Suryapet
-
ఐదు నెలలుగా అందని వేతనాలు
పెద్దవూర: ప్రభుత్వ ఎస్టీ వసతి గృహాల్లో పనిచేసే వర్కర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేసే హాస్టల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారి రోజువారీ జీవితం కుదేలవుతుంది. అప్పులు చేసి మరీ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 312 మంది వర్కర్లునల్లగొండ జిల్లాలో 43 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు వంట చేయడం, హాస్టల్ గదులను, పరిసరాలను, బాత్రూంలు, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి పనులు చేసేందుకు గాను 312 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హాస్టల్లోనే ఉంటూ పనులు చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వర్కర్లతో సమానంగా ... ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పనిచేసే రోజువారి వర్కర్లు రెగ్యులర్ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా.. వారికి ఇస్తున్న వేతనం రూ.13,328 మాత్రమే. పని మాత్రం ప్రతిరోజూ చేస్తున్నా. జీతం మాత్రం రావడం లేదని, ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో తమ పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నారు. నవంబర్ నుంచి పెండింగ్..గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నామని వర్కర్లు వాపోతున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేపు మాపు అంటున్నారు గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదు. పది రోజులైతే ఈ విద్యాసంవత్సరం కూడా అయిపోతుంది. జీతాల గురించి అడిగితే రేపొస్తాయి.. మాపొస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు హాస్టళ్లలోనే పనిచేస్తుండటంతో వేరే పనులకు వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి తక్షణమే వేతనాలు ఇప్పించాలి. – నాగేందర్, వర్కర్, ఎస్టీ హాస్టల్, పెద్దవూర కుటుంబ పోషణ కష్టంగా ఉంది ఐదు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. మాకు వేరే పనులకు వెళ్లడానికి వీలు ఉండదు. కిరాణ దుకాణాలు, పాలు పోసే వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చకపోవడంతో సరుకులు ఇవ్వడం లేదు. పాలు పోయడం లేదు. చేసిన అప్పులు తీర్చాలని అప్పులోల్లు ఒత్తిడి చేస్తున్నారు. – బొడ్డు రాములమ్మ, ఎస్టీ హాస్టల్ వర్కర్ పెద్దవూర కుటుంబ పోషణ భారంగా మారిందంటున్న ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు అధికారులు స్పందించి జీతాలు ఇవ్వాలని వేడుకోలు -
చెరువులో మునిగి యువకుడి గల్లంతు
భూదాన్పోచంపల్లి : చెరువులో నాటుపడవపై షికారుకు వెళ్లగా.. పడవ మునగడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్పోచంపల్లి మండల పరిధిలోని గౌస్కొండ గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్కొండ గ్రామానికి చెందిన పాండాల శివ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్లో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. శివ సోమవారం ఉదయం బైక్పై డ్యూటీకి బయల్దేరుతుండగా.. అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితులు దుర్గాప్రసాద్, సాయి, తరుణ్, మల్లేశ్, రాము ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని శివకు చెప్పారు. దీంతో శివ తన తల్లికి ఫోన్ చేసి ఈరోజు డ్యూటీకి వెళ్లడంలేదని చెప్పాడు. అనంతరం స్నేహితులంతా కలిసి గ్రామ శివారులోని చెరువు సమీపంలో మద్యం సేవించారు. అనంతరం చెరువు ఒడ్డున మత్స్యకార్మికులు చేపలు పట్టేందుకు ఉపయోగించే నాటుపడవ కనిపించడంతో సరదాగా చెరువులో షికారు కొడదామని అందరూ కలిసి పడవ ఎక్కి చెరువు లోపలికి వెళ్లారు. చెరువులో కొద్దిదూరం వెళ్లాక అకస్మాత్తుగా పడవలోకి నీళ్లు రావడంతో వారంతా భయపడి ఒక్కొక్కరుగా చెరువులోకి దూకారు. ఐదుగురిని రక్షించిన చెక్క వెంకటేశ్..చెరువులోకి దూకిన వారంతా ఈత కొడుతూ కొద్దిదూరం వచ్చారు. మద్యం మత్తులో ఉండడంతో ఒడ్డు వరకు ఈదలేక కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న మత్స్యకార్మికుడు చెక్క వెంకటేశ్ గమనించి థర్మాకోల్తో చేసిన తెప్ప సహాయంతో ఐదుగురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. శివకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఒడ్డుకు చేరిన మిగతా యువకులు భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోచంపల్లి ఎస్ఐ భాస్కర్రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గల్లంతైన శివ ఆచూకీ కోసం స్థానిక మత్స్యకార్మికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
బ్యాటరీలు చోరీ చేసిన దొంగల అరెస్ట్
నేరేడుచర్ల : డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన టిప్పర్లలోని బ్యాటరీలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను నేరేడుచర్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న రాత్రి నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద గల డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన మూడు టిప్పర్లలోని బ్యాటరీలతో పాటు జనరేటర్ రూంలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. డాంబర్ మిల్లు వాచ్మన్ మాతంగి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి శివయ్య, కంచుగంటి కార్తీక్, పంటమూల జానయ్య చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి ముగ్గురిని అరెస్ట్ చేసి హుజూర్నగర్ కోర్టులో హాజరుపర్చి జడ్జి తీర్పు మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కాల్వలో బోల్తా పడిన కారు● ముగ్గురికి స్వల్ప గాయాలు సూర్యాపేటటౌన్ : కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం తెల్ల వారుజామున సూర్యాపేట పట్టణంలో జరిగింది. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి కాల్వలో బోల్తా పడింది. కారు డ్రైవర్కు, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. -
భూదాన వజ్రోత్సవాలకు ఆహ్వానం
భూదాన్పోచంపల్లి : పోచంపల్లిలో 18న నిర్వహిస్తున్న భూదాన వజ్రోత్సవాలకు హాజరుకావాలని సోమవారం హైదరాబాద్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత లవకుమార్, కొట్టం కరుణాకర్రెడ్డి, తడక యాదగిరి, కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, తొలుపునూరి కృష్ణ, పోతగల్ల నర్సింహ పాల్గొన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ కల్పించాలి దేవరకొండ : పార్లమెంట్లో మహిళా బిల్లుతో పాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం దేవరకొండలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. -
బుద్ధవనంలో కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ బృందం
నాగార్జునసాగర్: కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ ధర్మేంద్రకుమార్శర్మ, సభ్యులు గౌతం, గుల్షన్రాజు సోమావారం సాయంత్రం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ఇంజనీర్లతో కలిసి బుద్ధవనంలోని జాతక వనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన వారిని సత్కరించారు. వారి వెంట ఎస్ఈ మల్లికార్జున్రావు, ఈఈ సీతారాం, డీఈ అశోక్, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, నర్సింహ, విజయ్ తదితరులు ఉన్నారు. -
రైతులను ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కట్టంగూర్ : ఐకేపీ కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకుల హవా నడుస్తుందని, రైతులను పట్టించుకునేవారు కరువయ్యారని ఆరోపించారు. రైతులు మరలా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్లో పోసి రాత్రికి రాత్రే కాంటా వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులు రోజుల తరబడి ఇబ్బందులకు గురువుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వకుండా రైతుల సంఘాల పేరిట వేరే వారికి ఇవ్వటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 3 కిలోలు అధికంగా కాంటా వేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెరగటంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ అధికారుల నిఘా కొనుగోలు కేంద్రాలపై ఉండాలన్నారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, పెద్ది మల్లేష్ ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. సోమవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. వివిధ పుష్పాలు, తులసీ దళాలతో స్వామివారిని లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
ఎఫ్సీఐ ఉద్యోగినంటూ మోసం
మాడుగులపల్లి : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. యువతితో పెళ్లి కుదుర్చుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు పోలీసుల అదుపులో నిందితుడు..? -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే హత్య
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యాభర్తల అరెస్ట్ రిమాండ్కు తరలింపు -
వేడుక ఏదైనా.. బౌన్సర్ పక్కా!
మధుమేహం ప్రతి ఇంటి సమస్య మధుమేహం ప్రతి ఇంట్లో సమస్యగా మారిందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.- 8లోబౌన్సర్లు.. సినీ తారలు, బడా పారిశ్రామిక వేత్తల పక్కన మాత్రమే కనిపించేవారు. నగరాల్లో పబ్బులు, క్లబ్బుల్లోనే వీరి హడావుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైన సెలబ్రిటీ బయట అడుగు పెట్టినా, వేడుకై నా, ప్రారంభోత్సమైనా వీరిని నియమించుకోవడం సర్వసాధారణమైంది. అయితే, నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకూ విస్తరించింది. – నల్లగొండ టూటౌన్ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా బంధుమిత్రుల ముందు తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి కొందరు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంటున్నారు. వేడుకలో కొత్తదనం చూపించేలా, తోపులాట జరిగినా అదుపు చేసేలా పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. ఏ వేడుకలో చూసినా నల్లకోటు, దృఢమైన శరీరంతో కనిపించే బౌన్సర్లు సందడి చేస్తున్నారు. సంపన్న కుటుంబాల వారి వేడుకల్లో ఫంక్షన్ హాల్ గేటు నుంచి వేదిక వరకు వీరి హడావుడి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల బందోబస్తుతో పాటు బౌన్సర్ల సేవలను వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకూ బౌన్సర్లను వినియోగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభలకు సైతం బౌన్సర్లను వినియోగించారు. వివిధ పట్టణాల్లో షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ప్రారంభించేందుకు సినీనటులు, మంత్రులు వచ్చే సందర్భంలోనూ బౌన్సర్లను పెడుతున్నారు. బౌన్సర్ల వినియోగం పెరగడంతో సంబంధిత ఏజెన్సీలకు మంచి ఆదరణ లభిస్తోంది. యువతకు కూడా ఇదొక ఉపాధిగా మారింది. పదవ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు. బౌన్సర్లు ప్రతిరోజూ జిమ్లలో వ్యాయామాలు చేస్తూ, డైట్ పాటిస్తూ తమ శరీర ఆకృతిని కాపాడుకుంటున్నారు. ఫంక్షన్ల నిర్వాహకులు ఒక్కో బౌన్సర్కు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అందులో కొంత సెక్యూరిటీ సంస్థ కమీషన్గా తీసుకుంటుంది. అయితే నల్లగొండ జిల్లాలో పురుషులు మాత్రమే బౌన్సర్లుగా సేవలందిస్తున్నారు. మహిళా బౌన్సర్లు లేరు. ఏదైనా వేడుకకు మహిళా బౌన్సర్లు కావాలని కోరితే హైదరాబాద్ నుంచి పిలిపిస్తామని సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. శుభకార్యాలు జరుపుకునేవారు బౌన్సర్ల కోసం మా సంస్థను ఆశ్రయిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవడానికి బౌన్సర్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద కూడా మా బౌన్సర్ల సేవలు అందిస్తున్నాం. రాజకీయ పార్టీల సభలకు కూడా పంపిస్తున్నాం. దీంతో బౌన్సర్లకు డిమాండ్ పెరిగింది. – జానీపాషా, సురక్ష సెక్యూరిటీ అండ్ బౌన్సర్ సర్వీసెస్, నల్లగొండ కేవలం ఆడంబరమే కాకుండా, అవసరం కోసం వీరిని నియమించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వేడుకల్లో స్టేజీ మీదకు వెళ్లే సమయంలో తోపులాట జరగకుండా, అతిథులు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు బౌన్స ర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకుల సొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ శుభకార్యం చేసుకునేవారు సొంతంగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఫంక్షన్లు, షాపుల ఓపెనింగ్లలో రద్దీ నియంత్రణకు బౌన్సర్ల సేవలు సెలబ్రెటీలు వచ్చినప్పుడు సెక్యురిటీగానూ.. రాజకీయ సభలకు కూడా బౌన్సర్లు చిన్న పట్టణాలకూ విస్తరించిన ట్రెండ్ -
ఆపరేటర్ల రెమ్యూనరేషన్ విడుదల
భానుపురి (సూర్యాపేట) : సోషల్ ఎకనామిక్ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, అధికారులు మూడు వారాల పాటు సర్వే చేసి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసేందుకు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తాత్కాలికంగా నియమించుకున్నారు. వీరికి చెల్లిస్తామని చెప్పిన రిమ్యూనరేషన్ నిధుల లేమితో ఏడాదిన్నరగా పెండింగ్లో ఉంది. 2వేల మంది ఆపరేటర్లుసమగ్ర కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలు ఉండడంతో డేటాను ఎంట్రీ చేసే వారు అధిక సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ మందిని డేటా ఎంట్రీ కోసం తీసుకున్నారు. ఒక్కో ఫారాన్ని నమోదు చేస్తే రూ.29 చొప్పున చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు అధికారులు చెబుతున్నారు. పని పూర్తయి నెలలు గడుస్తున్న తమకు ఇస్తామన్న డబ్బులు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.రూ.1.07 కోట్లు విడుదలసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కుటుంబాలకు సంబంధించిన డేటాను ఆపరేటర్లు ఆన్లైన్ చేశారు. ఇందుకుగాను ఒక్కో ఫారానికి రూ.29 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.1,07,31,170లను కేటాయించింది. ఈ నిధులు మండలాల వారీగా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల వివరాలు సేకరించి వారికి డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం సోషల్ ఎకనామిక్ సర్వే డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇవ్వాల్సిన నిధులు విడుదల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు కేటాయింపు -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి
సూర్యాపేటటౌన్ : మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజలు తమ వంతు కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ కోరారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శని వారం ఔషధ నియంత్రణశాఖ, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ, నిబంధనల బలోపేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్ఓ ప్రారంభించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, హెచ్ఓడీలు, డాక్టర్లు పాల్గొన్నారు. -
డిఫెన్స్ డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : డిఫెన్స్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మన తప్పు కాకపోయినా ఇతరుల తప్పులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా వాహనం నడపడం మంచిదని పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్ డ్రైవింగ్పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మట్టపల్లి లక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి ఆలయ తిరు మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పనివేళలు మార్చాలిసూర్యాపేట అర్బన్ : ప్రస్తుతం ఎండలు ముదిరిన కారణంగా మున్సిపల్ కార్మికులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పని చేయించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం తగదన్నారు. కార్మికులకు నెలకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు అందించాలని కోరారు. 80 మంది మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కాంట్రాక్టర్ ద్వారా రూ.12 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు నాగమ్మ, యాదమ్మ, గట్టు నరేష్, వెంకటాద్రి, శ్వేత, సతీష్, భిక్షం, నాగయ్య, బక్కమ్మ పాల్గొన్నారు. 21న జిల్లా సదస్సుసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 21న సూర్యాపేటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్ హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుట్ల సైదులు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పెద్దింటి రంగారెడ్డి, దేసోజు మధు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి, నాయకులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ రోప్’ సమర్థవంతంగా నిర్వహించాలి
సూర్యాపేటటౌన్ : ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సూర్యాపేట, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీస్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఆధునీకరించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లు పంపిణీ చేశారు. సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనీవాస్రెడ్డి, సూర్యాపేట కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ప్రయాణికులు ఉన్నచోట షెల్టర్ లేక..
అర్వపల్లి : సూర్యాపేట–జనగామ, నకిరేకల్–తానంచర్ల జాతీయ రహదారుల ప్రధాన కూడలి ప్రాంతమైన అర్వపల్లి వై జంక్షన్ వద్ద బస్షెల్టర్ లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల కోసం గంటల తరబడి ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం రోడ్డులో హైవే వెంట గ్రామ శివారులో బస్షెల్టరు ఏర్పాటు చేయడంతో ఉపయోగం లేకుండా పోయింది. పర్సాయపల్లి, రామన్నగూడెంలో హైవే వెంట ఏర్పాటు చేసిన బస్షెల్టర్లు నిర్వహణలేక ధ్వంసం కావడంతో ప్రయాణికులకు ఉపయోగ పడడం లేదు. వాటిని కొందరు బైక్లు పార్క్ చేసుకోవడానికి వినియోగించుకుంటున్నారు. ప్రయాణికులు మాత్రం ఎండలో అవస్థలు పడుతున్నారు. వేల్పుచర్ల వద్ద హైవేపై, అడివెంల స్టేజీ వద్ద, నకిరేకల్ –తానంచర్ల హైవేపై సీతారాంపురం వద్ద బస్షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడుతున్నారు. -
రైలు కూత!
అన్ని జిల్లా కేంద్రాలకు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మూడు జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉండగా, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూడా రైల్వే కల నెరవేరబోతోంది. అందుకు అవసరమైన పనులకు 2026–27 రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్కు సంబంధించిన సమగ్ర కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రం దక్షిణ మధ్య రైల్వేకు అందించింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా చేపట్టే రైల్వే లైన్ల సర్వేలు, కొత్త లైన్లకు సంబంధించిన అంశాలను పేర్కొంది. వాటికి కొంత మేర నిధులు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఆచరణ రూపం దాల్చితే సూర్యాపేటతో పాటు దేవరకొండ వంటి ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ లభించనుంది. కీలక ప్రాజెక్టులకు నిధులు సూర్యాపేటను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – శంషాబాద్ లైన్తో పాటు నల్లగొండ, దేవరకొండను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – కర్నూల్కు సెమీహైస్పీడ్/హైస్పీడ్ రైల్వే కారిడార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఈసారి బడ్జెట్లో రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది పూర్తయ్యాక డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించనుంది. శంషాబాద్ – విశాఖపట్టణం లైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్ మీదుగా చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట మీదుగా జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని నుంచి విశాఖపట్టణం చేరనుంది. ఇక మరోలైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట మీదుగా సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్కు ఏర్పాటు చేయనున్నారు. 942 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రూట్లో సెమీ హైస్పీడ్ / హైస్పీడ్ రైల్ గంటకు 220 కిలోమీటర్ల వేగంగంతో ప్రయాణించనుంది. అంటే నాలుగు గంటల్లో శంషాబాద్ నుంచి విశాఖపట్టణం చేరనుంది. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల పొడవునా కొత్త రైల్వే లైన్ వేసేందుకు రూ.458.46 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 133 కిలోమీటర్లు ఉన్న డోర్నకల్ –మిర్యాలగూడ లైన్ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించింది. ఈ లైన్ నిఘా, ట్రాఫిక్ సర్వే కోసం బడ్జెట్లో రూ.37 లక్షలు కేటాయించింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో అదనపు బాక్స్ బ్రిడ్జీలు, నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వికలాంగుల కోసం సదుపాయాల కల్పన, ప్లాట్ఫామ్ల విస్తరణ, ఎస్కలేటర్లకు నిధులను కేటాయించింది. ఎఫ్ఎల్ఎస్ పూర్తయిన డోర్నకల్ – గద్వాల లైన్డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 చేపట్టిన ఎఫ్ఎల్ఎస్ మార్చి నెలలో పూర్తయిందని, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 296 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్కు సంబంధించిన డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా చివరి దశకు చేరుకుంది. ఒకటీ రెండు నెలల్లో ఆ నివేదిక రైల్వే బోర్డుకు చేరనుంది. రూ.5,330 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ లైన్ నిర్మాణం ఆచరణలోకి వస్తే డోర్నకల్ నుంచి కూసుమంచి మీదుగా పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ లేదా నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలకు చేరనుంది. వీటిల్లో ఈ రైల్వే లైన్ ఆచరణ రూపం దాల్చినా జిల్లాలో ఇంతవరకు రైల్వే కనెకట్టివిటీ లేని ప్రాంతాలకు రైల్వే సదుపాయం లభించనుంది.ఫ ఇప్పటికే నల్లగొండ, భువనగిరికి రైల్వే కనెక్టివిటీ ఫ ఇక సూర్యాపేటకూ రైలు సౌకర్యం ఫ కొత్త రూట్లలోనూ రైల్వే లైన్లు ఫ డోర్నకల్ – గద్వాల ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి ఫ మాచర్ల – నల్లగొండ లైన్కు రూ.458.46 కోట్లు కేటాయింపు ఫ డోర్నకల్–మిర్యాలగూడ అంశాన్ని పేర్కొన్న రైల్వే శాఖ ఫ 2026–27 బడ్జెట్ వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే -
చిలుకూరు కేంద్రంలో..
చిలుకూరు : కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గ్రామంలోని సెంటర్కు వచ్చి బస్సుల కోసం వేచి చూస్తుంటారు. బస్షెల్టర్ లేక ఎండలోనే నిలబడాల్సి వస్తున్నది. వర్షం పడితే దుకాణాల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. హైవే అథారిటీ వారు సీతారాంపురం, కవిత జూనియర్కళాశాల వద్ద బస్షెల్టర్లు ఏర్పాటు చేశారు కానీ మండల కేంద్రంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. వృద్ధులు, మహిళలు ఎండలోనే గంటల కొద్దీ నిలబడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు క్రాస్ రోడ్డు వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఇక్కడే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో బస్షెల్టర్ లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట–జనగామ, తొర్రూరు–మోత్కూరు వెళ్లే రూట్లోనూ బస్ షల్టర్లు లేక పోవడంతో రోడ్డు పైనే నిరీక్షించాల్సి వస్తున్నది. ఎండ వేడిమి తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణాల ముందు నిలబడితే షాపుల యజమానులు వెళ్లగొడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. -
జీవనశైలిలో మార్పుల వల్లే వ్యాధులు
సూర్యాపేటటౌన్ : మన జీవన శైలిలో మార్పుల వల్లే భౌతిక శ్రమ తగ్గిపోయి, మానసిక శ్రమ పెరగడం వల్లే అనేక వ్యాధుల బారిన పడుతున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ప్రపంచ హోమియో దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి ఔషధాలు వ్యాధిని లోతుల్లోంచి నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. నిత్యం యోగా, ప్రాణాయం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీలు డాక్టర్ శ్రీకాంత్ భట్, డాక్టర్ కృష్ణయ్య, ఆయూష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ రాకమృష్ణ, నరేష్ పాల్గొన్నారు. -
ఆంధ్రా నుంచి ధాన్యం తెచ్చే వారిపై క్రిమినల్ కేసులు
మఠంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వరి ధాన్యం తెచ్చే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హుజూర్నగర్ సీఐ గజ్జెల చరమందరాజు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని మట్టపల్లి వంతెనపై ఉన్న సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, వాహనాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని మట్టపల్లి వంతెన వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ నుంచి దళారులు అక్రమ మార్గంలో ధాన్యం తెలంగాణలోకి తెచ్చి మద్దతు ధర, బోనస్ పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన వెంట ఎస్ఐ బాబు, సిబ్బంది ఉన్నారు. -
బస్షెల్టర్ ఆక్రమణ.. రోడ్డుపై ప్రయాణికులు
నడిగూడెం : మండల కేంద్రంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన బస్షెల్టర్ భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు దీనిని వినియోగించుకోలేక పోతున్నారు. దాంతో ఇరువైపులా ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుమీద, బస్షెల్టర్కు చుట్టుపక్కల ఉన్న దుకాణాల వద్ద నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రం నుంచి ప్రజలు నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారంతా బస్సుల కోసం గంటల కొద్దీ రోడ్డు మీదే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. నిలబడేందుకు నీడ, కనీసం తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్కు మరమ్మతులు చేయించి, ఉపయోగంలోకి తీసుకరావాలని స్థానికులు కోరుతున్నారు. -
‘అరైవ్–అలైవ్’లో భాగస్వాములు కావాలి
భానుపురి (సూర్యాపేట) : అరైవ్ –అలైవ్ రోడ్డు భద్రత అవగాహన ఉద్యమమని, ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీహాల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఆర్అండ్బీ, రైల్వే, ఇరిగేషన్, ఆర్టీఓ, ఎడ్యుకేషన్, డీఎంహెచ్ఓ, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఎస్పీ కె. నరసింహతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలలో జిల్లా యంత్రాంగం కూడా భాగస్వాములై ప్రజలను, విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. రహదారులపై లోపాలను గుర్తించి సవరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే ఉన్న నిరూపయోగ బావులను పూడ్చివేయాలన్నారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ 13న అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రత గ్రామ సభలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు, సెన్సెస్పై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, ఆర్టీఓ జయప్రకాశ్రెడ్డి, సీపీఓ కిషన్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భూసేకరణను వేగవంతం చేయాలి జిల్లాలో అభివృద్ధి పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం వీసీ కాన్షరెన్స్హాల్లో జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇరిగేషన్, రైల్వే, ఇండస్ట్రియల్ పార్క్ వంటి పనులకు కావాల్సిన భూమిని త్వరితగతిన సేకరించి అందించాలన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు బస్సు ప్రమాదాలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా.. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తుతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుంచి బస్సు ప్రయాణికులు దిగారు.కామారెడ్డి జిల్లా: భిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి జాతియ రహదారిపై అంబులెన్స్- బస్సుఢీకొన్నాయి. ఘటనలో అంబులెన్లో ఉన్న సలేహా బాను (63), డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ (76)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తిరుపతి జిల్లా: ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించబోయి అవతలి వైపు రోడ్డు దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం నుంచి బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పాకాల సీఐ చిన్న గోవిందు, ఎస్ఐ తరుణ్.. . ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇరాన్పై యుద్ధం నిలిపివేయాలి
సూర్యాపేట : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులపై స్పందించకుండా ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లు, మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పు సరైంది కాదన్నారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును రివ్యూ చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుడాలో 320 ఎకరాల భూమిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆక్రమించారని ప్రచారం జరుగుతోందని, ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పిట్టల దొరలా వ్యవహరిస్తున్న ట్రంప్... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిట్టల దొరలా వ్యవహరిస్తూ అపరిచితుడిగా మారిపోతున్నాడని అన్నారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర కరువైందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
నేడు మెగా ఆయుష్ వైద్య శిబిరం
చివ్వెంల : సూర్యాపేట పట్టణంలోని జిల్లా జనరల్ హాస్పిటల్లో శుక్రవారం నిర్వహించనున్న మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ బి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కోరారు. పక్షవాతం, ఫైల్స్, కీళ్లవాతం, చర్మవ్యాధులు, ఎలర్జీ వంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓగా శిరీషసూర్యాపేట : జెడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన శిరీషకు సీఈఓగా పదోన్నతి లభించింది. ఆమె సూర్యాపేట జెడ్పీ సీఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను శిరీష కలిసి పూలమొక్క అందజేశారు. ఆమెకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్చారిసూర్యాపేటటౌన్ : బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేటకు చెందిన పోలోజు మహేష్చారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని బీసీ సంఘం కార్యాలయంలో మహేష్చారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్కుమార్ నియామకపత్రం అందజేశారు. శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం గావించారు. రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను గరుడ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చె న్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించండి
సూర్యాపేట : ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యవారం కార్యక్రమంలో 4వ రోజు ఎయిడ్స్ నివారణ ప్రచార దినం, రెడ్ రన్ను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీపై సరైన అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ.. అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల హెచ్ఐవీ సంక్రమించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్న్ఎండీ షఫీఉల్లా, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు నాజియా, శ్రీశైలం, శ్రావణి, శాంతకుమార్, అమూల్య, ప్రణీత్, వాసవి, వార్డు కౌన్సిలర్లు రాజేశ్, ఈద ప్రవీణ్, మాణిక్యం అరుణ, ఎస్ఓ పి.వీరయ్య, డిప్యూటీ డీఈఎమ్ఓ సంజీవ్రెడ్డి మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ రోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి జనరల్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పి.వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్కుమార్, ప్రవీణ్, దశరథ్, నిర్మల్కుమార్, విద్యాసాగర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్, మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్ వారోత్సవాల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ ఈ వీసీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్– విజయవాడ నేషనల్ హైవేపై 32 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, సీపీఓ కిషన్, ఆర్టీవో జయప్రకాశ్రెడ్డి, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
రైతులకు మేలు జరిగేలా చూడాలి
సూర్యాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే యంత్రాలు, తేమశాతం కొలిచే మిషన్లు, తాగునీరు, టెంట్లు, టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచామన్నారు. 2, 3 మండలాలకు కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను నియమించామని, జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా అధికారులు మోహన్బాబు, శ్రీధర్, జిల్లా కోఆపరేటీవ్ అధికారి ప్రవీణ్, పీఏసీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
హుజూర్నగర్ : విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఆర్టిజన్ల సంఘం ఉమ్మడి జిల్లా కోకన్వీనర్ నకులుడు, డివిజన్ ప్రెసిడెంట్ వెంకటనరసింహాచార్యులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్త విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెలో భాగంగా గురువారం హుజూర్నగర్లోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమ్మెలో డివిజన్ పరిధిలోని ఆర్టిజన్లు పాల్గొన్నారు. ఈ సమ్మెలో వారు పాల్గొని మాట్లాడుతూ.. ఆర్టిజన్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నిబంధనలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి ఆర్టిజన్లను జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని, ట్రెజరీ ద్వారా వేతనం ఇవ్వాలని కోరారు. మీటర్ రీడింగ్ తీసేవారికి కూడా న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కోకన్వీనర్ పి.మల్లయ్య, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, నాయకులు తిరుపతిరావు, సైదులు, జితేందర్రెడ్డి, వీరభద్రం, ప్రసాద్, శివ, శేఖర్రెడ్డి మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు బడిబాట
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాం. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేదు. –అశోక్, డీఈవో సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది అధికారికంగా నిర్వహించకపోయినా.. కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట నిర్వహించి విద్యార్థుల పెంపే లక్ష్యంగా పనిచేశారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ బడి బయట ఉన్న పిల్లలను గుర్తిస్తున్నారు. జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రస్తుతం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 690 ప్రాథమిక పాఠశాలలు, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు, 190 ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 70 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా ప్రతిఏటా జూన్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ముందస్తుగానే బాడిబాట నిర్వహించాలని ఆదేశించడంతో ఈ నెల 6వ తేదీ నుంచే ప్రారంభించారు. విద్యార్థుల గుర్తింపు... సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం జూన్్ 2 నుంచి నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మొదలుపెట్టడంతో.. ఈ కార్యక్రమంలో భాగంగా ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముందస్తు బడిబాట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బడిబాట నిర్వహిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత నిర్వహిస్తున్నారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్ల లను, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ తరగతులు గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది 7వేల మంది విద్యార్థులు.. గత ఏడాది ముందస్తు బడిబాట జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెంపునకు దోహదపడింది. ముఖ్యంగా గత ఏడాది జూన్ వరకు దాదాపు 7వేల మంది విద్యార్థులను గుర్తించి ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఫ ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కార్యక్రమం ఫ జూన్ 12వ తేదీ వరకు కొనసాగింపు ఫ బడి బయట, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల గుర్తింపు ఫ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం -
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించండి: ఎస్పీ
సూర్యాపేటటౌన్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం ఎస్పీ పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో రహదారులపై ఉన్న ట్రాఫిక్ రద్దీని, రోడ్ల వెంబడి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతున్నందున పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ఆర్టీసీ అధికారులను సంప్రదించి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు, మార్గాలను సులభతరం చేయాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీస్ సిబ్బందిని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకలపై దాడులను ఖండించాలిసూర్యాపేట అర్బన్ : ప్రశ్నించే గొంతుకలపై దాడులను ఖండించాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎంఎల్ )మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య, కారింగుల వెంకన్న, ఎర్ర అఖిల్ కుమార్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రకళ, కొత్తపల్లి రేణుక, సంతోషిమాత, కల్పన, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు భీమనపల్లి ప్రకాష్, నితిన, రాజు, నారాయణ పాల్గొన్నారు. -
కార్మికులకు ఆదివారం సెలవు ఇవ్వాలి
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట పట్టణ మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. మున్సిపల్ అధికారులు కార్మికులకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అందిస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెంకటాద్రి, నాగేశ్వరరావు, శ్వేత, కుమారి, సువార్త, కళమ్మ, వెంకటమ్మ, సతీష్, నవీన్, ఉప్పలయ్య, మారయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా బుధవారం మూడో రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులు అనే అంశంపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటిక ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అర్హతలు ఉన్నవాటికి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై, వాటి ప్రాంగణాలను సీల్ వేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్వో డాక్టర్ పెండెం వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రాయితీ పొందు
ముందే చెల్లించు ప్రభుత్వం ప్రకటించినన 5 శాతం ఆస్తి పన్ను రాయితీని మున్సిపాలిటీ ప్రజలంతా సద్విని యోగం చేసుకోవాలి. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో గాని, ఆన్లైన్ ద్వారా గాని ఒకేసారి ఆస్తిపన్నును చెల్లించి ఐదు శాతం రాయితీ పొంద్దవచ్చు. పట్టణవాసులు ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. – సీహెచ్.హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేటసూర్యాపేట అర్బన్ : నిర్ణీత సమయంలో ఆస్తి పన్ను వసూలు చేసి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ ఎర్లీ బర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ఈమేరకు మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 30 వరకు చెల్లిస్తేనే ప్రయోజనం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఈ నెల ఒకటి నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు 5 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలలోనూ పన్ను మేళాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయాలని ఆదేశించారు. గత సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయిలు ఉన్నట్లయితే, వాటిపై ఎటువంటి రాయితీ వర్తించదు. బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీని పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్ స్కీం కోసం ఆరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీల ఆర్థిక బలోపేతానికి.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు 5శాతం రాయితీ శుభవార్తగా మారింది. ముందస్తు పన్ను వసూలులో రెవెన్యూ పరంగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ఏటా ఆస్తి పన్ను వసూలు వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ స్కీమ్ ఉపయుక్తంగా మారింది. ఆన్లైన్లోనూ చెల్లించేలా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియను వేగవంత చేయాలని జిల్లా యంత్రాంగం.. మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ వెబ్సైట్, మొబైల్ యాప్ల ద్వారా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుకు ఎర్లీబర్డ్ స్కీం ఫ 30వ తేదీ వరకు చెల్లించిన వారికే 5శాతం రాయితీ వర్తింపు ఫ బకాయిదారులకు రాయితీ ఉండదు ఫ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన యంత్రాంగం మున్సిపాలిటీ భవనాలు డిమాండ్ (రూ.కోట్లలో..) సూర్యాపేట 36,800 21 తిరుమలగిరి 5,540 1.48 నేరేడుచర్ల 4,194 1.38 హుజూర్నగర్ 8,957 4.11 కోదాడ 17,718 8.23 -
కక్షిదారులకు అందుబాటులో ఉండాలి
చివ్వెంల (సూర్యాపేట) : న్యాయవాదులంతా కక్షిదారులుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ న్యాయసేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. నూతనంగా ఎన్నికై న సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి శాలువా కప్పి, పూలమొక్కను అందజేసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, ఉపాధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీ పసల బాలరాజు, గేమ్స్ సెక్రటరీ పత్తిపాక రాధాకృష్ణ, ఈసీ సభ్యులు వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, బొజ్జ అనిల్, బుక్క సుజాత, న్యాయవాదులు బచ్చలకూరి గోపి, ధరావత్ వీరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
మొక్కలు ఎండిపోకుండా కాపాడాలి
మోతె : వన నర్సరీల్లోని మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీరు అవి ఎండిపోకుండా సంరక్షించాలని జిల్లా ఆడిటింగ్ అధికారి (డీఏఓ) శ్యాంసుందర్ అన్నారు. బుధవారం మోతె మండలం రాఘవాపురం, నామవరంతోపాటు పలు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి మాట్లాడారు. నర్సరీల నిర్వహణకు రికార్డుల మెయింటెనెన్స్ పక్కాగా ఉండాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు వేసవిలో తాగునీరు, నీడ సౌకర్యంతో పాటు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత పీఓ, ఏపీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కృష్ణవంశీ, ఏపీఓ నాగేష్, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ దుచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో జోడు సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం జోడు సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ప్రజా సమస్యలపైనే నిరంతర పోరు
అర్వపల్లి : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. అర్వపల్లిలో బుధవారం నిర్వహించిన సీపీఎం నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేరళ సీఎం విజయన్ను విమర్శించడం తగదన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, పాత పింఛన్లను పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్రెడ్డి, మండల కార్యదర్శులు వజ్జె శ్రీనివాస్, వి.శ్రీనివాసులు, ఉప్పలయ్య, దేవరకొండ యాదగిరి, నాయకులు శిగ వెంకన్న, అవిలయ్య, సరోజన, లక్ష్మి, వెంకటేశ్వర్లు, అబ్బులు, సైదులు, యల్లయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి -
రహదారుల వెంటే ధాన్యం కొనుగోళ్లు
ఫ యథేచ్ఛగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న కమీషన్ వ్యాపారులు ఫ మద్దతు ధర కంటే తక్కువకు కొని మిల్లులకు తరలింపునేరేడుచర్ల : నేరేడుచర్లలో ధాన్యం వ్యాపారం రోడ్డెక్కింది. కొందరు వ్యాపారులు.. మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని రోడ్ల వెంటే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసి రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ ఘటన నేరేడుచర్ల మండల పరిధిలో యథేచ్ఛగా సాగుతోంది. పది రోజులుగా నేరేడుచర్ల మండలంలో యాసంగి వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం దిగుబడి అధికంగా వస్తోంది. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు నేరేడుచర్లలోని హుజూర్నగర్ రోడ్డు, జాన్పహాడ్ రోడ్డు, బైపాస్ రోడ్డులో తమ ఆఫీసులను ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొంటున్నారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,380 ఉండగా అంతకంటే తక్కువగా రూ.2,300లే చెల్లిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒప్పందంలో కమీషన్ పొందుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. -
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
సూర్యాపేట టౌన్ : పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా పోలీస్ భద్రత స్కీమ్ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారా యణ ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీం కింద మంజూరైన ఆర్థికసాయం చెక్కును బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉండి అకాలంగా మృతిచెందిన సిబ్బంది కుటుంబాలను పోలీస్ శాఖ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. కోదాడ వైద్యశాలలో ఆర్డీఓ విచారణకోదాడ : కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది నియమాకాల్లో అవకతవకలు జరిగాయని కొందరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో బుధవారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి శంకర్ వైద్యశాలలో విచారణ చేపట్టారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ బుధవారం ‘నియమాకాల్లో సిత్రాలు’ శీర్షికన వార్త ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించిన ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులను వైద్యశాలకు పిలిపించి వారు విచారణ చేశారు. ఏడుగురి వేతనాలను 11 మందికి పంచుతున్న విషయంపై వాంగ్మూలం సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ దశరథ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలికోదాడ : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి సిబ్బంది, అధికారులు కృషిచేయాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్యూషాఖాన్ సూచించారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అందుతున సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్లో కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు వయా నడిగూడెం మీదుగా బస్ సర్వీస్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నడిగూడెం మండలం చనుపల్లి, కోదాడ మండలం గణపవరానికి కూడా త్వరలో బస్సౌకర్యం కల్పిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా ఐదు లక్షల స్మార్ట్ కార్డులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం జానిరెడ్డి, డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నివారణకే హెచ్పీవీ టీకా
సూర్యాపేట టౌన్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడానికే ప్రభుత్వం హెచ్పీవీ టీకా పంపిణీ చేస్తుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 14 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు తప్పనిసరిగా ఈ టీకాను వేయించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,664 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని హెచ్పీవీ టీకా వేయించేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో టీకా వేస్తారని, విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా సంక్షేమ, విద్యాశాఖల అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, డీఈఓ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మాధవ్ కుమార్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
యువతకు ఉపాధి కల్పించేందుకే ఏటీసీలు
హుజూర్నగర్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఉన్న ఏటీసీ సెంటర్ను సందర్శించారు. సెంటర్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా రూ. 46 కోట్లతో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 172 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి రూ.2 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 14 కోట్లతో ఐటీఐ భవనం నిర్మాణంలో ఉందన్నారు. రాష్ట్రానికే తలమానికంగా మోడల్ కాలనీ హుజూర్నగర్ మోడల్ కాలనీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. రామస్వామి గుట్ట వద్ద 116 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఇళ్లను పరిశీలించి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. మోడల్ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోడల్ కాలనీ పనులను ఉద్దేశ్య పూర్వకంగానే అటకెక్కించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేశామన్నారు. ఈ నెలాఖరుకు మోడల్ కాలనీ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ప్రిన్సిపాల్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఏఎంసీ చైర్పర్సన్ డి.రాధిక, ఆర్డీఓ శ్రీనివాసులు, విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్య, తహసీల్దార్ కవిత, నాయకులు ఉన్నారు.ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
10 నుంచి మరో విడత గోదావరి జలాలు
అర్వపల్లి : యాసంగి సీజన్కు సంబంధించి గోదావరి జలాలను జిల్లాకు ఈ నెల 10 నుంచి 17 వరకు మరో విడుత విడుదల చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ తిరుమలగిరి డివిజన్–2 ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు 6 విడతలుగా గోదావరి జలాలు విడుదల చేశారు. అయితే వరి పంటలు చేతికందే దశలో ఉన్నాయని, నీటి విడుదలను నిలిపివేస్తే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యర్ధన మేరకు గోదావరి జలాలను చివరి విడతగా మరో వారం రోజులు విడుదల చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని వారు పేర్కొన్నారు. టైమ్టేబుల్ ప్రకారం ఎస్ఏ –2 పరీక్షలు నిర్వహించాలి హుజూర్నగర్ : రేపటి నుంచి జరిగే సమ్మెటివ్–2 పరీక్షలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు టైమ్టేబుల్ ప్రకారం నిర్వహించాలని డీఈఓ అశోక్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన తనఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ఎస్ఏ– 2 పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఎం బీరెల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు టున్నారు. బీసీటీయూ జిల్లా కమిటీ ఎన్నికసూర్యాపేటటౌన్ : బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటీని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల దేవరాజు, కోశాధికారిగా మండవ సైదులు, గౌరవ అధ్యక్షుడిగా పోతురాజు నరసయ్య ఎన్నికయ్యారు. బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 90 శాతానికి పైగా బహుజన విద్యార్థులు చదువుతున్నారని, పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని బలోపేతం చేసేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నె శంకర్గౌడ్, నల్లగొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, బి. శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు లింగాల రవిగౌడ్, మన్నూరి నాగన్న, దొంగర మహేష్, నిమ్మల శ్రీనివాస్, బైరు వీరస్వామి, నాయకులు అల్లాడి సత్యనారాయణ, సురభి శ్రీధర్, రాచకొండ నాగయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ఒడిబియ్యంఅర్వపల్లి : జనగామకు చెందిన శ్రీశైలం వనితాక్షేత్రం ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాపురంలోని సూర్యక్షేత్రంలో ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సూర్యనారాయణ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్దన్, గణపురం నరేష్, గ్రూప్ లీడర్లు గీత, వరలక్ష్మి, సంతోషి, రాజేశ్వరి, లలిత, సంధ్య, రమాదేవి పాల్గొన్నారు. బెల్లంకొండ సైదులు, జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి -
అన్నదాతల్లో ‘అకాల’ గుబులు
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం వరి పొలాలు కోత దశలో ఉన్నాయి. చాలా మంది రైతులు కోతలు కూడా ప్రారంభించారు. ఈ సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస్తే తాము ఇన్ని రోజులు పడ్డ శ్రమ వృథా అవుతుందని భయాందోళన చెందుతున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతులను మరింత కలవర పెడుతోంది. 4.82 లక్షల ఎకరాల్లో వరి సూర్యాపేట జిల్లాలో యాసంగి సీజన్లో 4.82 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. బోరు బావులు కింద మొదటగా సాగు చేసిన వరి పొలాలు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది రైతులు నూర్పిడి చేసి ధాన్యాన్ని మిల్లులు, మార్కెట్కు తరలిస్తున్నారు. మరి కొందరు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లారు. ఈ వారం రోజుల్లో 90 నుంచి 1.20 లక్షల ఎకరాల్లో పొలాలు నూర్పిడి కానున్నాయి. మిగతా పొలాలు మరో 15 రోజులకు కోతకు వచ్చిఏ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు కురిస్తే కోత దశలో ఉన్న పొలాలు ఆగమయ్యే ప్రమాదం ఉంది. ఈదురు గాలులు వీస్తే వరి పైరు పూర్తిగా నేల వాలిపోవడం, గింజలు రాలిపోవడం జరిగి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుంది.జిల్లాలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం సూర్యుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా సాయంత్రం వేళల్లో ఆకాశం మేఘావృతం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. దాంతో రైతులు తమ పొలాలను త్వరగా కోసుకునేందుకు ఆరాట పడుతున్నారు. అందరూ ఒకే సారి వరికోత యంత్రాల కోసం ఎగబడుతుండడంతో వారు రేట్లు పెంచుతున్నారని రైతులు చెబుతున్నారు. అయినా అవి దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోతలు కోసిన రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యంపై పట్టాలు కప్పి భద్ర పరుస్తున్నారు. ఫ కోతకు సిద్ధంగా వరి పొలాలు ఫ ఈదురు గాలులు వస్తే తీవ్ర నష్టం ఫ వాతావరణంలో మార్పులతో రైతుల్లో ఆందోళన -
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టుకు వచ్చిన కక్షిదారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మనకు వచ్చే రోగానికి సంబంధించిన సంకేతాలు శరీరంలో ముందుగానే కనిపిస్తాయని, వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. న్యాయవాదులు, కోర్టు ఆఫిసర్లు, సిబ్బంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, కోర్టు వైద్యాధికారి స్రవంతి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
టెన్త్ మూల్యాంకన రేట్లు పెంచాలి
సూర్యాపేటటౌన్ : పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకన రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భోజన విరామం సమయంలో జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాల వద్ద నిరసన తెలి పారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా పదో తరగతి పేపర్ మూల్యాంకన రెమ్యూనరేషన్ పెంచడం లేదని, ఇంటర్ మీడియట్ పేపర్ దిద్దే వారితో సమానంగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పాట్ ముగిసిన వెంటనే తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరారు. అనంతరం డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు శీనయ్య, వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు తంగెళ్ల జితేందర్రెడ్డి, పబ్బతి వెంకటేశ్వర్లు, బంధం వెంకటేశ్వర్లు, జహంగీర్, గుంటి సత్యనారాయణ, రామలింగారెడ్డి, ఆర్. లింగయ్య, యాకయ్య, ఆనంద భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల నిరసన -
హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పక వేయించాలి
నూతనకల్ : వివిధ రకాల క్యాన్సర్లకు కారణమైన వైరస్ నుంచి బాలికలను రక్షించేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పక వేయించాలని డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని హెచ్పీవీ వ్యాక్సిన్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు, ఇతర క్యాన్సర్ల నివారణకు వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. వైరస్ బారిన పడకముందే టీకా వేయించుకుటే వందశాతం రక్షణ పొందవచ్చని చెప్పారు. ఆయన వెంట మండల వైద్యాధికారి అశ్రితారెడ్డి, సీహెచ్ఓ శరణ్నాయక్, వైద్యసిబ్బంది ఉన్నారు. -
ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే ఊరుకునేది లేదు
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటరీకరణ విధానాలు అవలంభిస్తూ ఆర్టీసీ ఆస్తులను ఏకపక్షంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాయని, కార్మికులు చెమటోడ్చి సంపాదించుకున్న ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఎస్ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ హెచ్చరించారు. మంగళవారం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ భవన్ ఏ బ్లాక్పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆస్తులపై చేసిన నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీలకు కేటాయించాని కోరారు. కార్యక్రమంలో సంఘం డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
10 నుంచి అరుణోదయ రాష్ట్ర మహాసభలు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి సైదులు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 52 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో సమాఖ్య దోపిడీ, పీడన, అసమానత, అణచివేతలకు వ్యతిరేకంగా డప్పుల దరువు మోగిస్తూ జైత్రయాత్ర సాగిస్తుందన్నారు. సంఘం సభ్యులు, మేథావులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర ఉమేష్, నాయకులు పాల్గొన్నారు. -
రూ.99 లక్షల జీఎస్టీ ఎగనామం!
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీకి ఎగనామం పెట్టింది. ఈ ఏజెన్సీ యూనివర్సిటీకి జూనియర్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, డైనింగ్ హాల్స్ హెల్పర్లు, స్టోర్ కీపర్లు వంటి 113 మందిని కేటాయించగా వారు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని కేటా యించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా సదరు ఏజెన్సీ రూ.99 లక్షలు జీస్టీ ఎగ్గొట్టినా యూనివర్సిటీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అన్నీ తెలిసిన సందరు అధికారులు ఈ విషయాన్ని దాచి పెట్టడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీ చెల్లించాలని పలుమార్లు జీఎస్టీ అధికారులు యూనివర్సిటీతోపాటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో యూనివర్సిటీ అధికారులు రెండు నెలలుగా ఏజెన్సీకి ఇవ్వాల్సిన నిధులు నిలిపివేశారు. దాంతో వర్కర్లు, ఉద్యోగులకు వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల బాధ్యతారాహిత్యం..మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో వర్కర్ల కోసం టెండర్లు పిలిచిన సమయంలోనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ జీఎస్టీ సంస్థ నుంచి బకాయిలు లేనట్లు ఎన్ఓసీ సమర్పించాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీ అధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా సదరు ఏజెన్సీ సంస్థకు టెండరు అప్పగించారు. మూడు నాలుగేళ్లుగా జీస్టీ చెల్లించడం లేదని జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోక పోవడంతోనే సదరు ఏజన్సీ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టింది. ఒక్కో ఉద్యోగికి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, యూనివర్సిటీ నేరుగా 2 శాతం, ఏజెన్సీ ద్వారా 16 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ 16 శాతం డబ్బులను ఏజెన్సీ సంస్థ స్వాహా చేసినా అధికారులు పట్టించుకోలేదు. కొందరు వర్సిటీ అధికారులు ఏజెన్సీతో అంటకాగి ముడుపులు పుచ్చుకొని ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. జీఎస్టీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఏ అధికారికి నోటీసులు వెళ్లినా కూడా ఏజెన్సీ సంస్థకు జీతాలు, జీఎస్టీ చెల్లింపు అతడిదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా, రిటైర్డ్ అయినా కూడా వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఎంజీయూలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకం దాచిపెడుతున్న యూనివర్సిటీ అధికారులు రెండు నెలలుగా ఔట్సోర్సింగ్ వర్కర్లకు వేతనాలు ఇవ్వని ఏజెన్సీజీఎస్టీ చెల్లింపు బాధ్యత ఏజెన్సీదే.. ఉద్యోగులను, వర్కర్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీకి ప్రతినెలా 16 శాతం జీఎస్టీ చెల్లించాం. జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది వాస్తవమే. ఏజెన్సీ యజమానికి కూడా నోటీస్ ఇచ్చాం. జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీదే. – అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్ -
బాధితులకు భరోసా కల్పించాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరమైన పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు గ్రీవెన్స్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీస్శాఖ ప్రధాన లక్ష్యమన్నారు.లక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, నిత్యహోమం చేపట్టారు. అనంతరం అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్య ధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం క్షేత్రంలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు భక్తులు పాల్గొన్నారు. ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టిసూర్యాపేటటౌన్ : ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ, ఆరోగ్య భద్రతా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆహార భద్రతా ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చన్నారు. కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుందని, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జి.చంద్రశేఖర్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘భారతీయం’
కోదాడ : వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను పురష్కరించుకొని కోదాడలోని తేజ విద్యాలయలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్లు వాడ్రేవు చినవీరభద్రుడు, డాక్టర్ చక్రపాణి, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమకుమారి, కౌన్సిలర్ చీమ నరేష్, మారసాని సోమిరెడ్డి, ఉపేంధర్రెడ్డి, పాఠశాల నిర్వాహకులు ఉస్తేల రమా సోమిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
వీఓఏపై కలెక్టర్కు ఫిర్యాదు
పాలకవీడు : మండలంలోని రావిపమాడ్లో శ్రీనిధి రుణాల విషయంలో అక్రమాలకు పాల్పడిన వీఓఏపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి సుశీల, మహిళలు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వీఓఏ, ఏపీఎం బ్యాంక్ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని సంఘాల ప్రమేయం లేకుండానే రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. సమావేశం నిర్వహించకుండా, తీర్మానాలు లేకుండా తమ పేర్లతో లక్షల్లో అప్పులు తీసుకున్నారని వాపోయారు. దాంతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వారు పేర్కొన్నారు. అతడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. -
డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేయడంలో పోలీ సులు మరింత అప్డేట్ కావాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో భరోసా కేంద్రం, జిల్లా పోలీస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అన్నివిభాగాల్లో 15 సంవత్సరాల ముందున్నారన్నారు. దానిని కొనసాగిస్తూ సాంకేతికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మొక్కలు నాటారు. అంతకు ముందు భరోసా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం డీజీపీ స్వీకరించారు. భరోసా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేష్ భగవత్లకు ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మెమొంటోలు అందజేశారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న డీజీపీ యాదాద్రి భువనగిరి జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్లో దొంగ రివాల్వర్ చోరి చేశాడని, యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయంలో దొంగతనం కేసులు తనకు ఎప్పుడు గుర్తుకు వస్తాయన్నారు. అప్పటి పోలీసులు కలిసికట్టుగా పనిచేసి దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు అని అన్నారు. అన్నిచోట్ల పనిచేయడం వేరు.. ఇక్కడ పనిచేయడం వేరన్నారు. ఎస్పీగా, రాచకొండ కమిషనర్గా జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పోలీస్ అధికారులతో పంచుకున్నారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, భువనగిరి డీఎస్సీలు రవీందర్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఫ డీజీపీ శివధర్రెడ్డి -
11 నుంచి ఇన్నోవేషన్ పంచాయతీ
● పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ నెల 11న నల్లగొండ ఐటీ టవర్లో నిర్వహించనున్న ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలను, పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న సందేహాలకు నిపుణులు సలహాలు అందిస్తారని చెప్పారు. రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న ఆవిష్కర్తలకు ఉన్న వనరులు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారు నిపుణులతో చర్చించి, వ్యాపార సవాళ్లను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశ్రమల వ్యవస్థాపకులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు, సీపీఓ కిషన్, డీఎఫ్ఓ సతీష్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇన్చార్జి ప్రణయ్, అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలి భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వేణు మాధవరావు, అధికారులు పాల్గొన్నారు. -
కా్యన్సర్ దరి చేరకుండా !
తిరుమలగిరి(తుంగతుర్తి) : మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ టీకాతో మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లను అరికట్టవచ్చు. 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న కిషోర బాలికలకు టీకాలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో 11 వేల మంది కిషోర బాలికలు నమోదై ఉన్నారు. వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని మార్చిలోనే ప్రారంభించినా.. అవసరమైన వ్యాక్సిన్లు అందక పోవడం, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున కిషోర బాలికలు టీకాలకు ముందుకు రాకపోవడంతో కొద్ది రోజులు విరామం ఇచ్చారు. మళ్లీ మంగళవారం నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్జిల్లాకు ఇటీవల 2500 హెచ్పీవీ వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని జిల్లాలోని 23 పీహెచ్సీలు, నాలుగు అర్బన్హెల్త్ సెంటర్లు, ఒక సీహెచ్సీ, మూడు ఏరియా ఆస్పత్రులు, ఒక ప్రభుత్వ వైద్యశాలలో ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 500మంది కిషోర బాలికలకు టీకాలు వేశారు. మిగిలిన వారికి టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి అవగాహన.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, సూపర్ వైజర్లకు, ఏజెంట్లకు హెచ్పీవీ టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కల్పించింది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే హెచ్పీవీ టీకాలను వేయాలని నిర్ణయించినప్పటికీ కేంద్రం నుంచి టీకాలు సరఫరా కావడంతో జాప్యం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయడంతో బాలికలకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ జిల్లాకు చేరిన 2500 యూనిట్లు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా టీకాలు కిషోర బాలికల తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీకాలను అందుబాటులో ఉంచాం. – వెంకటరమణ, డీఎంహెచ్ఓ, సూర్యాపేట -
హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి
మిర్యాలగూడ టౌన్ : హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జగిత్యాల ధర్మ రక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామీజీ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్ కాలనీ చౌరస్తాలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ సంస్థలు పట్టణ, గ్రామాల్లోని ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలన్నారు. హిందువులందరినీ సంఘటితం చేయడంతో పాటు హిందూ సంప్రదాయాలు భావితరాలకు అందడం ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవచ్చన్నారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్, వికారాబాద్ సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కూర జయదేవ్, హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ.. హిందూ ధర్మం అంటేనే ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదన్నారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరంశెట్టి సీత కోటేశ్వర్రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా సహ వ్యవస్థాపకుడు చెరుపల్లి కరుణాకర్, గూడూరు శ్రీనివాస్రావు, జనార్దన్, గాయం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఏబీవీపీ జిల్లా కమిటీ ఎన్నిక
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో ఆదివారం ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు అధ్యక్షతన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జెరిపోతుల లక్ష్మణ్, కార్యదర్శిగా మాశెట్టి నరేష్, కోశాధికారిగా జగదీష్ కుమార్, ఉపాధ్యక్షులుగా రాచకొండ శ్రీనివాస్, కొత్తగట్టు యాదగిరి, సహాయ కార్యదర్శి అక్కల నరేష్, ఈశ్వర్, పీఆర్ఓగా చౌదరి రెడ్డి, కమాండెంట్గా పులుసు ఎల్లేష్తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గురునాధన్, జనగామ తిరుపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి శ్రీనివాస్ గౌడ్, మాజీ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్, జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి నరేష్, సుంకాని శ్రీనివాస్, కమాండెంట్ పులుసు ఎల్లేష్, సభ్యులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనారసింహుడికి విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం జరిపించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలిఆత్మకూర్(ఎస్) : మండలం కేంద్రంలోని నెమ్మికల్ గ్రామంలో ఉన్న పూలే – అంబేద్కర్ గ్రంథాలయంలో టీ–సాట్ ద్వారా నిర్వహించే ఆన్లైన్ శిక్షణ తరగతులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు ఆదివారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత ఉచిత ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయానికి టీవీని బహూకరించిన దాత శీలం వేణును సన్మానించారు. అదేవిధంగా మనం ఫౌండేషన్ ద్వారా గ్రంథాలయాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్ అధ్యక్షుడు గంపల కృపాకర్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు గంపల నారాయణ, గరిగంటి ప్రకాష్, శీలం వేణు, శంకర్, పూర్ణేష్, సునీల్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం మద్దతు ధర చట్టం చేయాలి హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని అమరవీరుల భవన్లో పట్టణ నాలుగో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరారు. ఆమేరకు కేంద్రం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పూర్తిగా అందించాలని, రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని, బోనస్ కూడా అందించాలని కోరారు. రెవెన్యూ పరిధిలో ఉన్న రైతుల సమస్యలను భూభారతిలో సులభతరంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో నాయకులు వీరబాబు, లక్ష్మమ్మ, సైదులు, హుస్సేన్, శీలం శ్రీను, మురళి, వీరయ్య, నాగేశ్వరరావు, వెంకన్న, లింగమ్మ, వెంకటేశ్వర్లు, వీరమల్లు, వీరస్వామి పాల్గొన్నారు. -
వరి కోతలు షురూ..
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. ఈమేరకు అధికారులు అన్ని మండలాల్లోనూ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈక్రమంలో రైతులు సన్న ధాన్యాన్ని ప్రైవేట్ మిల్లులకు తరలిస్తున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆరబెడుతున్నారు. 4.82 లక్షల ఎకరాల్లో వరిసాగు.. జిల్లాలో దాదాపు 4.82 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొత్తం ధాన్యం దిగుబడి 9లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని, 4.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సన్నరకం 2 లక్షల వరకు ఉంటుంది. ప్రధానంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఈ ధాన్యాన్నే సాగు చేశారు. అలాగే సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లోనూ దొడ్డురకం అధికంగా, సన్నరకం వరిని కొంతమేర రైతులు సాగు చేశారు. ఈ క్రమంలో మొదటగా నాటుపెట్టిన పొలాలు కోతకు వచ్చాయి. ఇందులో దొడ్డురకం, సన్నరకం రెండు ఉన్నాయి. ఈ రెండు రకాల ధాన్యాలకు ప్రభుత్వం వేర్వేరుగా 334 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. బోనస్ కారణంగా సన్నరకాలు సైతం కొనుగోలు సెంటర్లకు అధికంగానే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 15వేల ఎకరాలకు పైగా వరి కోతలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ వారంలో ముమ్మరం కానున్నాయి. ఒకేసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువలా రానుంది. ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు సన్నధాన్యం ప్రైవేట్ మిల్లులకు.. దొడ్డుధాన్యం కొనుగోలు సెంటర్లకు తరలిస్తున్న రైతులుసన్నాలు ప్రైవేట్ మిల్లులకు..చింట్ల వంటి కొన్నిరకాల సన్నాలు పచ్చిగా ఉన్నప్పుడే ధర ఉంటుంది. వీటిని సాగు చేసిన రైతులు నేరుగా ప్రైవేట్ మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికే హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ఆయా ప్రాంతాలతో పాటు మిర్యాలగూడలో ఉన్న ప్రైవేట్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.2400ల వరకు ధర పడుతుండడంతో రైతులు ఎలాంటి శ్రమ లేకుండా ఉంటుందని మిల్లుల్లోనే అమ్ముకుంటున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల రైతులు సైతం ప్రైవేట్ మిల్లులకే సన్నరకాలను తరలిస్తున్నారు. కొందరు రైతులు దొడ్డురకం ధాన్యాన్ని ప్రైవేటుగా మార్కెట్లో అమ్మకానికి వెళ్తే దాదాపు రూ.1700ల నుంచి రూ.1850ల వరకు ధర వస్తోంది. ఈ నేపథ్యంలో దొడ్డురకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి.. మద్దతు ధర కోసం రైతులు చూస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత సన్నాలను సైతం ఈ సెంటర్లకే తరలించనున్నారు. -
నిరంతరాయంగా విద్యుత్
విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు తక్షణం సరఫరాను పునరుద్ధరించి వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈఆర్టీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల పాటు ఈ సేవలు అందించేందుకు మా అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తమ సమస్యలను టోల్ప్రీ నంబర్ 1912 ద్వారా తెలియజేయవచ్చు. – శ్రీనివాస్, ఎస్ఈ, జిల్లా విద్యుత్ శాఖ●● మెరుగైన విద్యుత్ సరఫరాకు పటిష్ట కార్యాచరణ ● ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు సిద్ధం చేసిన విద్యుత్ శాఖ ● అందుబాటులోకి ఈఆర్టీ సేవలుసూర్యాపేట అర్బన్ : ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయం లేకుండా చూసేలా జిల్లా విద్యుత్ శాఖ అత్యవసర పునరుద్ధరణ బృందాలు (ఈఆర్టీ–ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీం) సేవలను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుత వేసవిలో తలెత్తనున్న విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు అత్యవసర రీస్టోరేషన్ బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందాల ద్వారా విద్యుత్ అంతరాయం సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తారు. వేసవి అనంతరం కూడా ఈ రీస్టోరేషన్ వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి. జిల్లాలో ఏడు ఈఆర్టీ వాహనాలుజిల్లాలో ఏడు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీం (ఈఆర్టీ) వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇవి 24 గంటల పాటు సేవలు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణం రంగంలోకి దిగేందుకు ఈ వాహనాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ వంటి నిత్యావసర మెటీరియల్ను ఈ వాహనాల్లో ముందుగానే లోడ్ చేసి ఉంచుతారు. సమస్య ఏర్పడిన వెంటనే విద్యుత్ శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునేందుకు వీలుగా ఈ వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టంను అమర్చారు. దీంతో ఎక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తినా వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం ఏర్పడింది. రైతులు, వినియోగదారులకు ఊరటఈ ఎమర్జెన్సీ సేవల వల్ల జిల్లాలోని రైతులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, సాధారణ వినియోగదారులకు ఎంతో ఊరట కలగనుంది. ముఖ్యంగా వ్యవసాయ పంపుసెట్లకు అంతరాయం లేకుండా విద్యుత్ అందడం వల్ల రైతాంగానికి మేలు జరగనుంది. గృహ, వ్యాపార అవసరాలకు సైతం కోతలు లేని విద్యుత్ను అందించాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.తక్షణ పరిష్కారానికి.. విద్యుత్ సరఫరాలో హఠాత్తుగా ఏర్పడే లోపాలు, లైన్ బ్రేక్డౌన్లు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను వీటి సహాయంతో తక్షణం పరిష్కరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుంది. వర్షాకాలం, ఈదురు గాలుల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు, తీగలు కనిపిస్తే వినియోగదారులు వెంటనే టోల్ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాల్సి ఉంది. ఈ టోల్ప్రీ నంబర్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. -
జగ్జీవన్రామ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
భానుపురి (సూర్యాపేట) : బాబు జగ్జీవన్రామ్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. ఆదివారం జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ విద్యాభ్యాసం నుంచి కుల వివక్షత ఎదుర్కొన్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల సంక్షేమానికి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లపాటు కేంద్ర కేబినేట్లో అనేక కీలక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ అధికారి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు -
రూ.కోట్లు ఖర్చు చేసి.. ఖాళీగా ఉంచారు!
కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపురం ఇందిరమ్మ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మించిన వసతిగృహాన్ని ప్రారంభించకుండా వదిలేశారు. కానీ గిరిజన కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తూ లక్షల రూపాయలను అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గిరిజన సంక్షేమశాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వదిలేశారులక్ష్మిపురం ఇందిరమ్మ కాలనీలో రెండు అంతస్తులతో రెండు వందల మంది విద్యార్ధులు ఉండే విధంగా గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం నిర్మించారు. పనులన్నీ పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారడంతో అధికారులు ఈ భవనం విషయాన్ని మర్చిపోయారు. ఇదే సమయంలో గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని అద్దెబవనంలో కొనసాగిస్తూ దానికి సంవత్సరానికి లక్షల రూపాయలను అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు. కళాశాలకు దూరంగా..కోదాడ పట్టణానికి లక్ష్మిపురం కాలనీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి కనీస రవాణ సౌకర్యాలు కూడా లేవు. పట్టణంలో ఉన్న ఏ ఒక్క కళాశాల దీనికి సమీపంలో లేవు. ఇవేమీ ఆలోచించకుండా అధికారులు కోట్ల రూపాయల ఖర్చు చేసి అక్కడ వసతి గృహాన్ని నిర్మించారు. నిర్మించిన అధికారులు దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. లక్ష్మిపురం కాలనీలో ప్రభుత్వ పాఠశాల లేదు. ఇక్కడ 700లకు పైగా గృహాలున్నాయి. కనీసం ఈ భవనంలో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించాలని కాలనీ వాసులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ.50 లక్షల యూజీసీ నిధులతో నిర్మించిన వసతిగృహం కూడా పది సంవత్సరాలుగా ఖాళీగా ఉంటుంది. పట్టణంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న మరోనాలుగు వసతి గృహాల్లో ఒకదానిని ఇందులోకి మారిస్తే లక్షల రూపాయల అద్దె చెల్లించే భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ప్రారంభించకుండా వదిలేసిన గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తూ రూ.లక్షల్లో చెల్లిస్తున్న అధికారులుకోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ఆంజనేయస్వామి దేవాలయానికి ఎదురుగా అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న గిరిజన కళాశాల విద్యార్థుల వసతిగృహం గడిచిన మూడు సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు లేకపోయినా గత్యంతరం లేక విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారు. ఈ భవనానికి నెలకి 55 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో రూ. 2 కోట్లతో మూడు సంవత్సరాల క్రితం సకల సౌకర్యాలతో ఇదే గిరిజన కళాశాల విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహం వినియోగంలోకి లేకుండా వదిలేశారు.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ఖాళీగా ఉంచి అద్దె భవనాలకు లక్షల రూపాయలు చెల్లించడం శోచనీయం. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం దుర్విని యోగం కాకుండా చూడాలి. – రాయపూడి చిన్ని, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ -
51 ఏళ్లకు ఒకే వేదికపైకి..
నేరేడుచర్ల : నేరేడుచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు 51 ఏళ్ల తరువాత ఒకే వేదికపైకి వచ్చారు. 1972 నుంచి 1975 వరకు 8, 9, 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం నేరేడుచర్లలోని అన్నపూర్ణ విశ్వేశ్వరాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆనాటి గురువులను సత్కరించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు కొణతం వెంకట్రెడ్డి, వి. వేలాద్రి, ఎంవైఎన్ చారి, పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్రెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు, బాల సైదులు, నర్సింహారావు, వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నర్సిరెడ్డి, జానయ్య, రామారావు, కృష్ణకుమారి, సోమయ్య, జానకిరామారావు, సత్యనారాయణ రెడ్డి తదితరులున్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత అన్నారు. గృహహింస, వరకట్న మరణాలపై శనివారం చివ్వెంల మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు మధు, మమత, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ కనకరత్నం పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ స్టవ్ల విక్రేతల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ అశోక్ శనివారం ఒక తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన 140 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేయుటకు గ్యాస్ స్టవ్లను (సుమారు 50 కేజీల అన్నం, కూరగాయలు వండేందుకు ఇనుప గ్యాస్ పొయ్యి) సరఫరాకు ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు సమర్పించాలని కోరారు.గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి : యాసంగి సీజన్కుగాను జిల్లాకు ఆరు విడతలుగా వదిలిన గోదావరి జలాలను నిలిపివేశారు. చివరి విడతగా పది రోజుల నుంచి నీటిని వదిలిన అధికారులు శుక్రవారం రాత్రి బంద్ చేశారు. వరిచేలు 15 రోజుల్లో చేతికందే అవకాశం ఉన్నందున మరో విడత నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ఓటర్ సవరణపై శిక్షణ ఇస్తాం భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమంపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవరావు, శ్రీనివా సులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. శాంతి నెలకొల్పాలిసూర్యాపేట అర్బన్ : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు–ప్రపంచ శాంతి కావాలి. డౌన్ డౌన్ ట్రంప్, మోదీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ నాయకులు లింగయ్య, సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్.భద్రయ్య, టీపీటీఎఫ్ నేత వీరన్న, ముస్లిం మైనార్టీ నాయకులు కాలే హమ్మద్, అబ్దుల్లా, ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ నాయక్
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఆయన ఎన్ని పనులున్నా.. రోజూ వ్యాయామం మిస్ చేయరు. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు ఎమ్మెల్సీ శంకర్నాయక్. కార్య కర్తలకు కూడా ఆయన ఇదే సూచిస్తారు.ఫ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ శంకర్నాయక్ ప్రత్యేక శ్రద్ధ ఫ సోషల్ మీడియాలో ఆయన ఫిట్నెస్ వీడియోలకు యూత్ ఫిదా ఫ మితాహారం, ఆరు గంటలు నిద్ర ఆయన హెల్త్ సీక్రెట్మిర్యాలగూడ : ఎమ్మెల్సీ శంకర్నాయక్ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ తొలుత జాగింగ్ చేస్తారు. 16 రకాల యోగాసనాలను వేస్తారు. ముఖ్యంగా వజ్రాసనం, కపాలభాతి వంటి ఆసనాలు వేస్తారు. తరువాత వెయిట్ లిఫ్టింగ్, డిప్స్తోపాటు వాలీబాల్, కబడ్డీ ఆడుతారు. చిన్నప్పటి నుంచే .. ఎమ్మెల్సీ శంకర్నాయక్కు చిన్నప్పటి నుంచే క్రీడలతోపాటు వ్యాయామంపై ఆసక్తి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు సైతం నిత్యం వ్యాయామం చేస్తారు. శంకర్నాయక్ ఏదైనా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు సైతం వ్యాయామం, శరీర దారుఢ్యానికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన యువత.. ‘ఫిట్నెస్ నాయక్’ అని కితాబిస్తున్నారు. ఆహార నియమాలు ఇవే.. శంకర్నాయక్ ఉదయం అల్పాహారంగా జొన్న గటక, రాగి సంకటి తీసుకుంటారు. మధ్యాహ్నం మిత భోజనం, రాత్రి జొన్నరొట్టె మాత్రమే తీసుకుంటారు. మాంసాహారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. నిత్యం ఆరుగంటలు తప్పకుండా నిద్రిస్తానని ఆహారం, నిద్ర నియమాలు పాటిస్తుండడంతో తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా శంకర్నాయక్కు ఆసక్తి ఉంది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. ఇటీవల శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతికోత్సవంలో కట్టప్ప వేషధారణ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రుల అభినందనలు అందుకున్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
● మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి సూర్యాపేట : బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కులతో పాటు 86 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ బీమా రూ.2లక్షలు అందజేస్తున్న ఏకై క పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు కార్యకర్తలను కాపాడుకోవడంలో కేసీఆర్ను మించిన వారే లేరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, ఆ పార్టీ నాయకులు అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్గౌడ్, సత్యనారాయణరెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం
కోదాడ : కోదాడ పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, పట్టణ ప్రజలు తమకు సహకరించాలని మున్సి పల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు కోరారు. కోదాడ అర్బన్ పార్కు దుస్థితిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులలో చలనం తీసు కొచ్చింది. ఈ వార్తను చూసిన కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమబాబు ఉదయమే మున్సిపల్ అధికారలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 20 మంది కామాటీలతోపాటు మున్సిపల్ డీఈ, శానిటరీ ఇన్స్పెక్టర్లతో పార్కు వద్దకు చేరుకొని దగ్గరుండి శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ రామినేని ఉదయశ్రీ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు -
నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి
సూర్యాపేట టౌన్ : కోర్టుల సిబ్బందితో సమన్వయంగా ఉంటూ వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు విధులు, పెండింగ్ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం తదితర అంశాలపై డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన కేసుల్లో నిందితులను వెంటనే న్యాయస్థానాల్లో హాజరుపరిచి రిమాండ్ తరలించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. కక్షిదారులను సమన్వయం చేసి లోక్అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను దస్త్రాలను, సమన్లు, వారెంట్లను పరిశీలించి పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్రెడ్డి, సీఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ బాధితులకు సౌలభ్యం కోసం ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు స్వీకరించి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఎస్పీ నరసింహ -
రిటైర్డ్ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేద్దాం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సభ్యత్వాలు అధికంగా చేయించి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బలోపేతానికి కార్యవర్గ సభ్యులంతా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. శనివారం సూర్యాపేటలో జరిగిన ఆ సంఘం మండల నోడల్ యూనిట్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యంపై విధివిధానాల రూప కల్పన జరుగుతుందని, వారం పదిరోజుల్లో జీఓ విడుదల కానుందని తెలిపారు. పీఆర్సీ అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, ప్రధాన కార్యదర్శి దండా శ్యాంసుందర్రెడ్డి, కోశాధికారి హమీద్ఖాన్, మండల అధ్యక్షుడు సుదగాని నాగేశ్వర్రావు, కార్యదర్శి శనగల యాదగిరి, నాయకులు సుధాకర్, రవీందర్రెడ్డి, గాలి శ్రీనివాస్, దేవీరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముక్త్యాల కెనాల్పై కొత్త వంతెన
కోదాడ : చిలుకూరు మండలం బేతవోలు రోడ్డులో ముక్త్యాల కాలువపై ఉన్న ఇరుకు వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. అందుకు ఇరిగేషన్ శాఖ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వంతెన నిర్మిణం పూర్తయితే ఇన్ని రోజులు ఇరుకు వంతెనతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. డబుల్ రోడ్డు వేసినా.. కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బేతవోలు క్రాస్ రోడ్డు నుంచి బేతవోలు గ్రామం మీదుగా జెర్రిపోతులగూడెం వరకు రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు వేశారు. కానీ ఈ మార్గంలో ఉన్న ఇరుకు వంతెన వద్ద మాత్రం సింగిల్ రోడ్డే ఉంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు అటు, ఇటు డబుల్ లేన్ ఉండడంతో ఎదురుఎదురుగా వచ్చిన వాహనాలు ఒకేసారి వెళ్లలేక ఒక వాహనం వెళ్లేంత వరకు రెండోది నిలిచి పోవాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో రెండు వాహనాలు ఒకేసారి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. బరాఖత్గూడెం వద్ద నిర్మాణం మునగాల మండలం బరాఖత్గూడెం నుంచి బేతవోలు రోడ్డులో ఉన్న ముక్త్యాల కాలువ 11.5 కిలోమీటర్ వద్ద కొత్త వంతెన నిర్మించనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయాలతో పాత వంతెనను తొలగించి ఆ ప్రాంతంలో కొత్తది నిర్మించనున్నారు. 29.28 మీటర్లు పొడవు, 7.5 మీటర్లు వెడల్పుతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. వంతెనకు రెండు వైపులా రక్షణ గోడను సైతం నిర్మించనున్నారు. తొలగనున్న ఇబ్బందులు ఇరుకు వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఈ ప్రాంత వాసులు పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతికి విన్నవించారు. దాంతో వారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంతెన నిర్మాణానికి కోటి రూపాయాలు మంజూరు చేయించారు. వెంతెన పూర్తయితే బేతవోలు, జెర్రిపోతులగూడెం, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, పోలేనిగూడెం, కొమ్ముబండ తండా, సీతరాంతండాతో పాటు విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వెళ్లే వాహనదారుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం ఫ వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి ఫ తీరనున్న ఇరుకు వంతెన కష్టాలుముక్త్యాల కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి ఇరి గేషన్ శాఖ నుంచి కోటి రూపాయాలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఆ తరువాత పనులు ప్రారంభిస్తాము. వంతెన నిర్మాణం పూర్తియితే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి. మానస, ఇరిగేషన్ ఏఈ, చిలుకూరు -
కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేదల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీఓ శంకర్, వివిధ సంఘాల నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి.సత్యనారాయణ, హుస్సేన్, పి.గామయ్య పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తు వేగవంతం : ఎస్పీ
సూర్యాపేట : కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్నాథ్, శివతేజ, సిబ్బంది ఉన్నారు. -
అధ్వానంగా అర్బన్పార్క్
ఫ రెండున్నర ఎకరాల్లో రూ. కోట్ల ఖర్చుతో ఏర్పాటు ఫ నిర్వహణ వదిలేయడంతో పచ్చదనం మాయం ఫ ఉన్న ఒక్క పార్క్నూ పట్టించుకోక పోవడంపై స్థానికుల విమర్శలు కోదాడ : కోదాడ పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన ఏకై క పార్క్ అధ్వానంగా మారింది. రూ.2.5 కోట్లు ఖర్చు చేసి రెండున్నర ఎకరాల్లో అభివృద్ధి చేసిన కోదాడ అర్బన్ పార్క్ నిర్వహణలేక ఆనవాళ్లు కోల్పోతోంది. రెండు ఏళ్లుగా పార్కును మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో పచ్చదనం కోల్పోయి పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. పార్కులోని బెంచీలు, క్రీడా పరికరాలు, విద్యుత్ దీపాలు విరిగిపోయాయి. పార్కు దుస్థితిపై ఓ బాలిక సోషల్ మీడియాలో పెట్టిన రీల్ చర్చనీయాంశమైంది. రెండున్నర కోట్ల ఖర్చుతో.. కోదాడ పట్టణంలోని 8వ వార్డులో ఉత్తమ్పద్మావతి నగర్ లే అవుట్ కింద వచ్చిన రెండున్నర ఎకరాల స్థలంలో కోదాడ అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. 2019లో పార్కు అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసి వివిధ పనులు చేపట్టారు. 2023లో మరోసారి కోటిన్నర ఖర్చు చేసి పార్కును అభివృద్ధి చేశారు. పచ్చదనం కోసం మొక్కలను నాటడం, వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లను నిర్మించారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడ ఏర్పాటు చేశారు. కొద్దిరోజులకే శిథిలావస్థకు పార్క్లో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, బెంచీలు, డస్ట్బిన్లు నాసిరకానివి కావడంతో కొద్ది రోజులకే పాడైపోయాయి. నిర్వహణ లేక వాకింగ్ ట్రాక్ మీద పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. పార్కులో మొక్కలకు నీరు పెట్టడానికి ఎవ్వరూ లేకపోవడంతో అవన్నీ ఎండిపోయాయి. పార్క్లో ఉన్న బోర్ మోటారు సైతం తీసుకెళ్లారని స్ధానికులు అంటున్నారు. మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్ధకు చేరడంతో పాటు వాటిలో సైతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. తలుపులు ధ్వంసమై వినియోగించుకునేందుకు వీలులేకుండా పోయాయి. చర్చనీయాంశమైన బాలిక రీల్ కోదాడ పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతున్న బాలిక అర్బన్ పార్క్ దుస్థితిపై రీల్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టింది. పార్కు దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, అధికారుల పనితీరు ఎండగడుతూ ఉన్న రీల్ ప్రస్తుతం కోదాడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయినా కోదాడ మున్సిపల్ అధికారులు మాత్రం ఈ విషయమై స్పందించడం లేదు. పార్కులోని వాకింగ్ ట్రాక్ దుస్థితికోదాడ అర్బన్పార్క్ -
కాశీగూడెంలో మద్యపాన నిషేధం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని కాశీగూడెం గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గురువారం ప్రజాపాలన గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో, గ్రామ పరిధిలో మద్యం అమ్మడం, కొనుగోలు చేయడం, తాగడం పూర్తిగా నిషేధమని, ఇందుకు గ్రామస్తులంతా కట్టుబడి ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అతిక్రమిస్తే వారికి గ్రామస్థాయిలో చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే జరిమానా ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని ఏపూర్ గ్రామంలో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇసుక అక్రమ రవాణాను నిలిపివేసేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. ఈ మేరకు గురువారం గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. గ్రామ సమీపంలో ఉన్న ఏటి నుంచి కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండడంతో గ్రామంలోని బోర్లు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్కు రూ.50వేలు, సహకరించిన వారికి రూ.10వేల జరిమానా విధించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఇసుక రవాణా సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ చంద్ర మోహన్, అభివృద్ధి కమిటీని సభ్యులు పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల యంత్రం
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కోదాడ: పేదల సౌకర్యార్థం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆరు నెలల క్రితం రూ.4కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ మిషన్ నేటికీ మూలన పడి ఉంది. దీని నిర్వహణకు అవసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లు నియమించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విలువైన యంత్రం ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. సిటీస్కాన్ మిషన్ ప్రారంభించిన నాడు రూమ్కు వేసిన తాళం ఇప్పటికీ తీసిన దాఖలాలు లేవు. దీని నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని వైద్యశాల నిర్వాహకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా నియమాకం మాత్రం జరగడం లేదు. దీంతో పేదలు సిటీ స్కానింగ్ కోసం ఖమ్మం, సూర్యాపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఆరు నెలలుగా తీయని తాళం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోదాడ ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచారు. నూతన భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ రూ.4కోట్ల విలువైన సిటీ స్కానింగ్ మిషన్ మంజూరు చేసింది. దీనిని వైద్యశాలలో మూడు గదులను కూలగొట్టి కొత్తరూం నిర్మించి అందులో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేశారు. కానీ దీని నిర్వహణకు అసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లను మాత్రం నియమించలేదు. యంత్రం పనిచేస్తుందా.. గడిచిన ఆరు నెలలుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసిన గదిపైన మరో రెండు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండడంతో దుమ్ము, ధూళి, సిమెంట్ గదిలోకి చేరి యంత్రం పాడైపోతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి సిటీస్కానింగ్ యంత్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.మహిళలను వేధిస్తే కేసులే : ఎస్పీచివ్వెంల(సూర్యాపేట) : మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అవసాన దశలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని, గంజాయి, డ్రగ్స్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సామాజిక అంశాలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా 300 గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దన్నారు. సైబర్నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్, సర్పంచ్ నగేష్ పాల్గొన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో వృథాగా సిటీ స్కానింగ్ మిషన్ రేడియాలజిస్టులు, టెక్నీషియన్లను నియమించకపోవడంతో వినియోగంలోకి రాని యంత్రం -
ఫేస్ చూపిస్తేనే అటెండెన్స్
కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం స్థానంలో ‘ముఖ గుర్తింపు హాజరు’ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ, 2 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో తరగతులకు డుమ్మా కొట్టడానికి వీలు లేకుండా పోతుంది. ఫైలెట్ ప్రాజెక్ట్గా మార్చి 15 నుంచి కొన్ని కళాశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. ఇది విజయవంతం కావడంతో అన్ని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి అమలులోకి తెచ్చారు. ప్రత్యేక యాప్ రూపొందించిన విద్యాశాఖఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పనిచేయకపోవడం, కృత్రిమ వేలిముద్రలు వాడడం వంటివి చేస్తుండడంతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్ఫోన్ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్ఆర్సీ యాప్ను తీసుకువచ్చింది. ‘రెయింట్ ఏఐ సొల్యూషన్స్’ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ సాగుతోంది. అధ్యాపకులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. ఒక్కసారి నమోదు అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి ఈ యాప్లో తమ పేరుతో పాటు ముఖాన్ని నమోదు చేసుకోవాలి. ఆ తరువాత యాప్ ద్వారా ప్రతిరోజు, ప్రతి పిరియడ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ విధానం పూర్తవుతుంది. కాగా.. కళాశాల లొకేషన్లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. ఫోన్లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్లో నమోదవుతుంది. దీని ద్వారా ఎంతమంది అధ్యాపకులు, విద్యార్థులు కళాశాలలకు వచ్చారు? ఎంతమంది డుమ్మా కొట్టారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. హాజరు పట్టిక అవసరం లేదుడిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలను ఉపయోగించాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్లో, రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగో సెమిస్టర్లో ఉండగా.. వీరికి యాప్ను ఉపయోగించి హాజరు నమోదు చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతో పాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేయనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమల్లోకి వచ్చిన ఎఫ్ఆర్సీ విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బందికి తప్పనిసరి కళాశాల ప్రాంగణంలో ఉంటేనే పనిచేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పనప్రైవేట్ కళాశాలలకు మినహాయింపుపై విమర్శలు జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సగానికిపైగా విద్యార్థులు తరగతులకు రాకుండా నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా కళాశాలలు కూడా అధ్యాపకులను నియమించకుండా కేవలం ఉపకార వేతనాల కోసమే కళాశాలలను నడుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానం అమలు చేసి ప్రైవేట్ కళాశాలలను వదిలేస్తే తమకు అడ్మిషన్లు తగ్గిపోతాయని, ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఎఫ్ఆర్సీ విధానం అమలు చేయాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
పూర్తిస్థాయిలో మూసీ ప్రక్షాళన చేపట్టాలి
నేరేడుచర్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళన పనులు కేవలం హైదరాబాద్ పట్టణానికే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలోని అరిబండి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లి కృష్ణానదికి త్రివేణి సంగమం అని అక్కడి వరకు ప్రక్షాళన చేపట్టాలని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టులో ఇసుక మేటలు, మట్టితో పూడిక పేరుకుపోయిందని, దీనిని తొలగించి నీటి నిలువలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన షట్టర్లను మరమ్మతులు చేయించాలన్నారు. కాలువకు ఇరువైపులా సీసీ లైనింగ్ పనులు చేపట్టాలని, చివరి భూముల రైతులకు నీరు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి శేఖర్రావు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్రెడ్డి, అనంత్ ప్రకాశ్, నగేష్, రామ్మూర్తి, హుస్సేన్, సైదులు, వడిత్యనాయక్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళి
సూర్యాపేట, సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో గురువారం జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లాడి సత్యనారాయణ గౌడ్, గోపగాని సుధాకర్ గౌడ్ గుణగంటి సురేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి వేణు సిద్ధార్థ్ గౌడ్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రవి, కార్యదర్శి సురభి శ్రీధర్ గౌడ్, తుంగతుర్తి డివిజన్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ గౌడ్, తండ అంజయ్య గౌడ్, బైరు విజయ్ గౌడ్, చిత్తలూరి రవీందర్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, పులుసు శ్రీనివాస్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, బాలగాని కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గృహహింస, వరకట్న మరణాలు వంటి నేరాలపై గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. లక్ష్మీనారసింహుడికి గరుడ వాహనసేవమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించిన అనంతరం మాంగల్యధారణ పూర్తిగావించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ప్రతిఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలి
సూర్యాపేట : ప్రతిఒక్కరూ చట్ట పరిధిలో బాధ్యతగా నడుచుకోవాలని ఎస్పీ కె.నరసింహ అన్నా రు. బుధవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.20 లక్షల విలువైనల 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులు కూడా కోల్పోతారన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR-పోర్టల్ (https-://www.ceir. gov.in)లో నమోదు చేసుకోవాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం ధర తగ్గించి..
సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని మిల్లర్లు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను ముంచుతున్నారు. గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చికెన్ షాపులు బంద్ భానుపురి (సూర్యాపేట) : చికెన్ షాపులకు కోళ్లు సరఫరా చేసే యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపుల యజమానుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా చికెన్ షాపుల యజ మానులు తమ షాపులను బంద్ చేశారు. జిల్లాకేంద్రంలో షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి తమ నిరసన తెలిపారు. దీంతో చికెన్ షాపులు జనం లేక వెలవెలబోయి కనిపించాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి ఆస్పత్రికి చేరుస్తున్నారు 108 సిబ్బంది. - 8లోనేడు గ్రామసభలుభానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈ సభలు జరగనున్నాయి. ఈ గ్రామసభల్లో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి పేర్లను చదివి వినిపించనున్నారు. అలాగే గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇవే కాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన తీరుపై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇందుకోసం వార్డు సభ్యుల నుంచి ప్రతి పౌరుడిని ఈ గ్రామసభలో భాగస్వామ్యం చేసేలా ఇప్పటికే ప్రచారం చేశారు. ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు కూడా అందజేశారు.ఫ అంతటా ఏర్పాట్లు పూర్తి ఫ గ్రామాల అభివృద్ధిపై చర్చించనున్న అధికారులు -
పారాక్వాట్ నిషేధం
ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది. జిల్లాలో ఈ మందు నిల్వ చేయడం, వాడకం ఎవరూ చేయొద్దు. ప్రాణాంతకమైన ఈ మందుతో చాలా ఇబ్బందులు వస్తాయి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భానుపురి (సూర్యాపేట) : గడ్డిమందు తాగి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. గడ్డిమందుకు విరుగుడు లేకపోవడంతో ఈ మందును ఏమాత్రం తీసుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలురకాల గడ్డిమందులు, అందులోనూ పారాక్వాట్ అనే మరో రకం గడ్డిమందుపై నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ మందు వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. ఇప్పటికే జీవో 24జారీ చేశారు. నిషేధంతో పారాక్వాట్ వినియోగం, నిల్వలపై యంత్రాంగం దృష్టిసారించింది. జిల్లాలో కొద్దిమొత్తంలోనే వినియోగం జిల్లాలో ఈ పారాక్వాట్ వినియోగం కొద్దిమొత్తంలోనే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ మందును మెట్టపంటల్లో కలుపు నివారణ కోసం వాడుతుంటారు. దీంతో గడ్డి జాతులకు చెందిన పలు రకాల కలుపు వెంటనే చనిపోతోంది. కూలీల ఖర్చు లేకుండా చాలామంది ఈ మందునే వాడుతున్నారు. అయితే తమ పంటలకు వాడుకోగా.. మిగిలిన మందును రైతులు మరోసారి వాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఇళ్లు, పొలాల వద్దనే ఉంచుతున్నారు. అనుకోకుండా ఇంట్లో జరిగే చిన్నచిన్న తగా దాలకు క్షణికావేశంతో ఈ మందును తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు జిల్లాలో చాలా కాలంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఈ మందు వాడకంపై వివరాలు సేకరించగా జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 200 లీటర్ల గడ్డిమందును వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ఒక్క పారాక్వాట్ గడ్డి మందు కాకుండా ఇతర గడ్డి మందులు తాగిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని రైతులు, ప్రజలు అంటున్నారు. గడ్డి మందులు తాగితే మనిషి ఎక్కువకాలం బతకడం కష్టమేనని రైతులు చెప్పుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ మెట్టపంటల్లో కలుపు నివారణకు ఈ గడ్డిమందు వినియోగం ఫ జిల్లాలో ప్రతి సంవత్సరం 200 లీటర్ల వరకూ వాడకం ఫ నిషేధంతో వినియోగం, నిల్వలపై యంత్రాంగం దృష్టి -
జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : మహనీయుల జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో బాబు జగ్జీవన్రామ్, బీఆర్.అంబేద్కర్ జయంతుల నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయుల చరిత్ర అందరికీ తెలిసేలా విద్యా సంస్థల్లో వ్యాసచరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యక్రమం చేపట్టిందని అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించేందుకు గురువారం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజం అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారని, కులమతాలకు అతీకంగా ప్రజాప్రతినిధులు, నాయకులను ఈ గ్రామసభలకు ఆహ్వానించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్, నరసింహారావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేటి నుంచి మూడు నెలల రేషన్
భానుపురి (సూర్యాపేట) : రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ను ఈ నెలలోనే ఇవ్వనున్నారు. జిల్లాలో 3,55,057 రేషన్ కార్డు దారులకు ప్రతినెలా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. మూడు నెలలకు 18వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మొత్తం బియ్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసే అవకాశం లేక పోవడంతో రెండు విడతలుగా ఇవ్వనున్నారు. అవి కూడా సన్న బియ్యమే అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026- 8లోమట్టపల్లి ఆలయంలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, నిత్యకల్యాణం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
మహిళల స్వావలంబనకు అడుగులు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు బలమైన అడుగు అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు రూ.10వేల కోట్ల ఆదా అయ్యిందన్నారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళలను సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ మోరి శెట్టి నివేదిత, సంక్షేమ అధికారి నరసింహారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం సుచరిత, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, సూర్యాపేట డిపో మేనేజర్ సునీత, కౌన్సిలర్ అరుణ పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, మైనింగ్ కార్య దర్శులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. -
పట్టాలెక్కేనా..
భానుపురి (సూర్యాపేట) : సాదా బైనామాల పరిష్కారానికి అనేక ఏళ్లుగా దరఖాస్తు దారులు ఎదురు చూస్తున్నారు. అనేక చిక్కుముడులు, అడ్డంకులతో వీటికి మోక్షం కలగడం లేదు. దాంతో కాగితాలపై రాసుకుని భూములు కొనుగోలు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి వేసిన ముందడుగు రైతుకు కాస్త ఊరట కలిగిస్తోంది. తమ సమస్య పరిష్కారానికి అడ్డంకులు తొలగినట్లేనని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యలు తీరనున్నాయి. కాగితంపై రాసుకొని కొనుగోళ్లు.. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదు. కేవలం అమ్మిన, కొనుగోలు చేసిన రైతులు గ్రామ పెద్దల సమక్షంలో తెల్లకాగితాలపై రాసుకొనే భూములు విక్రయించే వారు. ఆ తరువాత వ్యవసాయ భూములకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం ప్రారంభించడం, రుణాలు మాఫీ అవుతుండడంతో చాలామంది రైతులు భూముల రిజిస్ట్రేషన్ల వైపు మళ్లారు. మరి కొందరు రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు వెచ్చించాల్సి రావడంతో, ఆ మొత్తం వారి వద్ద లేకపోవడంతో అలాగే వదిలేశారు. ఈ క్రమంలోనే రైతుబంధు, రైతుభరోసా పథకాలు రావడంతో భూముల పంచాయతీలు మొదలయ్యాయి. 2020 అక్టోబర్లో ప్రభుత్వం ఈ సాదాబైనామా కింద భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో సూర్యాపేట జిల్లాలో 29,814 దరఖాస్తులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చినా.. సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయంలో పలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. కొంత కాలానికి కోర్టు చిక్కులు తొలిగిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో పేర్కొన్న ఇరుపక్షాల అంగీకారం నిబంధనతో వాటిని పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ఈ నిబంధనలో ప్రభుత్వం మార్పు చేసింది. కొనుగోలుదారు అందించే హామీ పత్రం (అఫిడవిట్)తో పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఫ సాదా బైనామాల పరిష్కారంలో అనేక చిక్కుముడులు ఫ దరఖాస్తులకు నేటికీ కలుగని మోక్షం ఫ జీఓలో సవరణతో దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు -
డ్రంకెన్ డ్రైవ్తోనే రోడ్డు ప్రమాదాలు
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేట : మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కుడకుడ రోడ్డు వరకు స్థానిక ప్రజలకు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెళ్లే వారిని గమనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అనుమతి పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకో వద్దని సూచించారు. పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం సురక్షితమని, నిదానంగా వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణుమాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనగణనకు సిద్ధంగా ఉన్నాం జనగణనకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. జనగణనకు సంబంధించి జనగణన రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలికేరి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
భానుపురి బడ్జెట్ రూ.107.30 కోట్లు
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.107.30 కోట్ల అంచనా బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం జిల్లాకేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో సూర్యాపేట మున్సిపల్ 2025–26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026–27 ముసాయిదా బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అన్నిరకాల పన్నులు, అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్, నాన్–ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో కలిపి మొత్తం రూ.107.30 కోట్లతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. ఇందులోనే అన్ని రకాల ఖర్చులు (వేతనాలు), పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ చార్జీలు, రుణాల చెల్లింపులు, గ్రీన్ బడ్జెట్, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణ, సాధారణ పరిపాలనకు కేటాయింపులు చేశామని ఆమె వివరించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడం అత్యవసరమన్నారు. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడం ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు. అనంతరం జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సి లర్లు తమ వార్డుల సమస్యలను చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫిఉల్లా, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించాలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడం మున్సిపల్ పాలక మండలి బాధ్యత అని అన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచుకోవాలన్నారు. ఫ ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్ ఫ ఆదాయ వనరులు పెంచుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అర్చకులు విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. అదేవిధంగా యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కైంకర్యాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపించారు. -
రాచకొండ రిజర్వాయర్కు డీపీఆర్ సిద్ధం చేయాలి
సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగు జలాలు అందించే రాచకొండ రిజర్వాయర్కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. రాచకొండ రిజర్వాయర్ నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నాలో రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు మారినా ఎస్ఎల్బీసీ, డిండీ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకం ఎత్తును 440 మీటర్లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు. 436 మీటర్లుగా నిర్ణయించి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు జలాలు అందించాలన్నారు. రాష్ట్రంలో సాగు జాలలు అందని నియోజకవర్గం మునుగోడు ఒక్కటే అన్నారు. ఈ కార్యక్రమాంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, నాయకులు బచ్చనగోని గాలయ్య, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, పల్లె శేఖర్రెడ్డి, కురుమిద్ద శ్రీనివాస్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ తదితరలున్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు
తిప్పర్తి : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గోలి మాధవరెడ్డి బైక్పై ఇంటికి వెళ్తుండగా తిప్పర్తి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంపెద్దఅడిశర్లపల్లి : బైక్పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవులు(29) బోర్వెల్ బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చెన్నకేశవులు బైక్పై అంగడిపేట నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో తన బోర్వెల్ వాహనం కనిపించడంతో బైక్ ఆపి డ్రైవర్తో మాట్లాడాడు. అనంతరం బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని..హాలియా : బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తానేదార్పల్లి గ్రామ బస్స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి(23) బైక్పై గుర్రంపోడు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తుండగా.. తానేదార్పల్లి గ్రామ బస్స్టేజీ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి వడ్లపల్లి మణిపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఅడ్డగూడూరు : భార్య మృతితో మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన సూదిరెడ్డి రాంరెడ్డి(58) భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి రాంరెడ్డి మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న పురుగుల మందు తాగి పొలం వద్ద పడి ఉండగా, అతడి కుమారుడు గమనించి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. -
సీఎంఆర్ ధాన్యం దిగుమతి చేసుకోం
భువనగిరిటౌన్ : 2025–26 రబీ సీజన్కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోబోమని యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మిల్లుల్లో ఇప్పటికే భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, కొత్తగా వచ్చే ధాన్యాన్ని భద్రపరచడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మిల్లర్లు తెలిపారు. ప్రస్తుతం 2024–25 రబీ కాలానికి సంబంధించి సుమారు 90,000 టన్నుల ధాన్యం మిల్లుల వద్దే నిల్వ ఉందని, అదేవిధంగా 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి మరో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి రా రైస్ పెట్టాల్సి ఉన్నందున, నిల్వలు పెరిగిపోయి మిల్లుల్లో అడుగు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పాత నిల్వలు పూర్తిగా డెలివరీ అయిన తర్వాతే కొత్త ధాన్యం దిగుమతి గురించి ఆలోచిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మార్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి అశోక్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
సూర్యాపేట : ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేవలం హుజూర్నగర్కే మంత్రిలా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ రాకపోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లేపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కందాల శంకర్రెడ్డి, మేకనబోయిన శేఖర్, దండ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలలుగా బడి మూసివేత
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పలుగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు డిసెంబర్లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పాఠశాల మూతపడే ఉంది. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో విద్యార్థులంతా ఇంటి వద్దే ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు పక్కనే ఉన్న పలుగుతండా ప్రాథమిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని పలుగుతండా వాసులు కోరుతున్నారు. ఉపాధ్యాయురాలి రాజీనామా కొత్తవారి నియమించకపోవడంతో తెరుచుకోని స్కూల్ -
సంఘాల లెక్కలు చెప్పడంలేదని..
కట్టంగూర్ : సమభావన సంఘాలకు చెందిన లెక్కలను చెప్పకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన మహిళా సంఘాలు సభ్యులు విచారణకు వచ్చిన అధికారులతో పాటు సర్పంచ్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. ఈ సంఘటన కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన వీబీకే నాగమణి మహిళా సంఘాలకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవటంతో అనేకసార్లు ఉన్నతాధికారులకు మహిళా సంఘాలు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అధికారులు విచారణ కోసం అనేకసార్లు గ్రామానికి వెళ్లి లెక్కలు తేల్చకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించటం లేదు. ఇందులో భాగంగా సోమవారం ఏపీఎం డి. రాములు, సీసీ ప్రసాద్తో కలిసి చెర్వుఅన్నారం గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం వెళ్లారు. గ్రామానికి వచ్చిన అధికారులు లెక్కలు చెప్పకుండా మరోసారి వాయిదా వేసినట్లు చెప్పడంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు గ్రామ పంచాయతీకి తాళం వేసి మూడు గంటల పాటు అధికారులతో పాటు సర్పంచ్ చిలుముల సైదులును నిర్బంధించారు. మహిళలు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ బంధం–2 అధ్యక్షురాలు గద్దపాటి రేణుక మాట్లాడుతూ.. తాను అధ్యక్షురాలిగా ఎన్నికై సంవత్సరం గడుస్తున్నా వీబీకే నాగమణి సంఘం లెక్కలు చూపించకుండా దాటవేస్తుందని, ఐకేపీ ధాన్యం కొనుగోలు నిర్వహణలో, సంఘం డిపాజిట్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. రాత్రయినా అధికారులను బయటకు పంపించకపోవటంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమభావన సంఘాల లెక్కలను క్లియర్ చేయిస్తామని హామీ ఇవ్వటంతో పంచాయతీ కార్యాలయం తాళం తీసి అధికారులను బయటకు పంపారు. మహిళా సంఘాల సభ్యుల ఆగ్రహం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన సభ్యులు చెర్వుఅన్నారంలో ఘటన -
అడ్లూరు గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత
కోదాడరూరల్ : కోదాడ మండలం అడ్లూరులో సోమవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. గ్రామసభ ప్రారంభం కాగానే ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష, కొందరు వార్డు సభ్యులు కలిసి ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలో ఎక్కడ పనిచేశారు, నిధులు ఎంత డ్రా చేశారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ గువ్వల శిరీష స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే పనులు చేశామని, పనులన్నింటికీ ఎంబీ రికార్డులు ఉన్నాయని, ఆ మేరకే నిధులు డ్రా చేశామని తెలిపారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా.. మొత్తం 10మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు. కర్రలతో దాడి చేసుకున్న రెండు వర్గాలు 10 మందిపై కేసు నమోదు -
ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనంగా నెలకు రూ.18 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్.కవిత, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో చేపట్టిన రాస్తారోకోలో వారు మాట్లాడారుఉ. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్యాయంగా తొలగించిన ఆశా వర్కర్ల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు రాధా భాగ్యలక్ష్మి, విజయ్ కుమారి, సైదమ్మ, ఉమా, హుస్సేనీ, సోమక్క, జ్యోతి, సుధా, సరస్వతి, అరుణ, సీత, జయమ్మ, సక్కుబాయి, బైనాబాయి, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గౌరవ సలహాదారులు శ్యామల అశోక్ పాల్గొన్నారు. -
ఫార్మాతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : ఫార్మా రంగంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీయూలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–2026 అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనశాస్త్ర విభాగంలో ఉన్న ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకొని పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అహ్మద్ కమాల్, రామాచారి, వసంత, వై.ప్రశాంతి, జ్యోతి, డి.రమేష్, ఆర్.రూప, ఎస్.కళ్యాణి, ఎ.శ్రీధర్రావు, ఎ.తిరుపతయ్య పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పెద్దవూర : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాకు చెందిన వడ్త్య తార(48) భర్తతో విడాకులు తీసుకుని అదే తండాలో తన తల్లి వద్ద ఉంటుంది. కొద్దిరోజులుగా ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ బుజ్జమ్మ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉట్లపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్కు వెళ్లిన తార మద్యం సేవించి గజ్జల లింగారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిద్రించింది. ఈ క్రమంలో రాత్రి గుర్తుతెలియని వాహనం రోడ్డుపై నిద్రించిన తారను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు మంగులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపారు. -
మొక్కల లక్ష్యం 44.36 లక్షలు
భానుపురి (సూర్యాపేట) : అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రానున్న వానాకాలం జిల్లావ్యాప్తంగా నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 44.36 లక్షల మొక్కలు పెంచాలని టార్గెట్ విధించగా అన్ని మండలాల్లో ఉపాధి హామీ కూలీలతో అవసరమైన మొక్కల పెంపకం చేపడుతున్నారు. మండలాలకు లక్ష్యాలు కేటాయించి.. జిల్లాలోని 486 గ్రామపంచాయతీలకు గాను 485 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన లక్ష్యంలో ఆయా మండలాల వారీగా జిల్లా యంత్రాంగం మొక్కల పెంపకానికి లక్ష్యాలను కేటాయించారు. ఇందులో మూడు జాతులకు చెందిన పలు రకాల మొక్కలను పెంచనున్నారు. పెన్పహాడ్ మండలంలో అత్యధికంగా 2.89 లక్షలు, సూర్యాపేట మండలంలో 2.67 లక్షల మొక్కలు పెంచాల్సి ఉంది. పంచాయతీలకు సంరక్షణ బాధ్యత జిల్లాలో మొక్కల పెంపకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల మట్టిని జల్లెడ పట్టించి కవర్లలో నింపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తనాలను సైతం విత్తగా మొలకెత్తాయి. ప్రధానంగా నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కల్లో ఉండే పలు రకాలను పెంచుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి. ఏ గ్రామ పరిధిలో పెంచే మొక్కలను అక్కడే నాటేలా చూస్తున్నారు. ఫ వనమహోత్సవానికి సన్నద్ధమవుతున్న అధికారులు ఫ 485 వన నర్సరీల ఏర్పాటు ఫ ఉపాధిహామీ కూలీలతో ముమ్మరంగా మొక్కల పెంపకం -
రెండు గణితం ఎస్ఏ పోస్టులు మంజూరు చేయాలి
సూర్యాపేట : ప్రతి ఉన్నత పాఠశాలకు తప్పనిసరిగా రెండు గణితం ఎస్ఏ పోస్టులు మంజూరు చేయాలని, గణిత ల్యాబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్ కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కాకతీయ కాన్సెప్ట్ స్కూల్లో గణిత ఫోరం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఎఫ్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర పరిశీలకుడు కొరివి కృష్ణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అడిగే సతీష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మండవ ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా జలగం పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శిగా సురేందర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, టీఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు నరేంద్ర స్వామి, మందాటి అశోక్, కోటేశ్వరరావు, కె.శ్యామ్ పాల్గొన్నారు. ఆర్య వైశ్యులు సమాజసేవకులుసూర్యాపేట : ఆర్యవైశ్యులు సమాజ సేవకులని, తాము జీవిస్తూనే పదిమందికి సహాయ సహకారాలు అందిస్తారని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కిరాణా ఫ్యాన్సీ భవన్లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ప్రథమ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా గౌరవ సలహాదారులు గోపారపు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి అట్టడుగు వర్గాన ఉన్న ఆర్యవైశ్యులకు సేవలు అందిస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం, శివాజీ మహారాజ్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవర శెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, మహంకాళి ప్రణీత్, సహాయ కార్యదర్శి కర్నాటి కృష్ణ, కోట శివ, వీరవెల్లి విజయ శంకర్ పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామికి అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం చేపట్టారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. తర్వాత విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయంలో నీరా జన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆల య అర్చకులు రామాచార్యులు , పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
ప్రచండ భానుడు
సూర్యాపేటలో శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుభానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. వేసవి కాలం ప్రారంభమైన కొద్దిరోజులకే ఉష్ణోగ్రతలు పెరిగాయి. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా శనివారం సూర్యాపేట పట్టణంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో భానుపురి ఒక్కసారిగా భగ్గుమన్నది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు ముదరడంతో బోరుబావుల్లో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణానికి మించి.. జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. కాగా ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగానే ఉంటుంది. రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతోంది. అయితే మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడు డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలంతా ఇదేవిధంగా ఎండల తీవ్రత ఉండగా.. శనివారం గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. 2025లో ఏప్రిల్ 7వ తేదీన 40.2 డిగ్రీలకు చేరగా.. ఈ వేసవిలో ముందుగానే శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలను చూసిన జనం బెంబేలెత్తి పోతున్నారు. ఉపశమనం కోసం.. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మిరప తోటలు ఏరుతున్న వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఇళ్లల్లోనూ వృద్ధులు, చిన్నారులు ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం 8గంటల వరకూ వాతావరణం చల్లబడి వర్షసూచన ఉన్నట్లు అనిపించినా.. మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎండల తీవ్రత పెరగడం, రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ప్రధానంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీ)ను రిపేర్ చేయించుకుంటున్నారు. 23 24 25 26 27 28ఫ ఈ సీజన్లో ఇదే అత్యధికం ఫ మూడురోజులుగా పెరిగిన ఎండ తీవ్రత ఫ గతేడాదితో పోల్చితే ముందుగానే భానుడి ప్రతాపంతేది -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసమే జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడం వల్ల స్నేహా పూర్వక వాతావరణం ఏర్పడుతుందని, ఇరువర్గాల వారు గెలిచిన వారు అవుతారన్నారు. ఒకసారి లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై అప్పీళ్లకు వేళ్లే అవకాశం ఉండదన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మంజూరు చేసిన రూ.కోటి 25లక్షల చెక్కు అందజేశారు. సూర్యాపేట జిల్లా కోర్టులో ఐదు బెంచీల ద్వారా నిర్వహించిన కేసుల్లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, విద్యుత్, మోటర్ వెహికల్ యాక్టు, గృహ హింస మొత్తం 1849 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జీ ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
దోచేస్తునా్నరు
ఖాతాలు అద్దెకు తీసుకునికోదాడ : సైబర్ నేరగాళ్లకు కోదాడ అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన పలువురు యువకులు కోదాడలోని మూడు బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని మ్యూల్ ఖాతాలుగా మార్చారు. (ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడాన్ని మ్యూల్ ఖాతాలంటారు) వీటిని ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు ఇతరుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ చేసి ఆ తరువాత ఆ ఖాతాల్లోని డబ్బులను కొల్లగొట్టి తాము అద్దెకు తీసుకున్న ఈ ఖాతాల్లోకి మరల్చడం వెంటనే వాటిని డ్రా చేసుకొని నేరానికి పాల్ప డుతున్నారు. సైబర్ నేరాలపై ఇటివల ప్రభుత్వం ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ పేరిట తనిఖీలు నిర్వహించగా కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 ఖాతాలు, ఇండియన్ బ్యాంక్లో 37,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 89 మ్యూల్ ఖాతాలను కనుగొన్నారు. పూర్తిస్ధాయిలో కోదాడ, పరిసర మండలాల్లోని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తే మరికొన్ని ఇలాంటి ఖాతాలు బయటపడే అవకాశం ఉందని పలువురు బ్యాంకు అధికారులే అంటున్నారు. ఈ మూడు బ్యాంకులలో 242 ఖాతాలు తెరిచిన వారు 1,271 సైబర్ నేరాలతో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రేడింగ్ యాప్తో మొదలు పెట్టి.. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం వల్లాపురం, సిరిపురం, మునగాల మండలం ఆకుపాములలో రెండు సంవత్సరాలుగా కొంత మంది యువకులు బినాన్స్ అనే ప్రైవేట్ ట్రేడింగ్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు దీని కోసం వీరు వల్లాపురం, సిరిపురం, ఆకుపాముల, అనంతగిరి, నడిగూడెం బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచారు. ఆ తరువాత నెమ్మదిగా వీటిని మ్యూల్ ఖాతాలుగా మార్చి భారీగా కమీషన్ తీసుకోసాగారు. తమ బంధువులకు, మిత్రులకు ఈ ట్రేడింగ్, మ్యూల్ ఖాతాలను గురించి చెప్పడంతో వందల మంది ఈ విధంగా చేయసాగారు. విషయం తెలుసుకున్న పలు బ్యాంకులు వల్లాపురం, సిరిపుర, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారికి ఖాతాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారంతా కోదాడలోని వ్యాపారం తక్కువగా ఉండే బ్యాంకులలో, కొత్తగా బ్రాంచీలు ఒపెన్ చేసే బ్యాంకులలో ఇలాంటి ఖాతాలను ఓపెన్ చేయడం ప్రారంభించారు. ఈ గ్రామాలకు చెందిన పలువురు సమీపంలో ఉన్న ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామలలో కూడా ఈ మ్యూల్ ఖాతాలను తెరిచారు. సైబర్ క్రైం పోలీసులు ఈ మూడు గ్రామాలలో పలు విడతలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా వీరు మాత్రం మారడం లేదని ఆయా గ్రామాల పెద్దలు అంటున్నారు. ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేయడంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లి న్యాయవాదుల ద్వారా రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని వల్లాపురం, ఆకుపాముల, సిరిపురం గ్రామాలకు చెందిన 116 మంది కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో కరెంట్ ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా ఒక యాప్ను ఉపయోగించి ట్రేడింగ్ చేస్తూనే ఈ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చారు. ఇలా అద్దెకు ఇచ్చే ఖాతాలను మ్యూల్ ఖాతాలు అంటారు. ఈ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ పేరుతో లూటీ చేశారు. ఇటీవల ఆపరేషన్ క్రాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైం పోలీసులు చేసిన తనిఖీలలో ఈ బ్యాంకులో ఖాతాలు తెరిచిన 116 మంది తమ ఖాతాలను కమీషన్కు ఆశపడినేరస్తులకు అద్దెకు ఇవ్వడం ద్వారా 778 సైబర్ నేరాలు జరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు నిర్ధారించారు.సైబర్ నేరాలకు అడ్డాగా కోదాడ రాష్ట్ర వ్యాప్తంగా 454 మ్యూల్ ఖాతాలు ఒక్క కోదాడలోనే 242 గుర్తింపు 1271 సైబర్ నేరాలతో సంబంధం ఆపరేషన్ క్రాక్డౌన్లో వెలుగు చూసిన అక్రమాలు37 కేసులు నమోదు చేశాం కోదాడ పరిసరప్రాంతాలకు చెందిన వారు కోదాడ బ్యాంక్లలో ఖాతా లను ఓపెన్ చేసి ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. దీనిపై నిఘా పెట్టి ఇటీవల తనిఖీలు చేశాం. అక్రమాలకు పాల్పడిన వారిపై 37 కేసులను నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తే తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. యువత తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – శివశంకర్, కోదాడ పట్టణ సీఐ -
గోదావరి జలాలు విడుదల
ఫ వారబందీ విధానంలో ఇదే తుది విడత అర్వపల్లి : చివరి విడత గోదావరి జలాలను శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 5 తడులుగా గోదావరి జలాలను వదిలారు. 6వ తడిగా చివరి విడత శుక్రవారం విడుదల చేశారు. 1,333 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వారబంధి విధానంలో వారం రోజులపాటు నీటిని సూర్యాపేట జిల్లాకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విడతతో షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల పూర్తయినట్లు తెలిపారు. -
మట్టపల్లి క్షేత్రంలో చలువ పందిళ్లు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కొంత ముందుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్షేత్రంలోని రాజగోపురం నుంచి ఆలయంలోని ముఖమండపం, గర్భాలయం వరకు.. అదేవిధంగా శ్రీపార్వతీ రామలింగేశ్వరాలయంలో పూజలు చేసుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. -
నేడు బౌద్ధమత ప్రతినిధుల రాక
హాలియా : నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధమత ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్నహత్, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్కోరియాగ్లోబల్ పీస్ అంబాసిడర్ మున్యోగ్ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు. మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం
ఫ అధ్యక్ష, కార్యదర్శులుగా కత్రం సీతారాంరెడ్డి, పోటు రంగారావు కోదాడ : నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపి, రెండుసార్లు వాయిదా పడిన కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు చివరకు ఏకగ్రీవంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి క్లబ్ కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ 2026–28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, వీరు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారిగా నియమితులైన న్యాయవాది ఎస్ఆర్కె.మూర్తి క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడిగా కత్రం సీతారాంరెడ్డి, క్యార్యదర్శిగా విశ్రాంత ఉపాధ్యాయుడు పోటు రంగారావును ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణరావు, సంయుక్త కార్యదర్శులుగా వంగవేటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్రావు, కార్యవర్గ సభ్యులుగా తమ్మనబోయిన రామయ్య, అమరనాయిని శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, మేకల ప్రతాప్, ముండ్రా రవికుమార్, ఇర్ల నాగమునీంధర్రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు(బాబు)లను ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సహకరించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మినారాయణ మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్లకు ఐదుగురు కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, పి.సత్యబాబు, ఎం.పాండురంగారావు, వేనేపల్లి వెంకటయ్య, పార సీతయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. -
బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్ సీసీఎఫ్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్ వ్యూ పాయింట్ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్ అటవీ సీసీఎఫ్ సునీల్ హీరావత్, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్, సాగర్ డీఎఫ్ఓ సంగీత, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నకిలీ బ్రాండ్లతో బియ్యం సరఫరా.. ఫ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్ బియ్యం వ్యాపారులు మిర్యాలగూడ అర్బన్ : నకిలీ బ్రాండ్ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్టౌన్ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది. -
అవగాహనతోనే విపత్తులను ఎదుర్కోవచ్చు
చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, ఆర్డదో వెలమ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్కుమార్చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ -
సూర్యాపేటలో జ్యోతిర్లింగ దర్శనం
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని రవి మహాల్లో సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని గురువారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి, భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని గజని మహ్మద్ ధ్వంసం చేసిన తరువాత అందులోని మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని అగ్నిహోత్రి బ్రాహ్మణులు గోప్యంగా దాచి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలకు బ్రహ్మర్షి రిషి దేవవ్రత్జీ, సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, చలమల్ల నరసింహ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు వంగవీటి రమేష్, బుద్ధ భిక్షపతి, సందీప్, బాణాల శ్రీనివాస్, రాధాకృష్ణ, నరేందర్ భరద్వాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
నల్లగొండ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్కే ఖాన్, మురళి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళననల్లగొండ టూటౌన్: యూనివర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్నానం చేసేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
అకమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్నఆరు ఇసుక రిచ్లలో అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ, ఏఎన్పీఆర్ కెమెరా పర్యవేక్షణతో పాటు ప్రతి సాండ్ టాక్సీ రీచ్లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై–ఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తిస్తే ఆ వాహనాన్ని బ్లాక్ చేయాలన్నారు. సీసీ కెమెరాతో అమర్చబడిన మొబైల్ వాహనం ద్వారా రీచ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం సంచరిస్తూ అక్రమ ఇసుక రవాణాను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు రీచ్లను సందర్శించాలని, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరాకు మాన్యువల్ ఉండదని ఆన్ లైన్ ట్రాన్సిస్ట్ పాస్ సిస్టమ్ (ఓటీపీఎస్), మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని, గ్రామపంచాయతీ సెక్రటరీ ఇసుక ఎంత కావాలో నిర్ధారిస్తే, సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణలో ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడీ విజయ రామారావు, డీపీఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు పాల్గొన్నారు.బీఈడీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెమిస్టర్లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోటయ్యారు. మూడో సెమిస్టర్లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది ఉత్తీర్ణులయ్యారు. 269 మందిప్రమోటయ్యారు. -
కషాయాలతో తెగుళ్ల నివారణ సులభం
గరిడేపల్లి : రైతులు పంటల సాగులో రసాయన మందులు వాడటంతో ఖర్చులు పెరగడం, నేల సారం తగ్గిపోవడం, పంటలలో అవశేషాలు మిగలడం, పర్యావరణ కాలుష్యం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వనరులతో అనేక కషాయాలు తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని గడ్డిపల్లి కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి. ఆదర్శ్ సూచిస్తున్నారు. రైతులే స్వయంగా తయారు చేసుకునే వివిధ రకాల కషాయాల గురించి ఆయన మాటల్లోనే.. ● వేప ఆకుల కషాయం : దీని తయారీ కోసం 5 కిలోల వేప ఆకులు, 10 లీటర్ల నీరు 24 గంటలు నీటిలో నానబెట్టి, మరిగించి వడకట్టాలి. వడకట్టిన కషాయాన్ని వరి, కూరగాయ పంటలపై పిచికారీ చేయడం వలన ఆకు తినే పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇది పంటకు హాని చేయదు. ఖర్చు తక్కువ. ● దశపర్ణి కషాయం : 10 రకాల ఆకులు, 200 లీటర్ల నీరు, 2 నుంచి 3 లీటర్ల గోమూత్రం కలిపి 20–25 రోజులు నానబెట్టి వడకట్టాలి. ఈ కషాయాన్ని వివిధ రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు ఉపయోగించుకోవచ్చు. ● మిరప, వెల్లుల్లి కషాయం : 500 గ్రాముల ఎండు మిరప, 250 గ్రాముల వెల్లుల్లిని నూరి నీటిలో 24 గంటలు ఉంచాలి. ఈ కషాయం పంటలపై పిచికారీ చేస్తే వేగంగా ఫలితం ఉంటుంది. ● గోమూత్ర, వేప కషాయం : 5 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల నీరు, కొన్ని వేప ఆకులు కలిపి 7 రోజులు నానబెట్టాలి. ఈ కషాయాన్ని ఫంగస్, తెగుళ్ల నివారణకు ఉపయోగించవచ్చు. పంట రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ● అల్లం–వెల్లుల్లి, మిరప కషాయం : అల్లం 250 గ్రాములు, వెల్లుల్లి 250 గ్రాములు, మిరప 250 గ్రాములు నూరి 24 గంటలు నీటిలో ఉంచాలి. ఈ కషాయం అన్నిరకాల రసం పీల్చే పురుగులను నాశనం చేస్తుంది. ఠి ఆవు పేడ ఆధారిత కషాయం : ఆవు పేడ 5 కిలోలు, నీరు కలిపి కొన్ని రోజులు పూతపోసి వడకట్టాలి. ఈ కషాయం పిచికారీ చేయడం వలన నేలలోని తెగుళ్లు నశించి, నేల సారవంతమవుతుంది. ● నీమాస్త్రం : వేప ఆకులు, గింజలు 5కిలోలు, ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 నుంచి 48 గంటలు పూతపోసి వడకట్టి స్ప్రే చేయాలి. వరి, పత్తి, కూరగాయల పంటల్లో తెల్ల దోమ, ఆకుతినే పురుగులు, చిన్న పురుగులు నశిస్తాయి. ● బ్రహ్మస్త్రం : వేప, రావి, బిల్వ, తులసి, సీతాఫలం వంటి 5 నుంచి 7 రకాల చేదు ఆకులు మొత్తం 10కిలోలు తీసుకుని 10 లీటర్ల ఆవు మూత్రంతో కలిసి 2 నుంచి 3 రోజులు పూతపోసి మరిగించి చల్లారిన తర్వాత వడకట్టాలి. ఈ కషాయాన్ని కాండం తొలిచే పురుగును నివారిస్తుంది. ● అగ్నియాస్త్రం : ఎండు మిరప కిలో, వెల్లుల్లి 500 గ్రాములు, పొగాకు 500 గ్రాములు, ఆవు మూత్రం 10 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 గంటలు పూతపోసి వడకట్టి ఉపయోగించాలి. తెల్లదోమ, ఆకులపై ఆశించే పురుగులను ఈ కషాయం నాశనం చేస్తుంది. జీవామృతం : ఆవు పేడ 10కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, శనగపిండి, పప్పు పిండి 2 కిలోలు, నీరు 200 లీటర్లు కలిపి 48గంటలు పూతపోసి నేలలో లేదా స్ప్రే రూపంలో ఉపయోగించాలి. ఈ కషాయం వలన నేల ఆరోగ్యం మెరుగుపడి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. పంట ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఘన జీవామృతం : ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు కలిపి ఎండబెట్టి గుళికలుగా తయారు చేయాలి. విత్తే ముందు లేదా నాటే సమయంలో నేలలో వేసుకోవచ్చు. దీని వలన నేల సారవంతం పెరుగుతుంది. వరి, ఇతర పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణకు ఈ కషాయాలు ఉపయోగపడతాయి. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ఆదర్శ్ సూచనలు -
వడగళ్లు కాదు.. దూది పూలు
పెద్దవూర : పై ఫోటోను చూసి వేసవిలో రాళ్ల వర్షం కురిసిందా.. భూమిపై అంతా మంచు పేరుకుపోయిందా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబడినట్లే. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన గుంటుక కృష్ణారెడ్డి గత వానాకాలం సీజన్లో తన చేనులో పత్తిని ఏరించాలనుకునే సమయానికి నవంబర్లో వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పత్తి చాలా వరకు రాలిపోయింది. వర్షాలు తగ్గాక పత్తి ఏరడానికి కూలీల కొరత ఏర్పడడంతో నేలపై రాలిపోయిన పత్తిని ఏరలేదు. ఐదు రోజుల క్రితం పత్తి కట్టెను తొలగించటంతో భూమిపై రాలిపోయిన పత్తి అంతా ఇలా తెల్లగా కనిపిస్తోంది. పెద్దవూర మండలంలోని చాలా వరకు పత్తి చేలలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి
మిర్యాలగూడ అర్బన్ : తండ్రితో కలిసి బైక్పై స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో వచ్చి కబలించింది. మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బెట్టెతండా గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీను కుమారుడు చరణ్(11) మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత శ్రీను తన బైక్పై చరణ్ను తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా.. ఈదులగూడ బైపాస్ రోడ్డు వద్ద ధాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రోడ్డు పక్కకు పడిపోగా.. ట్రాక్టర్ ట్రాలీ టైరు చరణ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు శ్రీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. రైలు ఢీకొని తెగిపడిన ప్రయాణికుడి కాలు మిర్యాలగూడ అర్బన్ : రైలు పట్టాలు దాటుతుండగా జారి కిందపడిన వ్యక్తి కాలు పైనుంచి రైలు వెళ్లడంతో కాలు తెగిపడింది. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే ఏఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన చేవూరి వెంకటాచారి గుంటూరుకు వెళ్లేందుకు గాను ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ రైల్వే స్టేషన్కు వచ్చాడు. ఒకటో నంబర్ ప్లాట్ఫాం పైకి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ నల్లగొండ నుంచి వస్తోంది. రెండో ప్లాట్ఫాం వద్ద ఉన్న వెంకటాచారి రైలు వేగాన్ని గమనించకుండా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. దీంతో అతని ఎడమకాలు పైనుంచి రైలు వెళ్లడంతో పాదం వరకు తెగిపడింది. స్థానికులు గమనించి 108 వాహనంలో అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్ఐ తెలిపారు. -
పంచాయతీ స్థలాన్ని విక్రయిస్తున్నారంటూ..
శాలిగౌరారం : మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని విక్రయించేందుకు సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ రంగు రాములు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ శీలం అనితాశంకర్ కుమ్మకై ్క గ్రామ పంచాయతీకి చెందిన 363 చదరపు గజాల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థలాన్ని విక్రయించొద్దని, ఇతర అవసరాలకు వినియోగించాలని చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయమై సర్పంచ్ శీలం అనితాశంకర్ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ స్థలాన్ని అమ్మేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఉప సర్పంచ్ రాములు దురుద్దేశంతో, రాజకీయ ఆధిపత్యం కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్లు ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. అర్ధనగ్నంగా ఉప సర్పంచ్ నిరసన -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని అన్నాదురై నగర్కు చెందిన గుండె శ్రీకాంత్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన శ్రీకాంత్ చోరీలకు పాల్పడుతున్నాడు. శనివారం రాత్రి సూర్యాపేటలోని సాయినగర్లో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 3 తులాల బంగారం, సుమారు 20 తులాల వెండి వస్తువులు, రూ.1000 నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం శ్రీకాంత్ను పట్టుకొని విచారించగా.. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
డ్రగ్స్కు వ్యతిరేకంగా వినూత్న ప్రచారం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, తెలుగు పండితుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో డ్రగ్స్కు వ్యతిరేకంగా సోమవారం పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ‘పరాభవనామ సంవత్సరంలో ఏ రాశికి చెందిన వారైనా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైతే అవమానం, వ్యయం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ ఉంటుంది’ అంటూ అవగాహన కల్పించారు. యువత, ప్రజలు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో రాజ్యపూజ్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయని, ఆదాయం పెరుగుతుందని, వ్యయం తగ్గుతుందన్నారు. అలాగే రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం వాటిల్లి కుటుంబాలకు తీరని శోకం మిగులుతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు. -
నాలుగు రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుంది
కోదాడ: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కేసు దర్యాప్తు నాలుగు రోజుల్లో పూర్తవుతుందని ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి తెలిపారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన మృతుడి తల్లి కర్ల లలితమ్మను అడిగి వివరాలు సేకరించారు. రాజేష్కు పోలీసులు వేసినట్లుగా చెబుతున్న ఇంజెక్షన్ను ఆయన స్వాధీనం చేసుకున్నారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నత్తనడకగా విచారణ : మంద కృష్ణమాదిగ రాజేష్ మృతి కేసు దర్యాప్తును నత్తనడకన చేస్తున్నారని, బాధ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. సోమవారం రాజేష్ ఇంటికి ప్రత్యేక దర్యాప్తు అధికారి వస్తున్నారని తెలుసుకున్న ఆయన కోదాడకు వచ్చారు. రాజేష్ తల్లి, దర్యాప్తు అధికారితో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉండగా.. అప్పటి డీఎస్పీ, ప్రస్తుత డీఎస్పీ, జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తికాకపోతే ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట ఏపూరి రాజు, నాగరాజు తదితరులు ఉన్నారు. కర్ల రాజేష్ మృతి కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి -
ఫ్రెండ్లీ పోలీసింగ్తో నమ్మకం పెరిగింది
నకిరేకల్ : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నకిరేకల్ పట్టణంలోని వైశ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. పోలీసులంటే భయం అనే భావన పోయిందన్నారు. అనేక సందర్భాల్లో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకునే అవకాశం కల్గిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ విజయవంతం కావాలంటే ప్రజలు కూడా సహకరించాలని కోరారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు సమాజ శాంతి, భద్రత కోసం పనిచేయడం మనందరి బాధ్యత అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు -
‘టీ–ఫైబర్’ కనెక్షన్ ఏదీ..?
రామన్నపేట : అతి తక్కువ ఖర్చుతో ప్రతి పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్ ద్వారా ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ, టీవీ సేవలను అందించాలని రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నేటికీ క్షేత్రస్థాయిలో కనెక్షన్లు ఇవ్వకపోవడంతో టీ–ఫైబర్ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. టీ–ఫైబర్నెట్ గ్రిడ్తో ప్రయోజనాలుభారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మల్టీపర్పస్ కనెక్షన్ : ఒకే కనెక్షన్తో ఫోన్, ఇంటర్నెట్, టీవీ మరియు ఓటీటీ సేవలు పొందవచ్చు. స్మార్ట్ టీవీగా మార్పు : ప్రత్యేక సెటాప్బాక్స్ ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. కీబోర్డు, మౌస్ ఉంటే చాలు, ప్రత్యేకంగా కంప్యూటర్ కొనాల్సిన పనిలేదు. విద్యా సేవలు : విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్ క్లాస్లు వినడం, హోంవర్క్ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ : ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడటంతో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. భూగర్భ కేబుల్ వేసినా..జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద రెండేళ్ల క్రితమే లక్షలు ఖర్చు చేసి టీ–ఫైబర్ సెట్లను అమర్చారు. వీటికి విద్యుత్ సరఫరా కోసం ఖరీదైన సోలార్ ప్యానళ్లను కూడా బిగించారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. ప్రస్తుత పరిస్థితి ఇలా..కొన్నిచోట్ల రైతు వేదికలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో పరికరాలన్నీ దుమ్ము పట్టిపోతున్నాయి. సిరిపురం వంటి గ్రామాల్లో ఇవి కేవలం అలంకారప్రాయంగా మారాయి. పేపర్ లెస్ సేవలకు ఆటంకంటీ–ఫైబర్ కనెక్షన్లు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్ లెస్) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. పరికరాలు అమర్చి రెండేళ్లు అలంకారప్రాయంగా సోలార్ ప్యానళ్లు పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలకు తప్పని నిరీక్షణ ప్రభుత్వ కార్యాలయాలకూ కనెక్షన్లు శూన్యం -
సైనిక లాంఛనాలతో జనార్దన్ అంత్యక్రియలు
నకిరేకల్ : స్విమ్మింగ్పూల్లో ఈత కొడుతూ గుండెపోటుతో మృతిచెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా 31 ఎన్సీసీ బెటాలియన్ సైనికులు జనార్దన్ భౌతికకాయంపై త్రివర్ణ పతాకం, పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారి నర్సింహ, ఉపాధ్యక్షుడు కొమ్ము కోటేష్, సైనిక సంక్షేమ శాఖ అధికారులు భిక్షపతి, రాజు, దామోదర్, అంజాద్, నర్సింహ ఉన్నారు. -
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
శ్రీరామయ్య జీవితం స్ఫూర్తిదాయకం
నేరేడుచర్ల : కమ్య్టూనిస్టు ఆశయాల కోసం తుది శ్వాస విడిచేంత వరకు కొనసాగిన గొప్పనేత శ్రీరామయ్య అని, ఆయన జీవితం నేటి కమ్యూనిస్టులకు స్ఫూర్తి దాయకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండలం మూడారం గ్రామంలో శ్రీరామయ్య భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే భూమి కోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర నేత మల్లు లక్ష్మి మాట్లాడుతూ శ్రీరామయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు పారేపల్లి శేఖర్రావు, కోదమగుండ్ల నగేష్, అనంత్ ప్రకాశ్, సిరికొండ శ్రీను, పోశనబోయిన హుస్సెన్, మర్రి నాగేశ్వర్రావు, కట్ట మధు బాబు, నాగ సైదులు, శ్రీధర్, బాబురావు,. రాణమ్మ, జానకిరాములు, రామ్మూర్తి, హఫీజ్, నర్సింహ్మ, పాతూరి శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
సూర్యాపేటటౌన్ : అతి కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన సమానమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సాధించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విదేశీ పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాములు మాట్లాడుతూ జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టు, తరగతికొక టీచర్ను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి. వెంకటయ్య ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, ఉపేందర్రెడ్డి, మంజుల, శ్రీనివాసరావు, అనిల్కుమార్, బాల్రాజ్, వెంకటేశ్, సత్తిరెడ్డి, వేణుగౌడ్, పింగల్రెడ్డి పాల్గొన్నారు. ఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరి పారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. 24న కలెక్టరేట్ ఎదుట నిరసనసూర్యాపేటటౌన్ : ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించలేదని విమర్శించారు. పీఆర్సీ ఫిట్మెంట్ వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు యాకయ్య, సుభాని, రమేష్, లాలయ్య, హనుమంత్, మల్లికార్జున్, సాల్మన్, మహేష్, మధు కుమార్, మహేందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, నర్సయ్య, రవి కుమార్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం
ఫ ముఖ్య అతిథులుగా హాజరైన గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ భువనగిరిటౌన్ : పీఎం సంసద్ పోటీల్లో విజేతలకు ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్, కేంద్ర మంత్రికి అదనపు కలెక్టర్ భాస్కర్రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు. -
డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదు
నల్లగొండ టౌన్ : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండికి అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు వస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ను సీపీఐ ఆద్వర్యంలో సందర్శిస్తామన్నారు. ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం పరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో బొల్గూరి నర్సింహ, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రవణ్కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు గవర్నర్, కేంద్ర మంత్రి రాక
భువనగిరిటౌన్ : పీఎం సంసద్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ఆదివారం భువనగిరి పట్టణానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రానున్నారు. ఇందుకు గాను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేస్తున్న వేదిక ఏర్పాట్లను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేంద్గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. -
ఫూలే, జగ్జీవన్రామ్ చూపిన మార్గాలే దిక్సూచి
తుంగతుర్తి : మహాత్మా జ్యోతిబాఫూలే, జగ్జీవన్రామ్ చూపిన మార్గాలే మనకు దిక్సూచి అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే విగ్రహావిష్కరణ, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. అనంతరం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్, చింతకుంట్ల మిట్టల్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), మందుల నరేష్, చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రేగటి రవి, సుంకరి జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే మందుల సామేల్ -
కట్టెల పొయ్యితో కుస్తీ !
కోదాడ : వంటగ్యాస్ కొరతతో కోదాడలోని ఓ హోటల్ యజమాని కట్టెల పొయ్యితో వంటకాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో వంట చెరకు క్వింటా రూ.700 ఉండగా ప్రస్తుతం వీటి ధర కూడా వెయ్యి రూపాయలకు చేరింది.శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి నిత్య కల్యాణం వైభవంగా చేశారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
జీడీడీపీలో మెరుగు
స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో సూర్యాపేట 9వ స్థానం 2025 డిసెంబర్ 22వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చిన్న తరహ పరిశ్రమల్లో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 2,38,879 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, 64,723 పరిశ్రమలతో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 38,113 పరిశ్రమలతో సూర్యాపేట 10వ స్థానంలో ఉండగా, 25,469 పరిశ్రమలతో యాదాద్రి భువనగిరి జిల్లా 17వ స్థానంలో ఉంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రై జెస్ (ఎంఎస్ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్ పోర్టల్లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది. స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది. తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది. జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వే –2023 వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధిక రేషన్ షాపులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 1051 రేషన్ షాపులు ఉండగా, 5,38,650 రేషన్ కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 611 రేషన్ షాపులు ఉండగా, 3,69,926 కార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉండగా, 2,50,292 రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడి జిల్లాలోనే చాలా తక్కువ భూములు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో సగటున 5,30,742 మంది చేతుల్లో (ఇండివిడ్యువల్స్) 5,14,402.40 ఎకరాలు ఉండగా, సూర్యాపేటలో 2,86,897 మంది చేతుల్లో 2,64,521.06 ఎకరాల భూమి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,33,535 మంది చేతుల్లో 2,32,250.67 ఎకరాలు ఉంది. అందులో నల్లగొండలో వ్యవసాయం చేసే 66,876 మంది ఎస్సీల చేతుల్లో 42,125 ఎకరాలు ఉండగా, 75,264 మంది ఎస్టీల చేతుల్లో 58,186 ఎకరాలే ఉంది. సూర్యాపేట జిల్లాలో 29,970 మంది వ్యవసాయం చేసే ఎస్సీల చేతుల్లో 16,159 ఎకరాలు ఉండగా, 43,713 మంది ఎస్టీల చేతుల్లో 31,968 ఎకరాల భూమి మాత్రమే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 28,223 మంది ఎస్సీలకు 16,487 ఎకరాలు, 14,542 మంది ఎస్టీల చేతుల్లో 9542 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు వర్షపాతంలో వ్యత్యాసం నమోదవుతోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 76 శాతం వ్యత్యాసం నమోదైంది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం వ్యత్యాసం ఉండగా, సూర్యాపేటలో 30 శాతం వ్యత్యాసం నమోదైంది. ఫ పరిశ్రమల్లో పది.. తలసరి ఆదాయంలో 14వ స్థానం ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే ఫ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న ఔత్సాహికులు సోషియో ఎకనామిక్ ఔట్లుక్–2026 వెల్లడి -
దోచుకుని పంచుకునేందుకే బడ్జెట్
ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శ సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడారు. రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ సిటీ పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయానికి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు నిధులు కేటాయించలేదని, ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు కూడా నిధులు లేవన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు బడ్జెట్లకు రూ.12వేల కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్ళు అయిందని, ఇక ఉన్నది రెండు బడ్జెట్లు కాబట్టి వచ్చినవన్నీ దోచుకుందాం పంచుకుందాం అన్న రీతిలో ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, తూడి నర్సింహారావు, ఆకుల లవకుశ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాలకు ప్రతీక రంజాన్
సూర్యాపేటటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు పలించాలని, త్యాగా లకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్ది అని, ఆయన హయాంలోనే పండుగల ప్రాధాన్యత పెంచుకున్నామని, అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రమాద స్థలాల పరిశీలనతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పోలీస్స్టేషన్ను ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను, తిరుమలగిరి క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యత తీర్చేందుకు ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాపారులు రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడతారని తెలిపారు. అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత కార్యాచరణ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణ రహదారులకు మహర్దశ
బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గ్రామాలను కలుపుతూ ఉండే లింక్ రహదారులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించినట్లుగా నిధులు విడుదల చేస్తే ఈ రహదారులన్నీ బాగుపడి రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాయితీలపై రుణా లను మంజూరు చేసేందుకు గతేడాది ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆయా వర్గాల నుంచి దాదాపు 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిధులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ బడ్జెట్లో సుమారుగా రూ.6వేల కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. -
సమతుల్యంగా ఉంది
కోదాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమతుల్యంగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. విద్యారంగానికి 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. ఇది 10 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ఆహ్వానించదగిన పరిణామం. ఉద్యోగులకు, పెన్షనర్లకు డిజిటల్ ఆరోగ్య కార్డులు, ద్యివాంగ విద్యార్థులకు వాహనాలు ఇస్తామనడం మంచి నిర్ణయం. – బడుగుల సైదులు, ఆర్థిక విశ్లేషకుడు, కోదాడ -
మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్య కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, విష్వక్సేనారాదన, పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. మాంగల్యధారణ తంతు కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
2,38,464 కుటుంబాలకు ధీమా
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పధకాలకు తోడుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో కుటుంబ పెద్ద ఏదైనా కారణంతో మృతిచెందితే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు. ఈ పథకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలో 2,38,464 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రభుత్వం అమలు చేయనుంది. విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుండగా.. జిల్లాలో 2వేల మందికి పైగా ఇంటర్ విద్యార్థుల ఆకలి తీరనుంది. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్ఓ
మునగాల : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్ ప్రసీద్కుమార్, మండల వైద్యాధికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో 230మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రవీందర్ తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ నల్లపాటి ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్, రిటైర్డ్ ఎంఈఓ ఓరుగంటి రవి, డాక్టర్ మణికుమారి, రేఖ, బడుగుల యశ్వంత్, రంజిత్ కుమార్, రాజు, రవీందర్, పుష్ప పాల్గొన్నారు.సబ్స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలనగరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం శివారులో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రాయినిగూడెం, ముత్యాలనగర్, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ గుండు రామాంజిగౌడ్, ఏఈ గన్న సాయికృష్ణ, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఎల్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను తగ్గించింది. గతేడాది బడ్జెట్లో రూ. 297.95 కోట్లను ఇచ్చిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.195.85 కోట్లకే పరిమితం చేసింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇక మూసీకి గతేడాది రూ. 50 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.30.15 కోట్లకే పరిమితం చేసింది. జిల్లాలో ఉన్న శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) స్టేజ్–2 కాలువల విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకోనుంది. దీంతో జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టనుంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ పనులకు గతేడాది కంటే భారీగా పెంచింది. జిల్లాలో దీనికోసం గతేడాది రూ.34.01 కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి రూ. 276.86 కోట్లు కేటాయించింది. దాదాపు రూ. 242.85 కోట్లు అదనంగా ఇచ్చింది. కాలువుల, డిస్ట్రిబ్యూటరీల కోసమే ఈ నిధులను కేటాయించింది. -
మక్క సాగుపై మక్కువ
మేళ్లచెరువు : ఖరీప్లో సాగుచేసిన పత్తి, కంది, పెసర వంటి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఈ యాసంగి సీజన్లో మొక్కజొన్న పంటపై దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. ప్రస్తుతం మేళ్లచెరువు మండల వ్యాప్తంగా సుమారు 1020 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. తక్కువ రోజుల్లోనే దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణమైంది. ధర ఆశాజనకం..బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు 2,100 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు ధర లభిస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొక్కజొన్నసాగు ద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామని ఆశిస్తున్నారు. మొక్కజొన్న సాగుకు వ్యయం ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కవ. ఎకరాకు కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. తెగుళ్ల బెడద మొక్కజొన్నకు నామమాత్రంగానే ఉండడంతో పురుగుమందుల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పంట దిగుబడి కూడా ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకు వస్తుండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.ఫ తక్కువ పెట్టుబడి.. మెరుగైన దిగుబడి ఫ గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల ఆసక్తి -
పెన్షన్లకు మోక్షం..
చేయూత పెన్షన్ పథకం కింద.. సాధారణ పెన్షన్లు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల చొప్పున అందిస్తున్నారు. చివరిసారిగా 2022లో కొత్త పెన్షన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు రూ.500 వరకు ఉంటుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో సుమారుగా 15వేలకు మందికి లబ్ధి చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంత కానుంది. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే దాదాపు రూ.5500 కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 5,400 ఇళ్లకు బిల్లుల చెల్లింపు జరగనుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి కానున్నాయి. ఇక రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నిరాశ చెందారు. -
‘లవ్వాలా’ సినిమా డైరెక్టర్ అడ్లూరు వాసి
శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్కుమార్ డైరెక్టర్గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లోగల కాకతీయహిల్స్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్వాలా’ అనే సినిమాకు రంజిత్కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. రంజిత్కుమార్ సినిమా డైరెక్టర్ కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సీతారాంరెడ్డి
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. పశు సంతతి గుర్తించాలిపశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి. మేలు జాతి పశువుల శరీర లక్షణాలుపాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పొదుగు లక్షణాలుపశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి. పశువుల కొనుగోలులో గుర్తుంచుకోవాల్సిన విషయాలుఅక్టోబర్, నవంబర్ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి. చూడాల్సిన అంశాలు● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి. ● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి. ● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి. ● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి. ● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి. ● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి. ● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి. ● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే పశువులను కొనకూడదు● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే) ● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం ● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు ● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.పశువుల బరువు తెలుసుకోవడం పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు. కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు. ఎల్ అనగా పశువు ముందు జబ్బ పాయింట్ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో. జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది. పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు -
రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొడ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం
నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం
సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు. 60 మంది బాధితుల నుంచి రూ.కోటి 85లక్షల వసూలు నిందితుడి అరెస్టు, రిమాండ్ -
అన్న ప్రసాదానికి రూ.6 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు. గంజాయి పట్టివేత సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు.


