breaking news
Suryapet
-
పోటీకి ఎవరు మేటి?
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. షెడ్యూల్ వెలువడిందో.. లేదో ఆయా స్థానాల్లో ఎవరూ పోటీ చేస్తే బాగుంటుందనే విషయమై ముఖ్య నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎవరెవరు పోటీలో ఉంటారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్న వారెవరో ఆయా పార్టీల మండల అధ్యక్షులు వివరాలు సేకరించి జిల్లా ముఖ్యనేతలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పార్టీల ముఖ్య నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సహా ఎన్నికల్లో ఎలా ఓటర్ల వద్దకు వెళ్లాలనే విషయమై రహస్య సమావేశాలు నిర్వహించడమేగాక పలు సూచనలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను వీలైనంత త్వరగా ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పడ్డాయి. నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి సంబంధించి ఆశావహులతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రతి జెడ్పీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మండలానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలని అధిష్టానం జిల్లా ముఖ్యనేతలను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేస్తే జెడ్పీ పీఠం సులువుగా దక్కుతుందన్న అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో లబ్ధి పొందాలని చూస్తోంది. యూరియా సరఫరా, ఎస్సారెస్పీ నీటిని జిల్లాకు అందించే విషయాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేలా ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా బీజేపీ చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు ఉండగా.. బీసీల రిజర్వేషన్ శాతం పెరిగింది. ఈ క్రమంలో బీసీలకు గణనీయంగా స్థానాలు పెరిగి.. జనరల్ స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. తదనంతరం సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆయా స్థానాల కోసం కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు. ఫ అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీల తీవ్ర కసరత్తు ఫ జెడ్పీటీసీ స్థానాలపై కన్ను ఫ ముగ్గురు ఆశావహులతో జాబితా తయారు చేస్తున్న కాంగ్రెస్ ఫ పార్టీ మండలాల అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ -
ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కబడ్డీ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలుకోదాడ: ప్రతిభ గల కబడ్డీ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని, దానికి నిదర్శనమే ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తృతీయస్థానం సాధించడమేనని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జట్టు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎండీ మహబూబ్జాని మాట్లాడుతూ.. కోదాడను కబడ్డీ క్రీడకు కేరాఫ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈదుల కృష్ణయ్య, జానకిరాంరెడ్డి, పంది కళ్యాణ్, జూలూరు వీరభద్రం, సైదులు, చలిగంటి రామారావుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. మట్టపల్లిలో వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ కు పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం జరిపించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టుకు 2,248 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గింది. మూసీ రిజర్వాయర్కు పదిహేను రోజుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పైగా వచ్చిన ఇన్ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తిన అధికారులు 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రం వరకు 643.80 అడుగుల(4.15 టీఎంసీలు)వద్ద నీరుంది. -
వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం
సూర్యాపేట అర్బన్: వీధి వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇదివరకు పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు అందించగా.. గత పది నెలలుగా ఆ పథకం నిలిచిపోయింది. దాని స్థానంలో తాజాగా లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు మహిళా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే కొంతమంది వీధి వ్యాపారులకు ఒకటి, రెండు విడతలుగా రుణాలు అందించగా.. ప్రస్తుతం మూడో విడత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రుణ సదుపాయం పెంపు ఐదేళ్ల కిందట వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించారు. వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు గురికాకుండా బ్యాంకుల ద్వారా నేరుగా స్వల్ప కాలిక రుణాలు అందజేశారు. వందల సంఖ్యలో మహిళా సంఘం సభ్యులు తీసుకొని చెల్లించడంతో ఎక్కువ మొత్తం రుణం పొందడానికి అర్హత సాధించారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు కూడా రుణాలు పొందే అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.10వేలు అందించారు. ఇప్పుడు లోక్ కల్యాణ్ మేళా ద్వారా రుణాన్ని రూ.15 వేలకు పెంచారు. రెండో విడత రూ.20వేలు అందించగా ప్రస్తుతం దీనిని రూ.25వేలకు పెంచారు. మొదటి, రెండో విడతల్లో సక్రమంగా చెల్లించిన వారిని రూ.50వేల రుణానికి ఎంపిక చేసి ఇవ్వనున్నారు. మున్సిపాలిటీల వారీగా ఫ పీఎం స్వనిధి పథకం స్థానంలో లోక్ కల్యాణ్ తీసుకువచ్చిన కేంద్రం ఫ పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు రుణాలు పొందే అవకాశం ఫ ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించిన అధికారులుజనాభా 1,53,000 75,000 35,850 18,474 14,853వార్డుల సంఖ్య 48 35 8 15 15నివాస గృహాలు 39,800 18,000 10,761 5,945 4,058మహిళా సంఘాలు 2,519 1,499 749 426 414మొత్తం సభ్యులు 24,737 14,990 7,490 4,230 4,140ఆర్పీల సంఖ్య 86 49 38 15 15 -
సర్వే@ 63 శాతం
నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఏకకాలంలో చేపట్టిన డిజిటల్ సర్వే, పంటల సాగు నమోదు జిల్లాలో ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 63శాతం సర్వే పూర్తి చేశారు. సెప్టెంబరు 1న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు సర్వే జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించి, రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. వాటిని సరిచేసి చివరి జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్నారు. వివరాలను శాటిలైట్కు అనుసంధానం చేయాలనే లక్ష్యంతో.. రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ కమతాలను, పంటల సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ వివరాలను శాటిలైట్కు అనుసంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తోంది. మొబైల్ యాప్తో క్ల్లస్టర్ పరిధిలోని ప్రతి ఏఈఓ 2వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలు ఈ ఏడాది నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఏఈఓ తన క్లస్టర్ పరిధిలోని భూ కమతాలకు వెళ్లి సర్వే నంబర్ను ఎంపిక చేసుకుని భూమిలో సాగు చేసిన పంటను ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా.. అన్నదాతలు సాగు చేసిన ప్రతి పంట వివరాలను అధికారులు సర్వే నంబర్ల ఆధారంగా నమోదు చేస్తారు. మొబైల్ యాప్తో సాగు విస్తీర్ణం అప్లోడ్ చేస్తారు. వరి పంటకు సంబంధించి రకాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం లేని భూముల్లో సాగు, రైతుల వివరాలను, ఆధార్ వివరాలను పరిగణనలోకి తీసుకుని యాప్లో నమోదు చేస్తున్నారు. 6.17 ఎకరాల్లో సాగు జిల్లాలో 6.17లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో వరి 4,85,125 ఎకరాలు, పత్తి 91వేల ఎకరాలు, కంది 2,650 ఎకరాలు, పెసర 2,700 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, మొక్కజొన్న 45 ఎకరాలు, మిర్చి 15,150 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, ఆయిల్పామ్ 4,000 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాలు, పండ్లు, కూరగాయలు 16,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిలో ఇప్పటి వరకు సుమారు 3లక్షల ఎకరాల్లో వరి, 80వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో ఇతర పంటల వివరాలను ఏఈఓలు సర్వేలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుల సంఖ్య : 2.81 లక్షలుక్లస్టర్లు : 82పంటల సాగు విస్తీర్ణం : 6.17 లక్షలు నమోదు చేసిన పంటలు : 3.90 లక్షలుఫ 3.90లక్షల ఎకరాల్లో పూర్తయిన డిజిటల్ సర్వే ఫ సాగైన పంటల నమోదు ముమ్మరం ఫ ఈనెల 25 లోపు పూర్తిచేసేలా కార్యాచరణ ఫ తుది జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్న అధికారులు ఫ ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో ప్రామాణికం కానున్న సర్వే రైతులకు బహుళ ప్రయోజనాలు పంట నమోదు, డిజిటల్ సర్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రైతుల పేరుతో పత్తి, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే వ్యాపారులు, మధ్య దళారులను నిలువరించవచ్చు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో తెలపడంతో పాటు ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో దీనిని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నడు పరిహారం అందించేందుకు ఈ వివరాలు చాలా ఉపయోగపడతాయి. -
గుర్తింపు పొందిన పార్టీలు 12
చిలుకూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి 12 రాజకీయ పార్టీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచే ఆయా అభ్యర్థులకు పార్టీలు బీ ఫారాలు అందజేస్తాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీలకు స్థానిక ఓటర్ల జాబితా ముద్రించి అందించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్ జాబితాను ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం, ఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ, జనసేన పార్టీలను మాత్రమే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందిస్తే వారికి పార్టీల గుర్తులు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే వారికి ఇతర గుర్తులు కేటాయించనున్నారు. ఫ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు ఫ ఆయా పార్టీలకు ఓటర్ల జాబితా అందించేందుకు ఏర్పాట్లు ఫ బీ ఫారాలు పొందిన అభ్యర్థులు పార్టీల గుర్తుతో బరిలోకి ఫ స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులు కేటాయింపు ఎంపీటీసీ స్థానాలు : 235జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు : 23పోలింగ్ కేంద్రాలు : 1272మొత్తం ఓట్లు : 6,94,815ముమ్మరంగా ఎన్నికల ప్రక్రియ జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1272 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిల్లో మొత్తం 6,94,815 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, వారి విగ్రహాలకు ముసుగులు వేశారు. కాగా.. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించే తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
సూర్యాపేట : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీసీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్, రాష్ట్ర సహాధ్యక్షుడు మన్నూరు నాగన్న అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగి జాన్ కిషోర్ను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. లోప భూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో కనీసం భద్రత, భరోసా లేకుండా జీవితాలను దుర్భరంగా గడుపుతున్న పరిస్థితి వచ్చిందన్నారు. క్రాఫ్ట్ టీచర్ జాన్ కిషోర్ ఉద్యోగ విరమణ పొంది సంవత్సరం గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేరెళ్ల దేవరాజు, పరమేష్ మల్లికార్జున్, రవీందర్, సుధాకర్, కేశవరెడ్డి, సైదులు, కేశవరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ టీజీసీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్ -
రుణ సౌకర్యం ఎంతో మేలు
ప్రధానమంత్రి స్వనిధి రుణాల్లో భాగంగా మాకు మొదటిసారిగా రూ.10వేల లోన్ ఇచ్చారు. తర్వాత రూ.20వేలు ఇచ్చారు. అవి పూర్తిగా కట్టాం. ఇప్పుడు రూ.50వేల రుణం తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఈ సౌకర్యం ఎంతో మేలు. – గౌస్య, కూరగాయల వ్యాపారి లోక్ కల్యాణ్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఇచ్చే రుణాలు పొంది వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బలపడి పలువురికి ఆదర్శంగా నిలవాలి. – సీహెచ్ హనుమంత రెడ్డి, మెప్మా పీడీ -
డబ్బు, మద్యంతో గెలిచేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పాలకవర్గ పార్టీలతో పాటు మతోన్మాదన శక్తులు డబ్బు, మద్యం, కులం, మతం, బంధుప్రీతితో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఎన్నికల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి సైదులు, ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు సంపేట కాశయ్య, దాసరి శ్రీనివాస్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్యకల్యాణతంతును ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలో భాగంగా నిత్య కల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. శనివారం వేకువజామున శ్రీస్వామి,అమ్మవార్లకు సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. మూసీకి కొనసాగుతున్న ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. శనివారం మూసీకి 2,579 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్లను పైకెత్తి 2,601 క్యూసెక్కుల నీటిని వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 529 నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందడి నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. శనివారం సాగర్కు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. కృష్ణాతీరం వెంట, ఎత్తిపోతల, అనుపు, బుద్ధవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించేందుకు లాంచీల్లో వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల రాతి, ఇనుప పనిముట్లు, బౌద్ధమతవ్యాప్తికి సంబంధించిన ఆనవాళ్లు, విగ్రహాలను సందర్శించారు. -
సానుభూతికి నో ఛాన్స్
తిరుమలగిరి (తుంగతుర్తి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా .. గతంలో ముందుగా ఒక నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలో ఏదో ఒకటి ముందు జరిగేది. ఇలా జరగడం వల్ల ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి దరిదాపుల్లోకి వచ్చి ఓడి పోయిన వారు మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈసారి సానుభూతికి ఛాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు సానుభూతిని మూటగట్టుకునే ఛాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరిశీలించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. రెండింటికీ పోటీ చేస్తే నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈసారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి తరువాత సర్పంచ్గా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ నేతలకు తలపోట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీల నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ ఏక కాలంలో ఎన్నికలు రావడంతో ఒక్కో ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని మళ్లీ గ్రామ స్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఇప్పుడు ఈజమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్దం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా అక్టోబర్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్ 15న నామినేషన్లకు చివరి రోజు, 27న రెండవ విడతకు నామినేషన్లు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 11న వెలువడతాయి. ఎన్నికలు జరిగిన తరువాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. ఫ ‘స్థానికం’లో ఒకేసారి ఎన్నికలు ఫ వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఫ ఓడి గెలిచేందుకు అవకాశం లేదు -
జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు
ఫ తుంగతుర్తిలో ముగిసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ఫ తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఫ జోహార్ దామన్న అంటూ అశ్రునివాళి ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, లక్ష్మణ్కుమార్, పీసీసీచీఫ్ మహేష్కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీతుంగతుర్తి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జనహృదయనేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తన గడి వెంట ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గౌరవసూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆర్డీఆర్ కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దామన్నను కడసారి చూసేందుకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్ దామన్న అంటూ నినాదాలు చేశారు. ప్రముఖుల శ్రద్ధాంజలి ఈ అంత్యక్రియల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వృద్ధుల వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్మేలు మందుల సామేలు, పద్మాతిరెడ్డి, కుంభం అనిల్ కుమార్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనిల్రెడ్డి రాజేందర్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, గాదరి కిషోర్కుమార్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, మహిళా కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఎస్పీ కె.నరసింహలతో పాటు పలువురు ప్రముఖులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. శోక సంద్రంలో తుంగతుర్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి తుంగతుర్తి ప్రజలతో పాటు, ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. జనహృదయనేతను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. దామోదర్ రెడ్డి పార్థివ దేహం శుక్రవారం రాత్రి తుంగతుర్తిలోని స్వ గృహానికి చేరే వరకు వేచి ఉన్నారు. అలాగే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నివాళులర్పించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. -
భూ సమస్యలను పరిష్కరించాలి
అర్వపల్లి: భూ భారతిలో వచ్చిన భూ సమస్యలపై విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీచేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నియమావళిపై తహసీల్దార్ శ్రీకాంత్కు పలు సూచనలు చేసి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. పీహెచ్సీలో రికార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. పీహెచ్సీకి కుర్చీలు, ఫ్యాన్లు సమకూర్చినట్లు తెలిపారు. మందుల స్టాక్, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఉపాధ్యాయ ఖాళీలు
676చిలుకూరు: వివిధ దశల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తికావడంతో జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఇదే క్రమంలో పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఈ ప్రక్రియతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరింది.కానీ ప్రాథమిక పాఠశాలలను మాత్రం టీచర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీ ఉపాధ్యాయుల ప్రదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఎక్కడెక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాల సేకరణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు పదోన్నతులు చేపట్టడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ముగిసిన పదోన్నతుల ప్రక్రియ అనంతరం జిల్లాలో 676 ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా ఎస్జీటీ, అత్యల్పంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లా విద్యాశాఖ పరిధిలో మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు 950 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 3,710 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 676 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టుల ఖాళీలు ఏర్పడడంతో డీఎడ్ అభ్యర్థులకు కలిసిరానుంది. స్కూల్ అసిసెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 70 శాతం పదోన్నతులకు వదిలివేయాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే ఆ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ సమయానికి పదవీ విరమణ ఖాళీలను బట్టి మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఫ పదోన్నతుల ప్రక్రియ పూర్తితో తేలిన లెక్క ఫ హైస్కూళ్లలో తీరిన ఉపాధ్యాయుల కొరత ఫ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలు ఫ ప్రస్తుతం పనిచేస్తున్నది 3,710 మంది ఫ ఉద్యోగోన్నతి పొందినవారి సంఖ్య 139 జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందినప్పటికీ కొంత మందికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లలేదు. జీహెచ్ఎంలుగా 23 మంది పదోన్నతి పొందగా 20 మంది జాయిన్ కాగా ముగ్గురు జాయిన్ కాలేదు. అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 28 మందికి పదోన్నతి రాగా 16 మంది జాయిన్ అయ్యారు. 8 మంది జాయిన్ కాలేదు. స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 14 మందికి 12 మంది జాయిన్ అయ్యారు. గణితంలో 13 మందికి 11 మంది జాయిన్ అయ్యారు. భౌతికశాస్త్రంలో ఆరుగురికి నలుగురు జాయిన్ అయ్యారు. జీవశాస్త్రం సబ్జెక్టులో 18 మందికి 15 మంది జాయిన్ అయ్యారు. సోషల్ సబ్జెక్టులో 31 మందికి 18 మంది జాయిన్ అయ్యారు. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లో ఆరుగురికి ఆరుగురు జాయిన్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 139 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందగా వారిలో కేవలం 102 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు పలు కారణాల దృష్ట్యా విధుల్లో చేరలేదు. -
జోహార్.. ఆరీ్డఆర్
సూర్యాపేట : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి (ఆర్డీఆర్) మరణవార్త విని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈనెల 2వ తేదీ రాత్రి 10.10 గంటలకు దామోదర్రెడ్డి మృతిచెందిన విషయం విదితమే. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపులి లాంటి దామన్నకు ఎవరూ సాటిరారని, దేవుడు తమకు అన్యాయం చేసి మా నాయకున్ని తీసుకెళ్లాడని దుఃఖించారు. జోహార్ దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల సందర్శనార్థం రెడ్హౌస్కు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో నివాళులర్పించిన అనంతరం రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్హౌస్)కు తీసుకొచ్చారు. తమ అభిమాన నాయకున్ని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు వేలాది మందిగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా తరలివచ్చారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాళాల వద్ద మధ్యాహ్నం 3గంటల నుంచే ప్రజలు వేచిచూశారు. మరికొందరు రెడ్హౌస్ వద్ద బారులుదీరారు. సాయంత్రం 5.15 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంది. దామోదర్రెడ్డి పార్థివదేహం ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ముందుభాగంలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి కూ ర్చుని తన తండ్రిని చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ గా పార్థివదేహాన్ని రెడ్హౌస్కు తీసుకెళ్లారు. వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కడసారి తమ అభిమాన నాయకున్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో తుంగతుర్తికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్డీఆర్ గడీ పక్కనే పామాయిల్ తోటలో మహా ప్రస్థానం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్లు అంత్యక్రియల కోసం చేపట్టిన పనులను పర్యవేక్షించారు. సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వేదాపు వెంకయ్య, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఫ తుంగతుర్తికి చేరిన రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహం ఫ అంతకుముందు సూర్యాపేటలో భారీ ర్యాలీ ఫ రెడ్హౌస్లో మంత్రి సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి, జైవీర్రెడ్డి, ప్రముఖుల నివాళి ఫ కన్నీటి పర్యంతమైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఫ నేడు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో దామోదర్రెడ్డి పార్థివదేహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, జూలకంటి రంగారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, దోసపాటి గోపాల్, వివిధ పార్టీల నాయకులు చెరుకు సుధాకర్, బడుగుల లింగయ్య యాదవ్, పిట్ట రాంరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి నివాళులర్పించారు. వీరివెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు సర్వోత్తమ్రెడ్డి వెన్నంటే ఉన్నారు. -
పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు ఉంచాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రతినెలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.. సెలవులు, పరీక్షలు ఎప్పుడు ఉంటాయో.. ఉపాధ్యాయులుకు తప్ప విద్యార్థులకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఒక విద్యాసంవత్సరంలో ఏ నెలలో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో అన్ని వివరాలు తెలిసేలా అకడమిక్ క్యాలెండర్లు ముద్రించి అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎన్సీఈఆర్టీ దీన్ని రూపొందించింది. ప్రతి పాఠశాల, ఎమ్మార్సీలో ఒక్కోటి, డీఈఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రెండు చొప్పున ఉంచాలని ఆదేశించింది. జిల్లాకు కావాల్సిన 882 క్యాలెండర్లను ఇప్పటికే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పంపించారు. వీటిని శనివారం (4వ తేదీ) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. క్యాలెండర్లో పొందుపర్చిన అంశాలివే.. వార్షిక షెడ్యూల్లో బడిబాట, పాఠశాల పున:ప్రారంభం, దసరా, క్రిస్మస్ సెలవుల వివరాలు ఉన్నాయి. అలాగే పరీక్షల షెడ్యూల్లో ఎఫ్ఏ–1 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షల వరకు ఏయే తేదీల్లో నిర్వహించాలో పొందుపరిచారు. స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్, 1–10వ తరగతి వరకు సిలబస్ ఎప్పుడు పూర్తి చేయాలి, రివిజన్ తరగతుల నిర్వహణ వంటి వివరాలు ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పనిచేసే సమయాలను పొందుపరిచారు. ప్రతి నెలలో నిర్వహించే కార్యక్రమాలు, సముదాయ సమావేశాలు, పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీల వివరాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్స్పైర్ అవార్డులు, సెమినార్లు వంటి వివరాలున్నాయి. జూన్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతినెలా పాఠశాల పనిదినాలు ఎన్ని ఉంటాయి.. పీటీఎం సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. కోకరిక్యులర్ యాక్టివిటీలో ఆరోగ్యం, కంప్యూటర్, కళలు, సంస్కృతి, విలువలు, జీవన నైపుణ్యాలపై వారంలో ఎన్ని పీరియడ్లు తీసుకోవాలో పొందుపరిచారు. ఫ విద్యా కార్యక్రమాలు, సెలవుల సమాచారంతో రూపకల్పన ఫ ఏ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలో తెలిసేలా ముద్రణ ఫ జిల్లాకు 882 క్యాలెండర్లు కేటాయింపు ఫ ఇప్పటికే ఎమ్మార్సీలకు చేర్చిన విద్యా శాఖ ఫ నేటి నుంచి పాఠశాలలకు పంపిణీ -
మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద పవిత్ర కృష్ణానదికి శుక్రవారం రాత్రి అర్చకులు హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో మంగళ వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్కు తరలించారు. అనంతరం చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలి సూర్యాపేట అర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ, మండల, పట్టణ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం అభ్యర్థులు, సానుభూతి పనులను గెలిపించాలని కోరారు. సీపీఎం పోటీచేయని చోట్ల పోటీ విషయమై శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాలు నిలిపివేతఅర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను నిలిపివేశారు. వారబందీ విధానంలో గతనెల 8వ తేదీ నుంచి నిరంతరాయంగా గోదావరి జలాలను వదులుతున్నారు. అయితే లోయర్ మానేర్డ్యాం నుంచి రెండో దశకు వారబందీ విధానంలో నీటిని నిలిపివేయడంతో జిల్లాకు ఆపారు. ఎల్ఎండీ నుంచి నీటిని పునరుద్ధరించగానే జిల్లాకు వదులుతామని నీటిపారుల శాఖ అధికారులు తెలిపారు. -
డాక్టర్ పెంటయ్య సేవలు అద్భుతం
ఫ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు ఫ కోదాడలో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటును ప్రశంసించిన రాయుడు కోదాడరూరల్ : కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మూగజీవులకు అందిస్తున్న వైద్యసేవలు అద్భుతమని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.సుబ్బారాయుడు ప్రశంసించారు. శుక్రవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించి ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణ ప్రాంత జంతువులకే కాక పరిస ప్రాంత జంతువులను కోదాడకు తీసుకొచ్చి వాటికి కూడా ఎంతో ఓపికతో డాక్టర్ పెంటయ్య చేస్తున్న వైద్యసేవలను చూసి అభినందించారు. అదేవిధంగా దాతల సహకారంతో పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి సంవత్సర కాలంగా రైతులకు తక్కువ ధరలకే మందులను అందజేయడం గొప్పవిషయమని అన్నారు. ఈ విధంగా ఏడాదిలో రూ.3.5కోట్ల అదనపు ఉత్పత్తుతులను సాధించి రివాల్వింగ్ ఫండ్తో ప్రణాళిక పద్ధతిలో మందులను తీసుకొచ్చి పాడి రైతులు, జీవాల పెంపకందారులు, పలు రకాల జంతువుల పోషకులకు మందులు అందజేస్తున్న డాక్టర్ పెంటయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట డాక్టర్ పెంటయ్య, వైద్యసిబ్బంది ఉన్నారు. -
కాంగ్రెస్ కసరత్తు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికపై నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంత నెలకొంది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అభ్యర్థులను ఎవరన్న దానిపై ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఈనెల 6వ తేదీ నాటికి పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్, ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సాధించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా, సూర్యాపేట చైర్మన్ పదవి బీసీకి, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే జెడ్పీ చైర్మన్ పదవి ఆశించే నేతలు సులభంగా గెలిచే జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు. ఎన్నికల మూడ్లోకి కాంగ్రెస్ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆశావహులు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికల మూడ్లోకి వచ్చేసారు. పోటీ చేయాలనుకునే వారంతా తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు ఆయా పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. జెడ్పీ పీఠం దక్కేదెవరికో..? ● నల్లగొండ జెడ్పీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఈసారి చైర్మన్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఈ అయిదు స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ఎస్టీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. అందులో అడవిదేవులపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, దామరచర్ల, తిరుమలగిరిసాగర్ స్థానాల్లో ఎస్టీ మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె వద్దంటే ఆమె కుమారుడు స్కైలాబ్నాయక్ సతీమణిని బరిలో దింపుతారన్న చర్చ జరుగుతోంది. ఆమె ప్రభుత్వ అధికారి అయినందున పోటీ కి ఆసక్తి చూపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ● సూర్యాపేట జిల్లా జెడ్పీ పీఠం బీసీలకు రిజర్వు కావడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టినా మంత్రులు ఇంకా దృష్టి సారించలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియల తరువాత దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. అయితే బీసీలకు రిజర్వు చేసిన గరిడేపల్లి, కోదాడ, నడిగూడెం, పెన్పహాడ్, నాగా రం, బీసీ మహిళలకు కేటాయించిన ఆత్మకూరు(ఎస్), చింతలపాలెం, మేళ్లచెరువు, నేరేడుచర్ల, సూర్యాపేట, జనరల్ మహిళలకు కేటాయించిన అర్వపల్లి, మఠంపల్లి, జనరల్ స్థానాలైన చిలు కూరు, చివ్వెంల, పాలకీడు స్థానాల్లో పోటీచేసి గెలిచే బీసీ నాయకులకు చైర్మన్ పదవి దక్కనుంది. ● యాదాద్రి–భువనగిరి జిల్లా పరిషత్ స్థానం బీసీ మహిళలకు కేటాయించారు. దీంతో ఇక్కడ బీసీలకు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లో బీసీ మహిళలు ఎవరైనా పోటీ చేసి గెలు పొందితే వారిలో ఒకరికి జెడ్పీ చైర్పర్సన్ అయ్యేందుకు అవకాశం దక్కనుంది. బీసీ మహిళలకు కేటాయించిన ఆలేరు, ఆత్మకూరు (ఎం), చౌటుప్పల్తో పాటు బీసీలకు కేటాయించిన అడ్డగూడూరు, భూదాన్పోచంపల్లి, గుండాల వలిగొండ జడ్పీటీసీ స్థానాలతో పాటుగా, జనరల్ మహిళలకు కేటాయించిన భువనగిరి, మోటకొండూరు, తుర్కపల్లి, జనరల్ అయిన బీబీనగర్, సంస్థాన్ నారాయణపురం, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ మహిళలు పోటీచేసే అవకాశముంది. ఫ జెడ్పీటీసీ సభ్యులు, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతల దృష్టి ఫ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిలో జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల కోసం అన్వేషణ ఫ నల్లగొండలో ఎస్టీ మహిళ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఫ పోటీచేసే యోచనలో రాగ్యానాయక్ సతీమణి లేదంటే కోడలు -
రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ అమలులో లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీల మీటింగులు, ర్యాలీలకోసం అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరికై నా ఎలక్షన్ పై సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేయాలనుకున్నా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీసీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, రాజేశ్వరరావు, లింగయ్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఆబిద్, కోట గోపి, స్టాలిన్, వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈ ఓ శిరీష, డీఎల్పీఓ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు విజయ దశమి
సూర్యాపేట అర్బన్: దసరా పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.శమీ, ఆయుధ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవిని ఆరాధించడం, ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం ఈ పండుగ ప్రత్యేకత. ఆయుధ పూజ పోలీసులు దసరా రోజు ఆయుధాలకు పూజలు చేస్తారు. అలాగే పరిశ్రమల్లో యంత్రాలు, ఇతర పరికరాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే చాలామంది దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేదా సహజంగా ఉన్న జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రావణ ప్రతిమలు ఏర్పాటు చేసి దహనం చేస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శమీ పూజకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్కెట్లలో సందడి కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. దీంతో బైకులు, ఎలక్ట్రికల్, వస్త్రదుకాణాలు, ఫుట్వేర్, లేడీస్ ఎంపోరియం, పూలు, పండ్లు, కూరగాయల దుకాణాలు రాత్రి పొద్దుపోయే వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి. రహదారులపై వాహనాల రద్దీ సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. షాపింగ్ చేసేందుకు ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లుండడంతో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు, బైక్లపై సొంతూళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. ఫ వేడుకలకు సిద్ధమైన ప్రజలు ఫ పట్టణాలు, పల్లెల్లో సందడి ఫ శమీ పూజకు, రావణ దహనానికి ఏర్పాట్లు -
నాణ్యమైన సేవలు అందిస్తాం
ఫ బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశం నల్లగొండ, రామగిరి(నల్లగొండ): బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. వెంకటేశం అన్నారు. బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పానగల్ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ప్రజలకు చవక, నమ్మదగిన సేవలను అందిస్తూ బీఎస్ఎన్ఎల్ ముందంజలో ఉందని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్టీటీహెచ్ ప్యాకేజీలు రూ.299, రూ.399లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, టీవీ ఛానల్స్, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్ఏ సత్యనారాయణ, ఏజీఎం సుబ్బారావు, శాంతికుమారి, రాములు, సురేందర్, వెంకన్న, నరేందర్, జీవన్కుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పండుగ గుర్తెరగం
నా చిన్నతనం నుంచి నేటి వరకు కూడా మా గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం చూడలేదు. మా గ్రామంలో గతంలో దసరా ఉత్సవాల సందర్భంగా కంకణం కట్టే విషయంలో కులాల మధ్య ఏర్పడిన ఘర్షణల వలన నేటికీ పండుగ జరుపుకోవడం లేదు. – పసునూటి అయోధ్య, మాచనపల్లి నా వయస్సు 34 సంవత్సరాలు. గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించక దాదాపు 42 సంవత్సరాలు. మా గ్రామంలో సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మధ్య ఆధిపత్య పోరుతో కంకణం కట్టుకునే విషయంలో ఏర్పడిన ఘర్షణ వలన దసరా జరుపుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి దసరా పండుగ జరుపుకునేలా చూడాలి. – పులుసు సతీష్గౌడ్, చిల్పకుంట్ల ● -
ప్లాస్టిక్ భూతంపై సమరం
ఫ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో 15 అడుగుల భూతం తయారీ ఫ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రీన్ క్లబ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రదర్శన సూర్యాపేట అర్బన్: సూర్యాపేట జిల్లా కేంద్నానికి చెందిన గ్రీన్ క్లబ్ ట్రస్టు కొన్నేళ్లుగా ప్లాస్టిక్ భూతంపై సమరం సాగిస్తోంది. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశంలోనే మొదటిసారిగా సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద మున్సిపాలిటీ సహకారంతో ఏర్పాటు చేసిన 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని బుధవారం ఆ క్లబ్ సభ్యులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్టు అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ రావణాసురుడి కంటే భయంకరమైనది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని పేర్కొన్నారు. విజయదశమి నుంచి ప్లాస్టిక్ను తరిమివేస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు తోట కిరణ్ సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు ముప్పారపు నాగేశ్వరరావు, తల్లాడ రామచంద్రయ్య, తొణుకునూరు మురళీమోహన్లను మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హనుమంతరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండి గౌసుద్దీన్, పర్యావరణ విభాగం ఇంజనీర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడగా.. దాని కింద పడి నలిగిపోయిన తూఫాన్ వాహనాలను బయటకు తీసేందుకు పోలీసులు అర్ధరాత్రి వరకు శ్రమించారు. యాసిడ్ ట్యాంకర్ తలకిందులుగా పడటం, అందులో యాసిడ్ ఉండడం, పోలీసులు రెండు జేసీబీలు, మూడు క్రేన్లు తీసుకొచ్చి ఐదు గంటలకు పైగా శ్రమించిన తర్వాత ట్యాంకర్ పైకి లేచింది. దానిని రోడ్డు పక్కకు ఉంచారు. అదేవిధంగా ట్యాంకర్ కింద నుజ్జునుజ్జయిన తూఫాన్ వాహనాలను బయటకు తీశారు. నాగార్జునసాగర్కు తగ్గిన వరదనాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 4,14,188 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్యులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 33,536, మొత్తం 3,94,858 క్యూసెక్యుల నీటిని దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువ, ఏఎంఆర్పీ, వరద కాలువలకు 19,330 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు. -
టైగర్ దామన్న ఇక లేరు
సూర్యాపేట : టైగర్ దామన్నగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో పేరుగాంచిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో ఆయన జన్మించారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి కుమార్తె వరూధినిదేవిని వివాహమాడారు. ఆయనకు కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట్రెడ్డికి స్వయానా సోదరుడు. దామోదర్రెడ్డి 1985 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు. పార్టీకి ఎంత కష్ట కాలం వచ్చినప్పటికీ పార్టీని వీడకుండా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో కార్యకర్తలకు అండగా నిలిచారు. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొడుతూ.. 1985 నాటికి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యంతోపాటు కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలుకలు ఉండడంతో కమ్యూనిస్టులను ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎర్రపహాడ్ జమీందారు జన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డికి స్వయంగా బావమరిది అయిన రాంరెడ్డి దామోదర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 1985లో దామోదర్రెడ్డి మొదటిసారి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటిదాకా తుంగతుర్తి నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. 1989లో మరోసారి గెలుపొందారు. మూడోసారి 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో నిలిచి సీపీఎం అభ్యర్థిపై విజయం సాధించారు. నాలుగోసారి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అదే సంకినేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఈసారి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో.. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి పోరెడ్డి చంద్రశేఖర్రెడ్డిపై విజయం సాధించారు. 1985 నుంచి వరుసగా తుంగతుర్తి నుంచి మూడుసార్లు గెలుపొంది ఒకసారి ఓటమి చవిచూసి మరోసారి గెలుపొంది నాలుగుసార్లు విజయం సాధించారు. అనంతరం సూర్యాపేట నుంచి 2009లో మరోసారి విజయం సాధించి మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994లో తెలుగుదేశం మిత్రపక్షాల హవాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలుపొందగా.. కేవలం తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే దామోదర్రెడ్డి గెలుపొంది కాంగ్రెస్ సత్తా చాటారు. 1985 కంటే ముందు తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టుల హవా కొనసాగి భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేలుగా పనిచేయగా దామోదర్రెడ్డి రంగ ప్రవేశంతో కమ్యూనిస్టుల ప్రాబల్యానికిగండి కొట్టినట్లు అయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన దామోదర్ రెడ్డి కనుమూయడంతో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది. పేటలో మూడుసార్లు ఓటమి దామోదర్ రెడ్డి 2014 నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో పోటీచేసి వరుసగా 2014, 2018, 2023లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి లోని వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 4వ తేదీన జరగనున్నాయి. మూడవ తేదీ 12 గంటలకు హైదరాబాదు నుండి ఆయన మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించి సూర్యాపేటలోని రెడ్హౌస్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అదే రోజు రాత్రి పార్థివదేహాన్ని తుంగతుర్తికి తరలించి 4వ తేదీ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జగదీష్రెడ్డి సంతాపం మాజీ మంత్రి దామోదర్రెడ్డి మృతి పట్ల సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.ఫ హైదరాబాద్లో కన్నుమూసిన రాంరెడ్డి దామోదర్రెడ్డి ఫ కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్కు జవసత్వాలు నింపిన నేత ఫ తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం ఫ గోదావరి జలాల సాధకుడిగా పేరు ఫ 3న సూర్యాపేటకు పార్థివదేహం ఫ 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు -
ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం
రాజాపేట : దసరా పండుగను రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ పండుగ రోజు స్వగ్రామానికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. రాజుల కాలం నుంచి గ్రామానికి చెందిన ఠాకూర్ వంశస్తులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు నిర్వహించి 9వ రోజు ఆయుధపూజ నిర్వహిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రం(సిరిమల్లె) వంశీయులతో కలిసి డప్పువాయిద్యాలతో గడికోటలోని మైసమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు చేస్తారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని తల్వార్లతో ప్రదర్శన నిర్వహిస్తూ జమ్మి కోసం బయల్దేరుతారు. గ్రామం శివారులోని సంఘమేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకుని జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. పూర్వం మాత్రం ఠాకూర్ వంశానికి చెందిన సత్యనారాయణసింగ్ తనకున్న లైసెన్స్ గన్ భుజానికి వేసుకుని ఊరేగింపుగా వెళ్లి శమిపూజ తర్వాత గన్తో రెండుమార్లు తూర్పుదిక్కు గాలిలోకి పేల్చిన అ నంతరం ప్రజలు జమ్మి తీసుకునేవారు. ఠాకూర్ సత్యనారాయణసింగ్ 1994 వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ప్రతి ఏడాది దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు గ్రామస్తులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు జాతీయ జెండా, తల్వార్లతో ర్యాలీగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. రామన్నపేట: రాన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కచ్చీరు వద్ద జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పటేల్ వంశస్థులు పండుగ రోజు తెల్లవారుజామున పాత జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఉదయం 10గంటల సమయంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి కొత్త జెండా కర్రకు అలంకరణ చేసి కొత్త తాడుతో జాతీయ జెండాను ఎగర వేయడం జరుగుతుంది. జాతీయ పతాకావిష్కరణలో గ్రామస్తులంతా పాల్గొంటారు. జమ్మిచెట్టు వద్దకు పూజకు వెళ్లే సమయంలో అక్కడే పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, కులపెద్దలకు కంకణాలు అందజేస్తారు. జమ్మిచెట్టు నుంచి జాతీయజెండా వద్దకు తిరిగి వచ్చి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా నిధానపల్లిలో బురుజుపైన, నీర్నెముల, శోభనాద్రిపురం, సిరిపురం గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.ప్రత్యేకంగా ఠాకూర్ వంశస్తులుదసరా రోజు జాతీయ జెండా ఆవిష్కరణ -
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఖమ్మం జిల్లాలో జన్మించినా తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన, ఆ తరువాత హైసూ్కల్ విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. తుంగతుర్తికి చెందిన వరూధినీ దేవిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. 1985లో రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008లో నియోజకవర్గాల పునరి్వభజన జరిగే వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకట్రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్లో దామన్నది ప్రత్యేక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డిమాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రిగ్బాంతికాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి అని ఆయనను తామంతా దామన్న అని పిలుచుకునే వాళ్లమని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని , ఒక నిజాయితీ గల నాయకుడిగా, ప్రజాసేవలో ఆయన చూపిన తపన ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు దుఃఖ సమయంలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు తుంగతూర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుండి అయిదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.దామోదర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతిమాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. దామన్న లేడు అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేదు, పార్టీ పటిష్ఠతకు దివంగత దామోదర్ రెడ్డి వేసిన పునాది బలమైనది. కాంగ్రెస్ తో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.కమ్యూనిస్టుల్బకంచుకోటలను ఛేదించిన ధీశాలి, అటువంటి మహానేత మననుండి నిష్క్రమించడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కీలకమైనది.పార్టీ కోసం,పార్టీ ఆశయాల కోసం,పార్టీ క్యాడర్ కోసం నిరంతరం పరితపించిన నేత దామోదర్ రెడ్డి. చివరి వరకు కాంగ్రెస్ పార్టీని ఊపిరిగా భావించిన యోధుడు దామన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దామోదర్ రెడ్డి మరణం.కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు. దామోదర రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నాయకులు, దామోదర రెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసింది.5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై మంత్రి కొండా సురేఖ ద్రిగ్బాంతితెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు దామోదర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ మహనీయుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సురేఖ ప్రార్థించారు.1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపుఅనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిదామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాలతల్లిదండ్రులు: నారాయణ రెడ్డి, కమలమ్మనలుగురు సోదరులు, సోదరీమణులుప్రైమరీ స్కూల్ కామేపల్లి, హైదరాబాద్ వివేక వర్ధిణి, వరంగల్ లో బీఎస్సీ, బీజెడ్సీజననం: 1952, 14 సెప్టెంబర్ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపు1992 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 2007 లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన దామన్ననాలుగుసార్లు తుంగతుర్తి, ఒకసారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు1994లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్(ప్రజా కాంగ్రెస్) గా పోటీ చేసి గెలుపు1999 లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు చేతిలో ఓటమి2004 లో తుంగతుర్తి నుంచే సంకినేనిపై దామన్న గెలుపు1985 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే1989 లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురిలో దామన్న ఒకరుతెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికలు 2014, 2018, 2023 లో వరుసగా మూడుసార్లు ఓటమి2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమిఎన్నికల పూర్తయ్యాక అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయిన దామోదర్ రెడ్డి -
అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీ, గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించినందున సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం ఆయన కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలోని 23 మండలాల జెడ్పీటీసీలు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 486 గ్రామపంచాయతీలు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 4,403 పోలింగ్ కేంద్రాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 1,272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 541 పోలింగ్ ప్రాంతాలు, 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టేజ్–1, స్టేజ్ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయగా, ఆర్ఓ, పీఓల శిక్షణ కార్యక్రమాలు మండలాల వారిగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్ లు పూర్తి వివరాలను ప్రదర్శించాలన్నారు. మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అలాంటి వార్తల వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో ఖర్చుగా చూపించనున్నట్లు చెప్పారు. మీటింగ్లు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రభుత్వ పథకాల మంజూరు, గ్రౌండింగ్, ప్రారంభోత్సవాలు ఉండవని, జిల్లా కలెక్టర్ మొదలుకొని కిందిస్థాయి వరకు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తారని చెప్పారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈ అప్పారావు, డీపీఓ యాదగిరి, నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్, సూర్యాపేట డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా సమాచార ఇంజనీర్ మల్లేశం, డిప్యూటీ సీఈఓ శిరీష, డివిజనల్ పంచాయతీ అధికారి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దు
సూర్యాపేటటౌన్ : అనవసరమైన లింక్లను అనుసరించి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ సూచించారు. సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న ముగ్గురి బాధితుల ఖాతాల్లో రూ.28లక్షల నగదును తిరిగి జమ చేయించి వారికి కోర్టు ఉత్తర్వులను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుడి మొబైల్ ఫోన్కు బిజినెస్ ఆఫర్ ఉందని మెసేజ్ వచ్చిందని, బాధితుడు మెసేజ్ను అనుసరిస్తూ సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ టోల్ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్, పట్టణ పోలీసులు అప్రమత్తమై సంబంధిత బ్యాంకు వారిని అతడి అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదులో రూ.26.42 లక్షల నగదు హోల్డ్ చేయించినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ నగదు మహారాష్ట్రకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పశ్చిమబెంగాల్కు చెందిన బంధన్ బ్యాంక్ వినియోగదారుల ఖాతాలకు బదిలీ అయ్యిందని గుర్తించి కోర్టు ఆర్డర్స్ ద్వారా తిరిగి బాధితుడికి ఇప్పించినట్లు తెలిపారు. ఇదేవిధంగా మరో వ్యక్తికి రూ.51వేల నగదు, ఇంకొక వ్యక్తికి రూ.90వేలు వారి అకౌంట్లలోకి వేసినట్లు ఎస్పీ వివరించారు. డబ్బులు తిరిగి పొందిన బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కమ్యునికేషన్స్ హెడ్కానిస్టేబుల్ మహేష్, కానిస్టేబుల్ మహేష్ చారి, రాజేష్, సైదులు, నాగయ్య పాల్గొన్నారు. ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
డివైడర్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఫ మరో ఇద్దరికి గాయాలు నేరేడుచర్ల: కారు డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్ల పట్టణంలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ నిమ్మతోట తనూజ్కుమార్(27) తన స్నేహితులు ఎస్కే నహీం, మాసిబోయిన నరహరి, తోము లోకేష్తో కలిసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఓ ఈవెంట్కు సంబంధించి ఫొటోగ్రఫీ గురించి మాట్లాడేందుకు సోమవారం రాత్రి కారులో వచ్చారు. ఈవెంట్ గురించి మాట్లాడిన అనంతరం తాగునీటి కోసం మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్లకు చేరుకొని ఓ టీస్టాల్ వద్ద ఆగారు. టీస్టాల్ ము ందు కారులో నుంచి లోకేష్ను దింపి యూటర్న్ తీసుకొని వస్తామంటూ మిర్యాలగూడ రోడ్డులోని హెచ్పీ బంక్ వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తనూజ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న నహీం, నరహరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నిమ్మతోట తరుణ్గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన హర్షవర్థన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ను చూడటానికి మంగళవారం రెండు బైక్లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు. -
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలను మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడారు. శేష జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్రావు, వీరబాబు, జానయ్య, యజ్దాని, భ్రమరాంబ, భూపాల్రెడ్డి, హాజీనాయక్ పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై జంక్షన్ల విస్తరణకు చర్యలు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామం వద్ద ఉన్న జంక్షన్ను ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి ఏసీపీ పరిశీలించి మాట్లాడారు. దండుమల్కాపురం పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ ఉండడంతో భారీ ట్యాంకర్లు రోడ్డు క్రాస్ చేసే సమయంలో హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దండుమల్కాపురం, బొర్రోళ్లగూడెం, కై తాపురం గ్రామాల వద్ద ఉన్న జంక్షన్లను విస్తరిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ సహకారంతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. హైవేపై ప్రయాణించే వాహనాల వేగం జంక్షన్ల వద్ద తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఇంజనీరింగ్ విభాగం అధికారులు కిషన్రావు, శరత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ డీజీఎం విశ్వేశ్వరరావు, చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్మోహన్ పాల్గొన్నారు. ఫ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి -
వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
పెన్పహాడ్: పెన్పహాడ్ మండలంలో మంగళవారం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. పెన్పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన దూబని లక్ష్మయ్య(35) తన వ్యవసాయం క్షేత్రంలో పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా.. మోటారుకు అనుసంధానించిన కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చీదెళ్ల గ్రామానికి చెందిన సురభి సైదులు(46) ఇంట్లోని దండెం తీగకు చేపలు ఎండపెడుతుండగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ రెండు ఘటనలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. -
బాస్కెట్బాల్ క్రీడాకారిణికి సన్మానం
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం గారెకుంటపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకట్రెడ్డి కుమార్తె విహారెడ్డి మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో అండర్–16 బాస్కెట్బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున వైస్ కెప్టెన్గా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఇరాన్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మంగళవారం గారెకుంటపాలెం గ్రామంలో విహారెడ్డిని గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విహారెడ్డి చిన్నతనం నుంచే బాస్కెట్బాల్ క్రీడలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, రత్నమాల, ఉపేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొమ్మలతో సులభంగా బోధించేలా..
ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. పాఠ్యాంశాలను బొమ్మలతో బోధించేందుకు గాను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. యాదాద్రి భువనగిరి నుంచి.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మండలం గొలనుకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏ. జ్యోతిర్మయి కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాల బోధనా పద్ధతులపై శిక్షణ ఈ జాతీయ స్థాయి శిక్షణలో దేశంలోని పలు రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, బొమ్మలతో బోధన, స్వయంగా బొమ్మల తయారీ గురించి నేర్చుకున్నట్లు ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, చారిత్రాక కట్టడాలు, బోనాలు, బతుకమ్మ, ఇక్కడి విద్యా బోధన తీరు తదితర విషయాల గురించి ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులకు వివరించినట్లు ఆమె తెలిపారు. సీసీఆర్టీ సంచాలకులు రాజ్కుమార్ జ్యోతిర్మయికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఫ జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొన్న గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి విద్యార్థులకు సులభంగా బొమ్మల ద్వారా పాఠాలు బోధించడం ఎలా అనేది జాతీయ స్థాయి శిక్షణలో నేర్పించారు. పాఠ్యాంశాల్లోని పాత్రల ప్రకారం స్వయంగా బొమ్మలు తయారు చేసుకోవడం కూడా తెలిసింది. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న వినూత్న బోధన పద్ధతుల గురించి తెలుసుకున్నాను. తెలంగాణలోని బోధన విధానాన్ని వేరే రాష్ట్రాల టీచర్లకు వివరించాను. శిక్షణలో భాగంగా రుద్రమదేవి వేషధారణతో పాఠ్యాంశం బోధించే అవకాశం నాకు దక్కింది. విద్యార్థుల్లో పాఠాలు వినాలనే ఆసక్తిని పెంపొందించి, తద్వారా సర్కారు బడుల్లో హాజరుశాతం పెంచడమే నా లక్ష్యం. త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొమ్మలతో బోధనపై అవగాహన కల్పిస్తాను. – ఏ. జ్యోతిర్మయి, ఉపాధ్యాయురాలు, గొలనుకొండ ప్రాథమిక పాఠశాల, ఆలేరు -
హైవేపై అదుపుతప్పిన యాసిడ్ ట్యాంకర్
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పారిశ్రామికవాడ నుంచి మంగళవారం యాసిడ్ను లోడ్ చేసుకున్న ట్యాంకర్ ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో అన్లోడ్ చేసేందుకు బయల్దేరింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాములు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగానే ముందున్న వాహనాల రద్దీని గుర్తించి బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు. ట్యాంకర్ వేగంతో ఉండడంతో బ్రేకులు పడలేదు. దీంతో చేసేదేమీ లేక ముందుకు వెళ్తే ప్రాణనష్టం జరుగుతుందన్న ఆలోచనతో ట్యాంకర్ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమ వైపుకు తిప్పాడు. ఈ క్రమంలో ముందున్న రెండు కార్లను ఢీకొట్టాడు. హైవే వెంట ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ను ఢీకొని సర్వీస్ రోడ్డులోకి వెళ్లి అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడి ఆగిపోయింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రమాద సమయంలో ట్యాంకర్లో డ్రైవర్తో పాటు నేరేడుచర్లకే చెందిన క్లీనర్ నవీన్ ఉన్నారు. డ్రైవర్ రాములకు తీవ్ర గాయాలై ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ ట్యాంకర్ రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఒక్కో వాహనానికి రూ.11లక్షల చొప్పున నష్టపోయామని వాహనాల యజమానులు సిలివేరు శివ, కవిడె నర్సింహ బోరున విలపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయంలో అందులోని యాసిడ్ లీకై రోడ్డుపై పారింది. తప్పిన ప్రాణనష్టం ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో, వాహనాల పక్కన డ్రైవర్లు, స్థానికులు సుమారు 20మంది నిల్చున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు నిమిషాల ముందే వారంతా అక్కడి నుంచి వెళ్లి సమీపంలోని దుకాణాల కూర్చున్నారు. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ సర్వీస్ రోడ్డులో పార్కింగ్ చేసిన వాహనాలపై బోల్తా ఫ ట్యాంకర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసిన పోలీసులు, స్థానికులు ఫ ఆస్పత్రికి తరలింపు ఫ చౌటుప్పల్ పట్టణంలో ఘటన -
కుటుంబ సమస్యలతో ఉరేసుకుని ఆత్మహత్య
గుర్రంపోడు: కుటుంబ సమస్యలతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. చామలేడు గ్రామానికి చెందిన ఆవుల నరేష్(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనికి వెళ్లిన నరేష్ తల్లి ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. కుటుంబ సమస్యలతోనే నరేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని తెలంగాణ జెన్కో ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(సీఈ) మంగేష్నాయక్ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్ కంట్రోల్ రూమ్లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్ పవర్హౌస్ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు. సమస్యలు లేకుండా చూడాలని వినతి భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని సద్దుల చెరువు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జట్టుకొండ మాట్లాడుతూ సద్దుల చెరువు వద్ద ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న (మహా ప్రస్థానం) శ్మశాన వాటికను అమృత్ పథకం కింద కేంద్రం పునర్నిర్మించిందన్నారు. గతంలో ఆరు ప్లాట్ఫాంలు ఉండగా ప్రస్తుతం మూడింటిని నిర్మించారని చెప్పారు. మున్సిపాలిటీ విస్తరిస్తున్నందున ఈ ప్లాట్ఫాంలు సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చలమల్ల నర్సింహ, రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవి చంద్ర, జుట్టుకొండ అజయ్కుమార్ పాల్గొన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ శ్రీలక్ష్మీనరసింహస్వామికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల సంవాదం రక్తికట్టించారు. అనంతరం కల్యాణతంతు ముగించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు క్రిష్ణమాచార్యులు,పద్మనాభాచార్యులు , బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి ,ఆంజనేయా చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పనులకు బ్రేక్..!
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులకు బ్రేక్ పడనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలు లేకుండా పోనుంది. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. జిల్లా యంత్రాంగమంతా దాదాపు ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లింది. స్థానిక సంస్థల సమరం ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలనే పాటించాల్సి ఉంది.ఈ మేరకు మంగళవారం రాజకీయ పార్టీలతో ఎన్నికల కోడ్పై మండల స్థాయిలో జిల్లావ్యాప్తంగా సమావేశాలను నిర్వహించారు. అలాగే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనుమతి తప్పని సరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో.. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం వర్తించనున్నాయి. అభ్యర్థుల ఖర్చులపై నిఘా సైతం ఉండనుంది. ప్రకటనలు, గోడలపై రాతలు రాయించే సమయంలోనూ ఎన్నికల సంఘం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. బోనస్ అందేనా! గత యాసంగి సీజన్లో జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. దాదాపు 50,992 మంది రైతులకు రూ.25.17 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్తో ఈ బోనస్ చెల్లింపులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. ఎన్నికల నిబంధనలు అడ్డంకిగా మారితే మరో 45రోజుల పాటు వేచిచూడాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదు. 486 గ్రామపంచాయతీల పరిధిలో సీసీరోడ్ల నిర్మాణం నుంచి నూతన భవనాల వరకు ఏ ఒక్క కొత్త నిర్మాణం ఈ ఎన్నికల కోడ్ కారణంగా చేపట్టకూడదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపనలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే నూతనంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలుస్తోంది. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల పరిస్థితిపై స్పష్టత లేదు. జిల్లాకు నియోజకవర్గానికి 3500ల చొప్పున ఇళ్లు మంజూరు కాగా.. అదనంగా ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోనుంది.ఫ అమలులోకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి ఫ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్ ఫ ఎన్నికల సంఘం పరిధిలోకి జిల్లా యంత్రాంగం -
22 ఏళ్లు దేశ రక్షణలో..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ వేలాద్రి కుమారుడు రవి 22 ఏళ్లు దేశ రక్షణలో ఆర్మీ జవాన్గా సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2003లో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఎంపికయ్యారు. మహరాష్ట్రలోని హేమనగర్లో శిక్షణ పొంది 2005లో ఆర్మీ జవాన్గా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచలప్రదేశ్లో పనిచేశారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో కూడా ఆయన పాల్గొని దేశానికి సేవలందించారు. ప్రస్తుతం అహ్మదానగర్లో పనిచేస్తున్న ఆయన మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. దసరా రోజు అభినందన సభ..రవి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్న సందర్బంగా అక్టోబన్ 2న దసరా రోజు చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అభినందన సభ నిర్వహించేందుకు గ్రామ యువత, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు పదవీ విరమణ పొందనున్న చిలుకూరుకు చెందిన ఆర్మీ జవాన్ -
మదర్ డెయిరీకి రూ.50 కోట్లు కేటాయించాలి
సాక్షి,యాదాద్రి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా మారిన మదర్ డెయిరీని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఏడాది కాలంలో మదర్ డెయిరీ అప్పుల పాలైనట్లు బీఆర్ఎస్ నాయకుడు గొంగిడి మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మదర్ డెయిరీని దివాలా దిశకు చేర్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు వేలాది మంది రైతులు, డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో పదేళ్లలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. మదర్ డెయిరీని ఎన్డీడీబీ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే అప్పుల కింద బ్యాంకు వాళ్లే లాకౌట్ చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసి, బ్యాంకును నమ్మించడానికి అప్పులకు కూడా ఇన్కం టాక్స్ కట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. డైరక్టర్ల ఎన్నికల్లో పొత్తు ధర్మం తప్పింది గొంగిడి మహేందర్రెడ్డే అన్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని అదనంగా పోటీలో నిలబెట్టి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అదనంగా రంగంలో దిగితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బులు ఇచ్చి, పాల చైర్మన్లకు ఫోన్లు చేసిన గొంగిడి మహేందర్రెడ్డి నైతికవిలువలు మర్చిపోయాడన్నారు. గత బీఆర్ఎస్ పాలకవర్గాల బాధ్యతారాహిత్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహులు, కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి విజ్ఞప్తి -
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం.. మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. మట్టపల్లి క్షేత్రం వద్ద..మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు -
యాదగిరీశుడి సేవలో పాదరాజ మఠం పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ ముల్బాగల్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠ అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్టలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు యాదగిరిగుట్ట: దసరా పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద సోమవారం రాత్రి బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరి క్షేత్రానికి భక్తులు వస్తుండటంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు. -
భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం
భువనగిరి: భువనగిరి పట్టణంలో సోమవారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తన దగ్గర రూ.11వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని వేడుకున్నాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన నంబర్కు రూ.11వేలు ఫోన్ పే చేయగా.. అతడు రూ.11వేల నగదును నాగేంద్రబాబుకు ఇచ్చాడు. అనంతరం నాగేంద్రబాబు నోట్లను పరిశీలించగా.. అవి దొంగ నోట్లని అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చన, అక్షరాభ్యాసం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుమందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. విద్యాలక్ష్మి అమ్మవారి వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న అర్చకులు -
హత్య కేసులో పది మంది అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్ది లింగస్వామికి, చారగండ్ల శివకుమార్కు ఐదేళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్పై హత్యాయత్నం చేసిన పెద్ది లింగస్వామిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగండ్ల శివకుమార్, పెద్ది లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో పెద్ది లింగస్వామి తన స్నేహితులు మాతంగి మధు, మరికొంత మందితో కలిసి శివకుమార్ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం శివకుమార్కు మాతంగి మధుతో ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ వద్దకు పిలిపించాడు. శివకుమార్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10గంటల సమయంలో మందు తాగుతుండగా.. పెద్ది లింగస్వామి, అతడి స్నేహితుడు మాతంగి మధు, మరికొందరు కలిసి మారణాయుధాలతో శివకుమార్ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కాగా హత్యకు గురైన శివకుమార్తో పాటు నిందితులపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు.. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రీ మధు, పెద్ది లింగస్వామి, సీతారాంపురానికి చెందిన చెవుల నరేష్, జేజేనగర్కు చెందిన జక్కి సతీష్, కేసారం గ్రామానికి చెందిన భాషపంగుల సతీష్, సూర రామచంద్రు, తాళ్లగడ్డకు చెందిన నేరెళ్ల శ్రీరాములు, అన్నాదురైనగర్కు చెందిన గువ్వల తరుణ్కుమార్, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేష్, ఇందిరమ్మ కాలనీకి చెందిన జెల్లా ఉదయ్కుమార్ అరెస్టయ్యారు. జేజేనగర్కు చెందిన జక్కి అనిల్, కృష్ణటాకీస్ దగ్గర గల వర్రె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. రిమాండ్కు తరలింపు పరారీలో మరో ఇద్దరు -
మోగిన స్థానిక నగారా
భానుపురి (సూర్యాపేట) : పల్లె పోరుకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. రెండు విడతల్లో జిల్లాలో ఉన్న 23 మండలాల్లోని 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలు, 486 గ్రామ పంచాయతీలు, 4,388 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. జిల్లా యంత్రాంగం చకాచకా ఎన్నికల పనులు మొదలు పెట్టింది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ రానుంది. సూర్యాపేట, తుంగతుర్తి డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లోని 11 జెడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు అదేనెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికోసం 550 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. రెండో విడతలో కోదాడ, హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో 12 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రెండు విడతల్లో పోలైన ఓట్లను నవంబర్ 11న లెక్కించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. దీనికోసం 722 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సర్పంచ్ స్థానాలకు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా జరగనున్నాయి. మొదట సూర్యాపేట, తుంగతుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 249 గ్రామపంచాయతీలు, 2,218 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ 2,218 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 2,32,962 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరో విడతలో కోదాడ, హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 237 గ్రామపంచాయతీలు, 2,170 వార్డుల కోసం జరిగే ఎన్నికలకు అధికారులు 2185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విడతలో దాదాపు 3,61,853 మంది ఓటు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా సూర్యాపేట జిల్లాలో మాత్రం రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. ఈ ఎన్నికలు ఏయే విడతల్లో నిర్వహించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. మరుసటి రోజు వార్డు సభ్యుల్లో నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. మండలాలు 23జెడ్పీటీసీ స్థానాలు 23ఎంపీటీసీ స్థానాలు 235పోలింగ్ స్టేషన్లు 1,272గ్రామపంచాయతీలు 486వార్డులు 4,388పోలింగ్ స్టేషన్లు 4,403మొత్తం ఓటర్లు 6,94,815స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలఫ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఫ అమలులోకి ఎన్నికల కోడ్.. ఎన్నికల నిర్వహణ పనుల్లో యంత్రాంగం బిజీ ఫ జిల్లా వ్యాప్తంగా 23 మండలాలు, 486 గ్రామపంచాయతీలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు విడత పోలింగ్ తేదీ డివిజన్లు స్థానాలు మొదటి అక్టోబర్ 23 సూర్యాపేట, తుంగతుర్తి 11 జెడ్పీటీసీలు, 112 ఎంపీటీసీలు రెండో అక్టోబర్ 27 కోదాడ, హుజూర్నగర్ 12 జెడ్పీటీసీలు, 123 ఎంపీటీసీలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ప్రారంభించారు. కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలనే పాటించాలని సూచించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి 15 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఇక ఎన్నికల నిర్వహణలో కీలకమైన ప్రొసీడింగ్ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. -
సద్దుల సంబరం
హత్య కేసులో పది మంది అరెస్ట్ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.50కోట్లు కేటాయించాలి మదర్ డెయిరీకి ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి కోరారు. మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025- 8లోకోదాడ పట్టణంలో బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళలు -
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి’ తో అనుసంధానం
నాగారం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి పని కల్పించనున్నారు. ఉపాధి కార్డు ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారుకు 90 రోజులు పని కల్పించి వేతన డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. తన సొంతింటికి కూలీ పనులు చేసుకున్నట్లయితే వేతనం కింద రూ.307 ఉండగా.. గరిష్టంగా 90 రోజులకు గాను రూ.27,630 చెల్లించనున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబు వేసే వరకు 50 పనిదినాలు కల్పించనున్నారు. కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరై జాబ్కార్డు కలిగిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 31 మంది లబ్ధిదారులను గుర్తించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జాబ్ కార్డు ఉన్నట్లయితే.. ఉపాధి హామీ కింద పనులు కల్పించాలని ఆదేశించారు.ఫ ఉపాధి హామీ కార్డున్న ఇందిరమ్మ లబ్ధిదారుడికి పనుల కల్పనకు ప్రణాళిక ఫ 90 రోజుల పనిదినాలకు వేతనం ఖాతాల్లో జమ ఫ ఇప్పటి వరకు 31మంది లబ్ధిదారుల గుర్తింపుప్రస్తుతం జాబ్ కార్డు కలిగి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఆయా లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి ఇంటికి అవసరమైన పనులు చేసుకుంటే కూలి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూస్తాం. – వి.వి. అప్పారావు, డీఆర్డీఓ -
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలన్నారు. ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712686057కు ఫోన్ చేసి పోలీసు సేవలు పొందాలన్నారు. ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతులు చేయిస్తాంమఠంపల్లి: మంచ్యాతండా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లకు మరమ్మతులు చేయిస్తామని నీటిపారుదల ఈఈ అశోక్ చెప్పారు. మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా వద్ద గల ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మూడు మోటార్లకు గాను పనిచేయని రెండిటికి మరమ్మతులు చేయించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈఈ వెంట డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్, లిఫ్టు చైర్మన్ కోట్యానాయక్, వైస్ చైర్మన్ చంద్రునాయక్, మాళోతు బాబునాయక్, రాజా నాయక్, ఆపరేటర్ నాగేశ్వరరావు ఉన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా రాంబాబునాగారం : బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన ఎర్ర రాంబాబును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్ సోమవారం నియమించారు. ఈ సందర్భంగా ఎర్ర రాంబాబు మాట్లాడుతూ బీఎస్పీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన బీఎస్పీ రాష్ట్ర కోఆర్టినేటర్లు బాలయ్య, దయానంద్, రామచంద్రం, పార్టీ నాయకులకు రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదలకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్కు 9,152 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్టు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 7,994 క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 643.50 వద్ద నిలకడగా ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మూసీ కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.06 టీఎంసీల నీరు న్విల ఉందని అధికారులు తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సూర్యాపేట అర్బన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు సన్నద్ధంకావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరైన మాట్లాడారు. ఈఎన్నికల్లో కావాల్సిన వ్యూహాన్ని రచించుకోవాలని, కలిసి వచ్చే రాజకీయ శక్తులతో ఫ్రంట్ గా ఏర్పడి స్థానికల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కోరారు. బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయనాయుడు, యల్లంల యాదగిరి, మేకల శ్రీనివాసరావు, మండవ వెంకటేశ్వర్లు, బత్తినేని హనుమంతరావు, పోకల వెంకటేశ్వర్లు ఎస్.కె. లతీఫ్, బూర వెంకటేశ్వర్లు, సాయబెల్లి, దేవరం మల్లేశ్వరి పాల్గొన్నారు. -
పేట మార్కెట్కు ఐదు రోజులు సెలవు
భానుపురి (సూర్యాపేట) : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈనెల 29 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఫసీయుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగ ఉండడంతో వ్యాపారులు, కార్మికుల కోరిక మేరకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. అలాగే దుర్గాష్టమి, దసరా పండుగల నేపథ్యంలో వచ్చేనెల 3వ తేదీ వరకు మార్కెట్ యార్డు, కార్యాలయానికి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు సెలువు దినాల్లో యార్డుకు ధాన్యం, ఇతర ఉత్పత్తులను తీసుకురావొద్దని కోరారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహుని నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవంతోపాటు నిత్యకల్యాణం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదనగావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి క్షేత్రంలో ఆదివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్తోత్తర పూజలు గావించారు. రాత్రి స్వామి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
‘ఉపాధి’లో బోగస్ హాజరుకు చెక్
చిలుకూరు: ఉపాధిహామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా నూతనంగా ఉపాధి కూలీల ముఖగుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్) విధానానికి శ్రీకారం చుట్టింది. ఒకరి పేరిట మరొకరు పనులకు వెళ్లటం లాంటి వాటికి చెక్ పడనుంది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు జిల్లాలో మూడు రోజులుగా ఉపాధిహామీ కూలీల ముఖ చిత్రం, ఇతర వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు) ఆన్లైన్లో కూలీల ఫేస్ ఐడీ నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షకుపైగా కూలీల కార్డులకు సంబంధించి ముఖ చిత్రాల సేకరణ నమోదును పూర్తిచేశారు. సూర్యాపేట మండలంలో 2,600 మంది వివ రాలు సేకరించి ముందుండగా చింతలపాలెం మండలంలో కేవలం 50 మంది వరకే సేకరించారు. అక్రమాలు జరగకుండా.. ఉపాధి పనుల విషయంలో గతంలో చనిపోయిన వారి పేరిట జాబ్కార్డు ఉంటే వారిపేరు మీద కుటుంబ సభ్యులు పనులకు వెళ్లేవారు. అలాగే 100 రోజుల పనిదినాలు పూర్తిచేసిన వారు ఇతరుల కార్డులతో పనిచేయడం వల్ల అక్రమాలు చోటుచేసుకునేవి. అయితే ఇకనుంచి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానంతెచ్చింది. కొత్త విధానం అమలైతే.. కొత్తగా తెచ్చిన ముఖగుర్తింపు హాజరు విధానం అమలైతే అక్రమాలకు చెక్ పడనుంది. ఈ విధానం వల్ల ఆన్లైన్లోనే హాజరు నమోదు కానుంది. ఎవరూ పనులకు వస్తే వారి పేరిట మాత్రమే హాజరు నమోదు కానుంది. ఒక జాబ్కార్డులో నలుగురు కూలీలు ఉంటే పనికి వచ్చిన వారి పేరిటే హాజరు నమోదుతో పాటు వేతనం కూడా వారి ఖాతాలోనే జమవుతుంది. చెల్లింపులు సైతం త్వరితగతిన పూర్తవుతాయి.మండలాలు 23 గ్రామాలు 475 జాబ్కార్డులు 2,63,000 కూలీల సంఖ్య 5,60,275పనులకు వెళ్తున్నవారు 3,34,539 ముఖగుర్తింపు హాజరు విధానానికి శ్రీకారం ఫ ఆన్లైన్లో కూలీల వివరాలు నిక్షిప్తం చేస్తున్న అధికారులు ఫ ఇప్పటికే నమోదైన లక్షమంది కూలీలు ఫ వచ్చే నెలలో పూర్తికానున్న ప్రక్రియ -
22 నెలలైనా గ్యారంటీల జాడేలేదు
చివ్వెంల(సూర్యాపేట) : ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడేలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీల బాకీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. గ్యారంటీలు ఇవ్వడమే కాదు.. అవి రాకపోతే మాకు గుర్తు చేయమని అనాడే కాంగ్రెస్ నాయకులు చెప్పారని, అందుకే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో గుర్తుచేయడాలనికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసి రూ.20వేల కోట్లని చెబుతున్నారని విమర్శించారు. రైతు భరోసా కింద ఒక్కో ఎకరాకు రూ.19వేలు, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి ఒకొక్కరికి రూ.55వేలు, ఆసరా పెన్షన్ల కింద ఒక్కొక్కరికి రూ.44వేలు, ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి రూ.22వేలు బాకీ ఉన్నారన్నారు. నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాలు అని చెప్పి 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రూ.24వేలు బాకీ ఉన్నారన్నారు. ఇచ్చిన ఒక్క గ్రూప్–1 నోటిఫికేషన్లో కూడా మొత్తం పైరవీలు చేసి కోట్ల రూపాయలు తీసుకుని ఆంధ్రోళ్లకు ఇచ్చారని ఆరోపించారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు భద్రత కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ హామీలు కేవలం సీఎం రేవంత్రెడ్డి మాత్రమే ఇచ్చినవి కావని.. ఏఐసీసీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ఇచ్చినవే అని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులనే కాదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. వీటన్నింటిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న చిన్న లీడర్లు ఫోన్ చేసినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. యూరియా కోసం లైన్లో నిలబడి మహిళలు చనిపోతే కనీసం కాంగ్రెస్ నాయకులు పరామర్శించలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందుకు వస్తే బాకీ కార్డు చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, పార్టీ ఇన్చార్జి ఆకుల లవకుశ, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహరావు, ధరావతు బాబునాయక్, గుర్రం సత్యనారాయణరెడ్డి, శ్రీరాములు, మాజీ సర్పంచ్ పల్లేటి శైలజనాగయ్య, నాగార్జున పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
రంగుమారిన పత్తిని ప్రభుత్వమే కొనాలి
ఆరు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. ఎకరానికి సుమారు రూ.15 వరకు ఖర్చు అయ్యింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిచేను మొత్తం ఎర్రబారింది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమే ఉంది. రంగుమారిన పత్తిని ప్రభుత్వం కొనాలి. ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. – బండగొర్ల దుర్గయ్య, రైతు, పస్తాల, నాగారం మండలం పత్తిచేలల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వరుస వర్షాల కారణంగా పత్తిచేలల్లో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే చిన్న, చిన్న కాలువలు ఏర్పాటు చేసి నీటిని తొలగించాలి. పత్తిలో రసంపీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమల నివారణకు వ్యవసాయశాఖ అధికారులు సలహాలతో సకాలంలో మందులు పిచికారీ చేసుకోవాలి. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ట్రాక్టర్ పంపిస్తాం.. డీజిల్ పోసుకోండి!
జానకీనగర్ గ్రామ వీధుల్లో ఉన్న చెత్త, నరికేసిన చెట్ల కొమ్మలుచిలుకూరు: మండలంలోని జానకీనగర్ గ్రామ వీధులు చెత్తమయంగా మారాయి. గ్రామ పంచాయతీ (జీపీ) సిబ్బంది తొలగించకపోవడంతో వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. చెత్తను తొలగించమని గ్రామ పంచాయతీని కోరితే డీజిల్కు డబ్బులు లేక జీపీ ట్రాక్టర్ నడవడం లేదని, ట్రాక్టర్ను పంపుతాం.. డీజిల్ పోసుకోండి అని అంటున్నారని గ్రా మస్తులు వాపోతున్నారు. చెత్తతోపాటు చెట్ల కొమ్మలను తొలగించి వీధుల్లోనే వేశారు. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వెంటనే చెత్తను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై కార్యదర్శి రజితను వివరణ కోరగా నిధుల కొరత ఉందని, ట్రాక్టర్ డీజిల్కు కూడా నిధులు లేవని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె వివరణ ఇచ్చారు. ఫ జానకీనగర్ వాసులతో జీపీ సిబ్బంది ఫ చెత్తమయంగా గ్రామ వీధులు ఫ వెంటనే వీధుల్లో చెత్త, చెట్ల కొమ్మలను తొలగించాలని గ్రామస్తుల వేడుకోలు -
ఉత్కంఠకు తెర
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో పంచాయతీల్లో సందడి నెలకొంది. గ్రామాల్లో రిజర్వేషన్ల కోసం ఇన్ని రోజులు వేచి చూసిన ఆశావహులకు రిజర్వేషన్లు కేటాయించడంతో తమకు అనుకూలంగా వచ్చిన వారు ఆనందంలో ఉండగా అనుకూలంగా రిజర్వేషన్లు రాని ఆశావహులకు నిరాశలో పడ్డారు. గ్రామాల్లో ఇక ఎన్నికల సమరమే మిగిలి ఉంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో వేచిచూడాల్సిందే. సూర్యాపేటటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. దాని ప్రకారంగా జిల్లా అధికారులు జిల్లాలోని 23 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 235 ఎంపీటీసీలు, 486 గ్రామ సర్పంచ్లు, 4,388 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్, ఆర్డీఓల సమక్షంలో ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. అలాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలతో కలిపి మహిళలకు 50శాతం రిజర్వేషన్ తగ్గకుండా కేటాయించారు. నాలుగు రోజులుగా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. ఈ సారి జెడ్పీ పీఠం బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తికావడంతో ఇన్నాళ్లుగా రాజకీయ నాయకులు, ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 42శాతంతో మెజార్టీ స్థానాలు బీసీలకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేయడంతో వారికే మెజార్టీలు స్థానాలు దక్కాయి. జిల్లాలో 23 మండలాలకు సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు 42శాతం రిజర్వేషన్ల ఆధారంగా కేటాయించారు. మొత్తం 23 మండలాల్లో ఎంపీపీల రిజర్వేషన్లు ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు, బీసీలకు 10, జనరల్ స్థానాలు ఐదు కేటాయించారు. అలాగే 23 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు, బీసీలకు 10, జనరల్ స్థానాలు ఐదు కేటాయించారు. దీంతో బీసీల్లో ఆశావహులు ఆనందంతో ఉన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు ఫ జెడ్పీ పీఠం బీసీ జనరల్కు రిజర్వు ఫ ప్రకటించిన అధికారులు ఫ బీసీలకు అత్యధిక స్థానాలు ఫ పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ఫ జిల్లాలో 23 మండలాలు, 486 గ్రామ పంచాయతీలు -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
హుజూర్నగర్ : యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుదని నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను శనివారం ఆయన ఎమ్మెల్సీ శంకర్నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏటీసీ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీటీ కత్తుల నాగేందర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, పీసీసీ డెలిగేట్ దొంగరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్, అరుణ్కుమార్ దేశ్ముఖ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి -
మారె్కట్కు దసరా జోష్
సూర్యాపేట అర్బన్, రామగిరి(నల్లగొండ) : దసరా పండుగ వేళ వివిధ వ్యాపార మార్కెట్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్లను కుదించి తాజాగా కొత్త సంస్కరణలు తేవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు పండుగ సందర్భంగా వివిధ షోరూమ్లు, షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కొత్త వస్త్రాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేసేందుకు వినియోగదారుల ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో పండుగ అమ్మకాలు జోరందుకున్నారు. జీఎస్టీలో రెండు స్లాబ్లు.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు చిరు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబ్లు అమలులో ఉండగా తాజా సంస్కరణలతో 5, 18 శాతం వరకు ఒకటి, 40 శాతం వరకు రెండో స్లాబ్గా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కార్లు, టీవీలు, బైక్లు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. ధరల తగ్గుదల ఇలా.. జీఎస్టీ కొత్త స్లాబ్లు అమలులోకి రావడంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీల ధరలు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగి వచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ జీఎస్టీ 5శాతానికి మారడంతో రూ.200 నుంచి రూ.400 వరకు ధరలు తగ్గాయి. ద్విచక్ర వాహనాలపై ఇప్పటి వరకు 28 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 18 శాతం స్లాబ్కు మార్చడంతో 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో బైక్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇక జీఎస్టీ మార్పుతో చిన్న కార్ల రేట్లు తగ్గించగా, భారీ కార్లు, లగ్జరీ వాహనాలపై పెంచింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో చిన్న కార్ల ధరలు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు తగ్గాయి. ఎలక్ట్రికల్ వాహనాలకు 5 శాతం పాత జీఎస్టీనే కొనసాగుతోంది. రేట్లు తగ్గడంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈసారి వాహనాల కొనుగోలు పెరిగిందని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు.. దసరా పండుగ వేళ వివిధ షాపింగ్ మాల్స్, ఆన్లైన్ స్టోర్స్ అన్నీ స్పెషల్ క్యాష్బ్యాక్ వంటి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఫ్యామిలీ షాపింగ్, పండుగ డెకరేషన్ కోసం కొత్త ఐటెమ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. మొబైల్స్ను ఆన్లైన్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ షాపింగ్తో జిల్లాలోని ప్రధాన పట్ట ణాల్లో షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. కాస్త ఉపశమనమే.. జీఎస్టీ సంస్కరణలతో కుక్కర్లు, టీవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు సైతం వాటిని సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభించింది. ఈ మార్పు చిరు ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మాత్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.నల్లగొండలోని ఓ షోరూమ్లో వాహనాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు, సూర్యాపేటలో సందడిగా ఉన్న ఎలక్ట్రానిక్ షోరూమ్ఫ జీఎస్టీ స్లాబ్ల కుదింపుతో కాస్త తగ్గిన ధరలు ఫ ఊపందుకున్న వ్యాపారాలు ఫ పండుగ ఆఫర్లతో పెరిగిన కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు ఫ తగ్గిన ధరలతో చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట -
లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
సూర్యాపేట : కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కలెక్టర్ హాజరై లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో పోరాడారని కొనియాడారు. అదనపు కలెక్టర్ కె.సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉషశ్రీ, రూప, స్వస్తిక్లకు ఉపకార వేతనాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహారావు, మాజీ మున్సిపల్ కమిషన్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు చల్లమల్ల నరసింహ, రామప్రభు, శారదాదేవి, పద్మశాలి నాయకులు అప్పం శ్రీనివాస్, పెండెం కృష్ణ, బంటు కృష్ణ, బయ్య మల్లికార్జున యాదవ్, వెంకటేశ్వర్లు, నగేష్, సైదులు, తల్లమల హుస్సేన్, యుగంధర్, లక్ష్మణ్, లింగయ్య, టీఎన్జీఓ సెక్రటరీ దున్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ తన సతీమణితో కలిసి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ సతీమణి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీడబ్ల్యూఓ దయానందరాణి, డీసీఓ పద్మ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డి, మహిళా ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మూసీకి పోటెత్తిన వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్లోకి 41,324 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 643.70 అడుగుల వద్ద నీరు ఉంది. మూసీకి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 8క్రస్ట్ గేట్లను ఎనిమిది అడుగులు, ఒక గేటును ఆరు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 44,547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కుడి, ఎడమ కాల్వలకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తడంతో కేతేపల్లి మండలం భీమారం శివారులో మూసీవాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన వరదనీటిలో మునిగిపోయింది. మిర్యాలగూడ వయా భీమారం మీదుగా సూర్యాపేటకు వాహనాల రాకపోకలు నిలిపేసి ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల మీదుగా దారి మళ్లించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సూర్యాపేటటౌన్ : మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఆయన సూ ర్యాపేట మండలం ఎదురువారిగూడెం–భీమారం వంతెన వద్ద మూసీ ప్రవాహాన్ని పరిశీలించి మాట్లాడారు. అత్యవసరమైతే డయల్ 100, స్పెషల్బ్రాంచ్ కంట్రోల్రూమ్ నంబర్ 8712686026 ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ ఎస్ఐ బాలునాయక్ ఉన్నారు. ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత -
అమ్మకాలు పెరిగాయి
ఏసీలు, టీవీలు, ఫ్రెష ర్ కుక్కర్లపై జీఎ స్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల అమ్మకాలు గతం కంటే పెరిగాయి. – కృష్ణారావు, సోనోవిజన్ షోరూమ్ మేనేజర్, సూర్యాపేట జీఎస్టీ 28నుంచి 18 శాతానికి రావడంతో రూ.8.40 లక్షలు ఉన్న కారు ధరలో రూ.లక్ష వరకు తగ్గింది. జీఎస్టీ ద్వారా రూ.80 వేల వరకు ఆదా అవుతుండగా కంపెనీ రూ.20వేల ఆఫర్ ప్రకటిస్తుంది. – సతీష్, టాటా షోరూమ్ మేనేజర్, సూర్యాపేట -
ఐలమ్మ పోరాటం.. స్ఫూర్తిదాయకం
సూర్యాపేట : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనే కసితో చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారులు నరసింహ, శ్రీనివాస్, శంకర్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, బీసీ సంఘం నాయకులు పద్మ, సైదులు, సత్యనారాయణపిళ్ళై, చల్లమల్ల నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి
సూర్యాపేటటౌన్ : పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసు సేవలు, సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి పిటీషన్ మేనేజ్మెంట్, రిసెప్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తేనే పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. సిబ్బంది అందరూ కలిసి టీం వర్క్ చేయాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఏడుకొండలు, మహేందరనాథ్, శివతేజ, సురేష్, సిబ్బంది ఉన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
సూర్యాపేట : త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఆర్ఓలు, ఏఆర్ఓల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ యాదగిరి, ఆర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. వివరాల నమోదు వేగవంతం చేయాలిభానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పీఎంఏవైజీ సర్వే యాప్లో వివరాల నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ డీఈ, ఏఈలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వివరాలు నమోదుకు ఈనెల 30 చివరి తేదీగా నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వెబ్ కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఇన్స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మూసీ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తున్నందున రిజర్వాయర్ నిండుకుండలా మారుతుందని, పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూసీ నదికి శనివారం ఉదయం వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, కేతేపల్లి మండలం భీమారంలో లోలెవెల్ కాజ్ వే దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. -
బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. శుక్రవారం హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో తాను చైర్మన్గా ఉన్న కమిటీ 3.70 కోట్ల మందిని ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ కులగణన చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం బీసీలు ఉన్నారని, తమ ప్రభుత్వం బీసీలకు విద్యలో, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్లో, శాసనసభలో బిల్లును ఆమోదించి చట్టం చేశామని మంత్రి గుర్తుచేశారు. -
రహదారుల నిర్మాణంలో రాజీపడం
గరిడేపల్లి : హుజూర్నగర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణంలో రాజీపడే ప్రసక్తే లేదని, అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.17కోట్లతో నిర్మిస్తున్న రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారులు నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణం జరిగే సమయంలో సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మండలంలోని గానుగబండ నుంచి పరెడ్డిగూడెం వరకు రూ.1.40 కోట్లతో 2 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి చెవ్వారిగూడెం మీదుగా నేరేడుచర్ల మండలం దిర్శంచర్ల వరకు రూ.3.5కోట్లతో 4.6 కి.మీ, కల్మలచెరువు నుంచి గానుగబండ వరకు రూ.2.8కోట్లతో 6 కి.మీ, కల్మలచెరువు నుంచి పాలకవీడు మండలంలోని సబ్స్టేషన్ వరకు రూ.4.2కోట్లతో 6 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి బొత్తలపాలెం వరకు రూ.3.5కోట్లతో 5 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి సోమ్లాతండా వరకు రూ.84లక్షలతో 1.2 కిలోమీటర్ల దూరంతో రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. అనంతరం గానుగబండలో దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. నాయకుల తీరుపై మంత్రి అసహనం గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసహనంతోపాటు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గానుగబండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు కనీసం మైక్ సక్రమంగా ఏర్పాటు చేయలేకపోవడం పట్ల సభా ప్రాంగణంలో నాయకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కల్మలచెరువులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ కూడా గానుగబండలో చేసిన అభివృద్ధి పనులపై వివరిద్దామంటే మైక్ సరిగ్గా పనిచేయలేదని ఇక్కడైనా పనిచేస్తుందా లేదా అని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, తహసీల్దార్ బండ కవిత, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్రెడ్డి, నాయకులు పైడిమర్రి రంగనాథ్, పెండెం శ్రీనివాస్గౌడ్, కటికం రమేష్, మూలగుండ్ల సీతారాంరెడ్డి, బచ్చలకూరి మట్టయ్య, గుండు రామాంజిగౌడ్, చామకూరి రజిత, పరమేష్, చాందిమియా, ముత్యాలగౌడ్, సందీప్, సరిత, వెంకటరెడ్డి, యోహాన్, బచ్చలకూరి కృష్ణ, జయరాం నాయక్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ నాణ్యతాప్రమాణాలతో రోడ్లు నిర్మించాలి ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ గరిడేపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
గడువులోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలి
సూర్యాపేట : సీఎంఆర్ లక్ష్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో తన చాంబర్లో మిల్లర్లు, అధికారులతో సీఎంఆర్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువు నవంబర్ 12 వరకు పెంచిందన్నారు. మిల్లర్లంతా సహకరించి గడువు నాటికి సీఎంఆర్ ఇవ్వాలన్నారు. మిల్లులను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, బిందెతీర్థం, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్యకల్యాణం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనగావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూముల సాగుకు యత్నం
నూతనకల్ : కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డదారుల్లో అసైన్డ్ భూముల సాగుకు పూనుకున్నారు. ఈ క్రమంలో సాగుకు యోగ్యంకాని భూములను భారీ యంత్రాలను ఉపయోగించి చదును చేస్తున్నారు. ఈ వ్యవహారం నూతనకల్ మండలంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నూతనకల్ మండలం యడవెల్లి గ్రామ శివారులో 87 సర్వే నంబర్లో దేశ్ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డి పేరు మీద పట్టా కలిగిన 18ఎకరాల పైచిలుకు భూమిని గ్రామంలోని గొర్రెల మేతకోసం యాదవులకు శ్యాంసుందర్రెడ్డి ఉచితంగా ఇచ్చారు. ఈ భూమి అసైన్డ్ భూమి జాబితాలో చేరింది. ఈ భూమిపై రాజకీయ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారుల కన్నుపడింది. దీంతో గొర్రెలకాపరులకు పెద్ద మొత్తంలో నగదు ఆశ చూపి భూములను కొనుగోలు చేశారు. అయితే అసైన్డ్ భూముల వివరాల నివేదిక అందించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించడంతో సర్వే నిర్వహిస్తున్నారు. సాగుకు యోగ్యంగా మార్చేందుకు.. 87 సర్వే నంబర్లో సాగుకు యోగ్యంకాని భూములను సర్వే చేయబోమని అధికారులు తెల్పడంతో యాదవ కులస్తుల నుంచి భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి జేసీబీలను ఏర్పాటు చేసి సాగుకు యోగ్యమైన భూమిగా మార్చడం కోసం పదుల సంఖ్యలో భారీ యంత్రాలను ఉపయోగించి పచ్చని చెట్లు, రాతి బండలను తొలగిస్తున్నాడు. దీంతో అక్కడ నివసించే నెమళ్లు, అడవి పందులు, వివిధ పక్షుల జాతులకు నిలువనీడ లేకుండా పోయింది. అధికారులు స్పందించి సాగుకు యోగ్యంకాని భూమిలో చేపడుతున్న భూ అభివృద్ధి పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు : తహసీల్దార్ ఈ విషయమై నూతనకల్ తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణకోరగా సీలింగ్ యాక్ట్ ప్రకారం సాగుకు యోగ్యంకాని భూములు సర్వేచేయ బోమని, సాగు భూములనే సర్వేచేసి నిర్ధారిస్తామని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఫ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు ఫ జేసీబీలతో చదును చేస్తున్న అక్రమార్కులు ఫ అడ్డుకోవాలంటున్న యడవెల్లి గ్రామస్తులు -
నేరాల నియంత్రణలో పోలీసుల పనితీరు భేష్
సూర్యాపేటటౌన్ : నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ పనితీరు భేష్ అని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ సబ్సిడరీ క్యాంటిన్, పోలీస్ ఫిట్నెస్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ ద్వారా హోం గార్డ్ నుంచి ఎస్పీ వరకు ఆర్థికపరంగా నెలకు సగటున రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. జిల్లా పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అమలు చేస్తున్న పోలీసు ప్రజా భరోసా అద్భుతమైన కార్యక్రమమని, దీని ద్వారా ఫలితాలు వస్తున్నాయన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్టంగా పనిచేయాలన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోర్ట్ వాల్ కట్టించడానికి రూ.30 లక్షలు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో నమోదవుతున్న నేరాలు, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను ఎస్పీ నరసింహ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి ఫ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి ఫ ఎస్పీ కార్యాలయంలో క్యాంటిన్, ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
తాడువాయి శివాలయాన్ని సందర్శించిన అధికారులు
మునగాల: మండలంలోని తాడువాయిలో గల శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ ఏఈ కిరణ్, సహాయ సంపత్తి సంజీవ్ సందర్శించారు. ఇటీవల గ్రామంలోని శివాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో నూతనంగా దేవాలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన కొలతలు సేకరించేందుకు వచ్చినట్లు తెలిపారు. గ్రామప్రజలు రూ.10లక్షలు కాంట్రిబ్యూషన్ కింద నిధులు జమచేస్తే దేవాదాయ శాఖ నుంచి రూ.40లక్షలు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. దేవాలయ పూజారి వారణాసి సత్యనారాయణ శాస్త్రి, గ్రామపెద్దలు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, గోపిని రామిరెడ్డి, భద్రంరాజు కృష్ణప్రసాద్, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, వట్టావుల సైదులు, దేవరం సుధీర్రెడ్డి, సోమయ్య, భిక్షం, బాలు, జిల్లేపల్లి శ్రీను, బాలకృష్ణ పాల్గొన్నారు. చెల్లని చెక్కుల పంపిణీతిరుమలగిరి: నాగారం మండలంలోని నాగారంబంగ్లాలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్కు సంబంధించి లబ్ధిదారులకు కాలం చెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు కాగా నాగారంబంగ్లాలో గురువారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కులను బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్లడంతో బ్యాంకు అధికారులు వీటిని పరిశీలించి చెక్కుపై తేదీ 13–06–2025 అని ఉండటంతో ఈ చెక్కుల గడువు ముగిసిందని, ఇవి చెల్లవని చెప్పారు. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ అధికారులను కలసి విషయం చెప్పగా ఇచ్చిన చెక్కులను తిరిగి వాపస్ తీసుకున్నారు. రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వారం రోజుల క్రితం ఆర్డీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాయని, వీటిపై తేదీలను గుర్తించలేదని పేర్కొన్నారు. చెక్కులను రీ వ్యాలిడేషన్ చేసి తిరిగి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెక్కుల పంపిణీలో గందరగోళం తలెత్తిందని లబ్ధిదారులు వాపోతున్నారు. -
మద్యం టెండర్లకు ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 30తో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనుండడంతో ప్రభుత్వం మరో రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబరు నుంచి 2027 నవంబరు వరకు) లైసెన్స్లు జారీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 23న కలెక్టరేట్లో డ్రా పద్ధతిన వైన్స్లు కేటాయించనున్నారు. నోటిఫికేషన్ రాకతో టెండర్దారులు సన్నద్ధమవుతున్నారు. గత నెలలో టెండర్ ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. రిజర్వేషన్ల ఆధారంగా దుకాణాల కేటాయింపు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలకు లైసెన్స్లు కల్పించనుంది. ఇందులో గౌడ్స్కు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ నేతృత్వంలో గురువారం సాయంత్రం రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాల నంబర్లను లాటరీ ద్వారా కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీలకు 3 షాపులు, ఎస్సీలకు 10 షాపులు, గౌడ్స్కు 27 షాపులు, మిగతా 53 షాపులు ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరి కింద కేటాయించారు. కేటాయించిన నంబర్లు ఇవే.. రిజర్వేషన్ల ఆధారంగా వైన్స్ నంబర్లు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు షాపు నంబర్లు 34, 85, 2 కేటాయించగా, ఎస్సీలకు 72, 10, 39, 61, 16, 50, 73, 28, 22, 81 కేటాయించారు. అదేవిధంగా గౌడ్స్కు 80, 24, 57, 52, 23, 41, 47, 19, 76, 04, 51, 18, 25, 77, 26, 89, 08, 44, 36, 07, 88, 49, 06, 60, 32, 43, 40 కేటాయించారు. నేటి నుంచి టెండర్ దరఖాస్తుల స్వీకరణ వైన్ షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు టెండర్దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెండర్ వేయదలిచిన వారు రూ.3లక్షల డీడీ తీసి అందుకు సంబంధించిన పత్రాలతో కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 23న కలెక్టరేట్లో డ్రా పద్ధతిన వైన్స్లు కేటాయించనున్నారు. ఈసారి ఆరు వైన్స్ల తగ్గింపు జిల్లాలో గత టర్మ్లో 99 వైన్స్ షాపులకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. ఈ ఏడాది 93 వైన్స్లకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మిగతా ఆరు వైన్స్లను తీసేస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. అందులో మఠంపల్లి, పాలకీడు, చింతలపాలెం, మేళ్లచెర్వు, నడిగూడెం, కోదాడ టౌన్లోని ఒక వైన్స్లకు సేల్స్ లేకపోవడంతో ఈ ఏడాది లైసెన్స్లు ఇవ్వడం లేదని ఎకై ్సజ్ అధికారి చెప్పారు. ఫ కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2025–27కు సంబంధించి వైన్ షాప్ల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు పారదర్శకంగా కేటాయించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ఉన్న 93 వైన్ షాప్లకు సంబంధించి రిజర్వేషన్ కేటాయింపుల కోసం శుక్రవారం జారీ చేయనున్న నోటిఫికేషన్ విషయమై గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా అబ్కారీ అధికారి లక్ష్మణ్ నాయక్, ఎస్టీ వెల్ఫేర్ అధికారి శంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి దయానంద రాణి, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహారావులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీలకు మూడు షాపులు, ఎస్సీలకు పది షాపులు, గౌడ్స్ కు 27 షాపులు, మిగిలిన 53 షాపులు ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరికి కేటాయించినట్లు తెలిపారు. 93 నంబర్లు బాక్స్లో వేసి లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు చెప్పారు. షాపుల కేటాయింపు ప్రక్రియ వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అబ్కారీ సీఐలు మల్లయ్య, నాగార్జున రెడ్డి, శంకర్, రజిత పాల్గొన్నారు. ఫ కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ విడుదల ఫ జిల్లాలో 93 వైన్ షాపులు ఫ రిజర్వేషన్ల ఆధారంగా ఎస్టీలకు 3, ఎస్సీలకు 10, గౌడ్స్కు 27 దుకాణాలు కేటాయింపు ఫ నేటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ -
సమీకృత మార్కెట్ను వినియోగంలోకి తేవాలి
సూర్యాపేట : సమీకృత వెజ్– నాన్ వెజ్ మార్కెట్ను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సమీకృత మార్కెట్ను ఆయన పరిశీలించారు. గాలి, వెలుతురు రావట్లేదని వ్యాపారస్తులు మార్కెట్ను వినియోగించటం లేదని, దానికి ప్రత్యామ్నాయంగా గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేసి క్రయవిక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వచ్చే శనివారం మార్కెటింగ్ అధికారులతో, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, మార్కెట్ కార్యదర్శి మహమ్మద్ ఫసియొద్దీన్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వేతనాలు చెల్లించాలని రాస్తారోకో
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఐదు నెలలుగా చెల్లించడం లేదని ఆరోపిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య, సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు వేర్వేరుగా మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఐదు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఉద్యోగుల రాస్తారోకో -
యువజన పోరాటాలు ఎంతో అవసరం
కోదాడ : ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో యువజన పోరాటాలు ఎంతో అవసరమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ చలపతిరావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని లాల్బంగ్లాలో నిర్వహించిన పీవైఎల్ (ప్రగతిశీల యువజన సంఘం) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలపై, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలపై తిరుగుబాటు చేయాలన్నారు. పాలకులు మతోన్మాద ముసుగులో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజలను భ్రమలో ఉంచారని పేర్కొన్నారు. ముస్లిం, మైనార్టీలపై, కమ్యూనిస్టులు, హేతువాదులపై మతోన్మాద బీజేపీ యుద్ధం ప్రకటిస్తుందని ఆరోపించారు. శిక్షణ తరగతులకు ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఏఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఆవునూరి మధు, పీవైఎల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి ఐలయ్య, ప్రజా చైతన్యవేదిక నాయకులు రాయపూడి చిన్ని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనమాల సత్యం, గొర్రెపాటి సత్యం, సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పర్శిక రవి, ఎం.సిద్దేశ్వర్, కోశాధికారి ధరావత్రవి, నల్గొండ నాగయ్య, బండి రవి, మోతిలాల్, బి.వి.చారి, సిద్ధులు, ఉమాశంకర్, మనోహర్, నరసింహరావు, తిరుపతి పాల్గొన్నారు. -
పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బంది
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ప్రజా మరుగుదొడ్లు సరిపడా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణ కేంద్రాలకు ఎంతోమంది వస్తుంటారు. వీరంతా టాయిలెట్కి ఎక్కడికి వెళ్లాలనేది ప్రధాన సమస్యగా మారింది. తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఉగ్గపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా అన్ని మున్సిపాలిటీల్లో ఆ సదుపాయం లేదు. కొన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో సర్వే చేయకుండానే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడంతో ఉపయోగం లేకుండా పోయాయి. మున్సిపల్ అధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రధాన రద్దీ స్థలాల్లో ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తే ప్రజలకు, వ్యాపారస్తులకు, వాహనదారులకు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. వెయ్యి జనాభాకు ఒకటి ఉండాలి స్వచ్ఛభారత్ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రతి 1000 జనాభాకు ఒక మరుగుదొడ్డి చొప్పున అందుబాటులో ఉండాలి. అందులో సీ్త్ర పురుషులకు 50 శాతం చొప్పున ఉండాలి. ప్రజా మరుగుదొడ్లు నిర్మాణాలను అనుకూలంగా లేని పట్టణాల్లో కనీసం బయో టాయిలెట్లు అయినా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాత ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి వాటిలో సీ్త్ర, పురుషులకు వేరువేరుగా సంచార మరుగుదొడ్లు, మూత్రశాల సదుపాయాన్ని కల్పించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సూర్యాపేట మున్సిపాలిటీ మినహాయిస్తే ఇతర మున్సిపాలిటీల్లో బయో టాయిలెట్లు సదుపాయం కూడా అందుబాటులో లేదు. బస్సు లోపలి మరుగుదొడ్లను వినియోగించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో అవి కూడా మూలకు చేరాయి. హుజూర్నగర్లో మొత్తం 35 పబ్లిక్ ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 28 ఉన్నాయి. ఇందులో 21 నడుస్తుండగా.. 8 మూతబడ్డాయి. కోదాడ మున్సిపాలిటీలో 80 పబ్లిక్ టాయిలెట్స్కు ప్రస్తుతం 8 ఉన్నాయి. అందులో 3 రిపేర్లో ఉన్నాయి. నేరేడుచర్లలో మున్సిపాలిటీలో నాలుగు ప్రజా మరుగుదొడ్లు నడుస్తున్నాయి. అధికారులు స్పందించి పట్టణ ప్రాంతాలకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని కోరుతున్నారు. ఫ మున్సిపాలిటీల్లో సరిపడా లేని ప్రజా మరుగుదొడ్లు ఫ మహిళా శౌచాలయాలు, సంచార టాయిలెట్లు అంతంత మాత్రమే మున్సిపాలిటీలు జనాభా పబ్లిక్ టాయిలెట్స్ మహిళల మొబైల్ ఉండాల్సినవి ఉన్నవి టాయిలెట్స్ టాయిలెట్స్సూర్యాపేట 1,53,000 150 120 14 06 హుజూర్నగర్ 35,000 35 28 12 – కోదాడ 80,000 80 08 – – నేరేడుచర్ల 14,989 15 8 04 – తిరుమలగిరి 18,747 18 12 06 – -
భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు
హుజూర్నగర్: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. హుజూర్నగర్లో రాజీవ్ చౌక్ నుంచి ఫణిగిరి గుట్ట వరకు రూ 6.50 కోట్లతో చేపట్టనున్న డబుల్ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దసరా పండుగ అందరికీ శుభాలు కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఈ సీతారామయ్య, ఏఈఈ కిరణ్ కుమార్, శివ, నాయకులు యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్, శివరాం యాదవ్, అరుణ్ కుమార్ దేశ్ముఖ్, శ్రీనివాస్, మల్లయ్య, హరిబాబు, శ్రీనివాస్రెడ్డి, అమర్నాధ్రెడ్డి, సావిత్రి పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో ప్రసంశ ప్రతిభ
సూర్యాపేటటౌన్ : ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన 36వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్స్ – 2025లో సూర్యాపేటకు చెందిన చిత్తలూరి ప్రసంశ జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించింది. ఆమె ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
భారీ వర్షంతో రాకపోకలు బంద్
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తిమ్మాపురం–సంగెం మధ్య కోడూరు వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో మళ్లీ రాకపోకలు బందయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇదే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల పాటు వాహనాలు నిలిచిపోయి కోడూరు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మళ్లీ భారీ వర్షానికి ఇదే పరిస్థితి నెలకొంది. కోడూరు–సంగెం మధ్య రెండు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోడూరు గ్రామ ప్రజలు పండుగల వేళ ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాగా అత్యవసరం ఉన్న వారిని గ్రామ పంచాయతీ ఆధ్వర్వంలో ట్రాక్టర్ను ఏర్పాటు చేసి వాగు దాటిస్తున్నారు. ఈ రహదారిపై వంతెనల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కబడ్డీ బాల బాలికల జట్ల ఎంపిక
కోదాడ: ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా మక్తల్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పోటీల్లో జిల్లా తరఫున ఆడే బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నర్సింహారావులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చామని, దీనిలో ప్రతిభ కనపరిచిన వారి నుంచి 14 మంది చొప్పున రెండుజట్లకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు వైష్ణవి స్కూల్ యాజమాన్యం క్రీడా దుస్తులను అందించింది. బాలుర జట్టు: బి. వినయ్(సూర్యాపేట),వి. వరుణ్, గోపిచంద్ (నేరేడుచర్ల), బి. దుర్గాప్రసాద్ (జాన్పహాడ్), జి. సాయిరాం (పెన్పహాడ్), జె. ఆనంద్( హుజూర్నగర్), పి. శివ(అమరవరం), ఎన్. విష్ణు, ఆర్ దినేష్( నూతన్కల్), టి. వినయ్(మాధరాయినిగూడెం), జి. యగ్నేష్ (రంగాపురం), బి. వినయ్ (వెల్లటూరు), డి. మిధున్ (నడిగూడెం), నాగసేనరెడ్డి( చింతలపాలెం), కోచ్గా ఉదయ్కిరణ్, మేనేజర్గా మాధవరెడ్డిలను ఎంపిక చేశారు. బాలికలజట్టు: ఎ. దివ్య( అప్పన్నపేట), వర్షిత, వైష్ణవి, రేవతి, దీక్షిత (నామవరం), ఎం. కీర్తిక(మేళ్లచెరువు), ఎల్. రాజశ్రీ ( గడ్డిపల్లి), ఎస్ శశిరేఖ (రాఘవాపురం), ఎస్.కె. అక్బరీ( కోదాడ), డి. శ్రీవల్లీ ( చివ్వెంల), ఎం. ఇందు (దూపహాడ్),కోచ్గా కోటేశ్వరావు, మేనేజర్గా లక్ష్మీరాజ్యంలను ఎంపిక చేసినట్లు వారు వివరించారు. -
వానాకాలం ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూర్యాపేట : వచ్చేనెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో 2025– 26 వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.ఈ వానాకాలం జిల్లాలో 10,30,868 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని, కొనుగోలు కేంద్రాల్లో 4,30,880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. అక్టోబర్ 20 నుంచి ధాన్యం వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గతంలో తప్పు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎట్టి పరిస్థితులలో ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటాయించవద్దని సూచించారు. ధాన్యం రవాణాకు ఎలాంటి సమస్య రాకుండా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను వెహికిల్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మాట్లాడుతూ మిల్లర్లు ధాన్యం కొనుగోలు సందర్భంగా బ్యాంకు గ్యారంటీలను తప్పనిసరిగా ముందే ఇవ్వాలన్నారు. అలాగే పత్తి కొనుగోలుపై సమీక్షించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్ బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఆర్డీఓ అప్పారావు, జిల్లా కోపరేటివ్ అధికారి పద్మ, జిల్లా మార్కెటింగ్ అధికారి సతీష్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.మధు, లీగల్ మెట్రాలజీ అధికారి చిట్టిబాబు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రకాష్ రెడ్డి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో వేతనాలు ఇవ్వాలి
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు కోరారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు పదివేల మందికిపైగా ఉన్నారని వీరికి 6 నెలల నుంచి జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారి జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. వారం రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ వారి సమస్యలపై స్థానిక ప్రభుత్వ అధికారులకు, జిల్లా మంత్రికి విన్నవించినా ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో బైరోజు మదన్ చారి, కొమ్ము నాగయ్య, ముత్యం నాగేంద్రబాబు, శ్యామ్, కక్కిరేణి నాగేంద్రబాబు, నాగరాజు, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.సిబ్బంది స్థానికంగా ఉండాలిమునగాల: పీహెచ్సీలలో విధులు నిర్వహించే సిబ్బంది స్థానికంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఓపీ రిజస్టర్ను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపుఅర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను బుధవారం 1,613 క్యూసెక్కులకు పెంచారు. దీంతో కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఈ నీటిని జిల్లాలోని 69,70,71డీబీఎంలకు వదులుతున్నారు. చివరి మండలాలతో పాటు చివరి ఆయకట్టుకు నీళ్లు అందేలా నీటిని పెంచారు. రైతులు ఈ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ కోరారు. -
టీచర్లకు టెట్ టెన్షన్
చిలుకూరు: ఉపాధ్యాయులను టెట్ భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మెజార్టీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదేళ్లకు పై బడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని, లేదంటే ఉద్యోగం వదులు కోవాలని తీర్పు వెలువరించడం భిన్న వాదనలకు తెరలేపుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్న వారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. 1985 డీఎస్సీ నుంచి 2024 డీఎస్సీ వరకు.. జిల్లాలో ప్రస్తుతం డీఎస్సీ 1985 నుంచి డీఎస్సీ 2024 వరకు ఎంపికైన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 3,702 మంది ఉపాధ్యాయులు ఉండగా టెట్ అర్హత సాధించిన వారు 1,163 మంది , టెట్ లేనివారు 2,539 మంది ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2010 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒక సారి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2017లో ఒక సారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు డీఎస్సీల్లో నియమితులైన వారు టెట్లో అర్హత సాధించగా .. . రెండేళ్ల కింద ఎన్సీటీఈ ఉత్తర్వులతోనూ కొందరు అర్హత సాధించారు. అలాంటి వారు కేవలం తక్కువ మంది ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఏడాది వ్యవధిలో జిల్లాలో 250 మందికి పైగా జీహెచ్ఎంలుగా, ప్రాథమిక పాఠశాల టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా టెట్ అర్హత లేకుండా పదోన్నతి పొందారు. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో రాబోవు పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది. టెట్ మినహాంపు ఇవ్వాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫ కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు ఫ జిల్లాలో మొత్తం 3,702 మంది ఉపాధ్యాయులు ఫ టెట్ అర్హత సాధించిన వారు 1,163మంది ఫ టెట్ లేని వారు 2,539 మంది -
మద్దతుకు మించి..
సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా పెసళ్లకు బుధవారం రూ.9108 ధర పలికింది. ఈ వానాకాలం సీజన్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం పెసళ్లకు రూ.8,768 మద్దతు ధర చెల్లిస్తుండగా.. దీనికి మించి ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు బుధవారం దాదాపు 61 మంది రైతులు 501 బస్తాలు (301 క్వింటాళ్లు) పెసళ్లను అమ్మకానికి తీసుకొచ్చారు. అత్యధికంగా రూ.9108, అత్యల్పంగా రూ.2786 ధర వచ్చింది. అత్యధిక ధర పలికిన పెసళ్లను తీసుకొచ్చిన పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు గుండు ఉమను మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కలిసి అభినందించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి ధర పొందాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ సెక్రటరీ ఫసీయుద్దీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ సూర్యాపేట మార్కెట్లో క్వింటా పెసళ్లకు రూ.9,108 పలికిన ధర -
మళ్లీ.. సిబ్బంది కొరత
తిరుమలగిరి (తుంగతుర్తి): మున్సిపాలిటీల్లో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రెండేళ్ల నుంచి వార్డు ఆఫీసర్లుగా పని చేసిన వీఆర్ఓలు, వీఆర్ఏలు తిరిగి సొంతశాఖ అయిన రెవెన్యూకు వెళ్లి పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 79 వార్డు ఆఫీసర్లకు గాను ఒకే సారి 66మంది రిలీవ్ అయ్యారు. దీంతో సేవలపై తీవ్ర ప్రభావం పడింది. జీపీఓ పోస్టుల్లో అవకాశం కల్పించడంతో.. గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఓలు, వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిని వివిధ శాఖల్లో నియమించింది. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లుగా, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా సర్దుబాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పాలన అధికారులుగా వ్యవస్థను తీసుక వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ కార్యాలయానికి ఒక జీపీఓను నియమించింది. జీపీఓ పోస్టుల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలకు తిరిగి అవకాశం కల్పించింది. అర్హత పరీక్ష నిర్వహించి ఎంపికై న వారిని తిరిగి గ్రామ పాలన అధికారులుగా నియామకం చేసింది. వార్డు ఆఫీసర్లలో ఎక్కువ మంది వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉండటంతో వారంతా మాతృ శాఖ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్కు వెళ్లిపోయారు. దీంతో మున్సిపాలిటీల్లో పాలనా పరంగా మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఐదు మున్సిపాలిటీల్లో 66 మంది రిలీవ్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓలు, వీఆర్ఏలు 79 మంది వార్డు ఆఫీసర్లుగా 2023 నుంచి పని చేస్తున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనా అధికారులుగా నియమించడంతో ఐదు మున్సిపాలిటీల నుంచి 66 మంది ఒకే సారి రిలీవ్ అయ్యారు. కేవలం 13 మంది మాత్రమే మిగిలిపోయారు. దీంతో వార్డు ఆఫీసర్ల కొరత ఏర్పడింది. సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సిబ్బందిని నూతనంగా నియమించాలని కోరుతున్నారు. ఫ రెవెన్యూ శాఖకు వెళ్లిన వార్డు ఆఫీసర్లు ఫ ఐదు మున్సిపాలిటీల్లో విధుల నుంచి ఒకేసారి 66మంది రిలీవ్ ఫ మిగిలింది 13 మంది మాత్రమే.. ఫ సేవలపై తీవ్ర ప్రభావం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో 2018 సంవత్సరం నుంచి సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్డు ఆఫీసర్లుగా రెవెన్యూ సిబ్బంది నియామకమైన తరువాత వీరు ప్రతి రోజూ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఆస్తి పన్ను వసూలు చేయడం, పారిశుద్ధ్యం, పచ్చదనం, ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ తదితర పనులల్లో నిమగ్నమయ్యే వారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను ప్రారంభించింది. గతంలో పని చేసిన వీఆర్ఓలు, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంది. దీంతో మున్సిపాలిటీల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. వార్డు ఆఫీసర్లు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమయ్యేవని ప్రజలు చెబుతున్నారు. సూర్యాపేట 14 11కోదాడ 13 08హుజూర్నగర్ 20 19తిరుమలగిరి 17 12నేరేడుచర్ల 15 14 -
సైబర్ మోసాల నిర్మూలనలో అంబాసిడర్లా ఉండాలి
సూర్యాపేటటౌన్ : యువత, విద్యార్థులు సైబర్ మోసాల నిర్మూలనలో అంబాసిడర్లా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో పట్టణ పోలీసులు, షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని నిరంతర సాధన చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పద్ధతులు, మెటీరియల్స్ ఎంపిక చేసుకోవాలన్నారు. రైతు విత్తనం నాటితే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా మీ తల్లిదండ్రులను మిమ్మల్ని భూమిమీదకు తీసుకువచ్చారని, మీరు సమాజానికి మంచి ఫలాలను ఇచ్చే వృక్షంలాగా ఎదగాలన్నారు. మంచి సమాజం పోలీసుల లక్ష్యం అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే విజయాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, షీ టీమ్స్ ఎస్ఐ నీలిమ, సీసీఎస్ ఎస్ఐ అనిల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
వాడపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై థర్డ్ డిగ్రీ..?
మిర్యాలగూడ అర్బన్(నల్గొండ జిల్లా): యూరియా కోసం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నానని తనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దామరచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ధనావత్ సాయిసిద్ధు ఆరోపించాడు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో అతడు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తపేట గ్రామంలో ఇటీవల తన అన్నను కొంతమంది కొట్టగా, వారిపై తాను తిరగబడ్డానని.. ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై ఒకరం కేసులు పెట్టుకున్నట్లు సాయిసిద్ధు పేర్కొన్నాడు. అయితే ఈ నెల 3న మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి రోడ్డుపై యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నాలో తాను పాల్గొన్నానని గుర్తించిన వాడపల్లి పోలీసులు తనపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని వాపోయాడు. తాను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తానని.. గుంట భూమి లేనోడివి యూరియా కోసం చేసిన ధర్నాలో ఎందుకు పాల్గొన్నావని ఎస్ఐ శ్రీకాంత్రెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నడవలేని స్థితిలో ఉండగా పెయిన్ కిల్లర్ ట్యాబెట్లు వేసి జడ్జి ఎదుట హాజరుపర్చారని, తనను కొట్టిన విషయం జడ్జికి చెప్తే బెయిల్ రాకుండా చేస్తామని బెదిరించారని ఆరోపించాడు. అయితే తాను ఈ విషయాన్ని జడ్జి ఎదుట చెప్పడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స చేయించాలని సిఫారసు చేశారని తెలిపాడు. వైద్య పరీక్షల అనంతరం తనను రిమాండ్ తరలించగా.. 12 రోజులు జైలులో ఉన్న తర్వాత బెయిల్పై వచ్చినట్లు వివరించాడు. తనను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టిన వాడపల్లి ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు సాయిసిద్ధు తెలిపాడు. కాగా ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పనిచేసిన సమయంలోనూ ఓ రైతును పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు ఉండగా.. తాజాగా వాడపల్లిలోనూ అదేవిధమైన ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని వివరణ కోరగా.. తాను ఎవరినీ కొట్టలేదని, సంబంధిత వ్యక్తిపై నమోదైన కేసులో అతడిని జైలుకు పంపామని పేర్కొన్నారు. -
పనులు వదులుకొని వచ్చినా నిరాశే
తిరుమలగిరి (తుంగతుర్తి): రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు రోజూ పీఏసీఎస్లు, మనగ్రోమోర్ కేంద్రాల బాటపడుతున్నారు. పనులన్నీ వదులుకొని రాత్రింబవళ్లు చాంతాడంత క్యూలో నిరీక్షించినా దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల యూరియా కోసం రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు మంగళవారం ఉదయం నుంచి రైతులు బారులుదీరారు. టోకెన్లు ఉన్న రైతులకు ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున యూరియా అందజేశారు. మిగిలిన రైతులకు టోకెన్లను అందించారు. తిరుమలగిరి: యూరియా కోసం రైతులు నూతనకల్ మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో పీఏసీఎస్ కార్యాలయంలో బస్తాలు ఉన్నప్పటికీ రైతులకు వాటిని అందించకుండా ఆలస్యం చేయడంతో రైతులు కార్యాలయం షెట్టర్లను పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సమాచారం అందుకున్న సీఐ నర్సింహారావు, తహల్దార్ ఎం. శ్రీనివాసరావులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. నేటి వరకు టోకెన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని ఈ నెల 19,20తేదీల్లో రావాల్సిన యూరియా లోడ్ రాక ఆకస్మత్తుగా టోకెన్తీసుకున్నవారు రావడంతో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. టోకెన్లు ఇచ్చిన ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేసిన తరువాతనే కొత్త వారికి టోకెన్లు అందిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకోను విరమించారు. పీఏసీఎస్ కార్యాలయంపై దాడి గురించి సిబ్బంది నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు
సూర్యాపేట : ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ (డీఆర్ఏ) కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీసీపీఎన్డీటీ యాక్ట్ల నియమ నిబంధనలు పాటించే వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారం లోపల తాత్కాలిక అనుమతి ఇచ్చి తర్వాత క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి అన్ని నియమ నిబంధనలు పాటిస్తే శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే నోటీసులు జారీ చేసి కారణాలు తెలుపుతూ తిరస్కరించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఎక్కడైనా అర్హత లేని వారు వైద్యం, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఎంహెచ్ఓ పి.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు జి.చంద్రశేఖర్, నాజియా, కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, మీడియా అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వేతనాలు ఇప్పించాలని వినతి
సూర్యాపేట : ఐదు నెలలుగా జీతాలు లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత ఏజెన్సీ ద్వారా వేతనాలు ఇప్పించాలని కోరుతూ టీఎస్ వ్యాన్, వీడియో కాన్ఫరెన్స్ ఇంజినీర్లు .. అదనపు కలెక్టర్ సీతారామారావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి లోనవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జిల్లా ఇంజనీర్లు నవీన్ కుమార్, శ్రీను, ప్రేమానందం, వెంకట్, సైదులు, మధు, శంకర్, నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు సూర్యాపేటటౌన్ : మౌలిక వసతులు లేని సర్కారు పాఠశాలలను నాలుగైదు కలిపి ఒకే సముదాయంలో నిర్వహించాలని తద్వారా ఉపాధ్యాయుల కొరత తీరుతుందని ప్రభుత్వం చేసే ఆలోచన సరైంది కాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలన్నారు. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా ఉదయం అల్పాహారం, ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.లింగయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వేణు, వెంకటేశ్వర్లు, ఆనంద భాస్కర్, సీహెచ్.యాదగిరి, సింహాద్రి, దేవేందర్, కవిత పాల్గొన్నారు. అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తులు రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు నల్లగొండలోని ఎన్జీ కళాశాల రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోసు్ట్రగాడ్యుయేషన్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, బోధన అనుభవం కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. -
చోరీల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు, రోగులతో పాటు సేవలందిస్తున్న వైద్యాధికారులకు రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ నర్సింహ చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎస్పీ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు.. పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదు అయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రాంగణంలో గల పోలీస్ అవుట్ పోస్టును పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, వైద్యాధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డా.వినయానంద్, డా.లక్ష్మణ్, డా.మనీషా, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సూర్యాపేటటౌన్ : చోరీల నియంత్రణకు నిరంతం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా సెలవులకు ఎక్కువ రోజులు ఊర్లకు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవీ.. ఎస్పీ సూచనలు సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. వాటికి చైన్తో లాక్ వేయడం మంచిది. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మన్/ సెక్యూరిటీ గార్డ్/ సర్వెంట్ గా నియమించుకోవాలి. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి.ఫ ఎస్పీ నరసింహ -
వట్టిఖమ్మంపహాడ్లో ఉద్రిక్తత
సూర్యాపేట : చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో మంగళవారం పీఎసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లారీలో యూరియాలోడు రావడంతో పంపిణీ చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తూ అడ్డుకున్నారు. తహసీల్దార్ ప్రకాశ్రావు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి 80 మందికి అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తహసీల్దార్ చెప్పిన విధంగా కాకుండా 60 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడంతో మహిళా రైతులు వ్యవసాయ అధికారితో వాగ్వాదానికి దిగారు. పీఎసీఎస్కు వచ్చిన లోడ్ యూరియాను దింపనివ్వకపోవడంతో ఎస్ఐకి ఏఓ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లారీలో ఉన్న యూరియాను దిగుమతి చేయించి, పీఎసీఎస్ కార్యాలయంలో ఉంచారు. బుధవారం పంపిణీ చేస్తామంటూ అధికారులు వెళ్లిపోయారు. -
ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వొద్దని ధర్నా
సూర్యాపేట : భవననిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు రూ.346 కోట్లను ప్రైవేట్ కంపెనీకి బదలాయించడం అన్యాయమన్నారు. అనంతరం లేబర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్, కొత్తపల్లి శివకృష్ణ, మల్లెపాక నగేష్, బాలాజీ, నాగలక్ష్మి, రాజు, రంగయ్య, లింగయ్య, మహేష్, జలంధర్ పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు కొలిక్కి !
సూర్యాపేటటౌన్ : జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజులుగా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి తీవ్ర కసరత్తు చేశారు. ప్రధానంగా జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఆర్డీఓలతో పాటు అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. మండలాల్లో ఉన్న జనాభా, ఇందులో ఎస్సీ, ఎస్టీలకు గతంలో కేటాయించిన స్థానాలు, ప్రస్తుతం కేటాయించాల్సిన స్థానాలు, బీసీ జనాభా గతంలో రిజర్వేషన్, ప్రస్తుతం కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ క్రమంలో 2019 రిజర్వేషన్ల వివరాలను సేకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించగా మిగిలిన స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయించి మొత్తంగా 50శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసేలా రిజర్వేషన్ల కసరత్తు జరిగినట్టు సమాచారం. వీరి సమక్షంలోనే.. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు, 4388 వార్డులు, 235 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓల సమక్షంలో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను కలెక్టర్ ఆధ్వర్యంలో ఖరారు చేసినట్టు సమాచారం. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేశారో తెలుసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 475 స్థానాలకు గాను ఎస్సీలకు 97 స్థానాలు, ఎస్టీలకు 111 స్థానాలు, బీసీలకు 65 స్థానాలను కేటాయించారు. ఇందులో జనరల్ కేటగిరిలో 202 స్థానాలు కేటాయించారు. -
జీఓ వచ్చాకే రిజర్వేషన్ల ప్రకటన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వార్డులు, గ్రామాలు, మండలాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్, 2024 కులగణన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చేనా? గవర్నర్కు, రాష్ట్రపతికి పంపించిన రిజర్వేషన్ బిల్లులు పెండింగ్లోనే ఉండిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనకు వచ్చింది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈనెలాఖరులోగా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీఓ జారీ చేసి, ఎన్నికలకు వెళ్లేలా చర్యలు చేపట్టడం, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలన్న ఆలోచనలో ఉంది. ఈమేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రిజర్వేషన్ల జాబితాల ఖరారుతోపాటు పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడం వంటి పనులు పూర్తి చేసుకోవాలని పేర్కొంది. దీంతో సూర్యాపేట జిల్లా యంత్రాంగం అదే పనిలో నిమగ్నమైంది. మండలాల వారీగా ఎవరి శాతం ఎంత? ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ అధికారులు స్థానిక ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టారు. సూర్యాపేట జిల్లాలో డీపీఓ యాదగిరి, జెడ్పీ సీఈఓ అప్పారావు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, 2024 కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ముందుగా మండలాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారనే దానిపై జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత గ్రామాలు, వార్డుల వారీగా కూడా జాబితాలు సిద్ధం చేస్తామని పేర్కొంటున్నారు. 2006, 2013, 2019లో రిజర్వేషన్లను పరిశీలిస్తూనే కొత్త రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు షురూ ఫ వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్న అధికారులు ఫ జిల్లా పరిషత్, పంచాయతీ శాఖల అధికారులతో కలెక్టర్ భేటీ ఫ బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక జీఓతో ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వంఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ప్రస్తుతం పెరగనున్న బీసీ రిజర్వేషన్లతో రిజర్వేషన్ల స్థానాలన్నీ మారిపోనున్నాయి. మరోవైపు బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన తర్వాతే మిగిలిన స్థానాలు జనరల్కు కేటాయించి, అందులో మొత్తంగా మహిళా రిజర్వేషన్లను 50 శాతం అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా జీఓ విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏయే మండలాల్లో ఎంత మంది ఉన్నారనేది తేల్చాలని చెప్పింది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టుకున్న అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన జనాభా లెక్కలు తేల్చే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాతనే అధికారికంగా రిజర్వేషన్ల ఖరారును అధికారులు ప్రకటించనున్నారు. -
వేలానికి దొడ్డు బియ్యం
భానుపురి (సూర్యాపేట) : రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వేలం వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయడంతో ఇప్పటికే రేషన్ షాపులకు సరఫరా అయిన దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో ఇ– వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,200 మెట్రిక్ టన్నులురేషన్ షాపుల్లో సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏప్రిల్ నుంచి అనుకోకుండా అమలు చేయడంతో అప్పటికే రేషన్ షాపులకు సరఫరా అయిన దొడ్డు బియ్యం అలాగే ఉండిపోయింది. నాటి నుంచి ప్రతినెలా సన్నబియాన్నే లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. దీంతో జిల్లాలోని 610 రేషన్ దుకాణాల్లో పాత కార్డుల ప్రకారం 3,24,158 కార్డుదారులకు సరఫరా చేసిన దాదాపు 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయి. కిలో రూ.20 నుంచి రూ.24చొప్పున..జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ ఆధీనంలో ఉన్న 1,200 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఇ– వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించినప్పటికీ జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అందలేదు. కిలో దొడ్డు బియ్యం రూ. 20 నుంచి రూ.24 చొప్పున ఇ–వేలం ద్వారా అమ్మేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరు నెలలుగా బియ్యం నిల్వలు ఉండడంతో పురుగులు పట్టి పోయాయి. అయితే ఈ బియ్యం అలాగే ఉంటే ప్రతి నెలా లబ్ధిదారులకు అందించే సన్న బియ్యానికి కూడా పురుగులు పట్టడం, రేషన్ షాపుల్లో స్థలం కొరత తదితర కారణాలతో విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.వేలం సక్రమంగా జరిగేనా.. ఆరు నెలలుగా నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఇప్పుడు తూకం వేస్తే తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ షాపులతో పాటు పలుచోట్ల గోదాముల్లో ఈ బియ్యం నిల్వలు ఉన్నాయి పురుగులు పట్టి బియ్యం పాడైపోయాయి. ఇ– వేలం వేస్తే ఆఫీసుల్లో పేపర్ల పై ఉన్న నిలువలను మాత్రమే లెక్కిస్తారు. తూకం తక్కువ వస్తే నష్టం వచ్చిన బియ్యాన్ని ఎవరు భరించాలి అన్నది సమస్యగా మారింది. రేషన్ షాపుల్లో 1,200 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సన్నబియ్యం పంపిణీతో దుకాణాల్లోనే నిల్వ ఇ–వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలుజిల్లాలో 1,200 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీకి ముందు వీటిని రేషన్ షాపులకు తరలించారు. ప్రస్తుతం ఈ బియ్యాన్ని ఇ–వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. వస్తే వేలం నిర్వహిస్తాం. – మోహన్ బాబు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి -
25,26 తేదీల్లో పీవైఎల్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : కోదాడ పట్టణంలో ఈనెల 25, 26 తేదీల్లో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య తెలిపారు. సోమవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శిక్షణతరగతులకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువకులకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో పీవైఎల్ మండల నాయకులు పగిడి విజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, తోట పవన్, చిత్తలూరి మహేష్, కడపత్తి మహేష్, చిత్తలూరి వెంకన్న, గడ్డం కృష్ణ, గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రారంభించిన రెండు ప్రధాన పథకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ పోర్టల్ https:// tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎల్. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.‘రేవంత్ అన్నకా సహారా– మిస్కీనో కే లియే’ ఈ పథకం కింద ఫఖీర్, దూదేకుల, ఇతర అట్టడుగు ముస్లిం వర్గాల అభ్యున్నతికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యూనిట్ ఖర్చు: రూ.1,00,000/– వరకు వందశాతం సబ్సిడీతో మోపెడ్లు/బైక్లు /ఇ–బైక్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు ఫఖీర్, దూదేకుల, అట్టడుగు ముస్లిం వర్గానికి చెంది ఉండాలని, రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి, వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక సహాయం పొందకుండ ఉండాలని, ఒక కుటుంబానికి ఒకే లబ్ధిదారుడు/లబ్ధిదారురాలు మాత్రమే అర్హులని సూచించారు. అలాగే‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద మైనారిటీ మహిళలు అంటే ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు చెందిన వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, ఒంటరి మహిళలలు తమ ఆర్థిక ఉన్నతికి చిన్నపాటి వ్యాపారం ఏర్పాటు చేసేందుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.50,000 ఒక్కసారిగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు కలిగి ఉండి, వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, కనీస విద్యార్హత – 5వ తరగతి ఉత్తీర్డులై ఉండాలని సూచించారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2.00 లక్షలకు మించరాదని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఇతర ఆర్థిక సహాయం పొందకుండ ఉండాలని, ఈ పథకాలకు ఆన్లైన్ ద్వాదా దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6వ తేదీ వరకు గడువు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ట్రంప్ తీరుపై పెదవి విప్పని మోదీసూర్యాపేట అర్బన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధిస్తున్న సుంకాలు, హెచ్–1 బి వీసాల రుసుం విషయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ పెదవి విప్పకపోవడం సరైంది కాదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు సోమవారం సూర్యాపేట పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే నిపుణులకు లక్ష డాలర్ల రుసుం కడితేనే హెచ్–1బీ వీసా జారీ చేస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు. దీనివల్ల సాఫ్ట్వేర్ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. అమెరికా విధానాలను ప్రతిఘటించకుండా ఆ దేశానికి సాగిలపడేలా మోదీ పాలన కొనసాగుతోందని విమర్శంచారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి పాల్గొన్నారు. -
సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారం
మూసీ ఉధృతంమోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన పోచం కన్నయ్య మదర్ థెరిస్సా జాతీయ స్ఫూర్తి సేవా పురస్కారం అందుకున్నారు. కన్నయ్య నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి వసుంధర విజ్ఞాన వికాస మండలి వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనను పురస్కారానికి ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేశారు. -
హోంగార్డుల సంక్షేమానికి పాటుపడతా
సూర్యాపేటటౌన్ : హోంగార్డుల సంక్షేమానికి పాటుపడతానని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్లను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డులకు ఎస్పీ అందజేసి మాట్లాడారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోం గార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలు అందిస్తున్నారన్నారు. వర్షాకాలం, చలికాలంలో హోంగార్డులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డుల రాష్ట్ర కమాండెంట్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఆర్ఐ నారాయణరాజు, ఆర్ఎస్ఐ అశోక్ పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉంటాం శాంతిభద్రతల పరిక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడారు. ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712686057కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలన్నారు. ఎస్పీ నరసింహ -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఆయన సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తో కలిసి ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపైదృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవ్, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీసీఓ పద్మ, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మట్టపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు మహాశాంతి కల్యాణంతో సోమవారం ముగిశాయి. ఈసందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అగ్ని ఆరాధనలు, హోమం, పూర్ణాహుతి, పవిత్రాల విసర్జనోత్సవ, సప్తదశకుంభారోపణం, మహాశాంతి కల్యాణం, ఆచార్యసన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసా చార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
వయోజనులకు అక్షరాలు నేర్పేలా..
నాగారం : నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలోని వయోజన విద్య మొక్కుబడిగా సాగడంతో ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. ఈ సారి కేంద్రం ప్రభుత్వం నవభారత్ సాక్షారత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని తెచ్చింది. 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించింది. తొలి విడతలో మహిళలకు ప్రాధాన్యమిచ్చింది. నిరక్షరాస్యులను గుర్తించి ‘ఉల్లాస్’ యాప్లో నమోదు చేస్తున్నారు. 150 మార్కులతో తుది పరీక్ష.. స్వశక్తి సంఘాల మహిళలు, ఉపాధి కూలీలు, ఐసీడీఎస్ లబ్ధిదారుల్లో నిరక్షరాస్యుల గుర్తించి రాయడం, చదవడం, చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పిస్తారు. వంద రోజుల్లో నేర్పించి 150 మార్కులతో తుది పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువపత్రాలు పంపిణీ చేస్తారు. ఆర్థిక అవగాహన, సాంకేతిక అక్షరాస్యత, న్యాయపరిజ్ఞానంపై శిక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 65.23 శాతం అక్షరాస్యత ఉంది. టీచర్లు, వీఓఏలకు ముగిసిన శిక్షణ మహిళల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సంఘాల్లో లావాదేవీల సొమ్మును స్వాహా చేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,13,426 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో తొలి విడతలో భాగంగా 41,526 మందిని శ్రీఉల్లాస్శ్రీ యాప్లో నిక్షిప్తం చేశారు. అనంతరం జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన వారు ఇటీవల మండల స్థాయిలో ఉపాధ్యాయులకు, వీఓఏలకు శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామస్థాయిలో సంఘాల్లోని ఔత్సాహిక మహిళలను వలంటీర్లుగా నియమించి శిక్షణ ఇచ్చారు. పాఠశాలల పరిధిలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులకు అప్పగించారు. తమ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పిల్లలకు దిశానిర్దేశం చేస్తున్నారు. లోపాలపై దృష్టి సారిస్తేనే.. సాక్షర భారత్లో వలంటీర్లకు పంపిణీ చేసిన పుస్తకాలు లబ్ధిదారులకు చేరుకోలేదు. నామమాత్రంగా అర్హత పరీక్ష ఏర్పాటు చేసి అందరినీ ఉత్తీర్ణత సాధించేలా చేశారు. కొందరు అక్షరాలు నేర్చుకుని మరిచి పోయారు. ప్రధానోపాధ్యాయులు నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల అక్షర ప్రగతిపై పిల్లలతో సమీక్షించాల్సి ఉన్నా అది చేయలేదు. వలంటీర్లపై పర్యవేక్షణ పెంచితేనే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.ఫ ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఫ ఇప్పటికే నిరక్షరాస్యులను గుర్తించిన అధికారులు ఫ ప్రత్యేక యాప్లో పేర్లు నమోదు ఫ ఉపాధ్యాయులు, వీఓఏలు, వలంటీర్లకు శిక్షణ పూర్తి ఫ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే బోధన ప్రారంభించే అవకాశం జిల్లాలో నిరక్షరాస్యులు 1,13,426 తొలి విడతకు ఎంపికై న వారు 41, 526 -
లిఫ్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
పాలకవీడు: మండలంలో జాన్పహాడ్ వద్ద కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. కృష్ణా, మూసీనదుల పరీవాహక ప్రాంత రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి కృష్ణానదిపై జాన్పహాడ్ వద్ద, మూసీనదిపై బెట్టెతండా వద్ద లిఫ్ట్లు నిర్మిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ అధికా రులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్వీ.సుబ్బారావు, మాజీఎంపీపీ భూక్యా గోపాల్, నాయకులు మాళోతు మోతీలాల్, జితేందర్రెడ్డి, కొణతం చిన వెంకట్రెడ్డి, తీగల శేషురెడ్డి, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెగులు.. దిగులు!
నాగారం : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో వరిసాగు చేసిన రైతులు సరైన సమయానికి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పంటలకు తెగుళ్ల బెడద పట్టుకుంది. దోమపోటు, ఎండు తెగులు, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు తదితరాలు ఎక్కువగా సోకుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్లను నివారించేందుకు రైతులు అనేక పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో పంటల సాగుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యకం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా మోతాదుకు మించి క్రిమిసంహారక మందుల్ని రైతులు అధికంగా వినియోగిస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది పంట దిగుబడిపై ఎంతో ప్రభావం చూపుతోందంటున్నారు. సస్యరక్షణ చర్యలు నామమాత్రమే.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 4,85,125 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సారి భారీగా వర్షాలు కురవడంతో వరిలో కలుపు నివారణతో పాటు తెగుళ్లు రాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా చేశాయి. వర్షాల వల్ల కొన్ని పంటలు దెబ్బతినడంతో రైతులు వరి ఎదుగుదలకు మోతాదుకు మించి ఎరువులు వాడారు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కుస్తున్నాయి. ఈ నెలలో దోమపోటు, కాండం తొలిచే పురుగు ఉధృతి కనిపించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వరిలో కొనలు ఎర్రగా మారి మొక్క ఎదుగుదల లేకుండా పోయిందని చెబుతున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు.. ఫ ప్రస్తుతం పిలక దశ నుంచి అంకురం దశలో ఉన్న వరిలో పైపాటుగా రసాయన ఎరువులు వాడాలి. దుబ్బు చేసే దశలో, అంకురం తొడిగే దశలో బురద పదునులో మాత్రమే వెదజల్లి మరలా 48 గంటల తర్వాత నీరు పెట్టాలి. ఫ కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించకుండా పొలం గట్లకు కలుపు లేకుండాచేయాలి. ఫ ప్రస్తుతం వరిలో కాండంతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు, పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఫ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుంచి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2గ్రా, కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా.లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. కాపర్ఆక్సి క్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫ ప్రస్తుతం అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. దీని నివారణకు ట్రైసైక్లాజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రొథైయోలిన్ 1.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లేదా ట్రైసైక్లోజోల్, మ్యాంకోజేబ్ మిశ్రమ మందు 2.5గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మేలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సన్నరకం వరి పంటకు చీడపీడల బెడద ఫ అధికంగా దోమపోటు, ఎండు, అగ్గి తెగుళ్లు ఫ వేధిస్తున్న కాండం తొలిచే పురుగు ఫ ఆందోళనలో అన్నదాతలు ఫ జిల్లా వ్యాప్తంగా 4.85 లక్షల ఎకరాల్లో వరిసాగు -
ఐదు దశాబ్దాల అనుబంధం
కోదాడ: వారంతా ఐదు దశాబ్దాల క్రితం (1976–77 సంవత్సరంలో) మఠంపల్లి మండల కేంద్రంలోని వివేకవర్ధిని పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు. ప్రస్తుతం వారి వయస్సు 65 సంవత్సరాలపై మాటే. వారంతా ఆదివారం కోదాడలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో జరిగిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులతోపాటు పాఠశాల తీపిగుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. 50 ఏళ్ల తరువాత ఒక వేదిక మీద కలుసుకోవడం చెప్పలేని ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముత్తినేని సైదేశ్వరరావు, తాటికొండ కృష్ణారెడ్డి, కోటిరెడ్డి, తీగల చంద్రశేఖర్రెడ్డి, తిప్పన వెంకట్రెడ్డి, మధుసూదన్రావు, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వేణుగోపాల్రావు, పుష్ప, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
పోరాట యోధుడు.. కొండా లక్ష్మణ్ బాపూజీ
భానుపురి (సూర్యాపేట) : తన తుదిశ్వాస వరకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని పద్మశాలి భవన్లో ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారన్నారు. 96 ఏళ్ల వయస్సులోనూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సాధనకు నిరాహార దీక్షలు చేసిన గొప్ప నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చలమల్ల నరసింహ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కడారి భిక్షం, పోపా జిల్లా అధ్యక్షుడు మిర్యాల గోపాలకష్ణ, యలగందుల సుదర్శన్, పొన్నం వెంకన్న, అయిటిపాముల శ్రీనివాస్, కనుకుంట్ల శారదాదేవి, మిట్టకోల యుగంధర్, చిలుకూరు గోవర్ధన్, యల్లే సత్యనారాయణ, మిరియాల సుధాకర్, బాల్నే క్రాంతి, పున్నా వెంకన్న, గూడూరు నాగేశ్వరరావు, పసునూరి పాండయ్య, వనం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పథకాల అమలులో తెలంగాణ నంబర్వన్
హుజూర్నగర్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దివ్యాంగుల జీవన భృతి చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 425 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పటివరకు 3 వేల మందికి రూ 13.31 కోట్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఆర్అండ్బీ అతిథి గృహం, ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం, ఫణిగిరి గుట్ట వద్ద సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు, ఐటీఐ కళాశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవనాల నిర్మాణ పనులను పరిశాలించారు. పనుల పురోగతిపై సమీక్షంచారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్పర్సన్ రాధిక అరుణ్ కుమార్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు, అధికారులు, నాయకులు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, అజీజ్పాష, ఏ.హరిబాబు, జక్కుల మల్లయ్య, కె.ఉపేందర్, కె.మహేష్ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఎంబీసీ లిఫ్ట్గా నామకరణం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ (ఎంబీసీ) లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన హుజూర్నగర్లో విలేకరులతో మాట్లాడారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, దొండపాడులో నిర్మిస్తున్న రాజీవ్గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరగనుందని పేర్కొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటన ఫ ఎత్తిపోతల పథకాల పనుల పరిశీలన -
సన్నరకానికే తెగుళ్లు
నాకున్న నాలుగు ఎకరాల్లో ఎకరంలో సన్నరకం వరి వేశాను. మూడు ఎకరాల్లో దొడ్డురకం వరిసాగు చేస్తున్నా. దొడ్డు రకానికి ఇబ్బంది ఏమిలేదు కానీ, సన్నరకం వరికి తెగుళ్లు సోకుతుండడంతో ఆందోళనగా ఉంది. – బోయిని అశోక్, రైతు, తుంగతుర్తి అధికారుల సూచనల మేరకే రైతులు పురుగుమందులు వాడాలి. తెగుళ్లు గుర్తించి... అధికారుల సూచనల మేరకు ఎరువు వేయాలి. వాడాల్సిన దానికన్నా ఎక్కువ, తక్కువ వాడితే దిగుబడిపై ప్రభావం పడుతుంది. – కృష్ణకాంత్, ఏఓ, నాగారం -
దుర్గామాత మండపాలకు అనుమతి తీసుకోండి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న దుర్గామాత మండపాల సమాచారం పోలీసులకు ఇవ్వాలని, ఆన్లైన్ లింక్లో వివరాలు నమోదు చేసి అనుమతి తీసుకోవాలని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట రక్షణ కల్పిస్తుందని, అన్ని కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో విలువైన ఆభరణాలు ధరించకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దేవీ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పండుగ సెలవుల దృష్ట్యా సొంత గ్రామాలు, దూరప్రాంతాలకు వెళ్లేవారు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. మట్టపల్లిలో వైభవంగా పవిత్రారోపణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నా యి. ఉత్సవాల మూడవ రోజులో భాగంగా ఆదివారం యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం పవిత్రారోపణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే దేవోత్తాపన, ఆరాధన, అష్టోత్తరశతకలశస్నపన, ప్రధానహోమం, బలిహరణ, మూలమంత్రహోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా చివరిరోజైన సోమవారం అగికనారాధనలు, పూర్ణాహుతి, పవిత్రాల విసర్జనోత్సవం, మహాశాంతిహోమం ఉంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పెండింగ్ డీఏలను మంజూరు చేయాలిసూర్యాపేటటౌన్ : పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేస్తూ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని టీపీటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కడపర్తి శ్రీనివాస్ నాయుడు, కె.నాగయ్య, బి.శ్రీనివాస్ గౌడ్, ఏ.రమేష్, బి.శంకర్రావు, జి.కేశయ్య, ముంతా శ్రీనివాస్, వి.అంజయ్య, డి.ఉపేందర్, కె.శ్రీనివాస్, కే.సైదులు, ఎస్.రమేష్, డి.శ్రీనివాస్, ఎం.మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ తరగతులను జయప్రదం చేయాలికోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని లాల్బంగ్లాలో ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లగొండ నాగయ్య, ధరావత్ రవి పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లాల్బంగాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యరంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో గొప్ప మార్పు వస్తుందన్నారు. -
‘ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మేం వ్యతిరేకం’
సూర్యాపేట జిల్లా: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తాము వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను ఉత్తమ్కుమార్రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. వారి హయాంలోనే కూలిపోయింది. తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టం. తుమ్మిడిహెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణకి రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతో నైనా పోరాడుతాం. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది’ అని పేర్కొన్నారు. -
బాలల భవితకు బాట వేసేలా..
ఫ కలెక్టర్ చొరవతో అంగన్వాడీకేంద్రాల్లో వినూత్న రీతిలోపూర్వ ప్రాథమిక విద్య ఫ ఆట,పాటలు, అభినయంతో ప్రత్యేక బోధన ఫ ఎంతో ఆసక్తిచూపిస్తున్న చిన్నారులు భానుపురి (సూర్యాపేట) : బాల్య దశలోనే చిన్న పిల్లలకు మంచి పద్ధతులు, అలవాట్లు నేర్పిస్తే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బాలల బంగరు భవితకు పునాదులు వేసేలా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ఆటపాటలు, అభినయంతో బోధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేంద్రాలను నిత్యం సందర్శిస్తూ పిల్లల సామర్థ్యాలను అంచనావేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. పిల్లల సమగ్రాభివృద్ధికి.. మనిషి జీవితంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసే పునాది దశగా భావించవచ్చు. ఈ వయసులో నేర్చుకున్న నైపుణ్యాలు పిల్లల్లో శారీరక అభివృద్ధితో పాటు మెరుగైన ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇవి పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్ప డతాయి. తద్వారా మంచి పౌరులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఈ కారణంతోనే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 3నుంచి 6సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. పిల్లలకు ప్రతినెలా మంచి అలవాట్లను నేర్పిస్తున్నారు. వీరికి ఇప్పటికే పౌష్టికాహారం అందిస్తుండగా.. ఇటీవల నుంచి ఇమ్యునైజేషన్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, పోషణ, ఆరోగ్య విద్య వంటివి అందిస్తున్నారు. పకడ్బందీగా అమలు జిల్లాలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 5,168 మంది గర్భిణులు, 36,378 మంది చిన్నారులు, 4,168 మంది బాలింతలు పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. జిల్లాలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక శ్రద్ధతో అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పిల్లలకు బట్టీ పద్ధతిలో కాకుండా ఆసక్తికరంగా ప్రీస్కూల్ అంశాలను బోధిస్తున్నారు. పిల్లలకు కథలను చదివి వినిపించడం లాంటి పద్ధతి కాకుండా అభినయాల ద్వారా బోధిస్తున్నారు. దీంతో పిల్లలు కథలను బాగా అర్థం చేసుకోవడంతో పాటు, పాత్రలకు తగ్గట్టుగా నటిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేకించి అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ పిల్లల ఆట పాటల ద్వారా వారి తెలివితేటలను, సామర్థ్యాలను, వారి చలాకీతనాన్ని అంచనా వేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు చిన్నప్పుడు పాటల్ని బాగా ఇష్టపడతారు. తల్లి పాడే జోల పాట మొదలుకొని అభినయంతో కూడిన పాటలు పిల్లలకు ఎంతో ఇష్టం. అలాంటి పాటలను అంగన్వాడీ కేంద్రాల్లో నేర్పిస్తున్నారు. ప్రత్యేక చొరవ.. ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పానికి తేజస్ నందలాల్ పవార్ లాంటి కలెక్టర్ తోడైతే నిజంగా భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా తయారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని ద్వారా వారి శారీరక అభివృద్ధితో పాటు, మానసిక సామర్థ్యాలు, ఉల్లాసం, ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండడం, స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండడం, ఆటలు, పాటలతో పిల్లల్లో ఆలోచించే సామర్థ్యం సైతం చిన్నప్పటి నుంచి అలవడుతుంది. దీంతో వారి జ్ఞానం పెంపొందడమే కాకుండా, వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, బొమ్మలు గీయించడం లాంటివి అంగన్వాడీ కేంద్రాల్లో చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మమేకమైన కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిల్లలు అన్ని అంశాలలో చురుకుగా ఉండేందుకు ఇప్పటికే ప్రీస్కూల్ కిట్లను అందించారు. ప్రత్యేకించి డ్రాయింగ్తో పాటు, సింగింగ్, ఇంగ్లిష్ లెర్నింగ్ వంటి వినూత్న కార్యక్రమాలను కలెక్టర్ నేర్పించేలా చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ అంగన్వాడీ పిల్లలతో మాట్లాడి వారిని ఆట పాటలతో చైతన్య పరుస్తున్నారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ,అంగన్ వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్ ల పెంపకం, రకరకాల అంశాల పట్ల ఆట పాటలతో వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. -
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
సూర్యాపేటటౌన్ : విధుల నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యం వహించొద్దని, సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసుల పరిష్కారం, రాత్రి గస్తీ విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు.. ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు, డయల్ 100 కాల్స్ పై వేగంగా స్పందించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్లు శివకుమార్, వెంకటయ్యలకు మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్, ఎస్ఐలు రవీందర్, సురేష్ రెడ్డి, రవీందర్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లుకు రివార్డ్లు అందించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్రెడ్డి, డీసీ ఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. 30వ తేదీ వరకు ‘30పోలీస్ యాక్ట్’జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఈనెల 30వ తేదీ ‘30 పోలీస్ యాక్ట్’ అమల్లో ఉంటుందని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించవద్దని సూచించారు. -
స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్ ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. పది రోజుల వ్యవధిలో రెండు స్కూల్ బస్ల కింద ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో జిల్లాలో సంచలనం సృష్టించింది. దీంతో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్కూల్ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. బస్సు పూర్తిగా కనిపించేలా.. ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి స్కూల్ బస్కు కుడి, ఎడమ పక్కన, ముందుభాగం, వెనుక భాగం కనిపించేలా ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. బస్సులకు ముందు భాగంగా సైడ్కు ఉండే ఈ అద్దాల్లో బస్కు ఉన్న చక్రాలు, బంపర్, రోడ్డు అంతా కనిపిస్తుంది. దాంతో అక్కడకు పిల్లలు వస్తే డ్రైవర్కు అద్దంలో చూస్తే కనిపిస్తుంది. డ్రైవింగ్ సీటుకు ముందు బస్ బయట నుంచి పెద్ద మిర్రర్ను ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా బస్ ముందు ఎవరైనా చిన్న పిల్లలు వెళ్లినా అద్దంలో నుంచి డ్రైవర్కు కనిపిస్తుంది. నెల రోజుల్లో ఏర్పాటు చేయాల్సిందే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,649 స్కూల్ బస్సులు ఉండగా, అందులో కాలం చెల్లినవి, మరో ఒకటీ రెండు నెలల్లో కాలం చెల్లే బస్సులు, మూసివేసిన పాఠశాలలకు చెందినవి 54 ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా 1,595 స్కూల్ బస్లకు ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో నల్లగొండ జిల్లాలో 699, సూర్యాపేట జిల్లాలో 522, యాదాద్రి భువనగిరి జిల్లాలో 337 ఉన్నాయి. వీటికి నెల రోజుల్లోగా ప్రత్యేకంగా ఆయా అద్దాలను బిగించాలని రవాణ శాఖ ఆయా పాఠశాలల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. రెండురోజుల కిందట ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు నల్లగొండ ఎంవీఐ లావణ్య తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లోనూ ప్రమాదానికి కారణమైన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడించారు. స్కూల్ బస్లను ఎప్పటికప్పుడు ఫిట్నెస్తో పాటు మిర్రర్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు రవాణ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కోసం వచ్చిన ఎంవీఐలు, స్థానిక రవాణా శాఖ సిబ్బందితో కలిపి 13 బృందాలను రవాణ శాఖ ఏర్పాటు చేసింది. ఫ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు ఫ ఇటీవల స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారుల మృత్యువాత ఫ ప్రమాదాల నివారణ పై దృష్టిపెట్టిన రవాణా శాఖ ఫ నెల రోజుల్లోగా మిర్రర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం ఫ బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాలపై తనిఖీలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు స్కూల్ బస్సుల వల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంతో విలువైన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా అద్దాలను బిగించేలా చర్యలు చేపడుతున్నాం. బస్సు చుట్టూ అన్ని వైపులా కనిపించేలా, పిల్లలు పూర్తిగా బస్సుకు దూరంగా వెళ్లారా? లేదా? అన్నది డ్రైవర్ ఆయా అద్దాల్లో చూసుకొని వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. – వాణి, నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ -
సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం
సూర్యాపేట అర్బన్: సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమనూరు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో డిస్కం జిల్లా అధ్యక్షుడు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చాలని, ఆర్టీజన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిస్కం కార్యదర్శి జి.సాయిబాబా, రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కె.రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్, సలహాదారు ఆర్.జనార్దన్ రెడ్డి, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.వెంకన్న, డిస్కం కార్యదర్శి ఎం.భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాసరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు దాదాపు 400 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాలకవీడు మండలంలో నిర్మాణంలోఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపై ఉదయం సమీక్షిస్తారు. అనంతరం హుజూర్నగర్లో ఐటీఐ, ఏటీసీ, డిగ్రీ కళాశాల భవనాలను, హౌసింగ్ కాలనీ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఇటీవల పట్టణంలో మృతి చెందిన రైస్ మిల్లర్ గెల్లి అప్పారావు, గెల్లి అరుణ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శిస్తారు. మధ్యాహ్నం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు, ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద ఎంబీసీ లిఫ్టు పనులు, దొండపాడు వద్ద లిఫ్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కోదాడ మండలానికి వెళతారు. పెంచికల్దిన్న పీఏసీఎస్ చైర్మన్ సస్పెన్షన్ ఫ నూతన చైర్మన్గా సిద్దపంగ శ్రీను నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శాఖమూరి శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార సంఘం అధికారి పద్మ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్ శ్రీకాంత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ సంఘానికి సంబంధించిన నగదు మొత్తాన్ని సొంతానికి వాడుకుంటూ తిరిగి చెల్లించకపోవడంతో పాటు అధికారుల నోటీసులకు సైతం స్పందించకపోవడంతో సస్పెండ్కు గురైనట్లు సీఈవో వెంకన్న తెలిపారు. చైర్మన్తో పాటు మరో డైరెక్టర్ వల్లంశెట్ల నారాయణ డిఫాల్టర్గా తేలడంతో ఆయనను కూడా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సస్పెండ్కు గురైన శ్రీకాంత్ స్థానంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ సిద్దపంగ శ్రీనుకు చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మసూర్యాపేటటౌన్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మను అధికారికంగా నిర్వహించుకునేలా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ చీరలు బందైనయని విమర్శించారు. బతుకమ్మ, దేవీనవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రజలందరికీ బతుకమ్మ, దేవీశరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యూరియా కొరతను నివారించాలని వినతిభానుపురి (సూర్యాపేట) : యూరియా కొరతను నివారించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్లు డిమాండ్ చేశారు. ఈమేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఏఓ సుదర్శన్కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఎక్కువ శాతం ఆయకట్టు ఉన్నందున అధికంగా యూరియా కేటాయించాలన్నారు. కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, హేమలత, ఎండి పాషా పాల్గొన్నారు. మట్టపల్లిలో వైభవంగా అగ్నిమథనం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠాపన, పవిత్రములశుద్ధి, సప్తదశకుంభాసాధన, సాయంత్రం అగ్నిధ్యానం, శయ్యావేది ప్రకల్పనం, పవిత్రఆవాహనం, సుదర్శన యంత్రస్థాపన, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఆదివారం శతకలశస్నపనం ,పవిత్రారోపణం, బలిహరణ తదితర కార్యక్రమాలుంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్ తెలిపారు. -
వేలిముద్రల విధానం విరమించుకోవాలి
అర్వపల్లి: యూరియా పంపిణీకి సంబంధించి ఇ–పాస్ యంత్రం ద్వారా రైతుల వేలిముద్రలు తీసుకోవడంతో గంటల కొద్దీ సమయం తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు శనివారం అర్వపల్లిలోని పీఏసీఎస్ ఎదుట సూర్యాపేట–జనగామ హైవేపై గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. తెల్లవారుజాము నుంచి సుమారు 800మందికి పైగానే రైతులు పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం వేచి ఉన్నారు. సాయంత్రం వరకు కూడా 300మంది రైతులకు మాత్రమే యూరియా అందింది. అయితే మండే ఎండలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వ్యవసాయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ రమేష్బాబు, ఏఓ గణేష్లను నిలదీశారు. కాగా రాస్తారోకోతో హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పినా శాంతించలేదు. తమకు ఇ–పాస్ విధానం వద్దని రైతులకు బిల్లుల ద్వారా యూరియా అందించాలని కోరారు. అదే సమయంలో వర్షం రావడంతో రైతులు రాస్తారోకో విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోలెబోయిన కిరణ్, సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బొడ్డు రామలింగయ్య, నున్న యాదగిరి, పోలెబోయిన పెదలింగయ్య, సంపత్ కిరణ్, జహంగీర్, శిగ వెంకన్న, రవీందర్నాయక్, నాగరాజు, సురేష్, యాదగిరి పాల్గొన్నారు. తప్పని యూరియా తిప్పలు కోదాడరూరల్ : రైతులకు యూరియా తిప్పలు ఇంకా తప్పడం లేదు. వరి పొలాలు నాట్లు పెట్టి నెల రోజులు దాటుతున్న సమయంలో ప్రస్తుతం పంట యూరియా వేసే అదునుకు చేరుకుంది. దీంతో రైతులు నానాపాట్లు పడుతున్నారు. కోదాడ పీఏసీఎస్ పరిధిలోని గణపవరం ఎరువుల గోదాముకు శనివారం 200 యూరియా బస్తాల లోడ్వచ్చింది. ఆ యూరియా కోసం దాదాపు 300 మంది రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిలబడ్డారు. పీఏసీఎస్ సిబ్బంది రైతుల పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డులను సీరియల్లో పెట్టారు.5 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి రెండు బస్తాలు, అంతకు తక్కువ ఉన్నవారికి బస్తా చొప్పున పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ చేశారు. సీరియల్లో ఉండి యూరియా అందని రైతులకు తర్వాత వచ్చేలోడ్లో ముందుగా ఇస్తామని చెప్పి పంపించారు. ఫ అర్వపల్లి పీఏసీఎస్ ఎదుట రైతుల రాస్తారోకో -
సూర్యాపేటలో దారుణం .. మద్యం మత్తులో కసాయి తండ్రి ఘాతుకం
సూర్యాపేట జిల్లా: మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి (వెంకటేష్) నేలకేసి కొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కసాయి తండ్రి 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి వచ్చిన భర్తను భార్య మందలిస్తున్న క్రమంలో చిన్నారి ఏడుస్తుండగా ఆగ్రహానికి గురైన తండ్రి వెంకటేష్ చిన్నారి భవిజ్ఞను రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక చితికి చేరుకుంది. ఇక కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి, ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకపోగా చికిత్స పొందుతున్న చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి (భవిజ్ఞ) మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు నలుగురిని కలిచివేసింది. -
యూరియా అందించాలని రోడ్డెక్కిన రైతులు
ఫ తుంగతుర్తిలో అధికారులపై ఆగ్రహం ఫ అర్వపల్లిలో రహదారిపై రాస్తారోకో ఫ నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన తుంగతుర్తి : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తి సొసైటీకి 600 బస్తాల యూరియా వచ్చిందని తెలియడంతో వేకువ జాముననే రైతులు సొసైటీ వద్ద క్యూకట్టారు. ఈరోజు యూరియా ఇవ్వడం లేదని అధికారులు చెప్పడంతో అన్నారం, సంగెం గ్రామ రైతులు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వస్తున్న సమాచారంతో సొసైటీ అధికారులు మధ్యాహ్నం యూరియా బస్తాలు ఇవ్వడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు ఉదయం ఇవ్వబోమని చెప్పి ఇప్పుడు ఎలా ఇస్తారని సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీలో ఉన్న 150 బస్తాల యూరియా బస్తాలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అర్వపల్లిలో ఆందోళన అర్వపల్లి: అర్వపల్లిలోని పీఏసీఎస్కు కొద్దిరోజులుగా యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం 365బీ హైవేపై రాస్తారోకో చేపట్టారు. తెల్లవారుజాము నుంచే కార్యాలయం వద్దకు వచ్చిన రైతులు చెప్పులను క్యూలైన్లో పెట్టి పక్కన కూర్చుని నిరీక్షిస్తున్నారు. ఈ రోజ యూరియా రావడం లేదని అధికారులు తెలపండంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాగా సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, డీఏఓ శ్రీధర్రెడ్డి, ఏడీఏ రమేష్బాబులకు ఫోన్చేసి పరిస్థితిని తెలియజేయగా ఒకటి రెండు రోజుల్లో పీఏసీఎస్కు యూరియా రానుందని తెలిపారు. అయితే రాస్తారోకోతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్ఐ ఈట సైదులు తన సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
యూరియా కోసం అవే బారులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శుక్రవారం 444 బస్తాల యూరియా రావడంతో టోకెన్లు ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. ఈ క్రమంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టోకెన్లు, యూరియా బస్తాల కోసం మండుటెండలో గంటల తరబడి బారులుదీరారు. కనీసం కార్యాలయం ముందు నీడ కోసం టెంట్లు గాని, మంచినీటి సదుపాయం లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద టోకెన్లు పంపిణీ చేస్తారని సమాచారంతో శుక్రవారం తెల్లవారకముందే రైతులు మహిళలు, పురుషులు వేరువేరుగా క్యూలైన్లలో నిలుచున్నారు. 8 గంటల వరకు పురుషుల క్యూలైన్ పాఠశాల గోడ వద్దకు చేరింది. దాదాపు 800 మందికి పైగా క్యూలైన్లో నిలిచి ఉండగా టోకెన్లు జారీచేసి మళ్లీ యూరియా వచ్చినప్పుడు తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం రెండు రోజుల క్రితం జారీ చేసిన టోకెన్లకు యూరియా పంపిణీ చేశారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలి
కోదాడ: జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నామ నరసింహారావు అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడలోని శ్రీవైష్ణవి పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలికల సబ్ జూనియర్ జిల్లా కబడ్డీ జట్టు కోచింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడలో నైపుణ్యం ఉన్న 25 మంది బాలికలను ఈ క్యాంపుకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 24 వరకు శిక్షణ ఇచ్చి ప్రతిభ చూపిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేసి సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజమాబాద్లో జరిగే అంతర్రాష్ట్ర పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, శెట్టి రామచందర్రావు, వైష్ణవి పాఠశాల చైర్మన్ లక్ష్మణరావు, సైదులు, బసవయ్య, రమేష్బాబు, ఉదయ్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి నూతనకల్ : రవాణా రంగ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం నూతనకల్ మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో జిల్లా ఆల్ రోడ్ ట్రాన్స్ఫోర్టు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సభలో రైతు సంఘం ఉపాధ్యక్షులు కందాల శంకర్రెడ్డి, ఎనిగతల సోమయ్యగౌడ్, బత్తుల సుధాకర్, బి. స్వరాజ్యం, ఎన్. రాంమ్మూర్తి, బొజ్జ శ్రీను, ఉప్పు లక్ష్మణ్, పంతం వెంకన్న, బొజ్జ విజయ్ పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితాలు–2002, 2025లను సరిపోల్చే ప్రక్రియలో అధికారులు సమన్వయంలో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి హాజరై కలెక్టర్ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఎలక్షన్ విభాగం డీటీ వేణు తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లో పైలెట్ పద్ధతిన దీర్ఘకాల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా షెడ్యూల్ జారీ చేస్తామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసే సమయంలో రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మట్టపల్లిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, పంచగవ్య ఆరాధన, ప్రాశన, రుత్విగ్వరణం, ధీక్షాధారణ, రక్షాబంధనం, మేథినీపూజ, మత్స్యంగ్రహణం, అంకురారోపణ తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 22 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం అగ్నిమథనం, వాస్తుపూజ, వాస్తుహోమం, పవిత్రములకుశుద్ధి తదితర కార్యక్రమాలుంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
చిలుకూరు: చిలుకూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్కు షో కాజ్ నోటీసులు జారీచేశామ ని తహసీల్దార్ ధృవకుమార్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సాక్షిలో శుక్రవారం చేతులు తడిపితేనే ఆన్లైన్లో ఎంట్రీ అనే కథననం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ స్పందించి బాధ్యులైన కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికారులకు తెలియజేసి సరెండర్ చేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ క్రమంలో కంప్యూటర్ సీటును తహసీల్దార్ రూమ్ పక్కకు మార్చారు. ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీసూర్యాపేటటౌన్ : దసరా సెలవులకు ఊర్లకు, దూరప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ రోజులు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో, చుట్టుపక్కల ఉన్న ఇరుగుపొరుగు వారికి తెలపాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల సిస్టం ఏర్పాటు చేసుకోవాలని కోరా రు. విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో గాని, వెంట గాని తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 86057, 8712686026 నంబర్లకు ఫోన్ చేసి సేవలు పొందాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలిచివ్వెంల : విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం ఆమె సూర్యాపేట పట్టణంలోని బాలసదన్, విజయ్నగర్ కాలనీలో చిల్డ్రన్ హోంను తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సీడీబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, కె.రాంరెడ్డి, భిక్షం, పి.నాగరాజు, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి పీవైఎల్ శిక్షణ తరగతులుసూర్యాపేట అర్బన్ : కోదాడలో ఈనెల 25, 26న జరిగే ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేటలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో బండి రవి, పెద్దింటి అశోక్, ప్రవీణ్, కూరాకుల నాగన్న, రమేష్ పాల్గొన్నారు. -
పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పరిపూర్ణంగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక హౌస్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేస్తాం. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తాం. – అశోక్, డీఈఓ, సూర్యాపేట నాగారం : ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ భవిష్యత్లో వారుపరిపూర్ణంగా ఎదిగేలా తీర్చిదిద్దాలని విద్యా శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రత్యేకంగా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తరగతి గదులు, పాఠాలకే పరిమితమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా శాఖ ఇతర అంశాలపై అవగాహన కల్పించనుంది. విద్యార్థుల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని నెలకొల్పేలా కార్యక్రమాలను చేపట్టనుంది. అందుకు ఈనెల 15వ తేదీ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలల్లో తరగతుల వారీగా నాలుగు హౌస్లను ఏర్పాటుచేస్తారు. వాటికి అబ్దుల్ కలాం–రెడ్ హౌస్, శకుంతలాదేవి–గ్రీన్ హౌస్, సీవీ రామన్–బ్లూ హౌస్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్–ఎల్లో హౌస్గా నామకరణం చేశారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఏదో ఒక హౌస్లో సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. సామాజిక స్పృహ పెంచాలని.. ప్రధానంగా తరగతి గదుల్లో పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్లో ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశాలపై శ్రద్ధ చూపడం లేదు. ఇంటికి, బడికి మాత్రమే పరిమితమవుతూ ఎక్కువగా పాఠ్యాంశాల్లోనే లీనమవుతున్నారు. సమయం దొరికినప్పుడు డిజిటల్ ఉపకరణాలకు అతుక్కుపోతున్నారు. దీంతో పిల్లలకు సామాజిక స్పృహ కరవవుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకున్న విద్యా శాఖ ప్రభుత్వ స్కూళ్లలో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు సిద్ధమైంది. కార్యక్రమాలు ఇలా.. ఫ హౌస్ కమిటీల ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారు. ఫ తోటి విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలగడం, సహనంతో వ్యవహరించడం గురించి వివరిస్తారు. ఫ శాసీ్త్రయ దృక్పథంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థుల మేధో వికాసానికి క్విజ్, పజిల్స్ వంటి గేమ్స్ను నిర్వహిస్తారు. – సాహిత్యంపై సదస్సులు ఏర్పాటు చేస్తారు. కథలు చెబుతారు. విద్యార్థులతో చెప్పిస్తారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. ఫ మధ్యాహ్న భోజనం పరిశీలన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములను చేస్తారు. ఫహౌస్ కమిటీల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు విద్యా శాఖ రూ.6,250 చొప్పున నిధులు కేటాయించింది. ప్రాథమికోన్నత 78జెడ్పీ ఉన్నత 182కేజీబీవీలు 18ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ కమిటీలు, స్టూడెంట్ కౌన్సిళ్లు ఫ 15 నుంచి ఏర్పాటు చేస్తున్న విద్యా శాఖ అధికారులు ఫ నాయకత్వ లక్షణాలూ పెంపొందించేలా కార్యాచరణ ఫ ప్రతి తరగతి నుంచి విద్యార్థుల భాగస్వామ్యం -
డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలి
హుజూర్నగర్ : హుజూర్నగర్ మండలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో హుజూర్నగర్ మండలంలోని సీతారాంపురం నుంచి హుజూర్నగర్లోని ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డీటీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. డబుల్ ఇళ్లు పూర్తి చేసి రెండు నెలల్లో అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నాగారపు పాండు, పల్లె వెంకటరెడ్డి, యాకూబ్, వి.సైదులు, డి.బ్రహ్మం, పి.హుస్సేన్, శ్రీను, వెంకటచంద్ర, భిక్షం, వెంకటయ్య, వీరస్వామి, సైదమ్మ, సరిత ఎల్లమ్మ వీరస్వామి, నరేష్, ఏసు, సైదులు, చంబయ్య కోటమ్మ పాల్గొన్నారు. -
ఫ్రీడమ్ పార్కు.. ఆహ్లాదానికి దూరం
కోదాడ: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును మున్సిపాలిటీ అధికారులు పిచ్చిమొక్కల పాలు చేశారు. రూ.10లక్షలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు మున్సిపల్, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఆనవాళ్లు కోల్పోయింది. రెండేళ్ల క్రితం ఏర్పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెండేళ్ల క్రితం కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఫ్రీడమ్ పార్క్ను మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. దీని కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి బస్టాండ్ అవుట్గేట్కు ఇరువైపులా, దుకాణ సముదాయానికి వెనుక వైపున ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాటిలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ మొక్కలకు నీరు పెట్టడానికి మరో రూ.3 లక్షలు ఖర్చు చేసి పొలీస్స్టేషన్ సమీపం నుంచిపైప్లైన్ కూడా ఏర్పాటు చేశారు. నాసిరకంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కొద్ది రోజులకే పాడైపోయింది. సంరక్షణను విస్మరించడంతో పార్కులోని మొక్కలన్నీ చనిపోయాయి. ప్రస్తుతం ఫ్రీడమ్పార్కు పిచ్చిమొక్కలతో నిండి ఆనవాళ్లు కోల్పోయింది. ప్రస్తుతం అక్కడ కేవలం బోర్డు మాత్రమే కనిపిస్తోంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం.. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు నిర్వహణ విషయంలో మున్సిపల్ అధికారులకు, ఆర్టీసీ అధికారులకు మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్కు ఏర్పాటు చేయడం వరకే తమ పని అని.. నిర్వహణను మాత్రం ఆర్టీసీ అధికారుల చూసుకోవాలని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అడిగారని తాము స్థలం ఇచ్చామని, పార్కు ఏర్పాటు చేసింది వారే కాబట్టి నిర్వహణ బాధ్యతలు కూడా వారే చూసుకోవాలి. పార్కు నిర్వహణకు తమ వద్ద ప్రత్యేకంగా సిబ్బంది లేరని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో పార్కు పిచ్చిమొక్కలకు, మల మూత్ర విసర్జనకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఫ రూ.10లక్షలతో కోదాడ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు ఫ నిర్వహణను పట్టించుకోని మున్సిపల్, ఆర్టీసీ అధికారులు ఫ ధ్వంసమైన ఫెన్సింగ్.. పిచ్చి మొక్కలకు నిలయం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బును దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఫ్రీడమ్పార్కు విషయంలో ఎక్కడ తప్పిదం జరిగిందో విచారించి బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబట్టాలి. కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. – పొడుగు హుస్సేన్,పట్టణ పన్ను చెల్లింపుదారుల సంఘం అధ్యక్షుడు. -
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
సూర్యాపేటటౌన్ : ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం ఆస్పత్రి ఎదుట చేపట్టిన ధర్నా మూడో రోజు కూడా కొనసాగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ పద్ధతిని అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రతి నెలా ఐదో తేదీ లోపు జీతం వచ్చేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అశోక్కుమార్, రమాకాంత్, జానకిరాములు, సంతోష్, వెంకన్న, మహేష్, ఉపేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు సంఘాభావం తెలిపారు. -
ఉపాధిహామీలో ‘జియో ఫెన్సింగ్’
నాగారం : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణలో ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానం అమలులోకి తెచ్చింది. పనుల విషయంలో అవకతవకలకు తావులేకుండా పక్కాగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కూలీల హాజరు నమోదులో అక్రమాలు చోటుచేసుకోకుండా పనుల వద్ద ఎక్కడి నుంచైనా కూలీల హాజరు తీసుకునేలా జియో ఫెన్సింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖగుర్తింపు, ఈకేవైసీ..ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని..పనుల వద్ద బోగస్ కూలీల హాజరు నమోదును అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. దీని నివారణకు ఇప్పటికే ముఖ గుర్తింపు హాజరు విధానం, ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో ఒకరి బదులు మరొకరు పనులకు వెళ్లడం, క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్లు తమకు సంబంధించిన వ్యక్తులను పనులకు హాజరుకాకున్నా హాజరు వేయడం వంటి వాటిని గుర్తించి ఈకేవైసీ అమలులోకి తెచ్చారు. తాజాగా ఈ జియో ఫెన్సింగ్ విధానంతో పని ప్రారంభించిన తర్వాత ఎంతదూరంలో పనులు చేస్తున్నా ఒకేచోట ఉండి కూలీల హాజరును గుర్తించేలా కొత్తగా సాంకేతిక విధానం తెచ్చారు. పని ప్రాంతంలో ఎక్కడినుంచైనా...పనిచేస్తున్న ప్రాంతంలో ఎక్కడినుంచైనా హాజరు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. జియో ఫెన్సింగ్ అమలుతో కూలీల హాజరు నమోదు వేగవంతంగా తీసుకోవచ్చు. గతంలో పని ప్రారంభించిన చోట జియోట్యాగింగ్ చేసిన చోటనుంచే కూలీల హాజరు తీసుకునేవారు. కొత్త విధానంతో పనిచేసే ప్రాంతం మొత్తం జియోట్యాగింగ్ చేస్తారు. అప్పుడు మ్యాప్ లొకేషన్తో హాజరు ఎక్కడినుంచైనా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కూలీల హాజరు నమోదులో అక్రమాలకు చెక్ పెట్టేలా.. కొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం పని ప్రాంతంలో ఎక్కడినుంచైనా హాజరు తీసుకునే అవకాశంఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఒకేచోట ఉండి పని ప్రదేశమంతా ఉన్న కూలీల హాజరు వేగవంతంగా తీసుకునేందుకు ఈ కొత్తవిధానం అమలు చేస్తున్నాం. జియో ఫెన్సింగ్తో పనులు పారదర్శకంగా జరగనున్నాయి. – వీ.వీ.అప్పారావు, డీఆర్డీఓ వంద రోజులు పనిచేసిన కుటుంబాలు 36 -
సమతుల ఆహారంతో ఆరోగ్యం
భానుపురి (సూర్యాపేట) : సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పేర్కొన్నారు. పోషణ మాసం 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీపై సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్–1 అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనం తీసుకునే ఆహారంలో నూనె, చెక్కర, ఉప్పు సరిపోను మోతాదులో ఉండాలన్నారు. రోజువారి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా మునగ ఆకు తీసుకోవడంతో రక్తహీనత బారిన పడకుండా ఉంటామన్నారు. కిశోర బాలికలకు రోజూ పల్లీ పట్టీ, నువ్వుల లడ్డూ ఇవ్వాలని చెప్పారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని గురువారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్య హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు.స్వామి అమ్మవారిని నూతన వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం స్వామవారి కల్యాణ తంతు జరిపించి గరుడ వహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎరువులు అందుబాటులో ఉంచాం నడిగూడెం : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా సహకార శాఖ పర్యవేక్షణ అధికారి డి. చంద్రకళ తెలిపారు. నడిగూడెం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రిజిస్టర్లతో పాటు యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్, సహకార సంఘం చైర్మన్ కొల్లు రామారావు, ఇన్చార్జి మండల వ్యవసాయాధికారి ఎన్.పిచ్చయ్య, సీఈఓ కిరణ్ కుమార్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. మహిళలు పోరాడాలి సూర్యాపేట అర్బన్: మత చాందస వాదానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలను చైతన్యంవంతులను చేయడానికి ప్రగతిశీల మహిళా సంఘం అనేక సదస్సులు, చర్చలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తోందన్నారు.రాజేశ్వరి, మాధవి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ, రాష్ట్ర కార్యదర్శి ఆర్. సీత, ఎఫ్టీయూ సహాయ కార్యదర్శి గంట నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి నరసమ్మ, వాణిశ్రీ, రామలింగమ్మ, మంగమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిశీలించి నోటీసులు జారీచేయాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు సూచించారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో గురువారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం 2014 జూన్ 2వ తేదీకి ముందు కాగితం రాసుకొని కొనుగోలు చేసి 2020 అక్టోబర్లో మీ–సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఉండి 12 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న వారివి మాత్రమే పరిశీలించాలని ఆదేశించారు. తహసీల్దార్లు రెవెన్యూ గ్రామాల వారీగా దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, రోడ్లు, ఇంకా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూముల వివరాలతో కూడిన 22– ఏ రిజిస్టర్ను త్వరగా సమర్పించాలన్నారు. అలాగే అన్ని రకాల ప్రభుత్వ భూములను జియో ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో భూమి పటం తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ లు, తహసీల్దార్లు, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ సాయి గౌడ్, డీటీ వేణు, అధికారులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
పెసరకు మద్దతు ధర కరువు
తిరుమలగిరి (తుంగతుర్తి): వానా కాలంలో పెసర పంట వేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఆగస్టులో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పెసర పంట దెబ్బ తిన్నది. దీనికి తోడు ప్రభుత్వం పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. పచ్చగా నిగనిగలాడాల్సిన గింజలు వర్షాలకారణంగా నల్లగా మారాయి. చేతికి వచ్చిన పంటను మార్కెట్కు తీసుకెళితే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇటు తక్కువ ధరకు అమ్ముకోలేక, ఇంట్లో దాచుకోలేక పెసర రైతులు విలవిలలాడుతున్నారు. తగ్గిన దిగుబడి ఈ వానా కాలంలో జిల్లాలో 911 ఎకరాల్లో పెసర సాగు చేశారు. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఈ పంట అధికంగా వేస్తారు. అయితే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా పెసర్లు వస్తాయి. సాధారణ రైతు పెసర సాగుకు ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు పెట్టాడు. పంట చేతికొచ్చే దశలో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బ తిన్నది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2, 3 క్వింటాళ్లకే పరిమితమైంది. దీనికి తోడు రంగు మారడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు ఆగస్టు నెల ప్రారంభం నుంచి పెసర్లు వస్తున్నాయి. ప్రభుత్వం క్వింటా పెసరకు మద్దతు ధర రూ.8,768 నిర్ణయించింది. అయితే గింజలు బాగాలేవంటూ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు రూ.3 వేల నుంచి రూ.6 వేల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అకస్మాత్తుగా వర్షాలు వస్తుండటంతో ఆరబెట్టిన గింజలు తెల్లగా మారుతున్నాయి. చేసిన కష్టాన్ని దాచుకునే వీలు లేక, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించలేక రైతులు దిగులు చెందుతున్నారు. మరి కొందరు రైతులు బస్తాల్లో పోసి ఇళ్లలోనే భద్రపరుస్తున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు ఇప్పటి వరకు 2753 క్వింటాళ్ల, సూర్యాపేట మార్కెట్కు 2400 క్వింటాళ్ల పెసర్లు వచ్చాయి. క్వింటాకు గరిష్టంగా రూ.6,692 ధర, కనిష్టంగా రూ.3,300 ధర పలికింది. ఫ కొనుగోలు కేంద్రాలనుప్రారంభించని ప్రభుత్వం ఫ ప్రైవేట్లో అమ్ముకుంటున్న రైతులు ఫ మద్దతు ధర క్వింటాకు రూ.8,768 ఫ గరిష్టంగా రూ.6,692 మాత్రమేపెట్టి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు -
బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలి
బీబీనగర్: కౌమార దశలో ఉన్న బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్ సూచించారు. స్వస్త్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ గురుకుల ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుతు పరిశుభ్రత, పోషకాహారం, రక్తహీనతపై విద్యార్థినులకు అవగాహన కల్పించి శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థినులకు రంగోళి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ఎయిమ్స్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా, ఇన్చార్జి ప్రిన్సిపాల్ భారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బీసీ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులు, భోజనాన్ని పరిశీలించి ప్రిన్సిపాల్ మాధవికి పలు సూచనలు చేశారు. ఫ బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్ -
ముగ్గురు కవులకు సాహిత్య పురస్కారాలు
రామగిరి(నల్లగొండ): ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. నార్కట్పల్లి మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. అద్భుత సాహిత్యం శ్రీరామోజు రఘు సొంతం ఆచార్య డా. శ్రీరామోజు రఘు అద్భుతమైన సాహిత్యానికి కేరాఫ్ అని చెప్పవచ్చు. ఈయన అధ్యయనం, అధ్యాపనం, విమర్శ, కవిత్వం, పాఠ్య ప్రణాళిక రూపకల్పనా శిల్పి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రఘు ఎన్జీ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలోనే తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తెలుగు భారతీయాంగ్ల కవిత్వంలో అస్తిత్వ వేదన అనే అంశంపై ఎంఫిల్, ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత అనే అంశంపై పీహెచ్డీ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. అనేక జాతీయ, అంతర్జాతీయ సాహిత్య సదస్సుల్లో పాల్గొని 60కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన రచించిన సమన్వయ విమర్శ గ్రంథానికి రాష్ట్రస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. కథ, కవిత్వం, నవల నాటక మొదలైన భిన్న ప్రక్రియల్లో ఆయన వ్యాసాలు రచించారు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ప్రకటించిన కీర్తి పురస్కారం–2024కు సాహిత్య విమర్శ రంగంలో ఆయన ఎంపికయ్యారు. తెలుగు మమకారి సాగి కమలాకరశర్మ ఆచార్య డా. సాగి కమలాకరశర్మకు తెలుగు భాష అంటే అమితమైన మమకారం. ఆయన స్వస్థలం నార్కట్పల్లి మండలం జువ్విగూడెం. డిగ్రీ వరకు సైన్స్ చదువుకుని తెలుగుపై ఉన్న మమకారంతో ఎంఏ, పీహెచ్డీ పూర్తిచేశారు. సంస్కృతం, ఇంగ్లిష్, జ్యోతిష్యం, యోగా, తత్త్వశాస్త్రాల్లో ఎంఏ పూర్తిచేశారు. తెలుగు యూనివర్సిటీ జ్యోతిష్య విభాగంలో 10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు. 2007లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం తెలుగు శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 13కు పైగా గ్రంథాలు రచించారు. వివిధ పత్రికల్లో 300లకు పైగా వ్యాసాలు, 100పైగా పత్ర సమర్పణలు చేశారు. రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పురస్కారం వంటివి 10కిపైగా అందుకున్నారు. ఈయన పర్యవేక్షణలో 14 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టా పొందారు. మూసీ సాహిత్య ధార, జ్యోతిర్వాణి, వేద సంస్కృతి పరిషత్ వంటి సంస్థలను స్థాపించి నేటి సమాజానికి సాహిత్యాన్ని అందిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యానికి విశేష కృషి చేస్తున్నందుకు గాను తెలంగాణ సారస్వత పరిషత్తు వారి సాహిత్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఆర్తి వచన కవిత్వంలో ప్రసిద్ధుడు బైరెడ్డి కృష్ణారెడ్డి బైరెడ్డి కృష్ణారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తిచేశారు. 34 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు. ఎన్జీ కళాశాలలో డిగ్రీ అధ్యాపకుడిగా పదవీ విరమణ పొందారు. ఆర్తి అనే పేరుతో 4 కవిత్వ సంపుటాలు ప్రచురితమయ్యాయి. దీంతో పాటు మరో రెండు సంపుటాలు వెలువడనున్నాయి. ఇంగ్లిష్ లెక్షరర్ అయిన కృష్ణారెడ్డికి తెలుగు సాహిత్యంలో మానవీయ బంధాలు, ఆర్థ్రత కలిగిన కవిత్వం రాసే కవి అని పేరు. ప్రతిష్టాత్మకమైన తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం–2024కు ఎంపికయ్యారు. -
వాకింగ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
మునగాల: వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘ టన బుధవారం మునగాల మండల కేంద్రంలో జరి గింది. మునగాల మండల కేంద్రానికి చెందిన సుంకరి వెంకన్న(57) రోజుమాదిరిగా బుధవారం ఉదయం ఇంటి నుంచి వాకింగ్కు బయల్దేరాడు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య గతంలోనే మృతిచెందింది. వెంకన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు.చేపల వేటకు వెళ్లి..మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నదిలో పడి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామ పరిధిలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన పూజ ప్రకాశ్రావు(46) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగానే బుధవారం పడవపై కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. నెమలిపురి సమీపంలో చేపలు పడుతుండగా.. కాలు జారి నదిలో పడిపోయాడు. తోటి జాలర్లు గమనించి ప్రకాశ్రావును నదిలో నుంచి బయటకు తీసేసరికి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.గోశాలలో ప్రత్యేక పూజలుయాదగిరిగుట్ట: కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా మల్లాపురం రోడ్డులోని మామిడి తోటలో ఉన్న గోశాలలో శ్రీకృష్ణుడికి, గోమాతకు ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్శర్మ, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.ఎంజీయూలో ప్రజాపాలన దినోత్సవంనల్లగొండ టూటౌన్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, జి. ఉపేందర్రెడ్డి, హరీష్ కుమార్, ప్రేమ్సాగర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గరిడేపల్లి: బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్ర శివారులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన ఊరె శ్రీనివాస్(50) బుధవారంన అత్తగారి ఊరైన పొనుగోడు నుంచి ఫత్తేపురం గ్రామానికి బైక్పై వస్తుండగా.. గరిడేపల్లి మండల కేంద్రం శివారులోని ఎంవీఆర్ ఫంక్షన్హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.ఆర్టీసీ బస్సు ఢీకొని..భువనగిరిటౌన్ : బైక్పై వెళ్తున్న గీత కార్మికుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు నారగోని బాలయ్యగౌడ్(56) బైక్పై భువనగిరికి వచ్చి పెట్రోల్ పోయించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. భువనగిరి పట్టణంలోని నల్లగొండ రోడ్డుపై ఎదురుగా వస్తున్న నల్లగొండ డిపో బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలయ్యగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ తెలిపారు. -
పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తప్పు జరగలేదు
భానుపురి(సూర్యాపేట): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మెరిట్ ప్రకారమే గ్రూప్–1 జాబితా తయారు చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతిభావంతుల మేధస్సును కించపరుస్తూ మానసికంగా దెబ్బతీయటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మంగళవారమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రిని కలిసి యూరియాను ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాలని కోరారని చెప్పారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, గడిచిన 20 నెలలు సంక్షేమ పాలన అందించామని, అదేవిధంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఫ మెరిట్ ప్రకారమే గ్రూప్–1 జాబితా ఫ ఐటీ మంత్రి శ్రీధర్బాబు -
ఉధృతంగా ప్రవహిస్తున్న డిండి వాగు
చందంపేట: డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండడంతో డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో చందంపేట మండలంలోని మన్నెవారిపల్లి, సిద్ధాపురం, బక్కలింగాలపల్లి, అక్కారం, ఐనూర్, బొమ్మన్పల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల వారు ఏదైనా అవసరమైతే దేవరకొండకు వచ్చేవారు కానీ.. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అచ్చంపేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా దేవరకొండ నుంచి మద్దిమడుగు మీదుగా శ్రీశైలం వెళ్లే వాహనాలు డిండి మీదుగా వెళ్తున్నాయి. 25 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిలిచిన రాకపోకలు -
సెల్ఫోన్లు అప్పగింత
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన సుమారు రూ.3.75లక్షల విలువైన 20 సెల్ఫోన్లను బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్కుమార్ మాట్లాడుతూ.. ఎవరైనా తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత వివరాలు ఆయా పోలీస్ స్టేషన్లో నమోదువుతాయని పేర్కొన్నారు. సెల్ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నంబర్లు భద్రపర్చుకోవాలన్నారు. పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మీనారాయణ, జయరాజు, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. -
సరైన వసతుల్లేని శిల్ప కళాశాల
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ శిల్ప కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా గదులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో శిల్ప కళాశాలలో విద్యార్థులు కూర్చునే గది పైకప్పు నుంచి నీరు లీకవ్వడంతో భయాందోళనకు గురయ్యారు. శిల్ప కళాశాల నిర్వహిస్తున్న భవనంలోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠంను కూడా కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనే మొదటిది.. తెలంగాణలోనే మొదటి శిల్ప కళాశాలను 2019లో యాదగిరిగుట్ట పట్టణంలో స్థాపించి, సర్టిఫికెట్ కోర్సులు మొదలుపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ ఆర్చిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ), హైదరాబాద్ అనుబంధంతో 3 సంవత్సరాల బీఏ కోర్సును ప్రారంభించారు. గతంలో శిల్ప కళను నేర్చుకునేందుకు రాష్ట్రంలోని పలువురు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన శిల్ప కళాశాలకు వెళ్లేవారు. అయితే సంప్రదాయ దేవాలయ శిల్ప కళాభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం, వైటీడీఏ ఆలోచనతో శ్రీలక్ష్మీనరసింహ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్చర్ అండ్ ఆర్చిటెక్చర్ పేరుతో యాదగిరిగుట్టలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 మంది విద్యార్ధులు.. ఈ శిల్ప కళాశాలలో ప్రస్తుతం 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 28 మంది విద్యార్థులకు గాను ఆరు గదులు ఉండాలి. కానీ ఇక్కడ మూడు గదులు మాత్రమే ఉండగా.. ఇందులో ఒక గదిని ఆఫీస్ రూమ్ కోసం, మరో రెండింటిని విద్యార్థులకు కేటాయించారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒక గది పైకప్పు నుంచి వర్షం నీరు లీకేజీ అవుతున్నాయి. దీంతో నిర్వాహకులు ఆ గదిని ఖాళీ చేసి, విద్యార్థులందరినీ ఒకే గదిలోకి పంపించారు. దీంతో అందులోనే విద్యనభ్యసించడంతో పాటు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మూడు సెమిస్టర్లు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. యాదగిరీశుడి ప్రధానాలయ పునఃనిర్మాణంలో స్తపతులుగా పనిచేసిన నలుగురు శిల్ప కళాశాలలో అధ్యాపకులుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు. శిల్ప కళాశాలకు రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో విశాలంగా ఉండేందుకు 2 ఎకరాల స్థలంతో పాటు రెగ్యులర్ అధ్యాపకులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంస్కృత విద్యాపీఠం ఇదే భవనంలో.. శిల్ప కళాశాల నడుస్తున్న భవనంలోని మొదటి అంతస్తులో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అనుబంధంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠాన్ని నడిపిస్తున్నారు. ఈ విద్యాపీఠంలో సుమారు 68మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పై అంతస్తులోనే విద్యార్థులు చదువుకోవడంతో పాటు అక్కడే మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతుంది. ఈ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు సైతం సరిపడా గదులు లేకపోవడం గమనార్హం. కాగా.. యాదగిరిగుట్ట పట్టణానికి సెంటర్గా ఉన్న ఈ భవనాన్ని 2005లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కొనసాగించేందుకు అదనపు గదులను నిర్మించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత గోశాల సమీపంలో కొనసాగుతుండగా.. ఐదేళ్ల క్రితం సంస్కృత విద్యాపీఠం, శిల్ప కళాశాలను కొనసాగించేందుకు దేవస్థానం, వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ వర్షానికి కురుస్తున్న పైకప్పు ఫ అదే కళాశాలలో కొనసాగుతున్న సంస్కృత విద్యాపీఠం ఫ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులుఫ నూతన భవనంలోకి మార్చాలని డిమాండ్ యాదగిరిగుట్టలో 2019లో శిల్ప కళాశాలను సర్టిఫికెట్ కోర్సుగా ప్రారంభించాం. అనంతరం వైటీడీఏ, దేవస్థానం, అప్పటి ప్రభుత్వ పెద్దలు 2022–23లో జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్ అనుబంధంతో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఒక గది పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతుంది. దీంతో విద్యార్థులను మరో గదిలోకి మార్చాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో చోటుకు కళాశాలను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – మోతీలాల్, శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ -
ఎమ్మెల్యే జగదీష్రెడ్డి క్యాంపు ఆఫీస్లో సీఎం ఫొటో
సూర్యాపేట : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు లేకపోవడం పట్ల సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారం కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లి సీఎం, మంత్రి ఫొటోలను పెట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను బీఆర్ఎస్ ఆఫీస్లా మార్చారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను అలానే ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిక బంగ్లా అయినందున సీఎం, జిల్లా మంత్రి ఫొటోలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సీఎం, మంత్రి ఫొటోలు తొలగిస్తే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫ కార్యకర్తలతో వెళ్లి పెట్టిన మార్కెట్ చైర్మన్ -
‘బాలెంల’ బలగంతో తిరుగుబాటు
సూర్యాపేట అర్బన్: సాయుధ పోరాటంలో భాగంగా 1946 అక్టోబర్ 18న తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు బాలెంల గ్రామాని చుట్టుముట్టారు. అప్పటికే గ్రామంలో ఉన్న నాయకులు పసిగట్టి తీవ్రంగా ప్రతిఘటించారు. తప్పని పరిస్థితుల్లో గ్రామ యువకులు గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి, సుంకు రంగయ్య, జమాల్ సాబ్, చాకలి భిక్షం, చాకలి చెన్నయ్య చేతికి అందిన గునపాలు, ముల్లు కరల్రు, రోకల్లలో పోలీసులతో గంటకు పైగా భీకర యుద్ధం చేశారు. పోలీసుల తుపాకులు లాక్కొని వారిని ఉరికించారు. దీంతో పోలీసులు పారిపోయారు. తిరిగి దొంగచాటుగా 25 మంది పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి విక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఆయుధాలు లేని యువకులు పోలీసు మూకలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. పోలీసుల కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి అమరులయ్యారు. -
బానిసత్వంపై ప్రజా పోరాటం
● నిజాంకు వ్యతిరేకంగా సామాన్య జనం తిరుగుబాటు ● రజాకార్ల కాల్పుల్లో నేలకొరిగిన ఎందరో వీరులురజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన గుండ్రాంపల్లిచిట్యాల: రజాకార్లకు ఎదురొడ్డి పోరాటం చేసిన గ్రామంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి సూర్యాపేట తాలుకాలోని వర్ధమానుకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చాడు. బతుకుదెరువు కోసం ఏపూరు గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద పనిలో చేరాడు. అనంతరం మక్బూల్ రజాకార్ల బృందంలో చేరి గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారిపై అరాచకాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. మక్బూల్ అరాచకాలకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూరు, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి అతడు 30మంది యువకులను బంధించి వారిని ఎడ్ల బండికి కట్టేసి గుండ్రాంపల్లి నడిబొడ్డున (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనతో పలివెలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్ తప్పించుకున్నాడు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్ చేయి విరగగా.. గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడు. కాని అతడి భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మక్బూల్కు సహకరించిన వారి ఇళ్లపై దాడి చేసి వారిని చంపేశారు. అమరవీరుల స్థూపం ఏర్పాటు.. నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాత నాటి పోరాటంలో 30 మందిని బావిలో సజీవ దహనం చేసిన చోట 1992 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు విజయవాడ–హైదరాబాద్ హైవే విస్తరణలో భాగంగా ఈ స్థూపాన్ని తొలగించి ఏపూరుకు వెళ్లే దారిలో పునఃనిర్మించారు. ఒకేరోజు 17మంది సజీవ దహనంఅర్వపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం నవాబు ఆకృత్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 17మంది కాసర్లపహాడ్ గ్రామస్తులను ఒకేరోజు రజాకార్లు సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. రజాకార్లకు వ్యతిరేకంగా అప్పట్లో చిగుర్ల సోమయ్య, మాజీ సర్పంచ్ సిరికొండ నర్సయ్య దళ కమాండర్లుగా పోరాడారు. ఆ సమయంలో రజాకార్లు కాసర్లపహాడ్ గ్రామానికి వచ్చి బాకి ముత్తయ్య, వేముల దేవయ్య, వేముల అర్వపల్లి, వేముల నర్సయ్య, మచ్చ చినరామయ్య, మంచాల గోపయ్య, కాటెబోయిన నర్సయ్య, పిట్టల రామయ్య, వడ్డగాని నర్సయ్య, బరిశెట్టి పాపయ్య, నల్లు చంద్రారెడ్డి, బౌరోజు లక్ష్మీనారాయణ, బౌరోజు సత్తయ్య, దిర్శనపు రాజయ్య, చెరుకు ఈదయ్య, ముద్దెరబోయిన కొండయ్య, దిర్శనపు రంగయ్యను పట్టుకొని గ్రామ శివారులోని కొమ్మోనిబండపై పశువుల కొట్టంలో తాళ్లతో కట్టేసి వారిపై ఎండుగడ్డి వేసి సామూహికంగా సజీవ దహనం చేశారు. అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన అనిరెడ్డి రాంరెడ్డి, పగిడిమర్రి జాను, రింగు హనుమయ్య, జోగు వెంకులు, రింగు వీరమల్లు నిజాం పోలీసుల చేతిలో అమరులయ్యారు. అమరుల జ్ఞాపకార్ధం కాసర్లపహడ్, అర్వపల్లిలో స్మారక స్థూపాలను నిర్మించారు. చిట్యాల: గుండ్రాంపల్లిలోని అమరవీరుల స్థూపం -
కట్ట మట్టి.. కొల్లగొట్టి!
తిరుమలగిరి (తుంగతుర్తి) : మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల వెంట అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. మూడు ట్రిప్పులు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా ఈ దందా సాగుతోంది. అయినా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తిరుమలగిరి మండలంలో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ, 69డీబీఎం, 70డీబీఎం, 71 డీబీఎం కాల్వలు ఉన్నాయి. ఆయా కాల్వల్లో తీసిన మట్టిని గతంలో వాటికి ఇరువైపులా పోశారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కాల్వల్లోకి వరద నీరు రాకుండా, కోతలకు గురి కాకుండా ఎత్తుగా ఉన్న ఈ మట్టి రక్షిస్తుంది. కాల్వల వెంట ఉన్న మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండానే కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారు. సాధారణంగా కొండలు, గుట్టల నుంచి మట్టిని తరలిస్తే మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. చెరువులు, కాల్వల నుంచి అయితే ఇరిగేషన్ శాఖ అధికారుల పర్మిషన్ ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు. హైవే రోడ్డుకు మట్టి తరలింపు వలిగొండ–తొర్రూరు నేషనల్ హైవే నిర్మాణానికి ఎస్సారెస్పీ కాల్వల వెంట ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా వాడుతుస్తున్నారు. కాల్వల వెంట జేసీబీలు పెట్టి అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా రోడ్డుకు మట్టిని తరలించి చదును చేస్తున్నారు. కొంత మంది నాయకుల కనుసన్నల్లోనే అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మట్టి దందాతో రూ. లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. దీంతో పాటు లేఅవుట్లు చదును చేయడానికి, రోడ్లు వేయడానికి కూడా ఈ మట్టిని తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. గతంలో కూడ తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామంలోని ఎర్రబోడు గుట్ట వద్ద కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి అక్రమంగా మట్టిని తరలించారు. ఇదే అదునుగా కాల్వల వెంట భూముల ఆక్రమణ కాల్వల వెంట ఉన్న మట్టిని పూర్తిగా తొలగించడంతో వీటికి ఇరువైపులా ఉన్న భూమిని పక్క భూమి వారు చదును చేసి కబ్జాచేస్తున్నారు. ఈ ఆక్రమించిన భూమిలో పంటలు సైతం వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కాల్వల వెంట మట్టిని తవ్వకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఎస్సారెస్పీ కాల్వల వెంట మట్టిని తీయడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. కాల్వల వెంట మట్టి తీసిన వారిపై, మట్టి తరలించిన టిప్పర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. – సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ డీఈ. ఎస్సారెస్పీ కాల్వల వెంట అక్రమంగా మట్టి తవ్వకాలు ఫ తిరుమలగిరి మండలంలో హైవేనిర్మాణం, వెంచర్ల ఏర్పాటు పనులకు తరలింపు ఫ నాయకుల కనుసన్నల్లోనే దందా ఫ చేతులు మారుతున్న లక్షల రూపాయలు -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
సూర్యాపేటటౌన్ : ప్రజల భద్రతే పోలీస్శాఖ లక్ష్యమని ఎస్పీ కె. నరసింహ పేర్కొన్నారు. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ, ఆర్టీఏ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడంతో పాటు400 మంది డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన ఆటో ప్రయాణానికి మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ఆటోలకు క్యూఆర్ కోడ్తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీని అందించామన్నారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కినట్లయితే క్యూఆర్ కోడ్ ప్రొవైడర్ ద్వారా సంబంధిత పోలీసులకు సమాచారం చేరి అలర్ట్ అయి మీకు రక్షణ కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్చార్జి ఆర్టీఏ జయప్రకాష్రెడ్డి, పట్టణ సీఐ వెంకటయ్య, మై ఆటో ఈజ్ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్రెడ్డి, ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచాలినడిగూడెం : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి భానునాయక్ కోరారు. నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన క్రీడా వస్తువులను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు క్రీడా వస్తువులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఉత్తీర్ణతను 70 శాతంగా నిర్ణయించిందన్నారు.నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించేందుకు అధ్యాపకులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ డి.విజయనాయక్, అధ్యాపకులు ఉన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి సూర్యాపేటటౌన్ : తమకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనిసూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. ఐదు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరతూ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట మంగళవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులేనని వారికి వెంటనే న్యాయం చేయాలన్నారు. 126 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ఉద్యోగులు రామారావు, నర్సిరెడ్డి, నాగయ్య, సాగర్, విజయ్, సాయి, రమాకాంత్, క్రాంతి, సతీష్, అనిల్, నవీన్, సందీప్, జానకి రాములు, భరత్, వీరేష్ ,మధు తదితరులు పాల్గొన్నారు. -
ఎండు ఆకు తెగులు.. నివారణ చర్యలు
త్రిపురారం: ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంటలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్యాక్టీరియా సోకడం వల్ల ఎండు ఆకు తెగులు ఉదృతిని అధికంగా ఉంది. దీంతో రైతులు సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఎండాకు తెగులు గుర్తించే పద్ధతులు, నివారణ చర్యలు ఆయన మాటల్లో... తెగులు సోకడానికి కారణాలు ఆగస్టు–సెప్టెంబర్ మధ్యలో ఉండే వాతావరణ పరిస్థితులు, మబ్బులతో కూడిన వాతావరణం రెండు నుంచి మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వరిలో ఎండాకు తెగులు ఆశించడానికి దోహదం చేస్తాయి. నారు మడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. గుర్తించే విధానం వరి పంటలో ఎండాకు తెగులు సోకిన ప్రదేశంలో ముందుగా ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో గమనించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది. నివారణ చర్యలు బ్యాక్టీరియా వ్యాప్తి నివారణకు తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు (లేదా) పోషామైసిన్ (లేదా) స్ట్రైప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. -
కమ్యూనిస్టులు ప్రభుత్వానికి సహకరించాలి
కోదాడ: ప్రజలతో నిత్యం కలిసి ఉండే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. కోదాడలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్లగొండ ఎంపీగా, సీపీఐ జాతీయ కార్యదర్శిగా సురవరం అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెట్టాయన్నారు. గతంలో తాగు, సాగునీటికు నోచుకోని నల్లగొండ జిల్లాకు కమ్యూనిస్టులు నిర్వహించిన ఉద్యమాలతో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని తెలుసుకొని ప్రజలు తినడానికి అనువుగా ఉండే సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఇప్పుడు రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితకాలం పోరాటాలు నిర్వహించిన సురవరం సుధాకర్రెడ్డి నిజమైన పేదల పక్షపాతి అని కొనియాడారు. పేద మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం ఉద్యమించేవారని గుర్తు చేశారు. సురవరం చూపిన పోరాట మార్గాన్ని నేటి కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సురవరం కృషి చేసేవారని అన్నారు. ఎంపీ రఘువీర్రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ ఎంపీ స్థానానికి తాను ఎంపీగా ఉండడం గర్వంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, గన్నా చంద్రశేఖర్, మేకల శ్రీనివాసరావు, బత్తినేని హనుమంతరావు, బద్దం కృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్బారావు, ఉస్తేల సృజన, ముల్కలపల్లి రాములు, కెఎస్ఎన్ ప్రసాద్, చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, అల్తాఫ్ హుస్సేన్తో పాటు పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సంపూర్ణ ఆరోగ్యం
సమతుల ఆహారం.. నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా పోషకాహారం అందిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇంకా రక్తహీనత, పలు రకాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం, కేంద్రాలకు వచ్చే వారందరికీ పోషకాహారం అందించే లక్ష్యంతో గతేడాది వరకు సెప్టెంబరు మాసం మొత్తం పోషణ సంబరాలు నిర్వహించేవారు. అయితే ఈ సారి ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, వివిధ శాఖలను భాగస్వాములను చేయనున్నారు. పర్యవేక్షణ చేపట్టాలి.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి రోజూ 75 గ్రాముల బియ్యం, 15 గ్రా. పప్పు, 0.5 గ్రా. ఆయిల్, గుడ్డు, 20 గ్రా. మురుకులు, 50 గ్రా. బాలామృతం అందజేస్తున్నారు. అయినా పోషకాహార లోపం ఉన్న చిన్నారులు, గర్భిణుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జిల్లాలో సుమారు 600 మందికి పైగా చిన్నారులు వారి వయసు కంటే తక్కువ ఎత్తు, బరువు ఉన్నారు. గర్భిణులను కూడా రక్తహీనత వెంటాడుతోంది. దీని కారణంగా సిజేరియన్ కాన్పులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చేపట్టబోయే కార్యక్రమాల ద్వారా మార్పు వచ్చేలా అవగాహన కల్పించాల్సి ఉంది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టాలి. పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లాలో బుధవారం నుంచి నెల రోజుల పాటు నిర్వహిచనున్నాం. పోషణ మాసంలో భాగంగా పిల్లలకు, కిశోర బాలికలకు, మహిలకు పోషకాహారంపై అవగాహన కల్పించేలా కార్యచరణ రూపొందించాం. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి, సూర్యాపేట. జిల్లా వివరాలు ఇలా...మండలాలు 23ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1209చిన్నారుల సంఖ్య 47,404గర్భిణులు 5,947 బాలింతలు 3,888ఫ నేటి నుంచి పోషణ మాసం ఫ అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఫ పోషణ ట్రాకర్లో వివరాల నమోదు -
ప్రజాపాలన దినోత్సవానికి వేళాయే
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 17వ తేదీన ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం సూర్యాపేట కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతీయ గీతాలాపన, 10.05 గంటలకు మంత్రి ప్రసంగించనున్నారు. 10.30 గంటలకు బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 11గంటలకు ఈ కార్యక్రమం ముగియనుంది. ఇదిలా ఉండగా ఇక్కడ జరిగే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ పాల్గొంటారని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం విదితమే. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం ఉత్తమ్.. రంగారెడ్డి జిల్లాలో జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. ఫ నేడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి శ్రీధర్బాబు