breaking news
Suryapet
-
చేయూత పింఛన్లు పెంచేవరకు పోరు
హుజూర్నగర్ : ప్రభుత్వం చేయూత పింఛన్లు పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్లో చేయూత పింఛన్దారుల జిల్లా సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని, వికలాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో మంత్రుల నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించిన అనంతరం ఈనెల 13న హైదరాబాద్లో చేయూత పింఛన్దారుల మహా గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ మహాగర్జనకు పింఛన్దారులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బివెంకటేశ్వర్లు, సీహెచ్.వినయ్ బాబు, ఆర్ సురేష్, సీహెచ్.నాగయ్య, బి.ప్రసాద్, ఒగ్గు విశాఖ, ఎం.వెంకటేశ్వర్లు, శరత్బాబు, ఎం.నాగరాజు, రాజేష్, శరత్, ఖాసీం, సతీష్, వినయ్, శ్రీనివాస్, రవీందర్, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంద కృష్ణమాదిగ -
కోటపహాడ్ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ఆత్మకూర్(ఎస్) : మండలంలోని కోటపహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.విజయ్ కుమార్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు పట్టించుకోకపోవడంతో వీధులు, మురికి కాలువల్లో చెత్తపేరుకుపోయి దుర్వాసన వస్తోందని మూడు రోజులు క్రితం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడం, నిరసన గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణ చేపట్టి కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారని ఎంపీడీఓ తెలిపారు. నీట్ పీజీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కోదాడరూరల్ : నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని సన కళాశాలలో ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సన కళాశాలలో 50 మంది, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో 180 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అభ్యర్థులను 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, సీసీ కెమోరాలు, జామర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, కళాశాల సిబ్బంది ఉన్నారు. పీహెచ్సీల్లో కాన్పుల సంఖ్య పెరగాలిఅర్వపల్లి: పీహెచ్సీల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెరిగేలి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, నర్సింగ్ ఆఫీసర్ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదల మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 2,08,455 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో అధికారులు 8 గేట్లను మూడు మీటర్ల మేరకు పైకెత్తి 2,05,279 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట అధికారులు తెలిపారు. -
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
సూర్యాపేట : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి రామ్కోటి ప్రజాపతి, రాష్ట్ర నాయకుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించే 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష వాల్ పోస్టర్లను శుక్రవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రి ఉత్తంకుమార్రెడ్డి, ఎంపీ రఘువీర్రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. నిరాహార దీక్షకు 30 కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల సైదులు, రెడ్డబోయిన నరేష్, కె.వీరబాబు, సట్టు మురళి, వేముల వీరమల్లు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గొట్టిపర్తి లింగయ్య, ఎలకపల్లి సైదులు, ప్రవీణ్, రాచమల్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ప్లాంట్లోని రెండో యూనిట్ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యూనిట్ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డియాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ వైటీపీఎస్లోని అన్ని విభాగాల్లో లాగ్బుక్ ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్రాజు పాల్గొన్నారు. చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్ పనులు పవర్ ప్లాంట్లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే నాలుగో బాయిలర్ లైటింగ్ (స్టీమ్ జనరేషన్) పనులు పూర్తికాగా, ప్లాంట్ సింక్రనైజేషన్కు సంబంధించి బాయిలర్ స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్, నార్మలైజేషన్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. యూనిట్–3 సింక్రనైజేషన్ను సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి, అక్టోబర్లో కమర్షియల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. డిసెంబర్లో సింక్రనైజేషన్ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ పేర్కొంది. ఫ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్–2 ప్రారంభం ఫ శుక్రవారం యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తిచేయాలని ఆదేశం ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మోతె : సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనణ కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మోతె పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లు, బ్లడ్ టెస్టులు, మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్సీ చెకప్కు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య విషయాలను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు వైద్యధికారులు కృషి చేయాలన్నారు. ఎక్కడైన డెంగీ కేసులు గుర్తిస్తే వారి ఇంటి పరిసరాల్లో శానిటేషన్ చేయించాలన్నారు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం తీసుకుంటే శిశువులో ఎదుగుదల ఉంటుందన్నారు. భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాంపురంతండాలో ఎస్సారెస్పీ 22–ఎల్ కాల్వను పరిశీలించి సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, పీహెచ్సీ డాక్టర్ యశ్వంత్, ఆయుష్ డాక్టర్ వాణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముఖ హాజరు
తొలిరోజు 2,689 మంది ఉపాధ్యాయులకు ‘ఫేస్ రికగ్నిషన్’ అమలు ఫ సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా రిజిస్ట్రేషన్ ఫ జిల్లాలో 881 స్కూళ్లు.. 4,542 మంది టీచర్లు సూర్యాపేటటౌన్ : విధులు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లకు ఇకనుంచి చెక్ పడనుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులే నేరుగా తమ సెల్ ఫోన్లలోనే ఆన్లైన్ విధానంలో హాజరు నమోదు చేసుకునేలా టీజీఎఫ్ఆర్ఎస్ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. అయితే మొదటి రోజు 2,689 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. శనివారం అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ యాప్ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయనున్నారు. విద్యార్థులకు మాదిరిగానే.. గతేడాది నుంచి పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు టీచర్లకు హాజరు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు. యాప్లో రిజిస్ట్రేషన్ ఇలా.. జిల్లాలోని 881 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 4,542 మంది పనిచేస్తున్నారు. కొత్త విధానం అమలులో భాగంగా సంబంధిత ఉద్యోగి స్మార్ట్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను టెక్నీషియన్ అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్లైన్లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం, ముగిసిన తర్వాత క్లాక్ ఔట్ అనే ఆప్షన్పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్లైన్లో చేరుతుంది. విద్యార్థులకు మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు కొందరు సమయానికి రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తెచ్చింది. దీతో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మెరుగైన బోధన అందుతుంది. మిగిలిన ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ శనివారం పూర్తవుతుంది. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తమ బోధనే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు విద్యాశాక ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజలి సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి. బైక్ అదుపుతప్పి యువకుడి మృతిఫ మరో ఇద్దరికి గాయాలు డిండి: బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది. శుక్రవారం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన లక్కు విజయభాస్కర్రెడ్డి(18), ఎం. సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డి గురువారం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుని రాత్రి బైక్పై ముగ్గురు కలిసి నాగార్జునసాగర్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్ అదుపుతప్పడంతో మధ్యలో కూర్చున్న విజయభాస్కర్రెడ్డి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సిద్దార్ధరెడ్డి, ప్రకాష్రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలించారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విజయభాస్కర్రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పచ్చందాల అర్బన్ పార్కు
సాగర్ జలాశయ తీరంలో నాగార్జునసాగర్–హైదరాబాద్, సాగర్–నల్లగొండ రహదారుల (సమ్మక్క–సారక్కల) వెంట రూ.1.5కోట్లతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల అటవీ కోర్ ఏరియాలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు పచ్చందాలను ఆరబోస్తోంది. 980 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన సాగర్ బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు రెండు రకాల సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో 10 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1,000, 24 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. సిబ్బంది కొరత మూలంగా పర్యాటకులు అడిగితేనే సఫారీ వాహనాలను నడుపుతున్నారు. -
ముఖ్యమైన ఫోన్ నంబర్లు
ఫ హిల్కాలనీ లాంచీ స్టేషన్: 7997951023 ఫ ఎత్తిపోతల : 9441453115, 9494347946 ఫ విజయపురి నార్త్ ఎస్ఐ: 8712670197 ఫ సాగర్ మాత దేవాలయం: 9581642488 ఫ ఫైలాన్ కాలనీ టైగర్ వ్యాలీ హోటల్: 915439303 ఫ పార్కింగ్ హోటల్ అండ్ రెస్టారెంట్: 7993750209 ఫ విజయపురి సౌత్లోని మాతాసరోవర్ రిసార్ట్స్: 8500718552, 7901084959 -
దుకాణాల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఫ మహిళకు తీవ్ర గాయాలు ఆలేరు: డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పెద్దవాగు నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తరలించేందుకు జూకంటి సంపత్ ట్రాక్టర్కు తహసీల్దార్ ఆంజనేయులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ కమల్హాసన్ వాగు వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని కనకదుర్గ గుడి మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. ఆర్కే సినిమా థియేటర్ వెళ్లే దారి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ ఉడెన్ ఫర్నీచర్ వర్క్స్షాప్ పైకి దూసుకెళ్లింది. దీంతో షాపులోని వర్కర్లు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొలనుపాకకు చెందిన వల్లెపు రాజమణిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫర్నీచర్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, డ్రైవర్ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాంగ్రూట్లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్ దుకాణాల పైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల, మిర్యాలగూడ టౌన్: సాగర్ ఎడమ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో లభ్యమైంది. మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపహాడ్ గ్రామానికి చెందిన చౌగాని శంకర్(38) తన స్నేహితులతో కలిసి బుధవారం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. శంకర్ మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో సాగర్ ఎడమ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొని వెళ్తుండగా స్థానికులు గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తన సిబ్బందితో ఎడమ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్పందించి శంకర్ కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకెళ్లగా మృతదేహం శంకర్దేనని గుర్తించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు మునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన పాలమాకుల సోమయ్య(45), ధనలక్ష్మి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాములలో కోడిగుడ్లు కొనుగోలు చేసి తమ సొంత ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఆకుపాముల గ్రామ శివారులోని జియో పెట్రోల్ బంబక్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహంనంలో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమయ్య మృతిచెందాడు. సోమయ్య భార్య ధనలక్ష్మి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆతిథ్యమిస్తున్న హోటళ్లు
నాగార్జునసాగర్లో పర్యాటకులకు అనుగుణంగా హోటళ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో హోటల్ బిజినెస్ కూడా పెరిగింది. హిల్కాలనీలో విజయ్విహార్లో నడుస్తున్న హోటల్లో దేశ, విదేశీయులు తినే పలురకాల వంటకాలు లభ్యమవుతున్నాయి. అలాగే బుద్ధవనంలో సిద్థార్థ హోటల్, మనోరమ హోటల్, పైలాన్కాలనీలో ఇటీవల ఏర్పాటైన టైగర్ వ్యాలీ హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి అవతలి వైపున ఉన్న మాతా సరోవర్, రైట్ బ్యాంకులో మాతా సరోవర్ హోటళ్లు వెలిశాయి. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హిల్కాలనీలో విజయ్విహార్ హోటల్లో 34 గదులు ఉన్నాయి. ముందస్తుగా ఆన్లైన్లో టీడీటీజీసీ.ఇన్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. వివరాలకు 08680–277362 నంబర్ను సంప్రందించాలి. -
సాగర్ సోయగాలు
చూసొద్దాం.. రండి నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని మాచర్లకు వెళ్లే దారిలో 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వద్ద 70 అడుగుల పైనుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. ఈ జలపాతం చూసేందుకు టిక్కెట్ ధర పెద్దలకు రూ.30 కాగా పిల్లలకు రూ.20. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి బస చేసేందుకు 8 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్ ఫ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే నందికొండ, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం ఫ చెప్పలేని అనుభూతిని మిగిల్చే లాంచీ విహారం గత ఆనవాళ్లకు చిరునామా అనుపు హిల్కాలనీకి 15 కిలోమీటర్ల దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ అలనాటి నాగార్జున విశ్వవిద్యాయం, ఇక్ష్వాకుల యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణా నది లోయలో లభించిన రంగనాథస్వామి ఆలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణా నది తీరంలో నిర్మించడం విశేషం. తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మనసు దోచే ఎత్తిపోతల -
3న ప్రో కబడ్డీ పోటీలు
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ ప్రో కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఈనెల 3న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (ఇండోర్)లో జరగనున్నట్లు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి , నామా నరసింహా రావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర యువ ప్రో కబడ్డీ లీగ్ పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల సూర్యాపేట జిల్లా క్రీడాకారులు ఈనెల2లోపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సెల్ నంబర్ 9912381165ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోంఅనంతగిరి: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ వెంట మండల వైధ్యాధికారి డాక్టర్ పుష్పలత, పీహెచ్ఎన్ అనంతలక్ష్మి, స్టాఫ్ నర్సు ధనలక్ష్మి, ఫార్మసిస్ట్ కృష్ణ తదితరులు ఉన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేపెన్పహాడ్: విద్యార్థులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈఓ అశోక్ సూచించారు. గురువారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయం, సింగారెడ్డిపాలెంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి నూరుశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కృష్ణప్రసాద్, పీడీ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు నరేందర్, ఉపాధ్యాయులు నల్లా శ్రీనివాసులు, మహేష్, సరిత పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మమతభానుపురి (సూర్యాపేట ) : యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాకు చెందిన మమతా నాగిరెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , కేసి వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి మమతానాగిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అమ్మ పాలు అమృతం
అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అమ్మపాల విశిష్టత తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. గర్భిణులు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సూర్యాపేట అర్బన్ : అమ్మ పాలు అమృతంతో సమానమని పెద్దల మాట. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను అందించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు పట్టిస్తేనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ముర్రుపాలు తప్పనిసరి బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను శిశువుకు తప్పనిసరిగా పట్టించాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహారం అందుతుంది. ఈ పాలలో మాంసకృత్తులు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన గంట నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం ఇవ్వకూడదు. రోజూ ఎనిమిది నుంచి పదిసార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ నేటి నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు -
లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలి
భానుపురి (సూర్యాపేట) : లేబర్ కోడ్ చట్టాలను రద్దుచేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్లయ్య డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ గురువారం టీయూసీఐ(ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేటలో ఆ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు గులాం హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న,జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి, సాహెబ్ హుస్సేన్, కస్తాల కృష్ణ, రజాక్, మోహన్, అంజయ్య, సైదులు పాల్గొన్నారు. -
ఈత, తాటి వనాలతో జీవనాధారం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఈత, తాటి వనాలు గౌడ కుటుంబాలకు జీవనాధారం అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో గౌడ సొసైటీ భూమిలో నాలుగు ఎకరాల్లో కలెక్టర్ ఈత మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. నాటిన మొక్కలను చంటి బిడ్డల్లా కాపాడి పెంచి పెద్ద చేసినప్పుడే ప్రయోజనం కలుగుతుందన్నారు. 1,600 ఈతమొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణకు నీటి కోసం బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నీటి తొట్టెలు నిర్మించి వాటి ద్వారా మొక్కలకు నీరు పోసి పెంచాలని సూచించారు. ఫెన్సింగ్ మంజూరు చేసి డ్రిప్ సౌకర్యం కల్పించాలని గౌడ సొసైటీ బాధ్యులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ అప్పారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్, ఆర్డీఓ వేణు మాధవరావు, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ మహ్మద్ హాసీం, కార్యదర్శి స్వప్న, గౌడ సొసైటీ చైర్మన్ వెల్గూరి జానయ్య, మల్లయ్య, తండు నాగలింగం, బాలయ్య, రాజు, నేతలు తంగళ్ల కరుణాకర్ రెడ్డి, ముసుగు రామచంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, శివ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేశారు భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు చేరే విధంగా డీపీఆర్ఓ రమేష్ కుమార్ అంకిత భావంతో పని చేశారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన డీపీఆర్ఓ రమేష్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో మంత్రుల పర్యటనలను విజయవంత చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు, పదవీ విరమణ పొందిన డీపీఆర్ఓ రమేష్కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ పాతసూర్యాపేటలో వనమహోత్సవం -
ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
చివ్వెంల(సూర్యాపేట) : ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న జ్యూడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోర్టులో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మధుసూదన్రావు ,ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, కోశాధికారి జునైద్, అసోసియేట్ అధ్యక్షుడు ఎ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె.వి.శ్రీకాంత్, ఎ.ఉమ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.మహేశ్వర్, జాయింట్ సెక్రటరీలు పి.నాగంజనేయులు, ఎ.మధుకర్, కె.నాగరాజు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
నిర్వహణ ఎత్తిపోయింది
నడిగూడెం : నాగార్జునసాగర్కు అనుబంధంగా నడిగూడెం మండల పరిధిలో నిర్మించిన ఎల్–34, ఎల్–35, ఎల్–36, ఎల్–10 ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మైనర్, మేజర్ కాల్వలు చెత్తాచెదారంతో నిండి పూడిపోవడం చివరి భూములకు నీరు అందడంలేదు. దీంతో పాటు ఈ పథకాలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు నిత్యం మొరాయిస్తున్నాయి. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు పూడిపోయి.. నడిగూడెం మండల కేంద్రం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–34 ఎత్తి పోతల పథకం ఉంది. ఈ పథకం కింద నడిగూడెం, రామాపురం గ్రామాలుండగా వీటి పరిధిలో 600 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద కాల్వలు పూడి పోవడంతో పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్–35 పరిధిలో.. నారాయణపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఎల్–35 ఎత్తి పోతల పథకాన్ని నిర్మించారు. దీని పరిధిలో నారాయణపురం, బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ పథకం కింద దాదాపు 4,500 ఎకరాలు డిజైన్ చేశారు. ఈ లిఫ్ట్ కింద కాల్వలు అధ్వాన్నంగా ఉండంతో కరివిరాల, వేణుగోపాలపురం గ్రామాలకు నీరందడంలేదు. కంపచెట్లతో నిండి.. కాగితరామచంద్రాపురం వద్ద ఎల్–36 ఎత్తి పోతల పథకం నిర్మించారు. దీని కింద కాగితరామచంద్రాపురం, కరివిరాల గ్రామాలున్నాయి. ఈ ఎత్తిపోతల కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కంపచెట్లతో పూడిపోయాయి. దీంతో ఈ ఎత్తిపోతల ద్వారా కేవలం కాగితరామచంద్రాపురం రైతులకు మాత్రమే నీరందుతోంది. చివరి ఆయకట్టు గ్రామమైన కరివిరాలకు సాగునీరు అందడంలేదు. నిర్వహణలోపంతో.. సిరిపురం వద్ద ఆర్–10 ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో సిరిపురం, శ్రీరంగాపురం, త్రిపురవరం గ్రామాలున్నాయి. ఈ లిఫ్ట్ కింద 6,500 ఎకరాలు డిజైన్ చేశారు. కానీ నిర్వహణ లోపం వల్ల ఆయకట్టు గ్రామమైన త్రిపురవరం వరకు నీరు పోవడం లేదు. మేజర్, మైనర్ కాల్వలు పలు చోట్ల పూడి పోవడం, ఇంకా పలు చోట్ల కంపచెట్లు ఉండడంతో చివరి భూములకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. మొరాయిస్తున్న మోటార్లు నడిగూడెం మండల పరిధిలోని నాలుగు ఎత్తి పోతల పథకాలకు చెందిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు నిత్యం మొరాయిస్తున్నాయి. దీంతో నిర్వహణ కష్టతరంగా మారింది. గతంలో ఎత్తి పోతల పథకాలను ఐడీసీ నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి పారుదలశాఖ నిర్వహిస్తోంది. ఎత్తి పోతల పథకాల కింద సాగు చేసే రైతులు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి చివరి భూములకు నీరందించేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫ నడిగూడెం మండలంలో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్వహణ అస్తవ్యస్తం ఫ పూడిపోయిన మేజర్, మైనర్ కాల్వలు ఫ చివరి భూములకు అందని సాగు నీరు ఫ నిత్యం మొరాయిస్తున్న మోటార్లు చివరి భూములకు నీరందించాలి ఎల్–35 ఎత్తి పోతల పథకం కింద నాకున్న భూమిని సాగు చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా చివరి భూములకు నీరందడంలేదు. గత రబీ సీజన్లో ఎత్తి పోతల నుంచి నీరందక ఎకరం ఎండి పోయింది. సంబంధిత అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మత్తులు చేయించి, చివరి భూములకు నీరందించాలి. –షేక్.మస్తాన్, రైతు, కరివిరాల కాల్వలకు మరమ్మతులు చేయాలి ఆర్–10 ఎత్తి పోతల పథకం పరిధిలో మేజర్, మైనర్ కాల్వలు కంపచెట్లతో నిండిపోయాయి. దీంతో చివరి భూములకు నీరందడంలేదు. అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించాలి. –మన్నెం నాగిరెడ్డి, రైతు, త్రిపురవరం ప్రతిపాదనలు పంపాం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే కాల్వలకు మరమ్మతులు చేపడతాం.చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నాం. – ఆనంద్ కుమార్, డీఈ, నడిగూడెం -
ఈ ఏడాది.. రాగిజావ ఏదీ?
హుజూర్నగర్ : పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ ఇంకా ప్రారంభించలేదు. గత ఏడాది పీఎం పోషణ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీని ప్రారంభించి విద్యా సంవత్సరం చివరి వరకు అందించారు. కానీ, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు విద్యార్థులకు రాగిజావ పంపిణీని ప్రారంభించలేదు. దీంతో విద్యార్థులు ఒకింత నిరుత్సాహానికి గురువుతున్నారు. జిల్లాలో 45వేల మందికిపైగా చిన్నారులుజిల్లాలో మొత్తం 979 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 690 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18,062 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 78 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,079 మంది, 211 ఉన్నత పాఠశాలల్లో 24,777తో కలిపి మొత్తం 45,918 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరూ గతేడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం రాగిజావ అందిస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. వారంలో మూడు సార్లు.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు కోడి గుడ్డు ఇస్తున్నారు. గుడ్డు లేని రోజుల్లో అంటే మంగళ, గురు, శనివారాల్లో మూడు రోజులపాటు మధ్యాహ్న భోజనానికి ముందు గత సంవత్సరం విద్యార్థులకు బెల్లంతో చేసిన రాగిజావ పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి పది గ్రాముల రాగి పిండి, బెల్లంతో మరిగించిన జావను ఇచ్చారు. ఇది మంచి పోషకాలతో కూడి ఉండడంతో చాలా మంది విద్యార్థులు ఇష్టంగా తాగారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు రాగిజావ అందిస్తే బాగుంటుందని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు పునః ప్రారంభమై నెలన్నర రోజులు నేటికీ రాగిజావ పంపిణీని ప్రారంభించని ప్రభుత్వం ఎదురుచూపుల్లో విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 979 స్కూళ్లు.. 45,918 మంది విద్యార్థులుమరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేస్తాం ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది ఇంకా రాగిజావ పంపిణీకి సంబంధించిన ఆదేశాలు రాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విద్యార్థులకు జాగిరావ పంపిణీ చేస్తాం. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఇక.. ముఖం చాటేయలేరు!
సూర్యాపేట : కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది సమయానికి రాకపోవడం, వచ్చినా వెంటనే వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. దీంతో వైద్యులు అందుబాటులో లేక ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించి, వైద్యసేవల్లో మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి వైద్య సిబ్బంది వివరాలను పంపించాలని ఆదేశించింది. అయితే ఫేస్ రికగ్నిషన్ను ప్రవేశపెట్టాలని ఆదేశిలిచ్చినా ఇందుకు సంబంధించి పరికరాలు ఇంకా రాలేదు. జిల్లాలో 1500 మంది వైద్యసిబ్బంది జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పీహెచ్సీలు 27, ఏరియా ఆస్పత్రులు 3, యూపీహెచ్సీలు 4, బస్తీ దవఖానాలు 5, పల్లె దవఖానాలు 122, ఆరోగ్య ఉప కేంద్రాలు 39 ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1500 మంది వరకు వైద్య సిబ్బంది ఆయా కేటగిరిల్లో పనిచేస్తున్నారు. వీటన్నింటిలోనూ ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలను జిల్లా నుంచి ఉన్నతాధికారులకు నివేదించారు. ఫేస్ రికగ్నిషన్తో మెరుగైన వైద్య సేవలు మారుమూల ఆస్పత్రులకు వైద్య సిబ్బంది వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు వైద్య సిబ్బంది ఉదయం వచ్చి హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లిపోవటం, లేదంటే రెండు రోజులకు ఒకసారి వచ్చి సంతకాలు చేయడం లాంటివి పరిపాటిగా మారినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తున్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఆశిం చిన స్థాయిలో ఫలితాలు రాకపోవటం, అవకతవకలకు అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఉన్నతాధికారులకు వివరాలు పంపించాం జిల్లాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. జిల్లాలో 1500 మంది వరకు వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఫేస్ రికగ్నిషన్కు సంబంధించి పరికరాలు ఇంకా రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. పరికరాలు రాగానే అన్ని ఆస్పత్రుల్లో అమలు చేస్తాం. – డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ వైద్యసిబ్బందికి ముఖ హాజరు ఫ 1వ తేదీ నుంచి అమలయ్యే అవకాశం ఫ వైద్య సేవల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని సర్కారు నిర్ణయం ఫ ఉన్నతాధికారులకు చేరిన వైద్యులు, సిబ్బంది వివరాల నివేదిక -
నారు ఉచితం.. సాగుకు ఊతం!
సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో నాణ్యమైన నారును రాయితీపై అందిస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయల నారు కావాల్సిన రైతులు నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఉద్యాన వన శాఖ అధికారులను సంప్రదించాలి. – తీగల నాగయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి నాగారం : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వినియోగదారుల ఆర్థిక అంచనాలు తారుమారవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్’ (ఎంఐడీహెచ్) పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను హైబ్రిడ్ రకం మిర్చి, టమాట, వంకాయ పంటల సాగుకు నారు ఉచితంగా ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి 60 ఎకరాలకు సరిపడా నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 813 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మేడ్చల్ జిల్లా నుంచి నారు.. జిల్లాలో మిర్చి, టమాట, వంకాయ సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు ఉచితంగా నారు అందించనున్నారు. టమాట, వంకాయ పంటల సాగుకు ఎకరానికి 8 వేల మొక్కలు అవసరం కాగా మిర్చికి మరింత నారు పట్టనుంది. వీటిని సీవోయి మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నర్సరీలో పెంచుతున్నారు. ఇది వరకు ప్రభుత్వం రూ.6,500 రాయితీ ఇవ్వగా రైతు వాటా రూ.1,500 ఉండేది. ప్రస్తుతం రైతులకు నారును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుండగా, రైతులు రవాణా చార్జీలను భరించాల్సి ఉంటుంది. నెల ముందే దరఖాస్తు.. కూరగాలయ పంటలను సాగు చేసే రైతులు నెల రోజుల ముందే అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తంగా ఈ సీజన్లో 60 ఎకరాలకు సరఫరా చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 30 ఎకరాలకు రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగే 10 ఎకరాలకు అధికారులు ఇండెంట్ పంపించారు. ఈ ఏడాది మిర్చి, వంగ, టమాట నారులు ఇవ్వనుండగా.. వచ్చే ఏడాది మరికొన్ని కూరగాయల రకాల చెందిన నారును రైతులకు ఇవ్వనున్నట్టు తెలిసింది.ఫ కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఫ మిర్చి, టమాట, వంకాయ సాగుపై దృష్టి ఫ రెండు సీజన్లలో 60 ఎకరాలకు నారు అందించాలని నిర్ణయం ఫ ఉత్పత్తి పెంపునకే ‘ఎంఐడీహెచ్’ అమలు -
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
తిరుమలగిరి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఐఈఓ బాలునాయక్ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు పంపించాలని కోరారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ మృత్యుంజయ, రాజమోహన్, శ్రీనివాస్ తదితరులున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ గరిడేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ పర్వీన్ సందర్శించారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంతో పాటు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట వైద్యాధికారి నరేష్, డీపీఓ ఉమ, ఎన్సీడీ కో ఆర్డినేటర్ సాంబశివరావు, హెల్త్ సూపర్వైజర్ అంజయ్యగౌడ్, ఏఎన్ఎం కవిత, బాలకృష్ణ ఉన్నారు. 1న చేయూత పింఛన్దారుల మహాసభసూర్యాపేట అర్బన్ : హుజూర్నగర్లో వచ్చేనెల 1న జరిగే చేయూత పింఛన్దారుల జిల్లా సన్నాహక మహాసభను జయప్రదం చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ అన్నారు. బుధవారం పిల్లలమర్రి గ్రామంలో చేయూత పెన్షన్దారులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే వికలాంగుల చేయూత పింఛన్ల మహాగర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు ఆగస్టు 1న హుజూర్నగర్లో వికలాంగుల చేయూత పింఛన్దారుల సన్నాహక మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకుపల్లి ఎల్లయ్య, సందీప్ పాల్గొన్నారు. -
సీఎంఆర్ బకాయిలు ఉంటే కేటాయింపులు ఇవ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు వచ్చే సీజన్లో కేటాయించేది లేదని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాంబాబు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి 2023 – 24 సీఎంఆర్ పెండింగ్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బకాయిలు పెండింగ్లో ఉన్న మిల్లర్లు గడువులోగా ధాన్యాన్ని అందించాలని ఆదేశించారు. బకాయి ఉన్న మిల్లర్లు 100శాతం బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ఆ మిల్లులకు సీఎంఆర్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ధాన్యాన్ని వేగంగా అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ మోహన్ బాబు, ఏసీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఎం బెనర్జీ, డీటీలు, ఆర్ఐ లు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హామీలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సూర్యాపేట : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ పబ్బం గడుపుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. భూభారతి చట్టం ద్వారా మొత్తం భూములను సర్వే చేసి నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగించాలని, అసలైన పట్టాదారులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వేల్పుల వెంకన్న, నరసింహారావు, మద్దెల జ్యోతి, ఉప్పుల రమేష్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి -
వైద్యరంగ సమస్యలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : వైద్యరంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రతి గ్రామంలో, గురుకుల, సంక్షేమ, కేజీవీబీ హాస్టల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పూల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సక్క డిమాండ్ చేశారు. బుధవారం పీవైఎల్, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతున్నారన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. కార్యక్రమంలో పీవైఎల్, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ నాయకులు దరవత్ రవి, పోలెబోయిన కిరణ్ కుమార్, బండి రవి, రామ లింగమ్మ, పిడమర్తి భరత్, రాఖి, బోర లెనిన్, రవి, రమేష్, సతీష్, మహేష్, అనిల్ పాల్గొన్నారు. -
హైవే విస్తరణకు గ్రీన్సిగ్నల్
అర్వపల్లి: రాష్ట్రంలో 15 జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎన్హెచ్–365 నకిరేకల్–మల్లంపల్లి సెక్షన్లోని, నకిరేకల్–తానంచర్ల రహదారి ఉంది. అలాగే ఎన్హెచ్ 365బీ సూర్యాపేట–జనగామ సెక్షన్లో 83 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ రెండు హైవేలు తుంగతుర్తి నియోజకవర్గం మీదుగా వెళ్తున్నాయి. అయితే ఈ హైవేలను రెండు వరుసలుగా విస్తరించి ఐదేళ్లు కావొస్తున్నా ఎలాంటి ట్రాఫిక్ పెరగకపోయినా మళ్లీ నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు వెళ్లడంతో ప్రజల్లో టెన్షన్ మొదలైంది. గతంలోనే ఇళ్లు, దుకాణాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు ఏమేమి కోల్పోవాల్సి వస్తుందేమోనని ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనే రెండు లేన్లుగా విస్తరణ సూర్యాపేట–జనగామ హైవేను సూర్యాపేట నుంచి తిరుమలగిరి వరకు 40 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారిగా సుమారు రూ.140 కోట్ల వ్యయంతో 2019లో నిర్మించారు. అలాగే నకిరేకల్–తానంచర్ల రహదారిని 65 కిలోమీటర్ల మేర రూ.298 కోట్ల వ్యయంతో 2021లో విస్తరణ పనులు పూర్తిచేశారు. రోడ్లను విస్తరించాక తగ్గిన ట్రాఫిక్ నకిరేకల్–తానంచర్ల రహదారిని నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి మూసీనది, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల మీదుగా మహబూబాబాద్ జిల్లా తానంచర్ల వరకు విస్తరించారు. ఈ రహదారి విస్తరణ జరిగాక హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట–ఖమ్మం ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించారు. దీంతో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఈ రూట్లో వెళ్లడానికి దగ్గరదారి కావడంతో నకిరేకల్–తానంచర్ల రూట్లో వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. నకిరేకల్–తానంచర్ల రూట్ కాకుండా సూర్యాపేట–ఖమ్మం రూట్ అయితే సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో వాహనదారులు నకిరేకల్–తానంచర్ల రోడ్డుకు రాకుండా సూర్యాపేట–ఖమ్మం ఎన్ఎచ్ఏఐ రూట్లో వెళుతున్నారు. నకిరేకల్–తానంచర్ల రూట్లో వాహనాలు పదుల సంఖ్యలోనే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా కేవలం మూడే తిరుగుతున్నాయి. రెండు వరుసల రహదారిపైనే వాహనాలు లేనప్పుడు ఇంకా నాలుగు వరుసలుగా విస్తరించడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా నకిరేకల్–తానంచర్ల హైవేపై ఉన్న అర్వపల్లి వై జంక్షన్లో వాహనాలు నాలుగు రూట్లలో వేగంగా వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు హైవే అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎన్హెచ్ 365, 365బీ నాలుగు వరుసల రోడ్డుకు కేంద్రం అనుమతి ఫ ప్రస్తుత రోడ్డుపైన వాహనాల రాకపోకలు తక్కువ ఉండడంతో ఫోర్వే ఎందుకని ప్రశ్నిస్తున్న ప్రజలు 20కి మించి వాహనాలు తిరగడం లేదు అర్వపల్లి మీదుగా విస్తరించిన నకిరేకల్–తానంచర్ల 365 హైవేపై రోజు 20కి మించి వాహనాలు తిరగడం లేదు. అలాంటప్పుడు దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించడం ఎందుకో అర్థంకావడం లేదు. రహదారి విస్తరణ పక్కనబెట్టి అర్వపల్లిలోని వై జంక్షన్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – బైరబోయిన భూమయ్య, అర్వపల్లి -
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
చిలుకూరు: విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యంతో చదువుకుని మంచి భవిష్యత్కు పునాదులు వేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. ఎన్ఎమ్ఎమ్ఎస్లో జిల్లా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన పాఠశాల విద్యార్థులు రవి, చైత్రను కలెక్టర్ అభినందించారు. అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్ చిలుకూరు అంగన్వాడీ కేంద్రం–4ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో చిన్నారులు భోజనం చేస్తుండగా పిల్లలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. దరణి అనే చిన్నారి జిల్లాల పేర్లు చెప్పడంతో కలెక్టర్ ఆ చిన్నారిని, అంగన్వాడీ టీచర్ సిరికొండ కవితను అభినందించారు. పీహెచ్సీ, పశువైద్యశాల తనిఖీ చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం ప్రహరీ కూలి పోవడంతో వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పశు వైద్యశాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ గిరిబాబు, ఆర్ఐ సీతా రామచందర్రావు, డాక్టర్ సుశీల, కార్యదర్శి షరీఫుద్దీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ -
వీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
యూనివర్సిటీకి చెందిన అన్ని వివరాలను వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యా కమిషన్ బృందానికి వివరించారు. యూనివర్సిటీలోని ప్రస్తుత స్థితిగతులను బృందం సభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు. అదేవిధంగా విద్యార్థులు తమ హాస్టల్లో కల్పించాలని వసతులు, సమస్యలు, పోటీ పరీక్షలకు వెసులుబాటు తదితర వాటిపై కమిషన్ బృందానికి విన్నవించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యా కమిషన్ను కలిసి నాలుగేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యా కమిషన్ బృందానికి వివరించారు. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ఎస్పీ
సూర్యాపేటటౌన్ : మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజులుగా 350 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారిలో ఎనిమిది మందికి కోర్టు ఒకరోజు జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతహుజూర్నగర్ : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని బీసీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణం, వర్మీ కంపోస్ట్ తయారు చేసేందుకు నిర్మించిన గుంతలను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలత, హెచ్ఎం జయప్రద, శానిటరీ ఇనన్స్పెక్టర్ అశోక్, ఏఈ. వినోద్ పాల్గొన్నారు. ఆగస్టు 3న జిల్లా స్థాయి యోగా పోటీలుసూర్యాపేట : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆగస్టు 3న ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి యోగా సెలక్షన్న్స్ నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తీకుల్ల సాయిరెడ్డి, ఉపాధ్యక్షురాలు వందనపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ గూడూరు నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచినవారు ఆగస్టు 7, 8 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. సబ్ జూనియర్ విభాగంలో 10 నుంచి 14 సంవత్సరాల వయసు వారు, జూనియర్ విభాగంలో 14 నుంచి 18 సంవత్సరాలు, సీనియర్ విభాగంలో 18 నుంచి 20 సంవత్సరాలు, సీనియర్ విభాగంలో ఏ సెక్షన్లో 28 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగం బీ సెక్షన్లో 35 నుంచి 45 సంవత్సరాలు, సీనియర్ విభాగం సీ సెక్షన్లో 45 నుంచి 55 సంవత్సరాల యోగా సాధకులు పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9849844365, 9490137179 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు. పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంహుజూర్నగర్ : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించి టీజీ జెన్కోలో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించారు. మొత్తం 18 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్లు ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు టీజీ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు. సాగర్ క్రస్ట్గేట్లు మొత్తం 26 ఎత్తడంతో దాదాపు 2.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీలకు చేరుకుంది. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. జూలై మాసం పూర్తి కావొస్తున్నందున ముందుగా పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. పదోన్నతులకు సంబంధించి మరో రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 950 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 688 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 184 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 3790 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 1694 మంది ఎస్జీటీలు, 1750 మంది స్కూల్ అసిస్టెంట్లు, 157 గెజిటెడ్ హెచ్ఎంలు, మిగిలిన ఉపాధ్యాయులు ఇతర కేటగిరీలకు చెందిన వారు ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన పదోన్నతులు, బదిలీల్లో సుమారు 641 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. 912 మంది ఎస్జీటీల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎంలుగా 68 మందికి ప్రమోషన్, 672 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. ఖాళీల ఆధారంగా.. జిల్లా పరిధిలో ఎస్జీటీలకు, మల్టీజోన్న్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. మొత్తంగా వివిధ కేటగిరిల్లో 198 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంల ఖాళీలు 23, మిగతావి స్కూల్ అసిస్టెంట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితా సైతం రూపొందిస్తున్నారు. జూన్న్30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 198 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఇప్పటికే 91 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఉత్తీర్ణతతోపాటు చదువులో వెనుకబడిపోతున్నారు. దీంతో టీచర్ల కొరత అధిగమించేందుకు ఇటీవల జిల్లాలో 91 మంది ఉపాధ్యాయులను అధికారులు వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారు. జీఓ నంబర్ 25 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిర్వహించారు. మండల స్థాయిలో ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల్లో ఖాళీల వివరాలు సేకరించారు. రెండు రోజుల్లో షెడ్యూల్ ! ప్రభుత్వం మొదట బదిలీలు చేపట్టి పదోన్నతులు చేస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. రెండు రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల కానుండడంతో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సీనియారిటీతో పాటు ఖాళీలను గుర్తిస్తున్నారు. షెడ్యూల్ వెలువడితే 15 నుంచి 20 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. బదిలీలు ఇప్పుడు చేపడితే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఫ వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ అధికారులు ఫ జిల్లాలో 198 మంది ప్రమోషన్ పొందే అవకాశం సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేస్తున్నాం ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో సీనియారిటీ జాబితాతోపాటు వివిధ కేటగిరిల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది పరిశీలిస్తున్నాం. సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నాం. షెడ్యూల్ రాగానే పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుంది. –అశోక్, డీఈఓ -
ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం
హుజూర్నగర్ : రాష్ట్రంలో పేదవారి కడుపు నింపి వారికి ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్తో కలిసి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజల అభీష్టానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన వారికి తెల్ల రేషన్కార్డులు అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 7 లక్షల 95 వేల 685 కొత్త రేషన్కార్డులు మంజూరు చేసిందన్నారు. వాటి ద్వారా కొత్తగా 33 లక్షల 97 వేల 367 మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. రూ.396 కోట్లతో 10 వేల ఎకరాలకు నీరు అందించే రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ దొండపాడు–2 కి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 11 వేల రేషన్ కార్డులు నూతనంగా మంజూరు చేశామన్నారు. చింతలపాలెం మండలంలో కొత్తగా 1,116 కార్డులు, గరిడేపల్లి మండలంలో కొత్తవి 2446, హుజూర్నగర్ మండలంలో 2,300 కార్డులు, మఠంపల్లి మండలంలో 1400, మేళ్లచెరువు మండలంలో కొత్తగా 12 వేలు, నేరేడుచర్ల మండలంలో కొత్తగా 1700, పాలకీడు మండలంలో నూతనంగా 812 కార్డులు మంజూరు చేశామని తెలిపారు. వీటి ద్వారా నూతనంగా 52 వేల మందికి సన్న బియ్యం తినే హక్కు కల్పించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు.. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ అర్హులై ఉండి కార్డులు రాని రేషన్ కార్డులకు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్, ఎస్పీ కే.నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ శ్రీని వాసులు, డీఎస్ఓ మోహన్బాబు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పంచాయతీ కార్యాలయం ఎదుట చెత్త పోసి నిరసన
ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన తెలిపారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని కోటపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, గ్రామంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయిందని మంగళవారం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. చెత్తను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట పోశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. సిబ్బందిపై బాధ్యత వదిలేసి గ్రామ కార్యదర్శి విధులను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ను మెకానిక్ షెడ్లో పెట్టారని, రోజుల తరబడి చెత్తను తీయడం లేదని, మురికి కాలువలు నెలలకొద్దీ తీయకపోవడంతో దుర్వాసన వస్తోందన్నారు. మాజీ సర్పంచ్ మందడి శేఖర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ వంగేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అత్యాధునిక సౌకర్యాలు
108 వాహనంలో.. నిడమనూరు : అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్ వాహనంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు, పాయిజన్, ప్రసవ సేవలు, అనారోగ్యానికి గురైన వ్యక్తిని వాహనంలో ఆస్రత్రికి తరలించేలోగా పలు అత్యవసర సేవలందించేలా 108 వాహనంలో వసతులు ఏర్పాటు చేశారు. ఇటీవల నిడమనూరుకు ఈ కొత్త అంబులెన్స్ వాహనాన్ని కేటాయించారు. వాహనంలో ఉన్న వసతులు ఇవీ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించేందుకు మల్టీపుల్ చానల్ మానిటర్ ఏర్పాటు చేశారు. దీనితో బీపీ, పల్స్ రేట్, సాచ్యురేషన్ పేషెంట్ కండిషన్ తెలిపేందుకు ఇది దోహదపడుతుంది. అదేవిధంగా పురుగుల మందు తాగి వారికి కడుపులో ఉన్న విషం తొలగించేలా స్టమక్ క్లీనర్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదం బారిన పడిన క్షతగాత్రులకు ఉపయోగపడే అత్యవసర మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. బాధితుడు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తారు. ఆస్పత్రికి తరలించే వరకు ఎంతగానో దోహదపడుతోంది. అత్యవసర ప్రసవ సమయాల్లో సేవలందించేలా డెలివరీ కిట్స్ ఉన్నాయి. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు మల్టీచానల్ మీటర్ సదుపాయం అందుబాటులో స్టమక్ క్లీనర్తోపాటు, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు -
దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించాలి
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలు విద్యార్థులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాధనంగా ఉండాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆయనతోపాటు, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి బృందం మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని సందర్శించి ప్రజా విచారణ చేపట్టారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉత్తమ విద్య, విద్యార్థుల అభ్యున్నతికి యూనివర్సిటీల్లో నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశ భక్తిని పెంపొందించే గురుతర బాధ్యత యూనివర్సిటీలపై ఉందన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ రేఖ, మద్దిలేటి, మిర్యాల రమేష్, దోమల రమేష్ పాల్గొన్నారు. సర్వీస్ను క్రమబద్ధీకరించాలియూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కమిషన్ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ప్రస్తుత సర్వీస్ను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 250 మందికి పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు మూడంచెల వేతన విధానం ద్వారా తీవ్ర నష్టం జరుగుందని, ఏజెన్సీ విధానం రద్దు చేయాలని కోరారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి -
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ మృతి
చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి దొడ్డా పద్మ (98) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు. బుధవారం చిలుకూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దొడ్డా పద్మ మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. బైక్ అదుపుతప్పి మహిళ మృతినకిరేకల్: బైక్ అదుపుతప్పి కింద పడడంతో మహిళకు తీవ్రగాయాలై మృతి చెందింది. ఈసంఘటన మంగళవారం నకిరేకల్ శివారులో చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన లోడే సత్యవతి(54), నకిరేకల్లో ఉంటున్న తన కుమారుడు ఉపేందర్ దగ్గరకు సోమవారం వచ్చింది. తిరిగి ఓగోడు గ్రామానికి వెళ్లేందుకు ఉపేందర్ తన మిత్రుడికి బైక్ ఇచ్చి ఇంటి వద్ద తన తల్లిని దింపి రమ్మని చెప్పాడు. ఈక్రమంలో బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈప్రమాదంలో సత్యవతి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణాచారి తెలిపారు. హైవేపై కారు దగ్ధంచిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు కిందికి దిగడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గంజాయి స్వాధీనంనడిగూడెం : ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నడిగూడెం ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రత్నవరం గ్రామానికి చెందిన రాహుల్ అభిషేక్ అనే యువకుడు కోదాడ నుంచి రత్నవరం గ్రామానికి తన ద్విచక్ర వాహనంలో 200 గ్రాముల గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి
త్రిపురారం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఇప్పటికే వరి నాట్లు పూర్తి చేసుకున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సైతం సాగు నీరు విడుదల కావడంతో ఇప్పటికే నాట్లు పూర్తి చేసుకోగా.. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వరి నాట్లు వేయడంలో బిజీగా ఉన్నారు. వరి పంటల సాగులో రసాయని ఎరువుల వాడకం తగ్గించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రసాయనక ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం దెబ్బతినడంతో పాటుగా పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువల వాడకం తగ్గించుకోవాలని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు సైతం వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. వరి సాగులో ఎరువులు, పోషకాల యాజమాన్యంపై కేవీకే సేద్యపు విబాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్ర శేఖర్ సూచనలు. ఫ భూసార పరిరక్షణకు రసాయనిన ఎరువుల వాడకం తగ్గించుకుని సేంద్రియ, జీవన ఎరువులు ఉపయోగించుకోవాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. ఫ వరి మాగాణుల్లో అపరాలు, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి పూత దశకు ముందు కలియదున్నడం వల్ల భూసారం పెరగడమే కాకుండా సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఆదా చేయొచ్చు. ఫ భూసార పరీక్షల ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడుకోవాలి. ఫ నత్రజని వినియోగాన్ని పెంచుకోవడానికి 50 కిలోల యూరియాకి 10 కిల్లో వేప పిండి లేదా 250 కిలోల తేమ కలిగిన బంక మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వరి పొలంలో వేద జల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. ఫ పురుగులు, మరియు తెగుళ్ల ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువు వాడకం తగ్గించుకోవాలి. ఫ భాస్వరం ఎరువులను పొలం దమ్ములోనే వేసుకోవాలి. దమ్ములో వేయకపోతే నాటు వేసిన పది రోజుల లోపు వేసుకోవాలి. యూరియా వినియోగంతో చీడపీడల ఉధృతి పెరుగుతుంది వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు కావాల్సిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో ఒకేసారి వేసుకోవాలి. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. చీడపీడల వల్ల తాలు కంకులు ఏర్పటి దిగుబడి తగ్గడమే కాకుండా పంట నాణ్యత దెబ్బతింటుంది. ప్రతి రైతు తన పొలంలో మట్టిని ప్రతి రెండేళ్లకు ఒక్కసారైన పరీక్ష చేయించుకొని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ, జీవన ఎరువుల వినియోగం పెంచుకోవాలి. ఫ వరిసాగులో కేవీకే సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
భూ వివాదం.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
భువనగిరి: ఇరువర్గాల మధ్య ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందాడు. న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో ధర్నాకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటకూరి వెంకటయ్యకు ఇద్దరు కుమారులు తోటకూరి మల్లేష్, తోటకూరి భాను(32) ఉన్నారు. అదే గ్రామానికి చెందిన తోటకూరి బాలనర్సింహకు ఇద్దరు కుమారులు బాలయ్య, మల్లేష్లు ఉన్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం సమయంలో వెంకటయ్య, ఆయన చిన్నకుమారుడు భాను వ్యవసాయ బావి వద్ద ఉండగా పెద్ద కుమారుడు మల్లేష్ పొలంలో వరాలు తీస్తున్నాడు. భూ తగాదా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడే ఉన్న బాలనర్సింహ చిన్న కుమారుడైన మల్లేష్ వెంకటయ్య పెద్ద కొడుకును చూసి తిట్టడం ప్రారంభించాడు. ఇదే సయయంలో బాలనర్సింహ భార్య శంకరమ్మ, చిన్నకుమారుడు మల్లేష్, మల్లేష్ అన్న కొడుకై న అజయ్లు కలిసి వెంకటయ్య పెద్ద కుమారుడిని కొట్టారు. బాలనర్సింహ చిన్న కుమారుడు తన వద్ద ఉన్న గొడ్డలితో అక్కడే ఉన్న వెంకటయ్య చిన్న కుమారుడు భాను తలపై దాడి చేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటయ్య సైతం గాయపడ్డాడు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భానును హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన మల్లేష్, శంకరమ్మ, అజయ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. భువనగిరి–జగదేవ్పూర్ రోడ్డుపై ధర్నాన్యాయం చేయాలని భాను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భువనగిరి–జగదేవ్పూర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరు పక్కల కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. పోలీసులు సర్దిచెప్పడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ రాహుల్రెడ్డి, రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు, బంధువుల ధర్నా -
వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాలు, వార్డుల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేయాలన్నారు. , సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి అర్జీకి సంబంధించి కచ్చితమైన సమాధానంతో కూడిన కాపీని అర్జీదారునికి పంపాలన్నారు. అలా చేయకపోతే ప్రజలు ఒకే సమస్యపై మరలా దరఖాస్తు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీఎఫ్ఓ సతీష్కుమార్, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీసీఓ పద్మ, డీఎస్ఓ మోహన్బాబు, సంక్షేమ అధికారులు దయానందరాణి, శ్రీనివాస్ నాయక్, శంకర్, జగదీశ్వరరెడ్డి, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, సంతోష్ కిరణ్, అధికారులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల చేయూత అభినందనీయంచివ్వెంల : తాము చదువుకున్న పాఠశాలకు చేయూతనందించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. చివ్వెంల మండలం కొండల రాయినిగూడెం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుని వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సోమవారం అదే పాఠశాలలో పలువురు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా టీషర్ట్లు, షూస్ పంపణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి మాతృభూమికి సేవచేయడం గర్వకారణమన్నారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు రెండవ తరగతి విద్యార్థి వినయ్ ఇంగ్లిష్లో సమాధానం చెప్పగా, ఐదవ తరగతి విద్యార్థిని శ్రీనిధి తెలుగు స్పష్టంగా చదివింది. దీంతో వారిని కలెక్టర్ అభినందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు, బాలింతలు, గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఈఓ కళారాణి, హెచ్ఎం నవీన్కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఫ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నందికొండ.. నిండుకుండ
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో సాగర్ జలాశయం.. నేడు గేట్ల ఎత్తివేత నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585.00అడుగుల (297.7235 టీఎంసీలు)కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మంగళవారం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నాగార్జునసాగర్ రానున్నారు. మంత్రుల పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బీసీ గురుకుల మైదానంలో హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో మంత్రులు కృష్ణమ్మకు వాయినమిచ్చి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఈసారి జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకుంటున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు మందుస్తుగానే జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదను శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి సోమవారం రాత్రి 2,10,920 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, సోమవారం ఉదయం రెండు గేట్ల నుంచి, మధ్యాహ్నం 12గంటలకు మూడు గేట్లు, సాయంత్రం 4 గేట్లు, రాత్రి వరకు మొత్తం ఐదు గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్వే మీదుగా 1,35,325 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,904 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. సాగర్ విద్యుదుత్పాదన కేంద్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో విద్యుదుత్పాదన చేస్తున్నారు. ఆ నీరంతా టెయిల్పాండ్ ద్వారా పులిచింతల జలాశయానికి చేరుతోంది. ఇక, నిన్నటి వరకు కుడి కాల్వకు కేవలం 511 క్యూసెక్కుల నీటినే విడుదల చేశారు. మంగళవారం నుంయి ఐదు వేల క్యూసెక్కులకు పెంచారు. నదిలోకి వెళ్లవద్దు : నల్లగొండ కలెక్టర్ సాగర్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున మత్స్యకారులు, రైతులు నదితీర ప్రాంతాలకు నదిలోకి వెళ్లవద్దని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నదిలో మోటర్లు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, మత్స్యకారులు వలలు, పుట్టీలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు. 2007 తర్వాత ఇప్పుడే.. గడిచిన 18 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఇంత ముందస్తుగా సాగర్ జలాశయానికి వరద రాలేదు. కేవలం 2007లో ముందస్తుగా వరదలు వచ్చి జలాశయం గరిష్టస్థాయికి చేరడంతో జూలై 14వ తేదీన జలాశయం 587.80 అడుగులకు చేరడంతో క్రస్ట్గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తిరిగి ఈ ఏడాది రికార్డు స్తాయిలో వరద వచ్చి చేరడంతో జూలై మాసంలోనే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగర్ ఆయకట్టుకు నేడు నీటి విడుదల నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆయకట్టుకు మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. మంత్రులు ఉదయం 10గంటల వరకు సాగర్కు చేరుకుని 11 గంటలలోపు కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. గడిచిన 18 సంవత్సరాల్లో జూలై మాసంలో కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు లేవు. 2006లో జూలై 21, 2007లో జూలై 14న నీటిని విడుదల చేశామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. 10.38లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద 10.39లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాలు, కృష్ణాజిల్లా 3,68,536 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,734 ఎకరాలకు సాగర్ నీరు అందనుంది.ఫ ఎగువ నుంచి భారీగా వరద ఫ నేడు క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న మంత్రులు ఫ 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకుంటున్న క్రస్ట్గేట్లు -
నేడు హుజూర్నగర్కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం హుజూర్నగర్కు రానున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్లో హుజూర్నగర్కు చేరుకుంటారు. 1:30 గంటలకు స్థానిక కౌండిన్య ఫంక్షన్ హోల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం 1.45 గంటలకు హెలికాప్టర్లో నకిరేకల్కు వెళతారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దుసూర్యాపేటటౌన్ : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ధూమపానం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నరసింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, అక్రమ సిట్టింగ్లు, బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడొద్దని పేర్కొన్నారు. మైనర్లకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దని సూచించారు. వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చివ్వెంల : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పి.సునిల్ గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. న్యాయవాదులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకుముందు సునిల్గౌడ్ను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, న్యాయవాదులు నాతి సవీందర్ కుమార్, మోదుగు వెంకట్రెడ్డి, బానాల విజయ్ కుమార్, సోమేష్ కుమార్, బత్తిని వెకటేశ్వర్లు, పొదిల ప్రదీప్ కుమార్, పంతంగి కృష్ణ, వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, కంచర్ల సతీష్ కుమార్, కట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.మెరుగైన బోధన అందించాలిసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) భానునాయక్ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో అయిన అడ్మిషన్లు, డైస్, అపార్, ఆదర్శ కమిటీల ఏర్పాటుతోపాటు తదితర అకడమిక్కు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపాళ్లుగా పదోన్నతిపై జిల్లాకు వచ్చిన బచ్చలకూరి మృత్యుంజయ (తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల) హరిప్రసాద్ (నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల)ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 30న జాబ్మేళానల్లగొండ : నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్లో సంప్రదించాలని సూచించారు. -
‘కల్యాణలక్ష్మి’ నిధులు కాజేశారు
కోదాడ: పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక చేయూతగా గత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం హయాంలో కొందరు దళారులు బోగస్ పత్రాలు సృష్టించి కొందరి చేత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయించగా లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. వీరికి ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చెక్కులు అందజేసింది. ఈ వ్యవహారంలో అనంతగిరి మండలం గొండ్రియాల, కొత్తగూడెంతోపాటు పక్కనే ఉన్న ఇంకొన్ని గ్రామాలకు చెందిన సుమారు 18 మంది బోగస్ లబ్ధిదారులున్నట్లు తెలిసింది. 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వారికి కూడా తాజా లబ్ధిదారుల జాబితాలో ఉండడం గమనార్హం. అనంతగిరి మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారి, కోదాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్గా ఉన్న మరొకరు, ఆయా గ్రామాలకు చెందిన నాటి బీఆర్ఎస్ నాయకులు కలిసి దాదాపు రూ.18 లక్షలకుపైగా కల్యాణలక్ష్మి పథకం నిధులు కాజేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయట పడడంతో తమపై కేసులు కాకుండా దళారులుగా వ్యహరించిన వారు రాజకీయ పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ఏం చేశారంటే..అనంతగిరి మండలంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి సాయంతో గోండ్రియాల, కొత్తగూడెం గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తప్పుడు వివాహ పత్రాలు సృష్టించి 2023లో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివాహాలు ఆయా గ్రామాల్లో జరిగినప్పటికి సమీపంలో ఏపీకి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఈ సమయంలో పనిచేసిన గ్రామ కార్యదర్శులు ఈ దరఖాస్తులను ధ్రువీకరించడానికి నిరాకరించడంతో కోదాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేసిన ఒకరు తప్పుడు పత్రాలతో వివాహ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. ఈ రెండు గ్రామాలకు సమీపంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉండడంతో అక్రమార్కులు ఏపీలో కొన్ని గ్రామాలకు చెందిన వారితో కూడా కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయించి దొడ్డిదారిన లక్షల రూపాయలు కాజేశారని పలువురు ఆరోపిస్తున్నారు. తిలాపాపం తలా పిడికెడుకల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులో సగం మాత్రమే లబ్ధిదారుడి ఇచ్చి మిగిలిన డబ్బుల్లో రెవెన్యూ అధికారికి రూ.30 వేలు, ముఖ్య నాయకుడికి రూ.20 వేలు, మిగిలిన డబ్బులను ఖర్చుల కింద తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో మండలానికి చెందిన కొందరు నాయకులు చర్యలు తీసుకోకుండా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది.రెండు రోజుల్లో విచారణ పూర్తిచేస్తాం గోండ్రియాలలో కల్యాణలక్ష్మి చెక్కు విషయంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు రావడంతో పూర్తి స్థాయిలో విచారణ చెయిస్తున్నాం. అందరి వాగ్మూలం రికార్డు చేస్తున్నాం. రెండు రోజుల్లో విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కొత్తగూడెం గ్రామ విషయం మా దృష్టికి రాలేదు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.సూర్యనారాయణ, ఆర్డీఓ, కోదాడ వివాహ సంవత్సరాన్ని మార్చి బోగస్ పత్రాలు సృష్టించి.. గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తులు చెక్కులు మంజూరు చేసిన ప్రస్తుత ప్రభుత్వం రూ.18లక్షలకుపైగా నొక్కేసినట్టు సమాచారం అనంతగిరి మండలంలో సుమారు 18 మంది వరకు బోగస్ లబ్ధిదారులు!అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన ఓ యువతికి 2009లో వివాహం జరిగింది. ఈమె వివాహం 2023లో జరిగినట్లు గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయగా లబ్ధిదారురాలిగా ఎంపికచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గతేడాది కోదాడలో జరిగిన కార్యక్రమంలో ఈమెకు చెక్కు అందజేశారు. కానీ, రెండు నెలల క్రితం ఈమె తన ఇద్దరి కుమార్తెలకు చీరల ఫంక్షన్ చేయడం గమనించదగ్గ విషయం. మొత్తంగా బోగస్ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి పథకం నిధులు కాజేసినట్టు బయట పడింది. ఇలా ఈ గ్రామంతోపాటు కొత్తగూడెం గ్రామంలోనూ సుమారు 18 మంది వరకు బోగస్ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి నిధులు కాజేసిన వ్యవహారం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
రైతులకు రాయితీ పరికరాలు
నాగారం : జాతీయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు 125 యూనిట్లు మంజూరు చేసింది. ఇందుకు గాను రూ.1.84 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద ప్రభుత్వం ఈ నిధులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం అర్హులైన రైతులను త్వరలో ఎంపిక చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆగస్టు నుంచి దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మహిళలకు 50 శాతం..రైతులకు అందించే వ్యవసాయ పరికరాలపై ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా రైతులకు 50శాతం రాయితీ ఇవ్వనున్నారు. మిగతా వారికి 40 శాతం రాయితీపై అందిస్తారు. ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో తీసుకోనున్నారు. కమిటీల ద్వారా ఎంపిక రైతులకు రాయితీ పరికరాలు ఇచ్చేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, డీఏఓ, ఆగ్రోస్ ఆర్ఎం, ఎల్ఎడీఎం, డాట్ సెంటర్ శాస్త్రవేత్త సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలు ఉంటారు. అర్హులైన రైతులను ఈ కమిటీలు ఎంపిక చేస్తాయి. అర్హతలు ఇవే..రాయితీ పరికరాలను పొందేందుకు సదరు రైతులకు కనీసం ఎకరం భూమి ఉండాలి. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. వచ్చిన యూనిట్లను మండలాల వారీగా కేటాయిస్తారు. ఈ నిధులు ఖర్చు చేసిన తర్వాత రెండో విడతలో యూనిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్సిడీ పరికరాలు ఇవే..మ్యానువల్ స్ప్రేయర్లు, పవర్ ఆపరేటర్ స్ప్రేయర్లు, ట్రాక్టర్తో నడిచే వ్యవసాయ పరికరాలు, రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రులు, కలుపు తీసే యంత్రాలు, కేజీవీల్స్ వంటివి 125 యూనిట్లు మంజూరయ్యాయి. యాంత్రీకరణ పథకం కింద 125 యూనిట్లు కేటాయింపు జిల్లాకు రూ.1.84 కోట్లు మంజూరు ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ రెండో వారం వరకు పంపిణీదరఖాస్తులు స్వీకరిస్తాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలను అందజేస్తాం. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
మూసీకి 1,604 క్యూసెక్కుల వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. సోమవారం 1,604 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1,281 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా 643.20 మేర అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 549 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. గేట్ల ద్వారా, కాల్వలకు కలిపి మొత్తం 1904 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.99 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆదివారం ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్లు పైకెత్తి ఉంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక్కో గేటును అడుగు మేర పైకెత్తి ఉంచి 1,286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి 1,287 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 643.30 అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 525 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా, ప్రధాన కాల్వలకు, సీపేజీ, లీకేజీల ద్వారా మొత్తం 1,885 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
తల్లిదండ్రుల రుణం తీర్చలేనిది
భానుపురి (సూర్యాపేట) : తల్లిదండ్రుల రుణం తీర్చలేనిదని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తు సాంకేతిక యుగంలో తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని బాగా చదివించాలని, వారు ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలనే కోరిక ఉంటుందని తెలిపారు. పిల్లలను భావి భారత పౌరులుగా తయారు చేయడంలో తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో పిటిషన్ చేయడం సరైంది కాదుసూర్యాపేట : రాష్ట్రంలోని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం సరైనది కాదని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లూనావత్ పాండు నాయక్, జిల్లా అధ్యక్షుడు నాగునాయక్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1976 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలోని ఎస్టీలుగా ఉన్న లంబాడీలు, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిటిషన్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనడం హేయమైన చర్యల అన్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బంజారా సేవా సంఘ్ జిల్లా గౌరవ సలహాదారుడు పోరియా నాయక్, ఉపాధ్యక్షుడు ధరావత్ సోమ్లా నాయక్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ గుగులోతు వీరన్న నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి సాయి నాయక్, పవన్ నాయక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సభను జయప్రదం చేయాలి తుంగతుర్తి: హుజూర్నగర్లో ఆగస్టు 1న జరిగే చేయూత పింఛన్దారుల నియోజకవర్గ స్థాయి సన్నాహక సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు, వీహెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసీం కోరారు. ఆదివారం తుంగతుర్తిలో గుండాల కొమురయ్య అధ్యక్షతన జరిగిన ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.6వేలు, చేయూత పింఛన్దారులకు 2016 నుంచి రూ.4016లకు, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 వేలకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సభకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతకుల రాజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్బాబు మాదిగ, కళామండలి జిల్లా అధ్యక్షుడు గంట భిక్షపతి మాదిగ, నాయకులు చింత సతీష్, జలగం శ్రీరాములు, జలగం సైదులు, జటంగి వెంకన్న, మండల ఇన్చార్జి చెడుపాక బోస్, తోట శ్రీరాములు, బొంకూరి వెంకన్న, యాదగిరి, మడిపెద్ది మంగమ్మ, పోలెపాక మధు తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట అర్బన్ : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, హుజూర్నగర్ పట్టణా ల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సహకరిస్తున్న లంచగొండి అధికారులను గుర్తించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ఉపాధ్యక్షురాలు రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు కల్పన, పద్మ, రేణుక, గౌరమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్ కార్డులు
భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డులు రానివారు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ అందజేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డితో కలిసి ఆయన సూర్యాపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హుజూర్నగర్ నుంచి సన్న బియ్యం, తిరుమలగిరి నుంచి నూతన్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం మన జిల్లా అదృష్టమని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 32,274 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా కొత్తగా 95,309 మందికి సన్న బియ్యం పొందే హక్కు లభించిందన్నారు. పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నం : పటేల్ రమేష్రెడ్డి పేదవారి ఆత్మ గౌరవానికి రేషన్ కార్డులు చిహ్నం అని తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి అన్నారు. మన జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీ, నూతన్ రేషన్ కార్డులు మంజూరు చేసినందుకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. దేశంలోని ఏ నాయకుడికి రాని ఆలోచన ముఖ్యమంత్రి, మంత్రికి రావడం వారి గొప్పతనం అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్ది, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డీఎస్ఓ మోహన్బాబు, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అర్హులందరికీ కార్డులు ఇవ్వడం సంతోషకరం : ఎమ్మెల్యే జగదీష్రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వడం, అలాగే సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషమన్నారు. -
ఇద్దరు అరెస్ట్
వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 583.00 అడుగులు ఇన్ఫ్లో : 93,113 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 35,749 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,151 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 511 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 4,287 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్ఖమ్మంలో దొరికిపోతామని.. సూర్యాపేటలో సంచలనం సృష్టించిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025- 8లోసాక్షి ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టలు బలహీనంగా మారాయి. పలుచోట్ల లైనింగ్ లేకపోవడం, లైనింగ్ ఉన్నచోట ధ్వంసం కావడం, కాంట్రాక్టర్ అక్కడక్కడా చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 582.90 అడుగులకు (291.3795 టీఎంసీలు) చేరుకుంది. ఈ వరద ప్రవాహం వారం రోజుల పాటు కొనసాగితే నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండనుంది. రెండు మూడు ర క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్వలకు కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ తరుణంలో సాగర్ ఎడమ కాలువ కట్ట పలుచోట్ల బలహీనంగా ఉండడంతో ఎక్కడ గండి పడుతుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. అదే జరిగితే నష్టం ఊహించని విధంగా సంభవించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పంట నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధునీకరణ అంతంతే.. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆధునీకరణలో భాగంగా సీసీ లైనింగ్ కోసం 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 2009లో ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.4444 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2010లో సాగర్ ఎడమ కాలువతోపాటు మేజర్లు, మైనర్ల ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సాగర్ ఎడమకాలువ ప్రారంభం నుంచి ఖమ్మం టేకులపల్లి వరకు, ప్రకాశం జిల్లా లింగంగుట్ల సర్కిల్ పరిధి వరకు, నూజివీడు సర్కిల్ పరిధి వరకు పనులను చేపట్టింది. అయితే నిధులు సరిపోకపోవడంతో పలుచోట్ల ప్రధాన కాలువతోపాటు మేజర్ల లైనింగ్ మధ్యలోనే ఆగిపోయింది. చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. నాణ్యత లోపం వల్లే కాల్వకు గండ్లు ప్రధాన కాల్వ ఆధునీకరణలో అక్కడక్కడా చేపట్టిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. పనుల్లో నాణ్యత లోపం కారణంగానే ప్రధాన కాల్వలకు గండ్లు పడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో 2002, 2024లో కాల్వకు గండ్లు పడ్డాయి. ఆ తరువాత ప్రభుత్వం వాటి మరమ్మతులకు నిధులను కేటాయించింది. అయితే పడిన గండిని పూడ్చారే తప్ప మిగతా మరమ్మతు పనులను పూర్తి చేయలేకపోయారు. దీంతో నీటి విడుదల కొనసాగుతుండడంతో కట్టలు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. 2022లో నిడమనూరు మండలంలోని 32వ కిలోమీటరు వద్ద గండిపడింది. దీంతో 40 రోజులపాటు నీటి విడుదలను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 32.4 కిలోమీటరు వద్ద వేంపాడు బ్రిడ్జి సమీపంలో వంద మీటర్ల పరిధిలో సీసీ లైనింగ్ వేయలేదు. దీంతో ప్రధాన కాల్వ నీటి ప్రవాహ ఒత్తిడికి గురై కాల్వ కట్ట బలహీనంగా మారుతోంది. అలాగే అక్కడి యూటీ (కాల్వ కిందిగా వర్షం నీరు ప్రవహించేవి), ముప్పారం యూటీ, నిడమనూరు యూటీల్లో పలుచోట్ల నీరు లీకేజీ అవుతోంది. 31వ కిలోమీటరు వద్ద ముప్పారం బ్రిడ్జి వెంట కాల్వ సీసీ లైనింగ్ పగిలిపోయి.. ముక్కలుగా మారి కాల్వలో కొట్టుకుపోయింది. దీంతో కాల్వ కట్ట బలహీనంగా మారింది. ముదిమాణిక్యం మేజర్ వద్ద, బొక్కమంతులపాడు(బికెపహాడ్) వద్ద కట్ట ప్రమాదకరంగా మారింది. న్యూస్రీల్కాల్వ కట్టలు బలహీనం..రైతుల్లో భయం.. భయం!ఫ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల దెబ్బతిన్న ఎడమ కాల్వ లైనింగ్ ఫ మరమ్మతు పనుల్లోనూ కొరవడిన నాణ్యత ఫ గడిచిన మూడేళ్లలో రెండు చోట్ల గండ్లు పడి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఫ ఇప్పుడూ అదే పరిస్థితి ఉండడంతో ఆందోళన చెందుతున్న రైతులు మరమ్మతులకు రూ.44.78కోట్లు కేటాయించినా.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని సాగర్ ఎడమ కాలువ పలుచోట్ల దెబ్బతినడంతో మరమ్మతుల కోసం గత ప్రభుత్వం రూ.44.78 కోట్లు కేటాయించింది. నల్లగొండ జిల్లాలో 1.89 కిలోమీటరు నుంచి 73.800 కిలోమీటరు వరకు రూ.15.78కోట్లు, సూర్యాపేట జిల్లాలో 74 కిలోమీటరు నుంచి 133 కిలోమీటరు వరకు రూ.29కోట్లు కేటాయించింది. అయితే కాంట్రాక్టర్ పనులను ఆలస్యంగా ప్రారంభించడంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు చేసిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఆ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో పూర్తికాలేదు. నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమ కాలువపై 30 యూటీలు ఉండగా ఐదు యూటీల వద్దనే మరమ్మతు పనులను చేపట్టారు. మరోవైపు పలు చోట్ల సీసీ లైనింగ్, ఫ్లోరింగ్ కోసం తాజాగా రూ.30కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపారు. 2022లో నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నిడమనూరు మండలంలోని 32వ కిలోమీటరు వద్ద గండిపడింది. వందల ఎకరాలు నీటి ముగిగాయి. గండి పూడ్చేందుకు 40 రోజులపాటు నీటి నిలిపివేశారు. ఆ సమయంలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. 2024 సెప్టెంబరు 1వ తేదీన నడిగూడెం మండలంలో 132 కిలోమీటరు వద్ద కాలువ కాల్వ కట్ట బలహీనంగా ఉండటంతో భారీగండ్లు పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కట్ట మరమ్మతులు చేపట్టాలి మా గ్రామ సమీపాన ఉన్న ఎడమ కాల్వ కట్ట పలు చోట్ల లైనింగ్ దెబ్బతింది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. అధికారులు స్పందించి కట్టకు మరమ్మతులు చేపట్టాలి. – సింగిరెడ్డి పుల్లారెడ్డి, రైతు, రామాపురం, నడిగూడెం నడిగూడెంలోనూ అదే పరిస్థితి నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టలు అధ్వానంగా మారాయి. 123 కిలో మీటరు నుంచి 132 కిలో మీటరు వరకు పలు చోట్ల లైనింగ్ దెబ్బతింది. కట్టలు కూడా బలహీనంగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు 132 కిలోమీటరు వద్ద కాల్వ కట్ట బలహీనంగా ఉండటంతో భారీ గండ్లు పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంకా పలు చోట్ల కట్టలపై కంపచెట్లు పెరిగాయి. దీంతో రైతుల రాకపోలకు కూడా ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి తక్షణమే కాల్వ కట్టలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. -
జానియర్ కాలేజీల్లో ‘పీటీఎం’
ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ప్రభుత్వ కళాశాలల్లో పీటీఎం అమలుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం మరింతగా పెరిగే అవకాశం ఉండనుంది. అధ్యాపకులతో తల్లిదండ్రులు సమావేశం కావడం ద్వారా విద్యార్థుల సమగ్ర విషయాలు తెలుస్తాయి. దీంతో వారికి కూడా కాలేజీ నియమ నిబంధనల పట్ల విద్యార్థుల చదువుల పట్ల అవగాహన పెరుగుతుంది. – భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట హుజూర్నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచి ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాల్లో మాదిరిగా జూనియర్ కళాశాలల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కొంత మేర తగ్గుతూ రావడం.. ఉత్తీర్ణత శాతం కూడా ఆశించిన మేరకు పెరగకపోవడంతో వాటిని అధిగమించేందుకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని.. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించే వారు. అది కూడా మొక్కుబడిగా జరిగేది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించేలా ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు ఉత్తీర్ణత శాతం మరింతగా మెరుగు పడుతుందని అధ్యాపకులు భావిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది కళాశాలలు జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 3,003 విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,559 మంది.. రెండో సంవత్సరం 1,444 మంది ఉన్నారు. పిల్లల పరిస్థితి తెలిపేలా.. ఇక నుంచి ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి కూడా తల్లిదండ్రులకు తెలియనుంది. అధ్యాపకులు సెల్ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించే తేదీ, సమయం తెలియజేస్తూ వారి పిల్లల చదువుల తీరును కూడా వివరిస్తారు. వారు ఏ దశలో ఉన్నారు, ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడ్డారు, కళాశాలకు క్రమం తప్పకుండా వస్తున్నారా తదితర విషయాలను తల్లిదండ్రులతో చర్చిస్తారు. దీనిని పక్కాగా అమలు చేసేలా ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఫ హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు కార్యాచరణ ఫ ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం ఫ ఈ ఏడాది నుంచే అమలుకు ఆదేశాలు -
ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని..
సూర్యాపేటటౌన్: సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈనెల 21న జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. దీంతో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితు లు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరని గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోదను అరెస్ట్ చేశా రు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్కు చెందిన ఏ–6 నిందితుడైన అమర్బట్ గూర్ఖాగా పనిచేస్తుండేవాడు. ఈ కేసులో ఏ–1 నిందితుడు, నేపాల్కు చెందిన ప్రకాష్అనిల్కుమార్.. ఖమ్మంలో ఉంటున్న అమర్బట్ వద్దకు వచ్చి గూర్ఖాగా పనిచేస్తూ యశోదతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూ ర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. ప్రకాష్ అనిల్కుమార్కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్కు చెందిన కడాక్ సింగ్తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మేకల యశోదతో కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకుని, రెక్కీ చేసి, శ్రీసాయి సంతోషి జ్యువెలరీలో షాపులో చోరీ చేశారు. తర్వాత బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. నిందితురాలు ఇచి్చన సమాచారం మేరకు ప్రత్యక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఏ–1 నిందితుడైన ప్రకాష్ అనిల్కుమార్పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితురాలి నుంచి 14 తులాల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి 14తులాల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసులు సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో తనిఖీలు చేస్తుండగా ఖమ్మం పరిధిలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె బ్యాగును తనిఖీ చేయగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్కు వెళ్తూ హైటెక్బస్టాండ్లో పట్టుబడింది. ఆమెను స్టేషన్కు తరలించి విచారించగా బంగారం షాపులో దొంగతనం చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చి చోరీకి సహకరించినట్టు అంగీకరించింది. దొంగలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్కు తీసుకెళ్లి అమ్ముదామని దొంగలు నిర్ణయించారు. ఈమేరకు నిందితులకు ఆశ్రయం ఇచ్చి సహకరించిన అమర్ బట్, మేకల యశోద ఖర్చులకు కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి మిగతా ఐదుగురు నిందితులు నేపాల్కు వెళ్లిపోతున్నట్లు వారికి చెప్పారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితులంతా ఖమ్మంలో దొంగతనాలు చేసి దొరికిపోయారని, అక్కడ చోరీ చేసే మళ్లీ దొరికిపోతామని, సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ కేసులో జ్యువెలరీ షాపు యజమాని రెండున్నర కిలోల బంగారం, కొంత నగదు దొంగతనానికి గురైనట్టు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుల్లో సిబ్బంది కొరత తీరుస్తాం
హుజూర్నగర్ : జిల్లాలోని కోర్టుల్లో సిబ్బంది కొరతను త్వరలోనే తీరుస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం హుజూర్నగర్కు వచ్చిన ఆమె కు స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ వాదులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని కోర్టు హాళ్లను తిరిగి వసతులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఆ తర్వాత స్థానిక రామస్వామి గుట్టవద్ద న్యాయ స్థానాలకు కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, జిల్లా అదనపు పీపీ బొబ్బ కోటిరెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీస్, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచందర్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. ఏటీసీ, ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులుహుజూర్నగర్ : హుజూర్నగర్లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), ఐటీఐ కోర్సుల్లో రెండవ విడత ప్రవేశాలకు పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్ జింజిరాల వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 8919234137 నంబర్ను సంప్రదించాలని కోరారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియనడిగూడెం : రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి(డీఎస్ఓ) వి.మోహన్బాబు అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 32 వేల రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ మీ సేవ కేంద్రంలో ఆన్లైన్ చేయించి దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏపూరి తిరుపమ్మ, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వి.సరిత, డీటీసీఎస్ రామిరెడ్డి, ఆర్ఐలు గోపాలకృష్ణ, రాంబాబు పాల్గొన్నారు. సమస్యలపై పోరాడాలిసూర్యాపేట అర్బన్ : దళితుల సమస్యలపై పోరాడేందుకు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని స్టార్ బాంకెట్ హాల్లో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కైలాబ్ బాబు మాట్లాడారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో దళిత గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట గోపి, నాయకులు నందిపాటి మనోహర్, ప్రకాష్, కరత్, మంద సంపత్, దుర్గం, దినకల్, శేఖర్, యాదగిరి, రమణ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బందిపై బదిలీ వేటు పెన్పహాడ్ : పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మండల వైద్యాధికారితో పాటు సూపర్వైజర్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ బదిలీ వేటు వేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ కోటిరత్నం తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పెన్పహాడ్లో ఆమె మాట్లాడుతూ మండల వైద్యాధికారి స్రవంతి, ఏఎన్ఎంలు విధుల విషయంలో గొడవ పడి ఒకరిపై మరొకరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదికను అందజేసినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా పర్యవేక్షణ లోపం కారణంతో వైద్యాధికారి స్రవంతి, హెచ్ఈఓలు చంద్రశేఖరరాజు, శ్రీనివాసులు, సూపర్వైజర్లు జానకమ్మ, సైదయ్యపై బదిలీ వేటు వేసినట్లు పేర్కొన్నారు. మోతె మండలంలో విధులు నిర్వర్తిస్తున్న రాజేష్ను డిప్యుటేషన్పై మండల వైద్యాధికారిగా నియమించినట్లు ఆమె తెలిపారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రతి విభాగం అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలోని వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ దావాఖానా కు వచ్చే పేషెంట్ల విషయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఆస్పత్రి హెచ్ఓడీలు.. ఓపీలను జాగ్రత్తగా గమనించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం అన్ని ఆపరేషన్లు, ఎంసీహెచ్లో డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలన్నారు. టీబి రోగులు కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి సేవలందించాలన్నారు. పలు సూచనలు చేశారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జయలత, డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. మెనూ అమలు చేయాలి అనంతరం జిల్లా విద్యా శాఖ, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ప్రతి వారం మనోధైర్యం కల్పించేలా సినిమాలు చూపించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేసిఒక టీచర్ను ఇన్చార్జిగా నియమించాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి మునగాల: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. శుక్రవారం ఆయన మునగాలలోని పీహెచ్సీని సందర్శించి మొక్కలు నాటా రు. అనంతరం స్థానిక పీహెచ్సీలో పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. పీహెచ్సీలో ఫర్నీచర్ కొనుగోలుకు తక్షణమే రూ.లక్ష చెక్కును వైద్యాధికారికి అందచేశారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్య మైన విద్యనందించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, ఎంపీఓ నరేష్, తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఏపీఓ శైలజ, ఏఓ రాజు, పీఆర్ ఏఈ వసంత, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్, స్టాఫ్నర్స్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గ్రామీణ రహదారుల అభివృద్ధి
సర్కిల్–2లో ఏడు నియోజకవర్గాలు.. నల్లగొండ సర్కిల్–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సర్కిల్ కింద రూ.389.73 కోట్ల వ్యయంతో 287.50 కిలోమీటర్ల పొడవునా 16 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గ్రామీణ రోడ్లును హైబ్రీడ్ ఆన్యూటీ మోడ్లో (హ్యామ్) అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్లను విస్తరిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. సర్కిల్–1లో ఐదు నియోజకవర్గాల్లో.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక ప్యాకేజీగా తీసుకున్నారు. మొదటి సర్కిల్లో రూ.302.45 కోట్లతో 18 రోడ్లను అబివృద్ధి చేయనున్నారు. నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 223.12 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టనుండగా.. ఇందులో 38.4 కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి చేయనున్న రోడ్లు ఇవే..● బరాకత్గూడెం –కాగిత రామచంద్రపురం రోడ్డు (నడిగూడెం, కాగితరామచంద్రపురం, సోమ్లా తండా) 7 కిలోమీటర్లు. ● శాంతినగర్ నుంచి ఎన్హెచ్ 9 వరకు వయా గోండ్రియాల రోడ్డు (శాంతినగర్, గోండ్రియాల, చిమిర్యాల) 11.60 కిలోమీటర్లు. ● కోదాడ–రేవూర్ రోడ్డు (కోదాడ, గుడిబండ,తొగర్రాయి, గనపవరం, ఎర్రారం)12.60 కిలోమీటర్లు ● రాయినిగూడెం–బరాకత్గూడెం రోడ్డు(బేతవోలు, సీత్లాతండా, పోలేనిగూడెం, బరాకత్గూడెం) 11.60 కిలోమీటర్లు. ● శాంతినగర్–నడిగూడెం రోడ్డు (శాంతినగర్, అనంతగిరి, అమీనాబాద్) 6 కిలోమీటర్లు. ● హుజూర్నగర్ లింక్ రోడ్డు 2 కిలోమీటర్లు. ● హుజూర్నగర్ రింగ్ రోడ్డు 4.15 కిలోమీటర్లు. ● దురాజ్పల్లి–గరిడేపల్లి రోడ్డు (దురాజ్పల్లి, సింగారెడ్డిపాలెం, అనంతారం ఎక్స్రోడ్డు, పెన్పహాడ్, మాచారం, దూపహడ్) 12.20 కిలోమీటర్లు. మరో ప్యాకేజీలో 15 కిలోమీటర్లు. ● హుజూర్నగర్–యాతవాకిళ్ల రోడ్డు (హుజూర్నగర్, లింగగిరి) 4 కిలోమీటర్లు. ● కోదాడ–రేవూర్ రోడ్డు (కందిబండ, హేమ్లాతండా, మేళ్లచెర్వు, రేవూర్) 7.45 కిలోమీటర్లు. ● హుజూర్నగర్–మేళ్లచెర్వు రోడ్డు (హుజూర్నగర్, వేపలసింగారం, మేళ్లచెర్వు) 11.10 కిలోమీటర్లు. ● దామరచర్ల–జాన్పహాడ్ రోడ్డు 4.50 కిలోమీటర్లు. ● సూర్యాపేట–నెమ్మికల్–దంతాలపల్లిరోడ్డు (గుండ్లసింగారం, నూతన్కల్, ఎర్రపాడ్ ఎక్స్రోడ్డు, మద్దిరాల) 18.40 కిలోమీటర్లు. ● సూర్యాపేట–నెమ్మికల్–దంతాలపల్లి రోడ్డు (కుడకుడ, ఐలాపురం, గుర్రంతండా, నెమ్మికల్, పాతర్లపహాడ్) 18 కిలోమీటర్లు. ● మామిడాల–కుంటపల్లి రోడ్డు (మామిడాల, గొట్టిపర్తి, రావులపల్లి ఎక్స్రోడ్డు, గుమ్మడపల్లి ఎక్స్రోడ్డు, కుంటపల్లి) 18.40 కిలోమీటర్లు ● మాచారం–చీదెళ్ల రోడ్డు (మాచారం, అనిరెడ్డిగూడెం, గాజులమల్కాపురం, చీదెల్ల రోడ్డు–11.00 కిలోమీటర్లు. ఫ ఉమ్మడి జిల్లాలో 60 రోడ్ల విస్తరణ ఫ హైబ్రీడ్ అన్యూటీ మోడ్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి ఫ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఫ టెండర్లను పిలిచేందుకు అధికారుల కసరత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవ హ్యామ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి మొదటి మూడు ప్యాకేజీల్లోనే అవకాశం కల్పించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రి కావడంతో జిల్లా రోడ్లను మొదటిలోనే అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీలుగా రోడ్ల అభివృద్ది, విస్తరణ చేయనుండగా, అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం కల్పించారు. -
పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచామని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో స్కానర్తో అనుమానితులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా కేంద్రంలో పాత నేరస్తులు, అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నారా అనే కోణంలో తనిఖీలు చేశామన్నారు. వ్యాపార సముదాయాలు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత గుర్తింపు కార్డులు లేకుండా ఎవరికి నివాసాలు అద్దెకు ఇవ్వొద్దన్నారు. అనుమానితుల సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్ఐలు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా లింగ నిర్ధారణ!
మెడికల్ షాపులే అడ్డాగా గుట్టుగా పరీక్షలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకే.. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం ప్రకారం పదేళ్లకు పైబడిన జైలుశిక్ష, జరిమానాలు ఉంటాయి. ఇలాంటి వాటిపై స్థానిక పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ఆర్ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలి. – కె.నరసింహ, ఎస్పీ, సూర్యాపేట సూర్యాపేటటౌన్ : లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొందరు సొంతంగా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని పుట్టబోయేది ఆడబిడ్డా.. మగ పిల్లోడా అని తేల్చి చెబుతున్నారు. ఆడపిల్ల అని తెలిసి కొందరు గుట్టుగా గర్భస్రావం (అబార్షన్) చేయించుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. లింగ నిర్ధారణ మొదలు, అబార్షన్ల వరకు జిల్లా అంతటా ఈ దందా కొనసాగుతున్నా.. వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖలు క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి.. జిల్లాలో పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేస్తున్నారు. కడుపులో పెరిగేది ఆడా.. మగా అనే విషయాన్ని గర్భిణికి ఐదో నెలలోనే చెబుతున్నారు. ఈ క్రమంలో రూ.వేలకు వేలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని చిన్న ఆస్పత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఎక్కువ శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. ఇందులో కొందరు ఆర్ఎంపీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేటలో వైద్యులు లేకుండానే పలు ఆస్పత్రుల్లో ఈ తంతు నిత్యకృత్యంగా మారడం గమనార్హం. మెడికల్ షాపులోనే స్కానింగ్ దందా.. జిల్లాలో స్కానింగ్ సెంటర్లతో పాటు మెడికల్ షాపుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ రోడ్డులో ఓ మెడికల్ షాపులో ఏకంగా స్కానింగ్ మిషన్ పెట్టిన ఇద్దరు వ్యక్తులు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు బట్టబయలైంది. కాగా వారిద్దరిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. అయితే అందులో ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్పత్రి మేనేజ్మెంట్గా వ్యవహరిస్తూ ఆర్ఎంపీల మధ్యవర్తిత్వంతో సీక్రెట్గా చర్చి కాంపౌండ్లో ఉన్న మరో వ్యక్తి మెడికల్ షాపులో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అబార్షన్ కోసం వెళ్లి ప్రాణాల మీదకు.. ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్ చేసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు నెలల క్రితం మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఐదో నెలలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు ఒక ఆర్ఎంపీ సాయంతో జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర థియేటర్ సమీపంలో పేరులేని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అబార్షన్ కోసం ప్రయత్నించగా ఆమె పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందింది. జిల్లాలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. హడావుడి చేశారు.. వదిలేశారు! మూడు నెలల క్రితం జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, అర్హత లేని వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందంతో పాటు వైద్యారోగ్యశాఖ నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించింది. కొందరు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయగా అనుమతులు లేని రెండు మూడు ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. అప్పటి వరకే హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ మళ్లీ తనిఖీలకు వెళ్లకపోవడంతో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ రూ.పదివేలిస్తే పరీక్ష.. క్షణాల్లో రిపోర్టు ఫ ఆడపిల్ల అయితే అబార్షన్లు సైతం చేయిస్తున్న వైనం ఫ శుక్రవారం సూర్యాపేటలో పరీక్షలు చేస్తున్న వారి గుట్టు రట్టు -
మూసీ రెండు గేట్ల ఎత్తివేత
ఫ 1,300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఫ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంకేతేపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. వారం రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 1,423 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా శుక్రవారం ఉదయానికి 1,650 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 643.50అడుగులు (4.07టీఎంసీలు) నీరు ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఏర్పాట్లు శుక్రవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ ఉదయం 10 గంటలకు మూసీ ప్రాజెక్టు 3, 8 నంబరు క్రస్ట్గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1300 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి కాల్వకు 167 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 215 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. ఎగువ నుంచివచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిమట్టం 643 అడుగుల వద్ద నిలకడగా ఉంచుతూ.. వరదను దిగువకు వదులుతున్నామని అధికారులు వెల్లడించారు. మూసీ నీటి విడుదల నేపథ్యంలో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, మూసీ ఏఈలు ఉదయ్, కీర్తి పాల్గొన్నారు. మొరాయించిన గేట్లు.. విద్యుత్ లోవోల్టేజీ సమస్య కారణంగా మూసీ గేట్లు మొరాయించాయి. మూసీ ప్రాజెక్టుకు సూర్యాపేట మండలం ఎర్కారం విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరపరా అవుతుంది. అయితే లోవోల్టేజీ సమస్య కారణంగా అధికారులు గేట్లు ఎత్తేందుకు స్విచ్ ఆన్ చేసినప్పటికీ గేట్లు పైకి లేవలేదు. దీంతో డ్యాం వద్ద అందుబాటులో ఉన్న జనరేటర్ సహాయంతో అధికారులు గేట్లను పైకెత్తారు. -
కష్టాల్లోంచి పుట్టిన స్టార్టప్
నల్గొండ: పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా దాతల సహకారంతో ఐఐటీలో చదివి.. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి అనిల్కుమార్. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి జీవితంలో సక్సెస్ అయ్యాడు.ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్కుమార్, అనిల్కుమార్ సంతానం. ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. కవిత దినసరి కూలీ. వారికి పెద్దగా ఆస్తులు లేవు. అనిల్కుమార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద హుజూర్నగర్లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్లో ప్రవేశ పరీక్ష రాసి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. పదో తరగతి తర్వాత హైదరాబాద్లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఐఐటీ అకాడవీు)లో ప్రవేశ పరీక్ష రాసి ఇంటర్తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సాధించాడు. ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ఫూర్తితో అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో సీటు సంపాదించాడు. అయితే ఏడాదికి దాదాపు లక్షన్నర రూపాయల ఫీజు చెల్లించాల్సి రావడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పైగా అనిల్కుమార్ అన్న సునీల్కుమార్ కూడా అదే సమయంలో బీటెక్ చదువుకుంటుండడంతో ఇద్దరికి ఫీజు చెల్లించడం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది. దాతల సాయంతో ఐఐటీకి..ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో 2021 డిసెంబర్ 12న అనిల్కుమార్ పరిస్థితిపై ‘అట్టడుగు నుంచి ఐఐటీకి’ అనే కథనం ప్రచురించడంతో దాతలు ముందుకు రావడంతో పాటు అప్పటి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్, ఇతరుల నుంచి ఆర్థిక సాయం లభించింది. అంతేకాకుండా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం రూ.2.50లక్షలు చెక్కు అనిల్కుమార్కు అందించడంతో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు దోహదం పడింది. తనకు అందివచి్చన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న అనిల్కుమార్ కష్టపడి చదివి ఈ నెల 15వ తేదీన ఐఐటీ ఖరగ్పూర్లో నిర్వహించిన 71వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు.కేటీఆర్ మాటలే ప్రేరణగా...‘మనం ఒకరి కింద ఎందుకు పనిచేయాలి..? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం..? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు..?’ అని మాజీ మంత్రి కేటీఆర్ మాటలతో ప్రేరణ పొందిన అనిల్కుమార్ ఐఐటీలో చదువుతుండగానే తన మిత్రులతో కలిసి లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ను స్థాపించాడు. ఈ స్టార్టప్ ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. అనిల్కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’ అని కేటీఆర్ అనిల్కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు. -
వరి నాట్లలో మెళకువలు
ముగిసిన ‘నవోదయ’ అథ్లెటిక్స్ మీట్పెద్దవూర: పెద్దవూర మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్స్ మీట్–2025 గురువారంతో ముగిసింది. రాష్ట్రంలోని తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి 68 మంది బాలురు, 46 మంది బాలికలు కలిపి మొత్తం 114 మంది ఈ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొన్నారు. రన్నింగ్, వాకింగ్, హార్డిల్స్, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్ వంటి మొత్తం 21 అథ్లెటిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన 25 మంది బాలికలు, 25 మంది బాలురను ఎంపిక చేసి ఈ నెల 27న కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్లో పంపించనున్నట్లు జేఎన్వీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె. శంకర్ తెలిపారు.త్రిపురారం: వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభంకావడంతో నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు సైతం పైనుంచి వరద వస్తుండడంతో మరికొన్ని రోజుల్లో సాగర్ కాలువకు నీటి విడుదల కూడా చేసే అవకాశం ఉండడంతో ఆయకట్టు పరిధిలో ఇప్పటికే రైతులు నారు పెంపకం చేపట్టారు. వరి నాట్లలో సరైన మెళకువలు, ఎరువుల యాజమాన్యం పాటించాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. సకాలంలో దుక్కులు, దమ్ము చేసుకోవాలి.. రైతులు ప్రధాన పొలాన్ని సకాలంలో మెత్తగా దుక్కి దున్నుకోవాలి. నీళ్లు పెట్టి దమ్ము కూడా చేసుకోవచ్చు. దీంతో పిచ్చి, కలుపు మొక్కలు పొలంలో కలిసిపోతాయి. తర్వాత పొలంలోని గట్లను సమానంగా సరి చేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్లు ముందుగానే సాగు చేసుకున్న రైతులు నాట్లకు 15 రోజుల ముందే దమ్ము చేసుకొని భూమిని చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి రెండు రోజుల ముందే నీళ్లలో దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది. ఎరువుల యాజమాన్యం.. ఫ నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, అంకురం దశలో, బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30 గంటల తర్వాత పొలానికి నీరు పెట్టడం ఉత్తమం. ఫ నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో గాని యూరియా రూపంలో లేదా నానో యూరియా రూపంలో అందించవచ్చు. శాస్త్రవేత్తల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలి. ఫ 40 కిలోల యూరియా 10 కిలోల వేప పిండి, లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. ఫ మట్టి పరీక్షల ఆధారంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి. ఫ పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవాలి. చెల్క నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి. ఫ కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. పూర్తిగా దమ్ములో వేసుకోవాలి. ఫ ముదరు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి 70 శాతం దమ్ములో, మిగతా 30 శాతం అంకురం దశలో వేయాలి. కాలి బాటలు సకాలంలో తీసుకోవాలి.నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుంటుంది. నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. దీర్ఘ, మధ్యకాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుతం వానాకాలం సీజన్లో చదరపు మీటరుకు 40 కదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20సె.మీ. కాలి బాటలు తీసుకోవాలి. కాలి బాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేసుకోవచ్చు. కలుపు మందులు, ఎరువులు, పురుగు మందులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. పైరు పరిస్థితిని తెలుసుకుంటానికి కాలి బాటలు తోడ్పడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించుకోవాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేవిధంగా చూసుకోవాలి. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి 4 నుంచి 5 మొక్కల చొప్పున నాటుకోవాలి. ఇవి చేయకూడదు. భాస్వరం ఎరువులతో కలిపి జింక్ సల్ఫేట్ను వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. భాస్వరంలో జింకును కలిపి వేయడం వల్ల రసాయనిక చర్య జరిగి పంటకు ఫలితం ఉండదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో సైతం పురుగు, తెగుళ్ల మందులు కలపరాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో ఎరువులు, చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం. ఫ కంపాసాగర్ కేవీకే సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
కేటీఆర్ మాటలే ప్రేరణగా...
గ్రామ పంచాయతీ కార్మికుడి కుమారుడి ప్రతిభ ఫ దాతల సహకారంతో ఐఐటీలో చేరి స్టార్టప్ కంపెనీ నెలకొల్పిన తుమ్మలపెన్పహాడ్ యువకుడు ఫ నేటి యువతకు స్ఫూర్తిగా పిడమర్తి అనిల్కుమార్ఆత్మకూర్ (ఎస్): పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా దాతల సహకారంతో ఐఐటీలో చదివి.. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి అనిల్కుమార్. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి జీవితంలో సక్సెస్ అయ్యాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్కుమార్, అనిల్కుమార్ సంతానం. ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. కవిత దినసరి కూలీ. వారికి పెద్దగా ఆస్తులు లేవు. అనిల్కుమార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద హుజూర్నగర్లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్లో ప్రవేశ పరీక్ష రాసి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. పదో తరగతి తర్వాత హైదరాబాద్లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఐఐటీ అకాడమీ)లో ప్రవేశ పరీక్ష రాసి ఇంటర్తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సాధించాడు. ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ఫూర్తితో అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో సీటు సంపాదించాడు. అయితే ఏడాదికి దాదాపు లక్షన్నర రూపాయల ఫీజు చెల్లించాల్సి రావడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పైగా అనిల్కుమార్ అన్న సునీల్కుమార్ కూడా అదే సమయంలో బీటెక్ చదువుకుంటుండడంతో ఇద్దరికి ఫీజు చెల్లించడం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది. దాతల సాయంతో ఐఐటీకి.. ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో 2021 డిసెంబర్ 12న అనిల్కుమార్ పరిస్థితిపై ‘అట్టడుగు నుంచి ఐఐటీకి’ అనే కథనం ప్రచురించడంతో దాతలు ముందుకు రావడంతో పాటు అప్పటి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్, ఇతరుల నుంచి ఆర్థిక సాయం లభించింది. అంతేకాకుండా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం రూ.2.50లక్షలు చెక్కు అనిల్కుమార్కు అందించడంతో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు దోహదం పడింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న అనిల్కుమార్ కష్టపడి చదివి ఈ నెల 15వ తేదీన ఐఐటీ ఖరగ్పూర్లో నిర్వహించిన 71వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న అనిల్కుమార్ ‘మనం ఒకరి కింద ఎందుకు పనిచేయాలి..? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం..? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు..?’ అని మాజీ మంత్రి కేటీఆర్ మాటలతో ప్రేరణ పొందిన అనిల్కుమార్ ఐఐటీలో చదువుతుండగానే తన మిత్రులతో కలిసి లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ను స్థాపించాడు. ఈ స్టార్టప్ ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. అనిల్కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’ అని కేటీఆర్ అనిల్కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు. -
యాదగిరి మాడ వీధిలో ప్రసాద టిక్కెట్ కౌంటర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలోని అఖండ దీపారధన పక్కన నూతనంగా ప్రసాద టిక్కెట్ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.15లక్షలతో 6 టిక్కెట్ కౌంటర్లను 70 గజాల్లో నిర్మాణం చేశారు. ప్రత్యేక గదులు, షెడ్డు, భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా గ్రిల్స్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివాలయానికి వెళ్లే మెట్ల దారిలో లడ్డూ, పులిహోర ప్రసాద టిక్కెట్ కౌంటర్లను గతంలో ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల మార్గంలో వెళ్లి టిక్కెట్ కొనుగోలు చేసి, తిరిగి మెట్లు ఎక్కి ప్రసాద విక్రయ కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు స్వామిని దర్శించుకొని నేరుగా అఖండఽ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన టిక్కెట్ కౌంటర్లో లడ్డూ, పులిహోర టిక్కెట్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రసాద విక్రయశాలకు వెళ్లెందుకు వీలు కల్పించారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి, అక్కడి నుంచి బస్టాండ్కు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద టిక్కెట్ కౌంటర్ను శ్రావణమాసం మొదటి రోజు శుక్రవారం ప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలం వంకమామిడి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన రాధారపు మల్లేశ్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మానస(20) డిగ్రీ పూర్తి చేసి భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో 20 రోజుల క్రితం చేరి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. ప్రతిరోజు ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పోచంపల్లికి వచ్చి వెళ్తోంది. బుధవారం గ్రామానికి వచ్చే బస్సు రాకపోవడంతో భూదాన్పోచంపల్లిలో బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్న తన పెద్దనాన్న కుమారుడు రాధారపు బాలకృష్ణ బైక్పై వచ్చింది. తిరిగి రాత్రి ఇంటికి అతడి బైక్ పైనే వెళ్తుండగా.. వంకమామిడి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ పక్క నుంచి నెమ్మదిగా వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పడంతో మానస ఒక్కసారిగా వెనుకకు ఒరగగా, ఆమె తల టిప్పర్కు బలంగా తాకడంతో తల పగిలి అక్కడక్కడే మృతిచెందింది. బాలకృష్ణ బైక్ పైనుంచి కిందపడిపోగా.. అతడి కాలు, చెయ్యి విరిగింది. గాయపడిన బాలకృష్ణ వెంటనే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు. బాలకృష్ణను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మానస మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా గురువారం ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి కుటుంబానికి టిప్పర్పై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు రూ.1.65లక్షల పరిహారం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. -
కాంగ్రెస్ రూపొందించింది ముస్లిం రిజర్వేషన్ బిల్లు
చౌటుప్పల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదని, అది పూర్తిగా ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల పేరుతో కేవలం ఒక మతానికి రిజర్వేషన్లు తీసుకురావడానికి బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. 285 సెక్షన్ సవరణ చేసి పంపించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుండానే గవర్నర్కు పంపించిందని ఆరోపించారు. 42శాతం రిజర్వేషన్లో 10శాతం ముస్లింలకే దక్కతుందన్నారు. నిజమైన బీసీలకు కాకుండా మతానికి రిజర్వేషన్లు అందించే కాంగ్రెస్ పన్నాగాన్ని బీసీ సమాజం గుర్తించాలన్నారు. కాంగ్రెస్ కుట్రను బయటపెడుతున్న బీజేపీని కావాలని బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చేది, ఇస్తున్నది కేవలం బీజేపీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా నిలువవని తెలిసే కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మండల, మున్సిపల్ కమిటీల అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, మాజీ సర్పంచ్లు రమనగోని దీపిక, రిక్కల సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, శాగ చంద్రశేఖర్రెడ్డి, పోలోజు శ్రీధర్బాబు, కంచర్ల గోవర్ధన్రెడ్డి, చినుకని మల్లేశం, బత్తుల జంగయ్య, మన్నె ప్రతాపరెడ్డి, ఊడుగు వెంకటేశం, కట్ట కృష్ణ, పిల్ల బుచ్చయ్య, కడారి అయిలయ్య తదితరులు ఉన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప -
ద్విచక్ర వాహనం ఢీకొని..
కనగల్: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ స్టేజీ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన షేక్ యాసిన్(75), హలీమా దంపతులు 20ఏళ్ల కిందట కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి వలస వచ్చి గ్రామ స్టేజీ వద్ద మిఠాయి దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం యాసిన్ తన దుకాణం అవతలి వైపు రోడ్డు దాటుతుండగా.. నల్ల గొండ మండలం బుద్దారం గ్రామానికి చిలుకల అనిల్ ద్విచక్ర వాహనంపై వచ్చి యాసిన్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాసిన్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రషీద్ఖాన్ తెలిపారు. -
ఒక కుటుంబం.. ఒకే వార్డు
సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా నిర్వహించేలా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో రూపొందించిన జాబితా ఆధారంగా పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల లెక్క తేల్చారు. అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో వార్డులను విభజించారు. ఇటీవల కొందరు కొత్తగా ఓటుహక్కు పొందారు. మరికొందరు ఓటర్లు మరణించారు. చేర్పులు, మార్పుల కారణంగా నూతన జాబితాను ప్రచురించారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు జాబితాను సవరించనున్నారు. ఎన్నికల నాటికి మళ్లీ కొత్త ఓటర్ల నుంచి చేర్పులు, మార్పులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వారి వివరాలతో వార్డుల వారీగా అనుబంధ జాబితాను రూపొందించే అవకాశముంది. దీనినే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పరిగణనలోకి తీసుకోనున్నారు. గ్రామం యూనిట్గా.. ఇప్పటివరకు మండలం యూనిట్గా అన్ని గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ఎంపీడీఓ లాగిన్తో టీపోల్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తపరిచారు. పంచాయతీ కార్యదర్శి స్థాయిలో గ్రామం యూనిట్గా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు కొత్త జాబితాను సిద్ధం చేసి కార్యదర్శి లాగిన్ ద్వారా టీపోల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ జాబితాను ఎంపీడీఓ పరిశీలించి డీపీఓకు పంపిస్తారు. ఉద్యోగుల వివరాల సేకరణ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. ఎంతమంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓ), పోలింగ్ సిబ్బంది అవసరమో గుర్తించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఇటీవల కొండరు ఉద్యోగులు బదిలీ అయ్యారు. వేరే ప్రాంతాల నుంచి ఇంకొందరు ఇక్కడికొచ్చారు. వారిలో ఎవరెవరు ఆర్ఓలు, ఏఆర్ఓలు, పోలింగ్ సిబ్బందో గుర్తించి వారి వివరాలను టీపోల్లో నమోదు చేస్తున్నారు. ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నాం. గ్రామం యూనిట్గా పంచాయతీ కార్యదర్శి లాగిన్లో అప్లోడ్ చేస్తున్నాం. – యాదగిరి, డీపీఓ ఫ వేర్వేరు వార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కచోటకు.. ఫ గ్రామం యూనిట్గా ఓటరు జాబితా రూపకల్పనకు అధికారుల కసరత్తు ఫ టీ పోల్ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం -
పిల్లల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
ఖమ్మం సహకారనగర్: పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తరగతి గదిలో విద్యార్థులతో మమేకమవుతూ పాఠాలు బోధించాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఆమె ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే పిల్లలకు నేర్పించేదే వారి జీవితంలో కీలకంగా మారుతుందన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈఓలు, ఎంఈఓలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేయాలన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి స్నాక్స్ సమకూర్చాలని సూచించారు. అనంతరం విద్యా శాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడగా ఎస్సెస్సీలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన, మూతబడిన స్కూళ్లు తెరిపించిన, అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన ఎంఈఓలను సన్మానించారు. ఈ సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ, విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు రమణకుమార్, రాజీవ్, సత్యనారాయణరెడ్డి, మదన్మోహన్, వెంకటనర్సమ్మ, డాక్టర్ హెచ్.హరీష్, మంజరి, డీఈఓ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. ఫ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా -
అందుబాటులో 10వేల టన్నుల యూరియా
భానుపురి (సూర్యాపేట) : ‘జిల్లాలో పదివేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.. ఇతర ఎరువులు కావాల్సినన్ని ఉన్నాయి.. రైతులు ఎవరూ అధైర్య పడవద్దు’ అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నకిలీ విత్తనాలు అరికట్టడంతో పాటు విత్తనాల నాణ్యత పరిశీలించడంలో వ్యవసాయ అధికారులు బాగా పని చేశారని అభినందించారు. రైతు భరోసా ద్వారా రైతులకు ముందస్తుగా పెట్టుబడి అందించామన్నారు. అధికారులు రైతు వేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు చేయాలన్నారు. ఎరువుల దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. యూరియా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల కొరత ఏర్పడితే కంట్రోల్ రూమ్ నంబర్ 8977741771 కి కాల్ చేసి తమ సమస్యను తెలియజేయాలన్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే అధికారులు పరిష్కరించాలన్నారు. వన మహోత్సవంలో వ్యవసాయ శాఖ కి ఇచ్చిన 3 లక్షల లక్ష్యాన్ని అధిగమించేలా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యాన వన అధికారి నాగయ్య, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఫ వ్యవసాయ, ఉద్యాన అధికారులతో సమీక్షఫ ఎరువుల కొరత ఏర్పడితే కంట్రోల్ రూమ్ నంబర్ 8977741771 కి ఫోన్ చేయండి -
ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు కేంద్రం కుట్ర
సూర్యాపేట అర్బన్ : దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులకు గురువారం తమ్మినేని హాజరై మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దళితులు, బలహీన వర్గాలు ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బిహార్లో ఓటర్ల ప్రక్షాళన పేరుతో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను తొలగిస్తోందన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓటర్ల సవరణ పేరుతో ఆధార్ కార్డులను నిరాకరించి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు ఉన్నా పట్టించుకోకుండా కుట్రలు చేసి అర్హులైన ఓట్లను తొలగిస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపినా పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేమని పరోక్షంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం తీవ్రంగా పెరుగుతోందని ప్రజల విషయాలను మతపరంగా చూస్తూ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి, పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్, తిప్పారపు సురేష్, మంద సంపత్, బొట్ల శేఖర్, దుర్గం దినకర్, ప్రకాష్, శరత్, జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు, సుధాకర్, పిండిగ నాగమణి, సైదులు, యాదగిరి, దుర్గారావు, వెంకటరమణ, రమణ, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగాఉండాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లతో జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు దిగొద్దని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీస్ సాయం పొందవచ్చని కోరారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యంకోదాడరూరల్ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు ఎన్.నాగేశ్వరరావు, పాండురంగాచారి పేర్కొన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని దోరకుంట, చిమిర్యాల, నల్లబండగూడెం, మంగలితండా పాఠశాలల్లో టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో తమ సంఘం ముందుటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు మైసయ్య, శ్రీనివాసరావు, నరసింహారావు, హనుమంతరావు పాల్గొన్నారు. ఇద్దరు మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. నల్లా బిల్లు వసూలుకు సంబంధించిన రశీదు పుస్తకం కనిపించకుండా విధుల్లో అలసత్వం వహించినందుకు సీనియర్ అసిస్టెంట్ బూర సతీష్, నల్లా బిల్లులు వసూలు చేసిన తప్పుడు లెక్క చేసి రూ. 4400 తక్కువగా మున్సిపాలిటీలో జమచేసినందుకు రెగ్యులర్ వాటర్ సప్లయ్ ఉద్యోగి సౌడం సురేష్లను సస్పెండ్ చేశారు. బిల్లుల వసూలు, జమను పరిశీలించడంలో అశ్రద్ధ వహించిన రెవెన్యూ అధికారి టి.కళ్యాణి కి మెమో జారీ చేశారు. -
ఎరువు మరింత భారం !
నాగారం : వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడులు తగ్గడం.. పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధర లేక నష్టాలను చవిచూస్తున్న రైతులకు పెరిగిన ఎరువుల ధర మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో పాస్పరస్, పొటాష్ ధరల పెరుగుదలతో కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఈ ఏడాది పెంచేశాయి. రకాన్ని బట్టి బస్తాకు గరిష్ఠంగా రూ.150 వరకు పెరగడంతో జిల్లాలోని రైతులపై రూ.కోట్లల్లో అదనపు భారం పడుతుంది. 6.17 ఎకరాల్లో సాగు భూమి జిల్లాలో 6.17లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వరి 4,85,125 ఎకరాలు, పత్తి 91వేల ఎకరాలు , కంది 2,650 ఎకరాలు, పెసర 2,700 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, మొక్కజొన్న 45 ఎకరాలు, మిర్చి 15,150 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, ఆయిల్పాం 4,000 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాలు, పండ్లు, కూరగాయలు 16,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచానా వేశారు. జిల్లా రైతులు డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వినియోగిస్తుంటారు. యూరియాపైనే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉంది. కాంప్లెక్స్ ఎరువుల విషయంలో రాయితీ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చు ఆధారంగా ధరలు నిర్ణయించే అకాశం ఉంది. యూరియా బస్తా(45 కిలోలు) తయారీకి రూ.1614 ఖర్చు కాగా, కేంద్రం బస్తాకు రూ.1347. 50 రాయితీ భరించి రైతులకు రూ.266.50కు అందిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీలో పొటాష్, పాస్పరస్ వంటి దేశీయంగా లభించక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో బస్తాకు రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగాయి. దీంతో వాన కాలం, యాసంగి సీజన్లలో ఈ మొత్తం రూ.13.64 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడనుంది.సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియా ఎరువులు వినియోగిస్తే అధిక పంటల దిగుబడుతో పాటు పంట పెట్టుబడి తగ్గుతుంది. యూరియా, డీఏపీకి బదులు నానో ఎరువు వాడితే ఖర్చు తక్కువ...లాభం ఎక్కువగా ఉంటుంది. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట. ఫ పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఫ రైతులపై ఆర్థిక భారం కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇలా...(రూ.లలో) ఎరువు 2023 2024 202520:20:13 1175 1300 1350 14:35:14 1450 1650 1800 10:26:26 1470 1570 1720 -
నేడు తెరుచుకోనున్న మూసీ గేట్లు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు క్రస్టుగేట్లను శుక్రవారం ఉదయం 8గంటలకు ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. మూసీకి గురువారం 1,427 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా 643.20 అడుగుల (4.07టీఎంసీల)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మూసీ క్రస్టు గేట్లు పైకెత్తుతామని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి ప్రధాన కాల్వకు 143 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 214.86 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మూసీ తీర ప్రాంత గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని మూసీ ప్రాజెక్టు అధికారులు సూచించారు. -
ఎట్టకేలకు సర్దుబాటు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉత్తీర్ణతతో పాటు చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలో టీచర్ల కొరతను తీర్చేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. అవసరమైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించింది. కొంతకాలంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు చేసి కలెక్టర్ సంతకం పెట్టడం ద్వారా ఎట్టకేలకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో జిల్లాలో 91 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. నేడో రేపో వారికి ఉత్తర్వులు అందనున్నాయి. మరో 40 మంది టీచర్లను రెండో విడతలో సర్దుబాటు చేయనున్నారు. అవసరమైన చోట.. జిల్లాలో 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు తగ్గుతున్నాయి. దీంతో మండల స్థాయిలో ఎంఈఓల పర్యవేక్షణలో ఖాళీల వివరాలు సేకరించారు. జీఓ నంబర్ 25 ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. పాఠశాలకు వెళ్లేనా..? ఉపాధ్యాయులను కొందరిని ఒకటే మండలం నుంచి ఇతర పాఠశాలకు పంపగా మరికొందరిని ఇతర మండలాలకు సైతం సర్దుబాటు చేశారు. అయితే వారికి అనుకూలంగా లేని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్తారా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అదే పాఠశాలలో ఉండేందుకు పైరవీలు సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా కలెక్టర్ ఆదేశాల మేరకు కచ్చితంగా సర్దుబాటు చేసిన పాఠశాలకు వెళ్లాల్సిందేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. హై స్కూళ్లకు ఎస్జీటీల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు డీఎస్సీ 2024లో ఎస్జీటీలు ఎక్కువగానే జిల్లాలో రిక్రూట్ అయ్యారు. ఎక్కువగా హై స్కూళ్లలోనే సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఎస్జీటీలను ప్రైమరీ స్కూల్కు సర్దుబాటు చేస్తే విద్యార్థులకు నష్టం కలుగకుండా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్జీటీలను హైస్కూల్కు సర్దుబాటు చేయడం ద్వారా వారికి హై స్కూల్ బోధనపై పట్టు ఉండదని, అలా చేయడం ద్వారా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయుల సర్దుబాటు శాసీ్త్రయంగా చేయాలని కోరుతున్నారు. ఎస్జీటీలను హైస్కూళ్లకు సర్దుబాటు చేయడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మండలాల వారీగా సర్దుబాటుమండలం టీచర్ల సంఖ్యఅనంతగిరి 03 ఆత్మకూర్.ఎస్ 06 చిలుకూరు 03 చింతలపాలెం 02 చివ్వెంల 04 గరిడేపల్లి 07 హుజూర్నగర్ 04 జాజిరెడ్డిగూడెం 04 కోదాడ 08 మద్దిరాల 04 మఠంపల్లి 06 మేళ్లచెరువు 01 మోతె 02 నడిగూడెం 05 నాగారం 01 నేరేడుచర్ల 01 నూతనకల్ 01 పాలకవీడు 02 పెన్పహాడ్ 03 సూర్యాపేట 12 తిరుమలగిరి 03 తుంగతుర్తి 09 ఫ మొదటి విడతలో 91 మంది టీచర్లను సర్దుబాటు చేసిన విద్యాశాఖ ఫ జీఓ నంబర్ 25 ప్రకారం ప్రక్రియ ఫ నేడో.. రేపో ఉపాధ్యాయులకు అందనున్న ఉత్తర్వులు ఫ ఎస్జీటీలను హైస్కూళ్లకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలునిబంధనల మేరకు సర్దుబాటు నిబంధనల మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేశాం. ఇప్పటి వరకు 91 మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు పంపించాం. సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు ఉత్తర్వులు రాగానే వెంటనే వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలి. – అశోక్, డీఈఓనిబంధనల మేరకు ఇలా.. విద్యార్థుల సంఖ్య సర్దుబాటు చేసిన టీచర్ల సంఖ్య 11 ఒక్కరు 11–30 ఇద్దరు 30–90 ముగ్గురు 90–130 నలుగురు -
బీజేపీ విధానాలను ప్రతిఘటించాలి
సూర్యాపేట అర్బన్: దేశంలో సామాజిక ఉద్యమాలను అణిచివేస్తున్న మనువాద బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులకు రెండో రోజైన బుధవారం ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ఏనాడూ పార్లమెంట్లో దళితుల గురించి చర్చ చేయలేదన్నారు. దళితులు, మహిళలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులు సంపద సృష్టిస్తే దానిని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతోందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్.. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేక దళితులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు విద్య, వైద్యం పేద ప్రజలకు అందడం లేదన్నారు. దళితులు విద్యకు దూరమవుతున్నారని, వైద్యం ఖరీదైన వ్యాపారంగా మారిపోయిందన్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి పోరాటం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి తో తాడోపేడో తేల్చుకోవడానికి పోరాటాలకు సన్నద్ధం కావాలని జాన్వెస్లీ పిలుపునిచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రతి గ్రామంలో దళిత, గిరిజన వాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉద్యమం చేయాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో భారత సమాజ పరిణామ క్రమంపై ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర నాయకులు బండారు రమేష్, మతం మతోన్మాదం ప్రతిఘటన పద్ధతులపై ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ బోధన చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్, సురేష్ కుమార్, ప్రకాష్ కారత్, బోట్ల శేఖర్, మంద సంపత్, ఏపీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు, జిల్లా ఆఫీస్ బేరర్స్ టేకుల సుధాకర్, దేవరకొండ యాదగిరి, దుర్గారావు, పిండిగ నాగమణి, ఇరుగు రమణ,వెంకటరమణ, నందిపాటి సైదులు, ప్రజా సంఘాల నాయకులు పోలిశెట్టి యాదగిరిరావు, వేల్పుల వెంకన్న,జె.నరసింహారావు, వీరబోయిన రవి, వల్లపుదాసు సాయికుమార్, మనోజ్ పాల్గొన్నారు. ఫ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ ఫ రెండో రోజు కొనసాగిన కేవీపీఎస్ రాష్ట్ర సామాజిక శిక్షణ తరగతులు -
పంటలకు జీవం
పత్తి రైతులు ఎరువులు వేసుకోవాలి రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున పత్తి రైతులు ఎరువులు వేసుకోవాలి. తేమశాతం ఉన్నప్పుడు వాడితేనే పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఎరువులను నిర్దిష్ట మోతాదులో వినియోగించాలి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భానుపురి (సూర్యాపేట) : రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైన ప్పటి నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలే ఇప్పటి వరకు సాగుకు ఉపయోగపడ్డాయి. తదనంతరం ఎలాంటి వర్షాలు లేక సాగు ముందుకు సాగలేదు. వర్షాభావ పరిస్థితులతో మెట్ట పంటల్లోనూ ఎదుగుదల లోపించింది. వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఈ దశలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు జిల్లాలోని చాలా మండలాల్లో సోమవారం మోస్తరు వర్షం పడింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు 14.9 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అన్ని మండలాల్లోనూ వర్షం పడింది. ఇక బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 మండలాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా మోతె మండలంలో 2.0 మి.మీ, చివ్వెంలలో 1.0 మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఇప్పుడిప్పుడే వరద పారుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మెట్ట పంటలతో పాటుగా.. సూర్యాపేట జిల్లాలో ఈ వానాకాలం 90 వేల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 50వేల ఎకరాల్లో సాగైంది. ఇతర మెట్టపంటలైన కంది, పెసర 5వేల వరకు ఉన్నాయి. ఇక అత్యధికంగా సాగయ్యే వరి 80వేల ఎకరాల వరకు వరి నారుతో పాటు నాట్లు పడ్డాయి. అయితే నెలన్నరగా వర్షాభావ పరిస్థితులతో పత్తి, కంది, పెసర పంటల్లో ఏ మాత్రం ఎదుగుదల లేకుండా పోయింది. బోరుబావుల కింద వరి సాగు చేయాలనుకున్న రైతులకు ఒక మడి సైతం తడిచేలా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు ఈ పంటలన్నింటికీ ఊపిరి పోసినట్లయింది. పత్తిలో కలుపుతీతతో పాటు ఎరువులు వేసే పనులను రైతులు మొదలు పెట్టారు. అలాగే వరి సాగు చేసే రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి. ఫ రెండు రోజులుగా మోస్తరు వర్షాలు ఫ పత్తితో పాటు వరి పైరుకు మేలు ఫ వ్యవసాయ పనులు ముమ్మరం -
నేరాల నివారణకు ప్రత్యేక నిఘా
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షల అమలు, డయల్ 100 కాల్స్, సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్యూ ఆర్ కోడ్ పని తీరు, ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడీ షీటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని, పెట్రోలింగ్, బీట్స్ సమర్థంగా నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. దుకాణ సముదాయాలు, కాలనీలు, గ్రామాలతో పాటు రహదారుల వెంట సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. వర్షసూచన ఉన్నప్పుడు అప్రమత్తంగా పని చేయాలన్నారు. అనంతరం గంజాయి, నకిలీ విత్తనాల స్వాధీనం కేసుల్లో బాగా పని చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్కు మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్ అందించి అభినందించారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మళ్లీ ఇందిరమ్మ సర్వే
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్న విషయం విదితమే. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ సొమ్ము అందాలంటే పక్కాగా వివరాలు నమోదై ఉండాల్సి ఉంది. దీనికోసం పీఎం ఆవాస్ యోజన యాప్లో లబ్ధిదారుల వివరాలు పొందుపర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను సంబంధిత యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. వివరాలన్నీ పకడ్బందీగా నమోదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6,642 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాగా.. మరికొన్నింటిని ఇందిరమ్మ కమిటీలు పూర్తిచేసి అధికారులకు అందించారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పీఎం ఆవాస్ యోజన యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. లబ్ధిదారుని పేరు, చిరునామా, ఆధార్ సంఖ్య, బ్యాంక్ ఖాతా, గ్రామం, పట్టణం, నగరంతో పాటు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్లు, పేర్లను పొందుపరచాల్సి ఉంది. ఒకవేళ లబ్ధిదారుడు ఉపాధి హామీ పథకం లో కూలీగా ఉన్నట్లయితే జాబ్ కార్డుల వివరాలు కూడా ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. అధికారులకు తప్పని ఇక్కట్లు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ అందాలంటే పక్కాగా ఈ యాప్లో లబ్ధిదారుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. అయితే కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్లను నమోదు చేస్తున్న క్రమంలో ఏదైనా పేరులో చిన్న పొరపాటు ఉన్నా యాప్ లో నమోదు కావడం లేదు. వివరాల నమోదుకు చాలా సమయం పట్టడం, సాంకేతిక సమస్యలు వస్తే మరింత ఆలస్యం అవుతుండడంతో అధికారులకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ వివరాల నమోదుకు ఈనెలాఖరు వరకే గడువు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఫ మరోసారి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నమోదు ఫ పీఎం ఆవాస్ యోజన యాప్లో వివరాలు అప్లోడ్ ఫ కేంద్ర ప్రభుత్వ రాయితీ అందేలా చర్యలు ఫ వివరాల నమోదుకు నెలాఖరు వరకే గడువు ఫ లబ్ధిదారుల ఇళ్లబాట పట్టిన సిబ్బంది వివరాలు యాప్లో నమోదు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం ఆవాస్ యోజన యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో త్వరలోనే ఈప్రక్రియ పూర్తవుతుంది. – సిద్ధార్థ, హౌసింగ్ పీడీ ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇలా.. మంజూరైనవి 6642ముగ్గుపోసినవి 1210రూఫ్ లెవల్ 106ఆరుఫీట్ల ఎత్తు 276బేస్మెంట్ లెవల్ 796 -
రోగులతో మర్యాదగా వ్యవహరించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు వివిధ విభాగాల గదులను పరిశీలించారు. రోజుకు ఎంతమంది గర్భిణులు వస్తున్నారు.. వారిని రిజిస్టర్లో నమోదు చేస్తున్నారో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, గర్భిణులతో పాటు వచ్చే సహాయకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గర్భిణులకు వైద్య సేవలు బాగా అందుతున్నాయి కానీ ఎంసీహెచ్ సిబ్బంది పేషెంట్లతో అమర్యాదగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణులను మెడికల్ చెకప్ కోసం తీసుకొచ్చిన గిరినగర్కు చెందిన ఆశా కార్యకర్తలు పారిజాతం, ఆదిలక్ష్మితో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గర్భిణుల వార్డును పరిశీలించారు. సాధారణ కాన్పులో తనకు బాబు పుట్టాడని చెరుకుపల్లి నుంచి వచ్చిన రమాదేవి అనే మహిళ సంతోషంగా కలెక్టర్కు తెలిపింది. గర్భిణులను జనరల్ చెకప్ కు తీసుకువచ్చే ఆశా కార్యకర్తల కోసం అన్ని సదుపాయాలతో ఉన్న ఒక విశ్రాంతి గదిని కేటాయించాలని హెచ్ఓడీని ఆదేశించారు. పేషెంట్లతో వచ్చిన సహాయకుల విశ్రాంతికి తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగం సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను పరిశీలించారు. ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. నర్సింగ్ కాలేజీతో పాటు హాస్టల్లో వసతుల కల్పనకు కలెక్టర్ లక్ష రూపాయలు మంజూరు చేశారు. అలాగే స్పోర్ట్స్కిట్ మంజూరు చేశారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ శ్రీకాంత్, గైనకాలజీ హెచ్ఓడీ పద్మజ, నర్సింగ్ సూపరింటెండెంట్ రేణుక బాయి, డాక్టర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ -
ఉమ్మడి జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధికి అనుమతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ (హామ్) పథకం కింద 60 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పనులను రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్లగొండ– 1 పరిధిలో 223.12 కిలోమీటర్ల పొడవున 18 రోడ్లను రూ.302.45 కోట్లతో విస్తరణ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. అలాగే నల్లగొండ–2 పరిధిలో 314.66 కిలోమీటర్ల పొడవున రూ.320.80 కోట్లతో 26 రోడ్లను అభివృద్ధి విస్తరణ పనులను చేపట్టనుంది. యదాద్రి భువనగిరి జిల్లాలో 287.50 కిలోమీటర్ల పొడవున రూ.389.73 కోట్లతో 16 రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులురామగిరి(నల్లగొండ): ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషి యాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతోపాటు ముప్పై కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, తొమ్మిది రకాల డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 15 సెప్టెంబర్ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు www.oucde.net వెబ్సైట్తోపాటు సెల్ : 9398673736, 9866977741 నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు. 10.31 కోట్ల మంది.. ఉచిత బస్సు ప్రయాణంరామగిరి(నల్లగొండ): మహాలక్ష్మి పథకం కింద నల్లగొండ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10,31,28,640 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి రూ.502 కోట్ల ఆదాయం సమకూరింది. దేవరకొండ డిపో పరిధిలో 1.96 కోట్ల మంది, నల్లగొండ పరిధిలో 1,53,52,391 మంది, మిర్యాలగూడ పరిధిలో 1,54,85,729 మంది, నార్కట్పల్లి డిపో పరిధిలో 36,25,576 మందితో నల్లగొండ జిల్లాలో మొత్తం 5,44,0 9149 మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. అలాగే సూర్యాపేట డిపో పరిధిలో 2.10కోట్లమంది, కోదాడ డిపో పరిధిలో 1.25 కోట్లతో కలిపి సూర్యాపేట జిల్లా మొత్తంగా 3.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. ఇక, యాదాగ్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట డిపో పరిధిలో 1,54,25,000 మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. జ్వర సర్వే నిర్వహించాలిగరిడేపల్లి: వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి సకాలంలో నివేదిక పంపించాలని జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి కోటిరత్నం సూచించారు. బుధవారం గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీసీసీఎం లతీఫ్, ఐఎల్ఆర్ టెక్నీషియన్ నరేష్, మండల వైద్యాధికారి నరేష్, యశోద, కృష్ణ, ఉపేందర్, కృష్ణకుమారి పాల్గొన్నారు. గరిష్ట నీటిమట్టానికి చేరువలో ‘మూసీ’ కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ గరిష్ట స్థాయికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,799 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం (4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టు బుధవారం సాయంత్రం నాటికి 643 (3.91 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు కుడి కాల్వకు 262 క్యూసెక్కులు, ఎడమ కాల్వ కు 307 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
హాస్టళ్లలో కమిటీలు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ సేఫ్టీ, ఆహార నాణ్యత, శానిటేషన్పై కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావు, ఇతర కార్యదర్శులతో కలిసి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అధికారులు నెలకోసారి హాస్టళ్లలో నిద్రించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. హాస్టల్ ఆవరణలోకి పాములు రాకుండా గడ్డిని శుభ్రం చేయాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లు, గ్రామ పాలనాధికారులకు ఈనెల 27న నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. వీటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల అకౌంట్, ఆధార్లలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసి వారికి నగదు జమ చేయాలన్నారు. వనమహోత్సవంలో శాఖల వారీగా మొక్కలు నాటాలని, పాఠశాలలు, దేవాలయాలు, సంక్షేమ హాస్టళ్లను గుర్తించి గుంతలు తీయాలన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతి మిల్లును తనిఖీ చేసి సీఎంఆర్ను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి సీతారాంనాయక్, డీఎస్ఓ మోహన్ బాబు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్నాయక్, జగదీశ్వర్ రెడ్డి, లత, డీసీఓలు, ఆర్సీఓలు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వేములపల్లి: బోరు బావి వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గబావిగూడేనికి చెందిన నంద్యాల ఆదిరెడ్డి (58) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బోరు బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని రైతు నలబోతు వెంకన్న గమనించి దగ్గరుకు వెళ్లి చూడగా ఆదిరెడ్డి పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వేములపల్లి పోలీసులు తెలిపారు. -
పరిశోధన.. బోధనలో ఓ భాగం
రామగిరి(నల్లగొండ): పరిశోధన బోధనలో భాగమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ(నాగార్జున ప్రభుత్వ కళాశాల) స్థాపించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం కాలేజీలో వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు బోధనకు పరిమితం కాకుండా పరిశోధనలో నిమగ్నం కావాలని తద్వారా సబంధిత సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల హాజరుశాతం కేవలం 50 శాతమే ఉంటుందని, కనీసం 75 శాతం హాజరుశాతం ఉన్న విద్యార్థులకే ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని తెలంగాణ కళాశాల విద్య ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి అధ్యాపకుడు విధిగా హాజరు తీసుకోవాలని అన్నారు. రేమీడియల్ క్లాసులు తీసుకొని అధ్యాపకులు విద్యార్థులకు మెంటార్గా ఉండాలన్నారు. ఇతర అతిథులు మాట్లాడుతూ.. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. 70 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతులుగా తీర్చిదిద్దిన కళాశాలకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఎన్జీ కళాశాలకు రానున్న కాలంలో న్యాక్–ఎ గ్రేడ్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ డీఎస్ఆర్. రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ వాటికి సిద్ధం కావాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏటా టాపర్గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి కళాశాల పేరు మీద రూ.1.5లక్షలు డిపాజిట్ చేస్తే వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద బంగారు పతకాలు ఇస్తామని తెలిపారు. అనంతరం 2021–2022 నుంచి 2023–24 వరకు వివిధ సబ్జెక్టులలో టాపర్గా నిలిచిన యూజీ, పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి. ఉపేందర్రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య రిటైర్డ్ ఆర్జేడీ డాక్టర్ జి. యాదగిరి, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరాజు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజారామ్, ఎన్జీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ లింగయ్య, డాక్టర్ లక్ష్మయ్య, మీనయ్య, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వైవీఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి, డాక్టర్ ఎ. మల్లేశం, సీహెచ్. సుధాకర్, ఎన్. కోటయ్య, శిరీష, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఘనంగా ఎన్జీ కాలేజీ వ్యవస్థాపక వేడుకలు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత -
వలస కార్మికులను నిర్బంధించిన 8 మందిపై కేసు
నల్లగొండ, చందంపేట: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ ప్రాంతంలో నిర్బంధించి వెట్టిచాకిరి చేయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం బానాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవహర్లాల్, పాయతండాకు చెందిన బాణావత్ రమేష్, ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన మైనంపల్లి శివ, కారె సింహాచలం, వంక విశాఖ అలియాస్ ఇషాక్, నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీకి చెందిన ఏరిపల్లి బావోజి, తాతారావు, చాపల బంగారి, గుడిపల్లి మండలానికి చెందిన జబ్బార్ అలియాస్ జవహర్లాల్, రమేష్, శివ కుమ్మకై ్క హైదరాబాద్కు చెందిన రాజు, జగన్, విజయవాడకు చెందిన లోకేష్ను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు ఒక్కో మనిషికి రూ.1500 చొప్పున కమిషన్ తీసుకుని, హైదరాబాద్, విజయవాడ నుంచి వలస కార్మికులకు రూ.15వేలు జీతం ఇస్తామని, రెండు రెండు గంటలు మాత్రమే పని, భోజనం, వసతి కల్పిస్తామని నమ్మబలికి వారిని దేవరకొండ, మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడి నుంచి వలస కార్మికుల సెల్ఫోన్లను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకొని రాత్రివేళ బైక్లపై నేరెడుగొమ్ము మండలం బాణాలకుంట, వైజాగ్ కాలనీకి తరలించి వారితో చేపలు పట్టడం, వలలు లాగించడం చేయించేవారు. రెండు పూటలు మాత్రమే భోజనం పెట్టి, పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. వేతనం అడిగితే వేడి చేసిన సీకులతో వాతలు పెట్టేవారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న నేరేడుగొమ్ము పోలీసులు దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో ఈ నెల 12న స్పెషల్ ఆపరేషన్ చేపట్టి కార్మికులకు విముక్తి కల్పించారు. నిందితులపై నేరడుగొమ్ము పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 32 మంది వలస కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో నలుగురు బాలకార్మికులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేష్, వెంకన్నను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డిండి, కొండమల్లేపల్లి సీఐలు, గుడిపల్లి, నేరడుగొమ్ము, గుర్రంపోడు ఎస్ఐలు, రెవెన్యూ, చైల్డ్ కేర్, సీడబ్ల్యూసీ బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ -
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ తనిఖీలు
కోదాడరూరల్: మేళ్లచెర్వు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టవ్వడంతో కోదాడ ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం కోదాడ పట్టణంలోని మద్యం దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ఎస్ఎస్ మద్యం దుకాణంలో అనుమానాస్పదంగా ఉన్న పలు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ మద్యం సీసాలను వరంగల్లోని ఎకై ్సజ్ శాఖ కెమికల్ ల్యాబ్కు పంపించి మద్యంలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాలను తెలుసుకుంటామని ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. మద్యంలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఆ షాపుపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే కోదాడ మద్యం దుకాణాల్లో కూడా కల్తీ మద్యం విక్రయాలు జరగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. షాపుల వద్ద తాగే వారికి ఈ నకిలీ మద్యం సీసాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని మందుబాబులు అంటున్నారు. మద్యం దుకాణాలపై ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తే నకిలీ మద్యం అమ్మకాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. -
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన కారు
● మూడు గ్రామాలకు నిలిచిపోయిన కరెంట్ సరఫరానిడమనూరు: నిడమనూరు మండల కేంద్రం శివారులో సోమవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు నర్సింహులగూడెం వద్ద పంతులు పెంటోజీ పెట్రోల్ బంక్ ఎదుట 167వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లతో పాటు 11కేవీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని రోడ్డు పక్కన ఆగిపోయింది. దీంతో శాఖాపురం, నర్సింహులగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలకు మరమ్మతుల కారణంగా నిడమనూరు మండల కేంద్రంలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంగళవారం ఉదయం ఘటనాస్థలం నుంచి కారును పోలీసులు తరలించారు. కారు, మూడు బైక్లు ధ్వంసం.. భూదాన్పోచంపల్లి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు అజాగ్రత్తగా కారు నడపడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్ల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారుతో పాటు మూడు బైక్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉడతల లోకేశ్యాదవ్, పోచంపల్లికి చెందిన సంజీవ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో రాత్రి 10.20గంటల సమయంలో కారులో పద్మానగర్ నుంచి పోచంపల్లి వైపు అతివేగంగా వస్తూ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన సూరేపల్లి భూషణ్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మూడు బైక్లు, కారు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సదరు యువకులు మద్యం మత్తులో కారులో పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన లోకేష్పై చర్యలు తీసుకోవాలని మంగళవారం బాధితుడు సూరెపల్లి భూషణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
బోధనా తీరు భేష్
మాది తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఎన్జీ కాలేజీలో 2020 నుంచి 2023 వరకు డిగ్రీ ఎంపీసీఎస్ చదువుకున్నాను. కళాశాలలో అధ్యాపకుల బోధన చాలా బాగుంది. అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు నాణ్యమైన బోధన అందించారు. ఫిజిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో టాపర్గా రావడంతో పాటు ఫిజికల్ సైన్స్ కోర్సులో ఓవరాల్ టాపర్గా నిలిచా. – జంతిక చిట్టిబాబు, ఎంపీసీఎస్ గర్వంగా ఉంది ఎన్జీ కాలేజీలో చదువుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 2022 నుంచి 2024లో డిగ్రీ ఈహెచ్పీ గ్రూప్ చదివాను. అన్ని సబ్జెక్టుల్లో టాపర్ నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది. ఎన్జీ కాలేజీలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. ఎంతో మందికి ఈ కళాశాల విద్యనందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన కళాశాల ప్రత్యేకత. – మసిరా ఫర్జా, ఈహెచ్పీ ● -
దళితులపై పెరుగుతున్న దౌర్జన్యాలు
సూర్యాపేట అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద విధానాలతో దేశంలో దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. మంగళవారం సూర్యాపేటలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జెండాను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు. అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని అన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మనువాద పాలకులు దేశాన్ని ఏలుతున్నారన్నారు. మనువాద ధర్మం, సనాతన ధర్మం ఎడమ చేయి, కుడి చేయి లాంటిదన్నారు. భూమి, రిజర్వేషన్లు, ప్రకృతి వనరులు అట్టడుగు వర్గాలకు దక్కకుండా కేవలం కుల సమస్య విడిగా పరిష్కారం కాదన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని, అట్టడుగు వర్గాలకు జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవని అన్నారు. అన్ని రకాల వివక్షలను అంతమొందించడానికి సమాజంలో దోపిడీని ఎదిరించే శక్తులతో కలిసి సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. బిహార్ రాష్ట్రంలో మైనార్టీల ఓట్ల తొలగింపు పౌర ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.ఫ దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు ఫ సూర్యాపేటలో కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు ప్రారంభం -
సంక్షేమ పఽథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి
సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్అలీ, చకిలం రాజేశ్వరరావు, కోతి గోపాల్ రెడ్డి, సురేష్ రావు, వీరన్న నాయక్, కక్కిరేణి శ్రీనివాస్, వేముల కొండ పద్మ, చింతమల్ల రమేష్,తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, గుడిపాటి నరసయ్య, ఎలిమినేటి అభినయ్, తండు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.ఫ ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ ఫోటోఫైల్ నెం : 22ఎస్పిటి 152 టు 155 -
ఇంకుడు గుంత.. ఇంతే.!
ఆత్మకూర్ (ఎస్): ఇళ్లలో వాడుకున్న నీటితోపాటు వాననీరు బయటికి వృథాగా పోకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగేలా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం నెరవేరలేదు. జూలై 20వరకు యుద్ధప్రాతిపదికన ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ నెలరోజుల క్రితం డెడ్లైన్ విధించినా ప్రక్రియ పూర్తికానేలేదు. ఇప్పటి వరకు 58.40శాతం మాత్రమే పూర్తయ్యాయి. 23 గ్రామాల్లో నాలుగు విభాగాల్లో.. భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో నాలుగు విభాగాల్లో 1,041 ఇంకుడు గుంతల నిర్మాణానికి కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఇందులో మొదటి విభాగం కింద ఇళ్లలో వ్యక్తిగతంగా 925, రెండో విభాగం కింద గ్రామ కూడళ్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 64, మూడో విభాగం కింద మురుగు కాలువలు ముగిసే ప్రాంతాల్లో (డ్రెయిన్ ఎండ్) 10, నాలుగో విభాగం కింద బోరుబావుల రీచార్జ్ కోసం గ్రామపంచాయతీ, ప్రైవేటు బోర్ల వద్ద 42 ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి. సబ్సిడీ.. దేనికెంత..ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ప్రకటించింది. వీటిలో వ్యక్తిగత గుంతలకు ఒక్కోదానికి రూ.6వేలు, కమ్యూనిటీ వాటికి రూ.13వేలు, బోర్ వెల్ రీచార్జ్ గుంతలకు రూ.40వేలు, డ్రెయిన్ ఎండ్లో నిర్మించేవాటికి రూ.92వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. వీటితో పాటు ప్రతి గ్రామానికి కలెక్టర్ ప్రత్యేకంగా రూ.2లక్షల చొప్పున మంజూరు చేశారు. 608 ఇంకుడు గుంతలు పూర్తిజిల్లాకు అన్ని రకాల ఇంకుడుగుంతలు కలిపి జిల్లాకు 1,041 మంజూరయ్యాయి. కాగా వీటిని ఈనెల 20తేదీ వరకు పూర్తి చేయాలని ఎంపీడీఓల సమావేశంలో కలెక్టర్ గడువు విధించారు. కానీ ఈప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. నిర్దేశించిన గడువులోగా కేవలం 608 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 433 ఇంకుడు గుంతల పూర్తికావాల్సి ఉంది.ప్రయోజనాలు.. ఇంకుడు గుంతల నిర్మాణంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడడంతో పాటు మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. డ్రెయినేజీలలో నీరు నిల్వ ఉండదు. కాబదోమలు రావు. వర్షపు నీరు, ఇళ్లలో నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి.లక్ష్యం చేరని ఇంకుడు గుంతల నిర్మాణం ‘స్వచ్ఛభారత్’ కింద పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక 1,041 ఇంకుడు గుంతలు మంజూరు 20వ తేదీతో ముగిసిన డెడ్లైన్ ఇప్పటి వరకు 58.40శాతమే పూర్తిఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పాత సూర్యాపేట గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నాం. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు కృషిచేయాలి. – ఎం.డి.హాసిం, ఎంపీడీఓ, ఆత్మకూర్(ఎస్) -
మహిళపై దాడి.. ముగ్గురి అరెస్ట్
నూతనకల్: భూ తగాదాలు, పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని మహిళపై కత్తితో దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన లింగాల నానయ్య, లింగాల లింగమూర్తి మధ్య కొంతకాలంగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన లింగాల లింగమూర్తి భార్య రేణుకపై పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని లింగాల నానయ్య, అతడి భార్య లలిత, కుమారుడు ఏకస్వామి కత్తితో దాడి చేసి గాయపర్చారు. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ గావించారు. స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : చిన్న చిన్న ఘర్షణలకు కోర్టు మెట్లు ఎక్కకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీ శారద సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో 90రోజుల ప్రచారం–దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కోర్టుకు వెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వినియోగదారుల వివాదాలు, డబ్బు, ఆస్తి, సమాజ సంఘర్షణలు, వాణిజ్య, వైవాహిక, వినియోగదారుల వివాదాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలిసూర్యాపేట : ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని అదనపు కలెక్టర్ పర్స రాంబాబు సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడ కుడలో గంగదేవమ్మ గుడి ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హన్మంతరెడ్డి, మున్సిపల్ డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది యాదగిరి, వార్డ్ అధికారి రమేష్ వసుంధర, వసీం పాల్గొన్నారు. 25న ఉద్యోగమేళాభానుపురి (సూర్యాపేట) : ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్, హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హెచ్సీఎల్ ప్రతినిధి ఫోన్ నంబర్లు 8341405102, 7981834205, 9063564875లను సంప్రదించాలని సూచించారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలితిరుమలగిరి ( తుంగతుర్తి ): ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు కొత్తగట్టు మల్లయ్య, సీపీఐ జిల్లా నాయకుడు ఎల్లంల యాదగిరిలతో కలిసి డేవిడ్కుమార్ మాట్లాడారు. ఎస్సారెస్పీ రెండో దశ కింద సూర్యాపేట జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వాలన్నారు. రుద్రమ చెరువును రిజర్వాయర్ గా చేయాలని డిమాండ్ చేశారు. కాల్వలకు మరమ్మతులు చేపట్టి చెరువులు, కుంటలు నింపాలన్నారు. రైతులు నార్లు పోసుకొని నాటు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి తరుణంలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బొడ్డు శంకర్, కందుకూరి ప్రవీణ్, పోలేబోయిన కిరణ్, కె.సోమేశ్, బచ్చు విజయ్, సుధాకర్ పాల్గొన్నారు. -
కల్వర్టును ఢీకొని మంటల్లో కారు దగ్ధం
కోదాడరూరల్: కల్వర్టును ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రోళ్లపూడికి చెందిన జి. అనిల్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ పనిమీద మంగళవారం కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ.. మార్గమధ్యలో ఇద్దరి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణ శివారులోని కొమరబండ వై జంక్షన్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనిల్తో పాటు మరో ఇద్దరు ప్రయానికులు క్షేమంగా బయటపడ్డారు. అనిల్ కారును వెనక్కి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలుపెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్ మీట్–2025 నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9 జేఎన్వీల నుంచి 57మంది బాలురు, 39 మంది బాలికలు ఈ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని తెలిపారు. క్లస్టర్ లెవల్లో ఎంపికై న 25మంది బాలురు, 25మంది అమ్మాయిలు ఈ నెల 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
రెక్కీ చేసి.. పక్కా స్కెచ్ గీసి..
సూర్యాపేటటౌన్: ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ జరిగింది. 8 కిలోల బంగారం, ఆభరణాల తోపాటు రూ.18 లక్షల నగదును దొంగలు అపహరించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ రూ.7.20 కోట్లు ఉంటుందని యజమాని అంటున్నారు. సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పట్టణంలోని ఎంజీ రోడ్డులో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. కిషోర్ సోమవారం ఉదయం 9 గంటలకు దుకాణం తెరిచి లాకర్ గదిలోకి వెళ్లి చూడగా గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. లాకర్ రూంకు ఉన్న షట్టర్ కట్ చేసి ఉంది. దీంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.తెలిసినవారా.. ప్రొఫెషనల్ ముఠానా?దొంగలు పక్కా స్కెచ్తో బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం దుకాణం మెయిన్ రోడ్డుకు ఉంటుంది. దొంగలు షాపు వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నుంచి వచ్చి బాత్రూంలోకి వెళ్లి తలుపును కట్ చేసి అందులో నుంచి లాకర్ రూంలోకి వెళ్లారు. లాకర్ రూం షట్టర్ను గ్యాస్ కట్టర్తో తొలగించి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 8 కిలోల బంగారం, ఆభరణాలతోపాటు రూ.18 లక్షల నగదు అపహరించారు. ఈ చోరీని ప్రొఫెషనల్ దొంగల ముఠా చేసిందా లేక తెలిసిన వ్యక్తులే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా.. బాత్రూం నుంచి వెళితే లాకర్ గది వస్తుందని దొంగలకు ఎలా తెలుస్తుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాత్రూంలో నుంచి లోపలికి ప్రవేశించే ముందు అక్కడున్న జగ్గుతో సీసీ కెమెరాను మూసేశారు. లాకర్ గదిలోని రెండు బీరువాల్లో ఒక్కోదాంట్లో 8 కిలోల చొప్పున 16 కిలోల బంగారం ఉండగా.. ఒక బీరువాలోని 8 కిలోల బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్, రెండు సిలిండర్లను అక్కడే వదిలేశారు. సిలిండర్పై ఉన్న నంబర్ ఆధారంగా దాన్ని కోదాడలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు వెనకాల ఖాళీ స్థలంలో రెండు తులాల రింగ్, చెవి దుద్దులు పడిపోగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.మూడు రోజులుగా రెక్కీముగ్గురు వ్యక్తులు మూడు రోజుల క్రితం దుకాణం పక్క సందులో ఉన్న బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో రూంను అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు బంగారు షాపులో దొంగతనం చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆదివారం రాత్రి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు రెండు గ్యాస్ సిలిండర్లు, కట్టర్ పట్టుకొని బాలాజీ గ్రాండ్ హోటల్ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడ ఆధారాలను సేకరించాయి. దొంగలు ఆదివారం రాత్రి 12.09 గంటలకు షాపులోపలికి వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. బంగారు షాపును సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం పరిశీలించారు. కేసును ఛేదించడానికి ఐదు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.సెక్యూరిటీ ఎందుకు లేదు..బంగారు షాపు యజమాని అంత పెద్ద మొత్తంలో షాపులో బంగారాన్ని పెట్టి కనీసం సెక్యూరిటీ గార్డ్ను కూడా పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. లాకర్కు అలారం సిస్టం కూడా ఏర్పాటు చేసుకోలేదు. జ్యువెలరీ షాపు యజమాని కిషోర్ అక్కడికి సమీపంలో మరో దుకాణాన్ని ఏర్పాటుచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగానే పెద్దమొత్తంలో బంగారం, ఆభరణాలు తీసుకొచ్చి ప్రస్తుత షాపులో పెట్టాడని అంటున్నారు. -
కొండగడప విద్యార్థినికి ప్రశంసలు
మోత్కూరు: మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని దొండ స్వాతి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వాతి విద్యార్థి దశనుంచే రచనలు, వ్యాసాలు రాస్తూ పేరుగడించారు. ఆమె రాసిన వ్యాసం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ సూర్య ధనుంజయ్, సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్, నలిమిల భాస్కర్, ఆట్టం దత్తయ్య వ్యాసాల సరసన చోటు దక్కడంతో ఆమెకు సత్కరించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు స్వాతిని సన్మానించారు. దరఖాస్తుల ఆహ్వానం ఆలేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ జయరాజారామ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లిష్, తెలుగు, డెయిరీ సైన్స్ సబ్జెక్టులకు గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం, ఇతరులు 55శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 3గంటల వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని సూచించారు. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: ఎదరుగా వస్తున్న డీసీఎంను తప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ అటవీ ప్రాంతంలోని కడిలబావితండాలో సోమవారం జరిగింది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపుల్పహాడ్ గ్రామానికి చెందిన దండుగుల రంజిత్ (32) కంప్రెషర్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కంప్రెషర్ పని నిమిత్తం ట్రాక్టర్ను తీసుకొని సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి వెళ్తుండగా.. రాచకొండ ప్రాంతంలో కడీలబావితండా పరిధిలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ తెలిపారు రంజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోరు బండి పైనుంచి పడి.. రామగిరి(నల్లగొండ): బోరు బండి పైనుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నల్ల గొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలా స్లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన అనిల్ కకాడియా బోర్ బండి మీద కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విలాస్లో బోర్ వేసిన అనంతరం ఒంటిపై ఉన్న దుమ్మును శుభ్రం చేసుకునే క్రమంలో విశాల్ వర్కాడే అనే వ్యక్తి ఎయిర్ పైపును అనిల్ కకాడియా వెనుక నుంచి పెట్టగా అతడు ప్రమాదవశాత్తు బోర్ బండి పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అనిల్ కకాడియాను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్ను వార్కడే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. -
వలస కార్మికులకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి
చందంపేట: వారంతా అమాయక కూలీలు.. కూలీ నాలి చేసుకుంటూ రోజు గడిపే వారు. వారికి పనులు కల్పిస్తామంటూ కొందరు మాయమాటలతో నమ్మించి.. వారి శ్రమను వాడుకుంటూ.. వేతనాలు ఇవ్వడం లేదు. తిరిగి సొంతూరికి కూడా వెళ్లన్వికుండా దాడులు చేస్తూ.. కనీసం వారి కుటుంబీకులతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వ లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ శ్రమదోపిడీ దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో స్పెషల్ కార్డన్ సెర్చ్ చేపట్టగా శ్రమ దోపిడీతో రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్న వలస కార్మికులకు విముక్తి లభించింది. అయితే కొందరికి మాత్రమే విముక్తి లభించగా.. మరికొందరి కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండేళ్లుగా గుట్టుగా.. నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీలో చేపల వేట నిర్వహిస్తున్న పలువురు మత్స్యకారులు ఈ ప్రాంతంలో పనులు చేసేందుకు గాను ఒడిషా, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన వారిని సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసి వారితో పనులు చేయించుకుంటున్నారు. చేపలు పట్టేందుకు వీరితో పనులు చేయించుకుంటూ వారికి వేతనం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేవలం అన్నం మాత్రమే పెట్టి వెట్టి చేయించుకున్నారు. రెండేళ్లుగా ఇలా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. తిరిగి వెళ్లనివ్వకుండా.. వైజాగ్కాలనీలో పనిచేసే వలస కార్మికులు తిరిగి వారి సొంత ప్రాంతానికి వెళ్లే మార్గం చూపించకుండా.. సాగర్ వెనుక జలాల్లో అటవీ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసి వారిని అక్కడే ఉంచి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడనివ్వకుండా బలవంతంగా పనులు చేయించి హింసించారు. డబ్బులు అడిగితే వారిపై దాడులకు పాల్పడ్డారు. పోలీసుల దాడులతో బట్టబయలు వలస కార్మికుల వెట్టి చాకిరీ విషయం దేవరకొండ పోలీసుల దృష్టికి రావడంతో ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో ఆది, సోమవారం ఆ ప్రాంతాలను గుర్తించి, 30 మంది వలస కార్మికులను దేవరకొండకు తరలించారు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వంద మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం ఉండడం.. కొంత మంది మాత్రమే దొరకడంతో మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఓ కార్మికుడి అంత్యక్రియలూ ఇక్కడే.. నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన కార్మికుడు తన స్వగ్రామానికి వెళ్తానని తనను ఇక్కడికి తీసుకొచ్చిన వారిని అడిగాడు. వారికి తెలియకుండా తన స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నంలో పెద్దమునిగల్ గ్రామ అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. అతని మృతదేహాన్ని కనీసం స్వగ్రామానికి కూడా పంపకుండా.. వైజాగ్ కాలనీలోనే అంత్యక్రియలు నిర్వహించారు.ఫ సాగర్ బ్యాక్ వాటర్ అటవీ ప్రాంతంలోని స్థావరంలో బందీలుగా ఇతర రాష్ట్రాల కార్మికులు ఫ వారి చేత చేపలు పట్టే పనులు చేయిస్తూ.. వేతనాలు ఇవ్వని వైనం ఫ సొంతూరికి వెళ్లలేక.. వేతనాలు లేక చితికిపోయిన కార్మికులు ఫ పోలీసుల తనిఖీతో బయటపడ్డ కార్మికులు -
రూ.20కే రూ. 2లక్షల బీమా
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ.20 కట్టడం ద్వారా రూ.2లక్షల బీమా పొందవచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ బీమాకు అర్హులు. అయితే ఇందు కోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉంటే.. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఆ ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. ఎన్ఆర్ఐలు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. కానీ క్లెయిమ్ మాత్రం లబ్ధిదారుడికి లేదా నామినీకి భారత కరెన్సీలో చెల్లిస్తారు. ప్రీమియం ఎంత చెల్లించాలి అంటే..పీఎంఎస్బీవై పథకంలో వార్షిక ప్రీమియంగా కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ తర్వాత ఆటోమెటిక్గా బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియంను కట్ చేస్తారు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లయితే.. క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు అకౌంట్కు మాత్రమే బీమా చెల్లిస్తారు. అంటే ఇతర బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించిన ప్రీమియాన్ని కోల్పోవాయినట్లే అవుతుంది. బీమా క్లెయిమ్ చేస్తే ప్రీమియం మారుతూ ఉంటుంది. ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మొదటి మూడేళ్లలో ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. బ్యాంకులు ఈ పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్లు జారీ చేయవు. బీమా వర్తించే సందర్భాలు..సహజ విపత్తుల వల్ల జరిగిన ప్రమాదాల వల్ల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, మరణాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించాలి. అప్పుడు మాత్రమే పీఎంఎస్బీవై పథకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం లాంటి మరణాలు సంభవిస్తే.. వాటిని పోలీసుల ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టుపై నుంచి కిందపడి చనిపోతే.. ఆ మరణాలను వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు చందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణించిన వారి తరఫు క్లెయిమ్లు నామినీ, చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో భవిష్యత్తుకు భరోసానిస్తున్న కేంద్ర ప్రభుత్వంలబ్ధి పొందేది ఇలా..ఈ బీమా పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా బాధిత కుటుంబానికి లేదా నామినీకి రూ.2,00,000 అందిస్తారు. ఒక వేళ పాలసీదారుడు పాక్షిక వైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా లేదా రెండు చేతులు లేదా కాళ్లు కోల్పోయినా.. దానిని శాశ్వత వైకల్యంగా గుర్తించి రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి, ఒక కంటి చూపు కోల్పోతే మాత్రం దానిని పాక్షిక వైకల్యంగా గుర్తించి రూ.లక్ష రూపాయలు పరిహారంగా ఇస్తారు. -
గరుడ టికెట్తో శీఘ్ర దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా ఆలయాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ రూ.300 టికెట్తో బ్రేక్ దర్శనం పేరిట ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. ఇదే మాదిరిగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని అంతరాలయంలో దర్శించుకునే విధంగా గరుడ టికెట్ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవాణి ట్రస్టు తరహాలో..తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తులకు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10,500 టికెట్ను అందిస్తున్నారు. ఇదే తరహాలో యాదగిరిగుట్టలో సైతం ఒక్కో భక్తుడికి రూ.5,000తో గరుడ టికెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, విదేశీయులతో పాటు సామాన్య భక్తులు సైతం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చునేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ గరుడ టికెట్ను ప్రవేశపెడితే తొందరగా, సులవుగా దర్శనం కావడంతో పాటు దేవాలయానికి ఆదాయం సైతం పెరగనుంది. ఈ టికెట్ కొనుగోలు చేసే భక్తులకు 5 అభిషేకం లడ్డూలు, కిలో పులిహోర ప్రసాదాన్ని సైతం అందజేయనున్నారు. అంతేకాకుండా ఆశీర్వచనం సైతం చేయనున్నారు. గరుడ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఉదయం ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా అంతరాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీవాణి ట్రస్టు తరహాలో యాదగిరిగుట్టలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ఒక్కో టికెట్ ధర రూ.5వేలువ్రత టికెట్ల ధర పెంపు..యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతం జరిపించేందుకు గాను ప్రస్తుతం టికెట్ ధర రూ.800 ఉండగా.. దానిని రూ.1,000కి పెంచుతూ ఆలయ ఈఓ వెంకట్రావ్ ఇటీవల నిర్ణయించారు. ఈ రూ.1000 టికెట్ కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం సత్యనారాయణ వ్రతం జరిపించడానికి ఆలయం తరఫున భక్తులకు అందజేస్తున్న వ్రత సామగ్రితో పాటు స్వామివారి ప్రతిమ, శెల్లా, కనుమను అదనంగా ఇవ్వనున్నారు. ప్రతి రోజు వ్రత మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు బ్యాచ్ల్లో 350 నుంచి 450 వ్రతాలు జరుగుతాయి. ఆదివారాలు, సెలవు రోజుల్లో మరో 100 వ్రతాలు అదనం. ప్రస్తుతం రూ.800 టిక్కెట్తో రోజుకు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుండగా.. రూ.1000కి ధర పెంచడంతో అదనంగా మరో రూ.90వేలు రోజుకు ఆదాయం అదనంగా రానుంది. -
ఉచితాలతో ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం
నల్లగొండ: ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదన్నారు. ప్రజలు ఉచితాల పథకాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దేశంలో వ్యవసాయమే ప్రధానమైందని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పని వైపు ప్రజలను మళ్లించి ఉచితాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి ఖర్చే అవినీతికి మూలం దేశంలో అవినీతి పేరుకుపోయిందనే వాదన ఉంది. ఎన్నికల్లో విచ్చలవిడిగా పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. ఆ తర్వాత ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించడానికి అవినీతికి పాల్పడుతున్నారు. దీనిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ చొరవచూపాలి. రాజకీయ నాయకులే కాదు.. కొందరు అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఇంజనీరింగ్ శాఖలో ఇష్టమొచ్చినట్లు ఎస్టిమేట్ వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. నాయకుల భాష మారాలి రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు వాడే భాషతో భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఆలోచించాలి. రాజకీయ నాయకులంటే ఇప్పటికే ప్రజలు ఈసడించుకుంటున్నారు. రాజకీయ నాయకులు గౌరవంగా మాట్లాడాలి. బనకచర్లను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ప్రకారమే చేసుకోవాలి. ఎమ్మెల్సీలు మల్లన్న, కవిత ఫిర్యాదులపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారన్నారు. పెద్దల సభను గౌరవించాల్సిన అవసరం అందరికి ఉంది. దూషణలు, దాడులు సరికావన్నారు. సాగర్ ఎడమ కాల్వకు ముందే నీటి విడుదల చేయడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు అధికార, ప్రతిపక్షాలు వాడే భాష మార్చుకోవాలి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగానితండాకు చెందిన లాకవత్ రవీందర్ బతుకుదెరువు కొరకు హైదరాబాద్కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్లోని అన్నోజిగూడలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్లోనే ఓ హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మనస్తాపంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యచింతపల్లి: భూ వివాదంలో అవతలి వ్యక్తులు అనే మాటలకు మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింతపల్లి మండలం వింజమూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దవారిగూడెంలో సోమవారం జరిగింది. చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి చంద్రయ్య(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా చంద్రయ్య కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి మధ్య పొలం పంచాయితీ జరుగుతుండగా.. ఆ వ్యక్తి అనే మాటలకు మనస్తాపం చెందిన చంద్రయ్య సోమవారం తన వ్యవసాయ పొలం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పాముకాటుతో గొర్రెల కాపరి మృతినడిగూడెం: పాముకాటుకు గురై గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ జి. అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా ఇడ్లీరు గ్రామానికి చెందిన సిద్ద నగేష్ (28) గొర్రెలను మేపుకుంటూ నడిగూడెం మండలానికి వలస వచ్చాడు. గత రెండు రోజులుగా నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన శేషగుప్తా వ్యవసాయ క్షేత్రంలో పెంట కోసం గొర్రెలను ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున గొర్రెల వద్ద నిద్రిస్తున్న నగేష్ను పాము కాటు వేసింది. అతడిని కోదాడకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామి, అమ్మవారిని అర్చకులు సోమవారం గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్శర్మ, సీతారామాచార్యులు, చీకూరిరాజేష్ పాల్గొన్నారు. -
ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు
నాగారం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు అందడంలేదు. టీఏ(టెక్నికల్ అసిస్టెంట్లు), ఎఫ్ఏ( ఫీల్ట్ అసిస్టెంట్ల)కు మూడు నెలలుగా, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, ఏపీఓలకు రెండు నెలలుగా జీతాలు రావడంలేదు. గ్రామాల్లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వీరికి నెలల తరబడి వేతనాలు రాక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది విధులు..గ్రామసభలో గుర్తించిన వివిధ రకాల పనులు, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేయించాలి. కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, క్షేత్రస్థాయి సిబ్బంది, సీనియర్ మేట్లకు అప్పగించాలి. గ్రామాల్లో మేట్లు ఇచ్చిన కొలతలు సరిగా ఉన్నాయా, లేవా ప్రతి వారం తనిఖీ చేయాలి. చెక్ మెజర్మెంట్ను జూనియర్ ఇంజనీర్కు సమర్పించాలి. వారం చివరలో పనుల కొలతలు మస్టర్లలో, ఎంబీలలో నమోదు చేసి ఇంజనీర్ కన్సల్టెన్సీకి నివేదించాలి. తదుపరి ఆ రికార్డులను అదనపు కార్యక్రమం అధికారుల ద్వారా పరిశీలించి చెల్లింపులు చేయడానికి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఫీల్ట్ అసిస్టెంట్లు గ్రామాల్లో గుర్తించిన పనులను నిర్దేశించిన పని దినాల లక్ష్యం మేరకు ఉపాధి కూలీలతో చేయించాలి. మస్టర్లలో కూలీల హాజరుకు తోడు సెల్ఫోన్లో ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండు సార్లు ఫొటో తీసుకోవడం, హాజరు ఆన్లైన్లో నమోదు చేయడం, కొలతల ప్రకారం పనులు చేయించడం, జాబ్ కార్డు నిర్వహణ, నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం, వనమహోత్సవాలు, ఆత్మీయ భరోసా పనులు నిర్వహించాలి. వారంలో ఒక రోజు మండల కేంద్రాల్లో నిర్వహించే సమీక్షలకు హాజరై పనుల వివరాలు అధికారులకు అందించాలి. కుటుంబ పోషణకు ఇబ్బందులుటెక్నికల్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి నెలకు వారి సర్వీసును బట్టి సుమారు రూ.20 వేల నుంచి రూ. 45వేలు, ఫీల్ట్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.12,140 నుంచి రూ.11,500ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే వీరికి ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు అందలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, ఏపీఓలకు మే, జూన్ నెలల జీతాలు రాలేదు. దీంతో వీరంతా కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఏ, ఎఫ్ఏలకు మూడు నెలలుగా రాని జీతాలు మిగతా సిబ్బందికి రెండు నెలలుగా.. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులుపని భారం తీవ్రంగా ఉంది ప్రస్తుతం మాకు ప్రభుత్వం నెలకు రూ.12,140 చొప్పున చెల్లిస్తుంది. దీంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో పనిభారం తీవ్రంగా ఉంది. ఒక్కో గ్రామంలో మూడు నాలుగు చోట్ల పనులు జరుగుతున్నప్పుడు వాటిని వెళ్లి పరిశీలించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. – ఎం.అంజయ్య, ఫీల్డ్అసిస్టెంట్, పస్తాలవేతనాలు విడుదల చేయాలి ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికితోడు మూడు నెలల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పెండింగ్ జీతాలు విడుదల చేసి, పే–స్కేల్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – పి.రవి, ఏపీఓ, నాగారం -
మూసీ ప్రాజెక్టుకు జలకళ
వరద నీటితో కళకళలాడుతున్న మూసీ రిజర్వాయర్కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. మూసీ ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం సాయంత్రం మూసీ ప్రాజెక్టుకు 880 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 2443 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో రావటం ఈ ఏడాది ఇదే మొదటిసారి. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 530 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 642.50 అడుగులకు (3.73 టీఎంసీలు) చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో మరో రెండు అడుగుల నీరు చేరితే గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని పేర్కొంటున్నారు. -
ఆయకట్టులో అదునుదాటుతోంది!
మిర్యాలగూడ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతులు పరిస్థితి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ సీజన్లో ముందస్తుగానే కృషానదికి వరద వచ్చింది. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి.. సాగర్కు వరద వస్తుండడంతో ముందస్తుగానే సాగునీరు విడుదలవుతుందని ఆశించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెలలోనే సాగునీరు విడుదలవుతుందని ఆశించి ఆయకట్టులో కాస్త ఆధారం ఉన్న రైతులు నార్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు, బావులు లేని రైతులు నీరు విడుదల చేశాక నారు పోసుకుని.. నాట్లు వేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కానీ సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అదును దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. పాలేరుకు వెళ్తున్న జలాలు నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లా అవసరాలకు కాకుండా ఖమ్మం జిల్లా అవసరాలను తీరుస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి. కానీ ఇక్కడ చెరువులను వదిలేసి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్లో నీటిని నింపారు. రెండు రోజుల నుంచి మళ్లీ పాలేరుకు రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కానీ ఇక్కడి మేజర్లకు ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో చెప్పడం లేదు. సాగునీటి కోసం ఎదురుచూపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని రైతులకు ఎడమకాల్వ నీరే ఆధారం. బావులు, బోర్లు ఉన్నా.. కాల్వలో నీరు పారితేనే భూగర్భ జలాలు పెరిగి పంటలు పండుతాయి. కానీ ఆయకట్టులో ఈసారి వర్షాలు కూడా సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రైతులంతా కాల్వలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. కండ్ల ముందు నుంచే పాలేరుకు నీళ్లు పోతున్నా తమ పొలాలకు నీరు పారించుకునే పరిస్థితి లేకుండాపోతోందని ఆవేదన చెందుతున్నారు. సాగర్కు వరద వస్తున్న ఈ తరుణంలో మేజర్ల ద్వారా నీటి విడుదల చేయాల్సి ఉన్నా.. తూములన్నీ బంద్చేసి నేరుగా ఖమ్మం జిల్లాకే నీరు తరలించుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి మేజర్లకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.ఫ సాగునీటి కోసం సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతుల ఎదురుచూపు ఫ మేజర్లకు నీటి విడుదలపై స్పష్టత కరువు సాగు, తాగు నీటి అవసరాలకు పాలేరుకు విడుదల చేస్తున్నాం : ఈఈ నీటి విడుదల విషయమై ఎన్ఎస్పీ ఈఈ వెంకటయ్యను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశానుసారం సాగు, తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాలోని పాలేరుకు నీటిని తరలిస్తున్నామని తెలిపారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేస్తున్నామని.. ప్రాజెక్టుకు వరదనీరు వచ్చినా కొద్ది పాలేరుకు నీటి విడుదల పెంచుతామని పేర్కొన్నారు. ఎడమకాల్వకు సాగునీటి విషయంపై ప్రశ్నించగా ఆయకట్టు రైతులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. మేజర్లు, మైనర్లు షట్టర్లు బంద్ చేశారు కదా అని అడగగా అది వాస్తవమేనని సమాధానం దాటవేశారు. -
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.పీఈటీఏ టీఎస్ జిల్లా కార్యవర్గం ఎన్నికసూర్యాపేట : వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ స్టేట్(పీఈటీఏ టీఎస్) జిల్లా కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతుంది. సంఘం జిల్లా అధ్యక్షుడిగా అయితగోని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం రంగారావు, కోశాధికారిగా సన్నీళ్ల యాదయ్య, మహిళా ఉపాధ్యక్షురాలిగా పార్వతి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రయ్య , అబ్జర్వర్లుగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శక్రు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ రత్నం వ్యవహరించారు. నృసింహుడికి లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట: ఏకాదశి సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి, అర్చకులు వేదమంత్రాలతో శ్రీస్వామివారిని కొలుస్తూ తులసీ దళాలతో లక్ష పుష్పార్చన చేశారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, వెండి జోడుసేవ ఊరేగింపు తదితర వేడుకలతో ఆలయం సందడిగా మారింది. -
‘దొడ్డా’ జీవితం ఆదర్శం
చిలుకూరు: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దివంగత దొడ్డా నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం వద్ద ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు ఆధ్యక్షతన నిర్వహించిన దొడ్డా నారాయణరావు సంతాప సభలో కూనంనేని పాల్గొని మాట్లాడారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మద్యపాన నిషేధ ఉద్యమం వరకు పోరాటంసాగించిన మహోన్నత వ్యక్తి దొడ్డా అని కొనియాడారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దొడ్డా నారాయణరావు మరణం సీపీఐకి తీరనిలోటు అని అన్నారు. క్రమ శిక్షణ గల నాయకుడిగా మంచి పేరు సంపాదించారన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ దొడ్డా నారాయణరావు ఆశయ సాధనకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం తన తుది శ్వాస వరకు పోరాడినయోధుడు దొడ్డా నారాయణరావు అని పేర్కొన్నారు. ముందుగా నారాయణరావు ప్రతిమతో ఉన్న శిలాఫలకాన్ని కూనంనేని , చాడ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, బొల్లం మల్లయ్య యాదవ్, సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు, గన్నా చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పార్టీ కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, దండు సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, సీపీఐ మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు -
ఉలిక్కిపడ్డ భానుపురి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. దొంగలు జ్యువెలరీ షాపునకు కన్నం వేసి 8కిలోల బంగారం చోరీచేయడంతో బంగారం షాపు నిర్వాహకులతో పాటు పట్టణంలో ఇతర వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్డు అయిన ఎంజీ రోడ్డులోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇంత పెద్ద దొంగతనం జరగలేదు. 2011లో సూర్యాపేటలోని పూల సెంటర్ రోడ్డులో ఓ బంగారం షాపులో కిలో బంగారాన్ని అప్పట్లో దొంగలు ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి అంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరగలేదు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏకంగా ఎనిమిది కిలోల బంగారం చోరీకి గురికావడం కలకలం సృష్టించింది. భారీ దొంగతనం కేసు పోలీసులకు సవాల్గా మారింది. జిల్లా కేంద్రంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో సైతం పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త షాపు పెట్టేందుకు ఎక్కువ మొత్తంలో కొనుగోలుసూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పదమూడు సంవత్సరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. మొదటగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో బంగారం షాపు నిర్వహిస్తుండగా ఆ తర్వాత ఐదేళ్ల క్రితం షాపును ఎంజీ రోడ్డుకు మార్చాడు. ఎక్కువగా ముంబై, హైదరాబాద్ నుంచి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల మరో బంగారం షాపు పెట్టేందుకు భారీగా బంగారం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ బంగారాన్ని షాపులోని లాకర్ రూంలో గల అల్మారాలో భద్రపరిచాడు. ప్రస్తుతం శ్రీసాయి జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్న మడిగె అద్దెకు తీసుకున్నది. తాను సొంతంగా కొత్తగా భవనాన్ని నిర్మించాడు. వచ్చే నెలలో ఈ షాపును తన సొంత భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొత్త షాపులో పెట్టేందుకు సుమారు 16కిలోలకు పైగా బంగారం కొనుగోలు చేసినట్టు వ్యాపారి కిషోర్ చెబుతున్నాడు. కొనుగోలు చేసిన రెండు వారాలకే చోరీ..షాపు నిర్వాహకుడు కిషోర్ అధిక మొత్తంలో బంగాారం కొనుగోలు చేసి తీసుకువచ్చి షాపులో పెట్టిన రెండు వారాలకే దొంగతనం జరగడం గమనార్హం. ఇది తెలిసిన వారి పనేనా అనే అనుమానం కలుగుతోంది. పది రోజుల క్రితమే లాకర్ మార్పు..ఇంతకాలం నడిపించిన షాపులో ఉన్న లాకర్ను పది రోజుల క్రితమే తన సొంత భవనంలో మార్చాడు. అయితే ఆ షాపు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన బంగారాన్ని షాపులోని లాకర్ గదిలో అల్మారాలను ఏర్పాటు చేసుకొని ఆ గదికి షెట్టర్ చేయించాడు. మరో పది రోజుల్లో షాపు మార్చాక బంగారం తీసుకెళ్లొచ్చనే భావనతో యజమాని ఉన్నాడు. ఇంతలోనే చోరీ జరగడంతో లబోదిబోమంటున్నాడు. బంగారం 16కిలోలకు పైగా ఉండగా అందులో ఎనిమిది కిలోల బంగారం, రూ.18లక్షల నగదును మాత్రమే ఎత్తుకెళ్లారు. వెండిని ముట్టుకోలేదు. అలాగే షాపులో నుంచి లాకర్ గదికి వచ్చే డోర్ను వెనుకాల నుంచి గడియ పెట్టి పరారయ్యారు. సూర్యాపేటలో జ్యువెలరీషాపును కొల్లగొట్టిన దుండగులు కోట్లు విలువ చేసే బంగారం అపహరణ విషయం తెలియడంతో వ్యాపారుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్దదొంగతనం ఇదే.. చర్చనీయాంశంగా మారిన భారీ చోరీ -
బాత్రూం గోడకు రంధ్రం చేసి.. 18 కేజీల బంగారం చోరీ
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో భారీ చోరీ కలకలం రేగింది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాత్రూమ్ గోడకు రంధ్రం చేసి మరీ లోపలికి ప్రవేశించి 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దుకాణం వెనుక నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు దొంగలను పట్టుకునేందుకు ఐదు బృందాల ఏర్పాటు చేశామని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
నిరంతరం.. నిఘా!
పారదర్శకత కోసమే సీసీ కెమెరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తరగతుల నిర్వహణలో పారదర్శకత కోసమే ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. రోజు వారీగా కళాశాలలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అధ్యాపకులు బోధన ఎలా చేస్తున్నారు. అనే విషయాలపై నిఘా ఉంటుంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉండే కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. దీంతో హాజరు శాతం, బోధన మెరుగుపడనుంది. – భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట హుజూర్నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై నిరంతరం నిఘా పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళాశాలల్లో ఏటా విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. రోజువారీగా విద్యార్థులు తక్కువగా వస్తున్నా అధ్యాపకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఫలితంగా ప్రైవేట్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు వెనుకబడుతున్నాయి. దీంతో విద్యార్థులు హాజరు, ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు క్షణాల్లో తెలిసేలా.. ఇప్పటి వరకు ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల్లో నిర్వహణ సజావుగా సాగేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేవారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కళాశాలలో నిరంతరం ఇవి ఉండేలా చర్యలు ప్రారంభించారు. ప్రతి విద్యార్థితోపాటు ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఏమి చేస్తున్నారో కూడా ఇంటర్మీడియట్ అధికారులకు క్షణాల్లో తెలిసేలా సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. కళాశాలల్లో ప్రతి తరగతి గది, వరండాలు, ప్రయోగశాల, ఆరుబయట తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. తరగతి గదులకు అనుగుణంగా 12 నుంచి 14 కెమెరాలను అమర్చనున్నారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గినా ఇంటర్ బోర్డుకు ఇట్టే తెలిసిపోనుంది. మొత్తం విద్యార్థులు 3,003 మంది జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి మొత్తం ఎనిమిది జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 3,003 విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం 1,559 మంది ఉండగా రెండో సంవత్సరంలో 1,444 మంది విద్యార్థులు చదువుతున్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా పర్యవేక్షణ కళాశాలల్లో రోజు వారీ విద్యార్థుల హాజరు, బోధన తీరు, కళాశాలల నిర్వహణ తదితర అంశాలను బో ర్డు అధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రిన్సిపాల్ హోదా కలిగిన అధికారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కళాశాలలను పరిశీలిస్తారు. దీంతో ప్రతి సమాచారం బోర్డు అధికారులకు తక్షణం తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఇంటర్ బోర్డు నుంచి సంబంధిత ప్రిన్సిపాళ్లకు సమాచారం వస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఫ విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు ఫ అధ్యాపకుల పనితీరుపైనా దృష్టి ఫ పారదర్శకత కోసమే ఏర్పాటు చేస్తున్న ఇంటర్ బోర్డు -
గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జి డి.నరసింహాచార్యులు అన్నా రు. గ్రీన్వాక్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెంలో ఆదివారం నిర్వహించిన చేతి సంచుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ ప్రతిఒ క్కరూ ప్రకృతిని గౌరవిస్తూ గాలి, నీరు ఆహారాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు. పనస వసంత్ సహకారంతో ఇంటింటికి చేతి సంచులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సలహాదారులు జె.శశిధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, కార్యవర్గ సభ్యులు గుండా కిరణ్,తల్లాడ రామచంద్రయ్య, సోమా హేమమాలిని, బహురోజు ఉపేంద్రచారి, రావిరాల సురేందర్, కొత్త మల్లికార్జున్, నెల్లుట్ల వెంకట్, విజయలక్ష్మి, డాక్టర్ అలేఖ్య, తోట స్వాతి, టీచర్లు నిర్మల, విజయ పాల్గొన్నారు. -
వ్యవసాయ కళాశాలకు భూమి కావాలి
ఎకరాకు రూ.20 లక్షలు కోదాడ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేదా అసైన్డ్ భూమి వంద ఎకరాలు లభ్యమైతే అక్కడ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. నీటి వసతితో పాటు రవాణా సౌకర్యాలుంటే సదరు భూమి ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం ఇప్పిస్తామని ఆయన వారికి పంపిన సమాచారంలో పేర్కొన్నారు. కానీ కోదాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎకరా భూమి రూ.30 లక్షలకు పైగా ఉందని అంతకంటే తక్కువ రేటు చెల్లిస్తే భూమి లభ్యం కావడం కష్టమని అంటున్నారు. సర్వే నంబర్ 190 ప్రభుత్వ భూమి కావాల్సినంత ఉన్నందున అసైన్డ్ భూములకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చి భూములను తీసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. కోదాడ: మూడు నెలల క్రితం ఉగాది పండుగ రోజు హుజూర్నగర్ నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి కళాశాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికి అది ముందుకు సాగడం లేదు. కళాశాల ఏర్పాటుకు నీటి సౌకర్యంతో పాటు సాగుకు యోగ్యంగా ఉన్న 100 ఎకరాల భూమి అవసరమవుతుంది. గడిచిన మూడు నెలలుగా అధికారులు హుజూర్నగర్ నియోజవకవర్గంలో భూమి కోసం జల్లెడ పడుతున్నారు. కానీ ఎక్కడా అనువైన వంద ఎకరాల భూమి లభ్యం కాలేదు. దీంతో ఈ కళాశాల ఏర్పాటుకు కోదాడ నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ భావించి వంద ఎకరాల ప్రభుత్వ లేదా ప్రైవేట్ భూమి అందుబాటులో ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు చెప్పాలని రెండు రోజుల క్రితం కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక నాయకులు భూమి ఎక్కడ ఉందోనని ఆరా తీయడం మొదలు పెట్టారు సర్వే నంబర్ 190లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి కోదాడ నియోజకవర్గంలోని మునగాల, నడిగూడెం మండలాల్లోని ముకుందాపురం, ఆకుపాముల, కోదండరామాపురం, తెల్లబెల్లి, ఎక్లాస్గాని పేట, రామాపురం గ్రామల పరిధిలో సర్వే నంబర్ 190లో దాదాపు 2వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని పలువురు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. కొందరికి ప్రభుత్వం పట్టాలను కూడి ఇచ్చింది. ఈ సర్వే నంబర్ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రవాణా సౌకర్యానికి ఇబ్బంది ఉండదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు వంద ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి సులువుగా లభ్యం అవుతుందని, దీనికి సమీపంలోనే సాగర్ ఎడమ కాలువు వెళుతుండడంతో పాటు ఇప్పటికే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి వసతి ఉన్నందున ఇక్కడ కళాశాల ఏర్పాటును మంత్రి పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. ఫ వంద ఎకరాల భూమి ఉంటే చెప్పండి ఫ కోదాడ నాయకులను కోరిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ మునగాల, నడిగూడెం మండలాల పరిధిలోని భూములను పరిశీలించాలంటున్న విద్యావేత్తలు ఫ నేషనల్ హైవే సమీపంలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ! -
మూసీకి 866 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్ఫ్లో పెరిగింది. శనివారం సాయంత్రం మూసీ రిజర్వాయర్కు 243 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో ఆదివారానికి 866 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెకు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 641.50 అడుగులకు చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పేర్కున్నారు. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 231 క్యూసెక్కుల చొప్పున మొత్తం 462 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ప్రజావాణి లేదు
భానుపురి (సూర్యాపేట) : బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినందున సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్కు రావొద్దని కోరారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలితిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రైవేట్ టీచర్లుకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్కుమార్ రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు జె.నర్సింహారావు, మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బండారి కిరణ్, కోశాధికారి ధరావత్ భిక్షం, గౌరవ అధ్యక్షుడు పాలబిందెల శేఖర్, సహాయ కార్యదర్శి జి.వెంకన్న, బి.భిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేడు ‘దొడ్డా’ సంతాప సభచిలుకూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారా యణరావు సంతాప సభ సోమవారం చిలుకూరులోని జరగనుందని సీపీఐ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నారాయణరావు శిలాఫలకాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదా డ ఎమ్మెల్యే పద్మావతి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంశివరావు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంరామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకనామిక్స్ 1, కామర్స్ 2, బాటనీ 1, మైక్రోబయాలజీ 1, జువాలజీ 3, ఫిజిక్స్ 3, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ 6, హిందీ 1, తెలుగు 4, హిస్టరీ (ఉర్దూ) 1, పోలిటికల్ సైన్స్ (ఉర్దూ) 1 సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉండాలని తెలిపారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, ఈ నెల 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 98490 00244, 94409 12000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యారాధనలు, భక్తజనులతో ఆదివారం యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. అదే విధంగా ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు. -
నిధులొచ్చాయ్..
త్వరలో పనులు ప్రారంభిస్తాం పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలకు ఉపాధిహామీ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో స్థలాలను సైతం గుర్తించారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. – వి.వి. అప్పారావు, డీఆర్డీఓ నాగారం : గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూరునున్నాయి. ఆయా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. 20 పంచాయతీ భవనాలు, 19 అంగన్వాడీ కేంద్రాలకు కలిపి రూ. 6.28 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే స్థలాలను గుర్తించే ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులకు శ్రీకారం చుట్టడానికి చర్యలు తీసుకోనున్నారు. రూ.6.28 కోటు విడుదల.. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 20 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.4 కోట్లు, 19 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు రూ. 2.28 కోట్లు మొత్తం కలిపి 32 భవనాలకు రూ.6.28 కోట్ల నిధులు ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యాయి. వీటిలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున, అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ప్రత్యేక గదులు, ఒక హాల్ తోపాటు మరుగుదొడ్డి, అంగన్వాడీ కేంద్రానికి ఒక గది, కిచెన్, మరుగుదొడ్డి నిర్మించనున్నారు. నేతలు చొరవ చూపాలి.. భవనాల నిర్మాణానికి అధికారులు, నేతలు చొరవ చూపితేనే పనులు ముందుకు సాగే అవకాశముంది. స్థలాలు గుర్తించి నిర్మాణానికి స్థానిక నాయకులు ముందుకొస్తే వెంటనే పనులు ప్రారంభించే అవకాశముందని మండల అధికారులు చెబుతున్నారు. మొదటి, రెండో విడతలో ఏర్పాటైన కొత్త పంచాయతీల్లో భవనాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కమ్యూనిటీ గదులు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. తీరనున్న అద్దె భారం.. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 306 పంచాయతీలకు పక్కా భవనాలు ఉన్నాయి. మిగతా 180 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీలకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె నెలకు రూ.18వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.25వేల చొప్పున చెల్లిస్తున్నారు. అలాగే జిల్లాలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 306 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంతభవనాలున్నాయి. 452 కేంద్రాలు అద్దె భవనాల్లో, 451 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతినెలా గ్రామాల్లో రూ.1,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2వేలకు పైగా అద్దె చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారింది. త్వరలో 19 భవనాలు నిర్మించనుండడంతో అద్దె భారం తగ్గనుంది. ఫ పంచాయతీలు, అంగన్వాడీల సొంత భవన నిర్మాణానికి రూ.6.28కోట్లు ఫ ఉపాధి హామీ పథకం కింద నిధులు ఫ స్థలాలు గుర్తించే ప్రక్రియ పూర్తి ఫ తీరనున్న అద్దె భారంగ్రామ పంచాయతీలు 486 అంగన్వాడీ కేంద్రాలు 1,209నిధులు మంజూరైన పంచాయతీలు 20అంగన్వాడీ కేంద్రాలు 19పంచాయతీ భవన నిర్మాణ ఖర్చు: రూ.20 లక్షలు అంగన్ వాడీ భవనానికి రూ.12 లక్షలు -
శ్రమిస్తే.. విజయం సొంతం
ఫ పాఠశాల స్థాయి నుంచే సివిల్స్పై ఆసక్తి పెంచుకున్న ఫ ఉన్నతాధికారిగా సేవలందించాలనే తపన ఫ స్వతహాగానే సివిల్స్కు ప్రిపరేషన్ ఫ యువత ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి ఫ భూవివాదాల్లో పోలీసుల జోక్యం సహించను ఫ డ్రగ్స్ నివారణకు అవగాహన సదస్సులు భువనగిరి డీసీపీ అక్షాంశ్యాదవ్ మాది ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా. మా నాన్న అజాబ్సింగ్ యాదవ్. ఆగ్రా యూనివర్సిటీలో జాగ్రఫీ ప్రొఫెసర్. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులపై నాకు ఆసక్తి పెరిగింది. సివిల్ సర్వీస్ పరీక్ష రాయాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచన ఉంది. నాకు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటీవలే నాకు వివాహమైంది. నా భార్య రోష్నీ స్వస్థలం ఢిల్లీ. ఆమె రిపబ్లిక్ టీవీలో ఉద్యోగం చేస్తున్నారు. గ్రేహౌండ్స్లో మొదటి పోస్టింగ్ ఐపీఎస్ శిక్షణ పూర్తయిన తర్వాత నన్ను తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. ఆదిలాబాద్లో ట్రైనీ అధికారిగా కొన్ని రోజులు పనిచేశాను. భద్రాచలంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా తొలిసారిగా విధుల్లో చేరాను. అక్కడ ఏడాది పని చేసిన తర్వాత అప్పటి గవర్నర్ తమిళిసై వద్ద ఏడీసీగా పనిచేశాను. పది నెలల తర్వాత హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సందర్శన, తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ సంవత్సరం మార్చిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీగా వచ్చాను. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాను. ఇక్కడి ప్రజలు సహృదయులు. అన్ని విధాలా పోలీస్ శాఖకు సహకరిస్తారు. పోలీస్ స్టేషన్లలో ల్యాండ్ సెటిల్మెంట్లపై నిఘా పెట్టాం. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చాం. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. రోడ్డు యాక్సిడెంట్లను నిరోధించడం, డ్రగ్స్ నివారణకు అవగాహన చర్యలు చేపట్టడం, కార్డన్ సెర్చ్, నాకాబంది నిర్వహిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, జీరో ఎఫ్ఐఆర్ కేసుల నమోదుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. యూత్ గోల్ ఇదే.. యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తే తప్పక విజయం లభిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సమాజంలో ఉత్తమ సిటిజన్గా ఎదగాలి. ఆడపిల్లలను గౌరవించాలి. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.కోచింగ్కు వెళ్లకుండానే.. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ చదివాను. 2015లో డిగ్రీ పూర్తి కాగానే జాగ్రఫీలో పీజీ చేస్తూనే సివిల్స్కు సన్నద్ధమయ్యాను. కోచింగ్కు వెళ్లకుండానే స్వతహాగానే ప్రిపేర్ అయ్యాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన బుక్స్ చదివి నోట్స్ తయారు చేసుకున్నా. పుస్తక పఠనం సివిల్స్ సాఽధించడానికి నాకు ఎంతగానో తోడ్పడింది. జాగ్రఫీతో పాటు సివిల్స్కు అవసరమయ్యే పుస్తకాలు చదివాను. తొలి ప్రయత్నంలో 2017లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ, సక్సెస్ కాలేకపోయాను. రెండవసారి ప్రయత్నం చేశాను. 2019లో సివిల్స్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాను. ఇక్కడి ప్రజలు సహృదయులు -
అక్క, తమ్ముడు అదుర్స్
చిన్న వయస్సులో దేశాలు, వాటి రాజధానుల పేర్లను తక్కువ సమయంలో చెప్పి అదుర్స్ అనిపిస్తున్నారు అక్క, తమ్ముడు. - 8లోఆర్టీఓ సురేష్రెడ్డికి పదోన్నతిసూర్యాపేట : సూర్యాపేట జిల్లా రవాణా అధికారి జి.సురేష్ రెడ్డికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు హనుమకొండకు పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సిబ్బంది ఎంతో తోడ్పాటునందించారన్నారు. అనంతరం ఆయనకు సిబ్బంది శాలువాలు, పూల బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ జయప్రకాశ్ రెడ్డి, ఆదిత్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బెంజిమెన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బాల పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు నిర్వహించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ అవార్డులకు ధైర్యం, కళలు, సంస్కృతి, శాస్త్ర సాంకేతికత, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ అనే ఆరు అంశాల్లో ప్రతిభ గల విద్యార్థులు htt p://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిభ గల బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ‘నవోదయ’లో వసతులు కల్పించాలిసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట పట్టణంలోని రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంలో బెంచీలు, ఆర్వో ప్లాంట్, వంట గది, వంట సామగ్రి, డైనింగ్ హాల్స్, టాయిలెట్లు, లైబ్రరీ కోసం టేబుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యాలయంలో త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డీఈఓ అశోక్, తహసీల్దార్ కృష్ణయ్య, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్, తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డీఈ రమేష్, ఏఈ ఓబుల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది మంది ఎస్ఐల బదిలీ సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది ఎస్ఐలను ఎస్పీ కె.నరసింహ బదిలీ చేశారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్(వేకెన్సీ రిజర్వు)లో ఉన్న ఎ.శివరాజ్ను సూర్యాపేట టౌన్ –2కు, సూర్యాపేట టౌన్– 2లో పని చేస్తున్న ఎం.ఆంజనేయులను వీఆర్లో ఉంచారు. వీఆర్లో ఉన్న సీహెచ్.గోపాల్రెడ్డి(ప్రొబేషనరీ ఎస్ఐ)ని కోదాడ రూరల్ స్టేషన్కు, కోదాడ రూరల్ స్టేషన్లో పని చేస్తున్న ఎం.అనిల్రెడ్డిని వీఆర్లో ఉంచారు. వీఆర్లో ఉన్న వి.సురేష్రెడ్డి(ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్)ని చిలుకూరు పోలీస్ స్టేషన్కు, చిలుకూరు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్.రాంబాబును వేకెన్సీ రిజర్వులో ఉంచారు. వీఆర్ లో ఉన్న టి.అజయ్కుమార్(ప్రొబేషనరీ ఎస్ఐ)ను మోతె పోలీస్ స్టేషన్కు, మోతె పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న బి.యాదవేందర్రెడ్డిని వీఆర్లో ఉంచారు. -
కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు ఇవ్వాలి
సూర్యాపేట : బతుకు పోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి క్షమాపణ చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్పు పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకుందన్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు లేదన్నారు. వారిద్దరికీ నీటి పారుదల రంగంపై పరిజ్ఞానం లేదన్నారు. ఉత్త మాటలో చెత్త మాటలో చెప్పడం లేదని, తన మాటలు అబద్ధమని నిరూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమని సవాల్ విసిరారు. ఇప్పటికై నా ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలన్నారు. దీంతో మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ద్వారా బస్వాపూర్, గంధమల్ల, ఎస్సారెస్పీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సమృద్ధిగా నీరు అందుతదన్నారు. కన్నెపల్లిలో బటన్ నొక్కితో నాలుగు రోజుల్లో పెన్పహాడ్ మండలం రావి చెరువుకు నీళ్లు అందే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుకు బనకచర్ల అనుమతులు రావడం కోసమే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సోలిపేట, రత్నపురం, రామారం, యర్కారం గ్రామాల్లో కూడా సైతం గోదావరి జలాలతోనే పంటలు పండాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది
ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ ఆఫ్గ్రిడ్ కోఆపరేటివ్ సిస్టమ్తో నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. నాలుగు నెలలుగా రూ.6 వేల ఆదాయం వచ్చింది. సోలార్ ప్లేట్ల క్లీనింగ్, సిబ్బందికి సహకరించడం తప్ప ఎలాంటి రిస్క్ లేదు. సోలార్ ప్యానల్కు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. –ముక్కెర అనిత, అయిటిపాముల మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద సాయం ప్రభుత్వ ద్వారా అయితే యూనిట్కు రూ.3 నుంచి రూ.4 వరకు ఆదాయం లభిస్తుంది. స్వబాగ్ ల్యాబ్ వారు యూనిట్కు రూ.16.50 చెల్లిస్తున్నారు. అదనంగా సోలార్ ప్యానల్ యూనిట్ల సంఖ్య పెంచుకుంటే మహిళలు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద సహాయం. – చెవుగోని సైదమ్మ, ఎఫ్పీఓ చైర్మన్, అయిటిపాములసోలార్ ప్యానెల్తో డైరెక్ట్గా బ్యాటరీ చార్జింగ్ సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే ఇది మొదటి పైలెట్ ప్రాజెక్ట్. సూర్యశక్తిని వినియోగించుకుని ఆదాయం సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్కు బదులుగా ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. భవిష్యత్లో మరిన్ని స్వచ్ఛ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేమే బ్యాటరీలను కొనుగోలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నాం. – జి. సుధాకర్బాబు, సీఈఓ స్వబాగ్ ల్యాబ్స్ -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు ,పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
అర్వపల్లి: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు తెలిపారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉండగా 15 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 3గ్రంథాలయాలకు భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. జాజిరెడ్డిగూడెం గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పాఠకులు వినతిపత్రం ఇవ్వగా స్పందించారు. ఈకార్యక్రమంలో లైబ్రేరియన్లు శ్యాంసుందర్రెడ్డి, ఎం. వెంకటరంగారావు, దార శ్రీనివాస్, సిబ్బంది కుంభం సోమయ్య, స్థానికులు బింగి కృష్ణమూర్తి, నరహరి, కె. నరేష్, నవీన్, ఉపేందర్, రాజు, మహేష్, శేఖర్ పాల్గొన్నారు. భూగర్భ జలాలు పెంచడానికి పాటుపడాలినూతనకల్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూగర్భ జలాల పెంచడానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. గురువారం నూతనకల్ మండలంఎడవెల్లిలో బోర్బావి రీచార్జిని పరిశీలించి మాట్లాడారు. వర్షపు నీటితో బోర్ బావుల రీచార్జితో మలినాలకు అడ్డుకట్టపడి స్వచ్ఛమైన నీరు లభిస్తుందన్నారు. ఆయన వెంట ఎంపీఓ శశికళ, పంచాయతీ కార్యదర్శి చలమయ్య ఉన్నారు. హుజూర్నగర్కు 1,392వ ర్యాంకుహుజూర్నగర్: స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సర్వేకు సంబంధించిన ర్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. శుభ్రత, పరిశుభ్రత, తడిపొడి చెత్త వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై కేంద్రం ఏటా సర్వే నిర్వహిస్తుంది. ఈ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా ఆయా వార్డుల నుంచి 12, 500 మార్కులపై సర్వే నిర్వహించింది. ఇందులో జాతీయ స్థాయిలో 1,392, రాష్ట్ర స్థాయిలో 137వ ర్యాంకు సాధించింది. మున్సిపాలిటీలో డోర్ టు డోర్ చెత్త సేకరణలో 83 శాతం, మార్కెట్ ఏరియాలో 100 శాతం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానంలో 0 శాతం, చెత్త ఉత్పత్తి, ప్రాసెసింగ్లో 54 శాతం పనితీరు కనబరిచినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే 2023–2004లో స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పోల్చుకుంటే ఈసారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. -
వడ్డీ.. వచే్చసింది!
మూడేళ్లుగా అందని వడ్డీ మూడేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు అందడం లేదు. తీసుకున్న రుణాన్ని బ్యాంకుల్లో సకాలంలో చెల్లించిన వెంటనే ప్రభుత్వం ఆ మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించాలి. కానీ మూడేళ్లుగా వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తయింది. దీంతో ప్రభుత్వం వాటిని విడతల వారీగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని ఆయా సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. అయితే జిల్లాల్లో మహిళా సంఘాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సకాలంలో ఆయా రుణాలను వడ్డీతో సహా చెల్లించిన సంఘాలు 41 వేలకుపైగా ఉన్నాయి. ఆయా సంఘాలకు ఇప్పుడు వడ్డీ బకాయిలు అందనున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. మూడేళ్లుగా రుణాలు తీసుకొని అసలు, వడ్డీ సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.38.63 కోట్లు విడుదల చేసింది. విడుదలైన వడ్డీ బకాయిల్లో నల్లగొండ జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.20.80 కోట్లు, సూర్యాపేటకు రూ.5.43 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.12.40 కోట్లు ఇచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ వడ్డీ బకాయిలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబురాల ముగింపు సమావేశంలో శుక్రవారం అందజేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆయా మహిళా సంఘాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాలకే.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 70 వేల వరకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు, వారు చేసే వ్యాపారాలు ఇతరత్రా పనులకు పోత్సాహం అందించేందుకు ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. అయితే బ్యాంకులనుంచి రుణాలను తీసుకున్న సంఘాలు ఆ రుణాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా వడ్డీతో సహా బ్యాంకుల్లో చెల్లించాలి. అలా చెల్లించిన మహిళా సంఘాలకే ప్రభుత్వం ఆ వడ్డీని తిరిగి మహిళా సంఘాల ఖాతాలో జమ చేస్తుంది. ఇలా నల్లగొండ జిల్లాలో 19,390, సూర్యాపేటలో 10,603, యాదాద్రి జిల్లాలో 11,209 సంఘాలు సక్రమంగా రుణాలు చెల్లించాయి. ఆయా సంఘాలన్నింటికీ ప్రభుత్వం వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఫ మూడేళ్ల తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ బకాయి విడుదల ఫ ఉమ్మడి జిల్లాకు రూ.38.63 కోట్లు కేటాయింపు ఫ మహిళా సంఘాల హర్షం ఫ ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పంపిణీవడ్డీ పంపిణీ వివరాలు ఇలా.. జిల్లా వడ్డీ పొందే వచ్చిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) నల్లగొండ 19,390 20.80 సూర్యాపేట 10,603 5.43 యాదాద్రి 11,209 12.40మొత్తం 41,202 38.63 -
మానసిక వికలాంగులకు చేయూతనందించాలి
చివ్వెంల(సూర్యాపేట) : మాససిక వికలాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గురువారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె.. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకర బోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, ప్రిన్సిపల్ మదనాచారి పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
సమగ్ర వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి
నాగారం : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి సంబంధించి సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాగారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ భూమిలో ఏ పంట పండుతుందో ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం, నాగారం, అర్వపల్లి మండలాల కార్యదర్శులు దేవరకొండ యాదగిరి, వజ్జా శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకుడు సిగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
కోదాడ: జిల్లాలో దుకాణదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం కోదాడలో ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. దుకాణదారులు ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మాలని, వ్యవసాయశాఖ అధికారులు దీనిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. గైనకాలజిస్ట్ విధులకు డుమ్మాకొట్టడంపై ఆగ్రహం కలెక్టర్ కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యుల హాజరు రిజిస్టర్ను పరిశీలించి గైనకాలజిస్ట్ పద్మావతి విధులకు డుమ్మా కొట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ప్రభుత్వ వైద్యశాలను గతంలో తనిఖీ చేసిన సమయంలో గైనకాలిజిస్ట్ విధులకు హాజరు కాలేదు... మళ్లీ ఈ రోజు కూడా ఆమె డ్యూటీకి రాలేదు ఎందుకు.? దీనిపై వెంటనే నాకు నివేదిక ఇవ్వండి’ అని కలెక్టర్.. వైద్యశాల సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. 100 పడకల వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తిచేయాలని కోరారు. నాణ్యమైన విద్యనందించాలి కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ సూచించారు. బాలుర పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు అవసరమైన వసతులను మెరుగు పర్చాలని కోరారు. బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం చేయాలని దానికి వెంటనే రూ.7 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, వైద్యశాల సూపరింటెండెంట్ దశరథనాయక్, కమిషనర్ రమాదేవి, మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఒక్కో నీటిచుక్క ఎంతో విలువైనది
ఫ ఈఎన్సీ శ్రీనివాస్ నాగార్జునసాగర్ : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి యాజమాన్యానికి చక్కటి ప్రణాళిక అవసరమని.. ఒక్కో నీటిచుక్క విలువైనదని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ అన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగుతున్న కాల్వల మరమ్మతు, ప్రాజెక్టులో పనులపై గురువారం హిల్కాలనీలోని విజయవిహార్ సమావేశ మందిరంలో నల్లగొండ చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్తో కలిసి సమీక్షించారు. అంతకుముందు సాగర్ ప్రధాన డ్యాంతోపాటు గ్యాలరీలు, గేట్లు, స్పిల్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగం, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణాన ఆదేశాలు వచ్చినా కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని.. అందువల్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్యాం ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జున్, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
బా్యగ్.. బరువు
నడుంనొప్పి వచ్చే అవకాశం విద్యార్థి మోయలేనంత బరువుతో వెన్నెముక, నడుము నొప్పివంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో వీపు మీద పెట్టుకునే బ్యాగులనే ప్రోత్సహిస్తున్నారు. ఇలా బరువులు మోయడం ద్వారా చదువుపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. బలహీనంగా ఉన్న పిల్లలకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. – డాక్టర్ చంద్రశేఖర్, పిల్లల వైద్య నిపుణులు నిబంధనల ప్రకారం పుస్తకాల బరువు ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థి పుస్తకాల బరువు ఉండాలి. నిబంధనలు అతిక్రమించి ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు తరగతుల వారీగా పుస్తకాల బరువు ఉండాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. –అశోక్, డీఈఓసూర్యాపేటటౌన్ : విద్యార్థులకు పుస్తకాల బ్యాగు భారంగా మారింది. కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఐఐటీ, జేఈఈ ఇలా రకరకాల పేర్లతో పదుల సంఖ్యలో పుస్తకాలు అంటగట్టడం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు బండెడు పుస్తకాలతో బడికి వెళ్లాల్సివస్తోంది. లేత వయసులో శక్తికి మించి బరువు మోయడంతో వెన్ను పూస, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 308 ప్రైవేట్.. 950 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో 308 ప్రైవేట్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇవే కాకుండా అనుమతి లేనివి సైతం ఉన్నాయి. వీటిలో సుమారు 40వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లోనే నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఇంకా రకరకాల పేర్లతో ఉన్న పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే తల్లిదండ్రుల తపను ఆసరా చేసుకొని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరలు పెంచి వసూలు చేస్తూ ఎల్కేజీ విద్యార్థులకు కిలోల కొద్ది పుస్తకాలను అంటగడుతున్నారు. వాటిని బ్యాగ్లో వేసుకొని చిన్నారులు మోయలేని పరిస్థితులు ఉన్నాయి. నో బ్యాగ్ డే ఏదీ? కేంద్ర ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ద్వారా ఆయా తరగతులకు పాఠ్యపుస్తకాలు ఎంత బరువు ఉండాలనే విషయంపై సూచనలు ఇచ్చింది. దీంతో పాటు తరగతుల వారీగా పుస్తకాల బరువుకు సంబంధించి రాష్ట్రంలోనూ విద్యాశాఖ అధికారులు 2017 జూలైలో జీఓను తీసుకొచ్చారు. అలాగే నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ రోజు విద్యార్థులు బ్యాగ్ లేకుండా పాఠశాలలకు రావాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇవి ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు సబ్జెక్టు పుస్తకాలు, ఐదు నోట్ పుస్తకాలు ఉండాలి. కానీ 12నోట్ పుస్తకాలు, ఆరు సబ్జెక్టు పుస్తకాలతో పాటు అదనంగా వివిధ పేర్లతో మరో ఐదారు పుస్తకాలు ఇచ్చారు. అయితే ఇవి సుమారు 10కిలోల బరువు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏడో తరగతికి పుస్తకాల బరువు 4కిలోలు ఉండాలి. ఇటీవల విద్యార్థికి వెన్ను నొప్పి, భుజాల నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చూపించినట్టు విద్యార్థి తండ్రి తెలిపాడు. ఇదీ.. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితికి నిదర్శనం. విద్యార్థుల వీపుపై బండెడు పుస్తకాలు ఫ ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు అంటగడుతున్న యాజమాన్యాలు ఫ శక్తికి మించి పుస్తకాల బరువుతో అవస్థలు ఫ వెన్నుపూస సమస్యలు వస్తాయంటున్న వైద్య నిపుణలునిబంధనల ప్రకారం తరగతుల వారీగా ఉండాల్సిన బ్యాగ్ బరువు..తరగతులు బ్యాగ్ బరువు (కిలోలలో..)1-2 1-3 3-5 2-3 6-7 04 8 4-5 9-10 05 -
9,23,449 ఎకరాలకు నీరు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు వరద పెరిగితే 20వ తేదీ నుంచి నీటి విడుదల ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వస్తున్న వరదనీరు (ఇన్ఫ్లో) 60 వేల క్యూసెక్కుల వరకు తగ్గిపోయింది. ఈ నాలుగైదు రోజుల్లో వర్షాలు పెరిగి శ్రీశైలం నుంచి సాగర్కు ఇన్ప్లో ఎక్కువగా ఉంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఖరారు చేసింది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, ఆసిఫ్నహర్, డిండి, ఎస్సారెస్పీ స్టేజ్– 2, మూసీ, ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో మొత్తం 9,23,449 ఎకరాల్లో పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని వృథా చేయకుండా ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలోని సాగునీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేసి నీటిని విడుదల చేయనున్నారు. నీటి కేటాయింపులు ఇలా.. ● నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నల్లగొండ జిల్లాలో1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలం సాగకు 16.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 28 టీఎంసీల నీటికి ఇవ్వనున్నారు. ● ఆసిఫ్నహర్ కింద 15,245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీరు కేటాయించారు. ● డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిన కమిటీ వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ● సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమకాల్వ కింద ఎత్తిపోతల పథకాలతో కలుపుకుని 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సాగుకు 18 టీఎంసీల నీటిని కేటాయించింది. ● ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు నీటిని ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని సూచించింది. ● మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు 4.28 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఫ సాగర్, మూసీ, ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ, ఎత్తిపోతల పథకాల కింద నీరు ఫ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీరివ్వాలని సూచించిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఫ ఎస్సారెస్పీ, డిండి కింద ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల ఫ సాగర్కు ఇన్ఫ్లో పెరిగితే ఈ నెల 20న, లేదంటే ఆగస్టు 1న ఎడమకాల్వకు నీరు -
జగదీష్రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు
సూర్యాపేటటౌన్ : రెండేళ్లలో ఒక్క శాతం అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. వందశాతం అభివృద్ధి చేసిన మాజీ మంత్రి జగదీష్రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గు చేటని, ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుందామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు కుంటలు నింపి దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించిన ఘనత జగదీష్రెడ్డిది అనే విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు గోపగాని వెంకటనారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, సవరాల సత్యనారాయణ, పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ -
గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..
ఫ ‘ధర్తి ఆభ జన్భాగీధారీ అభియాన్’ను తీసుకువచ్చిన కేంద్రం ఫ మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించాలని నిర్ణయం ఫ గిరిజన తండాల్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వే గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన దర్తి ఆభ జన్ భాగీధారీ అభియాన్’ ద్వారా గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం మఠంపల్లి మండలంలోని పలు గిరిజన తండాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. సర్వేలో సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్ చేస్తున్నాం. తద్వారా ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుంది. – వెంకటేశ్వర్లు, లైజనింగ్ ఆఫీసర్, మఠంపల్లి మండలం మఠంపల్లి: గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ధర్తి ఆభ జన్భాగీదారీ అభియాన్ పథకాన్ని తీసుకువచ్చింది. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ (డీటీడీఓ) ఆధ్వర్యంలో అత్యధికంగా గిరిజన తండాలు గల మఠంపల్లి, పాలకీడు, మేళ్లచెరువు, అనంతగిరి, నేరేడుచర్ల, చివ్వెంల, తుంగతుర్తి, తిరుమలగిరి, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో ఈనెల 6 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఈసర్వే ఈనెల 19 వరకు కొనసాగనుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఇంటింటి సర్వే ఎలా చేపట్టాలి అనేదానిపై రామచంద్రాపురంతండా, భీమ్లాతండా, భోజ్యాతండా, సుల్తాన్పూర్తండా, గుర్రంబోడు తండా, క్రిష్ణాతండా, తదితర గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వలంటీర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దీంతో వారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, కిసాన్ కార్డ్, ఫసల్బీమా పొందుతున్నారా లేదా, ప్రభుత్వ ఇల్లు మంజూరు అయిందా కాలేదా తదితర 40అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే వివరాలన్నింటినీ ఆన్లైన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పథకం లక్ష్యాలు ఫ గిరిజన గ్రామాల్లో విద్యుద్దీకరణ, ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడం. ఫ గిరిజన ప్రజలకు ఆధార్కార్డు, ఆయుష్మాన్ భారత్కార్డు, పీఎం కిసాన్ పథకం, జన్ధన్ ఖాతా, స్కాలర్షిప్ వంటి సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పిస్తారు. ఫ మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడం. -
50 శాతం ప్లాంటేషన్ పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఈ నెల చివరికల్లా 50 శాతం ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను విజయవంతంగా అధిగమించాలన్నారు. జూలై చివరి కల్లా ఫిట్టింగ్ 75 శాతం పూర్తి చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమం 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, వర్షపు నీరు ఒడిసిపట్టే ఇంకుడు గుంటలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ ఇంకుడు గుంతలు ఈనెల చివరి కల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈనెల చివరి వారంలో పూర్తిచేసిన పనులన్నింటినీ పీపీటీ ద్వారా వివరించాలని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలునేరేడుచర్ల : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ జయ మనోహరి హెచ్చరించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు సమాచారం అందించాలన్నారు. బుధవారం నేరేడుచర్ల మండల కేంద్రంలోని మాధవ నర్సింగ్ హోంను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయని స్కానింగ్ మిషన్ను గుర్తించి, గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ మిషన్ వాడకూడదన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడిపితే మూసివేస్తామన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నజియా, టీవీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలంతో పాటు అధికారుల బృందం తదితరులున్నారు. ప్రవేశాలు పెంచాలి ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో అడ్మిషన్లు భారీగా పెరిగాయని తెలిపారు. నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా 154 అడ్మిషన్లు అయ్యాయని, ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మారం హరిప్రసాద్, తుంగతుర్తి కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ స్థానాలు ఖరారు
సూర్యాపేట : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి. జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సమరభేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డీపీఓలు, పోలీస్శాఖకు ఆదేశాలు అందాయి. ఫ జిల్లాలో 23 చొప్పున జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 235 ఎంపీటీసీలు ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు గతంలో మాదిరిగానే.. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో జిల్లాలో 23 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. కొత్తగా మండలాలు ఏర్పాటు కాకపోవడంతో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇటీవల ఎంపీటీసీల నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పటికీ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఎంపీటీసీ స్థానాల్లోనూ ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో జిల్లాలో గతంలో ఉన్న 235 స్థానాలకు అవే స్థానాలు ఉన్నాయి. -
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ కె. నరసింహ అన్నారు. గురువారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెడు స్నేహాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపాలన్నారు. ఆకతాయిల వేధింపులకు గురైతే 100కు గాని, షీ టీం 87126 86056 నంబర్కుగాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదవాలని, మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య లాంటి తప్పులు చేయొద్దని బాలికలకు సూచించారు. బాలికలు తమ ఫొటోలను, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు. సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎంఈఓ ధారాసింగ్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, రూరల్ ఎస్సై బాలు నాయక్, కస్తూర్బా ఎస్ఓ సరస్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
భానుపురి (సూర్యాపేట) : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఇకనుంచి రైతుఉత్పత్తి దారుల సంఘాలుగా సేవలు అందించనున్నాయి. ఇప్పటివరకు రైతులకు వ్యవసాయ రుణాలు, వడ్ల కొనుగోలు, ఎరువులు, విత్తనాలను మాత్రమే అందించిన ఈ కేంద్రాలు మరిన్ని సేవలను అందించనున్నాయి. కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మారుస్తుండగా.. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా నుంచి 39 సెంటర్లను ఎంపిక చేశారు. గుర్తించిన ఎఫ్పీఓలకు ఒక్కోదానికి రూ.18 లక్షల చొప్పున నిధులు సైతం మంజూరు చేశారు. సూర్యాపేటలో 9 పీఏసీఎస్ల గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా 311 పీఏసీఎస్లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్పీఓ) కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా వీటిలో నుంచి 39 పీఏసీఎస్లకు మొదటి విడతలో స్థానం దక్కింది. ఇందులో సూర్యాపేట జిల్లా నుంచి చివ్వెంల పీఏసీఎస్తో పాటు నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, పెన్పహాడ్ మండలం నారాయణగూడెం, చిలుకూరు, గరిడేపల్లి మండలం పొనుగోడు, మేళ్లచెర్వు, నడిగూడెం, పాలకీడు, సూర్యాపేట పీఏసీఎస్లు మొత్తం 9 రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మొదటి విడతలో ఎంపికయ్యాయి. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో 13సెంటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 సెంటర్లను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మొదటి విడతలో గుర్తించింది. మరిన్ని సేవలు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ప్రస్తుతం పీఏసీఎస్ల్లో అందుతున్న సేవలతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు రుణాలే కాకుండా కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించనున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సంఘాల్లో అందుబాటులోకి తేనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, కోల్డ్ స్టోరేజీల యూనిట్లు, కోళ్ల పెంపకం చేపట్టనున్నారు. దీంతో ఓ వైపు రైతులకు అన్ని రకాల సేవలు అందడంతో పాటు సంఘాలు ఆర్థికంగా బలోపేతం కానున్నాయి. ఫ పీఏసీఎస్లను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం ఫ మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 39 సెంటర్లు ఎంపిక ఫ నిర్వహణ నిధులు సైతం విడుదల రైతులకు మేలు కలుగుతుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. వీటితో రైతులకు మేలు జరుగుతోంది. చాలా రకాల సేవలు ఈ సంఘాలతో అందుతాయి. మొదటి విడతగా సూర్యాపేట జిల్లాలో 9 పీఏసీఎస్లను గుర్తించారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. త్వరలోనే అన్ని పీఏసీఎస్లు ఇదే విధంగా సేవలు అందిస్తాయి. – పద్మ, డీసీఓ మొత్తం పీఏసీఎస్లు, ఎంపికై న రైతు ఉత్పత్తి సంఘాల వివరాలు పీఏసీఎస్లు గుర్తించినవి సూర్యాపేట 44 9 నల్లగొండ 42 13 భువనగిరి 21 17 మొత్తం 107 39 -
తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య!
నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచి్చంది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
గురుకులాల్లో ఎందుకిలా..?
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య డీఈఓ అడ్డగింత సూర్యాపేటటౌన్ : నడిగూడెం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఉరేసుకొని మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మంగళవారం ఉదయం తీసుకొచ్చారు. అయితే పోస్టుమార్టం వద్దకు వచ్చిన డీఈఓ అశోక్ను విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఎలాంటి విచారణ చేయకుండా కుటుంబ తగాదాలతో మృతి చెందిందని మీడియాకు ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. పోలీసులు చేయాల్సిన విచారణను డీఈఓ ఎలా చేస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోస్టుమార్టం గది వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సముదాయించడంతో డీఈఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫ ఫుడ్ పాయిజన్తో పలువురు ఆస్పత్రి పాలు ఫ పట్టింపులేని సిబ్బంది, అందుబాటులో ఉండని ప్రిన్సిపాళ్లు ఫ కనిపించని ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫ వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంధ్య(11) పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు దేవరకొండలోని ఆశ్రమ పాఠశాలలో 40 మంది, మర్రిగూడలోని మోడల్ స్కూల్లోని బాలికల హాస్టల్లో 18 మంది విద్యార్థినులు ఫుడ్పాయిజన్తో ఆస్పత్రి పాలయ్యారు. ఇవే కాకుండా మంగళవారం తెలవారుజామున నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూష మహాలక్ష్మి క్లాస్రూమ్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే తమ పిల్లల బాగోగులపై ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమా? తూప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాలలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతోపాటు భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. నాలుగంతస్తులు ఉన్న ఆ భవనంపైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల వద్ద కనీసం గేటు కూడా లేకపోవడంతోనే ఆ బాలిక భవనంపైకి కిందకి దూకినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. వందల మంది విద్యార్థులు ఉండే గురుకులాల్లో, అందులోనూ బాలికల గురుకులాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాత్రి వేళలలో పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం వల్లే ఆ సంఘటన జరిగినట్లు తెలిసింది. డ్యూటీల సమయంలో మెళకువతో ఉండాల్సి ఉన్నా వారు నిద్రపోవడం వల్లే బాలిక భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. ఇక నడిగూడెం కేజీబీవీలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా తరగతి గదికి తాళం వేయలేదని, దాంతో బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, వార్డెన్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని భోజనంతో ఆసుపత్రులపాలు గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, అందుబాటులో ఉండకపోవడం, భోజనం నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. దేవరకొండ, మర్రిగూడ పాఠశాలల్లో ఈ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో భోజనం నాణ్యతను పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులకు వండి పెడుతున్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని పలుమార్లు హాస్టల్ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులకు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. అయినా భోజనంలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మునగాల: బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మునగాలలో మండల పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడు మైలార్శెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన పూలమాలలు, శాలవాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, కేతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల పార్టీ నాయకులు భద్రంరాజు కృష్ణప్రసాద్, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, వినోద్, గోవిందాచారి, మండవ సైదులు, ఆర్.సైదులు పాల్గొన్నారు. -
మండలం యూనిట్గా రిజర్వేషన్లు!
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను తొలగించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ రానుంది. ఈ ఆర్డినెన్స్ రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. అయితే మండలం యూనిట్గా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉండనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఈ ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించనున్నారు. బీసీలకు 42శాతం.. బీసీలకు 42శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7 శాతంతో పాటు అన్ని కేటగిరీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేయనుంది. ఆర్డినెన్స్ విడుదలైన వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా రిజర్వేషన్ల కోటా, కేటాయింపులకు ఉత్తర్వులు రానున్నాయి. ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే కలెక్టర్లు, ఆర్డీఓల నేతృత్వంలో రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పదవులకు జిల్లా యూనిట్గా, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల పదవులకు మండలం యూనిట్గా, గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు గ్రామం యూనిట్గా రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై ఎటూ తేలకపోవడంతో ఇన్నాళ్లూ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా పరిషత్లకు, పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారైతే ఆగస్టులో తొలుత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామపంచాయతీల ఎన్నికలు జరుగుతాయని అధికార, రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ నెలాఖరులోగా ఖరారు చేసే అవకాశం ఫ తొలుత పరిషత్లు, ఆ తర్వాత పంచాయతీలకు కేటాయింపు ఫ రిజర్వేషన్లపైనే నాయకుల ఆశలుఆశావహుల ఎదురుచూపులు జిల్లాలో గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా కొత్తవి రానున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పోటీకి సిద్ధంగా ఉన్నా.. ఇన్నాళ్లూ రిజర్వేషన్ తమది కాదని భావించారు. వారంతా తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తే పోటీకి సై అనాలని ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏ వర్గానికి కలిసొస్తుంది..? ఎంపీటీసీ స్థానం ఏ కేటగిరీకి కేటాయిస్తారోనని..? జెడ్పీటీసీ స్థానం ఎటు వెళుతుందోనని.. ? ఎంపీపీ పదవులు ఏ వర్గానికి దక్కుతాయి? అనే అంశంపై అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలు 486ఎంపీటీసీ స్థానాలు 235జెడ్పీటీసీ స్థానాలు 23ఎంపీపీలు 23 -
బీఆర్ఎస్ హయాంలోనే సమృద్ధిగా గోదావరి జలాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చాయని, గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి సమృద్ధిగా పంటలు పండాయని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు యుగేంధర్రావు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రజాక్ గుర్తు చేశారు. మంగళవారం తిరుమలగిరిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభను కాంగ్రెస్ సభగా మార్చారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు సమృద్ధిగా రావడంతో చెరువులు నిండి జాలుపట్టి పోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లు లేక చెరువులు ఎండి పోతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ల సహకారంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వ్యక్తిగతంగా దూషణలు చేయడం, స్థాయికి తగ్గట్లుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని, పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలందరికీ నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. రుణమాఫీ, రైతు భరోసా సరిగా అమలు కావడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్రెడ్డి, తాటికొండ సీతయ్య, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి శోభన్బాబు, కందుకూరి బాబు పాల్గొన్నారు. -
సూర్యాపేట
సాగర్ సమాచారం1200 ఏళ్ల నాటి పురాతన బావి ఉండ్రుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి గిరి దుర్గంపై గల కోనేరులో 1200 ఏళ్ల నాటి చేద బావి బయటపడింది. 9పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 556.60 అడుగులు ఇన్ఫ్లో : 64,789 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 1,650 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : నిల్ కుడికాల్వ ద్వారా : నిల్ ఎడమకాల్వ ద్వారా : నిల్ ఏఎమ్మార్పీకి : 1,650 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్పక్కా ప్లాన్ భర్త వేధింపులతో విసిగిన మహిళ కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. - 10లోబుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025 -
పోలీస్ ఆర్థిక చేయూత పథకంతో భరోసా
సూర్యాపేటటౌన్ : పోలీస్ ఆర్థిక చేయూత పథకం పోలీస్ కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించగా ఆయన కుటుంబానికి పోలీస్ చేయూత పథకం ద్వారా వచ్చిన రూ.2లక్షల చెక్కును ఎస్పీ.. మంగళవారం అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కృష్ణయ్య కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీదర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్ పాల్గొన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషిసూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నిశలు పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమాశంకర్, రాష్ట్ర సెక్రటరీ మూమిన్ రోషన్, రాష్ట్ర కన్వీనర్ నిమ్మరబోయిన నవీన్, ఏ ఎల్యూ జిల్లా సెక్రటరీ సీనపల్లి సోమేశ్వర్, మారపాక వెంకన్న, షఫీ ఉల్లా, బత్తిని వెంకటేశ్వర్లు, ఈశ్వర్ కుమార్, టేకులపల్లి శ్రీనివాసరావు, దోరేపల్లి రమేష్, కోనం రఘురామయ్య, పసల బాలరాజు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్కు ఉత్తమ అవార్డునల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం హైదరాబాద్లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలిసూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపర్తి రామనర్సయ్య, పుప్పాల వీరన్నలు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను సేకరించి మాట్లాడారు. సమావేశంలో శంకర్, కృష్ణమూర్తి, రాచూరి ప్రతాప్, నర్సయ్య, అంజయ్య, వెంకయ్య, శ్రీనివాస్రెడ్డి, డి.వెంకన్న పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన బిల్లులేవి !
ఫ మూడు నెలలుగా అందని బిల్లులు ఫ సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న వంట ఏజెన్సీలు నాగారం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలల నుంచి బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఆర్థిక భారంగా మారడంతో వంట చేయలేమని పేర్కొంటున్నారు. సరుకుల కొనుగోళ్ల భారంజిల్లాలో 874 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 40,447 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో 1437 మంది వంట ఏజెన్సీలున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.9.29, కోడిగుడ్డుకు రూ.6, 9వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థికి కోడిగుడ్డుతో కలుపుకొని రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా కూరగాయలు, వంట నూనె, గ్యాస్, నిత్యావసర సరుకులు ఏజెన్సీ నిర్వాహకులు దుకాణాల్లో కొనుగోలు చేసి వంట చేయాలి. కానీ మార్చి నుంచి జూన్ వరకు బిల్లులు రాలేదు. కోడిగుడ్ల బిల్లులు సైతం రాకపోవడంతో ఆర్థికంగా భారమవుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం సైతం.. జిల్లాలో 1437 మంది మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ఉన్నారు. వీరికి గౌరవ వేతనంగా కేంద్ర ప్రభుత్వం రూ.1000, రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కలిపి మొత్తం రూ.3000 చెల్లిస్తుంది. గౌరవ వేతనం కూడా రావడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు. వంట బిల్లులు రాక కిరాణషాపులు, కూరగాయల దుకాణాల్లో ఉద్దెర పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు – 874విద్యార్థులు – 40,447వంట కార్మికులు – 1437అప్పు తెచ్చి వండి పెడుతున్నాం మధ్యాహ్న భోజన బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పు తెచ్చి మరీ వండి పెడుతున్నాం. ప్రస్తుతం పెరిగిన ధరలతో ఆర్థికంగా భారమవుతోంది. గుడ్డుకు రూ.6లు చెల్లిస్తుండగా, మేము రూ.7లకు కొనుగోలు చేసి పెడుతున్నాం. గుడ్ల బిల్లులతో పాటు, మార్చి, ఏప్రిల్, జూన్ మూడు నెలల వంట బిల్లులు రాలేదు. ప్రభుత్వం వంట బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి. – తోట జయమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, వర్థమానుకోట -
మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
కోదాడరూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు పేర్కొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తన స్వగ్రామం కోదాడ మండలం నల్లబండగూడెం అని అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డపై ఉన్న మమకారంతోనే తొలిపర్యటన సూర్యాపేట జిల్లాలనే చేపట్టానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో 13 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇతర దేశాల సహాయం కోసం ఎదురు చూసిన దుస్థితి నుంచి నేడు 54 దేశాలకు ఆర్థిక సాయం చేసే స్థాయికి భారత్ను తీసుకొచ్చిన ఘనత బీజేపీకి దక్కుందని పేర్కొన్నారు. 2047వరకు ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత దేశం అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అనంతరం రాంచందర్రావును వివిధ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, బొబ్బా భాగ్యారెడ్డి, డాక్టర్ సుబ్బారావు, కనగాల నారాయణ, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, బండారు కవితారెడ్డి, మల్లెబోయిన అంజియాదవ్, అక్కిరాజు యశ్వంత్, బొలిశెట్టి కృష్ణయ్య, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అసెంబ్లీ చట్టం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2019లో అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 103వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్లో బిల్లు తెచ్చి రిజర్వేషన్ అమలు చేస్తున్న విధంగానే 2025లో కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50శాతం విద్యా ఉద్యోగ, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్, కనకయ్య, చిలకరాజు శ్రీను, ఇనుగుర్తి వెంకటరమణాచారి, నిగడాల వీరయ్య, కొండ అన్నపూర్ణ, మండవ నాగమణి, వెంకట్, సిరాపురపు శ్రీనివాస్ దేశగాని హేమలత దేశ గాని సైదులు పాల్గొన్నారు. -
రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్
సూర్యాపేట : రాష్ట్రంలో రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బాలాజీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరిస్తారని అన్నారు. గతంలో ఈ జిల్లాలో సైకిళ్లపై తిరిగి రెండు మూడు సభ్యత్వాలు చేయడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. నేడు లక్షకు పైగా సభ్యత్వాలు నమోదుకావడం శుభసూచకమని పార్టీ అధికారంలోకి రావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అర్హులకు రేషన్కార్డులు అందడంలేదని కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఇదే కొనసాగితే దీనిపై ఉద్యమం చేస్తామన్నారు. రేషన్ కార్డ్పై నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాలన్నారు. పదేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్లకు పైచిలుకు నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న ఆరు గ్యారంటీలు అటకెక్కాయని, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు గద్దె దింపడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీస్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ఒంటరిగానే పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుస్తామని రాంచందర్రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని బీసీలను మోసం చేస్తోందన్నారు. అందులో 10 శాతం ముస్లింలకుకేటాయించడం విడ్డూరమన్నారు. 42శాతం పూర్తిగా బీసీలకు కేటాయిస్తే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీఈ లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యను తమ పార్టీకి అంటగట్టి రాంచందర్రావును బదనాం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్మశానంలో పేలాలు ఏరుకుంటోందని విమర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం, పట్టుదల పెరిగిందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నేత కడియం రామచంద్రయ్య, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, నరసింహ పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ
చివ్వెంల(సూర్యాపేట) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజలో ఉంటుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల సురేష్ పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పీఆర్టీయూ సభ్వత్వ నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పీఆర్టీయూతోనే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఒనగూరాయన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కృషితో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ బషీర్, పొదిల రవీందర్, నాయకులు ప్రతాప్ కుమార్, ఖలీల్ అహ్మద్, గిరి ప్రసాద్, కోట యాదగిరి, షేక్ షాబొద్దీన్, భుక్యా శ్రీను, బుక్క రమేష్, తలశెట్టి కరుణాకర్, సతీష్, మోహన్ రెడ్డి, సాజిత్, వెంకట్ రెడ్డి, జిలకర శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలో గల శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, దుర్గాప్రసాద్శర్మ, సీతారామాచార్యులు, రాజేష్ పాల్గొన్నారు. చేయూత పింఛన్లు పెంచాలిసూర్యాపేట అర్బన్ : చేయూత పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్చార్జి గడ్డం ఖాసిం, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దె రాజేష్, షేక్ నయీమ్, చింత వినయ్ బాబు, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, వీరస్వామి, వెంకన్న మాదిగ, చింత జాన్ విల్సన్ మాదిగ, విజయరావు, స్నేహలతచౌదరి, ఎండి.జహీర్ బాబా, పేరెల్లి బాబు, పేర్ల సోమయ్య, గుండు శ్రీనివాస్, నూకపంగు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు. శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవతో పాటు స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం, జోడు సేవ తదితర పూజలు నిర్వహించారు. 16న మత్స్యగిరిలో వేలం పాటలువలిగొండ : వలిగొండ మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ దుకాణాల నిర్వహణ, స్వామివారి నిత్యకై ంకర్యాలకు పూజా సామగ్రి సమకూర్చడానికి ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ మోహన్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5,18,28 తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదాపడినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొనాలని కోరారు. -
పోరుగడ్డకు అండగా ఉంటాం..
ఫ తుంగతుర్తి నియోజకవర్గానికిపూర్తిస్థాయిలో గోదావరి జలాలు తీసుకొస్తాం ఫ రైతును రాజుగా చేస్తేనే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది ఫ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాం.. ఫ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఫ తిరుమలగిరిలో కొత్త రేషన్కార్డుల పంపిణీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ, తిరుమలగిరి (తుంగతుర్తి) : ‘భూమి.. భుక్తి.. విముక్తి కోసం పోరాడిన గడ్డ తుంగతుర్తి.. ఈ గడ్డకు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచి నల్లగొండ జిల్లాను ఎర్రగొండగా మార్చారు. నల్లగొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర. అలాంటి గడ్డ నుంచే ఈరోజు పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి ముందుగా రూ.34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదలకు రేషన్కార్డులు అందజేసి మాట్లాడారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడి ప్రజలు తెలంగాణ పౌరుషాన్ని చూపించారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. రైతు రాజుగా మారినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. రేషన్కార్డుల పంపిణీ చేయడం అంటే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది పేదలకు సన్న బియ్యం వడ్డించడమేనని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభకు 6 గంటలు ఆలస్యంగా వచ్చినా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి కరెంటు లేకున్నా సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఎదురు చూసి మందుల సామేల్కు 60 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యకర్తల కష్టం వల్లే ఈ రోజు మనం అందరం గెలిచి, ఈ స్థానంలో ఉన్నామని, మనకు పదవులు రావడానికి కార్యకర్తలే కారణమని వారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అందర్నీ సమన్వయం చేసుకొని కలుపుకు పోవాలన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్నాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రమేష్రెడ్డి, సంకెపల్లి సుధీర్రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తేజస్నందలాల్ పవార్, ఇలా త్రిపాఠి, హన్మంతరావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ బిఎస్.చౌహాన్ పాల్గొన్నారు. పదేళ్లు రాచరిక పాలన సాగింది – అడ్లూరు లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో రాచరిక పాలన సాగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ విమర్శించారు. పది సంవత్సరాల్లో ఒక్కరికి కూడా రేషన్కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ, కులగణన, సన్న బియ్యం పంపిణీ, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 59 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కాంగ్రెస్కు కంచుకోట – మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి కాపాడారని, గతంలో మా తమ్ముడు రాజగోపాల్రెడ్డి, నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచామన్నారు. బిక్కేరు వాగుపై బ్రిడ్జి, నాగారం, అడ్డగూడూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆ ఆలోచన బీఆర్ఎస్కు రాలే.. – ఎంపీ చామలకిరణ్కుమార్రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేల్కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 70 వేలకు పైగా మెజార్టీ వచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సన్న బియ్యాన్ని అత్తగారింట్లో (హుజూర్నగర్లో) ప్రారంభించారని, రేషన్ కార్డులను పుట్టినింటిలో (తుంగతుర్తి నియోజకవర్గంలో) ప్రారంభించేలా చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి – ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 13 గ్రామాలకు దేవాదుల ద్వారా గోదావరి జలాలు అందివ్వాలని, ఎస్ఆర్ఎస్పీ కాల్వలు అసంపూర్తిగా ఉన్నాయని, లైనింగ్ చేయాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సామేల్కు హితబోధ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందుల సామేల్ రూ.50 వేలతో వస్తే.. నియోజకవర్గ ప్రజలు 60 వేల మెజార్టీతో గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వారిని గుండెల్లో పెట్టుకుని ఎమ్మెల్యేను చేసిండ్రు. అందుకే వారి మంచి చెడుల్లో పాలుపంచుకోవాలి. సోనియాను నమ్మి గెలిపించారు. కడుపులో పెట్టుకోవాలి. ఒకరికి బాధ ఉంటది, ఒకరికి దుఃఖం ఉంటది, ఒకరికి కోపం ఉంటది. ఒకరికి ఆలోచన ఉంటది. మరొకరికి ఆశ ఉంటంది.. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా నువ్వే ఓపికతో అన్నీ ఆలోచించి అందరినీ కలుపుకుపోవాలి. ఏదేనా సమస్య ఉంటే ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్సీ లకు అవకాశం వస్తే అందులో నల్లగొండ జిల్లాకే ముగ్గురికి ఇచ్చాను. పీసీసీ అధ్యక్షుడు కూడా నల్లగొండ కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించాలన్నారు. ఇక్కడి ప్రజలకు కోపం వస్తే దాచుకోరని, గట్టిగా కోపంగా మాట్లాడతారని, అయితే, వివరించి చెబితే వింటారని, తనకు ఆ విశ్వాసం ఉందన్నారు. కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం అన్నారు. టార్గెట్.. జగదీష్రెడ్డిఫ గంజాయి మొక్కతో పోల్చిన సీఎం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని టార్గెట్ చేసుకొని తిరులమగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘సూర్యాపేటలో ఉన్న మూడడుగులాయన ఈ సభకు సీఎం ఎట్ల వస్తరని అంటున్నరు. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకువస్తానని అంటున్నరు. మరి పదేళ్లు ఎందుకు తేలేకపోయారు’ అని రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. గోదావరి జలాలు తేవడమంటే మందులో సోడా కలిపినట్లు కాదన్నారు. ‘పదేళ్లు దొరగారి దగ్గర ఫామ్హౌస్లో గడ్డి పీకావా.. పదేళ్లలో ఒక్కనాడైనా ఆలోచించావా’ అని ప్రశ్నించారు. ‘మీ ఊరును మండలం చేశావు. మండలానికి అధికారులను తెచ్చుకున్నవు. మీ మండలానికి ఎంఆర్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా కట్టించుకోలేదు. వాటికి మా మందుల సామేల్ స్థలాన్ని ఇప్పించి కట్టిస్తున్నడు’ అని అన్నారు. తన ఊరికి ఏం చేయలేని ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడట. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన్ను చూసుకోవాలన్నారు. మా దామన్న ఒక్కడు చాలు. వారి కథకమామిషు ఏందో చూసుకుంటారని అన్నారు. ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఇంకా వారి గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. పదేళ్లు మంత్రిగా చేసిన ఆయన మొన్న ఎన్నికల్లో తులసి వనంలో గంజాయి మొక్కలా ఒక్కడే గెలిచిండు. ఆ మొక్కను కూడా వచ్చే ఎన్నికల్లో కూకటి వేళ్లతో పీకేయాలన్నారు.