిరి దేవేందర్, కంచనపల్లి రవీందర్రావు, రావుల శ్రీనివాస్రెడ్డి, పల్రెడ్డి రవీందర్రెడ్డి, ఐతగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, తండు సైదులుగౌడ్, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ హాజరుకు చెక్!
నాగారం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరుకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇ–కేవైసీ విధానం అమలు చేయనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమాలు ఇలా.. జిల్లాలో 23 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 2.63 లక్షల జాబ్ కార్డులు ఉన్నారు. అందులో 5.70 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో ప్రస్తుతం పనులుచేస్తున్న వారు 2.15 లక్షల మంది ఉన్నారు. ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు క్షేత్ర సహాయకులు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు, ఒకరి పేరుమీది మరొకరు పనులకు వెళ్తున్నట్లు గుర్తించారు. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడడం, నగదు రికవరీలు చేయడం జరుగుతున్నా సిబ్బందిలో మార్పు కన్పించడం లేదు. వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్)ను తీసుకొచ్చింది. దీనిని సైతం క్షేత్రస్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతర ఫొటోలతోపాటు ఉపాధి హామీ పని చేయకపోయినా చేసినట్లు అప్లోడ్ చేస్తున్నారని తేలింది. దీంతో కూలీలకు ఆశించిన స్థాయిలో వేతనాలు రావడం లేదు. రోజుకు రెండుసార్లు ఫొటోలు అప్లోడ్.. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టడానికి ఇ–కేవైసీ విధానం ద్వారా హాజరు తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ అధికారులు ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీని సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ప్రకారం పనులకు వచ్చిన వెంటనే కూలీల ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు. తిరిగి నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి ఈ రెండు ఫొటోల్లో ఉంటే వేతనాలు మంజూరవుతాయి. లేదంటే వేతనాలు నిలిపివేస్తారు. ఈ విధానంపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇది అమలైతే నకిలీ హాజరుకు అవకాశం ఉండదు. అక్రమాలకు అవకాశం ఉండదు ఉపాఽధి హామీ కూలీలకు ప్రభుత్వం ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలు సేకరించడం పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేస్తాం. ఇ–కేవైసీ హాజరుతో అక్రమాలకు అవకాశం ఉండదు. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట ఫ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఫ త్వరలో ఇ–కేవైసీ విధానం ఫ కూలీల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఉపాధిహామీ పథకం వివరాలు జాబ్ కార్డులు 2.63 లక్షలు నమోదైన కూలీలు మొత్తం 5.7లక్షలు పనులకు వెళుతున్న కూలీలు 2.15లక్షలు -
పింఛన్ల సభను జయప్రదం చేయాలి
నాగారం : చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే దివ్యాంగుల ఆసరా పింఛన్ల సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ కోరారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సైదులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మంద కృష్ణమాదిగ ఈ సభకు హాజరవుతారని, వృద్ధులు, దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బొజ్జ అశోక్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, రుద్రపంగు సురేష్, వీహెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ మాదిగ, పాల్వాయి బాలయ్య, చెడపక గంగరాజు, కొండగట్టు శ్రీనివాస్, బొంకూరి కృష్ణ, కండే అనిల్, చింతకుంట్ల నరేంద్ర, బొజ్జ సతీష్, మిరియాల చింటూ, బొజ్జ రవి, బొజ్జ వెంకన్న, బొజ్జ బజార్, పోగుల లింగమ్మ, నాతి వెంకన్న, సైదమ్మ, సత్తయ్య, సత్తయ్య చిత్తలూరు సత్తమ్మ, వడ్డకొండ్ల సోమయ్య, మేడే మాణిక్యం, మంగమ్మ, భాగ్యమ్మ, నర్సయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. నేడు మంద కృష్ణమాదిగ రాక తిరుమలగిరి( తుంగతుర్తి ) : చేయూత పెన్షన్దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తిలో జరిగే సభకు మంద కృష్ణమాదిగ హాజరవుతారని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న తెలిపారు. ఆదివారం తొండ, మామిడాల, వెలిశాల తిరుమలగిరి, మాలిపురం గ్రామాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న అధ్యక్షతన జరిగిన గ్రామసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో సీహెచ్ వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, రాధ, ఎల్లయ్య యాదవ్, రావుల మల్లేష్ మతి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బడిలోనే ఆధార్ నమోదు..
నాగారం : ఆధార్ కార్డు గుర్తింపు కోసమే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ధ్రువపత్రాల జారీకి అత్యంత కీలకంగా మారింది. ఏ విద్యార్థి, ఏ పాఠశాలలో చదువుతున్నాడు, విద్యార్థుల సంఖ్య వివరాలను ఒక్క క్లిక్తో తెలుసుకోవడానికి ప్రభుత్వం యూడైస్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరి. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలో చాలామందికి ఆధార్ లేకపోవడం సమస్యగా మారింది. ఆధార్కార్డు లేనివారి సంఖ్య వేలాదిగా ఉన్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పాఠశాలల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు, అప్డేట్ కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అన్నింటికీ ప్రామాణికం... పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నుంచి బడ్జెట్ కేటాయింపులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనం, యూ నిఫాం వంటివి అందుతాయి. జాతీయ ఉపకార వేతనాలకు బ్యాంకు ఖాతా అవసరం కావడం దా నికోసం ఆధార్ వివరాలు అత్యంత ప్రామాణికం. 31,203 మంది గుర్తింపు.. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 21,531 మంది విద్యార్థులకు పేరు సవరణ, 10,846 మందికి పుట్టిన తేదీ సవరణ, మరో 138 మందికి జెండర్ మార్పు ఇలా మొత్తం 31,203 మందికి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉన్నట్లు తేలింది. వీరిలో 1, 2, 3 తరగతుల వారే అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎమ్మార్సీ కార్యాలయాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కిట్లను కూడా మంజూరు చేశారు. పర్యవేక్షణ లోపం, సిబ్బంది పట్టింపు లేమితో చాలాచోట్ల ఇవి కనుమరుగయ్యాయి. ప్రభుత్వ పరిధిలో కిట్లు అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. మండలానికి ఒకరు, అవసరం ఉన్నచోట ఇద్దరు సిబ్బందిని ఏజెన్సీవారు నియమించుకుంటున్నారు. ప్రస్తుతం నియామకమైన 23 మంది ఆయా మండలాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రత్యేక సిబ్బంది నేరుగా పాఠశాలకే వచ్చి కొత్త ఆధార్ నమోదుతోపాటు అవసరమైన విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. మార్పు, చేర్పులు, తప్పుల సవరణ, బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నారు. ఫ 31,203 మందికి ఆధార్ నమోదు, అప్డేట్ చేయాల్సి ఉందని గుర్తింపు ఫ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం ఫ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రక్రియ అప్డేట్ ప్రక్రియ కొనసాగుతోంది విద్యార్థుల ఆధార్ అప్డేట్ ప్రక్రియ జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతోంది. విద్యార్థులకు నూతన ఆధార్కార్డు నమోదు, పేర్లు, పుట్టిన తేదీల్లో మార్పులు, చేర్పులు వంటి వారిని ఏజెన్సీ సిబ్బంది పాఠశాలల్లోనే సవరిస్తున్నారు. –అశోక్, డీఈఓ, సూర్యాపేట -
మూసీకి స్వల్పంగా తగ్గిన ఇన్ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి 4,365 క్యూసెక్కుల వదరనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండడంతో అధికారులు శనివారం ఐదు గేట్లు తెరవగా రెండింటిని ఆదివారం మూసి వేశారు. మిగతా మూడు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 3,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 643.50 అడుగుల వద్ద ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఫ మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల -
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.పూజలు చేసి హారతి ఇస్తున్న అర్చకుడు -
యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలి
హుజూర్నగర్ : యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురికంటి వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హుజూర్నగర్లోని టౌన్హాల్లో మహాయోగా సేవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా యోగా విద్య కరపత్రాన్ని స్థానికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు యోగాను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్నారు. యోగా మంత్రిత్వ శాఖ, యోగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. యోగా జీవన శాస్త్రవేత్తలను నామినేటెడ్ ద్వారా చట్ట సభల్లోకి తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన 50 వేల మంది యోగా సాధకులను నియమించి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలిమేళ్లచెరువు : పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హామీలను ఈ నెల 15 వరకు అమలు చేయని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వైభవంగా సౌర హోమంఅర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, కె.సత్యనారాయణ, మణికంఠ, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, మోనూపాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంత.. తీర్చును చింత
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ ఏడాది వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రజలకు నీటి కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమస్య అధిగమించాలంటే నీటిని భూమిలోకి ఇంకించడం ఒక్కటే మార్గం. వాన నీటిని ఒడిసి పట్టడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు తవ్వినట్లయితే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేలోపు విస్తృతంగా ఇంకుడు గుంతలు తవ్వితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.. వార్డుకు పది చొప్పున తవ్వితే.. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులు ఉన్నాయి. వార్డుకు 10 చొప్పున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములై విస్త్రత ప్రచారం చేపడితే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ సీసీరోడ్లు నిర్మించడంతో వర్షం కురిసినా కూడా నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. సీసీ రోడ్ల పక్కన భారీ గుంతలు తవ్వి వాన నీళ్లు ఇంకేలా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గుంతలపై ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మించే ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించకుంటే అనుమతి నిరాకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత నిర్మాణాల్లోనూ అ వకాశం ఉన్నచోట ఇంకుడు గుంతల ఏర్పాటుకు నో టీసులు జారీ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో బో రు ఉన్న ప్రతివారు ఇంకుడు గుంత తవ్వించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. ఫ గత వేసవిలో అడుగంటిన భూగర్భ జలాలు ఫ ఇబ్బంది పడిన ప్రజలు ఫ నీటి సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించాలంటున్న నిపుణులు ఫ వర్షపు నీటిని ఒడిసి పడితే తీరనున్న నీటి కష్టాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని చెబుతున్నాం. అలాగే అవసరం ఉన్నచోట ఇంకుడు గుంతలు నిర్మించాలని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. –మున్వర్ అలీ, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి మున్సిపాలిటీ వార్డులసంఖ్య జనాభా సూర్యాపేట 48 1,33,339 కోదాడ 35 75,093 హుజూర్నగర్ 28 35,850 తిరుమలగిరి 15 18,474 నేరేడుచర్ల 15 14,853 -
ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం అర్ధరాత్రి చివ్వెంల మండల పరిధిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర్ణమి నిద్ర రాత్రులు కార్యక్రమంలో వేణారెడ్డి పాల్గొని మాట్లాడారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర.. పౌర్ణమి రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ పౌర్ణమి నిద్ర రాత్రుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గోపురానికి తీసుకువచ్చిన పసిడి కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ, కెక్కిరేణి శ్రీనివాస్, తంగెళ్ల కరుణాకర్రెడ్డి, రుద్రంగి రవి, పందిరి మల్లేశ్గౌడ్, రావుల రాంబాబు, మద్దెబోయిన శ్రీనివాస్, మద్దెబోయిన తిరుమలేష్, నబీఖాన్, జావేద్, సాగర్, లింగమంతులు, సంజయ్, కుర్ర సైదులు, లింగస్వామి, చిన్న మల్లయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్లో బిగ్ స్కాం.. వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు తేలింది.2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం.. డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. నాలుగేళ్లపాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. -
కోదాడలో మళ్లీ వరద
కోదాడ: కోదాడ పట్టణంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కోదాడ పెద్దచెరువుకు భారీగా వరద రావడంతో అలుగు పోస్తోంది. దీంతో కోదాడ –అనంతగిరి రోడ్డుపై వరద పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి కోదాడ పెద్ద చెరువు అలుగునీటితో పూర్తిగా మునిగిపోయిన కోదాడ –ఖమ్మం రోడ్డులోని షిర్డీసాయినగర్ కాలనీ గురువారం రాత్రి కురిసిన వర్షానికి మరోసారి ముంపునకు గురైంది. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. పెద్దచెరువు అలుగు వాగులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వారం రోజుల క్రితం కాలనీ వాసులు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దచెరువు అలుగుపోసి వరద కాలనీ మీదకు మళ్లిందని, దీంతో మళ్లీ ముంపుబారిన పడ్డామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే భవానీనగర్ కూడా గతేడాది మాదిరిగానే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైంది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సాయంతో కాలనీ మధ్యలో ఉన్న నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న డివైడర్లను పగులగొట్టి వరదనీటిని కిందివైపు మళ్లించారు. అయితే గతేడాది ఈ రెండు కాలనీలను పరిశీలించిన కలెక్టర్ ఆక్రమణలు తొలగించి నాలా వంతెనను వెడల్పు చేయాలని ఆదేశించినా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే కోదాడ–అనంతగిరి రోడ్డులో పెట్రోల్బంక్ వద్ద ఉన్న ఎర్రకుంట అలుగు కాలువపై మజీద్ వద్ద పెద్ద గూనలతో కల్వర్టు నిర్మించి, కాల్వను వెడల్పు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఫ నీట మునిగిన షిర్డీసాయినగర్, భవానినగర్ కాలనీలు ఫ గతేడాది వరద ముంచెత్తినా ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు ఫ పెద్ద చెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలకు ఆటంకం -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
చివ్వెంల : సీజనల్ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం చివ్వెంల పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాల గురించి వైద్యాధికారి భవానిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలకు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట హెల్త్ సూపర్వైజర్లు, సిబ్బంది ఉన్నారు. కేజీబీవీ సమస్యను కలెక్టర్కు వివరిస్తాం అర్వపల్లి: భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి అర్వపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జలమయమై బాలికలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ అశోక్ అన్నారు. భారీ వర్షానికి జలమయమైన అర్వపల్లి కేజీబీవీని శుక్రవారం డీఈఓ అశోక్, జీసీడీఓ పూలన్ సందర్శించారు. కేజీబీవీలో ఉన్న బాలికలను తాత్కాలికంగా ఇళ్లకు పంపించారు. నీళ్లు తగ్గే వరకు బాలికలు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వారి వెంట ఎస్ఓ నాగరాణి, అధ్యాపకులు, సీఆర్టీలు, సిబ్బంది ఉన్నారు. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలిమునగాల: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చి పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన మునగాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుంటల రమేష్దీనదయాళ్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వరద పాఠం నేర్వలే..!
60 ఫీట్ల రోడ్డు జలమయంగా.. గతేడాది సెప్టెంబర్లో భారీ వర్షం వచ్చినప్పుడు 60 ఫీట్ల రోడ్డు వద్ద నాలా పొంగడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నాలాలో మట్టి తీసి శుభ్రం చేయడంతో సమస్య కొద్దివరకు పరిష్కారమైంది. నాలాలను పెద్దగా చేసి ఎప్పటికప్పుడు అడ్డంకులను తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని స్థానికులు అంటున్నారు. సూర్యాపేట అర్బన్ : భారీ వర్షం వస్తేచాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. అయితే గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు సుందరయ్య నగర్ కాలనీతోపాటు ఆర్కే గార్డెన్ సమీపంలోని వివిధ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సద్దుల చెరువు అలుగు పోయడంతో సుందరయ్య నగర్ కాలనీలోకి నీరు వచ్చి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. సద్దుల చెరువు అలుగు నీరు పారే కాలువ చెత్తాచెదారం మట్టితో కూరుకుపోవడంతో వరదనీరు సరిగా పారక ఇళ్లలోకి వస్తుంది. కాలువపై ఉన్న బ్రిడ్జిల దగ్గర చిన్నచిన్న గూనలకు బదులు పెద్ద గూనలు వేస్తే వరదనీరు సాఫీగా ముందుకెళ్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం.. భారీ వర్షం పడితే వరద నీరు తమ ఇళ్లలోకి వస్తుందని, వెంటనే అధికారులు స్పందించి ముందస్తుగా వరద ముంపు ముప్పు తప్పేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నాలా అస్తవ్యస్తం ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్కు వెళ్లే రోడ్డు వద్ద గల నాలా ప్రమాదకరంగా తయారైంది. బ్రిడ్జి కింద చిన్న చిన్న గూనలు వేయడంతో వాటిలో వరదనీరు సాఫీగా పోవడంలేదు. భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు వరదనీరు పైకివచ్చి బ్రిడ్జి కోతకు గురవుతోంది. పైగా ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ చిన్నపాటి చెరువులా తయారవుతుంది. గతంలో చిన్నగా ఉన్న కాలువని పెద్దగా చేయడంతో ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగిందని స్థానికులు అంటున్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్ ముందు గల ఈదులవాగు మీద చిన్నచిన్న గూనలు వేసి నిర్మించడంతో ఇరుకుగా మారింది. దీంతో ఎస్వీ కాలేజ్ వెనుక ప్రాంతమైన ఆర్కే నగర్ జలమయంగా మారుతుంది. బ్రిడ్జి మీద నుంచి వెళ్లే మామిళ్లగడ్డ, సీతారాంపురం, ఇందిరమ్మ కాలనీ రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈదులవాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ‘పేట’కు ముంపు ముప్పు తప్పేదెలా..? ఫ భారీ వర్షాలకు మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు ఫ గతేడాది ఇచ్చిన హామీలు నెరవేర్చని మున్సిపల్ యంత్రాంగం ఫ నామమాత్రపు పనులతోనే సరిపెడుతున్న వైనం ఫ వర్షాలు కురుస్తుండడంతో ఆందోళనలో ముంపు కాలనీల ప్రజలు -
అంతటా మోస్తరు వర్షం
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఐదారు రోజులుగా తీవ్ర ఉక్కపోత, ఎండ తీవ్రత ఉంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం కురిసింది. చాలాచోట్ల రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరగా.. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వాగులు సాగాయి. జిల్లాలో అత్యధికంగా నడిగూడెం మండలంలో 101.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 16.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలుమండలం వర్షపాతం నాగారం 65.2 తిరుమలగిరి 36.1 తుంగతుర్తి 36.4 మద్దిరాల 45.0 నూతనకల్ 59.9 జాజిరెడ్డిగూడెం 83.9 సూర్యాపేట 40.3 ఆత్మకూర్(ఎస్) 62.5 మోతె 58.6 చివ్వెంల 69.1 పెన్పహాడ్ 31.5 మునగాల 58.7 నడిగూడెం 01.0 అనంతగిరి 56.4 కోదాడ 88.5 చిలుకూరు 72.0 గరిడేపల్లి 48.0 నేరేడుచర్ల 34.6 పాలకవీడు 32.8 మఠంపల్లి 40.7 హుజూర్నగర్ 42.4 మేళ్లచెరువు 16.7 చింతలపాలెం 42.7 -
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ కె.నరసింహతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖ పరేడ్కు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జాబితా తయారు చేయాలని సూచించారు. డ్రగ్స్ను నిర్మూలించాలి అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్ కార్డ్, నషా ముక్త్ భారత్ అభియాన్పై ఎస్పీ నరసింహతో కలిసి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఈనెల 13న యాంటీ డ్రగ్స్పై పాఠశాలలు, కళాశాలలు యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం అనంతరం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. వానాకాలం ప్రారంభమైనందున ఇసుక సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ముందుగా ఇసుక బజారుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు. నాగారం మండలం పేరబోయినగూడెం అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జానపహాడ్, బెట్టెతండా, ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు, మున్నేరు వాగు రక్షణ గోడకు ఇరిగేషన్ శాఖకు ఇసుక అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ఎస్పీ కె.నర్సింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్, డీపీఓ యాదగిరి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, అబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్, ట్రాన్స్ పోర్ట్ అధికారి జయప్రకాశ్రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వంతెనల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండల పరిధిలోని మూసీనది ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే భీమారం గ్రామం వద్ద వంతెనను పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టులు, వంతెల వద్ద పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు మూసీనదిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. యువత సెల్ఫీలు అంటూ విషాదం కొనితెచ్చుకోవద్దని సూచించారు. సూర్యాపేట, పెనపహాడ్, నేరేడుచర్ల, పాలకవీడు పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్ల కృష్ణానదిలో నీటి ఉధృతి అధికంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, డయల్ 100, జిల్లా స్పెషల్ బ్రాంచ్ 87126 86026 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఎస్పీ వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తసూర్యాపేటటౌన్ : బ్యాంకులకు వరుసగా పండగ సెలవులు ఉన్నందున సైబర్ మోసగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగ బహుమతులు అంటూ, స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమైనా బ్లూ లింక్స్, మెసేజ్లు వచ్చినా వాటిని అనుసరించవద్దని, అపరిచితులు డబ్బులు అడిగితే స్పందించవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ మోసగాళ్ల వల్ల ఆర్థిక నష్టానికి గురైతే వెంటనే 1,930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫ ఎస్పీ నరసింహ -
ప్రయోగ ఫలం రైతు దరిచేరేలా..
భానుపురి (సూర్యాపేట) : రైతులకు ఆధునిక సాగుపై మరింత అవగాహన కల్పించేలా రైతు విజ్ఞాన కేంద్రం రానుంది. జిల్లాకో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో రోజురోజుకూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు రైతులకు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో గడ్డిపల్లిలోని కేవీకే ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందుతుండగా.. రైతు విజ్ఞాన కేంద్రంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,70,853 మంది ప్రయోజనం కలగనుంది. రైతన్నలకు మేలు కొత్తగా ఏర్పాటు కానున్న రైతు విజ్ఞాన కేంద్రంతో రైతులకు ఎంతో మేలు కలగనుంది. ప్రధానంగా ఈ కేంద్రం ఏర్పాటుతో ఐదారుగురు శాస్త్రవేత్తలు, వారి సహాయక సిబ్బంది రైతులకు అందుబాటులోకి రానున్నారు. ప్రయోగశాల ఏర్పాటు చేయడమే కాకుండా విత్తనాభివృద్ధి, సాగు క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాల్లో రైతులకు డ్రోన్లు, ఇతర యంత్రాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నిత్యం ఏదో ఒక పంటపై పరిశోధనలు, ప్రయోగాలు, రైతు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రైతులకు శాస్త్రవేత్తలు, ఇతర వ్యవసాయ అధికారులు సైతం అందుబాటులోకి ఉండి సాగులో సమస్యలు తొలగనున్నాయి. అలాగే ఈ రైతు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ప్రయోగాలు సైతం పొలాల వరకు చేరుతాయి.సాగులో కొత్త పుంతలు.. జిల్లాలో వ్యవసాయం కొంత మూసపద్దతిలోనే సాగుతోంది. ప్రధానంగా జిల్లాలో వరిని అత్యధికంగా పండిస్తారు. తదనంతరం పత్తి సాగు చేపడుతారు. ఏ నేలల్లో ఏ పంట వేస్తే మేలు జరుగుతుందన్న ఆలోచన లేకుండా మూస పద్ధతిలో వెళుతుండగా.. ఇందులోనూ ఇప్పుడిప్పుడే రైతులు యాంత్రీకరణ వైపు మళ్లుతున్నారు. అన్నదాతలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి పద్ధతిని అవలంబించడంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా విత్తనాల సాగు నుంచి అన్నింట్లోనూ డ్రోన్ల వాడకం పెంచనున్నారు. యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అందించనున్నారు.ప్రధాన పంటలు : వరి, పత్తి నేలలు : ఎర్రనేలలు, నల్లరేగడి, ఎర్ర చెల్క, ఇసుక నేలలు వ్యవసాయ భూమి : 8,95,680 ఎకరాలు మండలాలు 23 రైతులు : 2,70,853 మంది గైడ్లైన్స్ రావాల్సి ఉంది జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆదేశాలు, గైడ్లైన్స్ రావాల్సి ఉంది. అయితే రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రం మొత్తం మారిపోతుంది. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
క్రీడలతో స్నేహభావం
చివ్వెంల(సూర్యాపేట) : క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, ప్రశాంత వాతావరణంలో క్రీడలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమికి అదనపు బస్సులురామగిరి(నల్లగొండ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆ సంస్థ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) కె.జానిరెడ్డి తెలిపారు. పండుగ రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 150 నుంచి 170 వరకు అదనంగా బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ స్పెషల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోలర్స్, సూపర్వైజర్లను నియమించామని పేర్కొన్నారు. ప్రయాణికులు అదనపు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూ చట్టాలపై అవగాహన అవసరంకోదాడ రూరల్: భూ చట్టాలపై రైతులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికతో పాటు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో గురువారం సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని రైతులతో కలిసి ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించినప్పుడే సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, హరి వెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ఏఓ రజిని, పీఏసీస్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 15న హర్ ఘర్ తిరంగాసూర్యాపేట అర్బన్ : ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతా రెడ్డి కోరారు. విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యశాలకు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డితో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నారు. తిరంగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని దేశభక్తిని ప్రదర్శించాలన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో పేరు గాంచిన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మాల్సూర్ గౌడ్, కో కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ మన్మథరెడ్డి, సీనియర్ నాయకులు కర్నాటి కిషన్, చలమల నరసింహ, కృష్ణయ్య, సులోచన, అనూష, శకుంతల, శోభా, సీత పాల్గొన్నారు. -
ఇన్నోవేషన్ హబ్.. మనకేనా?
దక్షిణ తెలంగాణలో రీజనల్ హబ్ ఏర్పాటు దిశగా కేంద్రం స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా.. రీజనల్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్లకు సహకారం అందించడం, ఫండింగ్, మార్కెట్ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్ ఇన్నోవేషన్ హబ్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ హబ్ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహంవివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్ ఇన్నోవేషన్ హబ్లను/సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్ హబ్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు.ఫ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం ఫ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు ఫ పార్లమెంటు ప్రశ్నత్తరాల్లో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం -
అందుబాటులో ఎనిమిది వేల టన్నుల యూరియా
మేళ్లచెరువు : జిల్లాలో ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) గోగుల శ్రీధర్రెడ్డి వెల్లడించారు. గురువారం చింతలపాలెం మండల కేంద్రంతో పాటు దొండపాడులోని ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల నానో యూనియా వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. డీఏఓ వెంట మండల వ్యవసాయాధికారి శశాంక్, ఎరువుల డీలర్లు తదితరులు ఉన్నారు. -
ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దు
మునగాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయమనోహరి సూచించారు. మునగాల మండల కేంద్రంలో ఇటీవల వైద్యం వికటించి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నేపథ్యంలో చికిత్స చేసిన చంద్రమౌళి క్లినిక్ను ఆమె తనిఖీ చేశారు. క్లినిక్తో పాటు ల్యాబ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో చంద్రమౌళి అందుబాటులో లేకపోవడంతో ల్యాబ్ నిర్వాహకుడు గోపగాని రమేష్ను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం వికటించి మృత్యువాత పడిన యువకుడు వెంకటేశ్వర్లుకు ఏ విధమైన వైద్యం అందించారని అడిగారు. దీంతో రమేష్ సమాధానం ఇస్తూ .. జ్వరంతో బాధపడుతూ నీరసంగా క్లినిక్కు వచ్చిన వెంకటేశ్వర్లుకు రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. రక్త కణాలు తక్కువగా ఉండడంతో సైలెన్ పెట్టి యాంటీబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చామన్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కోదాడకు తీసుకెళ్లాలని తాము అతని కుటుంబ సభ్యులకు సూచించామని తెలిపారు. ల్యాబ్కు పరిమితి ఉందా ? అని ల్యాబ్ నిర్వాహకుడిని డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి అడిగారు. దీంతో అనుమతి పత్రం తీసుకురాగా గడువు నెల రోజుల క్రితమే ముగిసినట్లు గుర్తించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు . మూడు నెలలకు ముందే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తాను విచారణ చేపట్టానని ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా అధికారికి అందచేజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాఽధికారి డాక్టర్ పి.రవీందర్, సూపర్వైజర్ శ్రీను, హెల్త్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
తుంగతుర్తి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ఎక్స్రే మిషన్, ల్యాబ్ ను పరిశీలించారు. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంటగది, వాటర్ ప్లాంట్, సరుకుల గదిని అధికారులతో కలియ తిరుగుతూ పరిశీలించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్లి విద్యార్థులు ఏవిధంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమార్, మండల విద్యాధికారి బోయిని లింగయ్య, డీసీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ రమేష్ బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, డాక్టర్లు వీణ, రాజు, ఆరోగ్య సిబ్బంది, ఎస్ఓ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిక్షరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. కేజీబీవీ ఎస్ఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి తుంగతుర్తి కేజీబీవీ ఎస్ఓ కల్పనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో రికార్డులను చూపాలని కోరగా నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆహార భద్రత చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లో గురువారం ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు పర్యటించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఫుడ్కమిషన్ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం, స్కూల్స్, హాస్టల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఇక్కడ ఆహార భద్రత చట్టాన్ని బాగా అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో అమలు చేస్తే తెలంగాణ ఆహార భద్రత చట్టం పూర్తిగా అమలు చేసిన వారమవుతామన్నారు. రేషన్ షాపుల్లో వేయింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్స్, పాలు, బాలామృతం, ఆట వస్తువులు సక్రమంగా సరఫరా చేయాలని తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామన్నారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డీఆర్డీఓ వీవీ అప్పారావు, సంక్షేమ శాఖల అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి -
తెలంగాణ సాధనలో జయశంకర్ కీలక పాత్ర
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు. సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంతో పాటు, దేశంలోనే ముందంజలో ఉంచడానికి ఉద్యోగులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వి.వి. అప్పారావు, డీటీడీఓ శంకర్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, సంతోష్ కిరణ్, శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వక్ఫ్ భూముల వేలంపై హైకోర్టు స్టే
పాలకవీడు: పాలకవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని జాన్పహాడ్ దర్గా భూముల కౌలు వేలంపాటను తాత్కాలికంగా రద్దు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. బుధవారం పాలకవీడులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాన్పహాడ్ దర్గాకు సంబంధించి వక్ఫ్కు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 57 ఎకరాల 38 గుంటల భూములపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం వేలం నిర్వహించాల్సి ఉందని అయితే ఈ భూములు తమకే చెందుతాయని హక్కుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించినట్లు చెప్పారు. ఇప్పటికే దర్గాపై తమకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిందని హక్కుదారులు తెలిపారు. మెప్మా పీడీగా బాధ్యతల స్వీకరణసూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డి బుధవారం మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించారు. హన్మంతరెడ్డికి మెప్మాపీడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి పోరుబాట మునగాల: ప్రజాసమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ సభ్యుడు చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, షేక్ సైదా, బచ్చలకూరి స్వరాజ్యం, దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, వి.వెంకన్న,బోళ్ల కృష్ణారెడ్డి, గోపయ్య, నాగయ్య, వెంకటాద్రి, నరసయ్య, వెంకటకోటమ్మ, జ్యోతి, సతీష్ పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రీడలకు వేళాయే..
త్వరలో పోటీలను ప్రారంభిస్తాం ఎస్జీఎఫ్ పోటీలను జిల్లాలో త్వరలో ప్రారంభిస్తాం. జిల్లాలో నాలుగు జోన్ల పరిధిలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశాం. రెండు రోజుల్లో ఆయా జోన్ల క్రీడా కార్యదర్శులను ఎన్నుకుంటాం. అనంతరం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి క్రీడాకారులను ఎంపిక చేస్తాం. –ఎం కిరణ్ కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి క్రీడల నిర్వహణకు ప్రభుత్వం సహకారం ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తోంది. ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం మండలాని రూ .10 వేల చొప్పన కేటాయిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ నిధులు వెంటనే విడుదల చేస్తే క్రీడల నిర్వహణ మరింత సులువు అవుతుంది. పాఠశాల స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడా కారులుగా తీర్చి దిద్దడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం. –అయితగాని శ్రీనివాస్, పీఈటీఏ టీఎస్ జిల్లా అధ్యక్షుడుహుజూర్నగర్ : పాఠశాల స్థాయి విద్యార్థి దశ నుంచే బాలబాలికలు వారికి ఇష్టమైన క్రీడలపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలను ఈనెలలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. మండల స్థాయి పోటీలు ఈనెల రెండో వారంలో, జోనల్ స్థాయి పోటీలు ఈనెల మూడో వారంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు రెండో వారంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా పోటీలు ఒక్కో స్థాయిలో రెండు రోజుల పాటు కొనసాగుతాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల పోటీలు నిర్వహించి ఆయా క్రీడల్లో ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. మూడంచెల పద్ధతిలో.. ఆటల పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహిస్తారు. అండర్–14, అండర్–17 విభాగంలో పాఠశాల విద్యార్థులు, అండర్–19 విభాగంలో ఇంటర్ విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాను హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుండతుర్తి జోన్లుగా విభజించారు. ఒక్కో జోనుకు ఒక క్రీడా కార్యదర్శి చొప్పున నలుగురు క్రీడా కార్యదర్శులను నియమించారు. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో క్రీడాంశంలో ఒక జట్టును ఎంపిక చేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందిస్తారు. వీటితో విద్య, ఉద్యోగాలకు క్రీడాకోటా కింద 2 శాతం రిజర్వేషన్ల సదుపాయం కూడా ఉంటుంది. అన్ని పాఠశాలల విద్యార్థులకు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. జిల్లాలోని 1వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు 979 ఉండగా వాటిలో విద్యార్థులు 45,918 మంది ఉన్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా విద్యార్థులు 18,062 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 78 ఉండగా విద్యార్థులు 3,079 మంది ఉన్నారు. ఉన్నత పాఠశాలలు 211 ఉండగా విద్యార్థులు 24,777 మంది ఉన్నారు. కేజీబీవీలు 18, ఆదర్శ పాఠశాలు 9, ఎంజీపీటీబీసీ 8, గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. వాటిలో దాదాపు 15 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. క్రీడాంశాలు ఇవే.. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, కరాటే, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, నెట్ బాల్, సాఫ్ట్బాల్, బేస్బాల్, బాల్ బ్యాట్మెంటన్, షటిల్, టేబుల్ టెన్నిస్, చదరంగం, అథ్లెటిక్స్లలో అండర్– 14, 17, 19 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలాని రూ.10 వేలు కేటాయిస్తుంది. ఈనెల చివరి వరకు మండలస్థాయి పోటీలను పూర్తి చేయాలి. సెప్టెంబరులో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం అవుతాయి. ఫ ఈ నెల రెండో వారంలో మండలస్థాయి, మూడో వారంలో జనల్స్థాయి పోటీలు ఫ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఫ విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం -
వర్షం 15% తక్కువే..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రైతన్నల ఆశలు ఇక ఆగస్టు మాసంపైనే ఆధారపడి ఉన్నాయి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా సరైన వర్షాలు లేవు. ఈ సీజన్లో జిల్లాలో సరాసరి 15శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని కారణంగా వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2,65,332 ఎకరాల్లో సాగైన వివిధ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈనెలలో కురిసే వానలపైనే ఆధారపడి ఉంది. సాధారణానికి మించి వర్షాలు కురవకపోతే బోరుబావులుసైతం వట్టిపోయే పరిస్థితి నెలకొంది. అంచనాలు తలకిందులు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రైతాంగం సంబురపడగా.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవనేలేదు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అసలు వాగులు, వంకలు సాగిన దాఖలాలు సైతం లేవు. కేవలం మోస్తరు వర్షాలే.. అదీ నెలలో 7, 8 రోజులకు మించి పడలేదు. జిల్లా గణాంక శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జూన్లో 95.5 మి.మీలు కురవాల్సి ఉండగా 44 శాతం లోటుగా 53.2 మి.మీ వర్షపాతం కురిసింది. జూలై చివరి వారంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలకు సాధారణం 162.7 మి.మీలకుగాను 2శాతం మించి 166.6 మి.మీల వర్షపాతం నమోదైంది. అయినా ఈ సీజన్ మొత్తంగా చూసుకుంటే జిల్లాలో సరాసరి 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రైతుల్లో ఆందోళన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈనెలలో వర్షాలు కురిసి.. చెరువులు నిండితే సరి లేదంటే సాగైన పంటలు సైతం చేతికొచ్చుడు కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి లోటు వర్షపాతం కారణంగా జిల్లాలో ఉన్న 1200 చెరువులు, కుంటలకు గాను కేవలం పది నుంచి 15 చెరువుల్లోకి మాత్రమే నీళ్లు వచ్చాయి. ఇక సాగర్, మూసీ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువుల్లోకి నీళ్లు వచ్చినా.. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని చెరువులు నీటి జాడకోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే పరిస్థితి నెలకొంటే ఆయా ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి నీటి ఆధారిత పంట వరి సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో జిల్లా రైతాంగం ఈనెలలో కురిసే వర్షాలపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. బోర్లుపోయడం కష్టమే వాతావరణం ఇలాగే ఉంటే బోర్లు పోయడం కష్టమే. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తేనే చివరి వరకు పొలాలు పారుతాయి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. రెండెకరాలు నాటు పెడుతున్నాం. చేతికొచ్చినప్పుడు లెక్క. – గడ్డం కేశయ్య, రైతు పంట అంచనా(ఎకరాల్లో..) సాగైంది(ఎకరాల్లో) వరి 4,85,125 2,11,096పత్తి 91,000 50,236 ఇతర పంటలు 5,000 4,000ఈ రైతు పేరు బట్టిపెట్టి శ్రీను. సొంతూరు ఆత్మకూర్(ఎస్). ఏటా జూన్, జూలైలో కురిసే వర్షాలకు గ్రామంలోని మర్రికుంటలోకి నీరు వచ్చేది. దీని కిందనే ఉన్న ఎకరం పొలం నాటుపెట్టేవాడు. ఈ వానాకాలం ఏ మాత్రం నీళ్లు కుంటలోకి రాలేదు. ఎకరం పొలం అలాగే ఉంది. వారం, పదిరోజుల్లో నీళ్లు రాకుంటే ఈ సారి వరి సాగుబంద్ చేయడమే.ఫ వానాకాలంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదు ఫ ఈ నెలపైనే రైతుల ఆశలు ఫ 2,65,332 ఎకరాల్లో వివిధ పంటలు సాగు ఫ వరుణుడు కరుణించకపోతే సాగైన పంటలు చేతికి అందడం కష్టమే -
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రభస
రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దు ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): రేషన్కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని, ఎప్పుడైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చిని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్లో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ రావు, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, డీఎస్ఓ మోహన్ బాబు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ ,తహసీల్దార్ అమీన్సింగ్, ఎంపీడీఓ హాసీం పాల్గొన్నారు. ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్లో బుధవారం జరిగిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మాట్లాడుతుండగా.. జై జగదీష్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాదనకు దిగారు. జై దామన్న అంటూ పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జగదీష్రెడ్డి కేసీఆర్ను పొగుడుతూ బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందిందని చెబుతుండగా ఆయన ఉపన్యాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో వందల మంది ప్రాణాలు బలిగొన్నదని, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు కుంభకోణం చేసిందని విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టిన భిక్షతో అధికారం చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళాతీయించాడని ఆవేశంగా వేదికపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటకుదిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు పంపారు. కలెక్టర్ కలగజేసుకొని ఇది రాజకీయ వేదిక కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వేదికని సర్దిచెప్పారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, రేషన్ కార్డులను ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఫ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట -
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ?
జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి పరీక్షించారు. అతను మద్యం తాగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే ఆ సమయంలో బైక్తోపాటు అతని సెల్ఫోన్ను కూడా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న హోంగార్డు, మరో కానిస్టేబుల్ మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని మరణానికి కారణం పోలీసుల దురుసు ప్రవర్తనేనని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేశారు.చింతపల్లి మండలం కూర్మేడ్ గ్రామంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ టీవీ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎదుటి వారితో కుమ్మకై ్క భూవివాదం సెటిల్ చేసుకోవాలంటూ తమ వేధిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఉన్నా పోలీసుల సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతేడాది శాలిగౌరారం ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదంలో పోలీసుస్టేషన్కు వెళ్లిన మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైపై ఎస్పీ విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసింగ్ గాడి తప్పుతోంది. కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితుల ఫిర్యాదులతో బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే. పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సెటిల్మెంట్లు చేస్తూ దండుకుంటున్న వారు కొందరైతే, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. అదీ చాలదన్నట్లు ఇంకొందరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సస్పెండ్ చేయడం, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. పైగా రాజకీయ పలుకుబడితో కొద్దిరోజుల్లోనే తిరిగి పోస్టింగ్ పొందుతున్నారు.ముడుపులే లక్ష్యంగా దందాలుకొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాజకీయ నేతల అండదండలతో అవినీతి దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా కేసు విషయంలో పోలీసు స్టేషనన్కు వెళితే చాలు న్యాయ అన్యాయాలు పట్టించుకోకుండా, ముడుపులు ముట్టజెప్పిన వారికి వంతపాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు ఎదురు తిరిగిన వారిపై చేయి చేసుకోవడం బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ముసిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్లో బంధించి చితకబాదడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చర్యలు చేపడుతున్నా తీరు మారట్లే..⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంధ్యకు యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని మరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మే నెల 20వ తేదీన ఆమె మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మృతురాలి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఎస్సైని బదిలీ చేశారు.⇒ సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థ సారధి రూ. 16లక్షలు లంచం డిమాండ్ చేసి మే 12న ఏసీబీకి పట్టుబడ్డారు.⇒ నూతనకల్ మండలం మిర్యాలలో చక్రయ్యగౌడ్ హత్య కేసులో అప్పటి డీఎస్పీ డబ్బులు తీసుకొని నిందితులను ప్రోత్సహించడంతో పాటు హత్య కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని కాదని తుంగతుర్తి సీఐకి బాధ్యతలు అప్పగించడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీని డీజీపీ ఆఫీస్కు, సీఐని ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు.⇒ నూతనకల్ పోలీస్ స్టేషనన్లో పనిచేసిన ఎస్ఐ వి.ప్రవీణ్కుమార్ అదే పోలీస్ స్టేషనన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ ప్రవీణ్కుమార్ను శనివారం డీఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.⇒ నేరేడుచర్ల మండలం మేడారంలో ఓ భూవివాదంలో తమ హత్యకు కుట్ర చేశారంటూ ఒక వర్గం వారు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మరోవర్గం వారిపై నేరేడుచర్ల ఎస్సై రవీందర్నాయక్ కేసు నమోదు చేసి స్టేషన్కి పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు అదే మండలంలోని కందులవారిగూడెంలో భూవివాదంలో ఎస్సై రవీందర్నాయక్ ఒక వర్గం వారిని విచారణ పేరుతో బాధితులను కొడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. విచారణ పేరుతో ఎందుకు కొడుతున్నారని అడిగితే తమపైనా దురుసుగా ప్రవర్తించారంటూ స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.⇒ గతేడాది భూవివాదంలో గుర్రంపోడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో ఎదుటివారితో కుమ్మకై ్క సూసైడ్ కేసుగా నమోదు చేశారు. ఆ కేసును ఎస్పీ శరత్చంద్రపవార్ విచారణ జరిపించారు. ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత సీఐపైనా విచారణ జరిపించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొట్టిన విషయంలో సీఐపై విచారణ జరిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.వివాదాల కేంద్రంగా చింతపల్లిచింతపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదంలో జోక్యం చేసుకున్నారు. ఆ కేసులో ఓ వృద్ధున్ని పోలీసు స్టేషనన్కు తీసుకువచ్చి కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆ వృద్ధుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వృద్ధునికి గుండెపోటు వచ్చిందని, పోలీసులు కొట్టినందున ఆయన చనిపోలేదని, గుండెపోటు కారణంగానే అతను చేనిపోయాడని తేల్చారు. అయితే సదరు ఎస్సైని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయినా కొద్దినెలలకే రాజకీయ పలుకుబడితో ఆయన మరో కీలకమైన పోస్టింగ్ తెచ్చుకోగలిగారు.డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసుల అత్యుత్సాహంపోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణ కేంద్రాల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగినా, తాగకపోయినా తనిఖీల సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనంతోపాటు సెల్ ఫోన్లు లాక్కోవడం, ఇష్టానుసారంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నది కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెస్తాం
హుజూర్నగర్ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోగల గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్లతో కలిసి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను నిర్లక్ష్యం చేసిందన్నారు. 2026 జూలై నాటికి పనులు పూర్తి చేయాలి పులిచింతలలోని తెలంగాణ జెన్కో విద్యుత్ తయారు చేసిన తర్వాత వచ్చే నీటిని రూ.320కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి తద్వారా మేళ్లచెరువు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాల్లో 14,100 ఎకరాలకు అందిస్తామన్నారు. రూ. 1450 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53 వేల ఎకరాలకు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 188.32 ఎకరాలకు భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించామన్నారు. 2026 జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాలేరు వాగుపై రూ. 47.64 కోట్లతో రెడ్లకుంట లిఫ్ట్ నిర్మించి దాని ద్వారా 4,460 ఎకరాలకు, రూ. 54.03 కోట్లతో రాజీవ్ శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్ల వివరించారు. ఆర్–9 కాలువపై రూ. 8.45 కోట్లతో లిఫ్ట్ నిర్మించి మునగాల, నడిగూడెం మండలాల్లో 3,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాన్నారు. రూ. 244 కోట్లతో మోతె లిఫ్ట్ నిర్మించి తద్వారా 45,736 ఎకరాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. పాలకవీడు మండలంలో రూ. 302.20 కోట్లతో జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మించి దీని ద్వారా 10 వేల ఎకరాలకు నీరందించే పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రూ 26.02 కోట్లతో నిరించే బెట్టెతండా లిఫ్ట్ ద్వారా 2041 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. రూ. 31 కోట్లతో నిర్మించే నక్కగూడెం లిఫ్ట్ ద్వారా 3,200 ఎకరాలకు నీరు అందుతుందని దానిని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ రమేష్ బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ సీతారామయ్య, ఎస్ఈ బీవీ ప్రసాద్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఈఓ ఆశోక్, జిల్లా సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, ఆర్డీఓ శ్రీనివాసులు ఆర్టీసీ సీఈ కవిత, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, నాయకులు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జున్, గెల్లి రవి, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, దొంతగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై హైదరాబాద్లో సమీక్ష -
కాళేశ్వరంపై వాస్తవాలను రైతుల ముందుంచాలి
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్రావు చెప్పిన వాస్తవాలను రైతుల ముందుంచాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కార్యకర్తలను కోరారు. మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్క్రీన్పై బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం పాల్గొన్నారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించాలిసూర్యాపేటటౌన్: పూణేలో జరిగే జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లోనూ పతకాలు సాధించాలని ఎస్పీ నరసింహ ఆకాంక్షించారు. మమునూరు లో నిర్వహించిన రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది, పోలీస్ డాగ్ రోలెక్స్ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక దర్యాప్తు పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్ చక్రవర్తి తృతీయ స్థానం, నార్కోటిక్ డాగ్ రోలెక్స్లో డాగ్ ట్రైనర్ సతీష్ ద్వితీయ స్థానం పొందారని వివరించారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు నాటికి పరిష్కారమయ్యేనా!
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలిఫ అదనపు కలెక్టర్ రాంబాబు సూర్యాపేట : భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. మంగళవారం సూర్యాపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. అధికారుల బృందాలకు క్షేత్రస్థాయి వెళ్లాలని కోరారు. అర్హులకు నూతన రేషన్ కార్డును కూడా త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ సి.హెచ్.కృష్ణయ్య, డీటీ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కపిల్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.సూర్యాపేట : భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. శతశాతం దరఖాస్తులకు మోక్షం కలిగించాలని ప్రభుత్వం విధించిన డెడ్లైన్ తొమ్మిది రోజుల్లో ముగియనుంది. వీటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది కుస్తీలు పడుతున్నారు. అయినా ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యలో ప్రభుత్వం చెబుతున్న పంద్రాగస్టు నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి సుమారు 47వేలకు పైగా దరఖాస్తులు రాగా కేవలం 807కు మాత్రమే మోక్షం కలిగింది. గడువులోగా అనుమానమే.. భూ సమస్యలతో చాలామంది యజమానులు ఏళ్ల తరబడి కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు ఈ దిశగా చర్యలను ముమ్మరం చేసినా.. వేలల్లో దరఖాస్తులు ఉండడం, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ప్రధానంగా దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా గతంలో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏల వ్యవస్థ లేకపోవడంతో ఈ పని అంత సులువుగా కావడం లేదు. మోకాపై భూమి ఉన్నప్పటికీ అమ్మిన వ్యక్తి రికార్డుల్లో లేకపోవడం, సర్వే నంబర్లోని విస్తీర్ణం పూర్తిగా నిండి ఉండడం, అన్నదమ్ముల్లో ఒకరిపై పట్టా చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం.. ఇలా పలు కారణాలతో దరఖాస్తులు అనర్హతకు గురవుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 1.70శాతమే పరిష్కారం ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 47,462 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 47,290 దరఖాస్తులను ఆన్లైన్ చేసి రైతులకు నోటీసులను అందించారు. ఇప్పటి వరకు కేవలం 807 దరఖాస్తులకు మోక్షం లభించింది. అంటే 1.70శాతం దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిష్కరించగలిగారు. చాలావరకు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వెల్లడించడం లేదు. సాదాబైనామాతో పాటు పీఓటీ దరఖాస్తులు 17వేల వరకు ఉన్నాయి. ఈ సాదాబైనామాలు, పీఓటీ కేసులు కోర్టు పరిధిలో ఉండడంతో పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం సాదాబైనామా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వాస్తవంగా రికార్డుల్లో పట్టాదారు ఉన్నాడా..? కాస్తుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చే లోపు సమగ్రంగా పరిశీలించి జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారుభూ భారతి దరఖాస్తుల మోక్షానికి తొమ్మిది రోజులే గడువు ఫ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 47,462 ఫ ఇప్పటి వరకు 807 పరిష్కారం ఫ సిబ్బంది కొరత, అధికంగా అర్జీలు రావడంతో తీవ్ర జాప్యం ఫ కుస్తీలు పడుతున్న రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 47,462 ఆన్లైన్ చేసినవి : 47,290 నోటీసులు ఇచ్చినవి : 47,290 పరిష్కారం అయినవి : 807 -
విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జున్ రెడ్డి సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన ముస్లిం మైనారిటీ యోధుల ఫొటో ఎగ్జిబిషన్ను మంగళవారం చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులోని ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిని నాగార్జున్రెడ్డి పరిశీలించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర సాధనలో ముస్లింలు చేసిన సేవలు మరువు లేనివి అని అన్నారు. దేశభక్తుల జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేయడం అభినందనీయం అన్నారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, అబ్దుల్లా, ప్రిన్సిపల్ వినోద, ఖాలెద్అహ్మద్, అస్గర్ సాహబ్, సీఐటీయూ జిల్లా మాజీ కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టపల్లి సైదులు, నర్సింహారావు, వేల్పుల వెంకన్న, సయ్యద్ ఫకీర్ హుస్సేన్, జహీర్, రహీం, అజీజ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
సూర్యాపేట : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు కోరారు. ఈనెల 7వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అఖిల భారత పదవ జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం సూర్యాపేటలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివ్య, కవిత, నవ్య, అలేఖ్య, సురేష్, నరేష్, సందీప్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కారు్డలకూ పథకాలు
భానుపురి(సూర్యాపేట) : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అందనున్నాయి. గృహ జ్యోతి, మహాలక్ష్మితో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కలెక్టరేట్తో పాటు మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నూతనంగా రేషన్ కార్డులు పొందిన 24వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 24వేలకు పైగా మందికి లబ్ధి..పదేళ్లుగా రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో వేలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను దూరమయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా మొదటగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో పదేళ్లుగా రేషన్ కార్డులు లేకపోవడంతో నూతనంగా వివాహాలు చేసుకున్న వేలాది మందికి ఈ పథకాలు అందలేదు. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటికి రేషన్ కార్డులు కావాల్సి ఉంది. గత నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 24వేలకు పైగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందించారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు వీరందరికీ అందనున్నాయి. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలెక్టరేట్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు నూతనంగా 24వేల కుటుంబాలకు ప్రయోజనంగృహజ్యోతి లబ్ధిదారులు 1,80,607ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు 3,26,057నూతన రేషన్ కార్డులు 24,082మహాలక్ష్మి లబ్ధిదారులు 1,62,718 -
ఇళ్ల నమూనాలు ముమ్మరం
ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం జిల్లాలో 19 ఇందిరమ్మ ఇంటి నమూనాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ఇప్పటికే 15 నమూనాలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని ఈనెల 15లోగా పూర్తిచేసేలా పనులు చేస్తున్నాం. లబ్ధిదారులు ఈ ఇంటి నమూనాలను అనుసరించి నిర్మాణాలు చేసుకోవాలి. – సిద్ధార్థ, హౌసింగ్ పీడీభానుపురి (సూర్యాపేట) : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ఓ నమూనాను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఇంటి నమూనాపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు జిల్లాలో చకచకా పూర్తవుతున్నాయి. 14 నమూనా నిర్మాణాలు పూర్తవగా మరో ఐదు నమూనాలు వివిధ దశలో ఉన్నాయి. పంద్రాగస్టు నాటికి అన్నింటినీ పూర్తిచేసేందుకు గృహ నిర్మాణ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోంది. 19 మండలాల్లో నిర్మాణాలు..సూర్యాపేట జిల్లాలోని 19 మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇంటి నమూనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయాలు, రైతు వేదికలు, ఇలా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 14 మండలాల్లో ఇంటి నమూనాలు పూర్తయ్యాయి. మరో అయిదు చోట్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. స్థలం కొరత కారణంగా జిల్లాలోని ఆత్మకూర్ ఎస్, నాగారం, మద్దిరాల, చింతలపాలెం మండలాల్లో ఆలస్యంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్మాణాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కల్పించేందుకు..ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రాయితీతో రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. సొంత స్థలం ఉండి డబ్బులు లేక ఇంటి నిర్మాణం చేసుకోలేని వారికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో తక్కువ వ్యయంతో ఇంటి నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చో ప్రభుత్వమే వాటి వివరాలను, గణాంకాలతో ప్రకటించింది. 400 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణం లోపు నిర్మాణం పూర్తిచేసే నమూనా రూపొందించింది. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా లబ్ధిదారుడు వచ్చి చూసి ఇంటి నిర్మాణాలు చేపట్టేలా వీటిని ప్రారంభించారు. దాదాపు జిల్లాలో మంజూరైన 19 నిర్మాణాలకు 14 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. లబ్ధిదారులు ఈ ఇంటి నిర్మాణాలను చూసి తాము ఇళ్లను నిర్మించుకోనున్నారు. జిల్లాలో 19 ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా నిర్మిస్తున్న గృహనిర్మాణశాఖ ఇప్పటికే 14 నమూనాలు పూర్తి 15వతేదీ నాటికి మిగతావి పూర్తిచేసేలా చర్యలు -
ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ
భానుపురి (సూర్యాపేట) : ఆల్బెండ జోల్ మాత్రలతో పిల్లల్లో నులిపురుగులను నివారించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ సంవత్సరం ఆగస్టు 11 న జాతీయ డీవార్మింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ సమాచారాన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువత తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా అధికారులు తమశాఖ అభివృద్ధి పనులపై, తమకు కేటాయించిన హాస్టళ్లు, పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షణకు ఏర్పాట్లు
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఉదయం 12గంటలకు తెలంగాణ భవన్నుంచి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రత్యేక స్క్రీన్ ల ద్వారా వీక్షించడానికి సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డిలు హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గంగరిడేపల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. బాల సైదిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, కిషోర్బాబు, వీరస్వామి పాల్గొన్నారు. గొల్లకురుమల సమస్యలు పరిష్కరించాలి తుంగతుర్తి : గొల్లకురుమల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత గొర్రెల పంపిణీ కింద నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినేటికీ నెరవేర్చలేదన్నారు. యాదవ విద్యార్థులందరికీ వెటర్నరీ పోస్టులు కేటాయించి, 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలన్నారు. సమావేశంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు వీరబోయిన రాములు, కొమ్మ లింగయ్య, ఉప్పుల లింగయ్య, మట్టిపెల్లి శ్రీను, నర్సయ్య, గంగరాజు, మధు, వెంకన్న, భిక్షం, శ్రీశైలం, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ల రికవరీలో సిబ్బంది కృషి ప్రశంసనీయం
సూర్యాపేటటౌన్ : పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో పోలీస్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. వివిధ చోట్ల పోగొట్టుకున్న 101 సెల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేసి మాట్లాడారు. పోయిన ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి కూడా రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్లు పోగొట్టుకుంటే అందులో ఉన్న విలువైన సమాచారం పోతుందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకిగురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉండాలిసూర్యాపేటటౌన్ : బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి అండగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ నరసింహ -
తొలగించారు.. నిర్మాణం మరిచారు!
కోదాడ: పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యం కోదాడ పట్టణ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మున్సిపాలిటీలో అత్యవసరంగా చేయాల్సిన పనులను సంవత్సరం కావొస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన డివైడర్లను మున్సిపాలిటీ అధికారులు హడావుడిగా పగులగొట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డివైడర్లను కూలగొట్టిన అధికారులు.. ఆ తరువాత వాటిని పునర్నిర్మించడం మరిచారు. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అయ్యాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 చోట్ల డివైడర్ల తొలగింపు..గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడలో రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, రెడ్ చిల్లి ఏరియా, భవానీ నగర్, శ్రీరంగాపురం పరిధిలో పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లకుండా సూర్యాపేట రోడ్డు, హుజూర్నగర్ రోడ్డు, మేళ్లచెరువు రోడ్డు, విజయవాడ రోడ్డులో 12 చోట్ల అడ్డుగా ఉన్న డివైడర్లను జేసీబీ సాయంతో తొలగించారు. ఆ తరువాత వాటిని పునర్నిర్మించాల్సి ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో డివైడర్లు పగులగొట్టిన ప్రాంతం నుంచి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్టాపర్లు అడ్డుపెట్టగా మరికొన్ని చోట్ల కంపను తాత్కాలికంగా అడ్డుగా ఏర్పాటు చేశారు.మీరంటే.. మీరే చేయాలంటూ.. కోదాడ పట్టణంలో రూ.34 కోట్ల నిధులతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల విస్తరణ పనులను గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేశారు. గత సంవత్సరం వర్షాలకు పలు కాలనీలు ముంపునకు గురవుతుండడంతో మున్సిపాలిటీ అధికారులు డివైడర్లను పగులగొట్టారు. కాబట్టి మున్సిపాలిటీ అధికారులే వీటిని పునర్నిర్మించాలని ప్రజారోగ్యశాఖ అధికారులు అంటుండగా.. తమ వద్ద నిధులు లేవని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో కోదాడ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం వరదలకు కోదాడలో డివైడర్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది నేటికీ మరమ్మతులు చేయని అధికారులు ప్రమాదాల బారిన పడుతున్న పాదచారులుప్రమాదాలు జరగకుండా చూడాలి కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లకు గతంలో పెట్టిన గాడులను వెంటనే మూసివేయాలి. వీటివల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మున్సిపాలిటీలో నిధులు లేవని అధికారులు చెప్పడం సరైంది కాదు. యుద్ధప్రాతిపదికన గాడులను మూసి వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. – ఈదుల కృష్ణయ్య, న్యాయవాది, కోదాడ -
రాకున్నా.. వచ్చినట్టు
నాగారం : గ్రామ పంచాయతీల్లో పాలన గాడి తప్పుతోంది. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకున్నా వచ్చినట్లుగా రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్లో తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదును పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లాలో 48 మంది కార్యదర్శులు తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో వారికి ఉన్నతాధికారులు చార్జ్మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవనాలు, కుర్చీల ఫొటోలు అప్లోడ్.. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 11 గంటలలోపు గ్రామానికి వెళ్లి యాప్లో తమ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ లోకేషన్కు వచ్చి సెల్ఫీ ఫొటో తీసుకుని డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) యాప్లో అప్లోడ్ చేయాలి. తదుపరి పారిశుద్ధ్య పనులను చేయిస్తూ ఆ ఫొటోలను కూడా యాప్లో అప్లోడ్ చేయాలి. అదే వారి ముఖ గుర్తింపు హాజరు కూడా. కానీ కొందరు యాప్లో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని విధులకు గైర్హాజరవుతున్నారు. యాప్లో సెల్పీతోపాటు ఏ ఫొటో అప్లోడ్ చేసినా ఓకే అని చూపిస్తుండడం వారికి కలిసి వస్తోంది. పంచాయతీ కార్మికుల సెల్ఫోన్లలో ఈ యాప్ను కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇన్స్టాల్ చేస్తున్నారు. కార్మికులే తమ ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఓపెన్చేసి కార్యదర్శి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పంచాయతీ భవనాలు, కుర్చీలు, ఇతర వస్తువులను అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు సెల్ఫోన్లో ఉన్న కార్యదర్శి సెల్ఫీ ఫొటోను మరోఫోన్ ద్వారా ఫొటో తీసి యాప్లో నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల పంచాయతీ అధికారులదే. కార్యదర్శుల హాజరు నమోదు ఎంపీఓ లాగిన్లో ఉంటుంది. డీఎల్పీఓ, డీపీఓలు సైతం తనిఖీ చేయవచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యదర్శులు తప్పుడు వివరాలను నమోదు చేస్తున్నారు. ఫ తప్పుడు హాజరు నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శులుఫ పంచాయతీ కార్మికుల సెల్ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఇన్స్టాల్ ఫ విధులకు రాకుండానే ఫొటోలు అప్లోడ్ ఫ జిల్లాలో 48 మంది కార్యదర్శులకు నోటీసులునోటీసులు జారీ చేశాం డీఎస్ఆర్ యాప్లో తప్పుడు ఫొటోలు నమోదు చేసిన 48 మంది కార్యదర్శులను గుర్తించి చార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరయ్యే కార్యదర్శులపై చర్యలు తప్పవు. –కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట -
పొగ కష్టాలకు చెక్..!
గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తాం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో 871 ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నట్లు గుర్తించాం. అన్ని పాఠశాలలకు త్వరలోనే గ్యాస్ సిలిండర్లు సమకూర్చుతాం. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి నాగారం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఇక నుంచి కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. కట్టెల పొయ్యితో వంట చేస్తున్న పాఠశాలలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సిలిండర్ల వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి పొయ్యి మండక ఉడికీ ఉడకని భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తరగతి గదుల్లోకి పొగ చూరుతోంది. పాఠశాలలకు వంట గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుతో వంట చేయడంలో ఆలస్యం, పొగ సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. 871 కనెక్షన్లు.. జిల్లాలోని 23 మండలాలు ఉండగా వీటి పరిఽధిలో మొత్తం 871 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా 42,634 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఈ పాఠశాలల్లో 1,435 మంది వంట ఏజెన్సీలున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలో కూడా ఎల్పీజీ కనెక్షన్ లేకపోవడంతో వంట కార్మికులు అన్ని బడుల్లో ఆరుబయట వంట చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని పాఠశాలల్లో వంట పాత్రలు కూడా సరిగా లేకపోవంతో కొన్ని నెలల క్రితం అందజేశారు. తప్పనున్న ఇబ్బందులు.. ఇటీవల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నాణ్యమైన వంటపాత్రలు అందించింది. అలాగే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనుంది. తద్వారా విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మండలాల పరిధిలో స్థానిక ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మధ్యాహ్న భోజన వండే కార్మికులకు గ్యాస్ సిలిండర్, స్టౌ ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ మాత్రం కార్మికులే నింపుకోవాలి. జిల్లాలో 871 పాఠశాలల్లో కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లుగా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేసింది. ఫ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సిలిండర్లు అందించేలా ప్రణాళిక ఫ ఇప్పటికే 871 స్కూళ్లకు అవసరమని గుర్తించిన అధికారులుప్రభుత్వ పాఠశాలలు 871 విద్యార్థులు 42,634వంట కార్మికులు 1435 -
నీట్ పీజీ ప్రశాంతం
సూర్యాపేట : నీట్ పీజీ(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్గ్రాడ్యుయేట్) జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. ఆదివారం సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న నీట్ పీజీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో 179 అభ్యర్థులకు గాను 171 మంది హాజరయ్యారని, 8 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే కోదాడ సన ఇంజనీరింగ్ కాలేజీలో 50 మందికి గాను 44 మంది హాజరయ్యారని, ఆరుగురు గైర్హాజరయ్యారని వివరించారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయలత, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
గుట్టకు పవిత్రోత్సవ శోభ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణా లతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాలను సిద్ధం చేశారు. విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సర్వదోషాలు తొలగిపోవడానికి.. ఏటా శ్రావణమాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగే నిత్యారాధనలు, వివిధ రకాల ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చితార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. ఫ నేటి నుంచి మూడు రోజులు ఉత్సవాలు -
రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం
తిరుమలగిరి( తుంగతుర్తి) : బీసీ వర్గంలోని అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే మన ఆలోచన సాధన సమితి ధ్యేయమని ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు అన్నారు. బీసీల చైతన్యం గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరిలో ఆదివారం మన ఆలోచన సాధన సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో తొమ్మిదో షెడ్యూల్ సవరణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, మన ఆలోచన సాధన సమితి నాయకులు గిలకత్తుల రాముగౌడ్, చేను శ్రీనివాస్, కందుకూరి ప్రవీణ్, తన్నీరు రాంప్రభు, కడెం లింగయ్య, పులిమామిడి సోమయ్య, భిక్షం, ఆలేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలి సూర్యాపేట అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సర్వే నిర్వహించి మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపె ల్లి సైదులు, కోట గోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాంసూర్యాపేట : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై కట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్రావు కేంద్రానికి లేఖ రాశాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించి మేమున్నామని ప్రగల్బాలు పలుకుతోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కడితే నల్లగొండ, మహబూబ్నగర్తోపాటు సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు ఎడారిగా మారుతాయన్నారు. -
రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
చిలుకూరు: కుల ధ్రువీకరణ పత్రాన్ని రెండు నిమిషాల్లో పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మీ సేవ కేంద్రాల్లో ఆధార్ నంబర్ ద్వారా రెండు నిమిషాల్లో తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కులం మారదు కాబట్టి అవసరం ఉన్న వారు నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి రూ. 45 రుసుం చెల్లించి ఆధార్ నంబరు ద్వారా తీసుకోవచ్చు. మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు ప్రజల సౌకర్యార్థం మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ సేవలు ప్రైవేట్ సైట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వీటిని మీ సేవ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ , అటవీ , సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు ఉన్నాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్ సర్టిఫికెట్ , పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ , క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ , సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్, మానిటరింగ్, వన్య ప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ విలువ ధ్రువపత్రం , పాన్ కార్డు సవరణ , ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాల పరిధిలో 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీలలో కలిపి 93 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఫ గతంలో తీసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయకుండా వెసులుబాటు ఫ రూ.45 చెల్లించి మీసేవ ద్వారా పొందే అవకాశం -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన పీడీఎస్యూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజుల నియంత్రణకు చట్టం లేకపోవడం వల్ల, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం 7 శాతం మించి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల విద్యారంగం వెనుకబడుతోందన్నారు. క్రార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్, నవీన్, నితిన్, పవన్, మనీషా, విజయ్, వాజిద్, మహ్మద్ ఆలీ, సైదా, శృతి తదితరులు పాల్గొన్నారు. ఫ పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి -
మున్సిపల్ పోరుకు సన్నద్ధం !
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతోపాటు దానికి అనుగుణంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సమాయత్తం అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉండగా వీటిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ముగిసిన గడువు ఈ సంవత్సరం జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. ఏడు నెలలుగా మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డుల్లోని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. పాలకవర్గం ఉన్నంత కాలం పట్టణవాసులు తమ సమస్యలను వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో పట్టణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలియగానే రాజకీయ పార్టీల నాయకులు క్రియాశీలకం అయ్యారు. మున్సిపాలిటీలో పట్టు సాధించాలని ప్రధాన పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమయింది. రిజర్వేషన్లపైనే చర్చ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏమేమి వస్తాయోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. చైర్మన్తోపాటు వార్డులకు రిజర్వేషన్లు గతంలో మాదిరిగా ఉంటాయా ? లేక కొత్తగా రిజర్వేషన్లు మారుతాయా అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండడంతో ఈసారి రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్నారు. గతంలోనే ఆయా మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజన జరగగా నివాస గృహాలు, జనాభా, కుటుంబాలను గుర్తించాల్సి ఉంది. ఫ ఏడు నెలలుగా ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు ఫ ఎన్నికల కోసం ఆశావహుల ఎదురుచూపులు ఫ కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న నాయకులు ఫ రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠమున్సిపాలిటీ వార్డుల నివాస జనాభా సంఖ్య గృహాలు సూర్యాపేట 48 39128 1,33,339 కోదాడ 35 23572 75,093 హుజూర్నగర్ 28 10761 35,850 తిరుమలగిరి 15 5447 18,474 నేరేడుచర్ల 15 5156 14,853 -
నేడు నీట్ పీజీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పీజీ(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్గ్రాడ్యుయేట్)కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని కోసం రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది. మొ 230 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 180 మంది, కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాలలో 50 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 8.30గంటల వరకు అనుమతి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ .. అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8.30 వరకు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత ప్రధాన గేటు మూసి వేస్తామన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జయలత, తహసీల్దార్ కృష్ణయ్య, తదితరులు ఉన్నారు. అభ్యర్థులకు సూచనలు.. ఫ ఒరిజినల్ అడ్మిట్ కార్డు( ప్రింటెడ్ ఫొటో తో కూడినది), ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఓటర్ ఐడీ , పాన్ కార్డ్ ,డ్రైవింగ్ లైసెన్స్ ,ఆధార్, ఈ– ఆధార్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు) లలో ఏదో ఒకటి తప్పనిసరి. ఫ ఫొటో గుర్తింపునకు సంబంధించి జిరాక్స్ కాపీలు లేదా మొబైల్ లో ఉండే గుర్తింపు కార్డులను అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఫ అభ్యర్థులు టీషర్ట్స్, షాట్స్ వంటి దుస్తులు కాకుండా సాధారణ దుస్తులను ధరించి రావాలి. ఫ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఫ రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ఫ హాజరుకానున్న 230 మంది అభ్యర్థులు ఫ సూర్యాపేటలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ -
ఉపవాసంతో పూజలు చేస్తాం
తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిష్టతో జాగరణలో ఉంటూ పూజలు చేస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు తండాను వదిలి బయటికి వెళ్లం. చివరిరోజు పూర్తిగా ఉపవాసంతో ఉంటాం. తండా పెద్దలు, తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తాం. – రమావత్ అనిత, తిరుమలగిరిసాగర్ తండా అంతా ఒక్కటిగా జరుపుకుంటాం తీజ్ పండుగను తండావాసులంతా కలిసి జరుపుకుంటాం. పంటలు బాగా పండాలని అమ్మవార్లకు పూజలు చేస్తాం. గోధుమ నారును తెంచి కుటుంబ సభ్యులకు ఇచ్చి, అమ్మవారి దీవెనలు అందుకుంటాం. చివరి రోజున చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. – నీలా బాయి, తుర్కపల్లి -
పదిలంగా స్నేహబంధం
స్నేహమేరా జీవితంఫ స్నేహానికి కల్మషం లేదంటున్న యువత ఫ అమ్మ తరువాత స్థానంలో స్నేహితుడు, నాన్న సుఖ దుఃఖాల్లో, కష్ట సుఖాల్లో వెన్నంటి ఉంటూ తాను తోడున్నాననే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. అన్ని సమయాల్లో నిస్వార్థంతో ఉండే అనురాగబంధమే స్నేహం. అందుకే స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో సినీ కవి. ఆధునిక పోకడలు మనిషి జీవితాన్ని మార్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ స్నేహానికి ఉన్న స్థానం అలాగే పదిలంగా ఉంది. మనిషిలో ఎన్ని మార్పులొచ్చినా స్నేహానికి ఉన్న విలువ ఏ మాత్రం తగ్గలేదు. అయితే మనుషులు కలుషితం అయ్యారే తప్ప స్నేహానికి ఉన్న స్థానం గొప్పదనే చెబుతోంది నేటి యువత. అలాంటి మనుషుల వల్ల కొంతవరకు స్నేహం కలుషితం అయింది తప్ప, స్నేహం అనేది కల్మషం లేనిదంటూ స్పష్టం చేశారు. ఈనెల 3వ తేదీన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మందిని ‘సాక్షి’ పలకరించింది. అందులో ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో స్నేహం కల్మషం లేనిదని చెప్పుకొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1200 మందితో సర్వే నిర్వహించగా, అందులో 72.42 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 27.58 శాతం అవసరాలు తీర్చేదిగా స్నేహం మారిందని పేర్కొన్నారు. మనుషుల స్వార్థం కారణంగా స్నేహం కూడా కలుషితం అయిందని 57.08 శాతం మంది వెల్లడించగా, కలుషితం కాలేదని 42.92 శాతం మంది తెలిపారు. తమకు ఒక్కరే స్నేహితులు ఉన్నారని 37.50 శాతం మంది పేర్కొనగా, తమకు ఇద్దరిక కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని 62.50 శాతం మంది స్పష్టం చేశారు. స్నేహితునికి ఇచ్చే స్థానం విషయంలోనూ అమ్మ, నాన్న కంటే ముందుగా స్నేహితునికే మొదటి స్థానం ఇస్తామని 21.42 శాతం మంది స్పష్టం చేశారు. 62.25 శాతం మంది.. అమ్మకే మొదటి స్థానాన్ని ఇవ్వగా, రెండో స్థానాన్ని స్నేహితునికి ఇచ్చారు. 16.33 శాతం మంది మాత్రం మొదటి స్థానం నాన్నకు ఇవ్వగా, ఆ తరువాత అమ్మ, స్నేహితునికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు.ప్రత్యేక కథనాలు 8లోuసాక్షి ప్రతినిధి, నల్లగొండ: -
చెట్టును ఢీకొట్టిన లారీ..
చీనెమ్మికల్లో బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 585.30 అడుగులు ఇన్ఫ్లో : 2,10,499 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 1,83,786 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,070 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 8,023 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 7,937 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు వరద కాల్వకు : 300 క్యూసెక్కులుబైక్ దొంగల రిమాండ్ ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న దొంగలను నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. - 8లో14 మంది ఎస్ఐల బదిలీసూర్యాపేటటౌన్ : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 14 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్– 2 ఇన్చార్జి ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ నల్లగొండలో ఉన్న ఆర్.నాగరాజును నూతనకల్ పీఎస్కు, నూతనకల్ ఎస్ఐ వి.ప్రవీణ్కుమార్ను డీఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. కోదాడ టౌన్ పీఎస్లో పని చేస్తున్న ఎస్ఐ ఎస్కె.సైదులును పీసీఆర్ సూర్యాపేటకు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.హనుమాన్ను కోదాడ టౌన్ పీఎస్కు, కోదాడ పీఎస్లో పని చేస్తున్న వి.మల్లేశంను వీఆర్ సూర్యాపేటకు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.అంజిరెడ్డిని కోదాడ ట్రాఫిక్ పీఎస్కు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఐ.మహేంద్రనాథ్ను సూర్యాపేట టౌన్ –1 పీఎస్కు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.యాదవేందర్రెడ్డిని సీసీఎస్ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎస్.రాంబాబును డీఎస్బి సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎం.ఆంజనేయులును డీఎస్బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎం.అనిల్రెడ్డిని సీసీఎస్ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎ.తేజస్వినిని డీఎస్బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎ.ఝాన్సీరాణిని డీఎస్బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఆర్.డాక్యానాయక్ను పీసీఆర్ సూర్యాపేటకు బదిలీ చేశారు. సర్వీస్ నిబంధనపై స్పష్టత కరువు కొత్త పోస్టుల భర్తీ నిబంధనల్లో పాత సర్వీస్పై స్పష్టత లేకుండా పోయింది. పే స్కేల్ విధివిధానాలు పేర్కొనలేదు. వీటిపై అనుమానాలు ఉండడంతో చాలామంది జీపీఓ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మొదట్లో వెనుకంజ వేశారు. అయితే విద్యార్హత ఉన్నవారంతా ఎంపిక పరీక్షకు హాజరయ్యారు. పాత సర్వీస్ యాడ్ చేయకపోయినా.. వీరంతా ఆసక్తి కనబర్చడం విశేషం. ఇక మంచి శాఖల్లో చేరిన వారు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారంతా తమ సర్వీస్ను కోల్పోయేందుకు ఇష్టపడడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎంపిక పరీక్ష రాసిన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించంసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన సిబ్బంది, సమయానికి రాని డాక్టర్లు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చిన, విధులకు హాజరు కాని సిబ్బందికి సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అత్యవసర చికిత్స విభాగంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగితో మాట్లాడారు. బ్లడ్ బ్యాంకును సందర్శించి ఎన్ని యూనిట్ల రక్తం నిలువ ఉందని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ విజయకుమార్, డాక్టర్లు విజయానంద్, లక్ష్మణ్ ఉన్నారు. పోలీస్ సిబ్బంది ఒత్తిడికి గురికావొద్దు సూర్యాపేటటౌన్ : విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఒత్తిడికి గురి కావొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వాలీబాల్ కోర్టును ఎస్పీ నరసింహతో కలిసి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీధర్ రెడ్డి, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ -
ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం ఐదు గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి 1,34,984 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 1,71,388 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా, ఈ ప్రాజెక్టులోని తెలంగాణ వైపు ఉన్న విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 100 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ జెన్కో అధికారులు తెలిపారు. పోర్ట్ పోలియో జడ్జిగా జస్టిస్ శ్రీదేవిచివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా పోర్ట్ పోలియో జడ్జిగా జస్టిస్ జువ్వాడ శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పోర్ట్ పోలియో జడ్జిగా పనిచేసిన జస్టిస్ రాధరాణి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆమె స్థానంలో శ్రీదేవి నియమితులయ్యారు. జిల్లా కోర్టుతో పాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ కోర్టుల అడ్మినిస్ట్రేటివ్ విధులు ఆమె నిర్వహించనున్నారు. 143 మంది బాలలకు వెట్టి నుంచి విముక్తిసూర్యాపేటటౌన్ : జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ముగిసిందని, దీని ద్వారా 143 మంది బాలలను వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ టీమ్స్తో సమావేశం నిర్వహించి ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టి నుంచి విముక్తి కల్పించినవారిలో తెలంగాణకు చెందిన వారు 76 మంది ఉండగా వీరిలో ఏడుగురు బాలికలు, 69 మంది బాలురు ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 67 మంది ఉండగా వీరిలో బాలురు 50 మంది, బాలికలు 17 మంది ఉన్నట్లు వివరించారు. బాలలతో పని చేయించుకుంటున్న 65 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వెట్టిచాకిరీకి, నిరాదరణకు గురైన బాలబాలికలు, తప్పిపోయి వచ్చిన బాలలను గుర్తించి సంరక్షించడం లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జీపీఓ పోస్టుకు ఓకే!
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పాలనాధికారి (జీపీఓ) పోస్టుల్లో చేరేందుకు పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా విధుల్లోకి చేరగానే పాత సర్వీస్ ఉండదని, జీరో నుంచి సర్వీస్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా పేర్కొన్నా దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంపిక కోసం రెండు విడతల్లో నిర్వహించిన అర్హత పరీక్షకు 94.18 మంది హాజరుకావడమే ఇందుకు నిదర్శనం రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి.. పల్లెల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలనాధికారి పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి వారి విద్యార్హతల ఆధారంగా గ్రామ పాలనాధికారి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే కొత్తగా విధుల్లోకి చేరగానే పాత సర్వీస్ ఉండదని, జీరో నుంచి మొదలవుతుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత అర్హులైన 275మంది పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొదటి విడతలో ఈ ఏడాది మే 25న నిర్వహించిన పరీక్షకు 194 మంది అర్హులకు గాను 182 మంది హాజరయ్యారు. రెండో విడతలో జూలై 27న నిర్వహించిన పరీక్షను 81 మందికి గాను 77 మంది రాశారు. రెండు విడతల్లో కలిపి 259 మంది పరీక్షకు హాజరయ్యారు. కేవలం 16 మంది మాత్రమే గైర్హాజరు కావడంతో జీపీఓ పోస్టుల్లో చేరేందుకు అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో.. వీఆర్ఓలు, వీఆర్ఏల వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో రద్దుచేశారు. అయితే జిల్లాలో పూర్వ వీఆర్ఓలు 209 మంది, వీఆర్ఏలు 440 మంది ఉండగా అప్పట్లో వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా భర్తీ చేస్తున్న గ్రామపాలనాధికారి పోస్టుల్లోకి వచ్చేందుకు వారికి అవకాశం కల్పించింది. ఫ గ్రామ పాలనాధికారిగా చేయడానికి పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏల ఆసక్తి ఫ దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు ఇప్పటికే రెండు విడతలుగా పరీక్ష ఫ 275 మందికి గాను 259 మంది పరీక్షకు హాజరు ఫ జీరో సర్వీస్ నిబంధనను పట్టించుకోని అభ్యర్థులు ఫ పోస్టింగ్లు ఇచ్చేందుకు అధికారుల సన్నాహాలు -
చేయూత పింఛన్లు పెంచేవరకు పోరు
హుజూర్నగర్ : ప్రభుత్వం చేయూత పింఛన్లు పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్లో చేయూత పింఛన్దారుల జిల్లా సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని, వికలాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో మంత్రుల నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించిన అనంతరం ఈనెల 13న హైదరాబాద్లో చేయూత పింఛన్దారుల మహా గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ మహాగర్జనకు పింఛన్దారులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బివెంకటేశ్వర్లు, సీహెచ్.వినయ్ బాబు, ఆర్ సురేష్, సీహెచ్.నాగయ్య, బి.ప్రసాద్, ఒగ్గు విశాఖ, ఎం.వెంకటేశ్వర్లు, శరత్బాబు, ఎం.నాగరాజు, రాజేష్, శరత్, ఖాసీం, సతీష్, వినయ్, శ్రీనివాస్, రవీందర్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంద కృష్ణమాదిగ -
కోటపహాడ్ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ఆత్మకూర్(ఎస్) : మండలంలోని కోటపహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.విజయ్ కుమార్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు పట్టించుకోకపోవడంతో వీధులు, మురికి కాలువల్లో చెత్తపేరుకుపోయి దుర్వాసన వస్తోందని మూడు రోజులు క్రితం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడం, నిరసన గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణ చేపట్టి కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారని ఎంపీడీఓ తెలిపారు. నీట్ పీజీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కోదాడరూరల్ : నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని సన కళాశాలలో ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సన కళాశాలలో 50 మంది, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో 180 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అభ్యర్థులను 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, సీసీ కెమోరాలు, జామర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, కళాశాల సిబ్బంది ఉన్నారు. పీహెచ్సీల్లో కాన్పుల సంఖ్య పెరగాలిఅర్వపల్లి: పీహెచ్సీల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెరిగేలి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, నర్సింగ్ ఆఫీసర్ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదల మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 2,08,455 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో అధికారులు 8 గేట్లను మూడు మీటర్ల మేరకు పైకెత్తి 2,05,279 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట అధికారులు తెలిపారు. -
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
సూర్యాపేట : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి రామ్కోటి ప్రజాపతి, రాష్ట్ర నాయకుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించే 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష వాల్ పోస్టర్లను శుక్రవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రి ఉత్తంకుమార్రెడ్డి, ఎంపీ రఘువీర్రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. నిరాహార దీక్షకు 30 కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల సైదులు, రెడ్డబోయిన నరేష్, కె.వీరబాబు, సట్టు మురళి, వేముల వీరమల్లు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గొట్టిపర్తి లింగయ్య, ఎలకపల్లి సైదులు, ప్రవీణ్, రాచమల్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ప్లాంట్లోని రెండో యూనిట్ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యూనిట్ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డియాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ వైటీపీఎస్లోని అన్ని విభాగాల్లో లాగ్బుక్ ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్రాజు పాల్గొన్నారు. చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్ పనులు పవర్ ప్లాంట్లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే నాలుగో బాయిలర్ లైటింగ్ (స్టీమ్ జనరేషన్) పనులు పూర్తికాగా, ప్లాంట్ సింక్రనైజేషన్కు సంబంధించి బాయిలర్ స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్, నార్మలైజేషన్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. యూనిట్–3 సింక్రనైజేషన్ను సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి, అక్టోబర్లో కమర్షియల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. డిసెంబర్లో సింక్రనైజేషన్ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ పేర్కొంది. ఫ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్–2 ప్రారంభం ఫ శుక్రవారం యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తిచేయాలని ఆదేశం ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మోతె : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనణ కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మోతె పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లు, బ్లడ్ టెస్టులు, మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్సీ చెకప్కు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య విషయాలను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు వైద్యధికారులు కృషి చేయాలన్నారు. ఎక్కడైన డెంగీ కేసులు గుర్తిస్తే వారి ఇంటి పరిసరాల్లో శానిటేషన్ చేయించాలన్నారు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం తీసుకుంటే శిశువులో ఎదుగుదల ఉంటుందన్నారు. భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాంపురంతండాలో ఎస్సారెస్పీ 22–ఎల్ కాల్వను పరిశీలించి సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, పీహెచ్సీ డాక్టర్ యశ్వంత్, ఆయుష్ డాక్టర్ వాణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముఖ హాజరు
తొలిరోజు 2,689 మంది ఉపాధ్యాయులకు ‘ఫేస్ రికగ్నిషన్’ అమలు ఫ సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా రిజిస్ట్రేషన్ ఫ జిల్లాలో 881 స్కూళ్లు.. 4,542 మంది టీచర్లు సూర్యాపేటటౌన్ : విధులు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లకు ఇకనుంచి చెక్ పడనుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులే నేరుగా తమ సెల్ ఫోన్లలోనే ఆన్లైన్ విధానంలో హాజరు నమోదు చేసుకునేలా టీజీఎఫ్ఆర్ఎస్ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. అయితే మొదటి రోజు 2,689 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. శనివారం అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ యాప్ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయనున్నారు. విద్యార్థులకు మాదిరిగానే.. గతేడాది నుంచి పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు టీచర్లకు హాజరు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు. యాప్లో రిజిస్ట్రేషన్ ఇలా.. జిల్లాలోని 881 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 4,542 మంది పనిచేస్తున్నారు. కొత్త విధానం అమలులో భాగంగా సంబంధిత ఉద్యోగి స్మార్ట్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను టెక్నీషియన్ అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్లైన్లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం, ముగిసిన తర్వాత క్లాక్ ఔట్ అనే ఆప్షన్పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్లైన్లో చేరుతుంది. విద్యార్థులకు మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు కొందరు సమయానికి రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తెచ్చింది. దీతో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మెరుగైన బోధన అందుతుంది. మిగిలిన ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ శనివారం పూర్తవుతుంది. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తమ బోధనే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు విద్యాశాక ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజలి సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి. బైక్ అదుపుతప్పి యువకుడి మృతిఫ మరో ఇద్దరికి గాయాలు డిండి: బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది. శుక్రవారం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన లక్కు విజయభాస్కర్రెడ్డి(18), ఎం. సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డి గురువారం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుని రాత్రి బైక్పై ముగ్గురు కలిసి నాగార్జునసాగర్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్ అదుపుతప్పడంతో మధ్యలో కూర్చున్న విజయభాస్కర్రెడ్డి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలించారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విజయభాస్కర్రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పచ్చందాల అర్బన్ పార్కు
సాగర్ జలాశయ తీరంలో నాగార్జునసాగర్–హైదరాబాద్, సాగర్–నల్లగొండ రహదారుల (సమ్మక్క–సారక్కల) వెంట రూ.1.5కోట్లతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల అటవీ కోర్ ఏరియాలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు పచ్చందాలను ఆరబోస్తోంది. 980 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన సాగర్ బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు రెండు రకాల సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో 10 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1,000, 24 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. సిబ్బంది కొరత మూలంగా పర్యాటకులు అడిగితేనే సఫారీ వాహనాలను నడుపుతున్నారు. -
ముఖ్యమైన ఫోన్ నంబర్లు
ఫ హిల్కాలనీ లాంచీ స్టేషన్: 7997951023 ఫ ఎత్తిపోతల : 9441453115, 9494347946 ఫ విజయపురి నార్త్ ఎస్ఐ: 8712670197 ఫ సాగర్ మాత దేవాలయం: 9581642488 ఫ ఫైలాన్ కాలనీ టైగర్ వ్యాలీ హోటల్: 915439303 ఫ పార్కింగ్ హోటల్ అండ్ రెస్టారెంట్: 7993750209 ఫ విజయపురి సౌత్లోని మాతాసరోవర్ రిసార్ట్స్: 8500718552, 7901084959 -
దుకాణాల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఫ మహిళకు తీవ్ర గాయాలు ఆలేరు: డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పెద్దవాగు నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తరలించేందుకు జూకంటి సంపత్ ట్రాక్టర్కు తహసీల్దార్ ఆంజనేయులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ కమల్హాసన్ వాగు వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని కనకదుర్గ గుడి మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. ఆర్కే సినిమా థియేటర్ వెళ్లే దారి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ ఉడెన్ ఫర్నీచర్ వర్క్స్షాప్ పైకి దూసుకెళ్లింది. దీంతో షాపులోని వర్కర్లు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొలనుపాకకు చెందిన వల్లెపు రాజమణిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫర్నీచర్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, డ్రైవర్ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాంగ్రూట్లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్ దుకాణాల పైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల, మిర్యాలగూడ టౌన్: సాగర్ ఎడమ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో లభ్యమైంది. మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపహాడ్ గ్రామానికి చెందిన చౌగాని శంకర్(38) తన స్నేహితులతో కలిసి బుధవారం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. శంకర్ మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో సాగర్ ఎడమ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొని వెళ్తుండగా స్థానికులు గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తన సిబ్బందితో ఎడమ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్పందించి శంకర్ కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకెళ్లగా మృతదేహం శంకర్దేనని గుర్తించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు మునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన పాలమాకుల సోమయ్య(45), ధనలక్ష్మి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాములలో కోడిగుడ్లు కొనుగోలు చేసి తమ సొంత ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఆకుపాముల గ్రామ శివారులోని జియో పెట్రోల్ బంబక్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహంనంలో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమయ్య మృతిచెందాడు. సోమయ్య భార్య ధనలక్ష్మి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆతిథ్యమిస్తున్న హోటళ్లు
నాగార్జునసాగర్లో పర్యాటకులకు అనుగుణంగా హోటళ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో హోటల్ బిజినెస్ కూడా పెరిగింది. హిల్కాలనీలో విజయ్విహార్లో నడుస్తున్న హోటల్లో దేశ, విదేశీయులు తినే పలురకాల వంటకాలు లభ్యమవుతున్నాయి. అలాగే బుద్ధవనంలో సిద్థార్థ హోటల్, మనోరమ హోటల్, పైలాన్కాలనీలో ఇటీవల ఏర్పాటైన టైగర్ వ్యాలీ హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి అవతలి వైపున ఉన్న మాతా సరోవర్, రైట్ బ్యాంకులో మాతా సరోవర్ హోటళ్లు వెలిశాయి. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హిల్కాలనీలో విజయ్విహార్ హోటల్లో 34 గదులు ఉన్నాయి. ముందస్తుగా ఆన్లైన్లో టీడీటీజీసీ.ఇన్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. వివరాలకు 08680–277362 నంబర్ను సంప్రందించాలి. -
సాగర్ సోయగాలు
చూసొద్దాం.. రండి నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని మాచర్లకు వెళ్లే దారిలో 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వద్ద 70 అడుగుల పైనుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. ఈ జలపాతం చూసేందుకు టిక్కెట్ ధర పెద్దలకు రూ.30 కాగా పిల్లలకు రూ.20. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి బస చేసేందుకు 8 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్ ఫ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే నందికొండ, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం ఫ చెప్పలేని అనుభూతిని మిగిల్చే లాంచీ విహారం గత ఆనవాళ్లకు చిరునామా అనుపు హిల్కాలనీకి 15 కిలోమీటర్ల దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ అలనాటి నాగార్జున విశ్వవిద్యాయం, ఇక్ష్వాకుల యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణా నది లోయలో లభించిన రంగనాథస్వామి ఆలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణా నది తీరంలో నిర్మించడం విశేషం. తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మనసు దోచే ఎత్తిపోతల -
3న ప్రో కబడ్డీ పోటీలు
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ ప్రో కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఈనెల 3న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (ఇండోర్)లో జరగనున్నట్లు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి , నామా నరసింహా రావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర యువ ప్రో కబడ్డీ లీగ్ పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల సూర్యాపేట జిల్లా క్రీడాకారులు ఈనెల2లోపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సెల్ నంబర్ 9912381165ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోంఅనంతగిరి: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ వెంట మండల వైధ్యాధికారి డాక్టర్ పుష్పలత, పీహెచ్ఎన్ అనంతలక్ష్మి, స్టాఫ్ నర్సు ధనలక్ష్మి, ఫార్మసిస్ట్ కృష్ణ తదితరులు ఉన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేపెన్పహాడ్: విద్యార్థులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈఓ అశోక్ సూచించారు. గురువారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయం, సింగారెడ్డిపాలెంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి నూరుశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కృష్ణప్రసాద్, పీడీ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు నరేందర్, ఉపాధ్యాయులు నల్లా శ్రీనివాసులు, మహేష్, సరిత పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మమతభానుపురి (సూర్యాపేట ) : యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన మమతా నాగిరెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , కేసి వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి మమతానాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అమ్మ పాలు అమృతం
అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అమ్మపాల విశిష్టత తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. గర్భిణులు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సూర్యాపేట అర్బన్ : అమ్మ పాలు అమృతంతో సమానమని పెద్దల మాట. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను అందించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు పట్టిస్తేనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ముర్రుపాలు తప్పనిసరి బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను శిశువుకు తప్పనిసరిగా పట్టించాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహారం అందుతుంది. ఈ పాలలో మాంసకృత్తులు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన గంట నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వకూడదు. రోజూ ఎనిమిది నుంచి పదిసార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ నేటి నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు -
లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలి
భానుపురి (సూర్యాపేట) : లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్లయ్య డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ గురువారం టీయూసీఐ(ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేటలో ఆ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు గులాం హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న,జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి, సాహెబ్ హుస్సేన్, కస్తాల కృష్ణ, రజాక్, మోహన్, అంజయ్య, సైదులు పాల్గొన్నారు. -
ఈత, తాటి వనాలతో జీవనాధారం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఈత, తాటి వనాలు గౌడ కుటుంబాలకు జీవనాధారం అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో గౌడ సొసైటీ భూమిలో నాలుగు ఎకరాల్లో కలెక్టర్ ఈత మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. నాటిన మొక్కలను చంటి బిడ్డల్లా కాపాడి పెంచి పెద్ద చేసినప్పుడే ప్రయోజనం కలుగుతుందన్నారు. 1,600 ఈతమొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణకు నీటి కోసం బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నీటి తొట్టెలు నిర్మించి వాటి ద్వారా మొక్కలకు నీరు పోసి పెంచాలని సూచించారు. ఫెన్సింగ్ మంజూరు చేసి డ్రిప్ సౌకర్యం కల్పించాలని గౌడ సొసైటీ బాధ్యులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ అప్పారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్, ఆర్డీఓ వేణు మాధవరావు, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ మహ్మద్ హాసీం, కార్యదర్శి స్వప్న, గౌడ సొసైటీ చైర్మన్ వెల్గూరి జానయ్య, మల్లయ్య, తండు నాగలింగం, బాలయ్య, రాజు, నేతలు తంగళ్ల కరుణాకర్ రెడ్డి, ముసుగు రామచంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, శివ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేశారు భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు చేరే విధంగా డీపీఆర్ఓ రమేష్ కుమార్ అంకిత భావంతో పని చేశారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన డీపీఆర్ఓ రమేష్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో మంత్రుల పర్యటనలను విజయవంత చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు, పదవీ విరమణ పొందిన డీపీఆర్ఓ రమేష్కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ పాతసూర్యాపేటలో వనమహోత్సవం -
ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
చివ్వెంల(సూర్యాపేట) : ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న జ్యూడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోర్టులో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మధుసూదన్రావు ,ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, కోశాధికారి జునైద్, అసోసియేట్ అధ్యక్షుడు ఎ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె.వి.శ్రీకాంత్, ఎ.ఉమ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.మహేశ్వర్, జాయింట్ సెక్రటరీలు పి.నాగంజనేయులు, ఎ.మధుకర్, కె.నాగరాజు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
నిర్వహణ ఎత్తిపోయింది
నడిగూడెం : నాగార్జునసాగర్కు అనుబంధంగా నడిగూడెం మండల పరిధిలో నిర్మించిన ఎల్–34, ఎల్–35, ఎల్–36, ఎల్–10 ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మైనర్, మేజర్ కాల్వలు చెత్తాచెదారంతో నిండి పూడిపోవడం చివరి భూములకు నీరు అందడంలేదు. దీంతో పాటు ఈ పథకాలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు నిత్యం మొరాయిస్తున్నాయి. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు పూడిపోయి.. నడిగూడెం మండల కేంద్రం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–34 ఎత్తి పోతల పథకం ఉంది. ఈ పథకం కింద నడిగూడెం, రామాపురం గ్రామాలుండగా వీటి పరిధిలో 600 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద కాల్వలు పూడి పోవడంతో పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్–35 పరిధిలో.. నారాయణపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–35 ఎత్తి పోతల పథకాన్ని నిర్మించారు. దీని పరిధిలో నారాయణపురం, బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ పథకం కింద దాదాపు 4,500 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్ కింద కాల్వలు అధ్వాన్నంగా ఉండంతో కరివిరాల, వేణుగోపాలపురం గ్రామాలకు నీరందడంలేదు. కంపచెట్లతో నిండి.. కాగితరామచంద్రాపురం వద్ద ఎల్–36 ఎత్తి పోతల పథకం నిర్మించారు. దీని కింద కాగితరామచంద్రాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ ఎత్తిపోతల కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కంపచెట్లతో పూడిపోయాయి. దీంతో ఈ ఎత్తిపోతల ద్వారా కేవలం కాగితరామచంద్రాపురం రైతులకు మాత్రమే నీరందుతోంది. చివరి ఆయకట్టు గ్రామమైన కరివిరాలకు సాగునీరు అందడంలేదు. నిర్వహణలోపంతో.. సిరిపురం వద్ద ఆర్–10 ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో సిరిపురం, శ్రీరంగాపురం, త్రిపురవరం గ్రామాలున్నాయి. ఈ లిఫ్ట్ కింద 6,500 ఎకరాలు డిజైన్ చేశారు. కానీ నిర్వహణ లోపం వల్ల ఆయకట్టు గ్రామమైన త్రిపురవరం వరకు నీరు పోవడం లేదు. మేజర్, మైనర్ కాల్వలు పలు చోట్ల పూడి పోవడం, ఇంకా పలు చోట్ల కంపచెట్లు ఉండడంతో చివరి భూములకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. మొరాయిస్తున్న మోటార్లు నడిగూడెం మండల పరిధిలోని నాలుగు ఎత్తి పోతల పథకాలకు చెందిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు నిత్యం మొరాయిస్తున్నాయి. దీంతో నిర్వహణ కష్టతరంగా మారింది. గతంలో ఎత్తి పోతల పథకాలను ఐడీసీ నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి పారుదలశాఖ నిర్వహిస్తోంది. ఎత్తి పోతల పథకాల కింద సాగు చేసే రైతులు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి చివరి భూములకు నీరందించేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫ నడిగూడెం మండలంలో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తం ఫ పూడిపోయిన మేజర్, మైనర్ కాల్వలు ఫ చివరి భూములకు అందని సాగు నీరు ఫ నిత్యం మొరాయిస్తున్న మోటార్లు చివరి భూములకు నీరందించాలి ఎల్–35 ఎత్తి పోతల పథకం కింద నాకున్న భూమిని సాగు చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా చివరి భూములకు నీరందడంలేదు. గత రబీ సీజన్లో ఎత్తి పోతల నుంచి నీరందక ఎకరం ఎండి పోయింది. సంబంధిత అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మత్తులు చేయించి, చివరి భూములకు నీరందించాలి. –షేక్.మస్తాన్, రైతు, కరివిరాల కాల్వలకు మరమ్మతులు చేయాలి ఆర్–10 ఎత్తి పోతల పథకం పరిధిలో మేజర్, మైనర్ కాల్వలు కంపచెట్లతో నిండిపోయాయి. దీంతో చివరి భూములకు నీరందడంలేదు. అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించాలి. –మన్నెం నాగిరెడ్డి, రైతు, త్రిపురవరం ప్రతిపాదనలు పంపాం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే కాల్వలకు మరమ్మతులు చేపడతాం.చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నాం. – ఆనంద్ కుమార్, డీఈ, నడిగూడెం