Suryapet
-
సోషల్ మీడియా కీలకపాత్ర పోషించాలి
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్లోని తన ఇంటివద్ద హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు నాకు రెండు కళ్లలాంటివని వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో జరగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోషల్ మీడియా వారియర్స్ను కోరారు. సోషల్ మీడియా వారియర్స్కు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా రంగంలో అనుభవం కలిగిన శ్రీధర్ రామస్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రత్యేకించి సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు. ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్సింగ్
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ ఆర్థిక సాయంతో పేదలకు నిర్మించబోయే ఇళ్లకు తొలిసారి జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ సహాయంతో ప్రత్యేక యాప్ను రూపొందించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించబోయే ఇళ్లకు ఈ కొత్త విధానం అమలులోకి తేనున్నారు. 2013లో రాష్ట్రంలో జియో ఫెన్సింగ్ విధానం అప్ప టి ప్రభుత్వం ప్రతిపాదించినా అది అమలు కాలేదు. అయితే ఈసారి ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే పీఎం ఆవాస్ యోజన నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో ఫెన్సింగ్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. తేడా వస్తే ఇల్లు రద్దు మొదటి విడతలో సొంతంగా ఇంటి జాగా ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అర్హుల గుర్తింపునకు ఇటీవల సర్వే చేసిన అధికారులకు సొంత జాగా ఉన్నా నిరుపేదలతో కూడా ఎల్ఈ జాతకాన్ని సిద్ధం చేశారు. ఇల్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు. ఇప్పుడు ఆ స్థలం జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది. ముగ్గుపోసే రోజు గ్రామ కార్యదర్శికి, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాలి. సర్వేలో చూపిన స్థలం అదే, కాదా అని వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. తర్వాతే ప్రత్యేక యాప్ లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో ఫెన్సింగ్ చేస్తారు. తదుపరి తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద నిలబడి యాప్ ద్వారా పరిశీలిస్తారు. ఏమాత్రం తప్పుడు సమాచారం ఉన్నా ఇల్లే రద్దవుతుంది. పాత ఇల్లు చూపితే అంతేసంగతులు! గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక స్థలం చూపించి మరో స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవి చూపి బిల్లులు మింగేశారు. బేస్మెంట్ లెవల్లో మొదటి బిల్లు ఉపాధి బిల్లు నుంచి కావడంతో అందినకాడికి దోచుకున్నారు. ఇకపై అలాంటి వాటికి అవకాశం ఉండదు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వచ్చేనెల 4వ తేదీ తర్వాత ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టడానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక ఎల్–1 జాబితా, ఇన్చార్జి మంత్రుల అనుమతితో ఆమోదించడంతో స్థానిక ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫ సర్వేలో చూపిన స్థలంలోనే ఇల్లు నిర్మించాలి ఫ వేరే ప్రదేశం చూపితే ఇల్లు రద్దే.. ఫ అక్రమాల కట్టడికి ప్రత్యేక యాప్ రూపకల్పన ఫ కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం నిర్ణయంమొదటి విడతలో ఇళ్ల మంజూరు ఇలా.. నియోజకవర్గాలు 04ఒక్కో నియోజకవర్గానికి 3,500మొత్తం 14,000 -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి): రాష్ట్రప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంతకండ్ల దామోదరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతా రామయ్య డిమాండ్ చేశారు. తిరుమలగిరి పట్టణంలో రూ.50 లక్షలతో నిర్మించిన ఆ సంఘం నూతన భవనాన్ని సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రావాల్సిన నాలు గు డీఏలను వెంటనే చెల్లించాలని, రెండవ పీఆర్సీ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎంప్లాయీస్ హెల్త్కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందేలా చూడాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంబాబు, సహాయ కార్యదర్శులు ఎం.పద్మారెడ్డి, సారంగుల నర్సయ్య, విఠల్రెడ్డి, జి.సుదర్శన్రావు, నర్సయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరెడ్డి -
దారులన్నీ గట్టువైపే..
లింగమంతుల స్వామి జాతరకు పోటెత్తిన భక్తులుసూర్యాపేట, చివ్వెంల,సూర్యాపేటటౌన్, భానుపురి: చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం జనగట్టును తలపించింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారిని సోమవారం ఒక్కరోజే 6 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. బోనాల సమర్పణ సాగిందిలా.. మున్న (రాజులు) మెంతబోయిన (పూజారులు) తమ ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో రెండు బోనాలు వండి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేకత. తొలుత మున్నవారు రాశిబోనం, తర్వాత మెంతబోయినవారు సందవసర బోనం సమర్పించారు. ఇరు బోనాల నుంచి కొంత అన్నం తీసి లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తొలిగొర్రె (మెంతబోయిన వారిది), బద్దెపాల గొర్రె (మున్న వారిది), వరద గొర్రె (గొర్ల వారిది)లను చౌడమ్మ తల్లికి ఎదురుగా బలిచ్చారు. ఆ మాంసాన్ని మున్న, మెంతబోయిన, బైకానివారు వాటాలుగా పంచుకుని వండి చౌడమ్మకు నైవేద్యం సమర్పించారు. లింగమయ్య పూజల్లో ప్రముఖులు లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్రెడ్డి, కలెక్టర్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. నేడు చంద్రపట్నం ఫ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఫ ఓ లింగా నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు ఫ రెండవ రోజు ప్రత్యేకంగా సాగిన బోనాల సమర్పణ ఫ పూజల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ -
సూర్యాపేట
ఆనవాళ్లు చెరిపేయలేరు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయలేరని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఐకేపీ సిబ్బంది నిర్బంధం మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో మహిళలు స్థానిక ఐకేపీ సిబ్బందిని నిర్బంధించారు. 7సూర్యాపేటలో యోగా పోటీలు మార్చి 2న సూర్యాపేటలో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు యోగా గురువు పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 8లో -
చలో విద్యుత్ సౌధను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్రంలో 23వేల మంది తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని కోరుతూ ఈనెల 20న టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో విద్యుత్ సౌదాను విజయవంతం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ చింత ఎల్లయ్య, జిల్లా చైర్మన్ మేడె మారయ్య పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 132/33కేవీ సబ్స్టేషన్లో చలో విద్యుత్ సౌదా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో నరేందర్, ఎంఎ.రహమాన్, మురహరి, రామస్వామి, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాల పెంపు అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను వారబందీ విధానంలో జిల్లాకు ఇస్తున్న గోదావరి జలాలను సోమవారం పెంచారు. తొలుత 400క్యూసెక్కుల నీటిని మాత్రమే వదలడంతో తూములకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. నీటిని పెంచాలనే రైతుల వినతి మేరకు నీటి పారుదల శాఖ అధికారులు 1,002 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69, 70, 71 డీబీఎంలకు వదులుతున్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని నీటి పారుదల శాఖ బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు. నిరంతరం నిఘా ఉంచాలిభానుపురి (సూర్యాపేట): పెద్దగట్టు జాతర ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. పెద్దగట్టు జాతర నేపథ్యంలో రెండవ రోజు పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరా విజువల్స్ను పరిశీలించి మాట్లాడారు. జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. అనంతరం ప్రత్యేక అధికారులతో కలిసి పలు సెక్టార్లను సందర్శించారు. విద్యుత్, మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, ఆర్డీఓ వేణుమాధవ్ రావు, ఈఓ కుశలయ్య, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేంత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాత సేవ, విశేష పూజలు, హోమం, పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత కల్యాణతంతు పూర్తి చేశారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్శర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. మహాశివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర పూజలు చేపట్టారు. -
ఓ లింగా.. ఓ లింగా..
సూర్యాపేట: ‘ఓ లింగా.. ఓ లింగా..’నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి మంద గంపల ప్రదక్షిణలతో వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలలో పెద్దగట్టుకు చేరుకున్నారు.ఈ సందర్భంగా యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీల చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ ఓ లింగా.. నామస్మరణతో గట్టుపైకి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పూజలు చేశారు. జాతర మొదటిరోజులో భాగంగా సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన ఊరేగింపుగా పెద్దగట్టుకు చేర్చారు. అంతకు ముందు కేసారం గ్రామంలో దేవరపెట్టెలోని దేవతామూర్తులకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి వేర్వేరుగా పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు.రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి కూడా ప్రత్యేక పూజలు చేశారు. కాగా, సోమవారం.. చౌడమ్మతల్లికి బోనాలు సమరి్పంచనున్నారు. జాతర రెండోరోజు అత్యంత ముఖ్యమైన ఘట్టం కావడంతో భక్తులు లక్షల్లో తరలివచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు. ఇదిలా ఉండగా, పెద్దగట్టు జాతర నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు. -
నేడు పెద్దగట్టుకు మంత్రి ఉత్తమ్ రాక
చివ్వెంల: మండలంలోని దురాజ్పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర సందర్భంగా లింగమంతులస్వామి వారిని సోమవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. పార్టీలోని అన్ని స్థాయిల కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు హాజరు కావాలని కోరారు. నేడు విద్యాసంస్థలకు సెలవు : కలెక్టర్భానుపురి (సూర్యాపేట): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం లోకల్ హాలీడేగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. గోదావరి జలాల పునరుద్ధరణఅర్వపల్లి: యాసంగి సీజన్కుగాను వారబందీ విధానంలో జిల్లాకు ఇస్తున్న గోదావరి జలాలను ఆదివారం పునరుద్ధరించారు. అయితే శనివారం విడుదల చేయాల్సి ఉండగా ఒక్కరోజు ఆలస్యంగా వదిలారు. కాగా 400 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుండడంతో చివరి ఆయకట్టుకు అందని పరిస్థితి నెలకొంది. ఈ నీళ్లు తూములకు ఎక్కే అవకాశం లేదని, వెంటనే 1,500 క్యూసెక్కులకు నీటిని పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంంగా ఆలయంలో సుప్రబాతసేవ, విశేష పూజలు, హోమం, పంచామృతాభిషేకం, అర్చనలు చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత కల్యాణతంతు పూర్తిచేసి నీరాజన మంత్ర పుష్ఫాలతోమహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం.. మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో ఆదివారం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా పూజలు, అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు. 26న అఖండ జ్యోతి రథయాత్ర ప్రారంభం భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టనున్న స్వామి వారి అఖండజ్యోతి రథయాత్ర ఈ నెల 26న హైదరాబాద్లోని బర్కత్పురలో గల యాదాద్రి భవనం నుంచి ప్రారంభం కానుందని రథయాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎంపల్ల బుచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట భక్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదగా రథయాత్ర సాగుతుందని, మార్చి1న యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు. అఖండ జ్యోతి రథయాత్రకు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో రథయాత్ర ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి బండారు ఆగమయ్య, గడ్డం జ్ఞానప్రకాష్రెడ్డి, అశోక్, ఉపేందర్, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా..
పట్టణాల్లోని యజమానులు స్థానిక మున్సిపల్ సిబ్బందితో కుమ్మకై ్క ఆస్తి విలువ తక్కువగా చూపించి తక్కువ పన్నులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గతంలోనే మున్సిపల్ పాలకవర్గ సమావేశాల్లో లేవనెత్తాయి. అలాగే వాణిజ్యపరమైన ఆస్తిని నివాస గృహంగా చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఆస్తిని ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లో దీనిని పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆస్తిపన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. -
ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి
నల్లగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలిగే సంతృప్తి మరెందులో రాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పార్కులో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ను కొనసాగిస్తామని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజాదర్బార్కు అధికారులను పిలువలేదని పేర్కొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
జాతరలో పటిష్ట బందోబస్త్ కల్పిస్తున్నాం
చివ్వెంల (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్త్ కల్పిస్తున్నామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. గుట్ట చుట్టూ, పైన భద్రత చర్యలు, పోలీస్ బందోబస్తు, ఎగ్జిబిషన్ రోడ్డు, కోనేరు, వీఐపీ మార్గం, హైవేపై వాహనాల రద్దీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవదర్శనం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్సీ నాగేశ్వర్రావు, డీఎస్పీలు రవి, శ్రీధర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ -
చికెన్ అమ్మకాలు డౌన్
80 శాతం అమ్మకాలు పడిపోయాయి బర్డ్ఫ్లూ ప్రచారంతో చికెన్ అమ్మకాలు 80 శాతం వరకు పడిపోయాయి. ఆదివారం రోజు 1600 కిలోల చికెన్ అమ్ముడు పోయేది. ఇప్పుడు 150 కిలోలు మాత్రమే అమ్ముడు పోయింది. నిన్న, మొన్నటి వరకు కొంతమేర అమ్మకాలు సాగగా.. రిజర్వాయర్లో కోళ్లు తేలడంతో అమ్మకాలు తగ్గడానికి కారణమైంది. – సలీమొద్దీన్, చికెన్ వ్యాపారి, నల్లగొండ నల్లగొండ టూటౌన్: ఆదివారం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కానీ బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ అంటేనే వామ్మో అంటున్నారు. గత పది, పదిహేను రోజుల నుంచి బర్డ్ఫ్లూతో కోళ్లు చనిపోతుండడంతో చికెన్ అంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు ప్రతి ఆదివారం సరాసరిగా 2.80 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ ఈ ఆదివారం ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారం రోజు కేవలం 50వేల కేజీల వరకు చికెన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే మూడింతల అమ్మకాలు పడిపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో 60వేల కేజీల నుంచి 80 వేల కేజీల వరకు అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను పడవేయడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో నల్లగొండ జిల్లాలో చికెన్ అమ్మకాలపై బర్డ్ఫ్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో ఆదివారం రోజున చికెన్ అమ్మకాలు లేక దుకాణాలన్నీ వెలవెలబోయాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బర్డ్ఫ్లూ లేదని ప్రకటించినా చనిపోయిన కోళ్లు రిజర్వాయర్లో ప్రత్యక్షం కావడంతో ఈ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాల్లో నో చికెన్.. ఏ చిన్న ఫంక్షన్ చేసినా చికెన్ ఉండాల్సిందే. పెద్ద శుభకార్యాల్లో అయితే చికెన్తో పలు రకాలుగా వంటలు చేసి పెడుతారు. శనివారం నల్లగొండలో ఫంక్షన్ ఉంటే ఒక అతను 60 కేజీల చికెన్ తీసుకెళ్లాడు. ఫంక్షన్ కు వచ్చిన వారు చికెన్కు దూరంగా ఉన్నారు. 60 కిలోల చికెన్లో కేవలం 6 కేజీల చికెన్ మాత్రమే తినగా ..మిగతా చికెన్ మిగిలిపోయింది. బర్డ్ఫ్లూ ప్రచారంతో ఇటు చికెన్ కొనలేక దాని స్థానంలో మటన్, చేపలు పెట్టాల్సి వస్తుండడంతో ఫంక్షన్లు చేసే వారికి కూడా ఖర్చు భారీగా పెరుగుతోంది. వెలవెలబోతున్న దుకాణాలు ఫ గతంలో ఒక్క ఆదివారమే 2.80లక్షల కేజీలకు పైగా అమ్మకాలు ఫ బర్డ్ఫ్లూ ప్రచారంతో తగ్గిన గిరాకీ ఫ ఆందోళనలో వ్యాపారులువ్యాపారుల ఉపాధిపై ఎఫెక్ట్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోల్సేల్ వ్యాపారులు ఐదారుగురు వర్కర్లను పెట్టుకొని చికెన్ దుకాణాదారులకు అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్ అమ్మకాలు లేకపోవడంతో చికెన్ వ్యాపారులతో పాటు, వాటిల్లో పనిచేసే వర్కర్ల ఉపాఽధిపై కూడా ప్రభావం పడింది. -
లింగమయ్యా.. దీవించయా్య..
విద్యుత్ వెలుగుల్లో లింగమంతులస్వామి ఆలయ పరిసరాలు వైభవంగా గొల్లగట్టు జాతర ప్రారంభం ఫ కేసారంలో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు ఫ అర్ధరాత్రి కాలినడకన పెట్టెను గట్టుకు చేర్చిన భక్తులు ఫ ఆకట్టుకున్న మందగంపల ప్రదక్షిణ చివ్వెంల/సూర్యాపేట టౌన్: గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్ప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం ప్రారంభమైంది. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీల చప్పుళ్లతో సందడి చేశారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలతో పాటు ఇతర వాహనాల్లో యాదవులు, భక్తులు ఆదివారం అర్ధరాత్రికే గట్టుకు చేరుకున్నారు. అర్ధరాత్రి గట్టుకు చేరిన దేవరపెట్టె.. ముందుగా సూర్యాపేట మండలం కేసారంలో ఆదివారం రాత్రి దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గొర్ల గన్నారెడ్డి ఇంటి నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మెంతబోయిన లింగస్వామి ఇంటి నుంచి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవతామూర్తులకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి పూజలు చేశారు. అనంతరం యాదవులు, ఇతర కులాలవారు కాలినడకన దేవరపెట్టెను ఊరేగింపుగా పెద్దగట్టు వద్దకు చేర్చారు. అనంతరం ఆలయానికి పడమటి వైపుఉన్న మెట్ల ద్వారా గొల్లగట్టుపైకి చేరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. మెంతబోయిన, మున్న, గొర్ల వంశస్తులు దేవరపెట్టెకు పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ మందగంపల ప్రదక్షిణ మున్న మెంతబోయిన వంశస్తులకు చెందిన ప్రతి ఇంటి నుంచి మహిళలు మందగంపలతో జాతరకు తరలివచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.నేడు చౌడమ్మకు బోనాలుజాతరలో రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మెంతబోయిన వంశస్తులు తెల్చిన తొలి గొర్రె (తల్లి గొర్రె), మున్న వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డిగొర్ల వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రెను అమ్మవారి ముందు జడత పడుతారు. అనంతరం అమ్మవారికి బలి ఇస్తారు. -
కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి
హుజూర్నగర్ రూరల్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్న కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో ఆదివారం తాజా మాజీ సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి తన తండ్రి అన్నెం వెంకట్రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ను బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి జగదీష్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వివరాలు తెలిపారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపోందడం కోసమే కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్.. ప్రజలందరి మనస్సులో ఉంటారన్నారు. ఈనెల 19న న్విహించనున్న మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రూ.5 లక్షల సొంత ఖర్చుతో ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి దంపతులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సారెడ్డి భాస్కర్రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి పరశురాం, వీరయ్య, శంభిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి హరిలీల, రాజమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
మళ్లీ.. భువన్ సర్వే
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తుల వివరాలను కచ్చితంగా నమోదు చేసేందుకు భువన్ సర్వే మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. గతంలో చాలా వరకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి ఉపగ్రహ ఆధారంగా ఫొటోలు తీయడంతోపాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి ఆస్తుల వివరాలు నమోదు చేస్తారు. దాని ప్రకారం పన్నులు విధించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సర్వే అనంతరం ప్రతి ఆస్తికి సంబంధించి పది అంకెల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తారు. ఈసారి పక్కాగా..ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి పక్కాగా కొలతలు సేకరించి అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం భువన్ యాప్ను తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 2021–2023లో మొదటిసారిగా మున్సిపాలిటీల్లో ఆస్తుల వివరాల నమోదుకు భవన్ సర్వే చేపట్టారు. అనివార్య కారణాలతో అప్పట్లో ఈ సర్వేను నిలిపివేశారు. తాజాగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఈ యాప్లో నిక్షిప్తం చేసేందు మళ్లీ సర్వేకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ సర్వే జరుగనుంది. గతంలో ముఖ్యంగా పట్టణాల్లో మాత్రమే ఈ సర్వే చేశారు. విలీన గ్రామాల్లో సర్వే పూర్తి కాలేదు. ఈసారి మొత్తం వార్డుల్లో సర్వే చేపట్టి ఆస్తుల వివరాలు నమోదు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే ఇళ్ల ట్యాగింగ్ పేరుతో అప్పటి మున్సిపాలిటీలు, వాటి పరిధిలోని ఇళ్లకు సంబంధించిన చిత్రాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం దానిని అనుసంధానం చేసేలా యాప్ రూపొందించారు. తాజాగా మున్సిపాలిటీల్లో సమగ్ర సమాచారం సేకరించి యాప్లో నమోదు చేయనున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలకు అనుమతులు ఉన్నాయా ? లేదా అనే వివరాలు సేకరిస్తారు. ఆస్తి పన్ను ఎంత విస్తీర్ణానికి చెల్లిస్తున్నారు?, వాస్తవ విస్తీర్ణం ఎంతో కొలుస్తారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. మున్సిపాలిటీల్లో పక్కాగా ఆస్తుల వివరాల నమోదుకు చర్యలు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశం నాలుగు నెలల్లో పూర్తికి ప్రణాళిక త్వరలోనే ప్రారంభంకానున్న సర్వేమున్సిపాలిటీ ఇళ్లు, భవనాలుసూర్యాపేట 39,128 కోదాడ 23,572 హుజూర్నగర్ 10,761 తిరుమలగిరి 5,447 నేరేడుచర్ల 5,156 మొత్తం 84,064 -
నారసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
30 ఏళ్ల తర్వాత సంత పునఃప్రారంభం
నాగారం: నాగారం మండల కేంద్రంలో 30 ఏళ్ల క్రితం నిలిచిన వారాంతపు సంత (అంగడి) కాంగ్రెస్ నాయకుల కృషితో తిరిగి శుక్రవారం పునఃప్రారంభమైంది. అప్పట్లో నాగారంబంగ్లా దగ్గర నాటి కలెక్టర్చేతులు మీదుగా ఈ సంత ప్రారంభమై కొద్ది రోజులకే మూతపడింది. ఎట్టకేలకు సంత పునఃప్రారంభం కావడంతో చిరు వ్యాపారులు, రైతులు వివిధ రకాల వస్తువులు, కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మంగదుడ్ల దశరథ, నాయకులు చిప్పలపల్లి మల్సూర్, జాజుల వీరయ్య, కడారి సోమయ్య, కన్నెబోయిన లింగమల్లు, చిప్పలపెల్లి ఉపేందర్, ఆకారపు కిష్టయ్య, చంద్రశేఖర్, శివ, మహిళలు, వ్యాపారులు పాల్గొన్నారు.నడిగూడెంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలినడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేయాలని పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే అత్యధికంగా నిమ్మ సాగు నడిగూడెం మండలంలోనే ఉన్నదన్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక ఇతర జిల్లాలకు వెళ్లి నిమ్మ పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, ఈ క్రమంలో రవాణా చార్జీల భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగూడెంలో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేస్తే నడిగూడెం మండలంతో పాటు, మోతె, మునగాల రైతులకు కూడా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గడువులోగా సీఎంఆర్ అప్పగించాలిభానుపురి(సూర్యాపేట): యాసంగి– 2023– 24, 2024–25 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలను గడువులోగా ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డీఎస్ఓ రాజేశ్వర్, డీఎం ప్రసాద్, డీటీలు, ఆర్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాఠ్య ప్రణాళిక మండలి అధ్యక్షుడిగా బెల్లి యాదయ్యనల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్య ప్రణాళికా మండలి అధ్యక్షుడిగా అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్గా అరుణ ప్రియ నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్(ఈఎల్టీఎస్) డైరెక్టర్గా నియమిస్తూ రిజిస్ట్రార్ అలువాల రవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. స్కాలర్షిప్లు విడుదల చేసే వరకు పోరాడుతాం నల్లగొండ టౌన్: స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు పోరాడుతామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్షిప్లు రాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, కుంచం, కావ్య, స్పందన సిరి పాల్గొన్నారు. -
దురాజ్పల్లి జాతరకు అంతా సిద్ధం
చివ్వెంల(సూర్యాపేట): దురాజ్పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దగట్టు వద్ద జాతర పనులు పరిశీలించారు. అనంతరం గట్టుపైన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 16 నుంచి 20 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బందోబస్త్కు 2 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. మూడు షిఫ్టుల్లో 90 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఐదు రోజుల పాటు విధులు నిర్వహిస్తారన్నారు. మరో 37 మంది అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. లైటింగ్, తాగునీటి సౌకర్యంతోపాటు ఎనిమిది చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు అంబులెన్స్లు, మూడు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఐదురోజుల పాటు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తిన జాతర నోడల్ అధికారి ఆర్డీఓ వేణుమాదవ్కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, సీపీఓ ఎల్.కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డీఎస్పీ రవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, ఈఓ కుశలయ్య, ఇంట్రా ఈఈ శ్రీనివాస్రావు, గ్రిడ్ ఈఈ కర్ణాకర్రెడ్డి, విద్యుత్ శాఖ అధికారి పాల్రాజ్, ఏడీఈ రాముల నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పెద్దగట్టు ముస్తాబు
రేపటి నుంచి దురాజ్పల్లి శ్రీలింగమంతులస్వామి జాతర జాతరకు 60 ప్రత్యేక బస్సులు భానుపురి (సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న తెల్లవారుజామున ప్రారంభమై ఈనెల 20 వరకు జాతర కొనసాగనుందని, ఈ ఐదు రోజుల పాటు ఈ బస్సుల ద్వారా జాతరకు ప్రయాణికులను చేరవేస్తాయని పేర్కొన్నారు. సూర్యాపేట నుంచి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల 16 నుంచి 20 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధశాఖలకు కేటాయించిన పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆలయాన్ని రంగులతో ముసాబు చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం నుంచి జాతర ప్రారంభం కానుండడంతో ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలు వెలుస్తున్నాయి. భక్తుల కోసం జాయింట్ వీల్ (రంగుల రాట్నం), బ్రేక్ డ్యాన్స్, సర్కస్, హంస వాహనం, ఎగ్జిబిషన్ తదితర వినోద శాలలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం సౌకర్యాలు.. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ భగీరథ విభాగం ద్వారా తాగునీరు అందించేందుకు 14 ప్రదేశాల్లో నల్లాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయంతోపాటు పరిసరాల చుట్టూ 66 సీసీ కెమెరాలు అమర్చారు. చెరువు కట్టపై నడిచే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుతురు కోసం హైమాస్ట్ లైట్లు బిగించారు. తప్పి పోయిన చిన్నారులకు ప్రత్యేక శిబిరంతోపాటు భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణకు చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. వివిధ పనులకు నిధుల కేటాయింపు ఇలా.. జాతర నిర్వహణకు ప్రభుత్వం 70 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దానిని చదును చేయించింది. ఇతర అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఈసారి గుట్టపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, గుట్టకింద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గుట్ట చుట్టూ హైమాస్ట్, టవర్ లైట్లకు రూ.35 లక్షలు కేటాయించారు. అలాగే జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు బారికేడ్ల నిర్మాణానికి రూ.12 లక్షలు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుకు రూ.12 లక్షల నిధులు కేటాయించారు. ఇవేకాక, చెత్త తొలగింపునకు రూ.25 లక్షలు, నేల చదునుకు రూ.10 లక్షలు, ఆలయం చుట్టూ చెట్ల పొదలు తొలగించేందుకు రూ.8లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.3లక్షలు, నీటి ట్యాంకర్ల కోసం రూ.5లక్షలు, గల్ఫర్ ద్వారా బుదర తరలించేందుకు రూ.4లక్షలు, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.5లక్షలు, జాతర స్టోర్ డస్ట్కు రూ.5 లక్షలు, గ్రావెల్ కోసం రూ.5లక్షలు కేటాయించారు. సీసీ కెమెరాలు, సోలార్ లైట్ల మరమ్మతులకు రూ.5లక్షలు, స్నానాలు చేసేచోట ప్లాట్ఫామ్, పైపులైన్ ఏర్పాటుకు రూ.9.30 లక్షలు, నీటి మోటార్స్, సింథటిక్ ట్యాంక్స్, హెచ్డీపీఓ పైపులైన్ కోసం రూ.5లక్షలు, కోనేరులో శివుడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు రూ.3 లక్షలు, నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.ఫ అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఫ రంగులతో రూపుదిద్దుకున్న ఆలయం, సింహద్వారం ఫ ఆలయం చుట్టూ చలువ పందిర్లు ఫ పరిసరాల్లో వెలుస్తున్న దుకాణాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు జాతర నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, లైటింగ్, సివిల్ పనులు చేయించాం. జాతర ముగిసే వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం. – బోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట -
ఎంజీయూలో సమూల మార్పులు
యూనివర్సిటీలో సమయ పాలన కఠినంగా అమలు చేస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకుల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా ఉండాల్సిందే. విద్యార్థుల హాజరు శాతం కూడా 75 శాతం ఉండాలి. ఏదైనా కారణం చేత తరగతులకు హాజరు కాకపోతే కనీసం 65 శాతం ఉండాల్సిందే. మరో 10 శాతానికి డాక్టర్ సర్టిఫికెట్ కూడా తేవాల్సి ఉంటుంది. కొందరు కాలేజీకి డుమ్మా కొట్టడంతో 25 శాతం కూడా లేదు. అటువంటి వారు 63 మంది డిటెన్షన్ అయ్యారు. కచ్చితంగా హాజరు శాతాన్ని, కాలేజీ పనివేళలు అమలు చేస్తుండడంతో మెరుగైన ఉత్తీర్ణత రానుంది. కొత్త కోర్సులకు నిర్ణయం యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ భవనం నిర్మించనున్నాం. కొత్తగా 56 ప్రోగ్రామ్ కోర్సులను తీసుకువచ్చేందుకు ఇప్పటికే డిజైన్ చేశాం. ప్రతి డిపార్మెంట్లో రెండు కోర్సులకు తగ్గకుండా కొత్త కోర్సులు తీసుకొస్తాం. లైబ్రరీని వారంలో రెండు రోజులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నడిపించనున్నాం. అక్కడ విద్యార్థులకు క్రెడిట్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఇంటర్న్షిప్ కోసం ఒక డైరెక్టర్ను కూడా నియమించాం. కంపెనీలతో మాట్లాడి విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పని వేళలు సీరియస్గా అమలు చేస్తున్నాం విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాల్సిందే మెస్ బిల్లు రూ.2200లకు తగ్గించాం రూ.322 కోట్లతో కొత్త భవనాల నిర్మాణాలకు డీపీఆర్ రూపొందించాం ‘సాక్షి’తో ఎంజీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
డీసీసీబీ, పీఏసీఎస్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కిందట (2020 ఫిబ్రవరి 15వ తేదీన) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. పాలక వర్గాల గడువు శుక్రవారం నాటితో (ఈనెల 15వ తేదీతో) ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం జీవో 74 జారీ చేశారు. గతేడాదే మారిన డీసీసీబీ చైర్మన్ ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్లు ఉన్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం 2020 ఫిబ్రవరి 29న ఎన్నికై ంది. బీఆర్ఎస్కు చెందిన గొంగిడి మహేందర్రెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనపై 2024 జూన్ 28న అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి గత ఏడాది జూలై 1వ తేదీన చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి మరో ఆరు నెలలుపాటు కొనసాగనున్నారు. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు. ఫ ఆరు నెలల పాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లా పీఏసీఎస్లు నల్లగొండ 42సూర్యాపేట 44యాదాద్రి 21 మొత్తం 107 రైతులకు సేవలందించేందుకు మరో అవకాశం రైతులకు మరో ఆరు నెలలు సేవలు అందించే అవకాశం లభించింది. పదవీ కాలం పొడగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ -
టెన్త్ ఇంటర్నల్ మార్కులపై ఆరా!
ఒక్కో బృందానికి పది పాఠశాలలు పాఠశాలల తనిఖీకి 35 బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో జీహెచ్ఎం గాని ఎఫ్ఏసీ హెచ్ఎం గాని, ఒక లాంగ్వేజ్ పండిట్, మరో నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మరో ఇద్దరు చొప్పున ఐదుగురు సభ్యులు ఉంటాడు. ఒక్కో బృందానికి 7 నుంచి 10 పాఠశాలల బాధ్యతలను అప్పగించారు. మార్చి మొదటి వారంలో ఫ్రీఫైనల్ పరీక్షలు ఉన్నందున ఈ నెల 20లోపు ఈ తనిఖీ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్లో ఇంటర్నల్ మార్కులు నమోదు చేస్తారు. చిలుకూరు: పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల నమోదుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్నల్ మార్కుల నమోదు విషయంలో పాఠశాలల ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వేస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికితోడు వచ్చేనెల (మార్చి) 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నందున శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని పరీక్షల విభాగాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. వాస్తవాల పరిశీలనకే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా.. లేదా ఇష్టానుసారంగా నమోదు చేశారా.. అలాగే విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్, చేతిరాత, ఎఫ్ఏలలో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నాయి. వివిధ అంశాలను చూసి లోపాలుంటే వాటిని సరిచేసిన తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రతి సజెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మెటివ్ అసెన్మెంట్ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. దీంట్లో భాగంగా శుక్రవారం చిలుకూరు జెడ్పీహెచ్తోపాటు వివిధ పాఠశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు కొనసాగాయి. ఫ ఇష్టానుసారంగా మార్కులు వేయకుండా కట్టడి ఫ క్షేత్రస్థాయిలో తనిఖీలకు 35 బృందాలు ఫ జిల్లాలో 355 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు 184ప్రైవేట్ పాఠశాలలు 121కేజీబీవీలు, గురుకులాలు 50మొత్తం విద్యార్థులు 11,912 -
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు, విశేష పూజలు కొనసాగాయి. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామిని పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత నిత్య కల్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.13.08 లక్షలు మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. గతనవంబర్ 22నుంచి గురు వారంవరకు హుండీల ద్వారా రూ.12,72,342, అన్నదానం హుండీ ద్వారా రూ.36,460లతో కలిపి మొత్తం రూ.13,08,802 ఆదాయం సమకూరింది. కొబ్బరి చిప్పల సేకరణకు నిర్వహించిన వేలానికి రూ.2,45,000 ఆదాయం వచ్చిందని, ఈ వేలాన్ని ఏపీకి చెందిన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన బి.అంజిరెడ్డి కై వసం చేసుకున్నట్లు ఈఓ పేర్కొన్నారు. -
మా భావాలు కలిశాయి
ప్రేమ వివాహాలతో అంతరాలు తొలగుతాయి ఇద్దరం అట్టడుగు వర్గాల పక్షాన పోరాడే సంస్థల్లో పనిచేశాం. నాది కొడంగల్ కాగా, నా భర్త వెంకటేశ్వర్లు పురం న్యాయవాది. ఆయనది నల్లగొండ పట్టణం బీటీఎస్. నేను మొదట అరుణోదయ సంస్థలో పని చేయగా, నా భర్త పీడీఎస్యూలో పని చేసేవారు. మా ఇద్దరి భావాలు, భావజాలం ఒక్కటే కావడంతో ఒకరినొకరం ఇష్ట పడ్డాం. ప్రేమించుకున్న నాలుగేళ్ల తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2018లో దగ్గరి బందువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టేజీ మీద దండలు మార్చుకొని ఒక్కటయ్యాం. కులం, మతం లాంటి అంతరాలు పోవాలంటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు అభ్యంతరాలు చెప్పినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. – అనితాకుమారి, లెక్చరర్, ఎంజీ యూనివర్సిటీ తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు మనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలకు పంపుతున్నారు. వాళ్ల ఆశలను నీరుగార్చుకుండా ఏకాగ్రతతో చదవుకొని ఉద్యోగం సాధించాలనే తప్పన పెట్టుకోవాలి. తల్లిదండ్రుల కుదుర్చిన పెళ్లి చేసుకోవాలి. –ప్రశాంతి, విద్యార్థినిఫ మా కుటుంబాలు ఒప్పుకున్నాయి ఫ మేము పనిచేసే ఉద్యమ సంస్థే మా పెళ్లి చేసింది ఫ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏ సమస్యా ఉండదు ఫ జీవితంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి ‘సాక్షి’తో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు నకిరేకల్: ‘మేము విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేశాం. మా ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నాం. మా కులాలు వేరైనా ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో మా పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఆనాడు మేము పనిచేస్తున్న ఉద్యమ సంస్థే మాపెళ్లి జరిపించింది. ప్రేమిస్తే.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అని చెబుతున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించగా.. ప్రేమ, పెళ్లిపై వారి మనోగతాన్ని వెల్లడించారు. ఒక విజన్ ఉండాలి పెళ్లి అనేది.. ఇద్దరి మనస్సులు, వ్యక్తిత్వాలు, రెండు జీవితాలు.. భవిష్యత్కు సంబంధించిన నిర్ణయం. ప్రేమ అంటే మానవీయ విలువలతో పాటు కుల మతాలకతీతంగా రెండు మనస్సులు కలిసి కడదాకా బాధ్యతలను పంచుకుని కలిసి సాగడం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహలు చేసుకునే వారు భవిష్యత్ సంబంధించి ఒక విజన్ ఏర్పరుచుకోవాలి. జీవితంపై ఒక స్పష్టత ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. తాత్కాలిక ఎమోషన్తో నిర్ణయాలు తీసుకుంటే.. అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రేమ, పెళ్లికి ముందు.. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు, అలవాట్లు, అభిరుచులు, ఆలోచన ధోరణి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే జీవనం సాఫీగా సాగుతుంది. భరోసా కల్పించాలని హైకోర్టు ఆదేశంచివ్వెంల(సూర్యాపేట) : పరువు హత్యకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన మాలబంటి అలియాస్ కృష్ణ కుటుంబాన్ని మూడు వారాల్లో కలెక్టర్, ఎస్పీ కలిసి భరోసా కల్పించాలని గురువారం హైకోర్టు ఆదేశించినట్లు హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్ తెలిపారు. తమకు న్యాయం జరగడం లేదంటూ మాలబంటి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.జీవితంపై స్పష్టత అవసరం ప్రేమించడం, ప్రేమించబడడం, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోడడం తప్పు కాదు. సమాజంలో ఉండే కులాలు, కుటుంబాలు, భార్యభర్తలు మధ్య ఉండే వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. కులాంతర వివాహమైనా.. కులంలో పెళ్లి అయినా ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల సహకారంతో చేసుకునే పెళ్లిళ్లకు సహకారం, నిబద్దత ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఇరువురు.. ఒక అవగాహనతో ప్రేమ, జీవితంపై స్పష్టతతో పెళ్లి చేసుకున్నా.. హ్యపీగా ఉండొచ్చు. -
పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన
చివ్వెంల(సూర్యాపేట) : ఎస్సారెస్సీ కాలువ ద్వారా నీటిని వదిలి తమను ఆదుకోవాలని కోరుతూ పురుగుల మందు డబ్బా పట్టకుని ఓ రైతు పొలంలో నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. కుడకుడ గ్రామానికి చెందిన వేములకొండ లక్ష్మయ్య తన 12 ఎకరాల వ్యవసాయ భూమిలో రూ.2 లక్షల వ్యయంతో వరి సాగు చేశాడు. అదేవిధంగా ఎస్సారెస్పీ కాలువ దగ్గర నుంచి ఉన్న పిల్ల కాలువను సొంత ఖర్చులతో బాగు చేశాడు. అయితే 15 రోజులుగా కాలువ నీరు రాకపోవడంతో సగానికి పైగా పొలం ఎండిపోయింది. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో పురుగుల మందు డబ్బా పట్టుకుని పొలంలో నిరసన వ్యక్తం చేశాడు. గమనించిన ఇరుగుపొరుగు రైతులు లక్ష్మయ్యకు సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి ఎస్పారెస్పీ కింద వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. -
ఫైన్ విధిస్తున్నా.. మారట్లే!
సూర్యాపేట టౌన్, తిరుమలగిరి (తుంగతుర్తి) : జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు నెత్తురోడుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు చెబుతున్నా కొందరు వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు పంపి జైలుశిక్ష పడేలా చేస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువమార్లు పట్టుబడిన వారి లైసెన్స్లు రద్దు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. పాయింట్ల ఆధారంగా శిక్షడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పాయింట్ల ఆధారంగా శిక్ష వేస్తారు. 2024 జనవరి నుంచి గత డిసెంబర్ వరకు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 12,940 నమోదు కాగా, రూ.66,97,500 జరిమానా విధించారు. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,350 కేసులు నమోదయ్యాయి. అందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్రీతింగ్ అనలైజర్ యంత్రాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆల్కహాల్ శాతం 30 కంటే ఎక్కువ ఉంటే మద్యం తాగినట్లుగా నిర్ధారించి కేసులు నమోదు చేస్తున్నారు. 100 పాయింట్లు దాటితే వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసులో శిక్షపడిన తర్వాత దానిని తిరిగి అప్పగిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో యువతే ఎక్కువగా పోలీసులకు పట్టుబడుతున్నారు. బీమా సైతం వర్తించదు.. మద్యం తాగి వాహనం నడపడం నేరమైనా కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారు ఇకపై వాహన బీమా ప్రయోజనాలు పొందలేరు. మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసులు నమోదై రుజువై అనర్హులుగా గుర్తింపు పొందుతారు. ఈ క్రమంలో ఇటీవల ప్రమాదాలు జరిగిన వెంటనే వాహనదారుల నుంచి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ఒకవేళ చనిపోతే జీర్ణాశయం నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు శాసీ్త్రయంగా రుజువైతే బీఎన్ఎస్ సెక్షన్ 185 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా..రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అవగాహన పోలీస్, రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు విస్త్రృతంగా నిర్వహించినా వాహనదారుల తీరు మారడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వచ్చే విద్యార్థులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న యువత తరచూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుకుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం మద్యం తాగి వాహనాలు నడపడం నేరం. తనిఖీల్లో పట్టుబడితే రెండు రోజుల నుంచి నెలవరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. తనిఖీల్లో పట్టుబడిన వారికి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నాం. – సన్ప్రీత్ సింగ్, ఎస్పీ, సూర్యాపేట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..2023 22,875 2024 12,940 2025 1,350 తప్పిదాలు ఇవే.. హెల్మెట్ ధరించకపోవడం ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లడం మద్యం తాగి వాహనం నడపడం మైనర్లు వాహనాలు నడపడం ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం అతి వేగం నంబర్ ప్లేట్ మార్చడం సరియైన పత్రాలు లేకపోవడం -
అభివృద్ధి పనుల పరిశీలన
నాగారం : శివరాత్రి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన నాగారం మండల కేంద్రంలోని శివాలయం వద్ద సొంత ఖర్చులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 26న జరిగే శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి రహదారి, భక్తులకు నీటి సౌకర్యం కల్పించడానికి వాటర్ ట్యాంక్, పైప్లైన్, ఆలయానికి మెట్లు నిర్మిస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు గుండగాని అంబయ్యగౌడ్, కూరం వెంకన్న, కత్తుల వెంకన్న, కన్నెబోయిన కుమార్, చిప్పలపల్లి మల్లేష్, బాలమణి, బొబ్బలి లింగమల్లు, మల్లయ్య, సంజీవ, కృష్ణ, బాలస్వామి, అంజయ్య, చింటూ పాల్గొన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలిహుజూర్నగర్ : గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 నియోజకవర్గాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, అన్నింటిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రభారీ ఆర్ రుక్మారావు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చల్లా శ్రీలత, టీచర్స్ ఎమ్మెల్సీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ బాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన పంటలు తెచ్చి మద్దతు ధర పొందాలి భానుపురి (సూర్యాపేట) : రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి ప్రభుత్వం అందిచే మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకుడు అజ్మీరా రాజు అన్నారు. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన సందర్శించి మాట్లాడారు. పంటలను కోసిన తర్వాత ఆరబెట్టడంతోపాటు శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో కొనసాగుతున్న కందులు, ఇతర పంటల కొనుగోళ్లను పరిశీలించారు. రైతులు, మార్కెట్ సిబ్బంది, వ్యాపారులతో మాట్లాడి పంటల రకాలు, మద్దతు ధర, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్కు ప్రస్తుతం అధికంగా వస్తున్న కందులకు మద్దతు ధర అందడం లేదని గుర్తించి వివరాలు సేకరించారు. మిషన్ల ద్వారా కోయడం వల్ల తేమశాతం, గింజ పగిలి ఉండడంతో వ్యాపారులు ధర పెట్టడం లేదని అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్కుమార్ పాల్గొన్నారు. 16న కబడ్డీ క్రీడాకారుల ఎంపిక గరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం గ్రామంలో సబ్ జూనియర్ జిల్లాస్థాయి బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ కర్తయ్య, కబడ్డీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు నరేష్గౌడ్ గురువారం తెలిపారు. ఈ నెల 16న రాయినిగూడెం గ్రామంలోని పాఠశాల క్రీడా మైదానంలో సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ జిల్లా సెలక్షన్స్ జరుగుతాయని ఇందులో పాల్గొనే క్రీడాకారులు 16 సంవత్సరాల లోపు ఉండి 55 కిలోల బరువు గల వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, పదో తరగతి మెమో, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో జరగనున్న 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
పంటలు ఎండుతున్నా..పట్టదా?
కరెంట్ కోతలతో పంట పొలాలు ఎండుతున్నా మంత్రులకు పట్టడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.ముగిసిన బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి.- 8లోఉమ్మడి జిల్లాలో 100 మంది యువతులు, 100 మంది యువకులనుపలకరించగా.. వారు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ప్రేమ పెళ్లి -
ఎమ్మెల్సీ బరిలో 19 మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 19 అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 19 మంది మధ్య పోటీ కొనసాగనుంది. బరిలోఉండే వారు తేలడంతో నేటి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. మొత్తం 23 నామినేషన్లు దాఖలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 3వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 10 తేదీన ముగిసింది. మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 11వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఒక అభ్యర్థి ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది నామినేషన్లను ఆమోదించారు. 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు కావడంతో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారిలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన బండారు నాగరాజు, కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన జి. కోటిరెడ్డి ఉన్నారు. మిగిలింది ప్రచారమే.. ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్లు, ఉపసంహరణలు పూర్తికావడంతో బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలిపోయింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నేటి నుంచి ప్రచారం ముమ్మరం కానుంది. పోలింగ్ ఈ నెల 27వ తేదీన జరుగనుంది. పోలింగ్కు రెండు రోజుల ముందే ప్రచారం బంద్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. సాధారణ ఎన్నికల తరహాలో ఎక్కడికక్కడ కళాశాలలు, సంఘాల వారీగా దావత్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తమ గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు.ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఫ ఇక జోరుగా సాగనున్న ప్రచారం ఫ టీచర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులు.. అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఎస్.సుందర్రాజు, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు. -
సంతోష్బాబును స్ఫూర్తిగా తీసుకోవాలి
సూర్యాపేటటౌన్ : మహావీర చక్ర కల్నల్ సంతోష్బాబును యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సంతోష్బాబు సతీమణి బిక్కుమల్ల సంతోషి అన్నారు. గురువారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోష్ బాబు 42వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ప్రారంభించారు. పేదలకు అన్నదానం చేశారు. అనంతరం సంతోషి మాట్లాడుతూ కల్నల్ సంతోష్బాబు ఆశయాలను నెరవేర్చడానికి ముందుంటామని వాసవి క్లబ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోట శ్యాంప్రసాద్, వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రటరీ యామా సంతోష్, యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ, వాసవి క్లబ్ అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్, సింగిరికొండ రవీందర్, పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, పబ్బతి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలు ఎండుతున్నా మంత్రులకు పట్టదా?
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో కరెంట్ కోతలతో నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గురువారం జనగామ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ కొద్దిసేపు భువనగిరిలోని వివేరా హోటల్లో ఆగారు. అక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆలేరు, భువనగిరికి కేసిఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని గుర్తుచేశారు. విద్యుత్ సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్ప్లాంటు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమీషన్లపై దృష్టి కేంద్రీకరించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉన్న అధిక సంతానం నిబంధన ఎత్తివేయాలన్నారు. చాలా రాష్ట్రాల్లో ముగ్గురు పిల్లల నిబంధన తొలగించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోవాలన్నారు. విద్య, ఉపాధి రాజకీయ రంగాల్లో వేర్వేరుగా మూడు బిల్లులు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాత్మకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోతుందన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా.. సీఎం రేవంత్ వణికిపోతున్నారన్నారు. కవిత వెంట మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, నాయకులు క్యామ మల్లేష్, బీరు మల్లయ్య, అనురాధ, శ్రీశైలం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ -
అప్పు తీర్చేందుకు వృద్ధురాలి హత్య●
● నిందితుడి అరెస్ట్ భువనగిరి: వృద్ధురాలిని హత్య చేసి పుస్తెలతాడు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధిలో నివాసముంటున్న తునికి మణెమ్మ(80)కు జనగామ జిల్లాకు చెందిన పుల్లెంగుల శంకర్ బంధువు అవుతాడు. శంకర్ అప్పుడప్పుడు మణెమ్మ ఇంటికి వచ్చేవాడు. అప్పులపాలైన శంకర్ వాటిని తీర్చేందుకు ఒంటరిగా ఉంటున్న మణెమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడును దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం జనగామ నుంచి ఆలేరు పట్టణాకి వచ్చి మధ్యాహ్నం మణెమ్మ ఇంటికి వెళ్లి గొంతు నులిమి చంపేసి ఆమె మెడలోని పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. మృతురాలి కుమారుడు రామారావు ఫిర్యాదు మేరకు ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఆలేరు పట్టణంలో యాదగిరిగుట్ట సీఐ కొండల్రావు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కారులో అటుగా వస్తున్న శంకర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా.. మణెమ్మను తానే హత్య చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. రెండున్నర తులాల పుస్తెలతాడు, కారు, సెల్ఫోన్, రూ.5,720 నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. సీఐతో పాటు ఎస్ఐ రజనీకర్, సిబ్బంది సత్యనారాయణ, చంద్రశేఖర్, మహేష్ డీసీపీ అభినందించారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి భద్రాచలంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారని చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకోగా రూ.3లక్షల విలువైన 2.080 కేజీల గంజాయి లభించిందని, నిందితులు నల్లగొండకు చెందిన ముంత నవీన్, నగరికంటి సుభాష్గా తేలిందని వెల్లడించారు. వీరిద్దరు ఒడిశా నుంచి నల్లగొండకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు, గంజాయి, ద్విచక్ర వాహనాన్ని భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. తనిఖీల్లో సిబ్బంది బాలు, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నారు. వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు అపహరణ పెన్పహాడ్: వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోసపహాడ్ గ్రామానికి చెందిన కీత పిచ్చమ్మ తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా.. సాగర్ ఎడమ కాల్వ కట్టపై బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టి మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీ మృతి రామన్నపేట: పని ప్రదేశంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతిచెందింది. ఈ ఘటన రామన్నపేట మండల కేంద్రంలో గురువారం జరిగింది. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన శ్యామల లింగమ్మ(55) గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఉపాధి హామీ పథకంలో కింద పనిచేసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పని ప్రదేశంలో కిందపడిపోయింది. సహచర కూలీలు గమనించి స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్కు విషయం తెలిపారు. 108 వాహనంలో రామన్నపేట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 128 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నల్లగొండ: అక్రమంగా నిల్వ ఉంచిన 128 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ టూటౌన్ ఎస్ఐ నాగరాజు గురువారం పేర్కొన్నారు. నల్లగొండలోని పానగల్ వడ్డెరవాడకు చెందిన కర్ర రమేష్ చుట్టుపక్కల గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసి రమేష్ ఇంట్లో 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అదేవిధంగా శ్రీరాంనగర్లోని డాన్ స్కూల్ సమీపంలో సాయి ఆంజనేయ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 117 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
చేనేత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
● సహకార్ భారతి ఆలిండియా చేనేత విభాగం అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రాభూదాన్పోచంపల్లి: చేనేత సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సహకార్ భారతి ఆలిండియా చేనేత విభాగం అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా పేర్కొన్నారు. గురువారం భూదాన్పోచంపల్లిలో రాష్ట్ర చేనేత సహకార్ భారతి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చేనేత పని ఒక్కరితో పూర్తికాదని, సమష్టి కృషితోనే అందమైన చీర తయారవుతుందని చెప్పారు. ఎంతో నైపుణ్యం కల్గిన చేనేత కార్మికులకు తగిన గుర్తింపు దక్కడం లేదని, సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. వీరి సురక్షిత జీవనానికి ప్రభుత్వాలు వెంటనే పూనుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సహకార్ భారతి కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంఘటిత ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహకార్ భారతి రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, బీజెపీ చేనేతసెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, చేనేతకార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, మాజీ సర్పంచ్ నోముల గణేశ్, చేనేతనాయకులు ఏలే భిక్షపతి, రుద్ర శ్రీశైలం, రుద్ర చెన్నకేశవులు, కడవేరు శేఖర్, ఏలే శ్రీనివాస్, గొలనుకొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య రాజాపేట: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపురం గ్రామానికి బిట్ల రమేష్కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రమేష్ కుటుంబ సభ్యులంతా కలిసి స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ హోటల్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ పెద్ద కుమారుడు బిట్ల పవన్(25) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విదేశీ, స్వదేశీ సంప్రదాయంలో పెళ్లి..
మోత్కూరు: ఖండాంతరాలు దాటిన ప్రేమ మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్కుమార్తో అమెరికాకు చెందిన మరియడిలారోసా ఆర్మాండోహెర్నాండెజ్ దంపతుల చిన్న కూతురు ఎలేనా (అవని)తో ఏడాది క్రితం అమెరికాలో వివాహం జరిగింది. సందీప్కుమార్ పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి మాస్టర్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అనంతరం టెక్సాస్ రాష్ట్రంలో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఎలేనా అదే కంపెనీలో మేనేజర్గా పని చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు అంగీకరించడంతో ఏడాది క్రితం అమెరికా సంప్రదాయం ప్రకారం అక్కడ వీరు ఇరువురు పెళ్లి చేసుకొని దంపతులయ్యారు. సందీప్కుమార్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ నెల 7న ఘట్కేసర్లోని రాక్ఎన్క్లేవ్ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం సందీప్కుమార్, ఎలేనా మరోసారి పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదం పొందారు. -
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ప్రాజెక్టుల ఎంపిక
రామగిరి(నల్లగొండ): డిగ్రీ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఏటా రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలను నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు కొన్ని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ● నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి హిస్టరీ సబ్జెక్టులో హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ నల్లగొండ టౌన్, ఫిజిక్స్ సబ్జెక్టులో అగ్రికల్చర వీడర్ ● నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల నుంచి బోటనీ సబ్జెక్టు నుంచి ఏ కంపారిటీవ్ స్టడీ ఆన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆర్డానిక్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆన్ ది న్యూట్రిషినల్ కంపోజిషన్ ఆఫ్ సెలక్టెడ్ వెజిటేబుల్స్, కామర్స్ సబ్జెక్టులో ఎక్సోఫ్లోరింగ్ టూరిజమ్ పోటెన్షియల్ ఇన్ నల్లగొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏ కంప్రహెన్సివ్ స్టడీ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ● మిర్యాలగూడలోని కేఎన్ఎం డిగ్రీ కళాశాల నుంచి మాథ్స్ సబ్జెక్టులో ది రోల్ ఆఫ్ మేథమెటిక్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ● దేవరకొండలోని ఎంకేఆర్ కళాశాల నుంచి మాథ్స్ సబ్జెకులో ఎసెన్షియల్ మాథమెటిక్స ఫర్ ఇన్వేష్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో ఏ కేస్ స్డడీ ఆన్ ఎలక్ట్రోరల్ రీఫామ్స్ ఇన్ తెలంగాణ నీడ్స్, ఇష్సూస్ అండ్ ఛాలెంజెస్ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ● సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల నుంచి ఎకనామిక్స్ సబ్జెక్టులో ఇంపాక్ట్ ఆఫ్ లేబర్ మైగ్రేషన్ ఆన్ అగ్రికల్చర్ డ్యూ టు కోవిడ్ 19 ఏ కేస్ స్టడీ ఇన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ, ఫిజిక్స్ సబ్జెక్టులో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ రీసోర్సెస్. ● హుజూర్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి తెలుగు సబ్జెక్టులో రూపొందించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ● యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఫిజిక్స్ సబ్జెక్టులో యూజెస్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఏ స్పెషియల్ రెఫరెన్స్ టు అగ్రికల్చర్, తెలుగు సబ్జెక్టులో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య జీవితం సాహిత్యంపై రూపొందించిన ప్రొజెక్టులు ఎంపికయ్యాయి. త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. -
ముగిసిన పూర్వగిరీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట రూరల్: పూర్వగిరి లక్ష్మీనరసింహాస్వామి (పాతగుట్ట) ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. స్వామివారికి ఆలయ ముఖ మండపంలో 108 కలశాలను వరుస క్రమంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి, అష్టోత్తర శతఘటాభిషేక వేడుకను నిర్వహించారు. అనంతరం ఆ జలంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు, ఏఈఓలు జూషెట్టి కృష్ణగౌడ్, గజవెల్లి రమేష్, బాబు, రఘు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి అర్జిత సేవలు పునరుద్ధరణ బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నెల 3వ తేదీ నుంచి రద్దైన అర్జిత సేవలు, నిత్య, శాశ్వత కల్యాణాలు, సుదర్శన నారసింహా హోమాలు వంటి పూజలు శుక్రవారం నుంచి యధావిథిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. చివరిరోజు ఘనంగా శతఘటాభిషేకం -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
ఫ ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు ఫ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు ఫ నేడు ప్రేమికుల దినోత్సవం చిట్యాల: చిట్యాల మండలానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకుని తమ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమళ్ల మహేందర్రెడ్డి–ప్రేమలత దంపతుల కుమారుడు రాజీవ్రెడ్డి.. యూకేలోని మాంచెస్టర్కు చెందిన కే.ఫిషర్–డేవ్ ఫిషర్ దంపతుల కూతురు లారెన్ ఫిషర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజీవ్రెడ్డి యూకేలోని మాంచెస్టర్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును చదువుకునేందుకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పోలీస్శాఖలో (సైకాలజీ విభాగం) పనిచేస్తున్న లారెన్ ఫిషర్తో పరిచయం ఏర్పడి ప్రేమ మొదలయ్యింది. దీంతో వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఇటీవల హైదరాబాద్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అలాగే గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన సీమ సాలయ్య–యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే సంస్థలో ఇండోనేషియాలో పనిచేస్తున్న ఆ దేశానికి చెందిన యువతి రిజ్కినన్ డానఫిట్రి పనిచేస్తుంది. వీరికి మొదట్లో మొబైల్ కాల్తో పరిచయమైంది. అనంతరం ఆ యువతి ఉద్యోగ నిర్వహణలో భాగంగా హైదరాబాద్కు రావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించి గత నెలలో గుండ్రాంపల్లి గ్రామంలో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడబ్బాయిలు.. విదేశీ అమ్మాయిలు -
ఆటో డ్రైవర్కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): నిర్లక్ష్యంగా ఆటో నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్కు 8 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా మూడో అదనపు జడ్జి డి. దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. ప్రొసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 నవంబర్ 14న మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన మామిడి యాదమ్మ, ఆమె భర్త లక్ష్మయ్య కలిసి తమ కుమార్తె పెళ్లికి బట్టలు కొనేందుకు అదే గ్రామానికి చెందిన మల్గిరెడ్డి వెంకట్రెడ్డి ఆటో మాట్లాడుకుని మాల్కు బయల్దేరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ వెంకట్రెడ్డి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఆటో కింద లక్ష్మయ్య పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యాదమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సత్యం, ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ వెంకట్రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రొసిక్యూటర్ జి. జవహార్లాల్ వాదనలతో ఏకీభవించిన జడ్జి డి. దుర్గాప్రసాద్ మద్యం సేవించి లక్ష్మయ్య మృతికి కారణమైన ఆటో డ్రైవర్ వెంకట్రెడ్డికి 8 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా లేదా మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మర్రిగూడ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, లైజనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లికార్జున్ విచారణకు సహకరించారు. -
ఎంజీయూ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్గా సురేష్రెడ్డి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూషన్ సెంటర్ డైరెక్టర్గా జక్కా సురేష్రెడ్డిని నియమిస్తూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి చేతుల మీదుగా సురేష్రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పరిశ్రమలు, యూనివర్సిటీని అనుసంధానం చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. పోటీ ప్రపంచంలో కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించాలంటే పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
ఆపరేషన్లు చేయిస్తూ.. ఆరోగ్యం తెలుసుకుంటూ
మునుగోడు: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కంటి ఆపరేషన్లు చేయిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు. తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరిలో ఒకసారి, ఈ నెల 9వ తేదీన మరోసారి మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 1350 మంది కంటి పరీక్షలు చేయించుకోగా అందులో 650 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఎమ్మెల్యే ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి హైదరాబాద్లోని శంకర్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఇప్పటి వరకు 520 మందికి దగ్గర ఉండి కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి వద్దకు ఎమ్మెల్యే వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లోనే గ్రామాలకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నెలలో రెండుసార్లు కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
కనుల పండువగా ఎదుర్కోలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సామ అభిషేక్రెడ్డి, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకట్రెడ్డి తలపై పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.5కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, గుడిపెల్లి మధుకర్రెడ్డి, బీరవోలు విక్రమ్రెడ్డి, సుంకరి జనార్దన్, వేల్పుల రమేష్, బైరబోయిన మహరాజు, సైదులు, రామలింగయ్య, కనుకు శ్రీను, మాజీ జెడ్పీటీసీ అవిలయ్య, దాసరి సోమయ్య, ఈఓ శ్రీనివాస్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, ధర్మకర్తలు అనిల్, కృష్ణమూర్తి, ప్రవీణ్, రేఖ, వెంకన్న, వెంకట్రెడ్డి, నిమ్మల కుమార్, నిద్ర సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఫ కొనసాగుతున్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు -
వైభవంగా సుదర్శన హోమం
చివ్వెంల: మండలంలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో గల గిరిదుర్గంలో వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాఘ పౌర్ణిమ సందర్భంగా బుధవారం శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆరుట్ల రవికుమారాచార్యులు, కృష్ణమాచార్యుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో 15 మంది దంపతులు కూర్చున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చకిలం కృష్ణకుమార్, డాక్టర్ ఎ.రామయ్య, మురళీకృష్ణ, బందకవి కృష్ణమోహన్, బొబ్బిలి శ్రీనివాస్రెడ్డి, గోపాల్ కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. యుద్ధభేరి ధర్నాను జయప్రదం చేయాలిసూర్యాపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీంను నిరసిస్తూ మార్చి 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిర్వహించనున్న యుద్ధభేరి ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ధర్నాకు జిల్లా నుంచి సీపీఎస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ఎస్పీని అభినందించిన డీజీపీ
సూర్యాపేట టౌన్: కరీంనగర్లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పాల్గొని బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ బుధవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మెడల్, ప్రశంసా పత్రం అందించి అభినందించారు. అలాగే ఇదే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో 5వ జోన్ తరఫున జిల్లా నుంచి పాల్గొని కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలు పొందిన మహిళా జట్ల క్రీడాకారులను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, సిబ్బంది ఉన్నారు. -
గతంలో చేయనివారే దరఖాస్తు చేసుకోవాలి
తిరుమలగిరి, అర్వపల్లి: కొత్త రేషన్కార్డులకు గతంలో చేయనివారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ (ఈడీఎం) గఫార్ కోరారు. తిరుమలగిరి, అర్వపల్లిలోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కొత్త రేషన్కార్డుకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో చేయాలని, అలాగే కార్డు ఉండి కుటుంబ సభ్యులందరి పేర్లు లేనివారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూళ్లు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ కేంద్రాల యజమానులు గన్నె సత్యనారాయణ, దావుల మల్లిఖార్జున్, సైదులు, వెంకన్న, సాయి, జ్యోతి పాల్గొన్నారు. -
మట్టపల్లి నారసింహుడికి విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవారాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. చివరగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. -
ఇక నుంచి మీ సేవలోనే
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం తిరుమలగిరి (తుంగతుర్తి): రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి పౌర సరఫరాల శాఖ మరో అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇక నుంచి మీ సేవ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరిస్తారు. దీంట్లో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు అధికారులు వెబ్సైట్లో ఆప్షన్ను పునఃరుద్ధరించారు. దీంతో ఐదు రోజులుగా దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరపడడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది. అయితే రేషన్ కార్డుల కోసం ప్రజా పాలన కార్యక్రమం, కుల గణన లేదా ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త కార్డు, చిరునామా మార్పు, కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం వంటి వాటికి అవకాశం కల్పించారు. అయితే ఆధార్ కార్డు ద్వారా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారికి.. ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించింది. వివిధ గ్రామాల్లో అధికారులు వెల్లడించిన జాబితాపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. జాబితాలో పేర్లు రాని వారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఫ పౌర సరఫరాల శాఖ నిర్ణయం ఫ కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియ ఫ ఇప్పటి వరకు చేసుకోని వారికి చాన్స్నిరీక్షణకు తెరపడేనా? తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్కార్డుల జారీ కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో వేగం పుంజుకుంది. దీంతో పేదలలో ఆశలు చిగురించాయి. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను అధికారులు అందించారు. వీటి ఆధారంగా అర్హుల జాబితాను అధికారులు రూపొందించి గ్రామ సభల్లో పెట్టారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులు ఎవరని తేల్చనున్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులుప్రజా పాలనలో 28,000 గ్రామ సభల్లో 23,798మొత్తం 51,798 -
ఉపసంహరణకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది అభ్యర్థు ల నామినేషన్లను ఆమోదించారు. గురువా రం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎంజీయూ అడిషనల్ కంట్రోలర్గా రామచందర్నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్గా డాక్టర్ ఎం.రామచందర్గౌడ్, కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్గా సోషల్ వర్క్ విభాగ అధిపతి డాక్టర్ ఎస్.శ్రవణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. విద్యారంగాన్ని పట్టించుకోని ప్రభుత్వంభానుపురి (సూర్యాపేట): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్ విమర్శించారు. బుధవారం సూర్యాపేటలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్.. విద్యాసంస్థల నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోని స్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాతంగి విజయ్, వంటికొమ్ము నగేష్, సాయి కిరణ్, నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్రామగిరి(నల్లగొండ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ తెలిపారు. పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిసి 72 కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఠీఠీఠీ.ౌ ఠఛిఛ్ఛీ. ుఽ్ఛ్ట వెబ్సైట్ నందు వివరాలు పొందుపర్చినట్లు చెప్పారు. మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్ నందు ఫీజు చెల్లించి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 98669 77741, 93986 73736ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘స్థానిక’ పోరులో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా వచ్చినా కాంగ్రెస్తోనే పొత్తుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మండల స్థాయిలో గతంలో మాదిరిగా జెడ్పీటీసీ స్థానాన్ని సీపీఐకు కేటాయించాలని కోరారు. అలా కాకుంటే ఎంపీపీ, జెడ్పీటీసీలలో ఏ ఒక్కటి ఇచ్చినా తీసుకుంటామన్నారు. అలాగే సర్పంచ్ స్థానాల్లో సీపీఐకి మండల కేంద్రం చిలుకూరుతోపాటు నారాయణపురం, జెర్రిపోతులగూడెం, కొమ్ముబండతండా, సీతారాంపురం గ్రామాలు, అలాగే ఎంపీటీసీ స్థానాలు చిలుకూరులో రెండు, జెర్రిపోతులగూడెం, నారాయణపురం, బేతవోలులో ఒకటి చొప్పున అయిదు స్థానాలు సీపీఐకు కేటాయించాలని అన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శులు సాహెబ్ అలీ, చిలువేరు ఆంజనేయులు, నాయకులు చేపూరి కొండలు, కొడారు శ్రీను, కనకయ్య, నాగేశ్వరరావు, సుల్తాన్ వెంకటేశ్వర్లు, కట్టెకోల నాగేశ్వరరావు, మాధవరపు లక్ష్మయ్య పాల్గొన్నారు. -
బడి బయట పిల్లలు 228 మంది
నాగారం : పాఠశాలకు వెళ్లని, బడి మధ్యలోనే మానేసిన పిల్లలు జిల్లాలో 228 మంది ఉన్నట్లు తేలింది. వివిధ కారణాలతో చదువుకు దూరమైన వీరిని బడుల్లో చేర్పించనున్నారు. గతనెల 12 నుంచి 31 వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీలు క్షేత్రస్థాయిలో బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు వెళ్లని పిల్లల వివరాలు సేకరించి, కారణాలు అడిగి తెలు సుకున్నారు. వీరందరినీ సమీప పాఠశాలల్లో చేర్చించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇ టుక బట్టీల్లోని కార్మికుల పిల్లల కోసం సైతం విద్యాశాఖ ప్రత్యేక బడులు ఏర్పాటు చేస్తోంది. బట్టీల యజమానుల సహకారంతో పుస్తకాలు తదితర సామగ్రి పంపిణీ చేస్తూ పాఠాలు బోధిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు సీఆర్పీలు పాఠశాలల్లోని విలేజ్ లెవల్ రిజిష్ట్టర్ ఆధారంగా బడీడు పిల్లల ఇళ్లకు వెళ్లి, 6–14 ఏళ్లు, 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారి వివరాలను ఆరా తీశారు. మధ్యలో బడి మానేశారా? ఆర్థిక ఇబ్బందులున్నాయా? పనులకు వెళ్తున్నారా? అనే కోణంలో వివరాలు సేకరించారు. 228 మంది పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరించడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం తదితర కారణాలతో బడికి వెళ్లని వారే అధికంగా ఉన్నారు. వీరి వివరాలు ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. బడి బయట ఉన్న పిల్లల ఇళ్లకు వెళ్లి.. విద్యాశాఖ చట్టం ప్రకారం బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది పేదరికంతో విద్యకు దూరమవుతున్నారు. చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. బడి బయట ఉన్న పిల్లల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులు సీఆర్పీలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని పాఠశాలల్లో చేర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనాథ పిల్లలను కస్తూర్బా, గురుకులాల్లో చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 77 మంది సీఆర్పీలు జిల్లాలోని 23 మండలాలలో 64 క్లస్టర్లు ఉండగా వీటి పరిధిలో 77 మంది సీఆర్పీలు పనిస్తున్నారు. వీరందరూ క్షేత్రస్థాయిలో బడి బయట పిల్లల సర్వే చేపట్టారు. జిల్లాలో 6 నుంచి 14 ఏళ్ల వారు 125 మంది, 15 నుంచి 19 ఏళ్ల వారు 28 మంది, వలస వచ్చిన వారు 41, వలస వెళ్లిన వారు 30, దివ్యాంగులు నలుగురు.. ఇలా జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లలు 228 మందిని గుర్తించారు. ప్రతి ఒక్కరికీ విద్య అందించేలా చర్యలు జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాం. తల్లిదండ్రుల సహకారంతో వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. వలస కార్మికుల పిల్లలకు స్థానికంగా విద్యనందించే ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికీ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దేవరశెట్టి జనార్దన్, కోఆర్టినేటర్ ఫర్ అవుటాఫ్ స్కూల్ చిల్డ్రన్, సూర్యాపేట వలస కార్మికుల పిల్లలకు బడులు ఏర్పాటు బడి బయట పిల్లలను గుర్తించేందుకు మొదటగా క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న సీఆర్పీలు మండలాల్లోని గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలోని ఇటుకబట్టీల్లో 41 మంది బడీడు పిల్లలను గుర్తించారు. వీరికోసం స్థానికంగానే ప్రత్యేక బడులు ఏర్పాటు చేశారు. విద్యార్హతలు ఉన్న వారిని గుర్తించి వారిని వలంటీర్లుగా నియమించి బోధన చేయిస్తున్నారు. అలాగే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పలకలు తదితర సామగ్రిని బట్టీల నిర్వాహకులు, అధికారులు సమకూర్చుతున్నారు. ఫ గత నెలలో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సీఆర్పీలు ఫ వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు ఫ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు గతేడాది గుర్తించిన బడి బయట పిల్లల సంఖ్య 145ఈ ఏడాది గుర్తించిన పిల్లలు228ప్రభుత్వ పాఠశాలలు 967పాఠశాల కాంప్లెక్స్లు 64సర్వేలో పాల్గొన్న సీఆర్పీలు 77 -
2వేల మందితో భారీ బందోబస్త్
చివ్వెంల: మండలంలో దురాజ్పల్లి గ్రామంలో గల శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నామని, ఇందుకు 2వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న జాతర నేపథ్యంలో బుధవారం ఆయన పెద్దగట్టు పరిసరాలను కలియదిరిగి బందోబస్త్ ఏర్పాట్లు, జాతర రూట్ మ్యాపు, గ్లోబల్ మ్యాప్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బంది వసతి, జాతరకు వచ్చి పోయే మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లు, దేవస్థానం రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చిపోయే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి–65పై వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడు వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తామన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, నార్కట్పల్లి మీదుగా మళ్లిస్తామని పేర్కొన్నారు. ఇతర జిల్లాల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు దైవదర్శనం కల్పించేలా పోలీస్ సేవలను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. జాతరలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కు అటాచ్ చేసి 24 గంటల పర్యవేక్షణ చేస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా పోలీస్ స్పెషల్ టీమ్స్, క్రైమ్ కంట్రోల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక టీమ్ మఫ్టీలో తిప్పుతూ అనుమానితులను గుర్తించి, దొంగతనాలు జరగకుండా చూస్తామన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్ ఉంటుందని, సాధారణ భక్తుల్లాగా ప్రజల్లో కలిసిపోయి షీటీమ్ బృందం పనిచేయనుందన్నారు. జాతర ప్రదేశంలో పోలీస్ కంట్రోల్ రూమ్, హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర సమయంలో పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువు నిండుగా ఉన్నందున చెరువు వైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, ఎస్బీ సీఐ నాగభూషణం, సీఐలు రాజశేఖర్, శ్రీను, రఘువీర్, వీరరాఘవులు, ఎస్ఐలు మహేశ్వర్, సాయిరామ్ శ్రీకాంత్, బాలు నాయక్, వీరయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పెద్దగట్టు జాతరకు పటిష్ట భద్రత ఫ 68 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఫ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడి -
యువతిపై పెట్రోల్ చల్లిన యువకుడిపై కేసు నమోదు
హుజూర్నగర్: తనను ప్రేమించడం లేదని యువతితో గొడవపడి ఆమెపై పెట్రోల్ చల్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. మంగళవారం ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన యువతి మూడు నెలల నుంచి హుజూర్నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. స్థానికంగా కోదాడ రోడ్డులో గల ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. సదరు యువతికి మోటమర్రి గ్రామానికే చెందిన సుందర్ ప్రమోద్కుమార్తో పరిచయం ఉంది. సోమవారం ప్రమోద్కుమార్ యువతికి ఫోన్ చేసి మాట్లాడాలి బటయకు రమ్మని కోరగా.. ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో యువకుడు గొడవపడ్డాడు. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను యువతిపై చల్లాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బర్డ్ఫ్లూపై అలర్ట్
చకచకా పెద్దగట్టు పనులు లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరకు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 8లోభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో బర్డ్ఫ్లూ వ్యాధి సోకకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా బాయిలర్ కోళ్లు చనిపోతున్న సంఘటనలతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లాలోకి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన బాయిలర్ కోళ్లు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రా నుంచి జిల్లాలోకి కోళ్లను రవాణా చేయకుండా ఉండేందుకు చెక్పోస్టును సైతం ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ఫౌల్ట్రీ ఫాంలలో ఏమైనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా..? లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు శాంపిళ్లను సేకరిస్తున్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు.. జిల్లాలో ఎక్కడైనా కోళ్లకు బర్డ్ఫ్లూ ప్రబలినట్లు సమాచారం అందితే .. వెంటనే అక్కడికి వెళ్లి చికిత్స అందించడానికి జిల్లాస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను జిల్లా పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసింది. ఈ టీంలో పశు వైద్యుడితో పాటు ఇద్దరు పారా వెటర్నరీలు, ఇద్దరు సహాయకులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధితో కోళ్లు చనిపోయిన దాఖలాలు లేకపోగా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. న్యూస్రీల్ఫ జిల్లాలోని కోళ్లలో కనిపించని వ్యాధి లక్షణాలు ఫ ముందు జాగ్రత్తగా పౌల్ట్రీఫాంల పరిశీలనకు బృందాలు ఫ కోదాడ సరిహద్దులో చెక్పోస్టు ఏర్పాటు.. ఆంధ్రా నుంచి కోళ్లు రాకుండా అడ్డగింత -
పనులు త్వరగా పూర్తి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ కోరారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్పల్లి గ్రామ శివారులోగల శ్రీ లింగమంతుల స్వామి ఆలయ పరిసరాల్లో రూ.1.67 కోట్ల వ్యయంతో చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా జంగిల్ క్లియరెన్స్, బారికేడ్లు, లైటింగ్, మరుగుదొడ్ల మరమ్మతులు, కోనేరు పనులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి పనులను పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. మరుగుదొడ్లు, నీటి ట్యాంకుల వద్ద నీరు రోడ్లపైకి రాకుండా ఎత్తుగా నిర్మించాలన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లడానికి పైపులైన్లు వేయాలన్నారు. పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇంజనీర్లను ఆదేశించారు. గుట్టచుట్టూ పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఈఈ యం.కిరణ్రావు, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, రాజిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ యం.డీ. గౌసొద్దీన్, ఎం.ఎస్.ఆర్, ప్రసాద్, మనోజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, శివప్రసాద్ పాల్గొన్నారు.ఫ మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ -
అర్చకుడిపై దాడిచేసిన వారిని శిక్షించాలి
సూర్యాపేట : చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు ఎంవీ రంగరాజన్పై దాడిని వారిపై చర్యలు తీసుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు డిమాండ్ చేశారు. అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ అర్చక సమాఖ్య, దేవాలయాల ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ ధర్మపరిరక్షకులైన అర్చకులపైన, సనాతన ధర్మం పై జరుగుతున్న దాడిని యావత్ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అర్చకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వీర రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్చకులకు, ఆలయాలకు భద్రత కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు వలివేటి వీరభద్ర శర్మ, వైష్ణవ సంఘం జిల్లా నాయకుడు దరూరి రామానూజా చార్యులు, బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర్ రావు, హిందూ ఐక్య వేదిక కన్వీనర్లు పర్వతం శ్రీధర్, నాగవెల్లి ప్రభాకర్, గట్ల సోమయ్య, అర్చక స్వాములు, వీరభద్రశర్మ, రెంటాల సతీష్, భట్టారం వంశీ కృష్ణ, శ్రీధరా చార్యులు, సంకర్శణాచార్యులు, శ్రీహరి ఆచార్యులు, సాగర శర్మ, మరింగంటి శ్రీనివాసా చార్యులు, వికాస తరంగిణి, ఆండాళ్ గొష్టి మహిళా భక్తులు పాల్గొన్నారు. -
సొంత నిర్ణయాలు అమలు చేయొద్దు
భానుపురి (సూర్యాపేట) : ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలు అమలు చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు నామినేషన్, స్క్రూట్నీ, ఉపసంహరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఆర్ఓలకు సంబంధించిన విధుల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ మాట్లాడారు. చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తప్పక కరదీపికను పూర్తిగా చదవాలని, అప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థంగా విధులు నిర్వహించగలుగుతారని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాలని, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు శ్రీనోట్ఙా సింబల్ కూడా తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, స్పెషల్ అధికారులు పాల్గొన్నారు. వివరాల నమోదులో తప్పులు జరగొద్దు విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ కు సంబంధించి సీఆర్పీలు, యంఐయస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన వర్క్ షాప్లో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో పోస్టర్ను అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలతో ఎవరికై నా సమస్య ఏర్పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాస రాజు, పద్మారావు, యల్డీయం బాపూజీ, ఈడీఎం గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వద్దు
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. మంగళవారం దురాజ్పల్లి గ్రామ పరిధిలోని పెద్దగట్టు ఆలయం వద్ద మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, బారికేడ్లు, సీసీకెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కుశలయ్య, పెద్దగట్టు చైర్మన్ నర్సయ్య యాదవ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. ప్రధాన సంఘాలు, సంస్థలకు చెందిన వారిలో ఎక్కువ మందికి రూ.కోట్లలో ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, బంగారం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా వివిధ రూపాల్లో ఉన్న తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వారికి బ్యాంకు, వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు కలుపుకొని పెద్దమొత్తంలో అప్పులు కూడా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అందరికంటే ఆస్తిపరుడు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రెండో స్థానంలో ప్రైవేటు విద్యా సంస్థ యజమాని సుందర్రాజు ఉన్నారు. ప్రధాన సంఘాల అభ్యర్థుల్లో టీచర్స్ జేఏసీ తరఫున పోటీచేస్తున్న, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి మాత్రం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉండగా, అప్పులు కూడా ఉన్నాయి. పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు, అప్పుల వివరాలివీ.. ● స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, ఆయన భార్య పేరున ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మొత్తంగా రూ.17.30 కోట్ల విలువైన భూములు, ఇళ్లు, బంగారం తదితర స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వివిధ బ్యాంకులు, వ్యక్తిగత అప్పులు మొత్తంగా రూ. 3.27 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన పేరుపై వాహనాలు ఏమీ లేవు. ● ప్రైవేటు విద్యా సంస్థల యజమాని ఎస్.సుందర్రాజు, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.16.44 కోట్ల ఆస్తులు ఉండగా, బ్యాంకులు, ఇతరత్రా రూ.2.30 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆస్తుల్లో ఆయన, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. కోటి విలువైన 33 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్ మాత్రమే ఉంది. ● ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆయన భార్య పేరున మొత్తంగా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.2.99 లక్షల అప్పు ఉంది. ఆస్తుల్లో రూ.90.10 లక్షల విలువైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసీలు, బంగారం ఉంది. మాడుగులపల్లి మండలం భీమనపల్లిలో ప్రస్తుతం రూ.1.20 కోట్ల విలువైన 4.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మిర్యాలగూడలో ప్లాట్లు ఉన్నాయి. ● డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, ఆయన భార్య పేరున అన్నీ కలిపి రూ. 3.20 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.కోటిన్నర అప్పు ఉంది. ● ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య, ఆయన భార్య పేరున రూ. 3.06 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ● పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.2.29 కోట్లు విలువైన ఆస్తులు ఉండగా, ఇక రూ.1.36 కోట్ల అప్పులు ఉన్నాయి. ● బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పేరున రూ.1.32 కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 21.80 లక్షల అప్పులు ఉన్నాయి. ఆయన పేరున ఎలాంటి వాహనాలూ లేవు. ● స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్, ఆయన భార్య పేరున రూ.1.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, అందులో రూ.98 లక్షల విలువైన 21 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్ మాత్రమే ఉంది. ● టీచర్స్ జేఏసీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున రూ.77 లక్షల ఆస్తులు ఉండగా, రూ. 57 లక్షల అప్పులు ఉన్నాయి. ● ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల పేరున రూ. 1.88 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.28 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి బంక రాజు పేరున రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ. 13.74 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి అర్వ స్వాతి, కుటుంబ సభ్యుల పేరున రూ.1.29 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.40 లక్షల అప్పులు ఉన్నాయి. ● స్వతంత్ర అభ్యర్థి.. కంటె సాయన్న, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. 3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.ఫ అందరిలో ఆస్తిపరుడు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి ఫ నామినేషన్ వేసిన వారిలో ఆయనకే అత్యధిక ఆస్తులు ఫ రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి ఫ ఆ తరువాత అత్యధికంగా సుందర్రాజుకు రూ.16.44 కోట్ల విలువైన ఆస్తులు -
అర్హత ఉన్నా అంతే..!
భానుపురి (సూర్యాపేట) : రైతాంగానికి రైతుభరోసా కష్టాలు ఇంకా వీడడం లేదు. ఇన్నాళ్లూ ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న ఆందోళన ఉండగా.. ఇప్పుడిక తమకు ఈ డబ్బులు అందుతాయా..? లేదా అన్న సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. మొదట ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు రైతుభరోసా అందించింది. ఆ తర్వాత మరో రెండు విడతల్లో జిల్లాలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేసింది. కానీ ఇందులో కొందరు రైతులకు రెండెకరాలలోపు భూమి ఉండి అన్ని అర్హతలున్నా, గతంలో రైతుబంధు అందినా డబ్బులు రాలేదు. ఈ విషయమై అధికారులను సంప్రదించినా వారికే స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది. 2,37,577 మందికి డబ్బులు జమ..! జిల్లాలో మొత్తం 2,70,853 మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులకు దాదాపు 6.19 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ మేరకు 2018 నుంచి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా నిధులను దుర్వినియోగం చేయొద్దని భావించి కేవలం సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు మాత్రమే నిధులను అందించాలని నిర్ణయించి మొదటగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ తర్వాత ఎకరం లోపు, అనంతరం రెండెకరాలలోపు ఉన్నవారికి రైతు భరోసా అందించింది. ఈ మూడు విడతల్లో మొత్తం 2,37,577 మంది రైతుల ఖాతాల్లో రూ.162.24కోట్లు జమ చేసింది. ప్రతి క్లస్టర్లోనూ రైతుల అయోమయం.. సాగుకు యోగ్యంగా లేని భూములను సర్వేచేసి అధికారులు గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా 7,581.77 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేనట్లు గుర్తించారు. అయితే జిల్లాలోని ప్రతి క్లస్టర్లోనూ సాగుకు భూములు యోగ్యంగా ఉండి.. ప్రస్తుత సీజన్లో పంటలు వేసుకున్న కొందరు రైతులకు సైతం రెండెకరాల భూమి ఉండి కూడా డబ్బులు జమ కాలేదు. అలాగే మరికొందరికి ఉన్న భూమిలో సగం భూమికే నిధులు జమ అయ్యాయి. నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటి వరకు అందలేదు. దీంతో రైతులు తమ పరిధిలోని ఏఈఓలను ఫోన్ ద్వారా, రైతువేదికల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తున్న సంఘటన చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక కారణాలతో కాలేదా..? ఇతర ఏమైనా కారణాలు ఉండి ఉండొచ్చా..? అన్నదానిపై సంబంధిత అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. ఈ నిధులు జమకాని రైతులు ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది.. ? ఎలా నిధులను పొందాలన్న దానిపై ప్రభుత్వం కూడా ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించగా సాంకేతిక కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని, అలాంటి వారి విషయంలో దరఖాస్తులు తిరిగి స్వీకరించాలా..? లేదా నిధులు జమ అవుతాయా అన్నది తెలియదని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని పేర్కొంటున్నారు.రెండెకరాలలోపు ఉన్నా అందని రైతు భరోసా ఫ ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు రైతుల పాట్లు ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ఫ దీనిపై అధికారులకు లేని స్పష్టత ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గునగంటి వెంకన్న. సొంతూరు ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఈయనకు 25గుంటల వ్యవసాయ భూమి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఈ రైతుకు పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 5వ తేదీన ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమచేసినప్పటికీ ఈ రైతుకు మాత్రం అందలేదు. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించినా.. స్పష్టత లేకపోవడంతో పెట్టుబడి సాయం అందుతుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నాడు. ఇదీ .. జిల్లాలో వందలాది మంది రైతుల పరిస్థితికి నిదర్శనం. అందిన రైతు భరోసా వివరాలు ఇలా.. విడత రైతుల జమ అయిన డబ్బులు సంఖ్య (రూ.కోట్లలో..) ఎంపిక చేసిన 23 గ్రామాల్లో 29,352 26.73ఎకరం లోపు భూములున్నవారికి 96,473 61.58 రెండెకరాల భూమి ఉన్నవారికి 1,11,752 73.93 డబ్బులు జమకాలేదు మాకు ఎకరం 25 గుంటల భూమి ఉంది. ప్రతిసారి రైతుబంధు నిధులు వచ్చేవి. ఈ సారి ఇంతవరకు రాలేదు. మెసేజ్ కూడా రాలేదు. బ్యాంక్కు వెళ్లి చూసుకున్నా డబ్బులు జమ కాలేదు. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే తెలియదని చెబుతున్నారు. ఏం చేయాలో అర్థంకావడంలేదు. –కవిత, అడివెంల, జాజిరెడ్డిగూడెం మండలం -
ఒక నామినేషన్ తిరస్కరణ
ఫ సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమాదేవి నేరేడుచర్ల : మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేరేడుచర్లకు చెందిన నక్క రమాదేవిని నియమించారు. ఈమేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ చేతుల మీదుగా మంగళవారం హైదరాబాద్లో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు మహిళా సంఘాన్ని కూడా బలోపేతం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర భారీనీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి, నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకకట్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నూకల సందీఫ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ తాళ్ల సురేష్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలక సరిత తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి సూర్యాపేటటౌన్ : వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాల బంటిని కుల దురహంకారంతో హత్య చేసిన నిందితులను, సహకరించిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ కె.శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కులదురహంకార హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ కుటుంబాన్ని చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చి మాట్లాడారు. ఈ హత్యకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదని మొత్తం ఈ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నది కుల పెద్దలేనని, కుల దురహంకారాన్ని రెచ్చగొట్టే సంస్కృతిని విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం హైదరాబాద్ కమిటీ కో–కన్వీనర్ సత్య, సభ్యులు సబిత, తిరుమ్ల, సావిత్రి, కిరణ్మయి, అరుణజ్యోతి, చింత పద్మలతో పాటు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, సుధాకర్రెడ్డి, ఏడిండ్ల అశోక్ ఉన్నారు. హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించారు. సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. -
‘ప్రాదేశిక’ ఓటరు జాబితా విడుదల
సూర్యాపేటటౌన్ : మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని.. అందుకు సంబంధించి ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశించడంతో జెడ్పీ సీఈఓ అప్పారావు ఆధ్వర్యంలో జిల్లాలో 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ఉంచారు. జిల్లాలో ప్రాదేశిక ఓటర్లు మొత్తం 6,96,329 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 3,54,748 మంది, పురుషులు 3,41,560 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలో ఉన్న అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ఈ నెల 15న ప్రకటించనున్నారు. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలు -
వంద శాతం వసూలే లక్ష్యం
తిరుమలగిరి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులపై ఆధారపడకుండా ఆస్తి పన్ను రాబట్టడానికి అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తుండడంతో పన్ను వసూళ్లను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 51.50శాతం పన్ను మాత్రమే వసూలైంది. నిర్దేశించిన గడువులోగా వందశాతం లక్ష్యంగా ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు నివాస, నివాసేతర నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పెద్ద మొత్తంలో బకాయిలున్న వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నులు చెల్లించనట్లయితే ఆస్తులు జప్తు చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు..జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లు 51.50శాతం మాత్రమే అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇక 49 రోజులే సమయం ఉంది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడం, మరో వైపు సాధారణ పన్ను వసూలు సరిగా లేక కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు కనీసం అభివృద్ధి పనులు చేపట్టడానికి పన్నుల వసూళ్లే మార్గమని భావించిన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డు అధికారులు, సిబ్బంది నివాస గృహాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి పన్ను వసూళ్ల కోసం 30బృందాలుగా ఏర్పాటై తిరుగుతున్నారు. ఒక్కో బృందంలో బిల్ కలెక్టర్, వార్డు ఆఫీసర్, సహాయకులు కూడా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుగుతూ బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మున్సిపాలిటీల్లో 51.50శాతం ఆస్తి పన్ను వసూలు ఆర్థిక సంవత్సరం ముగింపునకు మిగిలింది 49 రోజులే వసూళ్లకు ప్రత్యేక బృందాల ఏర్పాటుఅభివృద్ధిలో భాగస్వాములు కండి ఆస్తి పన్నులు ఉన్న వారు వెంటనే బకాయిలు చెల్లించాలి. వంద శాతం పన్నులు వసూలు చేసే దిశగా సిబ్బంది ఇంటింటికీ తిరిగుతున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – యాదగిరి, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరిపన్నుల వివరాలు (రూ. కోట్లలో) మున్సిపాలిటీ అసెస్మెంట్లు డిమాండ్ వసూలు చేయాల్సినవి సూర్యాపేట 35,441 16.77 9.07 7.70 కోదాడ 16,883 7.78 3.62 4.16 హుజూర్నగర్ 8,396 2.46 1.21 1.25 తిరుమలగిరి 5,485 1.43 0.72 0.71 నేరేడుచర్ల 3,952 1.13 0.61 0.52 మొత్తం 70,157 29.57 15.23 14.33 -
20 రోజుల్లోనే 47 అడుగులు తగ్గిన నీటిమట్టం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్వే(546అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతంతో పాటు, స్థానికంగా అత్యధికంగా వర్షాలు కురిశాయి. కృష్ణానదిలో అక్టోబర్ మాసాంతం వరకు ఎగువ నుంచి వరదలు కొనసాగాయి. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. గత ఏడాది అక్టోబర్ వరకు జలాశయం నీటిమట్టం 589.70 అడుగులు ఉండగా 311.1486 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. అయితే, వానాకాలంలో వేసిన వరిపంట డిసెంబర్ చివరికి చేతికి వచ్చింది. వరికోతలు మొదలు అయ్యాయి. తిరిగి యాసంగి సీజన్కు రైతులు నార్లు పోసుకుంటారని ఏకధాటిగా కాల్వలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి యాసంగి సీజన్ మొదలవుతున్నట్లు సాగునీటి శాఖ అధికారులు ప్రకటించారు. అప్పుడు సాగర్ జలాశయం నీటిమట్టం 580.90 అడుగుల (285.6098 టీఎంసీలు) నీరుంది. ప్రస్తుతం యాసంగి వరి పొలాలు పొట్టదశలో ఉన్నాయి. ఇప్పటి వరకు సాగు, తాగునీటికి కలిసి సాగర్ నుంచి 89టీఎంసీల నీటిని విడుదల చేశారు. అయితే, యాసంగి పంట నీటి విడుదలకు షెడ్యూల్ ఏప్రిల్ వరకు ఉంది. అప్పటి వరకు కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆన్ ఆఫ్ విధానానికి స్వస్తి! ఎడమ కాల్వలకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లుగా తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు ప్రకటించారు. కానీ, రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాల్వలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఫ నాగార్జునసాగర్లో వేగంగా తగ్గిపోతున్న నీరు ఫ స్పిల్వే దిగువకు నీరు ఫ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 543 అడుగులు -
పెద్దగట్టులో భక్తుల సందడి
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందే భక్తుల రాక మొదలైంది. సోమవారం భక్తులు తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వారం రోజుల ముందే భక్తులు వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లును ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. స్పందించారు.. పనులు చేశారుచివ్వెంల(సూర్యాపేట) : దురాజ్పల్లి పరిధిలోని శ్రీ లింగమంతుల స్వామి(పెద్దగట్టు) ఆలయం వద్ద అధికారులు కొన్ని పనులు చేపట్టారు. జాతర పనులు నత్తనడకన సాగుతున్న అంశంపై పెద్దగట్టుపై పట్టింపేది అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికాలు స్పందించారు. చెరువు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లకు తలుపులు బిగించారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. గుట్టకింద కోనేరును శుభ్రం చేశారు. రైతు భరోసా రెండో విడత రూ.73.93 కోట్లు జమభానుపురి (సూర్యాపేట) : యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో నిధులను విడుదల చేయగా.. ఈనెల 5వ తేదీన ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున నిధులను వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం ఎకరా నుంచి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 1,11,752 మంది జిల్లాలోని రైతులకు రూ.73,93,34,053 లను విడుదల చేసింది. విడతల వారీగా జిల్లాలో సాగుకు యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. నేడు సినీ స్వరాభిషేకంసూర్యాపేటటౌన్ : ఈ నెల11న సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాల భవన్లో సినీ గాయకులు ఘంటసాల, బాల సుబ్రహ్మణ్యం, నటులు ఎన్ టీఆర్, ఏఎన్ఆర్ల స్మారకార్థం సినీ స్వరాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ గాయకుడు, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని సోమవారం బాల భవన్ లో ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యాపేటలో కళల అభివృద్ధిలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు హమీద్ ఖాన్, బండారు వీరు నాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయాలి
సూర్యాపేట: పంట పొలాలకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు విడుదల చేసి ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం పర్యవేక్షణ అధికారికి వినతిపత్రం అందజేశారు. యాసంగి పంటలకు విడతలవారీగా నీళ్లు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్కుమారెడ్డి ప్రకటించడంతో మోతె, చివ్వెంల, నడిగూడెం, మునగాల మండలాల్లో రైతులు బోర్లు, బావులు, చెరువులను ఉపయోగించుకొని వరినాట్లు వేసుకున్నారని తెలిపారు. నేడు భూగర్భజలాలు ఇంకిపోవడంతో నీళ్లు లేక పంటలు పండక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా విడతలవారీగా విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతుల పొలాలకు రావడం లేదన్నారు. పంటలు ఎండిపోకుండా విడతల వారీగా కాకుండా పూర్తిగా నీటిని విడుదల చేయాలని కోరారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా నామవరం చెరువును రిజర్వాయర్ చేసి పాలేరు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఈ ప్రాంత చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ఉపాధ్యక్షుడు ముప్పాని లింగారెడ్డి, సహాయ కార్యదర్శి ఉప్పల మల్లయ్య, సభ్యులు పాలకూరి ఎల్లయ్య, నల్లగొండ వెంకన్న, రమేష్బాబు, తండు మల్సూర్, సునీల్, శిగ రవి, నారాయణరెడ్డి, బాలు, బైర వెంకన్న, మండవ శ్రీను, వీరబోయిన వెంకన్న, తండా కృష్ణయ్య పాల్గొన్నారు. ఫ గ్రామీణ పేదల సంఘం నేతలు డిమాండ్ ఫ నీటిపారుదలశాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా -
ఏ పంట.. ఎన్ని ఎకరాలు
ప్రారంభమైన డిజిటల్ సర్వే ఫ సాగు చేసిన పంటల వివరాలు సర్వే నంబర్ల వారీగా సేకరణ ఫ ఒక్కో ఏఈఓకు 2వేల ఎకరాల చొప్పున సర్వే లక్ష్యం ఫ ప్రత్యేక యాప్లో నమోదునాగారం : పంటల సాగు వివరాల్లో కచ్చితత్వం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ డిజిటల్ సర్వే చేపట్టింది. జిల్లాలో రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా వ్యవసాయ విస్తరణ అధికారులు పొలాల బాట పట్టారు. వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, ఇతర ప్రయోజనాల కోసం ఈ సర్వే దోహదపడనుంది. నష్టం అంచనాకు ఉపయుక్తం..రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చేందుకు కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు అశాసీ్త్రయ లెక్కలతో నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. కేంద్రం నుంచి వచ్చే రాయితీ పథకాలు కూడా కోల్పోవాల్సివస్తుంది. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి ప్రస్తుత సర్వే దోహదపడనుంది. సాగు సామర్థ్యాన్ని పెంచడానికి, ఆధునికి సాంకేతికను పెంచేందుకు ఉపయుక్తంగా మారనుంది. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పంటల సాగు వివరాలు తేలనున్నాయి. ఒక్కో ఏఈఓకు 2 వేల ఎకరాలుపంటల నమోదులో కచ్చితత్వం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో 4.82లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని 83 క్లస్టర్ల పరిధిలో ప్రతి ఏఈఓకు 2 వేల ఎకరాల్లో డిజిటల్ సర్వే లక్ష్యం విధించారు. నామమాత్రంగా కాకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి భూముల సర్వే నంబరు, ఉప నంబర్ల వారీగా పంటలను చిత్రీకరిస్తూ, యాప్లో నమోదు చేస్తున్నారు. పంటల వివరాల నమోదు ఇలా..గతంలో పంటల సాగు వివరాలను ఒకే చోట కూర్చొని కొందరు రైతుల నుంచి సేకరించేవారు. దీంతో సాగు లెక్కల్లో కొంత వ్యత్యాసం కనిపించేంది. కానీ కొన్నాళ్లుగా పంటల వివరాలు పారదర్శంగా నమోదు చేస్తున్నారు. ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయ విస్తరణ అధికారులు వెళ్తున్నారు. అక్కడ ఆ రైతు ఏఏ సర్వే నంబర్లలో ఏఏ పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశాడు, రైతు పేరు, ఊరు, భూమి, బోరు బావులా, సాగునీటి సౌకర్యం ఉందా అనే వివరాలను నమోదు చేస్తున్నారు. పంటల వివరాలను ట్యాబ్లో నమోదు చేసి ఫీల్డ్ నుంచే ఆన్లైన్లో ఫొటోలు తీసి రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా ఎంత విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారో తేలనుంది.సకాలంలో పూర్తిచేస్తాం జిల్లాలో పంటల డిజిటల్ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేతో రైతులకు బహుళ ప్రయోజనం కలగనుంది. ప్రతి రైతు సాగు చేసిన పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో సందర్శించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా ఆదేశించాం. పంటల సర్వేను సకాలంలో పూర్తి చేసేలా చేసేలా సిబ్బందికి సూచించాం. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట -
జోరుగా నామినేషన్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజున 18 మంది నామినేషన్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. ఇప్పటి వరకు 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరుగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. భారీగా సమావేశాలు, ర్యాలీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి సోమవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డి, పులి సరోత్తమ్రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్ద ఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. అయితే సుందర్రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. జోరందుకోనున్న ప్రచారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున ప్రచార ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని సంఘాలు క్షేత్ర స్థాయిలో ఓ దఫా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇకపై మరింత జోరుగా ప్రచారాన్ని కొనసాగించనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన సంఘాల అభ్యర్థులతో పాటు బహుజన వాదంతో ముందుకు వస్తున్న అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి, ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.ఫ మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు ఫ భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ ఫ నేడు నామినేషన్ల పరిశీలనఅభ్యర్థుల వారీగా నామినేషన్లు వేసిన సెట్ల సంఖ్యఅభ్యర్థి సెట్లు అలుగుబెల్లి నర్సిరెడ్డి 3పులి సరోత్తంరెడ్డి 3పింగిళి శ్రీపాల్రెడ్డి 4పూల రవీందర్ 3గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి 2ఎస్.సుందర్రాజు 3తాటికొండ వెంకటరాజయ్య 1ఏలె చంద్రమోహన్ 3దామర బాబురావు 3లింగిడి వెంకటేశ్వర్లు 4బంక రాజు 2పన్నాల గోపాల్రెడ్డి 2ఔర స్వాతి 1చకిలం చంద్రశేఖర్ 2తలకొప్పుల పురుషోత్తంరెడ్డి 3కొలిపాక వెంకటస్వామి 3కాటే సాయన్న 1జంగిటి కై లాసం 1జెట్టి శంకర్ 1బోండా నాగరాజు 2కోమటిరెడ్డి గోపాల్రెడ్డి 1గండిరెడ్డి కోటిరెడ్డి 1తండు ఉపేందర్ 1 -
వివాహితతో సహజీవనం.. ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..?
సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్కుమార్ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్కుమార్తోనే ఉంటోంది. తల్లితో సహజీవనం చేస్తూ.. ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..జాటోతు సునీల్కుమార్ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్కుమార్ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది. పోక్సో కేసు నమోదు...సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన సునీల్కుమార్పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్కుమార్ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..? సునీల్కుమార్కు హెచ్ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్కుమార్ను అరెస్ట్ చేసి హెచ్ఐవీ టెస్ట్ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. -
యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి
కోదాడ: యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మర్యాద సైదులుయాదవ్ కోరారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన సంఘం నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు దురాజ్పల్లి, కోదాడలో జరిగే లింగమంతుల జాతరలో యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల కృష్ణయ్యయాదవ్, కట్టెబోయిన శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్, మాదాల ఉపేందర్, మొడెం సైదిబాబు, చిమట శ్రీనివాస్, రాముడు, శివకృష్ణ, గంధం ఉపేందర్, జంగాల కృష్ణయ్య, మోహన్రావు పాల్గొన్నారు. గోదావరి జలాల నిలిపివేత అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు వస్తున్న గోదావరి జలాలు వారబందీ విధానంలో ఆదివారం నిలిపివేశారు. ఈ విధానంలో ఈనెల 1న జిల్లాకు గోదావరి జలాలను పునరుద్ధరించారు. వారం రోజులు పూర్తి కావడంతో నిలిపివేశారు. తిరిగి ఈనెల 15న మళ్లీ పునరుద్ధరించి ఈ నెల 22 వరకు వదలనున్నారు. మట్టపల్లిలో విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవారాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ గావించారు. అనంతరంశ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థుల క్షేత్ర సందర్శననడిగూడెం : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదివారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కేవీకేను సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త బి.సౌమ్య కేవీకేలో సాగు చేస్తున్న వివిధ రకాల పంటల గురించి వివరించారు. అదేవిధంగా వర్మి కంపోస్టు, జీవన ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు రవికృష్ణ, రజినీ, శైలజ, రాజ్యలక్ష్మి, భగీరథ, మంజుల, అనూష, కోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్
సూర్యాపేటటౌన్: ఈ నెల 3వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం జరిగిన పరీక్షలో 620 మంది విద్యార్థులకు గాను 594 మంది విద్యార్థులు హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 272 మంది విద్యార్థులకు 229 మంది విద్యార్థులు హాజరు కాగా 43 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్ విభాగంలో 394 మంది విద్యార్థులకు గాను 383 మంది విద్యార్థులు హాజరవ్వగా 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్ విభాగంలో 289 మంది విద్యార్థులకు 263 మంది విద్యార్థులు హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఫ డీఐఈఓ భానునాయక్ -
నామినేషన్లకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సోమవారం ముగియనుంది. 3వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. 7వ తేదీ వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్సీ, యూటీఎఫ్, ఇతర సంఘాలు అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ నెల 7వ తేదీన నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ సమర్పించారు. మిగతా వారు కూడా ఒక్కో సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరి కొందరు సోమవారం భారీ ర్యాలీతో నామినేషన్లు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీగా దాఖలు కానున్న నామినేషన్లు సోమవారం నామినేషన్లు ఆఖరు తేదీ కావడంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా ర్యాలీలు నిర్వహించి నామినేషన్ను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫ భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయనున్న పలువురు అభ్యర్థులు -
పచ్చదనానికి ప్రణాళిక
ఫ నయనానందకరం.. ఎదుర్కోలు మహోత్సవంచిలుకూరు: ఈ ఏడాది జూన్లో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామాల్లో కార్యదర్శులు, ఉపాధిహామీ టీఏలు, కూలీలకు మొక్కలు పెంచడం పై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు శిక్షణ పూర్తి చేశారు. మట్టిని, ఎరువుల మిశ్రమంతో ఉపాధిహామీ కూలీలు మొక్కల సంచులు మట్టితో నింపి విత్తనాలు నాటారు. నిత్యం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలు, టీఏలు, ఈసీలు గ్రామ నర్సరీలను సందర్శించి నిర్వాహకులకు తగిన సూచనలు చేస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.8నుంచి రూ.10 వరకు ఖర్చు జిల్లా గ్రామీణాబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున మొత్తం జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు గాను 475 జీపీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి కనీసం 10 వేల చొప్పున 49 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. వీటిల్లో ఇప్పటికే 50 లక్షల బ్యాగ్ల్లో విత్తనాలు నాటారు. ఈ ఏడాది టార్గెట్ పూర్తి చేసేందుకు నర్సరీల్లో మొక్కలు పెంచే క్రమంలో వివిధ కారణాలతో మొక్కల ఎండిపోవడం, చనిపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో లక్ష్యానికి మించి మొక్కలను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఒక్కో మొక్కకు కనీసం రూ. 8నుంచి రూ.10 వరకు ఖర్చు చేయనున్నారు. ప్రతి ఇంటికి తులసి మొక్క పంపిణీ చేయనున్నారు. ఇళ్ల రహదారి ప్రాంతాల్లో నీడనిచ్చే, పూల, పండ్ల మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా టేకు, ఈత, వెదురు, మలబారు, మునగ, వెలగ, మర్రి, వేప, బాదం, జామ, సీతాఫలం, ఖర్జూరా, మందార, సన్నజాజి, మల్లె తదితర మొక్కలకు ప్రాధాన్యమిస్తున్నారు. మెళకువలు పాటిస్తూ.. నర్సరీల్లో మొక్కలు పెంచే క్రమంలో సరైన అవగాహన లేక చాలా చోట్ల మొలకలు రాక రెండో సారి విత్తనాలు నాటాల్సి వస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా అలా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విత్తన శుద్ధి చేయడం, సంచుల్లో నాణ్యమైన మట్టి నింపడం, మొలకల రావడానికి అవసరమైన ఉష్ణోగ్రత కల్పించడం, వేసవిలో ఎండిపోకుండా తరుచూ నీటి తడులు ఇవ్వడం, గ్రీన్ నెట్లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. జాగ్రత్తలపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తున్నారు. ఫ వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేస్తున్న అధికారులు ఫ 475 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు ఫ ఈ ఏడాది 49 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం50 లక్షల బ్యాగుల్లో విత్తనాలు నాటాం ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ నర్సరీల్లో 55 లక్షలు మొక్కలు పెంచడమే లక్ష్యంగా నర్సరీలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 50 లక్షల మట్టి బ్యాగుల్లో విత్తనాలు నాటాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది, కార్యదర్శులకు శిక్షణ, సలహాలు ఇస్తూ నర్సరీలు సిద్ధం చేస్తున్నాం. కనీసం ఒక గ్రామ నర్సరీకి 10 నుంచి 12వేల మొక్కలు పెంచాలని నిర్ణయించాం. – అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట -
కృష్ణ హత్య కేసులో నిందితులను శిక్షించాలి
సూర్యాపేట: ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన వడ్లకొండ కృష్ణ (బంటి) హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ భద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో కుల, మతాంతర ప్రేమ వివాహాల్లో పరువు హత్యను నివారించడం ఎలా అనే అంశంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. కృష్ణ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. క బహుజన మహాసభ రాష్ట్ర నాయకుడు నారబోయిన వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు, సీపీఐ సీనియర్ నాయకులు దంతాల రాంబాబు, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య, సామాజిక అధ్యయన వేదిక కో కన్వీనర్ రేపాక లింగయ్య, సీయూసీ నాయకులు షేక్ కరీం, డీటీఎఫ్ నాయకులు ఎస్కె ఉమర్టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. వీరన్న, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కునుకుంట్ల సైదులు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ పాల్గొన్నారు. -
ప్రాదేశిక సమరానికి సమాయత్తం
తిరుమలగిరి (తుంగతుర్తి): మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ని యామకం, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడంతో పాటు ఈ నెల 15న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. 700 మందికి ఒక పోలింగ్ కేంద్రం జిల్లాలో పాత స్థానాలకే ఎన్నికలు నిర్వహించనున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు స్థానాలు పెరగలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామాలు విలీనమయ్యాయి. కానీ ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు. ఈ సారి 23 మండలాల్లో 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 11న పోలింగ్ కేంద్రాల జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. 11 నుంచి 13వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాలకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 13న వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు తీసుకోనున్నారు. 14న అభ్యంతరాలు స్వీకరించి కలెక్టర్ అనుమతికి పంపిస్తారు. కలెక్టర్ ఆమోదంతో 15న తుది జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు వస్తుండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి గ్రామాల్లో అభ్యర్థులకు 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించడంతో పురుషులకు రిజర్వేషన్లు రాకుంటే తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను నిలబెట్టడానికి అన్ని పార్టీల్లోని నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఫ రేపు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్న పోలింగ్ కేంద్రాల జాబితా ఫ 15న విడుదల కానున్న తుది జాబితా ఫ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించిన అధికారులు -
వీరికి బాధ్యతలు..
జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకుగాను ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ)తో పాటు ఎంపీడీఓలు కీలక పాత్ర పోషిస్తారు. 23 మండలాలకు 23 మంది ఆర్ఓలు, 4 ఎంపీటీసీ స్థానాలకు ఒకరు చొప్పున ఏఆర్ఓలను నియమించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రిజర్వేషన్ల అమలు, పోలింగ్ కేంద్రాల కేటాయింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణపై దృష్టి సారించారు. అదేవిధంగా ఎన్నికలకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారి (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి (ఓపీఓ), రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరంతా జిల్లా, మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగు నీరు, ప్రహరీ, లైటింగ్, ల్యాంప్లు తదితర మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. -
ప్రైవేట్ ఉపాధ్యాయులకు 12నెలల జీతం ఇవ్వాలి
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు 12నెలల జీతాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బస్కూరి కేపీ కుమార్ డిమాండ్ చేశారు. టీపీయూఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లపై వివిధ పాఠశాలల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కళింగం, ఉపేందర్, బచ్చలకూరి జానయ్య, మహేష్, రాజశేఖర్, ఆర్.రమేష్, సోమరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
బంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేట టౌన్: ప్రభుత్వం వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాల బంటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కుల నిర్మూలన సంఘం గౌరవ అధ్యక్షురాలు గుత్తా జ్యోత్స్న, రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అన్నారు. ఇటీవల పరువు హత్యకు గురైన మాల బంటి కుటుంబ సభ్యులను శనివారం సంఘం నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మృతుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాంతర, మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘం నాయకులు జ్యోతి, యూసఫ్బి, కృష్ణచంద్, కె.సురేష్, బీబీ.శ్యామ్, రాఘవేంద్రప్రసాద్, చింతపల్లి ప్రభాకర్, వేణు, శేఖర్, ఆవుల నాగరాజు పాల్గొన్నారు. -
ఏబీఏపీని బలోపేతం చేయాలి
సూర్యాపేట: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ (ఏబీఏపీ)ని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయాలని ఆ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాచర్ల రమేష్, తెలంగాణ అధ్యక్షుడు టీవీ.పుల్లంరాజు అన్నారు. శనివారం సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. శబరిమలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేలా ఏబీఏపీ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షలో సేవ చేస్తున్న వారిని సన్మానించారు. ఈ సమావేశంలో సంస్థ జాతీయ కార్యదర్శి సరిశెట్టి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి కర్కా సిద్ధు, కోశాధికారి మూడ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గంగాధర్ స్వామి, కమిటీ సభ్యులు భాస్కరాచారి, మాధప్ప, ఇస్లావత్ నగేష్, రాము, భాస్కర్, సాగర్, గురవయ్య, సుంకాని శ్రీనివాస్, రాఘవశెట్టి, పులుసు యల్లేష్, మొరిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీయోగానందుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్థపన తిరుమంజనం, సహస్రనామారాధన, అభిషేకాలు, అర్చనలు, విశేషపూజలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుడిపల్లి మధుకర్రెడ్డి, ధర్మకర్త రాగి అనిల్, ఈఓ వై.శ్రీనివాస్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, బైరబోయిన మహరాజు, సైదులు, బైరబోయిన రామలింగయ్య, కనుకు శ్రీనివాస్, మహేష్, అర్చకులు రాంబాబుఅయ్యంగార్, పవన్కుమార్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. లింగ వివక్షలేని సమాజాన్ని స్థాపిద్దాంభానుపురి (సూర్యాపేట): లింగ వివక్ష లేని సమాజ స్థాపనకు మహిళలు పోరాడాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో దంతాల పద్మరేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దేశగాని హేమలత, కార్యదర్శిగా పొదిల వెంకటమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా మల్లేశ్వరి, ఉపాధ్యక్షులుగా దంతాల పద్మరేఖ, సహాయ కార్యదర్శి కంభంపాటి నాగమణి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, కోటమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను నిలువరించి..
అర్వపల్లి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు తక్కువ ధరకు ప్రజలకు ఇసుకను అందించడానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ జిల్లాలో ప్రవేశపెట్టిన సాండ్ ట్యాక్సీ విధానం ఫుల్ సక్సెస్ అయింది. గతంలో ఇసుక అక్రమ రవాణాతో గ్రామాల్లో ఘర్షణలు జరగడంతో పాటు ప్రభుత్వానికి పైసా ఆదాయం వచ్చేది కాదు. దీనికి తోడు గృహ నిర్మాణదారులు అధిక రేట్లకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలాగే సకాలంలో ఇసుక అందక ఇబ్బందులు పడేవారు. కానీ, కలెక్టర్ ప్రవేశపెట్టిన సాండ్ ట్యాక్సీ విధానంతో ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరకడంతోపాటు ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి ఆదాయం లభిస్తోంది. ఏడు మండలాలకు ఇసుక సరఫరా.. జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీనది నుంచి సాండ్ ట్యాక్సీ విధానాన్ని 75రోజుల నుంచి అమలు చేస్తున్నారు. అయితే తుంగగూడెంలోని మూసీనది క్వారీ నుంచి సాండ్ ట్యాక్సీ విధానంలో ఇసుకను సరఫరా చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, తుంగతుర్తి మండలాలకు సాండ్ ట్యాక్సీ విధానంలో ఇసుక సరఫరా చేసేవారు. ఇటీవల అదనంగా మద్దిరాల, అత్మకూర్(ఎస్), తిరుమలగిరి మండలాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫ తుంగగూడెం రీచ్లో సక్సెస్ ఫుల్గా సాండ్ ట్యాక్సీ ఫ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అమలు ఫ 75 రోజుల్లో జీపీకి రూ.4.56 లక్షల ఆదాయం ఫ ఇక్కడి నుంచే ఏడు మండలాలకు ఇసుక పకడ్బందీగా అమలు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాండ్ ట్యాక్సీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తున్నాం. ఇక్కడి నుంచి 7 మండలాలకు ఇసుక అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జక్కర్తి శ్రీనివాసులు, తహసీల్దార్ 4,562 ట్రక్కుల ఇసుక తరలింపు తుంగగూడెం నుంచి సాండ్ ట్యాక్సీ విధానం మొదలుగా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 4,562 ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను ఇతర మండలాలకు తరలించారు. అయితే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్కు రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి రూ.4.56లక్షల ఆదాయం సమకూరింది. అలాగే ఈ పథకంతో ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు, కూలీలు ప్రతిరోజూ ఉపాధి పొందుతున్నారు. ఈ విధానం మొదలైనప్పుటి నుంచి అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఒక్క గొడవ కూడా జరగడంలేదు. సాండ్ ట్యాక్సీ విధానంతో ఇళ్ల నిర్మాణదారులకు పెద్ద భారం తగ్గింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన జిల్లా కలెక్టర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.