Suryapet
-
సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర
అర్వపల్లి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరుతో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. శనివారం అర్వపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1205 బూత్లలో ఏ ఒక్క బూత్లోనూ కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏలను సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. బీజేపీ కుట్ర పూరితంగానే నట రాజన్ను రాజ్యసభ సభ్యురాలు కాకుండా చేసిందన్నారు. అక్రమంగా, అన్యాయంగా నామినేషన్ తిరస్కరణ జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఈసీల ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, సర్పంచ్లు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, మంచాల లలితారామ్మూర్తి, నాయకులు మేకల రాంబాబు, బైరబోయిన మహరాజు, జె.సోమయ్య, బాసపోలు శ్రీనివాస్, బింగి శ్రీకాంత్, విజయ్, ఖాజ, సైదులు, తదితరులు పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాల పంపిణీ
ఫ 10వేల అడ్మిషన్లు లక్ష్యంగా బడిబాట ఫ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ ఫ రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభానికి ఏర్పాట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 950 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే గోదాం నుంచి ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పాఠ్య, నోట్ పుస్తకాలు చేరాయి. మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మా లక్ష్యం. అందుకే విద్యార్థి పాఠశాలకు వెళ్లిన రోజే వారికి పుస్తకాలు అందిస్తాం. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్.. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందిస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అడ్మిషన్ల పెంపుపై దృష్టిగత విద్యా సంవత్సరం బడిబాట ద్వారా 4వేల అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను కొత్తగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 1,900కు పైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. బడిబాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన..బడిబాట కార్యక్రమాన్ని విస్త్తృతంగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బడిబాట ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత లేదుపాఠశాలల్లో విద్యా బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత లేదు. కాకపోతే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర తక్కువ ఉపాధ్యాయులు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం.డిజిటల్, ఏఐ ద్వారా బోధన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులలో విద్యాబోధన అమలు చేస్తున్నాం. ఇంటర్నేట్ ఉన్న పాఠశాలకు ఏఐ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ బోధన అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా, పోటీ ప్రపంచంలో రాణించేలా అవసరమైన అన్ని వసతులు, సాంకేతిక సదుపాయాలు, బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. -
రైతన్న సాగుబాట
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతులు సాగు బాట పట్టారు. రోహిణికార్తె నుంచే వివిధ వ్యవసాయ పనులు చేపడుతూ వస్తున్నారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడడంతో పత్తితో పాటు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా వ్యవసాయ భూములను సిద్ధం చేస్తున్నారు. మరో ఒకటి, రెండు వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది పంట వ్యర్ధాల తొలగింపు, దుక్కులు దున్నడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పత్తి సాగు అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన విత్తనాల కొనుగోలుకు దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారు మళ్లు పోసుకునే పనులను ముమ్మరం చేశారు. సాగు అంచనా 6.20 లక్షల ఎకరాలు జిల్లాలో వానాకాలం సీజన్లో 6.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో వరి సాగే 4,94,500 ఎకరాల్లో ఉండనుండగా.. రెండోస్థానంలో పత్తి 90,800 ఎకరాల్లో సాగు కానుంది. వరి సాగు కోసం రోహిణి కార్తె నుంచే రైతులు నార్లు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పొలాలను దుక్కి దున్నుకుంటున్నారు. పదిరోజులు ఆలస్యంగా.. సాధారణంగా మేలోనే అకాల వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి మేలో వర్షాలు కురువక పోగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల కంటే ముందుగా కురిసే వర్షాలు సైతం జిల్లాలో 10 రోజులు ఆలస్యమయ్యాయి. గతేడాది మే 25 నాటికే వర్షాలు పడడంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆలస్యం కావడంతో పంట వ్యర్థాల తొలగింపులోనే ఉన్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట పంటల సాగు పనులను రైతులు ముమ్మరం చేశారు. వ్యవసాయ పనిముట్ల మరమ్మతులు, విత్తనాల కొనుగోలు, చేలను చదును చేయడం, ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం చేపడుతున్నారు. జిల్లాకు ఐదురోజుల పాటు వర్ష సూచన ఉండడంతో సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి. ఫ తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో బిజీ ఫ పంట పొలాల్లోని వ్యర్థాల తొలగింపు, దుక్కి దున్నే పనుల్లో మరికొందరు ఫ జిల్లాకు ఐదురోజుల పాటు వర్ష సూచన -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఉరుములు వస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారు వీలైతే పక్కా భవనాలలో ఆశ్రయం పొందాలని, వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.కిడ్స్ ఫొటో కాంటెస్ట్లో చిన్నారికి బహుమతినడిగూడెం : మండల కేంద్రానికి చెందిన దివ్యశ్రీ, గెల్లా సంగమేశ్ దంపతుల మూడు నెలల కూతురు తుర్వి కృతిక కిడ్స్ ఫొటో కాంటెస్ట్లో బహుమతి సాధించింది. ట్రాయో కిడ్స్ కాంటెస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించిన లిటిల్ మైర్మెడ్ ఫొటో కేటగిరిలో కృతిక ఫొటోలను ఆమె తల్లిదండ్రులు అప్లోడ్ చేశారు. సదరు ఫొటోలు కిడ్స్ ఫొటో కాంటెస్ట్ సీజన్–31లో ఎంపికవడంతో సంస్థ వారు చిన్నారికి మెడల్, సర్టిఫికెట్ అందించారు. లక్ష్మీనరసింహునికి నిత్యపూజలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యురాలి ప్రసవంపెన్పహాడ్ : మండలంలోని అనాజీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎంఎల్హెచ్పీ(మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్)గా పని చేస్తున్న డాక్టర్ చిప్పలపెల్లి అనూష శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం చేరారు. ఆమె నార్మల్ డెలివరీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే ప్రసవం కావడం ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన వైద్యానికి నిదర్శనమన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకొని ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని కోరారు. -
బాధితులకు భరోసా, భద్రత : ఎస్పీ
సూర్యాపేట : బాధితులకు తక్షణ భరోసా, రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డితో కలిసి పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. గత నెలలో నమోదైన కేసుల పూర్వపరాలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. బాధితుల ఇంటి వద్ద నుంచి కేసు నమోదు చేసే విషయంలో అలసత్వం వహించవద్దన్నారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీసీఆర్బి డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెపక్టర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి
భానుపురి (సూర్యాపేట) : మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్కు తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలైనా మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి నిరసన చేపట్టబోతే ముందే అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందించి వారిలో సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్యయాదవ్, వై. అరవింద్రెడ్డి, సముద్రాల రమేష్, తదితరులు ఉన్నారు. -
సెలవు రోజుల్లోనూ ‘దోస్త్’ అడ్మిషన్లు
హుజూర్నగర్ : దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ఈ నెల 15 చివరి తేదీ అని, సమయం తక్కువగా ఉన్నందున రెండో శనివారం, ఆదివారం సెలవు రోజుల్లోనూ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, కౌన్సెలింగ్ పూర్తిగా ఉచితమని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక వసతులతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. మెగా లోక్ అదాలత్ను వినియోగించుకోవాలిహుజూర్నగర్ : ఈ నెల 20న జరిగే మెగా లోక్ అదాలత్ను కక్షి దారులు వినియోగించుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాంప్రసాద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కేసు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా శీరిన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య, సీనియర్ న్యాయవాదులు ఎన్. సత్యనారాయణ, కె. బాలకృష్ణ, కె.సైదులు, ఏజీపీ బి.సురేష్నాయక్, నగేష్ రాథోడ్, అడవి రాముడు, మౌలాబీ, బి.నరేష్, నాగూర్ బాషా, సైదా హుస్సేన్ పాల్గొన్నారు. -
డీసీసీబీకి పాత పాలకవర్గమే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. వెంటనే ఆయా పాలకవర్గాలను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని జిల్లా సహకార అధికారులకు (డీసీవో) సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్లగొండ డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి, ఇతర డైరెక్టర్లు మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమ, బుధవారాల్లో ఆయా పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించనున్నాయి. డీసీసీబీ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ తరువాత మళ్లీ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడగించకుండా, గత ఏడాది డిసెంబరు నెలలో వాటిని రద్దు చేసింది. జిల్లా కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించింది. దీనిపై డీసీసీబీలకు చెందిన కొందరు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జీవో 598పై స్టే విధిస్తూ గత నెల 21న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు.. డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లాల సహకార అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డీసీసీబీకి పాత పాలకవర్గమే ఉంటుంది.ఫ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పాలకవర్గాల రద్దు జీఓ సస్పెన్షన్ ఫ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఎస్పీ
చివ్వెంల(సూర్యాపేట) : యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, మంచి భవిష్యత్ను నిర్మించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. శుక్రవారం మండలంలోని దురాజ్పల్లి శివారులోని ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో డ్రగ్స్పై విద్యార్థులకు నిర్వహించిన అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్ రహిత సమాజ కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అధికారులు, పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు వి.మహేశ్వర్, కనపక రత్నం, భరోసా ఎస్ఐ మౌనిక. షీటీం ఎస్ఐ నీలిమా, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికగరిడేపల్లి : మండలంలోని పొనుగోడు ఎంబీఆర్ ఫంక్షన్హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా మహాసభల్లో శుక్రవారం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ములకలపల్లి రాములు, ఉపాధ్యక్షులుగా పులుసు సత్యం, కొదమగుండ్ల నగేష్, జంపాల స్వరాజ్యం, నారసాని వెంకటేశ్వర్లు, సిరికొండ శ్రీను, సోమపంగా జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మట్టిపెల్లి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శిగా పోసనబోయిన హుస్సేన్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మిట్టపల్లి లక్ష్మీ, కడెం కుమార్ను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభల చివరి రోజున పలు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి విద్యార్థుల ఎంపికభానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవెలబుల్ పథకం కింద వివిధ పాఠశాలల్లో విద్యనందించేందుకు శుక్రవారం కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. 1వ తరగతిలో 89 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 82 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.దయానందరాణి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిస్యూట్ సొసైటీ కోఆర్డినేటర్ పద్మ, అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాల గ్రంథాలయాలకు నిధులు
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం గ్రంథాలయాలను మంజూరు చేసింది. వాటికి సంబంధించిన గ్రాంట్లను విడుదల చేసింది. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని లైబ్రరీలలో కొత్త పుస్తకాల కొనుగోలుకు వీటిని ఖర్చు చేయనున్నారు. 903 స్కూళ్లకు నిధులుసూర్యాపేట జిల్లాలో 220 ఉన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో పాఠశాలకు రూ.5,198 చొప్పున, 683 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో దానికి రూ.1,171 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు ఉపయోగపడే సబ్జెక్టు పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, బాలల కథల పుస్తకాలను కొనుగోలు చేయనున్నారు. పఠనాసక్తి పెంపొందించేందుకే.. విద్యార్థులు మొబైల్స్కు ఆకర్షితులవుతున్న తరుణంలో వారిలో పఠనాసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కమిటీలు విద్యార్థుల వయస్సు, అభ్యసన స్థాయికి అనుగుణంగా పుస్తకాలను ఎంపిక చేయనున్నారు. ఉన్నత పాఠశాలకు రూ.5198 పీఎస్, యూపీఎస్కు రూ.1,171 చొప్పున గ్రాంట్ విడుదల -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
ఆలేరు: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా కార్యకర్తలు కీలకం అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షినటరాజన్కు రాజ్యసభ అవకాశం రాకుండా కుట్రలు చేయడం మహిళల పట్ల బీజేపీ నిజమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ఓట్ల దోపిడీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల దోపిడీకి కూడా ప్రయత్నించడంపై మండిపడ్డారు. కొత్తగా వివాహమైన మహిళల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా మహిళా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్పై కుట్ర భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఆమె రాజ్యసభ నామినేషన్ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై ఇప్పుడు బిల్లు పెట్టినా ఓటు వేయడానికి కాంగ్రెస్ సిద్ధమేనన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి అలిగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ (33శాతం) బిల్లును తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో పోస్ట్ కార్డులపై మహిళల సంతకాలు సేకరించి వాటిని నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి పంపే ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో పోస్టుకార్డుల రాసి ప్రదర్శించారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను చైతన్య పరిచి, పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.ఫ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్రం విఫలం ఫ సీట్ల దోపిడీకి పాల్పడుతున్న బీజేపీ ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం -
‘సర్’ పై అప్రమత్తంగా ఉండాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సర్ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి అడ్డదారిలో అధికారంలోకి రావడానికి పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పద్ధతినే ప్రయోగించారన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సర్ పేరుతో హరించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, చకిలం నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు వై.నరేష్, సుంకరి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల -
ముగిసిన ‘థ్రెడ్. పోచంపల్లి’ ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ పాల్గొన్నారు. -
జూన్లో పాఠశాల ఖర్చులు
అడ్మిషన్, ట్యూషన్ ఫీజు : రూ.5వేల నుంచి 25వేలు పుస్తకాలు, నోట్బుక్స్ : రూ.5వేల నుంచి 10వేలు యూనిఫాం : రూ.1500 నుంచి రూ.4వేలు షూస్, బ్యాగులు : రూ.1500 నుంచి రూ.3వేలు, స్కూల్ బస్ చార్జీలు : రూ.5వేల నుంచి 10వేలు సాగు ఖర్చులు (ఎకరాకు) వరి : రూ.20 వేల నుంచి 25 వేలు పత్తి : రూ.15 వేల నుంచి రూ. 20 వేలు మొక్కజొన్న : రూ.10వేల నుంచి రూ. 15వేలు కంది : రూ.10వేల నుంచి రూ.12 వేలు -
ఆధునీకరణ ఆలస్యం..
అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తున్న ఎస్సారెస్పీ కాల్వలు ఆధునీకరణకు నోచడం లేదు. సీసీ లైనింగ్ లేక కోతకు గురై అధ్వానంగా మారాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు కోదాడలోని రెండు మండలాలు, సూర్యాపేటలోని మూడు మండలాలకు ఈ కాల్వల ద్వారానే గోదావరి జలాలు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం ద్వారా ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణం చేపట్టారు. 2008లో కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు లైనింగ్ చేపట్టక పోవడంతో కాల్వలు కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి ఇవే ఆధారంఎస్సారెస్పీ కాల్వల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల పరిధిలోని సుమారు 1.50 లక్షల ఎకరాల గోదావరి జలాలు అందుతున్నాయి. నియోజకవర్గంలో 69,70,71 ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు, టెయిలెండ్ ఉన్నాయి. వీటితో పాటు 20 వరకు మైనర్, సబ్మైనర్ కాల్వలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 180 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నాయి. ఇందులో కేవలం 71 డీబీఎం కాలువ నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల్లో 7కిలోమీటర్ల మేర లైనింగ్ నిర్మించారు. ముందుకు సాగని నీరుఎస్సారెస్పీ కాల్వలకు సీసీ లైనింగ్ లేక పోవడంతో ప్రస్తుతం కంపచెట్లు, పొదలు దట్టంగా పెరిగి కాల్వ కనిపించని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కాల్వ కోతకు గురవుతోంది. ప్రతి సీజన్లో అధికారులు కాల్వల ద్వారా గోదావరి జలాలను వదులుతున్నారు. కాల్వ లైనింగ్ లేక, చెట్లతో నిండి ఉండడంతో నీరు సాఫీగా పారడం లేదు. కాల్వ చివరి ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా గోదావరి జలాలు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు సుమారు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నిధులు మంజూరు కాక పోవడంతో పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల లష్కర్లు, సూపర్వైజర్లను నియమించిన ప్రభుత్వం ఆధునీకరణను మాత్రం చేపట్టడం లేదు. ప్రభుత్వం స్పందించి కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలో కాల్వల ఆధునీకరణకు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. – ఎం.సత్యనారాయణగౌడ్, నీటిపారుదల శాఖ ఈఈసీసీ లైనింగ్కు నోచని ఎస్సారెస్పీ కాల్వలు ఫ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిన కాల్వలు ఫ కాల్వ చివరి భూములకు అందని నీరు -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
హుజూర్నగర్ : పట్టణంలోని మట్టపల్లి బైపాస్ రోడ్డులోగల గోదా, పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ, కల్పవృక్ష, అశ్వ, గజ, శేష, హంసవాహానాలపై శ్రీవారు, అమ్మవార్లను, అళ్వార్లను అధిష్టింపజేసి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. మొదట ఆలయంలో శ్రీవారి మూల మూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమం, పూర్ణాహుతి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. -
20న జాతీయ మెగా లోక్ అదాలత్
సూర్యాపేటటౌన్ : ఈ నెల 20న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన, డ్రంకెన్ డ్రైవ్, మోటారు ట్రాన్స్ఫోర్ట్ రోడ్డు నిబంధనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేసన్ జిల్లా అధ్యక్షుడిగా బండారి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం నాయకులు రామనర్సయ్య, పుప్పాల వీరన్న, సీహెచ్.భిక్షం, పుప్పాల రవికుమార్, బడుగుల సైదులు, హనుమంతరావు, శిరగాని యాకయ్య, సుధాకర్రెడ్డి, నల్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తుంగతుర్తిలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలుతుంగతుర్తి: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా మండల కేంద్రంలో ఆదివారం నార్కోటిక్లో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని షాపులు, పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. తని ఖీలు నిరంతరం కొనసాగుతాయని, గ్రామాల్లో మత్తు పదార్థాల రవాణా, వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ ఆర్ఎం బదిలీ రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యా రు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. -
‘గ్రీన్ మ్యాట్’ దందా..
బెల్ట్ ఏకరూపకం ఇది కోదాడలోని కట్టకొమ్ముగూడెం వీధిలో ఉన్న బెల్ట్ దుకాణం. కొత్తవారు సైతం సులువుగా గుర్తు పట్టడానికి వీలుగా డబ్బాకొట్టు చుట్టూ గ్రీన్మ్యాట్ కడతారు. డబ్బాకొట్టు ఉండి దానికి మూడు వైపుల గ్రీన్ మ్యాట్ కట్టి ఉంటే అది బెల్ట్ దుకాణమని గుర్తు పట్టేందుకే ఈ ఏర్పాట్లు. కోదాడ పట్టణమే కాదు జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఇదే విధంగా కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేకుండా గ్రీన్ మ్యాట్ ఉన్న డబ్బాకొట్టు దగ్గరికి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాలు అన్ని వేళలా అందుబాటులో ఉండడం విశేషం.కోదాడ : పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అన్ని షాపులు ఒకే మోడల్లో కనిపించే విధంగా వాటిని ఏర్పాటు చేస్తుండడం విశేషం. గతంలో గ్రామానికి ఒకటి రెండు కనిపించే బెల్ట్ దుకాణాలు ఇపుడు ప్రతి వీధిలో రెండంకెల స్థాయికి చేరాయి. ప్రతి గ్రామంలో ఇదే ప్రధాన వ్యాపారంగా మారింది. గ్రామ రాజకీయాలకు, వ్యవహారాలకు ఈ దుకాణాలే కేంద్ర బిందువులుగా మారాయి. చిన్నా..పెద్ద తేడా లేకుండా వచ్చిన వారందరికీ అవసరమైన బ్రాండ్లు సరఫరా చేయడం వీటి ప్రత్యేకతగా మారింది. వ్యతిరేకులకు గాలం..గతంలో గ్రామంలో బెల్ట్షాపుల ఏర్పాటును యువజన సంఘాలతో పాటు చదువుకున్న యువకులు గట్టిగా వ్యతిరేకించేవారు. దాంతో అమ్మకాలు చేసే వారుకూడా గుట్టుగా వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బెల్ట్ దుకాణదారులు ఏదో ఒక రాజకీయపార్టీకి సానుభూతి పరుడిగా ఉంటూ వారి అండదండలతో దుకాణాలను నడుపుతున్నారు. గ్రామంలోని యువకులను చేరదీసి అరువుకు మద్యాన్ని ఇస్తుండడంతో వారు కూడ వ్యతిరేకించడం మానేశారు. ఎకై ్సజ్ పోలీసులు సైతం బెల్ట్ దుకాణాలను ప్రొత్సహిస్తున్నారని, సివిల్ పోలీసులు వీటి గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊళ్లను పంచుకొని వ్యాపారం..వైన్స్ దుకాణా దారులు గ్రామాలను పంచుకొని అక్కడి బెల్ట్ దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒకరి పరిధిలోని గ్రామాలకు మరొకరు మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం కోదాడ మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులకు పట్టణంలోని వైన్స్ యజమానులు మద్యం సరఫరా చేశారు. దాంతో వైన్స్ యజమానుల మధ్య గొడవలు జరిగి రోడ్డెక్కారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమలుకు నోచని ఎస్పీ హామీ ఆరు నెలల క్రితం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో పోలీసుశాఖ యువత కోసం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు పలు సమస్యలను లేవనెత్తారు. తమ గ్రామంలో బెల్ట్ దుకాణాల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారారని, గ్రామంలో పదికి పైగా బెల్ట్ దుకాణాలున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని యువకులు ఎస్పీని కోరారు. ఈ విషయమై విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు ఒక్క బెల్ట్ దుకాణం కూడా మూత పడలేదని ఆ గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డబ్బాకొట్టుకు మూడు వైపులా గ్రీన్ మ్యాట్.. ఇదే బెల్ట్ షాపుల కోడ్ ఫ కొత్తవారైనా సులువుగా గుర్తుపట్టేలా ఏర్పాట్లు ఫ గ్రామాలు, పట్టణాల్లో విచ్చల విడిగా బెల్ట్ దుకాణాలు ఫ అధికారులు పట్టించుకోక పోవడంతో జోరుగా వ్యాపారం -
మఠంపల్లి కవికి ప్రశంసా పత్రం
మఠంపల్లి : మఠంపల్లికి చెందిన కవి, గాయకుడు కర్ల శ్రీనివాస్ రాసిన కవితకు రాష్ట్రస్థాయిలో ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శనివారం రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనంలో కర్ల శ్రీనివాస్ పాల్గొని శ్రీపల్లె జనం గుండె తడి తెలంగాణశ్రీ కవితను రాసి వినిపించారు. ఆయన రాసిన కవితను ప్రసంసిస్తూ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యుడు దరువు అంజన్న, దరువు ఎల్లన్న ప్రశంసా పత్రం అందించారు. -
రాజ్యసభలో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి
మునగాల : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని దివ్యాంగులకు కేటాయించాలని, తద్వారా దివ్యాంగులపై ఉన్న చిత్తశుద్ధిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో శనివారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు, ఇతర దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు, రాష్ట్ర నాయకులు కడియం నరేష్, జిల్లా అధ్యక్షుడు పసుల చంద్రయ్య, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ -
వీధి కుక్కలకు ప్రత్యేక చికిత్స
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో మెంజ్ వైరస్తో చర్మవ్యాధుల బారిన పడిన వీధి కుక్కల చికిత్సకు బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ముందుకు వచ్చారు. ఇటీవల వీధి కుక్కల చర్మవ్యాధులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై స్పందించిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ షెల్టర్ డైరెక్టర్ ఎన్ఎస్కే కుమారి, సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఇప్పటి వరకు 194 వైరస్ సోకిన కుక్కలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి చికిత్స కోసం సుమారు రూ.1.80 లక్షల విలువైన ఇంజక్షన్లు, మందులను అమల సూర్యాపేటకు పంపించారు. జిల్లా బ్లూ క్రాస్ వలంటీర్ నరేందర్ నాయుడు వీటిని జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. హైదరాబాద్కు చెందిన బ్లూ క్రాస్ వలంటీర్లు లాలు, నరేష్ ప్రత్యేక వైద్య బృందంతో కలిసి కుక్కలకు చికిత్స అందించేందుకు సూర్యాపేటకు చేరుకున్నారు. శనివారం నుంచి పట్టణంలోని 48 వార్డులలో వైరస్ సోకిన కుక్కలను గుర్తించి దశలవారీగా చికిత్స అందించనున్నట్లు నరేందర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వార్డు కౌన్సిలర్లు కోడి శిరీష శివ, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుంటి సైదులు, అక్కినపల్లి జానయ్య, యాట వెంకన్న, పొలాగాని కృష్ణ పాల్గొన్నారు. బ్లూ క్రాస్ పర్యవేక్షణలో 194 కుక్కలకు వైద్య సేవలు -
ప్రపంచంలోనే అరుదైనది మియాజాకి మామిడి
కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్ ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు. శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..మియాజాకి, థామిట్ క్వీన్, నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్కేజీ మ్యాంగో, బ్లాక్ స్టోన్ మ్యాంగో. గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను. – వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం -
మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గౌరవం
సూర్యాపేట అర్బన్ : ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యధితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి, పారిశుధ్యం, ఓటరు నమోదు తదితర అంశాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, డయల్ 100, లేదా 112 నంబర్లకు కాల్ చేస్తే పోలీసులే వారి వద్దకు వచ్చి అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏసీపీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్రావు, వార్డ్ కౌన్సిలర్ షేక్ జహీర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, డాక్టర్ అమూల్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.సమస్యల పరిష్కారమే ధ్యేయం చివ్వెంల(సూర్యాపేట) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన–ప్రగలతి ప్రణాళిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం మండలంలోని గుంజలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచనారాణి, తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్కుమార్, సర్పంచ్ బొలికొండ సైదులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హార్టికల్చర్ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు
గరిడేపల్లి : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.భగవాన్ తెలిపారు. శనివారం గడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాలిసెట్ 2026, ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. గడ్డిపల్లిలోని ఘంటాగోపాల్రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్, కేవీకేలో ఈ కోర్సు అందుబాటులో ఉందన్నారు. అర్హత గల విద్యార్థులు వినియోగించుకోవాలని మరిన్ని వివరాలకు సెల్ : 9603268682 నంబర్ను సంప్రదించాలని కోరారు. కుంట ఎఫ్టీఎల్లో అక్రమంగా ఫెన్సింగ్ ● ఆక్రమణను తొలగించిన మత్స్యకారులు, గ్రామస్తులు ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ఉన్న పోల్కమ్మ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో కొంత మంది ఫెన్సింగ్ వేయడం వివాదాస్పదమైంది. కుంటలోకి వెళ్లకుండా కొందరు అడ్డంగా ఫెన్సింగ్ వేయడంతో స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు కుంట వద్దకు వెళ్లి అక్రమ ఫెన్సింగ్ను నేలమట్టం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు జంగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నార్ల రమేష్, గంగరబోయిన శీను, జటంగి రామనర్సు, వీరబోయిన గంగయ్య, జంగా లక్ష్మణ్, పిడుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అంకితభావంతో సేవలందించాలినల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు. 20న జాతీయ లోక్ అదాలత్భువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి లత కోరారు. శనివారం ఆమె జిల్లాలోని జూనియర్ సివిల్ జడ్జీలు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఏపీపీఓలు, ఎకై ్సజ్ పోలీస్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజీ పడదగిన కేసులను త్వరగా గుర్తించి కక్షిదారులకు వెంటనే నోటీసులు అందజేయాలని ఆదేశించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా వ్యాప్తంగా విస్తృ ప్రచారం చేయాలనానరు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.మాధవి లత భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. బాలురకు వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. -
విస్తరిస్తున్న కాలనీలు..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తోంది. జాతీయ రహదారిపై ఉండడంతో వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో జనాభా కూడా పెరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులలో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ఆయా కాలనీల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక పోవడంతో ఖాళీ ప్లాట్లలో, ఇళ్ల మధ్యే మురుగు పేరుకు పోతున్నది. సీసీ రోడ్లు లేక..మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కొన్నిచోట్ల మట్టి రోడ్లు, మరికొన్ని ప్రాంతాల్లో గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో మట్టిరోడ్లు బురద మయంగా మారడంతో రాకపోకలు కూడా కష్టంగా మారుతోందని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నానరు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే గార్డెన్, ఇందిరమ్మ కాలనీ ఫేస్–1, ఫేస్–2, ఫేస్–3, తిరుమలనగర్, అంబేద్కర్నగర్, వెంకటేశ్వరకాలనీ, వినాయనగర్ కాలనీ, జమ్మిగడ్డ, స్నేహనగర్, సుందరయ్యనగర్ కాలనీలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన దురాజ్పల్లి, కుడకుడ, దాసాయిగూడెం, పిల్లలముర్రి గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా కాలనీలలో సరైన డ్రెయినేజీలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరంతా రోడ్లపై పారుతోంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో చేరి మురుగు నీటి కుంటలా మారుతోంది. ఇందులో పందులు స్వైరవిహారం చేస్తుండటంతో దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దోమల బెడదతో రోగాల పాలవుతున్నారు. వర్షం వస్తే మునుగుడే.. చాలా కాలనీలలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక పోవడంతో వర్షాకాలంలో కాలనీల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా కాలనీల్లో నిలిచి ఇళ్లను ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఎస్వీ డిగ్రీ కళాశాల వెనుకభాగం, ఆర్కే గార్డెన్, సుందరయ్యనగర్, స్నేహనగర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. గతంలోనూ కాలనీలు వరద నీటిలో మునిగిన సందర్భాలు ఉన్నాయి.తాగునీటికీ కటకటే..కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాంతో ప్రజలు నీటిని కొనుగోలు చేసి మరీ తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో బోరు ఉన్న వారు వాటిని వినియోగించుకుంటుండగా.. లేని వారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు సైతం పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తున్నదని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రాధాన్యత ఆధారంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. వర్షపు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కొత్త కాలనీలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో సమస్యలనేకం ఇళ్ల మధ్యే, చెత్త, మురుగు మౌలిక వసతులు కల్పించాలని స్థానికుల వినతిమున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నిధులు కేటాయించి వసతులు కల్పిస్తాం. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడతాం. పట్టణంలోని వార్డులలో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం. చైర్మన్, వార్డు సభ్యుల చొరవతో ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేపడతాము. – సీహెచ్.హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
మార్కెట్ విలువ పెంపును ఉపసంహరించుకోవాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ వ్యాల్యూ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ పెరగడం వల్ల బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్ మరింత భారంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవాధ్యక్షుడు దేవత్ కిషన్నాయక్, రాష్ట్ర కోశాధికారి సైదులు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరి బొమ్మగాని శ్రీని వాస్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కంభంపాటి అంజయ్యగౌడ్, సభ్యులు వెన్న శ్రీనివాస్రెడ్డి, మాదిరెడ్డి గోపాల్రెడ్డి, మల్లయ్యగౌడ్, మారయ్యగౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ పి.శివరాంప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవునికి ప్రకృతికి అవినావభావ సంబంధం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేయాలన్నారు. ప్రకృతిని ప్రేమించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్య వంతంమైన వాతావారణం అందించాలని సూచించారు. ప్రస్తుతం అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాంప్రసాద్ -
మెరుగైన ఫలితాలే లక్ష్యం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నాణ్యమైన విద్య అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సులోచనారాణి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం ఆమె సాక్షి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే.. సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరగతి గదులు, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యా బోధన జరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. గత కొన్నేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదలతో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ ఏడాది కూడా గతం కంటే మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, షూస్ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు ఈ ఏడాది ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు, షూస్, బ్యాగ్ను ప్రభుత్వం అందిస్తున్నది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది నుంచి డిజిటల్ విద్యఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధన నిర్వహిస్తాం. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సులభంగా పాఠాలను అర్థం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి కళాశాలకు నాలుగు ఐఎఫ్బీ ప్యానెల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా వచ్చింది. అధ్యాపకులు డిజిటల్ పద్ధతిలో బోధించనున్నారు. ఈ ఏడాది నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాంవిద్యా ప్రమాణాలు, ఫలితాలు, పోటీ పరీక్షల విజయాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది జూలై నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. ప్రతి రోజు స్లిప్ టెస్ట్లు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా వారు ఉత్తీర్ణత సాధించేలా చేస్తాం. ఈ ఏడాది నుంచి 20 ఇంటర్నల్ మార్కులు కలవనుండగా.. దీంతో ఎక్కువశాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ..వార్షిక పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తాం. వెబ్ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, ఆన్న్లైన్ పరీక్షలు, నిపుణుల మార్గదర్శకత్వంతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లపై దృష్టి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ D ÝëÇ Ð]l$«§éÅçßæ² ¿Zf¯]l…, AÌêµ-àÆý‡… A…¨…^ól Äñæ*^èl¯]l˘ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణిఅడ్మిషన్లు పెంచేందుకు.. గతేడాది నవంబర్, డిసెంబర్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు తమ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్లకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలపై అవగాహన కల్పించారు. పదో తరగతి పరీక్షల అనంతరం కూడా విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు పెరిగేలా చూస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 165 అడ్మిషన్లు వచ్చాయి. అడ్మిషన్ల గడువు కూడా ఉండటంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. -
8న సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం
చిలుకూరు : సీపీఐ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సమయానికి హాజరు కావాలని కోరారు. విశేషంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తులుసూర్యాపేటటౌన్ : జిల్లాలోని 91 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు అదే గ్రామ పంచాయతీ పరిధిలో నివాసితులై ఉండాలని, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమేనని, బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున 10 నెలల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలిచివ్వెంల(సూర్యాపేట) : రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డి.నరేష్ సూచించారు. శుక్రవారం మండలంలోని వాల్యతండాలో నిర్వహించిన రైతు అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సారాన్ని కాపాడ డాటానికి రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు చేయించి, భూమికి అవసరమైన పోషకాలను, ఎరువులను వినియోగించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ డి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ నాగులునాయక్, ఏఈఓ శైలజ, రైతులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
పెన్పహాడ్ : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ, చికున్న్గున్యా, వైరల్ ఫివర్, అతిసారం వంటి వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసిద్ధ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. మండలంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. చీదెళ్ల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం శ్రీడ్రై డ్ఙే ను పాటించాలని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ మోతీలాల్, మండల వైద్యాధికారి రాజేష్, ఆరోగ్య విస్తరణ అధికారి తాడూరి వెంకన్న, ఎంఎల్హెచ్పీ ప్రియాంక, ప్రేమ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ మాధవి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాంప్రసాద్ సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసిద్ధ్ -
ఎరువు..బరువు
జిల్లా రైతులపై రూ.45 కోట్లకు పైగా భారం ఇప్పటికే డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టర్ల కిరాయిలు పెరిగినాయి. యూరియా ధర పెరగకున్నా డీఏపీకి బదులుగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెంచడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎరువులు పత్తితో పాటు వరిలోనూ చల్లల్సిందే. ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించాలి. – జటంగి సైదులు, రైతు, కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచింది. జిల్లా రైతాంగం ఈ ఎరువులను అవసరానికి మించి వాడతారు. ఒక్క బస్తా వాడాల్సిన చోట రెండు బస్తాలను వాడుతున్నారు. దాంతో భూమిలో సారం తగ్గుతోంది. రైతులు సంప్రదాయ సాగు వైపు మళ్లాలి. పశువుల ఎరువు, జీలుగ, పచ్చిరొట్టె వంటి వాటిని భూముల్లో చల్లుకోవాలి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారిభానుపురి (సూర్యాపేట) : ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో రైతులపై భారం పడనుంది. ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు పెరిగి విత్తనాలు, పురుగు మందుల ధరలు, భూమి దున్నకం ఖర్చులు పెరిగి రైతులు అవస్థలు పడు తున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడంతో సాగు ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. యూరియా, డీఏపీల ధరలు పెరగకపోగా.. కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఎరువుల ధరల పెంపుతో జిల్లా రైతాంగంపై ఒక్క వానకాలం సీజన్లోనే సుమారు రూ.45 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. 6 లక్షలకు పైగా ఎకరాల్లో సాగుసూర్యాపేట జిల్లాలో వానకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో అఽత్యధికంగా 4.90 లక్షల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. మిగతాది మెట్ట పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు ఉంటాయి. వ్యవసాయశాఖ అంచనాల మేరకు రైతులు 60వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుంటారు. డీఏపీ ధర ఇప్పటి వరకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా అధికంగా ఉండడంతో 14 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులను 40 నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల వరకు వినియోగిస్తున్నారు. ఇందులో చాలామంది రైతులు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఆర్థికంగా భారం మోస్తున్నారు. భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు యథాతధంగా యూరియా, డీఏపీలు పెరిగిన ధరలు ఇలా..డీఏపీ ధరలు అధికంగా ఉండడంతో ఇప్పటి వరకు అదేస్థాయిలో భాస్వరం, ఇతర లవణాలు ఉండే కాంప్లెక్స్ ఎరువులను రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇందులోనూ 20–20–00–13 వాడకం అధికంగా ఉంటుంది. 17–17–17, 151–15–15, 28–00–28 వినియోగం తక్కువగా ఉంటుంది. ఇక డీఏపీ వాడకం కూడా మోతాదుగా ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా జిల్లా రైతాంగం అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువులు, అందులోనూ 20–20–00–13 ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెరగింది. పాత ధర రూ.1600లు ఉండగా ప్రస్తుతం రూ.2100కు పెరిగింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.500ల వరకు పెరిగాయి. దాంతో జిల్లా రైతాంగంపై ఈ ఒక్క సీజన్లోనే రూ.45 కోట్లకు మించి భారం పడనుంది. -
భారీగా పెరిగిన భూముల విలువ
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించగా.. అది శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరల్లో చేసిన మార్పులు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వర్తించనున్నాయి. ఈ క్రమంలో భూముల విలువ దాదాపు 15 నుంచి 100 శాతం పెరిగాయి. ప్రధానంగా మార్కెట్ డిమాండ్, అభివృద్ధి, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూముల విలువలను 50 నుంచి 100 శాతం మేర పెంచింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా గజం రూ.21,300 ధర పలుకుతోంది. ఇది బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువగా ఉండనుంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వ్యవసాయ భూముల ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు సవరించిన భూముల విలువ ప్రకారమే అదనపు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పలుమార్లు వాయిదా పడుతూ..!భూముల విలువను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా.. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలోనే మారిన భూముల విలువ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏ ప్రాంతంలో.. ఎంత మేర పెంచాల్సి ఉందన్న వివరాలను సబ్ రిజిస్ట్రార్ల నుంచి సైతం సేకరించింది. ఈ వివరాల నమోదుతో పాటు కొన్నిప్రాంతాల్లో సరైన ప్రతిపాదనలు రాకపోవడంతో వాయిదా వేసి ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోనూ లోపాల కారణంగా ఈ నెల 5 నుంచి అమలు చేసింది. వ్యవసాయ భూములు ఇలా..● జాజిరెడ్డిగూడెం మండలంలో ఎకరాకు గరిష్టంగా రూ.11,81,250, కొమ్మాలలో కనిష్టంగా ఎకరాకు రూ.3,93,750గా ఉంది. గరిడేపల్లిలో ఎకరాకు రూ.5.10 లక్షలు, కుతుబ్షాపురంలో రూ.3.93 లక్షలుగా ఉంది. ● తుంగతుర్తి మండలంలో నేషనల్ హైవే వెంట ఉన్న గ్రామాల్లో ఎకరానికి రూ.1,06,000 అత్యధికంగా, రావులపల్లిబండ రామారం, మానా పురం గ్రామాలలో ఎకరాకు రూ.70,000 అత్యల్ప ధరగా నిర్ణయించారు. ● నేరేడుచర్లలో అత్యధికంగా ఒక ఎకరం భూమి విలువ రూ.44,47,500, బోడలదిన్నలో అత్య ల్పంగా రూ.2,25,000గా నిర్ణయించారు. ● మఠంపల్లిలో ఎకరం రూ. 54,55,025, అల్లిపురం, గుండ్లపల్లిలో అత్యల్పంగా రూ. 3,93,750, పెన్హాడ్లో ఎకరం రూ.11.81లక్షలు, గాజుల మల్కాపురంలో ఎకరం రూ. 5.90 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయేతర భూముల విలువల రూ.10వేలకు పైనే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చాలా ప్రాంతాల్లో రూ.10వేలకు మించే భూముల విలువ సవరణ ఉంది. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్, పీఎస్ఆర్ సెంటర్, సీసీ బ్యాంక్ టు పోస్టాఫీస్, ఈద్గారోడ్డు టు సీసీ బ్యాంక్, కొత్త నేషనల్ హైవే టు అలంకార్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలో అత్యధికంగా గజం భూమి రూ.21,300గా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు, ఇళ్లకు డిమాండ్ ఉండడంతో భూము ల విలువను ప్రభుత్వం ఈ మేరకు పెంచింది. కనిష్టంగా సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో గజం రూ.5500లుగా నిర్ణయించింది. కోదాడలో వ్యవసాయేతర భూములకు అత్యధికంగా గజం రూ.26,400 ఉండగా, కనిష్టంగా బాలాజీనగర్లో రూ.2300గా ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్మెంట్ల విషయానికి వస్తే కోదాడలోని హుజూర్నగర్ క్రాస్రోడ్డులో ఒక ఎస్ఎఫ్టీ గరిష్టంగా రూ.2400, కనిష్టంగా రూ.1800 చొప్పున నిర్ణయించారు. హుజూర్నగర్ పరిధిలో గతంలో అత్యధి కంగా గజం రూ.13,300 ఉండగా పెంచిన ధరలతో రూ.20,300గా నిర్ణయించారు. కనిష్టంగా భూముల విలువ గజం రూ.3వేలుగా ఉంది. హుజూర్నగర్లో 80 శాతం మేర భూముల విలువ పెరిగింది. జిల్లాలో కమర్షియల్ భూముల విలువ 50 నుంచి 100శాతం పెంపు వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ సైతం సవరణ -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసం పోలీసు శాఖ అనుక్షణం కృషి చేస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింక్లను ఓపెన్ చేయవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100, 112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారులకు కేసు పత్రాలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మార్క్ఫెడ్లో ఎన్డీసీఎంఎస్ విలీనం
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్డీసీఎంఎస్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్డీసీఎంఎస్లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్డీసీఎంఎస్పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీసీఎంఎస్ను మార్క్ఫెడ్లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్ఫెడ్ పరం కానున్నాయి. మార్క్ఫెడ్లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్ఫెడ్ చేతిలోకి ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం -
ధాన్యం కాంటా వేయాలని ఆందోళన
తుంగతుర్తి : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా అన్నదాతకు కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో రైతుల గుండెలు మండిపోతున్నాయి. తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రైతు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాలోతు సీతారాం ధాన్యం పోసి రెండు నెలలు దాటినా కాంటాలు వేయడం లేదని ఆవేదనతో గురువారం తన ధాన్యపు రాశికి నిప్పు పెట్టబోయాడు. పక్కనే ఉన్న రైతులు అతడిని వారించి నిప్పు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కాంటాలు అయ్యేవని అన్నారు. కానీ ఈసారి సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ కేంద్రంలో హమాలీలు ఇష్టానుసారంగా కాంటాలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కాంటాలు సీరియల్ ప్రకారం త్వరత్వరగా వేయాలని డిమాండ్ చేశారు. -
నూతన గ్రామ పంచాయతీ ఎదుట సర్పంచ్ నిరసన
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచ్ పొల్నేడి నర్సమ్మ గురువారం నూతన పంచాయతీ భవనం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అన్ని అనుమతులు ఇచ్చి, బిల్లులు మంజూరు చేసిన అధికారులే.. భవనాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతో భవన ప్రారంభాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను అధికారులు అవమానపరచడం తగదన్నారు. నూతన భవనాన్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. -
రూ.3 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం
హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో రూ 3.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హుజూర్నగర్ కొత్త బస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం గురువారం ఆయన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో మంత్రితో శంకుస్ధాపన చేయిస్తామన్నారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ పట్టణానికి వచ్చిన ఎండీకి ముందుగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్రెడ్డి, ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ తుసూర్షా ఖాన్, ఆర్ఎం కే.జాన్రెడ్డి, డీఎం డి.శ్రీనివాసరావు, ఏఎస్ఎం పి.నాగశ్రీ, సూపరింటెండెంట్ సీహెచ్ నాగిరెడ్డి, సుధాకర్రెడ్డి, సులువ చంద్రశేఖర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి -
కబ్జా కోరల్లో చెరువులు
మునగాల : నీటితో కళకళలాడాల్సిన చెరువు శిఖం భూములు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి.చెరువు సరిహద్దుల్లో ఉన్న కొంతమంది రైతులు శిఖం భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నప్పటికీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మునగాల మండల కేంద్రంలోని ఊరచెరువుతోపాటు తాడువాయి శివారులోని ఎర్రచెరువు ఆక్రమణకు గురవుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా మునగాల ఊరచెరువు, తాడువాయి ఎర్రచెరువులకు చెందిన శిఖం భూముల్లో కొంతమంది రైతులు యథేచ్ఛగా మట్టి తోలకం పనులు చేపట్టి, చదును చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు, నీటిపారుదల శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణదారులు రోజురోజుకూ మరింత రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా.. చెరువుల ఆక్రమణలపై స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇరు శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కబ్జాల కారణంగా చెరువుల విస్తీర్ణం కుంచించుకుపోతోంది. దీనివల్ల భవిష్యత్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే చెరువులను నమ్ముకుని మత్స్య సంపదపై జీవనం సాగిస్తున్న వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి, చెరువుల ఆక్రమణలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాడువాయి ఎర్రచెరువు, మునగాల ఊరచెరువును కొంతమంది మట్టిపోసి చదును చేసి ఆక్రమణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు చేపడతాం. –వినయ్కుమార్రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఏఈఈ, మునగాల ఫ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఫ మత్స్యకారుల ఉపాధికి గండం ఫ ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు -
సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
సూర్యాపేట అర్బన్ : వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారానికి సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికై ంది. ఈ పురస్కారాన్ని శుక్రవారం హైదరాబాద్లోని టీజీపీసీబీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపల్ అధికారులకు అందజేయనున్నారు. నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలుసూర్యాపేటటౌన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 5వ తేదీ (శుక్రవారం) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 186 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదన్నారు. రాజకీయ కమిటీ వైస్చైర్మన్గా ప్రభాకర్కోదాడ, కోదాడ రూరల్ : ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా కోదాడ పట్టణానికి చెందిన ఓరుగంటి ప్రభాకర్ నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్లోని వాసవీభవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభాకర్కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. నిరుద్యోగాన్ని అరికట్టడంలో ప్రధాని విఫలం సూర్యాపేట అర్బన్ : దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని, వాటిని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పదేపదే భారతదేశంపై సుంకాలు విధిస్తున్నా.. వాటిని ప్రతిఘటించడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. పార్టీ జిల్లా శిక్షణ తరగతుల్లో మతోన్మాద విధానాలు– శాసీ్త్రయ ధృక్పథం అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి బోధించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా చలమల్లభానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ఉద్యమకారుల వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా చలమళ్ల నర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ నరాల సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. -
సూర్యాపేటలో రూ.192 కోట్లతో జనరల్ ఆస్పత్రి నిర్మాణం
ఈ నూతన భవనంలో ఐసీయూ, ట్రామా కేర్, మాతా–శిశు విభాగం, డయాలసిస్, అత్యవసర విభాగం, రోగులకు ఒకేచోట అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ ఐసీయూలు, వెంటిలేషన్ సదుపాయాలు, డయాలసిస్ కేంద్రం, డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ విభాగం, ప్రత్యేక ప్రసూతి, శిశు వైద్య విభాగాలు క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భవన నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు కూడా త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఉంది. అత్యవసర వైద్య సేవలు కావాల్సి వస్తే అంబు లెన్స్లో హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మంకు పరుగులు తీసే కాలం చెల్లబోతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో రూ.192 కోట్ల నిధులతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందు బాటులోకి రానుంది. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి.సూర్యాపేటటౌన్ : జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సర్వజన ఆస్పత్రి (జనరల్ హాస్పిటల్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. అంతర్గత మౌలిక వసతుల ఏర్పాటు, విద్యుత్, ఆక్సిజన్ పైప్లైన్లు, వైద్య పరికరాల అమరిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లాతోపాటు సమీప జిల్లాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. రూ.192 కోట్ల వ్యయంతో.. సూర్యాపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న జనరల్ ఆస్పత్రి పక్కనే నిర్మిస్తున్న నూతన సర్వజన ఆస్పత్రి భవనానికి ప్రభుత్వం సుమారు రూ.192 కోట్ల మేర నిధులు మంజూరు చేసింది. బహుళ అంతస్తులతో విశాలమైన ప్రాంగణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 350 పడకలు ఉండగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనంలో మరో 650 పడకలకు సరిపడా నిర్మాణం జరుగుతోంది. మొత్తం కలిపి వెయ్యి పడకల ఆస్పత్రిగా మారనుంది. నూతన భవనంతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనంపైన అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. నూతన భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. రెండు భవనాలు కలిసి సుమారు 3.54 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక హంగులతో.. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో సర్వజన ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లా వైద్య రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. రోగులు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ లోపల నాలుగు భారీ లిఫ్ట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే సూర్యాపేట జిల్లా వైద్య సేవల రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నూతన జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం ఐదు అంతస్తుల్లో భవనం నిర్మాణం జరుగుతోంది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. –రాజశేఖర్, ఈఈ, టీఎంఎస్ఐడీసీ ఫ వేయి పడకలు.. నాలుగు లిఫ్టులు ఫ తుది దశకు చేరిన పనులు ఫ త్వరలో అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు -
బిగ్ షాక్: రేవంత్, ఉత్తమ్లకు అధికారుల డీమోషన్!
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు."ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించించింది కేసీఆరేనని, అందుకే ఆయనను ప్రజలంతా తెలంగాణ జాతిపితగా పిలుస్తున్నారన్నారు. అది తట్టుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విషం కక్కుతున్నారని ఆరోపించారు. పదవులను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సాధనకై ముందుకు నడిపిన గొప్పనేత కేసీఆర్ అని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 24 కరెంట్ ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పటికే ఆంధ్ర పాలకులు, ఉద్యోగులు, ఆంధ్ర కుట్రదారుల పెత్తనం మొదలైందని, ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోందని విమర్శించారు. అప్రమత్తంగా ఉండి పోరాడకపోతే ఆగమైతమని, వాళ్ల కుట్రలను ఛేదించాలంటే మరొక తెలంగాణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది. -
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మోత్కూరు : హైదరాబాద్లోని కొత్తపేట ప్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్లోని ఎల్బినగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతిపాలకవీడు: పాలకవీడు తహసీల్దార్గా పనిచేస్తున్న ప్రమీలకు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నది లభించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆమె పేరు ఉండడంతో ప్రమీలను మండల అధికారులు అభినందించారు. మూగజీవాలకు పెంటయ్య సేవలు అభినందనీయం కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మూగజీవాలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సీతరామయ్య కొనియాడారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో డాక్టర్ పెంటయ్య విశిష్ట సేవలను అభినందిస్తూ ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ పెంటయ్య కోదాడ ప్రాంతంలోని పశువులకే కాకుండా పక్క జిల్లాలు, పొరుగున ఉన్న ఏపీ ప్రాంత మూగజీవాలకు కూడా వైద్య సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ నల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ సియాజి రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
న్యాయవాదుల సమష్టి కృషి ఫలితం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారుల న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చట్టాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం, ఇది న్యాయవాదులు సాధించిన సమష్టి కృషి ఫలితం. – నూకల సుదర్శన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సూర్యాపేట -
గ్రామ సభలను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలకు మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లాలో నిర్వహించే గ్రామ సభలు, శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణలపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 72శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్బృందాలు నిఘా పెట్టాలన్నారు. వర్షపాతం తక్కువగా నమోదైతే ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. వన మహోత్సవానికి అటవీ శాఖ, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వారం రోజుల్లోగా సమగ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎఫ్ఓ దామోదర్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అభివృద్ధిలో సరికొత్త అడుగు
భానుపురి (సూర్యాపేట) : ఎందరో త్యాగధనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గేయాన్ని ఆలపించి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 5కోట్ల 13 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.307 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఆదా చేసుకున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 46,587 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని తెలిపారు. పేదింటి ప్రజల కల సాకారం దిశగా.. పేదంటి ప్రజల కల సాకారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 12,868 ఇళ్లను కేటాయించామని, ఇందులో 6,032 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో సీతారామస్వామి గుట్ట వద్ద 2,160 గృహాలకు మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 675 రెండు పడకల గదులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.397 కోట్ల 24 లక్షల నిధులను బ్యాంకుల ద్వారా రుణాలుగా ఇప్పించామని, జిల్లాలో రెండు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మోతె మండలం అన్నారెడ్డిగూడెం వద్ద పాలేరు వాగుపై ఎత్తిపోతల పథకం కోసం 204 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. 39 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.206 కోట్ల 37 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా..జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వంద పడకల ఏరియా హాస్పిటల్ ను 400 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. నూతన పల్లె దావాఖాల నిర్మాణాలకు, వివిధ పనుల కోసం రూ.334 కోట్ల 85 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ నరసింహ ఉన్నారు.ఫ త్వరలోనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం ఫ మహిళలకు రూ.307 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ లబ్ధి ఫ ఇరిగేషన్ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఫ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ యాసంగి సీజన్లో రూ.810 కోట్ల విలువైన ధాన్యాన్ని 48,897 మంది రైతుల వద్ద సేకరించామని చెప్పారు. వీరికి ఇప్పటివరకు రూ.530 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద 478 మంది రైతులకు రెండు కోట్ల 72 లక్షల విలువైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించినట్లు చెప్పారు. 2026– 27 వానాకాలంలో 50 శాతం సబ్సిడీపై 2500 క్వింటాల జీలుగు విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు
అర్వపల్లి, వేలేరుపాడు : ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అక్కాచెల్లెళ్లు సజీవ దహనమాయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల గోపయ్యకు ఇద్దరు కుమార్తెలు పూలమ్మ(64), సావిత్రి(61) సంతానం. పూలమ్మకు జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన శిగ వెంకటేశంతో, సావిత్రికి ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన వలగాని ఉప్పలయ్యతో వివాహం జరిగింది. పూలమ్మ భర్త వెంకటేశం 12 ఏళ్ల కిందట, సావిత్రి భర్త గోపయ్య 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లకు సంతానం లేరు. భర్త మృతిచెందిన తర్వాత పూలమ్మ తన తల్లిగారి ఊరైన కాసర్లపహడ్కు వచ్చి తమ్ముడు ఉయ్యాల అంజయ్య ఇంట్లో ఉంటోంది. సావిత్రి వేలేరుపాడులోనే నివాసముంటూ కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. సావిత్రి తన తమ్ముడు అంజయ్య కుమారుడు రవిని దత్తత తీసుకుంది. జ్వరం వస్తుందని చెల్లె ఫోన్ చేయడంతో.. కాసర్లపహాడ్లో ఉంటున్న తన అక్క పూలమ్మకు నెల రోజుల కిందట సావిత్రి ఫోన్ చేసి తనకు జ్వరం వస్తుందని.. తగ్గే వరకు ఉండిపొమ్మని కోరింది. దీంతో పూలమ్మ వేలేరుపాడులో ఉంటున్న చెల్లెలు సావిత్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. సోమవారం రాత్రి సావిత్రి ఉంటున్న రేకుల ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఇద్దరు వేర్వేరు మంచాలలో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సావిత్రి, పూలమ్మ సజీవ దహనమయ్యారు. ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయి. మంటలు పక్కనే ఉన్న లక్ష్మి అనే మహిళ ఇంటికి కూడా వ్యాపించడంతో ఆ ఇల్లు కూడా దగ్ధమైంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు కాసర్లపహాడ్ నుంచి మృతుల బంధువులు వేలేరుపాడుకు వెళ్లారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించగా, వారు అంత్యక్రియల నిమిత్తం కాసర్లపహాడ్కు తీసుకొచ్చారు. హత్య చేసి కాల్చేశారా..? ఈ అగ్ని ప్రమాదంపై మృతుల బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సావిత్రిది ఇల్లు రేకుల ఇల్లు కావడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఒక కోణంలో పోలీసులు భావిస్తుండగా.. మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు అక్కాచెల్లెళ్లను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేసిన అనంతరం సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి సజీవ దహనం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏలూరు పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఘటనా స్థలంలోని విద్యుత్ వైర్లు, ఇతర వస్తువులను సేకరించి విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో, కుక్కునూరు సీఐ ఎం. రమేష్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ అగ్నిప్రమాదంలో అక్కాచెల్లెళ్లు సజీవ దహనంఫ ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఘటన ఫ మృతుల తల్లిగారి ఊరు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ -
విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం నీరాజన మంత్ర పుస్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం
సూర్యాపేటటౌన్ : ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెనన్స్ డేలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో జూన్ ఒకటి నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీలు లేదా ఆ పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. అధిక శబ్ధం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని పేర్కొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో ఎస్పీ నరసింహ -
వేడుకల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట అవతరణ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. రాష్ట్ర అవతరన వేడకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం అదనపు కలెక్టర్ హరిసింగ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం కలెక్టరేట్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉదయం 8 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరుల కుటంబ సభ్యులకు సత్కారం, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ, ప్రతిభా వంతులైన విద్యార్ధులకు సన్మానించనున్నట్టు పేర్కొన్నారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలిప్రజావాణిలో వచ్చిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, డీసీఓ ప్రవీణ్ పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి : ఉత్తమ్
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్లను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి మంత్రి పరిశీలించారు. మిగిలిన పనుల గురించి మంత్రి వాకబు చేస్తూ ఇలా ఆలస్యంగా చేస్తే ఎలా అంటూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు రూ.50 లక్షలతో ఏర్పాటు చేసి అనుసంధానించిన 372 సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్లు దొంతగాని శ్రీనివాస్, కొణతం చివెంకటరెడ్డి, వైస్ చైర్మన్లు తన్నీరు మల్లిఖార్జున్, నూకల సందీప్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ డి.రాధిక, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, కోతి సంపత్రెడ్డి, గెల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంమఠంపల్లి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో రూ.80లక్షలతో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈసభలో వైస్ చైర్మన్ బాబునాయక్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంజీనాయక్, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, అరుణ్కుమార్దేశ్ముఖ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్రెడ్డి, సర్పంచ్ వీరలక్ష్మిపాపయ్య, ఉపసర్పంచ్ కొత్తపల్లిశౌరీ, అరుణాసైదులు, బాబుతోపాటు డివిజన్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
నాగారం : వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం నాగారం మండలం ఫణిగిరిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంక్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎస్ఓ మోహన్బాబు, తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, ఏపీఎం వెంకట్రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చామంతినరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంలో డిజిటల్ సేవలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద పాఠశాలల అభివృద్ధి డిజిటల్ తరగతి గదులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, గురుకుల విద్యాసంస్థల విస్తరణ, గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికితోడు చిలుకూరు, తిరుమలగిరి మండలాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరై పనులు జరుగుతున్నాయి. అలాగే కోదాడకు జవహర్లాల్ నవోదయ విద్యాలయం మంజూరైంది. -
పెరిగిన సాగు విస్తీర్ణం
వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న సూర్యాపేటలో సాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం లభించింది. జిల్లాలో నాగార్జునసాగర్ కాలువల కింద 2,29,961 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్–2 2,13,175 ఎకరాలు, నాగార్జునసాగర్ లిఫ్టుల కింద 38,422 ఎకరాలు, మూసీ ప్రాజెక్టు కింద 15,230 ఎకరాలతో పాటు చెరువులు, ఇతర లిప్టులు, బోరుబావుల కింద కలిపి దాదాపు 6,20,886 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3,98,218 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఎస్సారెస్పీ స్టేజ్ –2 కింద రెండు పంటలకు సాగు నీరు అందించడంతో 2026 నాటికి 6.20 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే దాదాపు 2,21,500లకు పైగా సాగు భూమి పెరిగింది. -
ధాన్యం దిగుబడిలో ముందంజ
తెలంగాణ ఏర్పడక ముందు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేసేవారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, పెసర, కంది వంటి పంటల సాగు అధికంగా ఉండేది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో వరి సాగు అధికంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రెండు పంటలను విడుదల చేయడంతో వరిసాగు అధికమైంది. అధిక శాతం రైతులు వరి సాగువైపు మళ్లారు. తెలంగాణ ఏర్పడక ముందు 2.32 లక్షల ఎకరాల్లో ఉన్న వరి.. 2026 నాటికి 4.80 లక్షల ఎకరాలకు చేరింది. ప్రతి సీజన్లో జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండి.. రాష్ట్రంలోనే వరి దిగుబడిలో సూర్యాపేట ముందంజలో ఉంది. -
7వ తేదీలోగా కళాశాలల్లో చేరండి
నడిగూడెం : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో చేరాలని ఆ విద్యాలయాల సంస్థ డీసీఓ సీహెచ్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 7వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఘర్షణపై విచారణగరిడేపల్లి : రెండు రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరి ఉద్యోగుల మధ్య జరిగిన గొడవపై సోమవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై కార్యాలయంలోని సిబ్బందిని, ఇతరులను విచారించి వివరాలను సేకరించారు. కార్యాలయం ఆవరణలో సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న విషయంపై, సర్వీస్ బుక్లో వివరాలను నమోదు చేయలేదనే అంశంపై ఆమె విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. ఆమె వెంట ఎంపీడీవో సరోజ తదితరులు ఉన్నారు. జిల్లా పోలీసులకు సేవా పతకాలుసూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలు వరించాయి. ఇందులో జిల్లా అదనపు ఎస్పీ యు.రవీందర్రెడ్డికి రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పతకం లభించింది. సీసీఎస్ ఏఎస్ఐ వెంకన్న, డీసీ ఆర్బీ కానిస్టేబుల్ శ్రీధర్, ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య, ఏఆర్ కానిస్టేబుల్ మధుమోహన్లకు సేవా పతకాలు వచ్చాయి. ప్రతిభ అవార్డులు పొందిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ అభినందించారు. ఉత్తమ సేవలకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు. శాస్త్రోక్తంగా నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విస్తరణ నల్లగొండ : వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్, సర్కిల్ కార్యాలయాలను విస్తరించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక డివిజన్తోపాటు 5 సిర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రటించింది. దీంతో జిల్లాలో అదనంగా ఆరు కార్యాలయాల ఏర్పాటు కానున్నాయి. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మహా శివుడికి పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. -
వసతుల కల్పన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మంగళవారంతో 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 2016లో సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భవించన అనంతరం అభివృద్ధిని పరిశీలిస్తే అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సూర్యాపేటకు రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రహదారులు, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్, పోలీస్ పరిపాలన, వైద్య, విద్యా సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. జిల్లా స్థాయి పరిపాలన అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. -
యూజీడీ పనులు పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ పనుల తీరుపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైపులు, మ్యాన్న్ హోల్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి, నెలల తరబడి కాంక్రీట్ పనులు చేయకుండా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. తవ్వకాల సమయంలో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి, దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో నల్లగొండ ప్రజారోగ్యశాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, మున్సిపల్ ఏఈ కిరణ్కుమార్, ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఏఈ అనిల్కుమార్, రమాదేవి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హోటళ్లలో తనిఖీలు
యాదగిరిగుట్ట : పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఇన్చార్జి ఫుడ్సేఫ్టీ అధికారి శివశంకర్ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న మంత్రాలయం హోటల్లో సోయా సాస్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వంటలకు ఉపయోగించే నూనె ఓవర్ హీట్ కావడం, కిచెన్లో వంట పాత్రలపై మూతలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న త్రినేత రాఘవేంద్ర హోటల్లో సైతం ఛాయ్ పత్తా కలర్ ఎక్కువగా ఉందని, పిండి పదార్థాలు బాగులేవని గుర్తించారు. సన్నిధి ఎమరాల్డ్ హోటల్లో ఆరు సాస్ బాటిల్స్ గడువు ముగిసినట్లు గుర్తించారు. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపుతామని ఆయన వెల్లడించారు. త్రినేత్ర రాఘవేంద్ర, మంత్రాలయం హోటల్స్లో వాటర్ బాటిల్స్ శాంపిల్స్ తీసుకున్నామని, సోయా సాస్లను సైతం శాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా హోటల్స్ కిచెన్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని, శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. వరి కొయ్యలకు నిప్పు● గడ్డివాములు, పైపులు దగ్ధం ఆత్మకూరు(ఎస్) : మండల పరిధిలోని బొప్పారం శివారు ఏపూర్ తండాలో ఆదివారం వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 4ఎకరాలకు పైగా పంట చేలలో పచ్చని చెట్లు, గడ్డివాములు, విద్యుత్ స్టార్టర్లు, పైపులు మంటల్లో కాలిపోయాయి. స్థానికులు ఫైరింజన్ సహకారంతో మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని అధికారులు ఎంత హెచ్చరించినా రైతులు ఆపడం లేదు. సాగర్లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వేసవివ సెలవులతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకు అధిక సంఖ్యలో తరలివచ్చి సాగర్ డ్యాం, బుద్ధవనం సందర్శించారు. విజయవిహార్ అతిథి గృహంలో బస చేసిన పలువురు పర్యాటకులు ప్రత్యేక సైకిళ్లతో పాటు బ్యాటరీ వాహనాల్లో సంచరించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు విజయవిహార్ సమీపంలోని ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. ఇద్దరు ఐటీఐ ప్రిన్సిపాళ్ల బదిలీ ఆలేరు : ఆలేరు, భువనగిరి పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణను మేడ్చల్ జిల్లా శామీర్పేట ఐటీఐకు, భువనగిరి ప్రిన్సిపాల్ జయను హైదరాబాద్లోని సంతోష్నగర్ ఐటీఐకి బదిలీ చేశారు. గద్వాల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణను ఆలేరుకు, శామీర్పేట ఐటీఐ ప్రిన్సిపాల్ లలితను భువనగిరికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కనగల్ : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు చదువును దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్లో, కారులో, బండిమీద ఎలా తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎంజీ యూనివర్సిటీని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందన్నారు. యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్ఎల్బీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ధర్వేశిపురం నుంచి కనగల్ –గుర్రంపోడు–దేవరకొండ మీదుగా డిండి వరకు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీల్లో కనగల్ –గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, చిట్ల వెంకటేశంగౌడ్, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -
20 మంది అధికారులు
119 ఆలయాలు..రామగిరి(నల్లగొండ) : నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయాల సంఖ్యకు, పర్యవేక్షించే అధికారుల సంఖ్యకు పొంతన లేకపోవడంతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అర్చకుల వేతనాలు, దేవుడి భూముల రక్షణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ వంటి కీలకమైన బాధ్యతలు ఇన్చార్జిల పాలనతో కుంటుపడుతున్నాయి.నల్లగొండ అసిస్టెంట్ కమిషన్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాగ్రి భువనగిరి, జనగామ జిల్లాలో మొత్తం 119 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కొక్కరు చొప్పున ఎండోమెంట్ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఐదుకు పైగా ఆలయాలకు ఒకే అధికారి..నిబంధనల ప్రకారం ప్రతి దేవాలయానికి ఒక పూర్తిస్థాయి ఎండోమెంట్ (కార్యనిర్వాహక) అధికారి ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండతో పాటు జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. దీనితో ఒక్కో అధికారికి సగటున ఐదు నుంచి ఆరు ఆలయాలకు అదనపు బాధ్యతలు (ఇన్చార్జి ఈఓగా) నిర్వహించాల్సి వస్తుంది. దూరభారాలు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఆలయాలను ఒకే అధికారి పర్యవేక్షించాల్సి రావడంతో వారు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి..నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పండగలు, ఉత్సవాల నిర్వహణ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆయాల దేవాలయాల పరిధిలో వేలాది ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు కేసుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. హుండీ లెక్కింపు, దాతల విరాళాలు, లీజుల వసూళ్లు వంటి ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ సకాలంలో జరగడం లేదు. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకుల సమస్యలను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. తక్షణ చర్యలు అవసరం..ఒక అధికారి వారంలో ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో ఒక ఆలయానికి కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల కనీస వసతుల కల్పన పూర్తిగా నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వైభవాన్ని, ఆస్తులను కాపాడాలంటే ప్రభుత్వం స్పందించి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎండోమెంట్ అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ శాఖకు సిబ్బంది కొరత ఒక్కో అధికారికి ఐదు, ఆరు ఆలయాల ఇన్చార్జి బాధ్యతలు కష్టతరమవుతున్న ఆలయ భూముల రక్షణ, ఉత్సవాల నిర్వహణ -
సర్కారు బడిలో స్పెషల్ కోచింగ్
చీమ – మిడతఫ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఫ నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో మూడేళ్లుగా కోచింగ్ ఇస్తున్న ఉపాధ్యాయులునార్కట్పల్లి : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నారు. గత మూడేళ్లుగా వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు. వేసవి సెలవులకు ముందే ప్రధానోపాధ్యాయుడు రాములు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కోచింగ్ ఇప్పించాలని సూచించగా.. డబ్బుల్లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆయనే స్వయంగా పాఠశాలలో ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. 50 మంది విద్యార్థులకు కోచింగ్..6 నంచి 10వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈ కోచింగ్కు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి) సంయుక్త సహకారంతో ఇద్దరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తున్నారు.ఐఐటీ కోచింగ్ తీసుకోవడం వలన నా పై చదువుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు కోచింగ్కు వస్తున్నాను. మ్యాథ్స్ మంచిగా అర్ధమయమ్యలా కోచింగ్ ఇస్తున్నారు. – భాషపాక లోకేష్, 10వ తరగతి గతంలో ఇంగ్లిష్లో వెనుకబడి ఉన్నాను. నెల రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకోవటం వలన ఇంగ్లిష్ రాయటం, చదవడం వస్తుంది. కోచింగ్ ఎంతో ఉపయోగంగా ఉంది. – గడ్డం శ్రీనిత్య, 8వ తరగతి మూడేళ్ల కితం ప్రధానోపాద్యాయుడు రాములు వచ్చి అడగడంతో ప్రతి వేసవిలో గత మూడేళ్లుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో ఐఐటీ కోచింగ్ ఇస్తున్నాను. విద్యార్థులకు సులభంగా అర్థమమ్యేలా కోచింగ్ ఇస్తున్నాను. – రాపోలు మాధవ, ఉపాధ్యాయుడుదాతల సహకారంతో పాఠశాలలో చదువుకునే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇంగ్లిష్లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నాం. – రాములు, ప్రధానోపాధ్యాయుడు, నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్ బామ్మ చెప్పిన కథవేసవి కాలంలో ఒక చీమ వానాకాలం కోసం ఎంతో కష్టపడి గింజలు మోసుకుంటూ ఆహారాన్ని కూడబెట్టుకుంటోంది. పక్కనే చెట్టు మీద ఉన్న ఒక మిడత చీమను చూసి, ‘అంత కష్టం ఎందుకు? నాలాగా హాయిగా పాడుకుంటూ ఆనందించొచ్చు కదా’ అని ఎగతాళి చేసింది. చీమ దాని మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. కొన్నాళ్లకు వానాకాలం రానే వచ్చింది. బయట అంతా వర్షం, ఎక్కడా ఆహారం దొరకలేదు. మిడతకు ఆకలితో ప్రాణం పోయేలా ఉండి, సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్లింది. అప్పుడు చీమ ‘కష్టపడాల్సిన సమయంలో పాడుకుంటూ కాలక్షేపం చేశావు, ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నావు. నీ బద్ధకమే నీకు శత్రువు’ అని చెప్పింది. నీతి: సమయాన్ని వృథా చేయకూడదు. కష్టకాలం రాకముందే మన భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.మంగినెపల్లి రోహిత్ చంద్ర, నకిరేకల్ మేము బొమ్మలు గీశామోచ్ -
వేతనాల్లో కోతపై తొందరెందుకు
సూర్యాపేటటౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కొత్త ఆరోగ్య పథకం కోసం మే నెల వేతనం నుంచే కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య అన్నారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి సంబంధించిన సర్వీసు బుక్లు, కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్ చేయడం ఇంకా పూర్తి కాలేదన్నారు. కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉండబోతుంది.? ఏయే ఆస్పత్రుల్లో సేవలు అందుతాయనే విషయాలు ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్ల డించలేదన్నారు. ఇవన్నీ పూర్తికాక ముందే హెల్త్కార్డ్కు సంబంధించిన డబ్బులను వేతనాల నుంచి కోత విధించడంలో ప్రభుత్వానికి అంత దొందరెందుకని ప్రశ్నించారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బి.దేవేందర్, గణిత, రాంసింగ్, కోటయ్య, సాహెబ్అలీ, ఫజల్ ఆబ్ఖాన్ పాల్గొన్నారు. యూటీఎఫ్ ఖండనరాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్తో కూడిన హెల్త్ కార్డులను అందించే క్రమంలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆర్థిక శాఖ మే నెల నుంచే ఉద్యోగుల వేతనాలలో 1.5శాతం మినహాయించడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, అనిల్ కుమార్లు ఖండించారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చలు జరపలేదని, రాష్ట్రంతో పాటు విజయవాడ, కర్నూలు పట్టణాల్లోనూ వైద్యం అందించాలన్న డిమాండ్ను పరిశీలించలేదన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య -
నేటి నుంచి ఇంటర్ తరగతులు
సూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత కళాశాలలు తెరుచుకోనుండగా.. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు. విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు ఉత్తమ ఫలితాల సాధనపై ఆయా కళాశాలల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో 87 జూనియర్ కళాశాలలు.. సూర్యాపేట జిల్లాలో మొత్తం 87 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు, గురుకులాలు, మోడల్, కేజీవీబీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచే పాఠ్యాంశాల బోధన ప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించింది. అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి..ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత విద్యా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తెలంగాణ బ్రేక్ ఫాస్ట్ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో అల్పాహారం, మూడు రోజులు పాలు(150 మి.లీ.), మూడు రోజుల రాగిజావ అందించనున్నారు. అల్పాహారంలో ఇడ్లీ, మిల్లెట్ఇడ్లీ, ఉప్మా, దోసె, బోండాలు, పూరీలను అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్తోపాటు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. పునఃప్రారంభం కానున్న జూనియర్ కళాశాలలు జిల్లాలో 8 ప్రభుత్వ కళాశాలలు -
అండర్ పాస్ అయ్యేదెలా..?
మఠంపల్లి: మండలంలోని పలు గ్రామాల గుండా వెళ్లే రైల్వే లైన్ మార్గంలో అండర్పాస్లు ఏర్పాటు చేశారు. అయితే అండర్పాస్లు లోతట్టుగా ఉండడం, వరదనీటి పారుదల సౌకర్యం లేక పోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద నీరు అక్కడే నిల్వ ఉండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండలంలోని తీగెలచెరువుతండా, అవిరేణికుంట తండా, లాలితండా, తుమ్మలతండా, మంచ్యాతండా గ్రామాల పరిధిలో ఉన్న అండర్పాస్లు లోతుగా నిర్మించారు. కొద్ది పాటి వర్షం వచ్చినా ఇందులో భారీగా నీరు నిల్వఉంటోంది. 15 నుంచి నెలరోజుల పాటు అండర్పాస్ వద్ద బురద, నీరు నిల్వ ఉండి వాటి గుండా ప్రయాణించేందుకు ఆయా గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపడడంతో గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధి కారులు స్పందించి అండర్ పాస్ బ్రిడ్జీల కింద వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వరదనీటి నిల్వతో రాకపోకలకు అంతరాయం -
నల్లగొండ డీఈఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యాధికారి(డీఈఓ) బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు. నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు ● నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్ల డించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. -
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆలయ క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపికకోదాడరూరల్ : ఈ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్లను ఆదివారం కోదాడలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్–19 బాల, బాలికలు, సీని యర్స్ సీ్త్ర పురుషులకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. అండర్–19 విభాగంలో జె.గౌతమ్ (హుజూర్నగర్), ఏ.సంతోష్ (కోదాడ), ఎండీ. మహ్మద్ క్వాహీ (కోదాడ), ఎండీ.మహ్మద్ హాది (కోదాడ), సీనియర్స్ విభాగంలో జె.సంతోష్ (హుజూర్నగర్), కె.ఉత్తేజ్ (సూర్యాపేట), కె.అవినాష్ (హుజూర్నగర్), రవీందర్ (కోదాడ), కె.నైనిక(సూర్యాపేట) ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరి తోట రంగారావు, కోచ్లు ఖాజా జలీల్, ఖాజా ఫజల్, నిస్సార్ పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణ, మదుఫర్కపూజ, మాంగల్యధారణ చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, నరేందర్ పాల్గొన్నారు. -
‘సర్’ పై ఫోకస్.. !
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’పై జిల్లాలో ఫోకస్ నెలకొంది. ఓవైపు అధికారులు, మరోవైపు రాజకీయ పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై దృష్టి సారించారు. జూలై 31లోగా ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. పలు కారణాలతో ఇప్పటి వరకు మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. మ్యాపింగ్తోనే బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు అధికార యంత్రాంగం, కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. అర్హులైన వారి ఓట్లు తొలగింపునకు గురి కాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తగ్గిపోవడంతో పాటు అధికార మార్పిడి కూడా జరగడంతో అధికార కాంగ్రెస్ ముందస్తుగా చర్యలు చేపట్టింది. పారదర్శకంగా ఉండేలా..!ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలకమైన ఓటర్ల మ్యాపింగ్, భౌగౌళిక సరిహద్దులు, పోలింగ్ కేంద్రాల పరిధికి అనుగుణంగా చేపడుతున్నారు. మొదటి విధానంలో 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాతో సరిపోల్చుతున్నారు. రెండో విధానంలో 2002 ఓటరు జాబితాను సేకరించి.. ఆ తర్వాత ఓటు హక్కు పొందిన వారి సంతానం సమాచారంతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 70 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో వారికి ఈ నెల 15 నుంచి 24 వరకు సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నారు.క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ చేస్తున్న బీఎల్ఓలు తమ ఓటర్లు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీల ప్రయత్నాలు బూత్ స్థాయిలో కమిటీలు, శిక్షణ -
పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం
సూర్యాపేటటౌన్ : పొగాకు వ్యసనాన్ని అందరం కలిసి అడ్డుకుందామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని అంబేద్కర్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రంగు రంగుల ప్యాకేజీలు, సువాసనలతో కూడిన ఫ్లేవర్డ్ సిగరెట్లు, ఈ–సిగరెట్ల వంటి వాటికి యువత, పిల్లలు ఆకర్షితులై వాటికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులను నమలడం, ధూమపానం వల్ల నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాసివ్ స్మోకింగ్ వల్ల గర్భిణులు, చిన్న పిల్లలు తీవ్ర ఆరోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. వీటి నుంచి బయట పడే వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘టొబాకో సెసేషన్ సెంటర్స్’ ద్వారా కౌన్సెలింగ్, మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జి.చంద్రశేఖర్, టీబీ యూనిట్ ఆఫీసర్ పి. వెంకటపాపిరెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి అమూల్య, డిప్యూటీ డెమో వి.సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ -
సర్వీస్ బుక్ ఎంట్రీపై పంచాయితీ..
గరిడేపల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇద్దరు ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. మండలంలోని లచ్యాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మొయినొద్దీన్ వాహనాన్ని అడ్డుకొని తన సర్వీస్బుక్ ఎందుకు ఎంట్రీ చేయడం లేదంటూ నిలదీశాడు. తాను గతంలో పని చేసిన ప్రాంతాల జాయినింగ్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని సర్వీస్ బుక్లో నమోదు చేయడం లేదని, బుక్లో ఎంట్రీల కోసం రూ.3వేలు డిమాండ్ చేశారని సుధాకర్ ఆరోపించాడు. మొయినొద్దీన్ సోమవారం సూర్యాపేట జెడ్పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో తన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ అసిస్టెంట్ లంచ్ బాక్స్తో తనపై దాడి చేశాడని పంచాయతీ కార్యదర్శి ఆరోపించాడు. సిబ్బంది వారిద్దరిని వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నియంత్రించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 5న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు జరిగే ర్యాలీ, ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం జిల్లా కేంద్రంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ ఉమర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.భిక్షం, నాయకులు బొల్లెద్దు వెంకటేశ్వరరావు, కొచ్చర్ల వేణు, మున్నూరు నాగన్న, నకిరేకంటి వెంకన్న, బి.దేవేందర్, ఎ.రాంసింగ్, బి.క్రాంతికుమార్, ఫజల్ అయూబ్ ఖాన్ , ఎండీ సాహెబ్ అలీ పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కుట్ర
సూర్యాపేటటౌన్ : తెలంగాణ రైతాంగానికి అందుతున్న ఉచిత విద్యుత్ను ఎత్తివేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రైతుల ప్రయోజనార్ధం చేపట్టిన రైతుబంధు, ఉచిత విద్యుత్, ధాన్యానికి మద్దతు ధర వంటి వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మూడవ డిస్కం తీసుకొస్తామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు చెప్పడం, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదని ప్రభుత్వం చెప్పడం రైతులను నిలువునా మోసం చేసే ప్రయత్నమేనన్నారు. రైతుల పాలిట ఉరితా డుగా మారనున్న మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పార్టీ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఉప్పల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్ -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అన్ని శాఖల అధికారులు రోడ్డు భద్రతా చర్యల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఆర్అండ్బీ, రైల్వే, ఇరిగేషన్, ఆర్టీఓ, ఎడ్యుకేషన్, డీఎంహెచ్ఓ, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులతో శనివారం కలెక్టరేట్ వీసీహాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ కె. నరసింహతో కలిసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. రహదారులపై లోపాలను గుర్తించి సవరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో పౌరులు బాధ్యతగా ఉండాలని, ప్రమాద సమయంలో సహాయ సహకారాలు అందించే వారికి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఆటోలు, ట్రాలీలలో ఎక్కువ మందితో ప్రయాణం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఎంహెఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, ఆర్టీఓ జయప్రకాశ్రెడ్డి, డీపీఓ యాదగిరి, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వంతెన కల.. నెరవేరుతున్న వేళ
గరిడేపల్లి : తాళ్ల మల్కాపురం పరిధిలోని ప్రజల వరద కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఇక్కడి పునాతన లోలెవల్ వంతెన స్థానంలో రూ.6.90 కోట్లతో నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను స్థానిక ప్రజలు మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.6.90 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఏప్రిల్ నెలలో ప్రారంభమైన వంతెన పనులు త్వరలో పూర్తి కానున్నాయి. తీరనున్న వరద కష్టాలు.. గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం పరిధిలో లోలెవల్ వంతెనపై నుంచి వర్షాకాలంలో స్వల్ప వర్షాలకే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కీతవారిగూడెం నుంచి మునగాల వరకు గల విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి కావడంతో.. వరదలు వచ్చినప్పుడల్లా రాకపోకలు నిలిచి పోతున్నాయి. దాంతో వెలిదండా, కొక్కిరేణి, కీతవారిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, రేగులగడ్డ తండా, రంగాపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల వరద కష్టాలు తీరనున్నాయి. ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు వారం రోజులుగా వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల వల్ల వాహనదారులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు వంతెన పక్కనే తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం వాహనదారులు ఈ రోడ్డు ద్వారానే ప్రయాణిస్తున్నారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ తాళ్లమల్కాపురంలో కొత్త వంతెన నిర్మాణం ఫ రూ. 6.90 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ శరవేగంగా సాగుతున్న పనులుపురాతనమైన వంతెన కావడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. మా ఇబ్బందులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే రూ.6.90 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. మా ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. – యమగాని సైదులు, తాళ్ల మల్కాపురం -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
కొత్త పెన్షన్పై టెన్షన్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పెన్షన్ల టెన్షన్ పట్టుకుంది. సుమారు ఐదేళ్లుగా కొత్త పెన్షన్ల ఊసు లేకపోవడంతో వేలాది మంది వీటికోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడైనా తమకు పెన్షన్ అందుతుందా.. లేదా అనే టెన్షన్ దరఖాస్తుదారుల్లో పట్టుకుంది. పెన్షన్ దరఖాస్తుదారులు వారికి కావాల్సిన కులం, ఆదాయం, ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. 2022లో చివరిసారిగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా పెన్షన్లను మంజూరు చేసింది. నాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కొత్త పెన్షన్ మంజూరు కాలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులతోపాటు దివ్యాంగులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వితంతు పెన్షన్ల కోసం గ్రామాల్లో నాలుగేళ్లుగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవేకాకుండా ప్రజాపాలన సమయంలోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు రాగా.. వీటన్నింటిని ఆన్లైన్ చేసి వదిలేశారు. అనంతరం వితంతు పెన్షన్ కోసం దరఖాస్తులు ఇచ్చినా.. ఆన్లైన్ చేసే అవకాశం లేకపోవడంతో అధికారుల వద్దనే దరఖాస్తులు ఉండిపోయాయి. నాలుగేళ్ల తర్వాత.. నాలుగేళ్ల తర్వాత కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన రావడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో చాలామంది వితంతు, వృద్ధాప్య, గీత కార్మిక, దివ్యాంగ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా కొందరు పైరవికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ వద్దకు వచ్చే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే వాటిని ఆన్లైన్ చేసే వెసులుబాటు లేదని చెబుతున్నారు. ఫ నూతన పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఫ గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన అధికారులు ఫ ధ్రువపత్రాల కోసం కార్యాలయాల వద్దకు కొత్త దరఖాస్తుదారుల పరుగులువృద్ధాప్య 53,205 దివ్యాంగులు 18,458 వితంతువులు 56,277 ఒంటరి మహిళలు 6795 చేనేత కార్మికులు 873 కల్లుగీత కార్మికులు 6,552 ఎయిడ్స్ బాధితులు 1205 ఫైలేరియా రోగులు 2109 డయాలసిస్ రోగులు 258 -
ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం
జిల్లాలో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు తిరుమలగిరి మండలంలో రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్య అందుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలి. –ఐ.శాంతయ్య, మండల విద్యాధికారి, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత సంవత్సరం 31 ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించగా.. కొత్తవాటితో కలుపుకుని మొత్తం 122 పాఠశాలలు కానున్నాయి. వచ్చేనెల 12వ తేదీ నుంచి జిల్లాలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య మరింత అందుబాటులోకి రానున్నది. ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్టక్చర్, ఫర్నీచర్, ఇండోర్, ఔట్డోర్ ఆట వస్తువులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతి పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు కేటాయించనున్నారు. ఒక ఇన్స్ట్రక్టర్.. ఒక ఆయా ప్రతి పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్తోపాటు ఒక ఆయాను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలవారి గౌరవ వేతనం రూ.8000, ఆయాకు రూ.6000 లుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసి త్రీమెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ఫ్రీ ప్రైమరీ సెక్షన్ను ప్రారంభించాలని, ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఫ ఆటపాటలతో కూడిన విద్యా బోధనకు శ్రీకారం ఫ కార్పొరేట్కు దీటుగా ఆధునిక వసతులు ఫ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఇన్స్ట్రక్టర్ల నియామకం -
మూడు నెలలైనా అందని వాహన రిజిస్ట్రేషన్ కార్డులు
వాహన పరివాహన్ పోర్టల్ వచ్చిన తర్వాత జిల్లాలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్లు షోరూంలోనే నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతోంది. పెండింగ్లో ఉన్న కార్డులను దశల వారీగా ముద్రించి పంపిణీ చేస్తున్నాం. త్వరలో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. వాహనదారుల ఇళ్ల వద్దకే కార్డులు పంపిస్తాం. –జయప్రకాష్రెడ్డి, జిల్లా రవాణశాఖ అధికారి, సూర్యాపేట మార్చి నెలలో నేను కొత్త బైక్ కొన్నాను. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షోరూంలోనే పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఒరిజినల్ ఆర్సీ రాలేదు. నంబర్ వచ్చినప్పటికీ ఆర్సీ లేకపోవడంతో పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అధికారులు స్పందించి ఆర్సీ త్వరగా వచ్చేలా చూడాలి. –రమావత్ చాంప్లా, వాహనదారుడు ఫ జిల్లాలో సుమారు 900 కార్డులు పెండింగ్ ఫ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు సూర్యాపేటటౌన్ : కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులకు రిజిస్ట్రేషన్ కార్డు(ఆర్సీ)ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాహన్ విధానం అమలులోకి తీసుకొచ్చినప్పటికీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ద్వారానే ద్విచక్ర వాహనాలు, కార్లు (నాన్ ట్రానన్స్పోర్ట్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేది. కేంద్ర ప్రభుత్వం శ్రీవాహన్శ్రీవిధానం అమలులోకి తీసుకువచ్చిన తరువాత ఈ ఏడాది మార్చి 23 నుంచి రిజిస్ట్రేషన్ల బాధ్యతలను వాహన షోరూంల నిర్వాహకులకు అప్పగించింది. ఈ కొత్త విధానంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు ఇస్తున్నారు. అనంతరం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరు కేటాయించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినప్పటికీ వాహన రిజిస్ట్రేషన్ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్, ఫైనాన్స్ పనులకు ఇబ్బంది సూర్యాపేట జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు కలిపి సుమారు 900 రిజిస్ట్రేషన్ కార్డులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినవారు ఇప్పటికే తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించుకున్నారు. కానీ ఆర్సీ కార్డులు అందకపోవడంతో కార్యాలయాలు, షోరూంల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వాహనదారులు మూడు నెలల క్రితమే వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కార్డులు అందలేదని వాపోతున్నారు. ఆర్సీ లేకపోవడంతో బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సంబంధిత పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు. షోరూంలపై పెరిగిన భారం.. కొత్త విధానం ప్రకారం వాహనాల వివరాలు, యజమాని ఆధార్, చిరునామా ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెనన్స్, పన్ను చెల్లింపుల వివరాలను షోరూం నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు, డాక్యుమెంట్ల ధృవీకరణలో ఆలస్యం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదించిందని తెలుస్తోంది. కొన్ని షోరూంలలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది. రోజూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని సమయానికి అప్లోడ్ చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆందోళనలో వాహనదారులు.. ఆర్సీ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. పోలీసులు అడిగినప్పుడు మొబైల్లో డిజిటల్ కాపీలు చూపిస్తున్నప్పటికీ చాలాసార్లు వివరణ ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు త్వరగా అందేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
రాజకీయ బెదిరింపులకు భయపడం
సూర్యాపేట అర్బన్ : రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లబావి సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సీపీఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసి మాజీ సీఎం విజయన్పై ఈడీని అడ్డు పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అన్నారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి జిల్లా కమిటీ సభ్యులు ఏలుగురి గోవింద్, మేకనబోయిన శేఖర్ రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, సూర్యాపేట 3 టౌన్ కార్యదర్శి చిట్లింకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి -
పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు
రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్, ఆటోమేషన్, అధునాతన మ్యాన్ఫ్యాక్చరింగ్ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, నాగార్జునసాగర్లో అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్ స్కేప్ డిజైన్, తిరుమలగిరిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాదగిరిగుట్టలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్డ్ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1 వరకు సరిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, జూన్ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. -
వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తున్న కేంద్రం
అర్వపల్లి : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ విమర్శించారు. ఏఐకేఎంఎస్(ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ), ఎస్కెఎం(సంయుక్త కిసాన్ మోర్చా) పిలుపుమేరకు గురువారం జాజిరెడ్డిగూడెంలో ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) ఆర్డర్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలుచేయాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ఎంఎస్పీ చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పోలెబోయిన కిరణ్, పెద్దలింగయ్య, వడకాల బయ్యన్న, మధుకర్, రైతులు పాల్గొన్నారు. జూన్ 2న పాదయాత్రసూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ నుంచి సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగయ్య, సూరం రేణుక పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన టీ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఈ ప్రాంత ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బక్కని నర్సింహులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన టీడీపీ జాతీయ మహానాడులో బక్కని నర్సింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని వ్యాఖ్యనించడం సరైంది కాదన్నారు. వందలాది సంవత్సరాల క్రితమే ‘త్రిలింగ దేశం’గా వర్థిల్లిన ప్రాంతం తెలంగాణమని, తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ గురించి స్పష్టంగా ఉందని తెలిపారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, నాయకులు వెంకటేష్ నాయక్, జక్కలి గోపి, చింతకాయల మహేష్ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నరసింహుడి కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణాన్ని గురువారం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, వేద మంత్రోచ్ఛరణల నడుమ తలంబ్రాలతో కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, సాయిచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, నరేందర్ పాల్గొన్నారు. -
హోర్డింగుల జోరు.. జనం బేజారు
కోదాడ : అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, లైట్ బోర్డులు కోదాడ పట్టణవాసుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు గాలివానకు పక్కకు ఒరిగిపోయి రాత్రి సమయాల్లో డివైడర్ పక్కగా వెళుతున్న వారికి తగిలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎలాంటి అనుమతుల లేకుండా ఇష్టానుసారంగా వందల సంఖ్యలో డివైడర్ల మధ్య బోర్డులను ఏర్పాటు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ప్రకటనల బోర్డులు, లైట్బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయాలంటే సదరు సంస్థలు మున్సిపాలిటీ అనుమతుల తీసుకోవడంతోపాటు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లో హోర్డింగులను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ధరలు నిర్ణయించి టెండర్ల ద్వారా వివిధ సంస్థలకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. ఈ విషయంలో కోదాడ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారుల కనీస చొరవ తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. హోర్డింగులు పెట్టినవారి నుంచి రుసుము వసూలు చేస్తున్న దాఖలాలు లేవని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోదాడ పట్టణంలో డివైడర్లు కేవలం నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండడంతో వీటిమీద అదేస్ధాయిలో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. గాలి వానలకు ఇవి ఏమాత్రం పక్కకు జరిగినా వాహనదారులకు తగులుతున్నాయి. పుట్టిన రోజుల హడావుడి.. గతంలో కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో రాజకీయ నాయకుల, సినిమా హీరోల పుట్టిన రోజుల వేడుకల సమయంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేవారు. ఇటీవల ప్రతిఒక్కరూ ఇలాంటి వేడుకల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేస్తున్నవారిలో పలువురు పోకిరీలు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు చిత్రవిచిత్రమైన ఫోజులతో కటౌట్లు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు స్పందించి ఫ్లెక్సీల ఏర్పాటులో కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఫ జనం ప్రాణాల మీదకు తెస్తున్న హోర్డింగులు ఫ గాలి దుమారానికి ఒరుగుతున్న బోర్డులు ఫ అధికారుల నిర్లక్ష్యం.. మున్సిపల్ ఆదాయానికి గండి కోదాడ పట్టణంలో ప్లెక్సీలు, హోర్డింగ్లు ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి. దీన్ని మున్సిపాలిటీ ఆదాయ వనరుగా మార్చుకోవాలి. పట్టణంలో డివైడర్ల మీద కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లు అంటించడం సరికాదు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలకు, వివిధ సంస్థలకు కూడా బాధ్యత ఉండాలి. –పందిరి నాగిరెడ్డి, విద్యావేత్త, కోదాడ -
ప్రారంభమైన రోహిణి కార్తె
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సాగుకు అనుకూలమైన రోహిణి కార్తె మొదలైంది. ఈ కార్తెలో సాగయ్యే పంటలు మంచి దిగుబడి ఇస్తాయన్నది రైతుల నమ్మకం. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతుండగా వ్యవసాయశాఖ మాత్రం ఇంతవరకు ఈ సీజన్కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయలేదు. వానా కాలం సీజన్లో జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది, ఏ రకమైన విత్తనాలు ఎంత అవసరం, యూరియా ఎంత కావాల్సి ఉంది అనే విషయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాంచాల్సి ఉంటుంది. ఈ మేరకు రైతులకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. 15 రోజులకే కీలకం..!జిల్లాలో వానాకాలం సీజన్ రోహిణి కార్తెతోనే ప్రారంభమవుతోంది. ముందస్తుగా సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోయగా.. ఆరుద్ర కార్తెలో ముమ్మరం కానున్నాయి. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం అవుతున్నారు. బోరుబావుల కింద వరి సాగు చేసే రైతులు ఈ కార్తెలోనే వరి నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కార్తె 15 రోజుల పాటు ఉండనుండగా.. కొద్దిమంది రైతులు ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేసి నీళ్లు వేయగా మరి కొందరు గురు, ఆదివారం (మంచి రోజుగా భావించి నారు మళ్లకు నీళ్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం, పదిరోజుల్లో నార్లు పోస్తారు. వరితో పాటు పత్తి సాగు చేసే రైతులు భూమి దున్నడంతో పాటు పెంటమట్టి తోలకం, చెత్తాచెదారం తొలగించి చేనును సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. యాక్షన్ ప్లానెక్కడ..!రోహిణికార్తెలోనే వరి సాగు చేయాలనుకున్న రైతులు విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొద్దిమంది రైతులు డీఏపీ బస్తాలను సైతం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయినా ఇప్పటి వరకు జిల్లాలో వానాకాలం – 2026 పంటల యాక్షన్ ప్లాన్ సిద్ధం కాలేదు. రైతులు ఏ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు..? ఏ విత్తనాలు కోరుకుంటున్నారు..? వారికి కావాల్సిన వైరెటీలు ఏమిటి..? అవి ఎంతమేర జిల్లాలో అవసరం. ఇంకా ఎన్ని విత్తనాలు కావాల్సి ఉందన్న అంచనాలతో రూపొందించే యాక్షన్ ప్లానే ఈ సీజన్ సాగులో కీలకం. ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అధికారులు సమకూర్చుతారు. ఇంత వరకు వానాకాలం యాక్షన్ ప్లాన్ సిద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సీజన్లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. రాత్రిళ్లు జాగారం చేసి మరీ కొనుగోలు చేశారు. ప్రస్తుత సీజన్లో ముందస్తు ఏర్పాట్లు లేకపోతే మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే వానా కాలం సీజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ఇంతవరకు ఖరారుకాని వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని రైతుల వినతి -
లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్వి గ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి నాగవల్లి దళా లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 31న బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపికకోదాడరూరల్ : వచ్చేనెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అండర్–19 బాలబాలికల, సీనియర్స్ సీ్త్ర, పురుషుల విభాగంలో జిల్లా జట్టుకు ఈ నెల 31న క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ పట్టణంలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభం అవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లా వాసులకే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాలకు సెల్ : 9059068263, 96421 14372 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాల్య వివాహాలు అరికట్టాలిపెన్పహాడ్ : బాల్యవివాహాలు అరికట్టి బాలికల భవిష్యత్తుకు బాటలు వేయాలని సీడీపీఓ సుబ్బలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాలలో మహిళా వారోత్సవాలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నివారణపై గ్రామ ప్రజలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఒగ్గు కిరణ్, ఇటికాల శ్రీనివాస్, ఏపీఎం అంజయ్య, ఎల్సీపీఓ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హనీఫా, స్వప్న, పంచాయతీ కార్యదర్శి అఖిల్, సోషల్ వర్కర్ శ్రీలక్ష్మి, జండర్ స్పెషలిస్ట్ రేవతి, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఒగ్గు సోమన్న, కిరణ్, సీసీ వెంకన్న పాల్గొన్నారు. అర్వపల్లిలో ఈదురు గాలుల బీభత్సంఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లితో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. కొద్దిపాటి వర్షపు జల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ఇళ్ల రేకులు గాలికి లేచిపోయాయి. దుకాణాల ఎదుట బోర్డులు ఊడిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు ఎగిపోగా జల్లులకు ధాన్యం కొంత మేరకు తడిసింది. -
జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఇచ్చే పీఆర్సీని ఇప్పటి వరకు ప్రకటించక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, లేని పక్షంలో జూన్ రెండు తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలిఫ అదనపు కలెక్టర్ హరిసింగ్ నూతనకల్ : భూముల రీసర్వే ప్రక్రియను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల రీసర్వే, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీలింగ్ భూములకు సంబంధించిన రైతుల వివరాలను తెలుసుకొని వారి భూమి స్వాధీనత ప్రకారం సర్వే పూర్తి చేసి కలెక్టర్కు నివేదిక అందించాలన్నారు. సాదా బైనామాలు, భూ భారతి, గ్రీవెన్స్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. వానాకాలం సమీపిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం గోదామును ఆయన పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, అధికారులు ఉన్నారు. ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ : రాష్ట్ర మైనార్టీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్టు రాసే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఉచిత కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మైనార్టీలుగా పరిగణించబడతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని మిల్లర్లను సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ మోహన్బాబు, సివిల్ సప్లై డీఎం శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ హరిప్రసాద్, సర్పంచ్ బోయపల్లి కిషన్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సీఈఓ వినయ్కృష్ణారెడ్డి, ఏపీఎం లక్ష్మి ఉన్నారు. బాలికలకు సైకిళ్ల పంపిణీమహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్యల ద్వారా తిరుమలగిరిలో బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన ఆయన వారికి పలు సూచనలు చేశారు. సైక్లింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించేందుకే సైకిళ్లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లాజర్, ఏపీఎం లక్ష్మి, డీటీ జాన్ మహ్మద్, సీసీ నాగయ్య, ఎంఎస్ అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. దిగుమతులు వేగవంతం చేయాలిచివ్వెంల(సూర్యాపేట) : రైతులకు ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దుగుమతి చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మండలంలోని బీబీగూడెం శివారులో ఉన్న శివదుర్గ రైస్మిల్ను ఆయన తనిఖీ చేశారు. దిగుమతులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రావణి ఉన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ -
అరుదైన ఘనత..
విహారెడ్డి భవిష్యత్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే ఎఫ్ఐబీఏ ఆసియా కప్ అండర్–18 బాస్కెట్బాల్ టోర్నీలో భారతజట్టును విజేతగా నిలపడమే తన తదుపరి లక్ష్యమని విహారెడ్డి పేర్కొంది. రోజూ గంటల తరబడి సాధన చేస్తూ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటోంది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో రాణించగలరని నిరూపిస్తోంది విహారెడ్డి.విహారెడ్డి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు.. అంతకుమించి కఠిన శ్రమ ఉన్నాయి. 2023లో జరిగిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో ఆమె కుడికాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకోగానే పట్టుదలతో మళ్లీ సాధన మొదలు పెట్టింది. 2024లో జాతీయ పోటీల సమయంలో కాలి మడిమకు తీవ్ర గాయమైంది. ఆ గాయాన్ని జయించి రెట్టింపు పట్టుదలతో ఆటలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విహారెడ్డి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చింది. అంతకుముందు 2025 అక్టోబర్ బహ్రెయిన్లో నిర్వహించిన మూడో ఏసియా యూత్ గేమ్స్ బాస్కెట్బాల్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించింది. -
అభివృద్ధి నిధుల విడుదలలో వివక్ష
కోదాడ : బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్న గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో వివక్ష చూపుతున్నారని, దాంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టలేక సర్పంచ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పలువురు సర్పంచ్లతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ సర్పంచ్లు గెలవడంతో అధికార పార్టీ వారు ఆయా పంచాయతీలకు అభివృద్ధి నిధులు మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ నిర్వహించి వెంటనే బీఆర్ఎస్ సర్పంచ్లున్న పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్కుమార్, బట్టు శివాజీ, శీలం సైదులు, తొగరు రమేష్, జానకిరామాచారి, పల్లా నర్సిరెడ్డి, భూపాల్రెడ్డి, శంకర్నాయక్, ఉపేందర్, కందిబండ సత్యనారాయణ, సీతారాములు, పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఉన్నారు. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఫిర్యాదు -
నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్
కోదాడరూరల్ : పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, అవసరమైతే వారిపై జిల్లా బహిష్కరణ వంటి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాథం కల్యాణ మండపంలో డివిజన్లో ఉన్న పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో నిందితులు, సస్పెక్ట్ రౌడీ షీటర్స్తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలకు పాల్పడితే త్వరతగతిన శిక్షలు పడుతున్నాయని, క్షణికావేశానికి లోనై నేరాలు చేస్తే కుటుంబాన్ని వీధిన పడేసి జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారి వివరాలను పోలీలసుకు చేరవేయాలన్నారు. నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగిన వారిపై భవిష్యత్లో రౌడీ షీట్స్ ఎత్తి వేసే విషయాన్ని పరిశీస్తున్నామని చెప్పారు. కోదాడ మండలం గణపవరంలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ రామారావు, సీఐలు శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు పరమేష్, అజయ్కుమార్, నవీన్కుమార్, సుధీర్కుమార్, హనుమానాయక్, సతీష్రెడ్డి పాల్గొన్నారు. అవసరమైతే జిల్లా బహిష్కరణ : ఎస్పీ -
విద్యార్థులందరికీ అభ్యాస దీపికలు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మాత్రమే అందజేస్తున్న అభ్యాస దీపిక (వర్క్బుక్)లను ఇకపై ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కూడా అభ్యాస దీపికలు అందుబాటులోకి రానున్నాయి. నేర్చుకునే విధానంలో మార్పు..జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 180 ఉన్నత, 80 ప్రాథమికోన్నత, 680 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 65వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు, పఠన సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు అభ్యాస దీపికలు ఉపయోగపడతాయని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి పాఠానికి అనుగుణంగా ప్రశ్నలు, వ్యాయామాలు, కార్యకలాపాలు, చిత్రాలు, సృజనాత్మక అంశాలతో ఈ వర్క్బుక్లను రూపొందించారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం చదవడం కాకుండా స్వయంగా అర్థం చేసుకొని అభ్యసించే అవకాశం ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఉపయోగం..ప్రత్యేకించి పదో తరగతి విద్యార్థులకు ఈ అభ్యాస దీపికలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. బోర్డు పరీక్షలకు అనుగుణంగా నమూనా ప్రశ్నలు, ప్రాక్టీస్ వ్యాయామాలు, ముఖ్యాంశాలపై ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది మరింత తోడ్పడనుంది. అభ్యాస దీపికల ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా బోధించగలరని అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన విద్యే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అభ్యాస దీపికలు అందజేస్తోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యాస దీపికల విస్తరణ ద్వారా విద్యార్థుల నేర్పు సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. పాఠశాల స్థాయిలోనే ప్రాక్టీస్కు ప్రాధాన్యత పెరగడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వర్క్ బుక్ల ప్రత్యేకతలు.. తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ మాద్యమాల్లో వీటిని ముద్రించనున్నారు. పదో తరగతి వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు వీటిని అందించనున్నారు. మూల్యాంకనంతోపాటు ప్రతి పాఠం చివర అభ్యసన ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్నలు–జవాబులు, ఖాళీలు, బాషా పుస్తకాల్లో వ్యాకరణం, గణితంలో సూత్రాలు, సాధన, సైన్స్, సాంఘిక శాస్త్రంలో పటాల అంశాలు ఉండటంతో ప్రతి పాఠంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. కొత్తగా హైస్కూల్ వారికి అందజేయాలని నిర్ణయం ఇప్పటికే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పంపిణీ నేర్పు, నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వ యోచన జిల్లాలో 950 ఉన్నత పాఠశాలలువర్క్బుక్ల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. నేర్చుకున్న పాఠాలల సాధనలను నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులను మెగురుపర్చి ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. – అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి -
సొంతింటిపై ఆశలు!
భానుపురి (సూర్యాపేట) : ఇళ్లు లేని పేదల కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీలో భాగంగా రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గతేడాది ప్రారంభించింది. ఈ సమయంలో ఇళ్లు మంజూరుకాని వారి కోసం రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఇప్పటిదాకా మొదటి విడతలో ఇళ్లు రాకుండా.. ఆశగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం మంది 3 లక్షల మందిదాకా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి విడతలో సుమారుగా 12,868 వేల మందికి ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలో ఉన్న 600 మందికి రెండో విడతలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంకా ప్రారంభంకాని 4,616 ఇళ్లు..జిల్లాకు మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 12,868 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.5 లక్షలతో ఇళ్ల నిర్మాణం ఎలా అన్న మీమాంసలో పడి చాలామంది లబ్ధిదారులు ముందుకు రాలేదు. తదనంతరం నెమ్మదిగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా.. ఇప్పటి వరకు 1,500లకుపైగా ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి మరో 1,500 ఇళ్ల గృహ ప్రవేశాల జరగాలన్నా లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇంకా 4,616 ఇళ్లకు కనీసం పునాదిరాయి పడని పరిస్థితి నెలకొంది. వేలాది మంది దరఖాస్తులు తమకు ఇళ్లు రాలేదని బాధపడుతుండగా.. ఇళ్లు మంజూరైనా కట్టుకోకుండా ఉన్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి నియోజకవర్గానికి 2వేల ఇళ్లకు అవకాశం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. పలు ఆంక్షలతో కూడిన గైడ్లైన్స్లను విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. నిధుల కొరత తదితర కారణాలతో విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లను కేటాయించనున్నారు. ఈ రెండు వేల ఇళ్లను తోడుగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. సీఎం కోటాలో మరిన్ని ఇళ్లను జిల్లాకు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇక మొదటి విడతలో ప్రారంభంకాని ఇళ్లను సైతం రద్దు చేయడమా..? రద్దు చేస్తే వాటి స్ధానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేస్తే మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. లేదంటే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతోనే ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. మొదటి విడత మంజూరైనవి 12,868గృహప్రవేశాలు 1,500 కుపైగా త్వరలో గృహ ప్రవేశాల లక్ష్యం 1,500 ఇంకా నిర్మాణం ప్రారంభించనివి 4,616రెండో విడతలో మంజూరయ్యేవి 8,000రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ అంగీకారం జిల్లాకు త్వరలో 8వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశం తొలుత 600 మందికి ప్రాధాన్యం ఎదురుచూపుల్లో దరఖాస్తుదారులు -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన దొంగరి వెంకటేశ్వర్లు
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు సోమవారం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలపగా సీఎం ఆయనను అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్పొరేషన్ పదవులకు పూర్తి న్యాయం చేయాలని సూచించినట్టు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందిస్తాంసూర్యాపేట టౌన్ : వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషిచేస్తున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శివయ్యకు పుష్పార్చనమేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నిత్యారాధనలు కొనసాగాయి. స్వామివారికి ప్రత్యేకంగా మహాలింగార్చన, పుష్పార్చన, గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎర్రకుంట కబ్జాపై అధికారుల పరిశీలన కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో గల 50 ఎకరాల ఎర్రకుంట చెరువు కబ్జాకు గురికావడంతో 15 ఎకరాలకు చేరుకుంది. దీనిపై ఈ నెల 22న సాక్షిలో ‘మాయమవుతున్న ఎర్రకుంట’ అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ నాగభూషణరావు, ఆర్డీఓ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెండు శాఖల అధికారులు సోమవారం ఎర్రకుంట చెరువును పరిశీలించారు. చెరువు హద్దులు, ఎఫ్టీఎల్ పరిధి, చెరువు కట్టప్రాంతం ఆక్రమణలను పరిశీలించారు. సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్య క్రమంలో కోదాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈఈ సువర్ణరేఖ, ఏఈఈ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
బౌద్ధక్షేత్రం కళాఖండాలు అద్భుతం
నాగారం : మండలంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతనమైన గొప్ప చారిత్రక ప్రాంతమని, ఇక్కడి కళాఖండాలు అద్భుతమని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర, పురావస్తు శాఖ నిపుణులు విజిత్, పూజా, ఐసోన్, సౌరబ్ కొనియాడారు. సోమవారం ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని, మ్యూజియాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధక్షేత్రంపై లభించిన అరుదైన బౌద్ధ శిల్పసంపద, చారిత్రక ఆధారాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నారు. అనంతరం ఫణిగిరి గుట్టపైన, మ్యూజియంలో ప్రాచీన బౌద్ధసంపదను పరిశీలించారు. ఈకా ఆర్తివింగ్ మ్యూజియం ప్రతినిధి ఇంద్రనీల్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్లో ఉన్న డీబెర్గ్ మ్యూజియంలోని కళాఖండాల కంటే ఇవి అద్భుతంగా ఉన్నాయన్నారు. వారివెంట సిబ్బంది గట్టు వీరయ్య, కార్తీక్, యాకయ్య పాల్గొన్నారు. ఢిల్లీ పురావస్తు శాఖ నిపుణులు -
ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆనన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మహిళా వారోత్సవాలు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం మహిళా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహార ప్రదర్శనను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రారంభించి తిలకించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, సీడీపీఓలు కిరణ్మయి, శ్రీవాణి, సాయిలత, శ్రీజ, పారిజాత పార్వతి తదితరులు పాల్గొన్నారు. మహిళా అభ్యున్నతికే ఇందిరా మహిళా శక్తిభానుపురి (సూర్యాపేట) : మహిళా అభ్యున్నతికే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ (చిలకపచ్చ డిజైన్ను వర్చువల్గా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మహిళా సంఘ సభ్యులతో సమీక్షించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సాగర్ కాల్వ డీప్కట్లలో ఏడాదంతా నీరే..
నడిగూడెం : నడిగూడెం, మునగాల మండలాల పరిఽధిలో నాడు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ తవ్వకంలో భాగంగా రెండు చోట్ల నిర్మించిన డీప్కట్లలో ఏడాది పొడవునా నీరుండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మునగాల మండలం నారాయణగూడెం నుంచి కృష్ణానగర్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లు, సిరిపురం వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ డీప్కట్లు నిర్మించారు. కాల్వ తవ్వేటప్పుడు భూమి సహజమైన లెవెల్ కంటే చాలా లోతుగా తవ్వడాన్ని డీప్ కట్ అంటారు. ఇక్కడ డీప్కట్లను దాదాపు 60 నుంచి 70 అడుగుల లోతుగా కాల్వ తవ్వారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా నిలిపివేసినా సరే ఆయా డీప్కట్లలో ఐదారు అడుగుల లోతులో నీరు నిల్వ ఉండడం విశేషం. ప్రస్తుత వేసవి కావడంతో ఈ నీరు పశువుల దాహార్తిని తీరుస్తుండడంతోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈత నేర్చుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సీజన్ ఆరంభంలోనూ సాగర్ నీటిని వదలకున్నా అనేక మంది రైతులు ఈ నీటితోనే వరినార్లు పోసుకుంటున్నారు. -
వైభవంగా నారసింహుడి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూల విరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టి నిత్య కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, భక్తులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి
సూర్యాపేట టౌన్ : ఆసుపత్రిలో హెచ్ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) డాక్టర్ జయలక్ష్మి అన్నారు. సోమవారం ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం కింద సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం డీఎంహెచ్ఓ, ఎయిడ్స్, లెప్రసీ ప్రోగ్రామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్ఎఫ్యూ కేసులను తగ్గించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా స్థిరమైన రోగులకు ఎంఎండీ అందించాలని సూచించారు. జిల్లాలో హెచ్ఐవీ నిర్ధారణ, చికిత్స, రోగుల ఫాలోఅప్ సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కామేశ్వర్రావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబ్బంది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సహజ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలి అర్వపల్లి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) డాక్టర్ జయలక్ష్మి కోరారు. అర్వపల్లిలోని పీహెచ్సీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొబలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీలో సాధారణ, క్షయ, కుష్టువ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. రిజిస్టర్లను, ల్యాబ్ను, ఫార్మసీని పరిశీలించారు. పీహెచ్సీలో జరుగుతున్న సహజ కాన్పులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఓ ప్రసిద్ధ, వైద్యాదికారి డాక్టర్ నగేష్నాయక్, ఉమ్మడి జిల్లా పీఓ సుధాకర్, సీహెచ్ఓ బిచ్చునాయక్, కామేశ్వరరావు, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, మాధవి, కళమ్మ, టీబీ మండల నోడల్ పర్సన్ వీరయ్య పాల్గొన్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జేడీ డాక్టర్ జయలక్ష్మి -
తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్తోపాటు మిద్దె ఆనంద్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్తోపాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
బీఆర్ఎస్ నేత హత్య కేసును చేధించిన పోలీసులు
సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే మధును మట్టుబెట్టారని చెప్పారు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హత్యకు పాల్పడినట్టు ఎస్పీ వెల్లడించారు. అతడికి మరో ఐదుగురు సహకరించారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన మధుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రవీందర్ కొడుకు జీవన్ గతంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్తో మధును హత్య చేశాడు. కొంతకాలంగా సూర్యాపేట బాలాజీనగర్లో కుటుంబంతో పాటు నివసిస్తున్న మధును పథకం ప్రకారం బయటకు తీసుకొచ్చి కత్తులతో నరికి చంపారు.చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మధును చింత సైదులు శుక్రవారం తన ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్తో కలిసి మధు మద్యం సేవించాడు. అతడు మత్తులోకి జారుకోగానే జీవన్కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వచ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూటగట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్లో పడేశారు.మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ అన్నారు. చదవండి: వ్యవస్థ చచ్చింది.. శవమై నడిచింది! -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మూడురోజుల నుంచి ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలని, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, తలకు టోపీ, రుమాలు, గొడుగు ఉపయోగించడం మంచిదని పేర్కొన్నారు. బాధితుల సహాయార్ధం కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 6281492368ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హుజూర్నగర్లో జిల్లాస్థాయి ఈత పోటీలు
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్లోని స్విమ్మింగ్ పూల్లో ఆదివారం జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొదటిసారి నిర్వహించిన ఈత పోటీలకు మంచి స్పందన రావడం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో 8 నుంచి 11 ఏళ్లలోపు విభాగంలో బేబీ జోహిత, 15 నుంచి 20 ఏళ్లలోపు వారిలో జి. వివేక్, 52 నుంచి 60 ఏళ్ల లోపు వారిలో ట్రాన్స్కో డీఈ వెంకట కృష్ణయ్య, జానిమియా, గురువయ్య, 70 ఏళ్ల పైబడిన వారిలో లింగారెడ్డి విజేతగా నిలిచారు. మహిళ విభాగాల్లో విజయలక్ష్మి, హర్షిత బహుతులు అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్రెడ్డి, పట్టణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, కార్యదర్శి వీరస్వామి, కోశాధికారి సైదారావు, గౌరవ సలహాదారులు గెల్లి రంగారావు, కొండయ్య, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏపీపీ బదిలీ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహిస్తున్న బి.హేమలత నాయుడు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సుప్రియ సుమన్ జైశ్వాల్ సూర్యాపేటకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రాసిక్యుషన్ డైరెక్టర్ సాంబ శివారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీపై వెళ్తున్న ఏపీపీని ఆదివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ దాసరి మధుసూదన్రావు, సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే భక్తులు పాల్గొన్నారు. -
సూర్య ప్రతాపం
ప్రాంతం గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతం గరిష్ఠ ఉష్ణోగ్రతతిరుమలగిరి (తుంగతుర్తి), భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం 13 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపం చూపెడుతుండడంతో జిల్లా అగ్ని గుండంగా మారుతోంది. మోతె మండలం మామిళ్లగూడెంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బయట ఎండతో పాటు వడగాలులు వీస్తుండగా.. ఇంట్లో ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి రోహిణి కార్తె మొదలవుతుండగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెరిగిన వడగాలులుప్రస్తుతం ఎండతో పాటు వేడిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలుల ప్రభావంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు సైతం ఆధునిక సాంకేతికతో ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీ) ఎండ వేడిని సూచిస్తూ నేరుగా సెల్ఫోన్లకు హెచ్చరికలను పంపిస్తోంది. ఎండ వేడి ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ మెసేజ్లు పంపుతోంది. జిల్లా అధికారులు సైతం వివిద సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. 13 మండలాల్లో అత్యధికంగా..మోతె మండలంలో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోదాడ మండలంలో 45.8 డిగ్రీలు, మేళ్లచెర్వు మండలంలో 45.8, మునగాల మండలంలో 45.7, చివ్వెంల మండలంలో 45.7, నడిగూడెంలో 45.6 డిగ్రీలు, పెన్పహాడ్, చిలుకూరు, సూర్యాపేట మండలాల్లో 45.5 డిగ్రీల చొప్పున, హుజూర్నగర్ మండలంలో 45.4, నూతనకల్ మండలంలో 45.3, చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా జాజిరెడ్డిగూడెం మండలంలో 43.3 డిగ్రీలు నమోదైంది. నేటి నుంచి మరింత తీవ్రం ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమై జూన్ 8 వరకు కొనసాగుతుంది. ఈ రోజుల్లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం 46 డిగ్రీలు నమోదవుతుండగా రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలని, నీరు, పానీయాలు తాగుతూ ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.మామిళ్లగూడెం 46.2 ఉర్లుగొండ 45.8 మేళ్లచెర్వు 45.8 మునగాల 45.7 తిరుమలగిరి (చివ్వెంల) 45.7 నడిగూడెం 45.6 పెన్పహాడ్ 45.5 చిలుకూరు 45.5 బలరాంతండా (సూర్యాపేట) 45.5మామిళ్లగూడెంలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఫ 13 మండలాల్లో 45 డిగ్రీలకు పైగానే.. ఫ వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి ఫ నేటి నుంచి రోహిణి కార్తె -
ఈత సరదా విషాదాంతం కావద్దు
సూర్యాపేటటౌన్ : ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో పిల్లలు, యువకులు వేడి నుంచి ఉపశమనం కోసం బావులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా విషాదం కాకూడదని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, కాల్వల వద్దకు వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రజల వద్దకే పోలీసు సేవలుప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లాలో ఆన్సైట్ –ఎఫ్ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేకుండా, సంఘటన జరిగిన ప్రదేశానికే వెళ్లి ఫిర్యాదులను స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, నమ్మకమైన పోలీసు సేవలు అందించేందుకు ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళపై లైంగిక దాడులు, చిన్న పిల్ల లపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్, వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ విధానం ఎంతో మేలని పేర్కొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
ఊరంతా ఏకమై.. ఇల్లు కట్టించారు
మునగాల : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఏకమై ఇల్లు నిర్మించి ఇచ్చారు. మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన పనస సైదులు(25) నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సైదులు తండ్రి అంతకు ముందే చనిపోగా తానే కూలిపనులు చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. సైదులు మృతి చెందిన తర్వాత తల్లి వెంకటమ్మకు జీవనాధారం లేకుండా పోయింది. దానికి తోడు ఆమెకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామానికి చెందిన గణేష్ యూత్ అండగా నిలిచింది. కుల, మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకం చేసింది. గ్రామస్తులు రూ.2.50 లక్షలు సేకరించి ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఆదివారం గ్రామస్తులు కలిసికట్టుగా గృహప్రవేశం నిర్వహించారు.ఫ మృతుడి కుటుంబానికి గ్రామస్తుల చేయూత -
యూనిఫాం రాకపాయే..
బడి తెరిచే వేళాయే..సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది బడి తెరిచే నాటికి పుస్తకాలతో పాటు యూనిఫాం అందించేవారు. కానీ ఇప్పటి వరకు డ్రెస్ కుట్టేందుకు అవసరమైన క్లాత్ జిల్లాకు అందలేదు. మరో 18 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా యూనిఫాం కుట్టించి అందించడం సాధ్యం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సారి నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు మామూలు దుస్తుల్లోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం రోజు పుస్తకాలు మాత్రమే ఇవ్వనుండగా.. యూనిఫాం ఆలస్యం కానుంది. జిల్లాలో 65 వేల మంది విద్యార్థులుజిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 190 ఉన్నత, 80 ప్రాథమికోన్నత, 680 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 65వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజే ఒక జత, తరువాత మరోజత ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాకు వస్త్రం రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో విద్యార్థికి రెండు జతలుప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంటున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లలకు కొత్త దుస్తులు వస్తాయనే ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కానీ క్లాత్ రాక ఆలస్యం కావడంతో ఈ సారి యూనిఫాం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాఠశాలల వద్ద అస్పష్టత...జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పటివరకు యూనిఫామ్ క్లాత్ పంపిణీపై అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. క్లాత్ వచ్చిన తర్వాత టైలర్లకు ఇచ్చి యూనిఫామ్లు సిద్ధం చేయించాల్సి ఉంటుంది. పాఠశాలల పునఃప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో క్లాత్ సరఫరాను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్లాత్ త్వరలోనే వస్తుంది : అశోక్, డీఈఓ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది అందించే యూనిఫాం క్లాత్ త్వరలోనే వస్తుంది. రాగానే వెంటనే పాఠశాలల వారీగా మహిళా సంఘాలకు క్లాత్ను అందించి దుస్తులు కుట్టిస్తాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు వచ్చాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే అందజేసేందుకు కృషి చేస్తాం.ఇప్పటి వరకు అందని యూనిఫాం క్లాత్ ఫ మరో 18 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం ఫ అప్పటివరకు దుస్తులు అందడం కష్టమే -
విచారణ ప్రభావితం చేసేందుకే ఆరోపణలు
భానుపురి (సూర్యాపేట) : బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్యతో కాంగ్రెస్కు సంబంధం లేదని, విచారణను ప్రభావితం చేసేందుకే మాజీ మంత్రి జగదీష్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హత్య రాజకీయాలపై జగదీష్రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మధు హత్య పాత కక్షలతో జరిగిందా.. వ్యక్తిగత కక్షలతోనా అనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. ప్రస్తుతం సూర్యాపేట మంత్రి ఉత్తమ్కు మార్రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి సారథ్యంలో ప్రశాంతంగా ఉందన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రోత్సహించలేదన్నారు. ఆ హత్యతో మా పార్టీకి సంబంధం లేదని, త్వరలోనే నిజాలు తేలుతాయని స్పష్టం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ, నాయకులపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, కౌన్సిలర్ నాగుల వాసు, దండు మైసమ్మ ఆలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
సేవాభావం కలిగి ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : వివిధ ఉద్యోగాలు సాధించిన యువతీయువకులు సేవాభావం కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండలో నిర్వహించిన జాబ్మేళాలో ఉద్యోగాలు సాధించిన వారికి శనివారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ నియామక పత్రాలు అందించి మాట్లాడారు. అదేవిధంగా సెకండ్ ఎడ్యుకేషన్ సీఎం కప్ 2025లో భాగంగా చెస్లో రాష్ట్ర స్థాయి మెడల్ సాధించిన ఓరుగంటి అనంతలక్ష్మిని సన్మానించి రూ.5వేల నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు
ఫ సీఎం పర్యటన సాగిందిలా..యాదగిరిగుట్ట : టెంపుల్ సిటీపై వేద పాఠశాల నిర్మాణానికి, మరికొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సీఎం సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు యాదగిరిగుట్టలో గడిపారు. సీఎం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లు ఉదయం 8.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుట్టకు చేరుకున్నారు. ● 8.53 గంటలకు ప్రత్యేక కార్వన్ బస్సులోకి వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు. ● 9.26 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వేద పాఠశాల భూమి పూజకు శ్రీకారం చుట్టారు. ● 9.40 గంటలకు వేద పాఠశాలకు శంకుస్థాపన భూమి పూజను పూర్తి చేశారు. ● 9.42 గంటలకు వేద పాఠశాల నిర్మాణం చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపం, గోశాల, దీక్షాపరుల సన్నిధానం, వేద పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన వాటితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ● 10.03 గంటలకు యాదగిరీశుడి ఆలయంలోకి వెళ్లారు. త్రితల ద్వారం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ● 10.10 గంటల నుంచి 10:21 గంటల వరకు గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వచ్చారు. ● 10.22 గంటలకు ముఖ మండపంలో సీఎంతో పాటు మంత్రులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తిలు శ్రీస్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ● 10.32 గంటలకు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చారు. ● 10.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు తిరిగి హైదరాబాద్కు వెళ్లారు. -
బడిపిల్లలకు బ్రేక్ఫాస్ట్
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 970 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా 690 పీఎస్, 80 యూపీఎస్, 200 హైస్కూళ్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించింది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. రోజుకో రకమైన టిఫిన్తో పాటు రోజు విడిచి రోజు పాలు, రాగి, బెల్లం జావా సరఫరా చేయనున్నారు. పథకం లక్ష్యం..ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయబోతున్నారు. గత ఏడాది కొడంగల్ నియోజకవర్గంలో ఈ పథకం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో పౌష్టికాహారలోపాన్ని, ఆకలిని అరికట్టి, శారీరక, మానసిక వికాసం పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో 2021లో కొద్ది నెలలు సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో 1నుంచి 10 తరగతులకు అల్పాహారం పథకం అమలు చేశారు. అప్పుడు పూరి, ఉప్మా, అటుకుల ఉప్మా, కిచిడీ విద్యార్థులకు అందించారు. అల్పాహారం సరఫరా ఎలా?ప్రతి రోజు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం వంట ఏజెన్సీలతో పిల్లలకు అందించాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బ్రేక్ ఫాస్ట్ పథకం వంటశాల ఒక చోట ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలానికి ఒక హైస్కూల్ను ఎంపిక చేసి అక్కడ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు అల్పాహారం సరఫరా చేయాలని యోచిస్తున్నారు. విద్యార్థుల ముందు రోజు హాజరును పరిగణలోకి తీసుకుని అల్పాహారం స్కూళ్లకు అందిస్తారు. టిఫిన్తోపాటు మధ్యాహ్న భోజనంలో సోమ, శుక్రవారాల్లో ఉడకబెట్టిన కోడి గుడ్డు అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇలా.. సోమవారం : దోశ – చట్నీ, చపాతి – కూర, మంగళవారం : మిల్లెట్ ఇడ్లీ (రెండు) – సాంబారు, జావ బుధవారం : పూరి (రెండు) – ఆలూ కుర్మా గురువారం : మిల్లెట్ ఇడ్లీ (రెండు) – సాంబారు, జావ శుక్రవారం : మిల్లెట్ ఉప్మా / పొంగల్, పాలు శనివారం : బోండా (రెండు) – చట్నీ, రాగి జావ ఫ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో అమలు ఫ ఇంటర్ విద్యార్థులకూ అందించాలని యోచిస్తున్న ప్రభుత్వం -
నేడు జిల్లా స్థాయి ఈత పోటీలు
హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్లోని స్విమ్మింగ్ పూల్లో ఆదివారం జిల్లా స్థాయి ఈత పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ డీఈ వెంకటకిష్టయ్య, నిర్వాహకులు జనార్దన్, వీరస్వామి, సైదారావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసుల తనిఖీలుకోదాడ రూరల్ : మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నార్కోటిక్ డాగ్ (రోలెక్స్) సహాయంతో పోలీసులు శనివారం కోదాడ పట్టణంలో ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు. రంగా థియేటర్ చౌరస్తా, బస్టాండ్ సెంటర్, ఖమ్మం క్రాస్రోడ్డు, పలు పాన్షాలు, కూరగాయాల మార్కెట్, టీ స్టాళ్లతోపాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మత్తు పదార్థాల వాసనను పసిగట్టేలా డాగ్తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ కె.శివశంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలిసూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సరైన న్యాయం చేయాలని టీజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ కుంట్ల ధర్మార్జున్ కోరారు. శనివారం సూర్యాపేట పట్టణంలో రవి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో డేవిడ్ కుమార్, గండూరి రమేష్, వెంకటేశ్వరరావు, అనంతుల మధు, నాగిరెడ్డి, మేకల నాగేశ్వరరావు, నాగిరెడ్డి, కేఎల్ఎన్.రావు, దుద్యాల రవీందర్రావు, ఎండి నజీర్, లక్ష్మీనారాయణ, నరసింహారావు, బ్రహ్మచారి, వనిత, అశోక్రెడ్డి, వెంకన్న, రమాశంకర్ పాల్గొన్నారు. -
సమభావన సంఘం సభ్యుల ధర్నా
ఫ శ్రీనిధి రుణం సభ్యులకు పంచకుండా సొంతానికి వాడుకున్న సంఘం లీడర్ ఫ రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందడంతో లీడర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు కోదాడ : సమభావన సంఘానికి మంజూరైన శ్రీనిధి రుణాన్ని సభ్యులకు పంచకుండా గ్రూప్ లీడర్ తన సొంత అవసరాలకు వాడుకోవడాన్ని నిరసిస్తూ శనివారం ఆ సంఘానికి చెందిన పలువురు మహిళలు సదరు గ్రూప్ లీడర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన శనివారం కోదాడ పట్టణ పరిధిలోని అజాద్నగర్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆజాద్నగర్కు చెందిన శ్రీమణికంఠ సమభావన సంఘానికి శ్రీనిధి కింద రూ.4.60 లక్షల రుణం మంజూరైంది. ఈ డబ్బులను సంఘం మొదటి లీడర్ సభ్యులకు పంచకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది. తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో అవాక్కయిన సభ్యులు శనివారం గ్రూప్ లీడర్ తమ్మిశెట్టి బుజ్జి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంలో గ్రూప్ రెండవ లీడర్కు కూడా ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. -
‘చేయూత’లో కదలిక
వృద్ధాప్య 53,205 దివ్యాంగ 18,458 వితంతు 56,277 ఒంటరి మహిళ 6795 చేనేత 873 కల్లుగీత 6,552 ఎయిడ్స్ 1205 పైలేరియా 2,109 డయాలసిస్ 258 మొత్తం 1,45,732 సూర్యాపేట : చేయూత పెన్షన్ల మంజూరుపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు గానూ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హుల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తు దారులు జాబితాలో తమ పేరు ఉంటుందనే ఆశతో ఉన్నారు. జిల్లాలో 1,45,732 పింఛన్దారులు సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 1,45,732 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో అత్యధికంగా వితంతు పింఛన్లు 56,277 ఉండగా, 53,205 మందికి వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. చివరగా 2022 ఆగస్టులో కొత్తగా పింఛన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు నాలుగేళ్లుగా వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తుకున్న వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ డబ్బులే ఆధారమవుతున్నాయి. 20వేల దరఖాస్తులు కొత్త పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 20వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్ల పంపిణీలో మొదటగా దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, వితంతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 50 శాతానికి పైగా దరఖాస్తుదారులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. పింఛన్ల మంజూరుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయా కేటగిరీల వారీగా చేసుకున్న దరఖాస్తులను విచారిస్తారా..? లేదంటే కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారా..? అన్నది స్పష్టత లేదు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఫ జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఫ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఫ ఒకట్రెండు రోజుల్లో డీఆర్డీఓలకు అందనున్న ఉత్తర్వులు ఫ దరఖాస్తు దారుల్లో చిగురిస్తున్న ఆశలు -
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం
సూర్యాపేట : ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్హాల్లో శుక్రవారం శ్రీమాదిగ మహాశక్తిశ్రీ నాయకులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా మాదిగల బతుకులు మారడం లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు ఉంటే అగ్రకులాల వారు అధికారాన్ని చలాయిస్తూ మాదిగలను, బహుజన కులాలను పావులుగా, ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకుంటే మన సత్తా ఏందో తెలుస్తదన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 50 వేల మందికి పైగా మాదిగలు ఉన్నారన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అందించడంలో పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాల కుటుంబాలకే, సీట్లు మంత్రి పదవులు దక్కాయన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, ప్రొఫెసర్ కనకయ్య, దుర్గయ్య గౌడ్, బండారు సుధాకర్, కేవీ, మాచర్ల సైదులు, డేవిడ్, మస్తాన్, దయానంద్, జయశంకర్, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
ఫ డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తుంగతుర్తి : ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ గాజుల చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వడదెబ్బతో మృతి చెందిన చర్లపల్లి సోమయ్య మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తలనొప్పి, అధిక చెమటలు, నీరసం, తల తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని వెళ్లి వైద్య సేవలు పొందాలన్నారు. ఆయన వెంట రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, జిల్లా ఎపిడిమియాలజిస్ట్ సతీష్ కుమార్, సీహెచ్ఓ శ్రీనివాస్ రాజ్, హెచ్ఈఓ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్లు కృష్ణమూర్తి, గాజుల సోమన్న, యాదగిరి, చారి, ఏ్ ఎంలు భారతి, శైలజ, ఆశ కార్యకర్తలు ఉన్నారు. తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పెద్ద కుట్రతుంగతుర్తి : తాడి మ్యూజికల్ ఫెస్టివల్ కార్యక్రమం గౌడ్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అన్నారంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎక్విరియం ఈకో పార్క్ యజమాని రామ్ దేవ్ రావ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న తాడి మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కల్లుగీత కార్మికులు వృత్తిని కాపాడుకునే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే.. కార్పొరేట్ వ్యవస్థ తాడి పేరుతో ఈవెంట్లు నిర్వహించి కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చూడడం దారుణమన్నారు. సమావేశంలో గౌడ సంక్షేమ, కల్లుగీత సంఘం నాయకులు గుండగాని నాగరాజుగౌడ్, మల్లేష్గౌడ్, ముత్తయ్యగౌడ్, సుధాకర్గౌడ్ పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
భానుపురి (సూర్యాపేట) : జిల్లా సగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు క్షేత్రస్థాయి అధికారులు కలికట్టుగా పని చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రవిమహల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక జిల్లాస్థాయి సమావేశంలో ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాలు లేకపోతే ఎంపీడీఓ ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 370కి పైగా భవనాల ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటికే 200 భవనాలకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని 50 మంది ప్రత్యేక అవసరాల పిల్లల కోసం 342 ప్రత్యేక పరికరాలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాదకద్రవ్యాలను నిర్మూలించాలి మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ను వారు సందర్శించారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక ఉత్తర్వులను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్చైర్మన్ షఫీఉల్లా, డీఆర్డీఓ సన్యాస య్య, జడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సీపీఓ కిషన్, డీఎస్సీడీఓ దయానందరాణి, అధి కారులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డీఆర్వోగా ప్రేమ్రాజ్
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారిగా డి.ప్రేమ్రాజ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రొటోకాల్ విభాగంలో అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ప్రేమ్రాజ్ను సూర్యాపేట డీఆర్వోగా నియమించారు. ఇప్పటి వరకు డీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. 4న కోదాడ పెద్దచెరువు సంఘం ఎన్నికలుకోదాడ : కోదాడ పెద్దచెరువు మత్య్స సహకార సంఘానికి జూన్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సహకార అధికారి వి. ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ బాలుర పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 9 కార్యవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నవారు ఈ నెల 25, 26, 28 తేదీలలో కోదాడ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంనూతనకల్ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా నేటికీ కాంటాలు వేయడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ముంచుకొస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 30 శాతం ధాన్యం రాసులు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి లారీల కొరత సమస్యను పరిష్కరించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. వారి వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్గౌడ్, రైతు సంఘం నాయకులు యానాల వెంకట్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
నేడు వేద పాఠశాలకు శంకుస్థాపన
యాదగిరిగుట్ట: సీఎం రేవంత్రెడ్డి శనివారం యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని టెంపుల్ సిటీపై రూ.43 కోట్లతో, 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలతో పాటు, విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే పనులకు సీఎం రేవంత్రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీతో కలిసి శంకుస్థాపన పూజలు చేయనున్నారు. శనివారం ఉదయం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలికాఫ్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. వేద పాఠశాలకు శంకుస్థాపన చేసే స్థలాన్ని, కొండకు దిగువన వాహన పూజల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, ప్రెసిడెన్షియల్ సూట్, వేద పాఠశాల స్థలం, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ముస్తాబైన ఆలయం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు నాల్గవ సారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఆలయాధికారులు సిద్ధమయ్యారు. సీఎంను ఆకర్షించే విధంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులకు ఈఓ భవాని శంకర్ బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులకు ఆశీర్వచనం చేసిన అనంతరం అందజేసే ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. -
లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభి షేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా సరిగా జరిగేలా..మేళ్లచెరువు : వేసవిలో విద్యుత్ సరఫరా డిమాండ్ అధికంగా ఉంటుంది. దాంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడడం, హెచ్చుతగ్గులు వచ్చి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని నివారించేందుకు మేళ్లచెరువు మండలంలోని జగ్గుతండా గ్రామ సర్పంచ్ మంజుల సుధాకర్నాయక్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లకు ఉండే ఎర్త్లకు పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని పోయిస్తున్నారు. దీని వల్ల వేసవిలో విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులను నివారించవచ్చని సర్పంచ్ తెలిపారు. సాగర్లో టూరిజం హెరిటేజ్ వాక్నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగార్జునసాగర్లో హెరిటేజ్ టూరిజం వాక్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక అధికారి మహ్మద్ అక్బర్అలీ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం విజయవిహార్ అతిథిగృహం ప్రాంగణంలో వాక్ చేశారు. జిల్లాలోని టూరిజం ప్రాంతాలకు సంబంధించిన బ్రోచర్లోని పలు ప్రాంతాలపై చర్చించారు. కార్యక్రమంలో టూరిజం గైడ్ సత్యనారాయణ, స్థానికులు నజీర్, అనిల్కుమార్, రాజగోపాల్, అడ్వకేట్ వినోద్కుమార్, మల్లికార్జున్, సిబ్బంది వెంకటస్వామి, అంజి, తులసి పాల్గొన్నారు. -
నేడు సూర్యాపేటలో సదస్సు
సూర్యాపేట అర్బన్ : సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జలగం జనార్దన్ (జెన్ను సార్) 5వ వర్ధంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డినగర్లో సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ జిల్లా నాయకుడు కారింగుల వెంకన్న తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్ను సార్ అనునిత్యం అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేశారన్నారు. సదస్సుకు పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజ రు కావాలని కోరారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్కుమార్, నాయకులు నవీన్రెడ్డి, శివ, కళ్యాణ్ పాల్గొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు బుధవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే స్వామి వారిని మేల్కోలిపిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. ఆ తర్వాత స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ప్రధానాలయం ముఖమండపం ముందు సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఇక ఆలయ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం తదతర నిత్యారాధనలు జరిపించారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
మొసళ్లున్నాయ్ జాగ్రత్త
సాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణా నది తీరం మొసళ్లకు నిలయంగా మారింది. గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026- 8లోతిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దాంతో జాబితాలను ఇవ్వాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ల బాధ్యులను జిల్లా అధికారులు కోరారు. దాంతో గ్రామాలలో మళ్లీ సందడి నెలకొంది. పదవి ఆశిస్తున్న నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడువు పొడిగింపుతో.. పాక్స్ల పాలకమండళ్లు, డీసీఎంఎస్, ఎన్డీసీసీబీ పాలకవర్గం గడువు 14 ఫిబ్రవరి 2025న ముగిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి గడువును మరో 6 నెలలు పొడిగించింది. అనంతరం మరో ఆరునెలల గడువును పొడిగిస్తూ 2025 ఆగస్టు 14న అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పొడిగింపు గడువు 2026 ఫిబ్రవరి 14 వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తూ 2025 డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది. 11 నుంచి 13 మంది జాబితా గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాక్స్లకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్ విధానంతో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు గత నెల 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే గడువు ఉండగానే పాలక మండళ్లను రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానానికి వెళ్లడంపై పలువురు నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఈ నెల 5 నుంచి పాత పాలక మండళ్లను పునరుద్ధరించారు. అయితే ఈ పాలక మండళ్ల విషయం తేలాల్సి ఉండగానే.. నామినేటెడ్ విధానంలో ఒక్కో పాక్స్కు 11 నుంచి 13 మందితో కూడిన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. 18 రకాల వివరాలు పంపాలి అధ్యక్షుడు, సభ్యులుగా నియమించేవారికి సంబంధించి 18 రకాల వివరాలను పంపాలని ప్రభుత్వం సూచించింది. మార్కెట్ కమిటీల మాదిరిగానే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, అధికారులు ఎఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, సెగ్మెంట్ బాధ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రుల ద్వారా పాలకమండళ్ల ప్రతినిధులను ఎన్నిక చేసే అవకాశం ఉంది. అయితే ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం మక్కల కొనుగోళ్లు, పెట్రోలు పంపుల నిర్వహణ, రుణాల పంపిణీ, బ్యాంకింగ్ కౌంటర్ల ద్వారా లావాదేవీల నిర్వహణ తదితర వాటితో పాక్స్లకు అమితమైన ప్రాధాన్యత ఉంది. దాంతో పాలక మండళ్లకు పోటీ ఎక్కువగానే ఉండనుంది. ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాలు : 107 సూర్యాపేట జిల్లా : 44 నల్లగొండ జిల్లా : 42 యాదాద్రి భువనగిరి : 21పీఏసీఎస్లకు పాలకమండళ్లుఫ కొత్తగా నామినేట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ఫ జాబితా పంపాలంటూ ఆదేశాలు -
టీబీ నిరా్ధరణ పరీక్షలు పెంచాలి
సూర్యాపేటటౌన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో టీబీ వ్యాధి అనుమానితుల నుంచి పరీక్షల నమూనాల సేకరణను పెంచాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 54 రోజుల ప్రగతిపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగశాలల్లో పరీక్షల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. ప్రాథమిక పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, లక్షణాలు ఉంటే వెంటనే సాంపుల్స్ సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. ఇప్పటి వరకు 21 గ్రామ పంచాయతీలు టీబీ ముక్త్గా మార్చినందుకు అభినందించారు. టీబీ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 67 గ్రామాలను గుర్తించి 32 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6,818 ఎక్స్రేలు తీయడంతో పాటు 2,941 మందికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా 149 టీబీ వ్యాఽధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీబీ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ పి.వెంకటపాపిరెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీశైలం, డిప్యూటీ డెమో సంజీవ్రెడ్డి, ఫార్మసిస్ట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ వెంకటరమణ -
పారదర్శక ఓటర్ల జాబితా తయారే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ సమావేశ మదిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. జూన్ 15 నుంచి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ, ప్రిపరేషన్, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేస్తారన్నారు. జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మార్పు, జూలై 31న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం, అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా అధికారిక ప్రచురణ ఉంటుందని వివరించారు. బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించడం, వలస వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే బాధ్యత కూడా బీఎల్ఓలపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, రాజకీయ నాయకులు చకిలం రాజేశ్వర రావు, ఎండీ అబీద్, రవి, కరుణాకర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
సర్వీస్ రికార్డులో చేతివాటం
సూర్యాపేటటౌన్ : రికార్డుల ప్రకారం తన సర్వీస్ పూర్తయినా.. అక్రమంగా సర్వీస్ రికార్డుల్లో తన పుట్టిన తేదీని దిద్దుకొని నాలుగేళ్లు అదనంగా ఉద్యోగంలో కొనసాగాడు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. పదవీ విరమణ వయస్సు దాటినా నాలుగేళ్లు విధుల్లో కొనసాగి జీతం రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. ఈ విషయమై స్వయాన అతడి కుమారుడే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. అయినా అతడిపై చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్బుక్లో తేదీ మార్పు మద్దిరాల మండలం చిన్ననెమిల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అల్లంనేని రంగారావు ఎస్జీటీగా విద్యాశాఖలో సేవలందించి 2004లో ఉద్యోగ విరమణ పొందారు. సదరు ఉపాధ్యాయుడి పుట్టిన తేదీ ఆయన చదివిన పాఠశాల (జడ్పీహెచ్ఎస్ తొర్రూర్) రికార్డుల ప్రకారంగా 12 నవంబర్ 1942గా ఉంది. అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఆయన 58 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని 2000 సంవత్సరంలో రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే కంప్యూటర్ వ్యవస్థ లేని సమయంలో సదరు ఉపాధ్యాయుడు తన సర్వీస్ బుక్లో చేతిరాతతో ఉన్న పుట్టిన తేదీని 1942కు బదులు 1946గా దిద్ది నాలుగేళ్లు అదనంగా కొలువులో కొనసాగారు. అధికారుల కళ్లుగప్పి 2004 వరకు విధుల్లో కొనసాగారు. నాలుగేళ్లు జీతం రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశారు. తండ్రి అక్రమాలపై కుమారుడి ఫిర్యాదు అల్లంనేని రంగారావు కుమారుడు వెంకటేశ్వర్రావు ఈ విషయం తెలుసుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన విషయమై కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, అకౌంట్ జనరల్ ఆఫీస్కు సైతం ఫిర్యాదు చేశాడు. మండల విద్యాశాఖ అధికారులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంకటేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు అల్లంనేని రంగారావు విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని నూతనకల్ మండల విద్యాధికారికి ఆదేశించాం. సర్వీస్ పుస్తకంలో పుట్టిన తేదీ దిద్దుకొని నాలుగేళ్లు అదనంగా జీతం పొందినట్లు రుజువైతే ఆ డబ్బులను రికవరీ చేస్తాం. అతడిపై చర్యలు సైతం ఉంటాయి. – అశోక్, డీఈఓఫ పుట్టినతేదీ మార్చుకొని అదనంగా నాలుగేళ్లు సర్వీస్లో ఫ ప్రభుత్వాన్ని మోసగించిన రిటైర్డ్ టీచర్ ఫ తండ్రి అక్రమాలపై కుమారుడి ఫిర్యాదు -
పైరవీల జోరు
ఫ నెలాఖరు నాటికి ఉద్యోగుల బదిలీలు ఫ పలు శాఖల్లో జోరుగా పైరవీలు ఫ నచ్చిన చోటుకు మారేందుకు తిప్పలు ఫ గాడ్ ఫాదర్ల వద్దకు పరుగులుభానుపురి (సూర్యాపేట) : పలు ప్రభుత్వ శాఖల్లో నెలాఖరు నాటికి ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొన్ని శాఖలకు మినహాయింపులు ఇవ్వగా.. బదిలీలు జరిగే శాఖల్లో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా స్థానచలనం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పైరవీల జోరు పెంచారు. తమకు అనుకూలంగా ఉన్న చోటుకు మారేందుకు, స్థానచలనం కాకుండా ఉండేందుకు ఓవైపు జిల్లాస్థాయి అధికారులను, మరోవైపు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. బదిలీల సందడి..! ఉపాధ్యాయులు, పోలీసులు, వాణిజ్య పన్నులు, అబ్కారీ, రవాణా, అటవీ శాఖల ఉద్యోగులు మినహా మిగతా 45 శాఖలకు పైగా ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరిగా మారాయి. ఇందులోనూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పరిసరిగా బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఆయా శాఖల జిల్లా అధికారులు తమ శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగుల బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించడం, బదిలీ అయ్యే ఉద్యోగుల లిస్టులను ప్రదర్శించడం వంటివి చేపట్టారు. ఆయా ఖాళీల ఆధారంగా 5 ఆప్షన్లతో కూడిన దరఖాస్తులను బదిలీ అయ్యే ఉద్యోగుల నుంచి స్వీకరించారు. కొన్నిశాఖల్లో ఒకట్రెండు రోజుల్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో బదిలీ సందడి నెలకొంది. నచ్చిన కాడికి వెళ్లేందుకు..! సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 7,987 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2024లో చేపట్టిన బదిలీల్లో పలువురికి స్థానచలనం కాగా.. ప్రభుత్వ మినహాయింపులు, బదిలీలు అయ్యే శాఖల్లో దాదాపు 3వేలకు పైగా ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు అధికంగా జరగనున్నాయి. బదిలీ తప్పనిసరి అనుకున్న వారంతా తమకు అనుకూలమైన మండలాలు, ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. జిల్లాస్ధాయి అధికారులనే కాకుండా ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తెస్తున్నారు. దాంతో పాటు ఉద్యోగ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న వారితో తమ పైరవీలను నడుపుతున్నారు. ఏది చేసైనా తమకు కావాల్సిన ప్రాంతాలు, పోస్టింగ్లను పొందేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 25 నుంచి ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. -
మరో నాలుగు రోజులే గడువు
నాగారం : ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూళ్లు వరంలా మారాయి. ఆదర్శ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు క్రీడలు, కళలు, సాంస్కతిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. 2026–2027 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తునకు ఈ నెల 25 వరకు గడువు ఉంది. జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు సూర్యాపేట జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. నాగారం(పసునూర్),తిరుమలగిరి (అనంతారం), సూర్యాపేట (ఇమాంపేట), పెన్పహాడ్ (అనాజీపురం), నడిగూడెం (కర్విరాల), గరిడేపల్లి (గడ్డిపల్లి), ఆత్మకూర్(ఎస్), మట్టంపల్లి, మునగాల మండలాల్లో మోడల్ స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ కోర్సులు ఉన్నాయ. ఒక్కో కోర్సులో 40 సీట్ల చొప్పున మొత్తం జిల్లాలో 1,440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లను భర్తీకి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి సైతం కల్పిస్తారు. 25 తుది గడువు ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 27న మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులకు 28 నుంచి 30 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ఫ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ఫ జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు -
చర్మవ్యాధులున్న వీధి కుక్కలకు చికిత్స
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుక్కలు చర్మవ్యాధులతో బాధపడుతున్నాయన్న సమాచారంతో హైదరాబాద్ బ్లూక్రాస్ షెల్టర్ డైరెక్టర్, సీఎఫ్ఓ ఎన్ఎస్కే కుమారి బుధవారం ప్రత్యేక వైద్యబృందంతో చేరుకొని చికిత్స చేపట్టారు. 25వ వార్డులో చర్మవ్యాధులతో ఉన్న కుక్కలను వలల సాయంతో పట్టుకుని వాటి నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం ప్రత్యేక వ్యాక్సిన్ అందించారు. పలు వార్డుల్లోని శునకాల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఎస్కే కుమారి మాట్లాడుతూ చర్మవ్యాధులతో బాధపడుతున్న కుక్కల విషయమై తమ వలంటీర్ అందించిన సమాచారం మేరకు సూర్యాపేటకు వచ్చినట్లు తెలిపారు. సుమారు పది కుక్కల నుంచి రక్త నమూనాలను సేకరించామని, వాటి నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు. ప్రస్తుతం కుక్కలకు వ్యాక్సిన్లు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ హనుమంతరెడ్డి సహకారం అందించారని వివరించారు, కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బ్లూ ఆఫ్ హైదరాబాద్ జిల్లా వలంటీర్ నరేందర్ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, 24, 25 వార్డు కౌన్సిలర్లు మన్నెం అరుణ మల్లేష్, కోడి శిరీష శివ, వైద్యులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపుల బంద్
సూర్యాపేటటౌన్ : ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ షాపుల యూనియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. అనంతరం వాటి యజమానులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ ఆన్న్ లైన్ సర్వీసు వల్ల మెడికల్ వ్యాపారులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. మెడికల్ షాపులను డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని. మరి ఆన్లైన్లోన విక్రయించే మందులను ఎవరు పరిశీలిస్తారని ప్రశ్నించారు. మత్తు టాబ్లెట్లు, నకిలీ మందులు ఆన్న్లైన్ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు.ఫ ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలపై నిరసన -
మోక్షం లేని ‘కోఆప్షన్’!
కోదాడ : కోదాడ మున్సిపల్ కోఆప్షన్ పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ పదవులను భర్తీచేయడంలో కీలకంగా వ్యవహరించే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాత్రం వీటిపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. మున్సిపాలిటీ పాలక వర్గం అధికారం చేపట్టిన రెండు నెలలలోపు వీటిని నింపాల్సి ఉంది. అయినా మూడు నెలల దాటినా కోఆప్షన్ పదవుల భర్తీకి మాత్రం మోక్షం కలగడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల కన్నా కోదాడలోనే అత్యధికంగా 57 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ముస్లిం మైనార్టీ కోటాలో ఉన్న ఒక్క పదవికి 17 మంది, క్రిస్టియన్ మైనార్టీ కోటాలో ఉన్న ఒక్క కోఆప్షన పదవికి మరో 17 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే, మాజీ ప్రజాప్రతినిధులు, పరిపాలన అనుభవం ఉన్న వారి కోటాలోని రెండు స్థానాలకు 25 మంది దరఖాస్తు చేశారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో.. కోఆప్షన్ పదవులు పరిమితంగా.. ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడంతో పదవులకు నాయకులను ఎంపిక చేయడంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పదవులను భర్తీ చేయడం తేనె తుట్టెను కదిలించినట్లేనని వారు భావిస్తూ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మున్సి పల్ ఎన్నికల సమయంలో పలవురికి కోఆప్షన్ పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వారంతా తమకు అవకాశం కల్పించాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో ఒకరికి ఇచ్చి మరొకరికి లేదంటే లేనిపోని సమస్యలు వస్తామని భావించి ఏకంగా మొత్తం ప్రక్రియనే వాయిదా వేసినట్లు సమాచారం. ఇలా ఎంతకాలం వాయిదా వేస్తారని.. ఏదో ఒకరోజు ఈ పదవులను భర్తీ చేయాల్సిందే కదా అని.. ఇప్పటికై నా మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక దృష్టిసారించి ఆశావహులను కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు అంటున్నారు. మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో కోదాడ మాజీ సర్పంచ్లు ఎర్నేని బాబు, పారా సీతయ్య ఇద్దరు తమకు కోఆప్షన్ అవకాశం కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. ప్రస్తుతం ఎర్నేనిబాబు సతీమణి కుసుమ కుమారి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమెకు మున్సిపల్ సమావేశాల్లో సహాయ సహకారాలు అందించాలంటే తాను మున్సిపల్ సమావేశాల్లో పాల్గొవాలని అందుకు తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని బాబు కోరుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చెరిసగం కాలమని చెప్పారని, రెండున్నర సంవత్సరాల తరువాత తన సతీమణి పారా సత్యవతికి చైర్పర్సన్ పదవి ఇస్తామని ఒప్పందం జరిగినందున తనకు కూడ కోఆప్షన్ అవకాశం ఇవ్వాలని పారా సీతయ్య గట్టిగానే కోరుతున్నారు. ఇక ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలలో కూడా గట్టిపోటీనే ఉండడంతో ఈ పదవులు ఎవరిని వరిస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పది సంవత్సరాలుగా పదవులు లేకుండా ఉన్నామని.. ఇప్పుడు అవకాశం వచ్చినందున వెంటనే పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు కోరుతున్నారు. ఫ భర్తీకాని కోదాడ మున్సిపల్ కోఆప్షన్ పదవులు ఫ రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు ఫ రెండు నెలలు దాటినా దృష్టిపెట్టని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఫ ఎదురుచూపుల్లో ఆశావహులు -
సమాజ హితానికి పాటుపడాలి
సూర్యాపేట టౌన్ : సమాజ హితానికి పాటుపడాలని ఎస్పీ నరసింహ అన్నారు. కేసుల్లో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో చేసిన పనుల నుంచి పాఠాలు నేర్చుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. అసాంఘిక చర్యలకు, నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రతినెలా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరిపై పోలీసు నిఘా ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడవద్దని కోరారు. గరిడేపల్లి, మేళ్లచెరువు, మునగాల, మోతె పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య కేసుల్లో జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, శివతేజ, సిబ్బంది పాల్గొన్నారు. భౌతికదాడులకు పాల్పడొద్దు నూతనకల్ : సమాజంలో భౌతికదాడులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించడంతో పాటు పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పాతనేరస్తులు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం గ్రామస్తులను చైతన్యవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగారం సీఐ నాగేశ్వరరావు, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్ మగ్ధూమ్ అలీ, ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
తిరుమలగిరి (తుంగతుర్తి) : వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆయన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారులతో కలిసి అన్ లోడింగ్ పాయింట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం దిగుమతులు వేగవంతం చేయడానికి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట తిరుమలగిరి తహసీల్దార్ హరిప్రసాద్, డీటీ జాన్మహ్మద్, ఆర్ఐ సుజిత్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ అనిల్, ఎస్ఐ వెంకట్రెడ్డి ఉన్నారు. 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం తుంగతుర్తి : ఇప్పటి వరకు జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్తోపాటు వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. అన్ని కేంద్రాల్లో హమాలీలు, లారీ కొరతలు లేకుండా అన్లోడింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసేలా చూస్తామని వివరించారు. పలు సమస్యలను కేంద్రాల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమార్, ఎంపీఓ సందీప్ ,వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ బాబు, ఏపీఎం యాదమ్మ, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
మోతె : రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మంగళవారం మోతె మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శమటోడ్చి రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తక్షణమే అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలు పడుతున్నారన్నారు. అనంతరం మోతెలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కాంటాలు ఎందుకు కావడంలేదని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల వడ్లు కొంటున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు ఆరె లింగారెడ్డి, శంకర్నాయక్, మిక్కిలినేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ -
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేద్దాం
నడిగూడెం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. నడిగూడెం మండలం తెల్లబల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పోరాటంలో సబ్బండ వర్గాలు కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఇవలపంగు సరోజిని, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ -
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి సమావేశం విజయంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లోని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఆర్డీఓలు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్తో నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్న్స్లో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి సమావేశం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ కిషన్, డీపీఓ యాదగిరి, డీఎస్ఓ మోహన్ బాబు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్రెడ్డి, అగ్రికల్చర్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. హైకోర్టు జడ్జ్జి చంద్రయ్య మృతికి సంతాపంచివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య మృతికి సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం అసోసియేషన్ కార్యాలయంలో చంద్రయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సవలను కొనియా డారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తళ్లమళ్ల హస్సేన్, ఉపాధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్యయాదవ్, ఈసీ సభ్యులు వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, నాతి సవీందర్ కుమార్, గుంటూరు మధు, బి.వెంకటరత్నం, మీసాల శ్రీనివాస్, చనగాని ప్రణిత, భద్రయ్య, కట్ట సుధాకర్ పాల్గొన్నారు. ‘ప్లాస్టిక్ యూనిట్’ పనులు త్వరగా పూర్తిచేయాలినడిగూడెం : ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూ నిట్ పనులు త్వరగా పూర్తిచేయాలని జెట్పీ సీఈఓ బి.శిరీష ఆదేశించారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రం సమీపాన సాగర్ ఎడమ కాల్వ వెంట రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట జెట్పీ డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి, ఎంపీడీఓ ఎల్.మల్సూర్, పీఆర్ ఏఈ లావణ్య, ఎంపీఓ విజయలక్ష్మి, సర్పంచ్ దున్నా శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి, పలువురు వార్డు సభ్యులు ఉన్నారు. భూ సేకరణకు సహకరించాలి తిరుమలగిరి (తుంగతుర్తి) : భూ సేకరణకు రైతులంతా సహకరించాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు కోరారు. మంగళవారం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో చెన్నూరు ప్రధాన కాల్వ భూ సేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. ఈ సభలో తహసీల్దార్ హరిప్రసాద్, డీటీ జాన్ మహ్మద్, ఆర్ఐ సుజిత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సూర్యాపేట అర్బన్ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. మంగళవారం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కమ్యూనిస్టులకే సాధ్యమని, ఇందుకు పుచ్చలపల్లి సుందరయ్యే ఆదర్శమన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా చిన్ననాటి నుంచే పోరాటం చేసిన మహా నాయకుడిని సుందరయ్య అన్నారు. తెలంగాణలో భూస్వామ్య జమీందారీ రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. వ్యవసాయ కార్మికులకు కూలి పెరగాలని, భూమి పంచాలని సంఘం పెట్టి విముక్తి పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, ఎల్గూరి గోవింద్, మద్దెల జ్యోతి, మేకన బోయిన శేఖర్, వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్, నాయకులు చినపంగి నర్సయ్య, మేకనబోయిన సైదమ్మ, మామిడి సుందరయ్య, అబ్బగాని భిక్షం, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం నేతలు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు -
చేయూతలో అక్రమాలకు చెక్
భానుపురి (సూర్యాపేట) : చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల వారికి పింఛన్లను అందిస్తోంది. కొందరికి పోస్టాఫీసుల్లో ఇస్తుండగా, మరి కొందరికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ పథకంలో కొన్ని అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారులు చనిపోతే పింఛన్ డబ్బులు వారి వాతాల్లో జమ అవుతుండగా కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. దీనిని అరికట్టి మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లబ్ధిదారుల సజీవ నిర్ధారణ (లైవ్నెస్ అథెంటికేషన్) సర్వే చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలతోనే..గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది జూలై నుంచి ఫేస్ రికగ్నసైడ్ యాప్ ద్వారా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. దాంతో మరణించిన వారికి ఈ పింఛన్ అందే అవకాశం లేదు. అయితే డయాలసిస్, పైలేరియాతో పాటు కొందరు పింఛన్ దారుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం ఫించన్ మొత్తాన్ని జమ చేస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల మంది వరకు పింఛన్ పొందుతున్నారు. ఈ విధానంలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో ఆయా పింఛన్ దారులను పరిశీలించనున్నారు. తేలనున్న లబ్ధిదారులుప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 53,205 మందికి, దివ్యాంగ పింఛన్లు 18,458 మందికి, వితంతు 56,277, ఒంటరి మహిళ 6795, చేనేత 873, కల్లుగీత కార్మికులు 6,552, ఎయిడ్స్ బాధితులు 1,205, పైలేరియా 2,109, డయాలసిస్ 258 మందికి అందుతున్నాయి. ఈ సర్వేతో బతికి ఉన్న లబ్ధిదారులు ఎంతమంది, ఎంతమంది మరణించారనే వివరాలు తెలియనున్నాయి.వివరాల సేకరణప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా.. బ్యాంకుల ద్వారా పింఛను తీసుకునే లబ్ధిదారుల ఇళ్లకు పట్టణాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వెళ్తారు. వారి ఫోన్లలోని ముఖ గుర్తింపు యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖాన్ని, కళ్లను స్కాన్ చేస్తారు. దాంతో ఆధార్ డేటా బేస్లోని వివరాలతో మ్యాచ్ అవుతుంది. మరణించిన లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిన లబ్ధిదారుల విషయాన్ని స్థానికంగా విచారించి నిర్ధారిస్తారు. అందు బాటులో లేని వారికి మూడు నెలల గడువు ఇస్తారు. ఆ గడువులోగా వారు ఫేస్ రికగ్నిషన్ యాప్లో నమోదు చేసుకోవాలి. లేకపోతే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. చేయూత పింఛన్లలో అక్రమాల గుర్తింపునకు సర్వే పోస్టాఫీసులు, అకౌంట్లలో జమయ్యే పింఛన్ల పరిశీలన లైవ్నెస్ అథెంటికేషన్ సర్వేతో ముందుకు -
లక్ష్మీనరసింహుడికి నిత్య పూజలు
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యదారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేపట్టారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ప్రకటించాలిసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో మాట్లాడారు. నూతన పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు కె. అరుణభారతి, కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శిలు ఎన్. నాగేశ్వరరావు, వెలుగు రమేష్, చిలక రమేష్, కె.బాల సైదిరెడ్డి, డి.శ్రీనివాసచారి పాల్గొన్నారు. టీజీఆర్జేసీలో చిలుకూరు విద్యార్థి ప్రతిభచిలుకూరు : ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో చిలుకూరు గ్రామానికి చెందిన కొడా రు కౌషిక్ సాయి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. కౌషిక్ సాయి పదవ తరగతిలో 564 మార్కులతో మండల టాపర్గా నిలిచాడు. ఈ సందర్భంగా కౌషిక్ సాయి మాట్లాడుతూ జేఈఈ మెయిన్లో ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమన్నారు. కౌషిక్ సాయిని పలువురు అభినందించారు. కేవీలో అడ్మిషన్లురామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 8 సీట్లు, 8వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నిప్పుల గుండమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగనుండటంతో వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో 44 డిగ్రీలకంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆ రెండు రోజులు రెడ్ అలర్ట్ను ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అల్లాడుతున్న జనం గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గింది. ఎండలతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లో కూడా వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అయితే బుధ, గురువారాల్లో 44 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తే కూడా ప్రారంభం అవుతుండటంతో ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇళ్ల వద్దే ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లొద్దు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లక పోవడం మంచిది. దాహం వేయక పోయినా ప్రతి గంటకు నీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగాలి. తేలికపాటి, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. బయటకు వెళ్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ లేదా తలపై టవల్ వాడాలి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిది. దోసకాయ, టమాటా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలో లేదా ఫ్యాన్, ఏసీ ఉన్న చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి. పరిస్థితి విషమిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. – డాక్టర్ రాజీవ్, జనరల్ ఫిజీషియన్, జిల్లా కేంద్ర వైద్యశాల ఆస్పత్రిఫ 21,22 తేదీల్లో 44 డిగ్రీలు దాటనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఫ నల్లగొండ జిల్లాకు రెడ్, యాదాద్రికి ఆరెంజ్ హెచ్చరిక ఫ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన -
శివాలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివుడికి, రుద్రాభిషేకం, బిల్వార్చన సేవలు, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూవులకు సుప్రభాతం అర్చన, ఆరాధనలు, అభిషేకాలు సహస్త్రనామార్చనలు అర్చకులు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలతోపాటుగా, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, కల్యాణోత్సవం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం, జోడుసేవలను నిర్వహించారు. -
ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారం
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీఓ పీడీ సన్యాయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీసీఓ ప్రవీణ్ కుమార్, డీఈఓ అశోక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 23 వరకు పర్యాటక వారోత్సవాలు సూర్యాపేటటౌన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటకశాఖ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రదేశాలు, మ్యూజియంలు, చారిత్రక కట్టడాల గురించి పర్యాటకులకు వివరించడానికి టూరి జం గైడ్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పురావస్తు శాస్త్రం కోర్సు, మ్యూజియాలజీ, లేదా గ్రాడ్యుయేట్లు అర్హులని తెలిపారు. వివరాలకు సెల్ : 9849905722. 9849905723 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడల అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హెలికాప్టర్ మంత్రులు ఎక్కడ?
నల్లగొండ : రైతులు అరిగోస తీస్తుంటే హెలికాప్టర్ మంత్రులు ఎక్కడికి పోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్వింటాకు 10 కేజీల చొప్పున కోత విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నా.. జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పత్తాలేరని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ ఉచిత విద్యుత్, రైతుబంధు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు రారాజులా ఉన్నారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వానికి ముందుచూపు లేక రైతులను ఆగం చేసిందన్నారు. కరోనా సమయంలోనూ దేశమంతా ఇంటికే పరిమితమైతే తెలంగాణలో మాత్రం రైతు కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొన్న చరిత్ర కేసీఆర్కు దక్కిందన్నారు. ప్రజలు రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసం చేశాడన్నారు. మంత్రులు ఏసీ రూమ్లకే పరిమితమయ్యారుఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏసీ రూమ్లకే పరిమితమయ్యారని, రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఆరోపించారు. 60 నుంచి 70 కార్ల కాన్వాయ్తో వెళ్లి కల్లాల వద్ద డ్రామాలు చేశారు తప్ప రైతుల గోస పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతులను పట్టించుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కిషోర్కుమార్, ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు లింగయ్యయాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మాలే శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు అరిగోస తీస్తున్నా వారికి పట్టదా.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపులేదు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
20న మెడికల్ షాపుల బంద్
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరస నగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్త పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా, పట్టణ, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. బంద్కు సంబంధించిన సమాచారాన్ని సోమవారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇతర అధికారులకు ముందస్తుగా అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్రమ ఈ ఫార్మసీల వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ జీఎస్ఆర్ 220ను ఉపసంహరించుకోవా లని కోరా రు. కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు లెవెల్ ఫ్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంద్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సూర్యాపేటలోని బొడ్రా యి బజార్లో శ్రీ వినాయక మెడికల్ షాపు, పీఎస్ఆర్ సెంటర్లోని వేదశ్రీ మెడికల్ షాపు, ఎంజీ రోడ్లో కార్తికేయ మెడికల్ షాపు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యామ ప్రభాకర్, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముశం హరిప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపగాని గిరిగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి లింగయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేటటౌన్ : పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ సాంఘీక శాస్త్రం ఫోరం సంయుక్తంగా హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కమిటీ పోటీల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డీఈఓ అశోక్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 23 జిల్లాల విద్యార్థులు పాల్గొనగా అంతర్జాతీయ అంశాలపై చర్చలు, ప్రసంగాలలో మునగాల టీజీఎంఎస్కు చెందిన హేమహాసిని, అనాజిపురం టీజీఎంఎస్కు చెందిన విరాట్ సూర్య, నూతనకల్ పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్కు చెందిన జి.సాత్విక్ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ ఎ.హరికృష్ణ, సాంఘీక శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు వేముల సైదులు, గౌరవ అధ్యక్షుడు యడవల్లి జానయ్య, ఉపాధ్యక్షుడు గుర్రాల సోమయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, ఆర్థిక కార్యదర్శి సుదర్శన్రావు పాల్గొన్నారు. అభినందించిన డీఈఓ అశోక్ -
ప్రజలకు అందుబాటులో పోలీస్శాఖ
సూర్యాపేటటౌన్ : పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజ లకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ కార్యాలయంలో...సూర్యాపేట డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి భరోసా కల్పించారు. ప్రతి సోమవారం డివిజన్ స్థాయి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణపురం నరేష్, యాదగిరి, ఇంద్రారెడ్డి, దేవిక, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి పూజలుమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామి వారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
నాగమల్లు జీవితం యువతకు ఆదర్శం
నాగారం : ప్రజల కోసం నిరంతరం తన కలం, గళంతో పోరాటాలు నిర్వహించిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యుడు, అరుణోదయ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తడకమళ్ల నాగమల్లు జీవితం యువతకు ఆదర్శమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నాగారం మండలం లక్ష్మాపురంలో నిర్వహించిన తడకమళ్ల నాగమల్లు సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేవిడ్కుమార్ మాట్లాడుతూ నాగమల్లు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, న్యూడెమోక్రసీ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టీయూఐ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, పోలేబోయిన కిరణ్కుమార్, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఎర్ర ఉమేష్, గండు నగేష్, సామ నర్సిరెడ్డి, దాసరి శ్రీనివాస్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, సర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచ్ సుధాకర్, మల్లెపాక వెంకన్న, కళాకారులు అనుదీప్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : మిల్లుల్లో ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని ఎస్పీ నరసింహ మిల్లర్లను ఆదేశించారు. శనివారం సూర్యాపేట రూరల్ పరిధి జనగామ రోడ్డులో ఉన్న వజ్ర రైస్ మిల్లులో ధాన్యం దిగుమతులను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వాహనాల నుంచి త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు సూచించారు. రైతుల పక్షాన బాధ్యత తీసుకుని వారికి అండగా నిలవాలని కోరారు. మిల్లు యజమానులు, కార్మికులతో మాట్లాడి ధాన్యం దిగుమతి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్, సిబ్బంది ఉన్నారు.


