breaking news
Suryapet
-
రుణసాయం అంతంతే!
భానుపురి (సూర్యాపేట) : రుణాల మంజూరులో బ్యాంకర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకర్లు మంజూరు చేసిన రుణాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ ఆ దిశగా రుణాలు మంజూరు చేయడం లేదు. ప్రాధాన్యంగా వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలపై బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. ఈ త్రైమాసికంలో మొత్తంగా 11,919.74 కోట్ల రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం విధించింది. ఇప్పటి వరకు కేవలం 3,843.28 కోట్లు (32.24 శాతం) మాత్రమే అందించాయి. బ్యాంకర్ల తీరుతో రుణాలు తీసుకుందామనుకున్న వినియోగదారులు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాధాన్యత రంగానికి 29.53 శాతమే! ఏటా తయారు చేసే వార్షిక రుణ ప్రణాళికను ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలుగా విభజిస్తారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రుణాలను అందించాల్సి ఉంటుంది. ఇందులో అన్నదాతలకు పంట రుణాలు, భూముల అభివృద్ధి, నీటి పారుదల సౌకర్యాల కల్పన, వ్యవసాయ యంత్ర కొనుగోలు, పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలు వంటివి ప్రాధాన్యత రంగం కిందకు వస్తాయి. ఈ మేరకు ప్రాధాన్యత రంగానికి అధిక మొత్తంలోనే దాదాపు 9,723.13 కోట్ల రుణలక్ష్యాన్ని మొదటి త్రైమాసికంలో విధించారు. అంత బాగానే ఉన్నా రుణాల మంజూరులో మాత్రం బ్యాంకర్లు చిన్నచూపు చూస్తూ కేవలం రూ.28.71కోట్లే (29.53 శాతమే) అందించాయి. ప్రాధాన్యేతర రంగానికి.. ఇందులోనే ప్రత్యేకంగా వ్యవసాయరంగానికి రూ.3,915.15 కోట్లు కేటాయించగా 29.08 శాతంతో రూ.1,138.49 కోట్లే ఇచ్చారు. దీర్ఘకాలిక రుణాల్లో రూ.2,979.48 కోట్లు కేటాయించగా 36.59 శాతంతో 1,097.63 కోట్లు అందించినట్లు ఇటీవల వెల్లడించిన వార్షిక రుణ ప్రణాళికలో తెలిసింది. ఇక ప్రాధాన్యేతర రంగాలకు బ్యాంకర్లు పెద్దపీట వేస్తున్నారు. ఈ రంగంలో 2,196.61 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఇప్పటి వరకు రూ.971.95 కోట్లను అందించడం గమనార్హం. దాదాపు ఇతర రంగాలకు ఇచ్చిన దానికంటే అధికంగా రుణాలను ఈ రంగంలో ఇచ్చారు. మొదటి త్రైమాసికంలో లక్ష్యం చేరని బ్యాంకర్లు ఫ రూ.11,919.74 కోట్లకు రూ.3,843.28 కోట్లే మంజూరు ఫ వ్యవసాయ రంగంపై చిన్నచూపు ఫ ప్రాధాన్యేతర రంగాలకు 44.25 శాతం రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో రుణాల మంజూరులో వేగం పెంచుతాం. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతాం. ప్రతిఒక్కరూ బ్యాంకర్లకు సహకరించాలి. వ్యవసాయ రంగానికి అధిక రుణాలు ఇస్తాం. – వెంకటనాగప్రసాద్, ఎల్డీఎం రుణాలు లక్ష్యం(రూ.కోట్లలో) ఇచ్చింది శాతం వ్యవసాయ 3,915.15 1,138.49 29.08దీర్ఘకాలిక 2,979.48 1,097.63 36.59ప్రాధాన్యరంగం 9,723.13 2,871.33 29.53ఇతర ప్రాధాన్యం 2,196.61 971.95 44.25 -
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సమాజాన్ని రక్షించేందుకు పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు కలెక్టర్తో పాటు ఎస్పీ నరసింహ, ఇతర పోలీసు అధికారులు, అమరుల కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది, అధికారులు స్మృతి పరేడ్ నిర్వహించారు. 2015 ఏప్రిల్ ఒకటో తేదీన సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ కుటుంబాలకు 200 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఆ పట్టాలను కుటుంబ సభ్యులకు అందించారు. అమరులైన హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్, కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్ పిలల్లకు చదువుల కోసం జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఆర్థిక సాయం అందించారు. సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన 191 మంది పోలీసు జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పోలీసుల బాధ్యత మరింతగా పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం విధినిర్వహణ చేయడం వల్లే ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు.స్మృతి పరేడ్ కమాండర్గా ఆర్ఎస్ఐ అశోక్ వ్యవహరించగా, అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి 191 మంది పోలీస్ అమరుల పేర్లను స్మరించారు. పోలీసు కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలతో నివాళులర్పించిది. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నర్సింహాచారి, రవి, ఏఓ మంజూ భార్గవి, సీఐలు శివశంకర్, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, వెంకటయ్య, రామకృష్ణారెడ్డి, ప్రతాప్, పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్గౌడ్, ఆర్ఎస్ఐలు ఎం.అశోక్, కె.అశోక్, సురేశ్, సాయిరాం, రాజశేఖర్, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ శాంతిభద్రతల పరిరక్షణలో మన పోలీసులే నంబర్వన్ ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఫ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్, ఎస్పీ -
జాబ్మేళా విజయవంతానికి సహకరించాలి
హుజూర్నగర్ : ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించే మెగా జాబ్మేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. జాబ్మేళా ఏర్పాట్లను మంగళవారం నాయకులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాబ్మేళాపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. జాబ్మేళాకు వచ్చే అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక నాయకులతో కమిటీ వేసి రిజిస్ట్రేషన్ కౌంటర్లు, కంపెనీల స్టాల్స్ వద్ద, భోజనాలు వద్ద రద్దీ కారణంగా ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి సూచించారు. జాబ్మేళాకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఎక్కువ కంపెనీలను ఆహ్వానించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధులు రామస్వామి, తుకారం, రవికుమార్, సుఽంకర్, కోఆర్డినేటర్ చందర్, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, గెల్లి రవి, కోతి సంపత్రెడ్డి, దొంతగాని శ్రీనివాస్, డీవీ, శివరాం యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
జాబ్మేళాపై విస్తృత ప్రచారం చేయండి
భానుపురి (సూర్యాపేట) : హుజూర్నగర్లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళాపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మెగా జాబ్మేళా నిర్వహణపై అదనపు కలెక్టర్ కె.సీతారామారావుతో కలిసి సంబంధిత అధికారులతో ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. హుజూర్నగర్లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ (సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక)లో ఉదయం 8 గంటల నుంచి జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు. ఈ మేళాకు రాష్ట్రంలోని 150 పెద్ద కంపెనీలు రానున్నాయని, 5వేల వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఆయన వెల్లడించారు. ప్రచారం చేస్తేనే మేలు.. ఈ జాబ్ మేళాకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగిన 18నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువత అర్హులని వివరించారు. మేళాపై విస్తృత ప్రచారం నిర్వహిస్తేనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది నిరుద్యోగలు వస్తారన్నారు. అన్ని పట్టణాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జాబ్మేళా వాల్పోస్టర్లు ముద్రించి బస్సులు, ఇతర వాహనాలకు, కళాశాలల వద్ద అతికించాలని చెప్పారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, జాబ్మేళా నిర్వహించనున్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్న స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పాహారం మొదలుకొని, మధ్యాహ్న భోజనం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాకు వచ్చి ఉద్యోగాలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జాబ్మేళాకు హాజరయ్యే వారు 5 సెట్ల రెజ్యుమ్తో పాటు ఇటీవలి కాలంలో తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో సహా హాజరు కావాలని కోరారు. జాబ్ మేళా నిర్వహణపై ఈనెల 22 ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూర్యాపేటలో ఉమ్మడి జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులతో సమన్వయం చేసుకొని అంతా హాజరయ్యేలా చూడాలన్నా రు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు మేళా నిర్వహణపై శ్రద్ధవహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా చూడాలి ఫ టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వెలుగు దివ్వెల పండుగ
భానుపురి (సూర్యాపేట) : చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం ఆనందంగా పండుగ జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ప్రధానంగా మహిళలు నోములు, వ్రతాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు కావాల్సిన అన్నిరకాల సామగ్రిని ఆదివారమే కొనుగోళు చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని రహదారులన్నీ జన సంచారం, వాహనాల రాకపోకలతో కిటకిటలాడాయి. పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెలకు చేరే ప్రజలతో ఆర్టీసీ బస్టాండ్లు రద్దీగా మారాయి. ఇక నోములు, వ్రతాల కోసం ప్రమిదలు, పూలు, బొమ్మలు, ఇతర సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన సెంటర్లలో పండుగ సందడి నెలకొంది. అలాగే కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్, తిరుమలగిరి పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారుల్లో పండుగ వాతావారణం సంతరించుకుంది. కిటకిటలాడిన టపాసుల దుకాణాలు దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతుంటారు. ఇందుకోసం వేలాది రూపాయలను వెచ్చిస్తారు. ప్రజల అభిరుచి మేరకు బాణసంచా వ్యాపారులు భారీగా టపాసులు, క్రాకర్స్ దిగుమతి చేసుకుంటారు. విక్రయానికి గాను ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేస్తుండగా.. ఈ యేడు సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారులకు కేటాయించారు. ఈ దుకాణాలకు ఉదయం నుంచే సూర్యాపేట పట్టణమే కాకుండా చుట్టపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి జనం వచ్చి టపాసులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నుంచి టపాసులు దుకాణాలు కిటకిటలాడాయి. అన్నింటికీ ఎక్కువే.. దీపావళి అంటేనే నోములు, వ్రతాలకు ప్రసిద్ధి. ఈ సందర్భంగా లక్ష్మీదేవీకి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ప్రమిదల కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపగా.. జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాల్లోని రహదారులు వెంట ఏర్పాటుచేసిన దుకాణాల్లో పూజ సామగ్రికి అధిక ధరలు ఉన్నాయి. చిన్నవి డజన్ ప్రమిదలు దాదాపు రూ.100ల వరకు విక్రయించారు. పెద్దవి నాలుగింటికి రూ.80 వరకు ధర పలుకుతుంది. పూజ కోసం వాడే పూలు సైతం ఒక మూర రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించడంతో తప్పని పరిస్థితుల్లో మహిళలు కొనుగోలు చేశారు. ఇక దీపావళికి కుటుంబంలోని ప్రతిఒక్కరూ కాల్చే టపాసుల ధరలు చుక్కలను అంటాయి. జీఎస్టీ స్లాబ్ల కుదింపుతో టపాసుల ధరలు తగ్గుతాయనుకుంటే దీపావళి, కార్తీక మాసం వ్రతాలు, నోముల కారణంగా వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుండడంతో జనం బెంబేలెత్త్తిపోతున్నారు. నేడు దీపావళి పర్వదినం ఫ నోములు, వ్రతాలకు సిద్ధమైన ప్రజలు ఫ మార్కెట్లో పూలు, ప్రమిదల కొనుగోలు ఫ టపాసుల దుకాణాలు కిటకిట ఫ అధిక ధరలతో జనం బెంబేలు ఫ అంతటా సందడి వాతావరణం -
ప్రజలకు మాజీ మంత్రి దీపావళి శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి అని, దీపాల కాంతులవలె తెలంగా ణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించాలన్నారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలి : ఎస్పీ సూర్యాపేటటౌన్ : దీపావళిని పురస్కరించుకొని బాణసంచా, టపాసులు పేల్చే సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మహిళలను గౌరవించాలని పేర్కొన్నారు. బాణాసంచా తయారీదారులు, విక్రయదారులపై నిఘా ఉంచామని తెలిపారు. పోరాట యోధుడు ధర్మభిక్షంసూర్యాపేట అర్బన్ : గీత కార్మికుల సంక్షేమ కోసం అహర్నిశలు పోరాడిన యోధుడు ధర్మభిక్షం అని గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండ కోటయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం 68వ వార్షికోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గీత పని వారల సంఘం వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మభిక్షం వర్ధంతి, జయంతిని అధికారంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో దోరపల్లి శంకర్, పాలకూరి బాబు, బండారు లక్ష్మయ్య, పాలకూరి బాబు, దోరపల్లి శంకర్, బూర వెంకటేశ్వర్లు, బూర సైదులు, పెద్దపోలు విష్ణు, ఎడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యతకు ఆర్ఎస్ఎస్ కృషితుంగతుర్తి : దేశ సమైక్యతకు ఆర్ఎస్ఎస్ ఎంతో కృషిచేస్తోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివా రం తుంగతుర్తిలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడారు. ముందుగా స్థానిక మెయిన్ రోడ్డుపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆబ్కారీ’ ఆదాయం పెరిగేనా..!
సూర్యాపేటటౌన్ : జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచింది. సెప్టెంబర్ 26నుంచి ఈనెల 18వ తేదీ రాత్రి వరకు మద్యం టెండర్లు స్వీకరించారు. అయితే చివరి రోజు (18వ తేదీన) జరిగిన బీసీ బంద్ నేపథ్యంలో టెండర్లు వేసేందుకు అంతరాయం కలిగింది. దీంతో కొందరు వ్యాపారుల విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు టెండర్ల గడువు పొడిగించింది. అలాగే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు సైతం రాకపోవడంతో గడువు పెంచినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం గడువు పెంచినా దరఖాస్తులతోపాటు ఆబ్కారీ శాఖకు ఆదాయం పెరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2,617 దరఖాస్తులు.. జిల్లాలో 93 వైన్స్లకు 23 రోజుల వ్యవధిలో అతికష్టం మీద 2,617 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదికూడా చివరి రోజు ఈ నెల 18న 1,343 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 11గంటల తర్వాత ప్రభుత్వం దరఖాస్తు గడువు పెంచింది. అయితే 18వ తేదీ వరకు జిల్లాలోని 93 వైన్స్లకు 2,716 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సూర్యాపేట సర్కిల్లో 31 వైన్స్లకు గాను 846, తుంగతుర్తి సర్కిల్లో 17 వైన్స్లకు గాను 368 దరఖాస్తులు, కోదాడ సర్కిల్లో 21 వైన్స్లకు గాను 633 దరఖాస్తులు, హుజుర్నగర్ సర్కిల్లో 24 వైన్స్లకు గాను 770 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో చిలుకూరు మండలం బేతవోలు వైన్స్కు అత్యధికంగా 57 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ ఫీజు ద్వారా రూ.78.51కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతేడాది 4,338 దరఖాస్తులు రాగా రూ.86.76కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ నెల 27న డ్రా పద్ధతిన వైన్స్లు కేటాయించనున్నారు. గత సీజన్లోనే పోటీ తీవ్రం గత సీజన్లో మద్యం దుకాణాల కోసం పోటీ తీ వ్రంగా ఉంది. ఒక్కో షాపునకు 50కి పైగా టెండర్లు వేశారు. కానీ ఈ సారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఈ సారి టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. మూడ్రోజుల గడువులోగా ఎన్ని దరఖాస్తులు వస్తాయో వేసిచూడాలి. ఫ 23వ తేదీ వరకు మద్యం టెండర్ల గడువు పెంచిన ప్రభుత్వం ఫ ఇప్పటి వరకు 2,617 దరఖాస్తులు ఫ టెండర్ ఫీజు అదనంగా రూ.లక్ష పెంపుతో ఆసక్తిచూపని వ్యాపారులు ఫ గతంలో మాదిరిగా కనిపించని ఉత్సాహం -
ఏపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి చేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యను మానుకోవాలి. అవినీతి, అరాచకాలను వెలికి తీసి వార్తలు రాస్తుందనే నెపంతో సాక్షి పత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. – మద్దెల జ్యోతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం నిరంకుశత్వం ఫ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలంటున్న ప్రజా సంఘాల నాయకులు భానుపురి (సూర్యాపేట) : ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పత్రికలపై వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే చేటులా ఉంది. ప్రశ్నించే వ్యక్తులు, సంస్థలు, పత్రికలపై కక్షకట్టడం ఏ మాత్రం సహించరానిది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాక్షి దినపత్రిక అవినీతి, అక్రమాలపై నిక్కచ్చిగా వార్తలు ప్రచురిస్తోంది. అలాంటి సాక్షి మీడియాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి నుంచి పక్షపాతంగా వ్యవహరిస్తూ దాడులు చేయించడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరించాలని చూడడం అప్రజాస్వామికమని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. -
అంతలోనే అనంతలోకాలకు..
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్..మాడుగులపల్లి: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి. వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్ కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్కృష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. వాటర్ ట్యాంక్ కూలి తల్లి, కుమారుడు మృతి మాడుగులపల్లి మండల కేంద్రంలో విషాధచాయలు -
దీపావళి వెలుగులు నింపాలి
● శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ ప్రతిఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేడే దీపావళి పండుగరామగిరి(నల్లగొండ): దీపావళి పండుగను సోమవారమే జరుపుకోవాలని నిర్ణయించినట్లు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నరకచతుర్ధశి నివాళులు, 21న ధనలక్ష్మి పూజలు జరుపుకోవాలని ఆయన అన్నారు. అమావాస్య ఘడియలు సోమవారం మధ్యాహ్నం 3.46 నుంచి మంగళవారం సాయంత్రం 5.56 నిమిషాల వరకు ఉన్నందున నోములు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరుపుకోవచ్చని సూచించారు. ఈసారి కొత్త నోములు లేవని పాత వారు కేదారిశ్వరి వ్రతం చేసుకోవాలన్నారు. సోమవారం నివాళులు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. -
సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపం
భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చోల్లేటి శ్రీనివాసచారి ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో నాలుగు ఇంచుల ఎత్తులో రూపొందించి ఔరా అనిపించారు. ఆయన గతంలోనూ బంగారం, వెండితో వీసా టవర్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్, భారత పార్లమెంటు భవనం, వీణ, బంగారు బతుకమ్మ, తెలంగాణ చిత్రపటం, ఫుట్బాల్ వరల్డ్ కప్, క్రికెట్ బాల్ వంటివి తయారు చేశాడు. వెండితో తయారు చేసిన పోలీసు అమరవీరుల స్థూపం -
అప్రమత్తంగా ఉంటేనే ఆనంద కేళి..
పెద్దవూర: వెలుగులు విరజిమ్మే దీపావళి రానే వచ్చింది. పండుగ రోజున టపాసులు పేల్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆనందకేళీ అవుతుంది. వ్యాపారులు పాటించాల్సిన జాగ్రత్తలు● టపాసుల దుకాణదారులు అధికా రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ● దుకాణాలను బహిరంగ మైదా నాలు, అధికారులు సూచించిన స్థలాల్లోనే ఉండాలి. ● దుకాణాల వద్ద ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. ● ప్రమాదాల నివారణకు నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. ● వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి దుకాణదారుడు కరపత్రాలను అందజేయాలి. ● దుకాణానికి అనుమతి గడువు తీరిన అనంతరం టపాసులను సంబంధిత అధికారికి అప్పగించాలి. కాల్చేటప్పుడు జాగ్రత్తలు● అనుమతులు ఉన్న దుకాణాల్లోనే టపాసులను కొనుగోలు చేయాలి. ● పెద్దల సమక్షంలోనే చిన్న పిల్లల చేత పటాకులు కాల్పించాలి. ● టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. ● టపాసులు కాల్చే సమయంలో బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పారపాటున దుస్తులకు నిప్పు అంటుకుంటే అటూ ఇటూ పరిగెత్తకుండా ఉన్న చోటే కింద పడుకుని దొర్లాలి. అలా చేయడం వలన నిప్పు త్వరగా ఆరిపోతుంది. ● ఇంట్లో కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల వద్ద టపాసులను నిల్వ ఉంచకూడదు. ● సగం కాలిన టపాసులను మళ్లీ కాల్చే ప్రయత్నం చేయరాదు. ● బాణసంచా కాల్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ● టపాసులను సొంతంగా తయారు చేసే ప్రయత్నం చేయరాదు. ● బాణసంచా పేలుళ్ల వలన వినికిడి సమస్యతో పాటు అధిక రక్తపోటు, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. రసాయనాలు.. వాటి ప్రభావం..చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని పేల్చగానే ఒకేసారి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంది. టపాసుల్లో ఉపయోగించే రసాయనాలు పీల్చడం వలన కలిగే దుష్పలితాలు.. రాగి: శ్వాస నాళాల్లో మంట వస్తుంది. కాడ్మియం: రక్తహీనత, మూత్రపిండాలు దెబ్బతింటాయి సీసం: నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది మెగ్నీషియం: మెగ్నీషియం ధూళి కారణంగా జ్వరం వస్తుంది. సోడియం: చర్మవ్యాధులు వస్తాయి జింక్: వాంతులు వస్తాయి నైట్రేట్: మానసిక స్థితి అదుపు తప్పుతుంది. ● టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి -
22 నుంచి కార్తీక పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహింంచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాల్స్లో పూజ సామాగ్రి, వ్రత పీటలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. యాదగిరి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో సైతం భక్తులు వ్రతాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ● యాదగిరి క్షేత్రంలో..యాదగిరి క్షేత్రంలో నెల రోజుల పాటు 6 బ్యాచ్లుగా వ్రతాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు, ఐదో బ్యాచ్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఆరో బ్యాచ్ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించనున్నారు. ● పాతగుట్ట ఆలయంలో..యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నాలుగు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 9గంటలకు, రెండో బ్యాచ్ 11గంటలకు, మూడో బ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు, నాల్గవ బ్యాచ్ సాయంత్రం 4గంటలకు నిర్వహిస్తారు. ● కార్తీక పౌర్ణమి రోజు..వచ్చే నెల 5వ తేదీన కార్తీక శుద్ధ పూర్ణిమ నేపథ్యంలో యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రతి గంటకు ఒక్క బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్లు నిర్వహిస్తామని ఇప్పటికే ఆలయ ఈఓ రవినాయక్ వెల్లడించారు. కాగా పాతగుట్ట ఆలయంలో 6 బ్యాచ్లుగా వ్రతా లను భక్తులచే జరిపిస్తారు.వ్రత మండపంలో సిద్ధం చేస్తున్న వ్రత పీటలు యాదగిరి క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు వ్రత మండపంలో పీటలు, ప్రసాదాలు రెడీ -
అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించాలి
రామన్నపేట: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం రామన్నపేటలో నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం వల్ల అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రపంచంలో కమ్యూనిజం మహోన్నతమైన సిద్ధాంతమని, కమ్యూనిస్టులు పురోగామిశక్తులు అని చెప్పడానికి శ్రీలంక వంటి పరిణామాలే నిదర్శనమని వివరించారు. పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. యువత దోపిడి వ్యవస్థను నిలువరించాలని, మతోన్మాదశక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు మేక అశోక్రెడ్డి, జెల్లెల పెంటయ్య, గడ్డం వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, కల్లూరి నాగేష్, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, విజయ్భాస్కర్, మీర్ఖాజా, బాలరాజు, రామచంద్రం, శ్రవన్, శివ, ఉదయ్ పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
అడ్డగోలుగా.. అడ్డుగోడలు
కోదాడ: జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు.గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఎకరం.. రెండెకరాల విస్తీర్ణంలో వెంచర్లు ఏర్పాటు చేసి వాటిచుట్టూ అడ్డగోలుగా గోడలు నిర్మిస్తూ ఇరుపక్కలా, కింది వెంచర్లకు దారి ఇవ్వకుండా సతాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దారి ఇవ్వాలంటే తమకు ఒకప్లాట్ ఖరీదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కేవలం 3 గేటెడ్ కమ్యూనిటీలకే అనుమతి ఉంది. కానీ, అనధికారికంగా 250 వెంచర్ల నిర్వాహకులు తమవి గేటెడ్ కమ్యూనిటీలని చెప్పుకుంటూ తమ వెంచర్ల చుట్టూ గోడలు పెట్టేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరు తూర్పు–పడమర.. మరొకరు ఉత్తరం–దక్షిణం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టం వచ్చినరీతిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రోడ్డు వైపు వెంచర్ ఏర్పాటు చేసిన వారు రోడ్లను తూర్పు–పడమర దిశలో ఏర్పాటు చేస్తుండగా, దాని పక్కనే వెంచర్ చేస్తున్నవారు రోడ్లను ఉత్తరం–దక్షిణం దిశలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో అస్తవ్యస్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో వాటర్, డ్రెయినేజీల ఏర్పాటు చేయడం కష్టంగా మారుతుందని, భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు కిందకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. రోడ్డు వైపు ఏర్పాటు చేసిన వెంచర్కు అనుగుణంగా దాని కింది వైపువారు రోడ్లను ఏర్పాటు చేయాలన్నా ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. మున్సిపాలిటీ పేర రోడ్ల రిజిస్ట్రేషన్ నామమాత్రమే! మున్సిపాలిటీల పరిధిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లకు అనుమతులు తీసుకున్న తరువాత వాటిలో నిబంధనల ప్రకారం రోడ్లను ఏర్పాటు చేసి వాటిని మున్సిపాలిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. సామాజిక అవసరాల కోసం వెంచర్ విస్తీర్ణంలో 10 శాతం భూమిని కేటాయించి దాన్ని కూడా మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధనలు ఉన్నా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమల గిరిలో కేవలం నాలుగు వెంచర్లలోనే రోడ్లను మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీల పేరుతో రియల్టర్ల నయాదందా ఫ పక్కవారికి దారిలేకుండా వెంచర్ల చుట్టూ గోడల నిర్మాణం ఫ దారి ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ ఫ మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేయని రోడ్లు ఫ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు కోదాడ మున్సిపాలిటీలో ఒక్క గేటెడ్ కమ్యూనిటీ కూడా లేదు. వెంచర్ల చుట్టూ గోడలు పెట్టినప్పటికి పక్క వెంచర్ వారికి రోడ్డు కోసం ఓపెన్ చేయాల్సిందే. ఒక ప్రాంతంలో వెంచర్ల నిర్వాహకులు ఒకేవిధంగా రోడ్లను ఏర్పాటు చేయాల్సిందే. దారి ఇవ్వడం లేదని ఇప్పటి వరకు ఫిర్యాదులు రాలేదు. వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – ప్రసాద్, టీపీఓ కోదాడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దందాకు తెరతీస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ పేరుతో వెంచర్ల ఏర్పాటు చేస్తూ వాటి చుట్టూ గోడలు నిర్మిస్తున్నారు. దీంతో పక్క వెంచర్ల వారికి దారిలేకుండా పోతోంది. దారి ఇవ్వాలంటే ఒక ప్లాట్ ఖరీదు చెల్లించాలని నిబంధనలు పెడుతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి. – అప్పిరెడ్డి, కోదాడ -
మహిళారైతు ఆత్మహత్యా యత్నం
భూములు లాక్కున్నారంటూ.. తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి తమ భూములను అక్రమంగా లాక్కున్నారంటూ పలువురు రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. పాఠశాలకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న రైతులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. బాధిత మహిళా రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమెను అడ్డుకొని పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం ప్రభుత్వం 20.18 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే సర్వే నంబర్ 98లోని రెండెకరాల భూమిని 60 ఏండ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిందని, దానిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తీసుకున్నారని చిత్తలూరి సోమయ్య, చిత్తలూరి సురేశ్, కృష్ణ, పోరెండ్ల పెంటమ్మ ఆరోపించారు. పోలీసులు రైతులను అరెస్టు చేసి వ్యాన్లో తీసుకెళ్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భూముల్లో నిర్మాణాలు చేపట్ట వద్దని వారు వేడుకున్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికాం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆఫర్లలో భాగంగా ఈనెల 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కేవలం రూపాయికే ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు మారే కొత్త వినియోగదారులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దీంతో నెలరోజుల పాటు ఉచితంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్తోపాటు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా బోధించాలిభానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ తేజాస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లాలోని మండల విద్యాధికారులు, హెడ్ మాస్టర్లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 నుంచి జరిగే సమ్మెటివ్ ఎగ్జామ్స్పై దృష్టి పెట్టి విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు 70 శాతానికి తగ్గకూడదన్నారు. పాఠశాలలో సరిగా పాఠాలు చెప్పని ఉపాధ్యాయులను గుర్తించి వారికి నోటీసులు లేదా మెమోలు జారీ చేయాలని డీఈఓ, కోఆర్డినేటర్లు, ఎంఈఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్, కో–ఆర్డినేటర్లు శ్రావణ్, జనార్ధన్, రాంబాబు, పూలమ్మ పాల్గొన్నారు. బీసీల బంద్కు సీపీఎం సంపూర్ణ మద్దతుసూర్యాపేట అర్భన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ లో పాల్గొంటామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే సమస్యపరిష్కారమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వేల్పుల వెంకన్న, మద్దెల జ్యోతి, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, గుంజ వెంకటేశ్వర్లు, వల్లపుదాసు సాయికుమార్, చినపంగి నరసయ్య పాల్గొన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధనతిరుమలగిరి (తుంగతుర్తి) : పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరికీ కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తిరుమలగిరి మండలం తొండలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయితే 2,500 మంది విద్యార్థులు చదువుకోవచ్చన్నారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తుందని ఆశాభావంవ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ ఎల్సోజు చామంతినరేష్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, గుడిపాటి సైదులు, జనార్దన్రెడ్డి, డీఈ రమేష్కుమార్, తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ లాజరస్, ప్రత్యేకాధికారి భీమ్సింగ్, కాంట్రాక్టర్ ఏకాంభరం, సులేమాన్, మాజీ సర్పంచ్ శాతవాహనరావు, లక్ష్మయ్య, జమ్మిలాల్ పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా డెవలప్ చేస్తావ్, నీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి?
ఫ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష ఆశావహులతో పరిశీలకుల భేటీ ఫ వివిధ అంశాలపై వారిని ప్రశ్నించిన అబ్జర్వర్లు ఫ నియోజకవర్గాల్లో ముగిసిన అభిప్రాయ సేకరణ సమావేశాలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల (డీసీసీ) నియామకం కోసం నియోజకవర్గాల్లో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు చేపట్టిన అభిప్రాయ సేకరణ శుక్రవారంతో ముగిసింది. ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతి, పీసీసీ పరిశీలకుడు సంపత్కుమార్ తదితరులు శుక్రవారం నల్లగొండలో డీసీసీ అధ్యక్ష పదవి ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడారు. ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం ఏం చేశావు.. డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తావ్.. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతావు. అందుకు నీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి’..? అనే తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు. ఆశావహుల ఆలోచనా విధానం, వ్యూహాలను కూడా పరిశీలించారు. పార్టీ కోసం వారు ఏం చేయగలుతారన్న అంశాలపై ఓ అంచనాకు వచ్చేలా ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను సేకరించారు. నల్లగొండతో పాటు సూర్యాపేట జిల్లాలోనూ దరఖాస్తుల స్వీకరణతో పాటు డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజక వర్గాల వారీగా పరిశీలకులను పంపించి ఉమ్మడి జిల్లాలో సమావేశాలను నిర్వహించింది. అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండటంతోపాటు పార్టీ కోసం పని చేసిన విధేయులకే డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనే లక్ష్యంతో అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించారు. పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది.. పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయగలిగే సత్తా ఎవరికి ఉంది.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరిగేలా కృషి చేసే సత్తా ఎవరికి ఉందన్న ఈ అభిప్రాయ సేకరణను చేపట్టి పూర్తి చేసింది. సత్తా ఎవరికి ఉంది.. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ, అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని క్రోడికరించి ఆరుగురితో కూడిన జాబితాను రూపొందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, జనరల్ కేటగిరీల్లో ఆశావహులు ఎవరెవరు ఉన్నారు.. అందులో పార్టీకి విధేయులుగా ఉంటూ కష్ట్టకాలంలో పార్టీ కోసమే పని చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు ఎవరెవరు ఉన్నారు.. పార్టీని జిల్లాలో బాగా ముందుకు తీసుకెళ్లగలితే సత్తా ఎవరికి ఉంది? ముఖ్య నేతలు ఎవరికి ఎక్కువ మంది సపోర్టు చేశారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరికి సపోర్టు చేస్తున్నారనే తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ జాబితాను రూపొందించనున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో గుమ్మల మోహన్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కై లాష్నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, దైద రవీందర్, రాజారమేష్యాదవ్, ఖాన్, చామల శ్రీనివాస్, సుంకరబోయిన నర్సింహయాదవ్, పోకల దాస్, బోళ్ల వెంకట్రెడ్డి, దూదిపాళ్ల వేణుధర్రెడ్డి, ఎంఏ సిరాజ్ఖాన్, గుంజ రేణుక, తిప్పర్తి రుక్మారెడ్డి, సలీమ్, రామలింగం తదితరులు మొత్తం 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్న, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, తండు శ్రీనివాస్యాదవ్, అన్నపర్తి జ్ఞానసుందర్, ధరావత్ వెంకన్ననాయక్, యరగాని నాగన్న, వీరమల్లు యాదవ్, అల్లం ప్రభాకర్రెడ్డి తదితరులు మొత్తం 16 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు..
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట): భర్త చనిపోయినా తన ఇద్దరు ఆడ పిల్లలను కష్టపడి పెంచి ఆస్తులు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే... చివరికి మిగిలి ఉన్న బంగారం పంచుకోవడం కోసం గొడవపడి 3 రోజులుగా కన్నతల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేయలేదు ఆ కూతుళ్లు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు.ఎస్ గ్రామానికి చెందిన పొదిల నరసమ్మ (80)కు ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోగా కష్టపడి ఆడపిల్లలను పెంచి పెద్ద వాళ్లని చేసింది. ఇటీవల అనారోగ్యంతో ఉన్న నరసమ్మ తన చిన్న కూతురు కళమ్మ ఇంటికి తనవద్ద ఉన్న ఆరు తులాల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను వెంట తీసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం నరసమ్మ అనారోగ్యంతో మృతిచెందింది.దీంతో అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని ఆత్మకూర్కు తీసుకొచ్చారు. అయితే నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి వస్తువుల గురించి ఇద్దరు కూతుళ్లు వివాదానికి దిగారు. అంత్యక్రియలు చేయకుండానే చిన్న కూతురు కళమ్మ వెళ్లిపోయింది. నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి తెచ్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని పెద్ద కూతురు వెంకటమ్మ పట్టుపట్టింది. బంధువులు నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోవడంతో గురువారం స్థానిక ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వెంకటమ్మ కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్
శాలిగౌరారం: అప్పులు తీర్చేందుకు గాను మహిళపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెలతాడు అపహరించిన దొంగను పోలీసులు 24 గంటలు గడువక ముందే అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నకిరేకల్లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని పద్మానగర్లో నివాసముంటున్నాడు. శ్రీనివాస్ గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు చేసేందుకు గాను అప్పులు చేశాడు. దీనికి తోడు కరోనా సమయంలో అతడి భార్య అనారోగ్యానికి గురికావడంతో మరింత అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో పాటు వాటికి వడ్డీలు పెరిగిపోతుండటంతో అర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అప్పులు తీర్చాలని శ్రీనివాస్ భావించాడు. ప్రస్తుతం బంగారం ధరలు విరీతంగా పెరగడంతో బంగారం దొంగతనం చేసినట్లైతే అప్పులు తొందరగా తీర్చవచ్చని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ శాలిగౌరారం మండలం మాధారంకలాన్ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. శ్రీనివాస్ స్కూటీపై అటుగా వెళ్తూ.. సావిత్రమ్మను చూసి స్కూటీ ఆపాడు. ఎక్కడకు వెళ్తున్నావ్ అని ఆమెను అడగగా.. ఆమె మాధారంకలాన్ వెళ్తున్నానని చెప్పింది. తాను అటువైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను శ్రీనివాస్ తన స్కూటీపై ఎక్కించుకున్నాడు. మాధారంకలాన్ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌళ్లగూడెం వద్ద గల 365వ నంబర్ జాతీయ రహదారి జంక్షన్ సమీపంలోకి రాగానే టాయిలెట్ వస్తుందని స్కూటీని ఆపాడు. స్కూటీ దిగిన సావిత్రమ్మ రోడ్డు వెంట నడుచుకుంటూ చౌళ్లగూడెం జంక్షన్ వైపు వస్తుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన శ్రీనివాస్ ఇనుపరాడ్డుతో సావిత్రమ్మ తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. శ్రీనివాస్ వెంటనే సావిత్రమ్మ మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని స్కూటీపై పారిపోయాడు. దొంగిలించిన బంగారు పుస్తెలతాడును నల్లగొండ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్లో తాకట్టుపెట్టి రూ.3.11 లక్షలు రుణం తీసుకున్నాడు. అందులో నుంచి రూ.61వేలు సొంత అవసరాలకు వాడుకొని.. మిగిలిన రూ.2.50 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. బాధితురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం, నకిరేకల్ సీఐల నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు శ్రీనివాస్ను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.2.50 లక్షల నగదు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిబ జడ్జి ఆదేశానుసారం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్రెడ్డి, వెంకటేశ్వర్లు, శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు సైదులు, లచ్చిరెడ్డి, సతీష్, పోలీస్ సిబ్బంది జానయ్య, లక్ష్మణ్, సతీస్, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సురేశ్, శ్రీకాంత్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మహిళపై దాడిచేసి పుస్తెలతాడు అపహరించిన దొంగ 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు స్కూటీ, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
ఇంటిపై నుంచి జారిపడి దుర్మరణం
భూదాన్పోచంపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు పారిపల్లి కృష్ణారెడ్డి(55) గ్రామంలో నూతనంగా రెండంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం ఇంటి స్లాబ్కు క్యూరింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం కారులో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే కృష్ణారెడ్డి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి.. తిప్పర్తి: తిప్తర్తి మండలం చిన్నాయిగూడెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30ఏళ్ల వయస్సున్న మతిస్థిమితంలేని వ్యక్తి చిన్నాయిగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం తిప్పర్తి పంచాయతీ కార్యదర్శి నర్సింహ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంచందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలో కృష్ణా నది వెనుక జలాల్లో గల్లంతైన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ మృతదేహం గురువారం లభ్యమైంది. పృథ్వీరాజ్ మంగళవారం స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీలో సరదాగా గడిపేందుకు వచ్చాడు. అదే రోజు ఈత కొట్టేందుకు గాను కృష్ణా నది వెనుక జలాల్లోకి దిగి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఎడీఆర్ఎఫ్ బృందాలకు రెండు రోజుల తర్వాత గురువారం మృతదేహం లభ్యమైంది. -
కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతి
కొండమల్లేపల్లి: పొలం వద్ద నేలపై పడి ఉన్న కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామానికి చెందిన జటమోని శ్రీను, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు జటమోని వెంకటేష్(23) గురువారం ఉదయం తమ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్ల పైన నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలు అతడి కాలుకు చుట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన వెంకటేష్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయని నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికి లైన్మన్, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా.. వెంకటేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ అతడి బంధువులు, గ్రామస్తులు కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. పోలీసులు, విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువుల ఆరోపణ కొండమల్లేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా -
యాసంగిలో వేరుశనగ సాగు అనుకూలం
పెద్దవూర: వేరుశనగ సాగుకు యాసంగి అనుకూలమైదని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ఆహార నూనెల జాతీయ యంత్రాంగం పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు నూరు శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను కొన్ని మండలాల్లో పంపిణీ చేసింది. ఈ పంటను వానాకాలం సీజన్లో ఏ పంట విత్తని పొలాల్లో, స్వల్పకాలిక పంటలను సాగు చేసిన పొలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ● శనగను ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రత వలన గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ● వేరుశనగ సాగు చేయడానికి ముందు 70 రోజుల కాలపరిమితి ఉన్న తృణధాన్యాలైన స్వల్పకాలిక కొర్ర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ● వేరుశనగను బంక నేలల నుంచి నల్లరేగడి వరకు ఏ భూమిలోనైనా పండించవచ్చు. చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు. విత్తే విధానంసాధారణంగా వేరుశనగ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తుంటారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు భూమికి ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల లోతున తడి మట్టి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. ● ఒక చ.మీ.కు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు లావు గింజలు కాబూలీ రకం ఎంచుకున్నప్పుడు వరుసల మ ధ్య 45 నుంచి 60 సెం.మీ. దూరం పాటించాలి. ● ట్రాక్టర్ ద్వారా వేరుశనగ విత్తు పరికరాన్ని వాడి పొలంలో మొక్కల మధ్య తగినంత సాంద్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని, ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు. విత్తనశుద్ధివిత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని, మూడు గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబ్యుకినజోల్ లేదా 1.5 గ్రాముల ఎటావాక్స్ పవర్ను కూడా విత్తనశుద్ధికి వాడవచ్చు. వేరుశనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ పొడిని విత్తనానికి పట్టించాలి. ఎరువుల యాజమాన్యంనేల స్వభావం, నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం అందించే ఎరువులను వేయాలి. నేలలో భాస్వరం నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అనిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డీఏపీని వేస్తే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేస్తే పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. విత్తనాన్ని విత్తిన 24 గంటల్లోగా ఫ్లూక్లోరాలిన్ ఎకరాకు 1 లీటర్, లేదా పెండిమిథాలిన్ను 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్ధవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కోత సమయంఆకులు పచ్చబారడం, రాలిపోవడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోత కోయాలి. పంట కోసిన వెంటనే గింజలను ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ, చేతితో గాని నూర్పిడి చేసుకోవచ్చు. రైతులు ఈ విధానాన్ని పాటిస్తే మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చు.తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు..వేరుశనగ పంటలో ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఎండు తెగులును నివారించేందుకు వేసవిలో లోతుగా దుక్కి దున్నడం వల్ల ముందు పంట అవశేషాలు తీసేయడంతో తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. వేరుశనగ పంటలో కుళ్లు తెగులు ద్వారా కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంధ్రం బీజాలు ఆవ గింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండటం, అంతగా కుళ్లని సేంద్రీయ పదార్థం ఉండటం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్లు గమనించినప్పుడు ఎకరాకు 200 గ్రాముల కార్భండిజమ్, 600 గ్రాముల మాంకోజెబ్ను వాడి మొక్కల మొదలు బాగం తడిచే విధంగా పిచికారీ చేయాలి. వేరుశనగ పండించే అన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో వాటిని అరికట్టవచ్చు. పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో ఒక మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. వేరుశనగ పంటలో పచ్చ రబ్బరు పురుగు నివారణకు ముందుగానే పంట వేసిన 15 రోజులకు ఒక లీటరు నీటిలో 5 మిల్లీలీటర్లు వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైతే లీటరు నీటికి 200 మిల్లీలీటర్ల ఇండాక్సాకార్భ్ కలిపి పిచికారీ చేయాలి. -
అంబులెన్స్ సేవలు ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ అర్బన్: అత్యవసర సమయంలో 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 108 వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టెక్నీషియన్లకు సూచించారు. అంబులెన్స్లోని అత్యవసర సేవలకు ఉపయోగించే పల్స్ ఆక్సిమీటర్, మానీటర్, ఏఈడీ, ఆక్సిజన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట 108 జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ యల్లావుల మధు, ఈఎంటీ వెలిజాల సైదులు, పైలెట్ పగిళ్ల జానకిరాములు తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ వేములపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల 108 అంబులెన్స్ వాహనాన్ని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ ఎల్లావుల మధు, సిబ్బంది విమల, అజ్రకుమార్ తదితరులున్నారు. ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ -
ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని పులిపలపులు, కల్వలపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, ఎంపీడీఓ యుగేందర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సింగం వెంకన్న, ఎన్.శేఖర్రెడ్డి, సీఈఓ సుఖేందర్, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఏఈఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాదులు
మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి పునాదులు కార్యకర్తలేనని, వారి అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే దేశం కోసమని, కాంగ్రెస్పై కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. జిల్లాలో మరో ఐదు రోజులు పర్యటించి డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృిషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజవకర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట్, నాయకులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిమిర్యాలగూడ టౌన్: ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్లపల్లి గ్రామానికి చెందిన సిరశాల నర్సమ్మ(58) భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇంట్లో ఆమె ఒంటరిగానే నివాసముంటోంది. నర్సమ్మ ఇంటికి కొంత దూరంలో ఆమె కుమారుడు లింగయ్యకు నివాసముంటున్నాడు. బుధవారం కూలి పనులను వెళ్లిన నర్సమ్మ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఇంటి ఆవరణలో దుస్తులు ఊతికి పక్కనే ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. రాత్రివేళ ఎవరూ చూడకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం తోటి కూలీలు నర్సమ్మను కూలి పనులకు పిలిచేందుకు ఇంటికి ఆమె వెళ్లగా విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె కుమారుడికి సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు. వ్యవసాయ బావిలో పడి వృద్ధుడు.. అడ్డగూడూరు: వ్యవసాయ బావిలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామ శివారులో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య(86) మంగళశారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మయ్య ఆచూకీ లభించకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో లక్ష్మయ్య మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ మృతి
మునగాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మునగాల ఎస్ఐ బి. ప్రవీణ్కుమారు తెలిపిన వివరాల ప్రకా రం.. మునగాల మండలం కోదండరామాపురం గ్రామానికి చెందిన రెణబోతు అప్పిరెడ్డి(75), రెణబోతు లక్ష్మీనరసింహారెడ్డి బుధవారం కోదాడ మండలం కందిబండ గణపవరంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా.. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనరసింహారెడ్డికి స్వల్ప గాయాలు కాగా.. అప్పిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు అచ్చిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కారును సూర్యాపేట పట్టణంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక అధికారి
నల్లగొండ: టపాకాయల దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయం అధికారి సత్యనారాయణరెడ్డి గురువారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు గాను అనుమతి కోసం నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి సత్యనారాయణరెడ్డిని ఓ వ్యాపారి సంప్రదించాడు. ఎన్ఓసీ మొత్తం తానే చేసి ఇస్తానని ఇవ్వాలని సదరు వ్యాపారిని సత్యనారాయణరెడ్డి రూ.10వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో వ్యాపారి నుంచి సత్యనారాయణరెడ్డి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా నల్ల గొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారించి నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1084 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. టపాకాయల దుకాణం ఏర్పాటుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ -
గ్రామీణ రోడ్లకు మహర్దశ
హ్యామ్ కింద అభివృద్ధి, విస్తరణకు నేడు టెండర్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి మోక్షం లభించనుంది. ఇప్పటికీ రోడ్లు సరిగ్గాలేని ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతోపాటు ఇరుకు రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్ల నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ అన్యూటీ మోడ్లో (హ్యామ్) పద్ధతిలో ఈ పనులు చేపట్టనుంది. వీటికి 40 శాతం నిధులను ప్రభుత్వమే నిర్మాణ దశలో సమకూర్చనుండగా, 60 శాతం నిధులు కాంట్రాక్టు సంస్థలు వెచ్చించనున్నాయి. వీటికి ఈనెల 17న టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధి, విస్తరణ.. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలోని 2,162 రోడ్ల అభివృద్ధి, విస్తరణను 7,449.50 కిలోమీటర్ల పొడవునా చేపట్టనుంది. అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం దక్కనుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తంగా 825.28 కిలోమీటర్ల పొడవునా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇవి కాకుండా మరో ఆరు ప్రాంతాల్లో రూ.560 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించనున్నారు. సర్కిల్–1లో ఐదు నియోజకవర్గాల్లో రోడ్ల అభివృద్ధి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. నల్లగొండ సర్కిల్ పార్ట్–1 కింద 184.72 కిలోమీటర్ల పొడవునా రోడ్లను అభివృద్ధి చేయనుండగా, 38.4 కిలోమీటర్ల పొడవునా డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు. ఇందులో మొత్తంగా నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభివృద్ధి, విస్తరణ కలిపి 223.12 కిలోమీటర్ల పొడవునా రోడ్ల పనులను చేపట్టనున్నారు. సర్కిల్ –2లో ఏడు నియోజకవర్గాల్లో.. నల్లగొండ సర్కిల్–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల పొడవునా రోడ్ల అభివృద్ధిని చేపట్టనున్నారు. ఫ ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్లకు అవకాశం ఫ మరో ఆరు ప్రాంతాల్లో కొత్తవాటికి ప్రతిపాదనలు ఫ హైబ్రీడ్ అన్యూటీ మోడ్లో చేపట్టనున్న పనులు ఫ పీఆర్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగించేలా కార్యాచరణ -
విధులకు హాజరుకాని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
మునగాల: కార్యాలయ నిర్దేశిత ప్రారంభ సమయం దాటినా సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఆరా తీసి విధులకు డుమ్మా కొట్టిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ డి.సత్యనారాయణ, ఎంపీఎస్ఓ బి.సంపత్, జూనియర్ అసిస్టెంట్ ఎం.సునీల్ గవాస్కర్, రికార్డ్ అసిస్టెంట్ జి.ప్రశాంత్లు విధులకు రిపోర్ట్ చేయలేదు. ఉదయం 10.30 గంటలు దాటినా విధులకు హాజరుకాకపోవడంతో వీరిని సస్పెండ్ చేశారు. ఈ అంశంపై కలెక్టర్ తహసీల్దార్ను వివరణ కోరారు. కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ అటెండెన్స్ రిజస్టర్ను పరిశీలించగా మొత్తం కార్యాలయంలో 18 మంది ఉద్యోగులకు గాను నలుగురు డిప్యుటేషన్పై ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మరో ఇద్దరు ఆకస్మిక సెలవులో ఉండగా మరొక ఉద్యోగి సర్వే విధులకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీఎస్ఓ, రికార్డు అసిస్టెంట్, జూనియర్, అసిస్టెంట్ విధులకు హాజరు కాలేదు. మిగిలిన వారు హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ప్రతి ఉద్యోగి సకాలంలో విధులకు హాజరు కావాలని, ఒకవేళ విధులకు గైర్హాజరైనా, ఆలస్యంగా వచ్చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి భానుపురి (సూర్యాపేట) : ఈ వానాకాలం సీజన్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, సీఈఓ లతో 2025– 26 వానాకాలం సీజన్ ధాన్యం సేకరణ పై వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండు మూడు రోజుల్లో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరుగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల వడ్లు కాంటా అయిన తర్వాత వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పౌర పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, పార సరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఆర్డీఓ వి.వి అప్పారావు, డీసీఓ పద్మ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వర్ శర్మ, సివిల్ సప్లయ్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, బెనర్జీ పాల్గొన్నారు. ఫ మునగాల తహసీల్దార్ కార్యాలయం తనిఖీ ఫ డుమ్మా కొట్టిన నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ ఫ సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక -
రూపాయికే బీఎస్ఎన్ఎల్ కనెక్షన్
కోదాడ: దీపావళి పండుగను పురష్కరించుకొని బీఎస్ఎన్ఎల్ వినియోగ దారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అమలులో ఉంటుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క రూపాయితో నెల రోజుల పాటు ఉచితంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్తో పాటు 2 జీబీ డెటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపవచ్చని పేర్కొన్నారు. పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి మారే వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని, సిమ్కార్డ్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంతుంగతుర్తి : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు పేర్కొన్నారు. గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన పోషణ మాసోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అనంతరం ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్న ప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తహసీల్దార్ దయానందం, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ, సూపర్వైజర్ ఖైరున్నిసా బేగం, మంగ, అనురాధ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదలకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం మూసీ రిజర్వాయర్కు 3,613 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 2,748 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపీజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు నీటిమట్టం 644.40 అడుగుల(4.30టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనం పై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంచేసి నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
బీసీ బంద్కు సహకరించాలి
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్ చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్కు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, హోటళ్లు సహకరించాలని పలు ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సూర్యాపేటలోని ఓ హోటల్లో తెలంగాణ జన సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలలో వెనుకబడిన తరగతుల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లుకు పార్లమెంట్లో వెంటనే చట్టం చేయాలని కోరారు. తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందారి డేవిడ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత సత్యనారాయణ పిళ్లే, నాయకులు చింతలపాటి శ్రీరాములు, అనంతుల మధు, మట్టిపల్లి సైదులు, బూర వెంకన్న, యాతాకుల రాజయ్య , చలమల నరసింహ, పొంగోటి రంగ, జనార్దన్, యాదగిరిరావ్, భద్రయ్య పాల్గొన్నారు. -
హాజరు మెరుగాయే..
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఇంటర్మీడియట్ స్థాయిలో సర్కారు విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు పర్యవేక్షిస్తోంది. ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తోంది. విద్యార్థులకు ఒక పూట ఫేస్రికగ్నిషన్ హాజరునమోదు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తుండటం సత్ఫలితాలిస్తోంది. గైర్హాజర్ అయితే తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్ ముఖ గుర్తింపు హాజరు కోసం ఇంటర్ బోర్డు అధికారులు టీజీబీఐఆర్ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రతిరోజు విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల గతంలో కంటే 20 నుంచి 25 శాతం విద్యార్థుల హాజరు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఏ విద్యార్థి అయినా కళాశాలకు హాజరు కాకుంటే తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్ వెళుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ అందిన తరువాత తల్లిదండ్రుల నుంచి సంబంధిత కళాశాల అధ్యాపకులకు ఫోన్ రాకపోతే కళాశాల అధ్యాపకులే తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇలా చాలా రోజులు కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు అధ్యాపకులు వెళ్లి వారితో మాట్లాడి చదువు విశిష్టతను తెలిపి కాలేజీకి పంపేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం వేళ మాత్రమే విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మధ్యాహ్నం తరువాత కూడా అమలులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టింది. ఈ విధానం వల్ల విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరవుతున్నారు. దీంతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. తరచూ కళాశాలకు హాజరుకాని విద్యార్థులపై పర్యవేక్షణ పెరుగుతుంది. – మృత్యుంజయ, ప్రిన్సిపాల్, తిరుమలగిరి. ఫ జూనియర్ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న ఫేస్రికగ్నిషన్ సిస్టమ్ ఫ 20 నుంచి 25శాతం పెరిగిన విద్యార్థుల హాజరు ఫ డుమ్మాకొడితే తల్లిదండ్రులకు సమాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 8మొదటి సంవత్సరం విద్యార్థులు 1559రెండవ సంవత్సరం విద్యార్థులు 1444 -
వైద్యసాయం అందేవరకూ సీపీఆర్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : గుండె పనిచేయకుండా ఆగిపోయిన వ్యక్తులకు వైద్య సహాయం అందే వరకూ ప్రాణాలు నిలపడానికి సీపీఆర్ (కార్దియోపల్మనరీ రీససిటేషన్) అత్యవసరమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో సిబ్బందికి సీపీఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుండె పనిచేయకుండా ఆగిపోయి శ్వాస తీసుకోకుండా స్పృహ కోల్పోయిన వ్యక్తులకు మాత్రమే సీపీఆర్ విధానం ఉపయోగించాలన్నారు. గుండెపోటుకు ఈ విధానం ఉపయోగించరాదని సూచించారు. ఇటీవల గుండె పనిచేయకుండా ఆగిపోవడం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని, అలాంటి సమయంలో సీపీఆర్పై ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు. సీపీఆర్ చేసేటప్పుడు వ్యక్తులను బట్టి ఛాతీపై ఒత్తిడి చేయాలని, ఎక్కువ ఒత్తిడి చేయకూడదని సూచించారు. అనంతరం వైద్యులు సృజన, శరణ్య సీపీఆర్ ఎలా చేయాలో అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చూపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బంద్కు పూర్తి మద్దతు
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. విద్యార్థులు కళల్లోనూ రాణించాలిసూర్యాపేట టౌన్ : విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళల్లోనూ రాణించాలని జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్ సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలభవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫోక్ డ్యాన్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో జిల్లాలోని తొమ్మిది పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నేరస్తులపై ప్రత్యేక నిఘా
అర్వపల్లి: జిల్లాలో నేరస్తులపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. అర్వపల్లి పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించి నేరాలు, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఘర్షణలకు పాల్పడే వ్యక్తులు, వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేయాలన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సత్వర న్యాయం చేయాలన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లలో సమస్య పరిష్కారం కాలేదనుకుంటే సీఐ, డీఎస్పీల వద్దకు వెళ్లాలని అక్కడా న్యాయం జరగడంలేదని భావిస్తే ఎస్పీ కార్యాలయానికి రావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ఈట సైదులు, ఏఎస్ఐ రామకోటి, హెడ్కానిస్టేబుల్ సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
హుజూర్నగర్లో వ్యవసాయ కళాశాల
హుజూర్నగర్ : హుజూర్నగర్కు వ్యవసాయ కళాశాల మంజూరైంది. ఈమేరకు రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎస్సీ అగ్రికల్చర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాలేజీ కోసం ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. కోర్సులు ఇలా.. హుజూర్నగర్లో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కాలేజీ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది. ఈ కాలేజీలో ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ఉంటుంది. దీనిలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు ఉంటాయి. అగ్రానమీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పెథాలజీ, ఎంటమాలజీ, హార్టికల్చర్, న్యూట్రిషన్ తదితర వ్యవసాయ అనుబంధ కోర్సులు ఉంటాయి. నాలుగేళ్ల (బీఎస్సీ)కోర్సులో భాగంగా తొలి ఏడాదికి సంబంధించి వంద మంది వరకు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంది. పూర్తికావొచ్చిన స్థల సేకరణ ప్రక్రియ! హుజూర్నగర్లో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చొరవతో ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు ఇటీవల నియోజకవర్గంలోని మండలాల్లో వివిధ చోట్ల అనువైన భూములను పరిశీలించారు. మొత్తం మీద హుజూర్ నగర్ శివారులోని మగ్దూం నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. స్థల సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో హుజూర్నగర్లో ప్రభుత్వం వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ భవనంలో.. ఈ విద్యా సంవత్సరం నుంచే హుజూర్నగర్లో కళాశాల తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం హుజూర్నగర్ పట్టణంలోని ఏదైనా ప్రైవేట్ భవనంలో కళాశాల ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ కళాశాలలో బోధించేందుకు దాదాపు 25 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానుండగా, పాతిక మంది వరకు స్థానికులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించి సరైన సూచనలు సలహాలు అందే అవకాశం ఉంది. సాంకేతిక సలహాలు లభించనున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, కొత్తకొత్త వంగడాలకు సంబంధించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు మరింత చేరువకానుంది. తద్వారా వారికి మరింత లబ్ధిచేకూరనుంది. ఈ కళాశాల ద్వారా నూతన వంగడాలు రైతులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఫ మంత్రివర్గంలో ఆమోదం ఫ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేలా ప్రణాళిక ఫ తొలుత ప్రైవేట్ భవనంలో తరగతులు ఫ కొలిక్కివచ్చిన స్థల సేకరణ ప్రక్రియ! -
ఆపదలో ప్రాణాలు నిలిపే సీపీఆర్
ఈ నెల 13 నుంచి 17 వరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్టర్లతో సీపీఆర్పై ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సీపీఆర్పై అవగాహన కల్పించేలా ఐదురోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. సీపీఆర్పై అవగాహన ఉంటే తోటి మనిషి ప్రాణాలు కాపాడే అవకాశ ఉంటుంది. – డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ, సూర్యాపేట సూర్యాపేటటౌన్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయడం వల్ల అతడి ప్రాణాలు కాపాడొచ్చు. సీపీఆర్ చేయడానికి వైద్యులే అవసరం లేదు, అవగాహన ఉన్న వారు చాలు. ఆగిన గుండెను తిరిగి పని చేయించే కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం కోసం వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఐదురోజుల పాటు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అధికమైన గుండెపోటు సమస్య ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు అడ్డు పడడం వల్ల చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తడి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తున్నది. వెంటనే సీపీఆర్ చేస్తే ప్రయోజనం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా ఒక్కోసారి సడెన్గా గుండె పనిచేయడం ఆగిపోతుంది. దానినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. దాంతో వారు ఒక్కసారిగా ఉన్నచోటే కుప్పకూలిపోతారు. కొందరికి నొప్పి రాకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అవగాహన ఉన్న వారు వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తే వారి గుండె తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. దాంతో అతడి ప్రాణాలు నిలిపి అవకాశం ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఛాతిపై రెండు అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి హృదయ స్పందన తిరిగి ప్రారంభమయ్యేలా నొక్కుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అతను బతికే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. విస్తృతంగా అవగాహన సీపీఆర్పై జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మాల్స్, ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు 17 వరకు కొనసాగనున్నాయి. వైద్యులు సీపీఆర్పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, పీహెచ్సీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఫ అత్యవసరంలో అనుసరించాల్సిన విధానంపై అవగాహన ఫ జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఫ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిక్షణ -
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
చివ్వెంల: మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించలేదన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న రాజ్యంగాన్ని మనువాద బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. రాజ్యంగ పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ అవలంబించిన విధానాన్నే రేవంత్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అమర వీరులు చూపిన బాటలో పయనించాలని పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ జీవితాంతం పేదల అభ్యన్నతికి కృషిచేసిన మహనేత ఇట్టమళ్ల ఏసోబ్ అన్నారు. అనంతరం ఇట్టమళ్ల ఏసోబ్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన స్థలంలో సీపీఎం కార్యాలయ నిర్మాణానికి తమ్మినేని శంకుస్థాపన చేశారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, వై.వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, సీపీఐ నాయకుడు ఖమ్మంపాటి అంతయ్య, ఇస్లావత్ రాంచందర్ నాయక్, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్రావు పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
ఆర్డీఆర్ మృతి కాంగ్రెస్కు తీరని లోటు
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తిలో దామోదర్రెడ్డి చిత్రపటానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుమారుడు సర్వోత్తంరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీగల గిరిధర్రెడ్డి, ఎల్సోజు చామంతినరేశ్, పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్దన్, గుడిపాటి నరసయ్య, అవిలమల్లు యాదవ్, నాయకులు తిరుమలప్రగడ కిషన్రావు, పచ్చిపాల సుమతి, దాయం ఝాన్సీరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భానుపురి (సూర్యాపేట) : మహిళల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తగిన శ్రద్ధ వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఫక్షన్హాల్లో నిర్వహించిన సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోషకాహారలోపం లేని సమాజాన్ని నిర్మించడమే పోషణ మాసం లక్ష్యమన్నారు. అందుకు కిందిస్థాయిలో కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లను అభినందించారు. గర్భిణుల పోషణలో ఆమె కుటుంబ సభ్యుఉల పాత్ర ఎంతో కీలకమన్నారు. బాల్య ఆరంభ దశ సంరక్షణ, విద్యపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నాం
భానుపురి (సూర్యాపేట) : వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ధాన్యం సేకరణపై బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో సూర్యాపేట జిల్లాలో 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ నెల నాలుగో వారం నుంచి ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ నిర్వహించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామగ్రి, గన్నీ బ్యాగులు అందించినట్లు తెలిపారు. మిల్లుకు ఎంత ధాన్యం పంపించాలో ముందే ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, పార సరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఆర్డీఓ అప్పారావు, డీసీఓ పద్మ, మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శర్మ, ట్రాన్స్పోర్ట్ అధికారి జయప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు
కోదాడ: పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ అన్నారు. బుధవారం కోదాడలోని కాశీనాథం ఫంక్షన్హాల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు భర్తీ చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికలో కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి, చెవిటి వెంకన్నయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, నాయకులు సాముల శివారెడ్డి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి
సూర్యాపేటటౌన్/తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులు ఉన్నత ఆశయం, లక్ష్యాన్ని ఎంచుకొని, వాటి సాధనకు కష్టపడి చదువాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తిరుమలగిరి మున్సిపాల్టీ పరిధిలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు శాంతి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా మారాయని, విద్యార్థులు వీటిపై పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఇంటర్నెట్ను నాలెడ్జ్ కోసం మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వెంకటయ్య, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ప్రిన్సిపాల్స్ యాదయ్య, సంజీవ్కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
డీసీసీకి ఆరుగురి పేర్లు!
భానుపురి (సూర్యాపేట) : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గానూ ఏఐసీసీ పరిశీలకుడు ఈ నెల 13 నుంచి జిల్లాలో మకాం వేశారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ.. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ కార్యకర్తల కోసం పనిచేస్తూ, ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని జిల్లా నుంచి ఆరుగురి పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. గతానికంటే భిన్నంగా గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా, ముఖ్య నాయకులతో సఖ్యతగా ఉన్న నాయకులనే డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలకు రాహుల్గాంధీ పిలుపునివ్వడంతో ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎంపిక చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ విధానం సక్సెస్ కావడంతో అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దాంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలను సైతం తెలుసుకుంటోంది. అధ్యక్ష స్థానం కోసం తీవ్ర పోటీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున నాయకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి తమకు ఇవ్వాలని ఏఐసీసీ పరిశీలకుడికి వినతిపత్రాలు సైతం అందించారు. తమ రాజకీయ గురువులను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఈ పోటీ నడుమ డీసీసీ పదవి ఎవరిని వరిస్తుందోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వరుస సమావేశాలు కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ నాయకులు, కార్యకర్తలతో వరస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. బుధవారం కోదాడలో పర్యటించి కోదాడ హుజూర్నగర్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్పార్టీ కసరత్తు ఫ జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుడి మకాం ఫ కార్యకర్తలతో వరస మీటింగ్లు, అభిప్రాయాల సేకరణ ఫ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2018లో మొదటిసారిగా చెవిటి వెంకన్నయాదవ్ను నియమించారు. ప్రతిపక్షంలో ఉండి పార్టీపరంగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన జిల్లాలో విజయవంతం చేశారు. దాంతో 2023 మేలో రెండోసారి ఆయననే డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆనాటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. జిల్లాలో బలమైన బీసీ నేత కావడం, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కావడంతో మరోసారి అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. అయితే ప్రస్తుత డీసీసీని కొనసాగించే అవకాశం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువులకు సైతం పదవులు ఇచ్చేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో డీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. మొదట ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణం జరిపించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. పశువులకు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలినాగారం : పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని, గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ డి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం మండలంలోని ఫణిగిరిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కలుషితమైన మేత, తాగునీరు, గాలి ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు సంక్రమిస్తుందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి.వెంకన్న, డాక్టర్ బి.రవిప్రసాద్, మండల పశువైద్యాధికారి బత్తుల రవి, పశువైద్యాధికారులు పి.మౌనిక ప్రియదర్శిని, ఏ.నరేశ్, జేవీఓ వై.నాగరాజు, ఎల్ఎస్ఏలు టి.మురళి, స్వప్న, రైతులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు
నడిగూడెం : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. 5 నుంచి 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకుల ఎరెన్స్టెస్ట్ రాసిన విద్యార్థుల్లో ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16, 17 తేదీల్లో సూర్యాపేట మండలం ఇమామ్పేట గురుకుల పాఠశాలలో దరఖాస్తులు అందించాలని కోరారు. దరఖాస్తుతో పాటు, కుల ధృవీకరణ పత్రం, ప్రవేశ పరీక్ష హాల్టికెట్ జిరాక్స్ జతపర్చాలని సూచించారు. కలాం ఆశయ సాధనకు కృషి చేయాలితిరుమలగిరి (తుంగతుర్తి) : భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. అబ్దుల్ కలాం 94వ జయంతిని బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని పెన్షనర్స్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు సంకెపల్లి విఠల్రెడ్డి, ఎం.పద్మారెడ్డి, బన్వరి నర్సయ్య, సీహెచ్.పుల్లయ్య, మల్లయ్య, సత్తిరెడ్డి, కొమురెల్లి, రాములు, రాంరెడ్డి, కృష్ణమాచారి, విద్యాసాగర్రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలిచిలుకూరు: ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం చిలు కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నారాయణపురం ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు గ్రామాణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోరి, డాక్టర్ సుభాశ్, సిబ్బంది ఉన్నారు. బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలి తుంగతుర్తి : కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నాగప్రసాద్ కోరారు. మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్లో పలువురు ఖాతాదారుల నామినీలకు మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కులను బుధవారం ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారు సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే వారికి బీమా వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి 18 నుంచి 50 సంవత్సరాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు. బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న పేదలు ఈ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వెంగళరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : జిల్లాలో 2025 విద్యా సంవత్సరంలో 40 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ప్రతి పాఠశాల నుంచి తాత్కాలిక పద్ధతిలో ఒక ప్రైమరీ టీచర్, ఒక ఆయాను నియమించేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ టీచర్కు ఇంటర్మీడియట్, ఆయాకు 7వ తరగతికి విద్యార్హత ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థి అదే గ్రామ పంచాయితీ వారై ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులుపూర్తి చేసిన దరఖాస్తులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అందజేయాలని కోరారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలినూతనకల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా వైద్య సిబ్బంది పాటు పడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ పీహెచ్సీని తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి లిఖిత్, సీహెచ్ఓ శరణ్నాయక్, ప్రియాంక, శిరీష, దీపిక, మనీషా, సుమాంజలి, అనూ హ్య, ఉషారాణి, ఆనంద్గౌడ్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ రెండో దశకు బీఎన్ పేరు పెట్టాలిసూర్యాపేట అర్బన్: ఎస్సారెస్పీ రెండో దశకు దివంగత మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ ప్రాజెక్టు సాధన కోసం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట్ నరసింహారెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు నీరు అందించడానికి కృషి చేశారన్నారు. సమావేశంలో కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, రాంబాబు, మడ్డిఅంజిబాబు, షేక్ జహంగీర్ పాల్గొన్నారు. బృందాల ఏర్పాటును విరమించుకోవాలిసూర్యాపేటటౌన్ : పాఠశాలల తనిఖీకి బృందాల ఏర్పాటును విరమించుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కొచ్చర్ల వేణు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తనిఖీ బృందాల స్థానంలో ఎంఈఓలు, డిప్యూటీ ఈఓ, డీఈఓలను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు. బృందాల పేరుతో ఉపాధ్యాయులను బడికి దూరం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం శోచనీయమన్నారు. -
కోదాడలో మున్సిపల్ స్థలం కబ్జా
కోదాడ: సామాజిక అవసరాల కోసం కేటాయించిన 10శాతం స్థలాన్ని ఒకరు కబ్జా చేశారు. ఈ స్థలం మున్సిపాలిటీ పేరున రిజిస్ట్రేషన్ అయి ఉన్నా అవేమీ పట్టించుకోకుండా రేకుల షెడ్డు నిర్మించి ఆక్రమణకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల విలువైన స్థలం అన్యాక్రాంతమైనా అధికారులు పట్టించుకోవడంలేదు. అసలు విషయం ఏమిటంటే.. కోదాడ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు, అంబేద్కర్ కాలనీ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాలుగు ఎకరాల స్థలాన్ని లే అవుట్ నంబర్ 2147/2012తో ప్లాట్లు చేశాడు. లే అవుట్లో సామాజిక అవసరాల కోసం 10 శాతం స్థలాన్ని కేటాయించాడు. ఈ స్థలాన్ని కోదాడ మున్సిపాలిటీ పేరుతో స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి కమిషనర్ రామానుజులరెడ్డి రిజిస్ట్రేషన్ సైతం చేయించాడు. నిబంధనల ప్రకారం ఈ లేఅవుట్ చేసిన వ్యాపారి అందులో రోడ్లను కూడా మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. షెడ్డు వేసి.. ఈ వెంచర్లో 1,211 గజాల స్థలాన్ని కోదాడ మున్సిపాలిటీ పేరుతో రిజిస్టేషన్ అయినప్పటికీ ఖాళీగా ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఒకరి కన్ను దీనిమీద పడింది. సదరు స్థలంలో రేకులషెడ్డు వేసి ఆక్రమణకు పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇటీవల ఇదే స్థలంలో అమృత 2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రజారోగ్యశాఖకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని కేటాయించే సమయంలోనైనా అధికారులు అక్కడ మున్సిపాలిటీకి ఉన్న స్థలం ఎంత..? వాటర్ ట్యాంక్కు ఎంత కేటాయిస్తున్నాం..? ఇంకా ఎంత స్థలం అక్కడ మిగిలింది.? అన్న వివరాలు కూడా తీసుకోలేదు. సదరు భూమి నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లుగా పెట్టిన తరువాత దానికి సంబంధించిన వివరాలు మొత్తం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. స్థలం ఆక్రమణకు గురి అవుతుందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి.ఫ స్థలం విలువ రూ.కోట్లలోనే.. ఫ రేకుల షెడ్డు నిర్మించి దర్జాగా ఆక్రమణ ఫ స్థానికులు ఫిర్యాదు చేసినాపట్టించుకోని అధికారులు కోదాడ మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం విషయంపై విచారణ జరిపి కబ్జాకు గురైతే తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. –రమాదేవి, కోదాడ మున్సిపల్ కమిషనర్ -
యువతకే డీసీసీ అధ్యక్ష పదవి
తుంగతుర్తి : డీసీసీ అధ్యక్షుడి నియామకంలో యువతకే ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ తెలిపారు. మంగళవారం తుంగతుర్తిలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మొదట మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సారత్ రౌత్ మాట్లాడుతూ ఓబీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ, మహిళల నుంచి ఆరు పేర్లు ఏఐసీసీకి పంపిస్తామన్నారు. వారిలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. పార్టీ అభివృద్ధికి పనిచేసే వారిని నియమిస్తారన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన , అందరినీ సమన్వయపరిచే వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామన్నారు.అనంతరం కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో పీసీసీ అబ్జర్వర్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పీసీసీ అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞాన సుందర్, పీసీసీ సభ్యుడు గుడిపాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, యోగానంద చార్యులు, పాలకుర్తి రాజయ్య, దొంగరి గోవర్ధన్, ఆకుల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. దామోదర్రెడ్డి మృతి బాధాకరం మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చాలా బాధాకరమని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ పేర్కొన్నారు. మంగళవారం దామోదర్రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామోదర్ రెడ్డి కుమారుడైన ఏఐసీసీ సభ్యుడు రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు. ఫ కాంగ్రెస్ అభివృద్ధికి కృషిచేసిన వారినే ఎంపిక చేస్తాం ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ -
రాయితీ.. రాలేదు!
భానుపురి (సూర్యాపేట): వంట గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన రాయితీ సొమ్ము రావడం లేదు. సుమారు ఐదారు నెలలుగా ఈ రాయితీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమకావడంలేరు. జిల్లాలో దాదాపు 6లక్షలకు పైగా సిలిండర్లకు సుమారు రూ.20కోట్ల వరకు సబ్సిడీ పెండింగ్లో ఉంది. 2024లో ఫిబ్రవరిలో ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తోంది. గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందించే ఉద్దేశంతో 2024 ఫిబ్రవరిలో పథకాన్ని ప్రారంభించారు. సిలిండర్ నింపిన తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో ఈ సొమ్మును ప్రభుత్వం జమచేసేది. మొదట్లో బాగానే అందించినా.. రానురాను ఈ పథకం కింద గ్యాస్ రాయితీ రావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. మొదట్లోనే వర్తించని పథకం.. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం పేరున ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి పథకం(రూ.500లకే గ్యాస్ సిలిండర్) కోసం దాదాపు 3,26,383 దరఖాస్తులు అందాయి. అయితే చాలామందికి అర్హత ఉన్నా దరఖాస్తులు నింపే సమయంలో అవగాహన లేమి కారణంగా ఈ పథకానికి దూరమయ్యారు. ఈ దరఖాస్తులు అందించిన వారిలోనూ చాలామందికి ఈ పథకం వర్తించకుండా పోయింది.ఫ లబ్ధిదారుల అకౌంట్లలో జమకాని గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు ఫ ఐదారు నెలలకు పైగా ఇదే పరిస్థితి ఫ ఆరు లక్షలకు పైగా సిలిండర్లకు సుమారు రూ.20కోట్ల వరకు సబ్సిడీ పెండింగ్ ఈ ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు బండి జ్యోతి. సొంతూరు తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం. మహాలక్ష్మి పథకం ప్రారంభం అయ్యాక ఆమె ఆరుసార్లు గ్యాస్ నింపించింది. రెండుసార్లు మాత్రమే రాయితీ సొమ్ము జమ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లను అడిగితే రాలేదని చెప్పారు. ఇదీ.. జిల్లాలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల పరిస్థితికి నిదర్శనం.జిల్లాలో మూడు కంపెనీలకు చెందిన 13 సాధారణ డిస్ట్రిబ్యూటర్లు, 12 గ్రామీణ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ 25 ఏజెన్సీల పరిధిలో 2,01,369 సింగిల్ కనెక్షన్లు, 65,146 డబుల్ సిలిండర్ కనెక్షన్లు, 55,537 దీపం కనెక్షన్లు, 44,322 ఉజ్వల కనెక్షన్లు, 43,701 సీఎస్ఆర్ కనెక్షన్లు.. ఇలా మొత్తం 4,10,075 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి 6 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో 8 సిలిండర్ల వరకు వినియోగిస్తుంటారు. ఈ లెక్కన ప్రతినెలా ఆయా ఏజెన్సీల ద్వారా 2లక్షల సిలిండర్లు జిల్లాకు సరఫరా అవుతుంటాయి. కాగా పథకం ప్రారంభమైన నాటినుంచి జిల్లాలో దాదాపు 5,52,043 సబ్సిడీ సిలిండర్లను పంపిణీ చేయగా.. రూ.15.26 కోట్లు సబ్సిడీ సొమ్ము జమచేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతినెలా జిల్లాలో 2లక్షల దాకా సిలిండర్లు సరఫరా అవుతుండగా.. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ల స్కీం అమలై దాదాపు 20 నెలలవుతోంది. కేవలం ఐదున్నర లక్షల మందికే ఈ పథకం కింద సిలిండర్లు అందించడంపై దీని అమలు తీరు అర్థమవుతోంది. -
నేరాల నివారణకు నాకా బందీ
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణకు నాకా బందీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం నిర్వహించిన నాకా బందీ కార్యక్రమాన్ని ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 23 ప్రాంతాల్లో నాకా బందీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అక్రమ రవాణా, అనుమానితులు, రౌడీషీటర్స్ కదలికలు, గంజాయి రవాణా చేసే వారి కదలికలు, పశువుల అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా నేరస్తుల కదలికలు గుర్తించి నివారించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు శ్రీకాంత్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. 21న పోలీస్ ఫ్లాగ్ డే ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజ రక్షణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ ఈనెల 21 నుంచి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలీస్ విధులు, టెక్నాలజీ వినియోగంపై పోలీస్ ఓపెన్ హౌజ్, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అమరవీరుల కుటుంబాల సందర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, అమర పోలీసులను స్మరిస్తూ క్యాండిల్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు ప్రతిభ తెలిపే లఘు చిత్రాల పోటీలు, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు ఉంటాయని, డ్రగ్స్ నివారణలో పోలీసు పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశాలపై వ్యాసరచనపోటీలు ఉంటాయని వివరించారు.ఫ ఎస్పీ నరసింహ -
సకాలంలో రుణాలు అందించాలి
భానుపురి (సూర్యాపేట) : కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో కనీస మద్దతు ధరలు, పత్తి నాణ్యతా ప్రమాణాలు, కపాస్ కిసాన్ యాప్పై అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పత్తిని విక్రయించేందుకు ఇకపై కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, రైతులే నేరుగా ఈ బుకింగ్ చేసుకునేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెటింగ్ కమిటీ సహాయ కార్యదర్శి ఎం.వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. భానుపురి (సూర్యాపేట) : 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైతులు, ప్రజలకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి డీసీసీ బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలు వార్షిక బడ్జెట్ రూ.6914.63 కోట్లు లక్ష్యంకాగా మొదటి మూడు నెలలలో రూ.2236.12 కోట్లు అందించి 32.34 శాతం వృద్ధి సాధించారని వివరించారు. ఇతర ప్రాధాన్యతారంగాల్లో వార్షిక బడ్జెట్ రూ.2196.61 కోట్లు లక్ష్యంకాగా మొదటి మూడు నెలల్లో రూ.971.95 కోట్లు అందించి 44.25 శాతం వృద్ధి సాధించారన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నాగప్రసాద్, ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డ్ జిల్లా మేనేజర్ రవీంద్ర నాయక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నరసింహారావు పాల్గొన్నారు. నిరంతరం పర్యవేక్షించాలి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి మంత్రి అడ్లూరు లక్ష్మ ణ్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ సంక్షేమ, విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని అనంతరం జిల్లా సంక్షేమ శాఖల అధికారులతో మాట్లాడారు. కాన్ఫరెన్స్లో ఎస్టీ సంక్షేమ అధికారి శంకర్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం
సూర్యాపేట అర్బన్ : గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో సూర్యాపేటలో కల్లుగీత కార్మిక సంఘం 4 వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటిరోజు వేలాదిమంది గీత కార్మికులతో ప్రదర్శన, బహిరంగ సభ, మిగతా రెండు రోజులు ప్రతినిధుల సభ నిర్వహిస్తామని వివరించారు. గీతవృత్తిని ఆధారంగా చేసుకొని జీవనంసాగిస్తున్న కార్మికుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదన్నారు. ప్రభుత్వాలు సహకరించి తాటి, ఈత చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలని కోరారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని అందుకు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. గీతకార్మికులకు పింఛన్ రూ4 వేలకు, ఎక్సిగ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు. ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా రూ. 12 కోట్ల 60 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.వెంకట నరసయ్య, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు గౌడ్, కొండం కరుణాకర్, యమ గాని వెంకన్న, అబ్బగాని భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ -
అందరి ఆమోదంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
భానుపురి (సూర్యాపేట) : పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నాయకుడు రాహుల్గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. మొదటగా గుజరాత్లో పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయం సేకరించి డీసీసీ అధ్యక్షుల ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ, ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జిల్లావ్యాప్తంగా మండలాలు, గ్రామాలలో తాను పర్యటిస్తానని, అందరి అభిప్రాయాలు తెలుసుకుని డీసీసీ అధ్యక్షుని ఎంపికలో యువతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఆరుగురు పేర్లు ఏఐసీసీకి పంపిస్తామని, వారిలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు పౌర సమాజం, ఎన్జీఓలను కలుస్తానని, ఎవరైనా తమ అభిప్రాయం తెలియజేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం ఉత్తమమైన వ్యక్తులను తాను సెలెక్ట్ చేయనున్నట్లు తెలిపారు. లాభాపేక్ష లేకుండా పార్టీకి పనిచేసే వారిని ఎంపిక చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున పార్టీ కూడా పటిష్టం అయ్యేలా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, పీసీసీ జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, ఓబీసీ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ చైర్మన్లు అరుణ్ కుమార్, నరేష్ సుమతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మండల పార్టీ అధ్యక్షులు వీరన్న నాయక్, తూముల సురేష్ రావు, కోతి గోపాల్ రెడ్డి, కందాల వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవ రావు, దండి రమేష్, జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు కక్కిరెని శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, కోదాడ,హుజూర్నగర్ మండల, బ్లాక్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ -
పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలు
చిలుకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా సబ్జెక్టు నిపుణులతో 11 టీములను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో టీముల్లో సభ్యులను నియమిస్తారు. త్వరలో ఈ బృందాలు తనిఖీలు చేపడతాయి. బృందాలలో సభ్యుల నియామకం ఇలా.. జిల్లాలో 600 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి ఆరు బృందాలు, 76 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక బృందం, 180 ఉన్నత పాఠశాలల తనిఖీకి నాలుగు టీములను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయడానికి జిల్లా స్థాయిలో ముగ్గురితో ఒక బృందం ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీకి ముగ్గురితో బృందాన్ని నియమిస్తారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరు, ఒక ఎస్జీటీ సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల తనిఖీకి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. జీహెచ్ఎం నోడల్ అధికారిగా ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఏడుగురు ఉపాధ్యాయులు బృందంలో ఉంటారు. వీరితో పాటు పీడీ కూడా ఉంటారు. మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ టీమ్లలో సభ్యులను అర్హులను కలెక్టర్ నాయకత్వంలోని కమిటీ ఏర్పాటు చేస్తుంది. త్వరలో ఈ బృందాలు పాఠశాలలను తనిఖీ చేస్తాయి. –అశోక్, జిల్లా విద్యాధికారి ఫ సబ్జెక్టు నిపుణులతో 11 టీములు ఏర్పాటు చేయాలని నిర్ణయం ఫ రెండు, మూడు రోజుల్లో సభ్యుల ఎంపిక ఫ త్వరలో 850 బడుల్లో తనిఖీలు తనిఖీ బృందంలో సభ్యులుగా నియమించాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలి. పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సంబంధిత సజెక్టులో పాఠ్యాంశ ప్రదర్శన ఇవ్వగలిగి ఉండాలి. విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యమిస్తారు. చక్కని రాత, మౌఖిక భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు కంప్యూటర్ , డిజిటల్ అక్షరాస్యతలో ప్రతిభాశాలి అయి ఉండాలి. కలెక్టర్ నాయకత్వంలోని కమిటీ ఈ తనిఖీ బృందాలను నియమించేందుకు తుది నిర్ణయం తీసుకుంటుంది. అదనపు కలెక్టర్ , డీఈఓ, మరో జిల్లా స్థాయి అధికారి ఈ కమిటీలో ఉంటారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జిల్లా అధికారులు పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వి.వి.అప్పారావు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీసీఓ పద్మ, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్రెడ్డి, సూపరింటెండెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 55 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం వానా కాలం 2025–26 సీజన్కు సంబంధించి సూర్యాపేట జిల్లాలో 55 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు తెలిపారు. వానాకాలం ధాన్యం సేకరణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర .. జిల్లా అదనపు కలెక్టర్, సివిల్ సప్లయ్, వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్, ట్రాన్స్ఫోర్ట్ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. 4లక్షల 30 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి సెంటర్లో సెంటర్ పేరు, సెంటర్ ఇన్చార్జి పేరు, ఇతర సిబ్బంది పేర్లు ఉండాలన్నారు. ప్రతి మండలంలో మండల్ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా అధికారులను నియమించాలని, ఎంపీడీఓలకు ఐకేపీ సెంటర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని, ప్రతి సెంటర్లో ఎక్విప్మెంట్ లెక్కలు కచ్చితంగా ఉండాలన్నారు. అవసరమైన సామగ్రికి ఇండెంట్ పెట్టాలని, ధాన్యం కొనుగోలులో అక్రమాలు, అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లయ్ డీఎం రాము, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వి.వి. అప్పారావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఏపీడీ సురేష్, నగేష్, ఏడీఎం బెనర్జీ, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
పనుల గుర్తింపునకు గ్రామ సభలు
గ్రామసభల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించేందుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులను గుర్తిస్తారు. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ నాగారం : జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి అక్టోబరు 2వ తేదీ నుంచే వీటిని చేపట్టాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈ నెలలో గ్రామసభల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు. 58 రకాల పనులు నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులను గుర్తించాలి. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉండగా అన్నింటా గ్రామసభలు నిర్వహించడానికి ఇది వరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు. సీజన్లకు అనుగుణంగా.. గ్రామసభల్లో సీజన్లకు అనుగుణంగా ఉపాధి పనులు గుర్తిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కూలీల సహాయాన్ని తీసుకోనున్నారు. అలాగే పంట పొలాల్లో కూలీలతో ఇసుక మేటలు తొలగించనున్నారు. వ్యవసాయ పనులు మెండుగా ఉండే రోజుల్లో కూలీలు తక్కువ సంఖ్యలో హాజరవుతుంటారు. ఆ పనులు లేని సమయంలో అధిక మందికి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. జిల్లాలో కొన్నాళ్లుగా ఎక్కువగా భూగర్భజలాల పెంపునకు సంబంధించిన పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, పొదల తొలగింపు, నీటి కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు.ఫ త్వరలో నిర్వహించేలా కార్యాచరణ ఫ 58 రకాల ఉపాధి పనులు చేపట్టాలని నిర్ణయం ఫ ఈ సారి కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఇసుక మేటల తొలగింపు గ్రామ పంచాయతీలు 486మండలాలు 23నమోదైన కూలీల సంఖ్య 1.34 లక్షలు జాబ్ కార్డులు 2.63లక్షలు -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృ తాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనం పై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశం చేసిన తర్వాత నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు. -
అవినీతిని ప్రశ్నించేలా..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండడం, డిజిటల్ ఉపకరణాలను ఎక్కువగా వినియోగిస్తుండడంతో విద్యార్థులు, యువకుల్లో క్రమేణా ప్రశ్నించేతత్వం తగ్గుతోంది. వివిధ పథకాలు, కార్యక్రమాలు, పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిసినా వారు స్పందించడం లేదని వివిధ అధ్యయనాల్లో తేలింది. పట్టభద్రులైన యువకులు సైతం అవినీతి, అక్రమాల గురించి నిలదీయకపోతే సమాజానికి నష్టం జరుగుతుందని భావించిన ఉన్నత విద్యాముడలి సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను విద్యార్థులు, యువకుల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారోత్సవాలు నిర్వహించింది. తిరుమలగిరి (తుంగతుర్తి): విద్యార్థులు, యువకులు కళాశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాకుండా అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా సమాజంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించేలా సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 వారోత్సవాలు చేపట్టింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చేపట్టి సదస్సులు శనివారంతో ముగిశాయి. తద్వారా ప్రభుత్వాలు పారదర్శక పాలన అందించేలా ప్రతిఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవగాహన కల్పించారు. మార్పు తేవాలనే లక్ష్యంతో.. ప్రస్తుత పోటీ, డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు, యువకుల్లో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాలన్న స్పృహ కరువైంది. ఎవరికి ఏమైతే మనకేంటి అనే ఆలోచనలో విద్యార్థులు, యువకులు ఉంటున్నా రు. ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లకే పరిమితమవుతూ సమాజంలో ఏ జరుగుతున్నా చూసి వదిలేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువకుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించి వారోత్సవాలు చేపట్టింది. పోరాడితేనే సమాజానికి మేలు సమాచార హక్కు చట్టం సామాన్యుల ఆయుధం.. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఏమి జరిగినా సమాచారం తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ అస్త్రాన్ని సంధించి అవినీతి, అక్రమాలపై పోరాడితేనే సమాజానికి మేలు జరగనుంది. ఈ చట్టంపై నేటి విద్యార్థులు, యువకులకు అవగాహన కల్పిస్తూ ప్రశ్నంచేతత్వం అలవాటు చేస్తూ దాని ప్రత్యేకతను వివరించి వారిని మేల్కొలిపేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్సిటీలు, కళాశాలల్లో శనివారం వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఈ చట్టం విశిష్టత, ఉద్దేశాలు, ప్రయోజనాలు, దీనికింద ఆడగాల్సిన, అడగకూడని సమాచార వివరాలను వివరించారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసే విధానం, చెల్లించాల్సిన రుసుం, సమాచారం ఇవ్వకుంటే సంప్రదించాల్సిన విభాగాలు, అధికారుల గురించి కూడా తెలియజేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 15,612 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫ సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు పాఠాలు ఫ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఫ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అవగాహన సదస్సులు ఫ శనివారంతో ముగిసిన ‘చట్టం’ వారోత్సవాలు అవగాహన కల్పించాం సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో పదునైన ఆయుధం. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఉన్నత విద్యామండలి ఆదేశాలతో చట్టం వారోత్సవాలు నిర్వహించి చట్టంపై అవగాహన కల్పించాం. ప్రభుత్వ పథకాలు, పనులు ఎంతవరకు వచ్చాయో ఈ చట్టం ద్వారా ప్రజలు సమాచారం తెలుసుకోవచ్చు. పారదర్శక పాలనతోనే అవినీతిరహిత సమాజం ఏర్పడుతుంది. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు, యువత అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాలి. – బి.మృత్యుంజయ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తిరుమలగిరి -
గోదావరి జలాలు.. దామన్న చలవే
తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం : ఆనాడు కరువు, కాటకాలతో ఎడారిగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పచ్చని పంటలు పండాలని 40 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికై న రాంరెడ్డి దామోదర్రెడ్డి గోదావరి జలాలను తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఉద్యమించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి సంతాప సభకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా దామోదర్రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఆర్డీఆర్ కృషి ఎనలేదిఅని అన్నారు. దామన్న.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసి వేలాది ఎకరాల భూములు, ఆస్తులను ప్రజలు, కార్యకర్తల కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, హత్యయత్నాలు, వివాదాలు, దాడులు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలను కాపాడి కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన ఘనత ఆర్డీఆర్ది అని అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటూ టైగర్ దామన్నగా గుర్తింపు పొందారని కొనియాడారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేల్కు చేతిలో రూ.50 వేలు లేకున్నా 50వేల మెజార్టీతో గెలవడానికి కారణం దామన్న వేసిన పునాదులేని పేర్కొన్నారు. ఆర్డీఆర్ కృషితోనే ఎస్సారెస్పీ స్టేజ్–2.. రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీరాం సాగర్ జలాల కోసం రక్తతర్పణం చేసిన ఘనత ఆర్డీఆర్దే అని కొనియాడారు. దామోదర్రెడ్డి కృషి ఫలితంగానే ఎస్సారెస్పీ స్టేజ్–2 పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతుకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సొంత ఆస్తులను త్యాగం చేసి పార్టీని బతికించిన ఘనత దివంగత నేత ఆర్డీఆర్ది అని అన్నారు. దామన్న కుమారుడు సర్వోత్తంరెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ జెండాను కాపాడిన ఘనత రాంరెడ్డి సోదరులకే దక్కిందన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాంరెడ్డి దామోదర్రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఆ పార్టీ శాసనసభా పక్షనేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీలను ఢీకొన్నది రాంరెడ్డి వెంకట్రెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, ఎంపీ రఘువీర్రెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మహిళా అధ్యక్షురావు తిరుమలప్రగడ అనురాధకిషన్రావు, కొప్పున వేణారెడ్డి, పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్రావు, సంకెపల్లి కొండల్రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తొడుసు లింగయ్య, ఆకుల బుచ్చిబాబు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్సారెస్పీ స్టేజ్–2 కోసం 40 ఏళ్ల క్రితమే దామోదర్ రెడ్డి పోరాటం ఫ ప్రజా జీవితంలో ఉండి ఆస్తులు త్యాగం చేశారు ఫ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి ఫ ఆర్డీఆర్ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు -
సాగర్ నాలుగు గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 85,118 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను ఎత్తి 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 33,454 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 19, 348 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది. పర్యాటకుల సందడి సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొన్నది. ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని, ఎత్తిపోతల జలపాతాలను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ ఉన్న బౌద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. దాంతో పాటు బుద్ధవనం వద్ద కూడా పర్యాటకుల సందడి నెలకొంది.నాలుగు గేట్ల ద్వారా విడుదలవుతున్న వరదనీరు ఫ కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు -
రేపు బుద్ధవనంలో ధమ్మవిజయం వేడుకలు
నాగార్జునసాగర్: ఈ నెల 14న ఉదయం 11 గంటలకు బుద్ధవనంలోని సమావేశ మందిరంలో ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధుడి ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయం స్థానంలో, దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహేశ్ దియోకర్ దమ్మవిజయ విశిష్టతను వివరిస్తారని తెలిపారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, హైద్రాబాద్ రెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, ఎంజేపీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత హాజరు కానున్నట్లు తెలిపారు. స్థానికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. -
ఇట్టమళ్ల ఏసోబ్ మృతి పార్టీకి తీరనిలోటు
చివ్వెంల: సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ మృతి పార్టీకి తీరనిలోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. చివ్వెంల మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ కుటుంబాన్ని ఆదివారం జాన్వెస్లీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏసోబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏసోబ్ చేసిన కృషి, సేవలు ఎనలేనివన్నారు. చివ్వెంల మండల తొలి ఎంపీపీ ఏసోబ్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కుల నిర్మూలన కోసం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసిన ఏసోబ్ ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. బీజేపీ మతోన్మాదం, కుల తత్వాన్ని పెంచిపోషిస్తుండడం వల్లే భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి, హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్కుమార్ ఆత్మహత్య లాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎండీ అబ్బాస్, డీజీ నర్సింగరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టపల్లి సైదులు, కోట గోపి, కందాల శంకర్రెడ్డి, ఇట్టమళ్ల స్టాలిన్, దేవరకొండ యాదగిరి, రిటైర్డ్ తహసీల్దార్ పెరుమాళ్ల రాజారావు, బచ్చలకూరి రాంచరణ్, బొప్పాని సులేమాన్, కొల్లూరి బాబు, జానయ్య, బచ్చలి కన్నయ్య పాల్గొన్నారు.ఏసోబ్ చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న జాన్వెస్లీ ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
నేడు ప్రజావాణి
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసినందున సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా వాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీజేఐపై దాడి హేయమైన చర్యసూర్యాపేట అర్బన్ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్.గవాయ్పై మతోన్మాద న్యాయవాది దాడికి పాల్పడడం హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మం పేరిట ప్రధాన న్యాయమూర్తిపై దాడికి పాల్పడి, బెదిరింపు ధోరణితో వ్యవహరిండచం మతోన్మాదానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీజేఐపై దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకమై దోపిడీ వ్యవస్థపై పోరాడాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం గావించి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్య కల్యాణం జరిపి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆర్డీఆర్ మరణం కాంగ్రెస్కు తీరనిలోటు
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోద్రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి కమిషన్ సభ్యులతో కలిసి కోదండరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న గొప్ప నేత అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆయన వెంట రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, సునిల్కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఫ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
పసిడి పరుగులు
సూర్యాపేట అర్బన్ : బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు భద్రత, సంపదగా భావిస్తారు భారతీయులు. ధర ఎంత పెరిగినా పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు బంగారం లేకుండా జరిగే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు చాలా తక్కువకు కొనుగోలు చేసిన పసిడి ధర నేడు పేద, మధ్యతరగతి వర్గాలకు అందనంత పైకి ఎగబాకింది. ప్రస్తుతం సూర్యాపేట మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,24,710 కాగా 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.1,14,400 పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతేవేగంగా పెరిగి కిలోకు రూ.1,78,000కు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2024 దసరా పండుగ సమయంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78వేలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.72 వేలు పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలికింది. ఏడాదిలోపే 10 గ్రాముల బంగారం ధరకు దాదాపు రూ.47వేలు, కిలో వెండి రూ.84వేలకు వరకు పెరిగింది. దీంతో జనం వామ్మో.. ఇక బంగారం కొనలేం అనే పరిస్థితి దాపురించింది. మూడు నెలల్లో భారీగా.. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలు, క్రూడాయిల్ రేట్లు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. పెళ్లిళ్ల సీజన్లో పేద, మధ్యతరగతి వర్గాలకు కష్టమే ప్రస్తుతం మంచి రోజులు ప్రారంభం అవ్వడంతో శుభముహూర్తాలు, వివాహాలు, గృహప్రవేశాలు, శారీ ఫంక్షన్లు, పండుగలు వరుసగా ఉండనున్నాయి. అయితే పెరిగిన బంగారం, వెండి ధరలతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు 200 గ్రాముల కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు కేవలం 5 నుంచి 6 గ్రాములతో సరిపెట్టుకుంటున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ల వేడుకల్లో పసిడి మెరుపులు లేకుండానే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను వాడుతున్నారు. నగలు తక్కువ.. సేవింగ్స్ ఎక్కువ బంగారం ధరలు కార్మికుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 10 గ్రాములు రూ.1.24 లక్షలు దాటడంతో ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య జిల్లాలో 70 శాతానికి తగ్గింది. ఉన్నత వర్గాల వారు బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తూ ఫ్యూచర్ ఆస్తిగా భావిస్తున్నారు. భవిష్యత్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆభరణం కంటే.. పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోంది. సంప్రదాయాలపై ఉన్న మమకారం ఒకవైపు కొనసాగిస్తూనే ఆర్థిక లాభాలను దృష్టిలో బంగారం కొంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్లో పసిడి ఒక స్టేటస్ సింబల్ కంటే పెట్టుబడి భద్రతా, భరోసా కల్పించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఫ రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు ఫ రూ.1.24 లక్షలు దాటిన పది గ్రాముల ధర ఫ కొనలేనిస్థితిలో పేద, మధ్యతరగతి వర్గాలు ఫ పెళ్లిళ్లలో తగ్గుతున్న నగల ధగధగలు -
ఫ యాదాద్రిలో సీజే
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో హైకోర్టు సీజేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకుడు భువనగిరి శివారు మాసుకుంట వద్ద శనివారం యాదాద్రి జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పీఆర్సీ రిపోర్టును ప్రకటించాలి సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడం, ఎస్.సోమయ్య పాల్గొన్నారు. -
పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి నమ్మకం పెరిగేలా పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యాధునికమైన సాంకేతికత కలిగి ఉందన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. పోలీసులు నిత్యం ప్రజలతో ఉంటూ వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు ఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, రవి, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివశంకర్, రామకృష్ణారెడ్డి, చరమందరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలిసూర్యాపేటటౌన్ : మార్చి–2024 నుంచి రిటైరైన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.కోటయ్య, ప్రధాన కార్యదర్శి సుభాని కోరారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.బెనిఫిట్స్ అందని కారణంగా పిల్లల పెళ్లిళ్లు చెయ్యలేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉపేందర్, దశరథరామారావు, జ్ఞాన్సుందర్, లింగయ్య, సుధాకర్ పాల్గొన్నారు. జూమ్ మీట్కు జిల్లా రైతులునడిగూడెం : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పీఎం ధన్–ధాన్య కృషి యోజన పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు హైదరాబాద్లోని ఐసీఏఆర్–అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (అటారి) కేంద్రంలో ఏర్పాటు చేసిన జూమ్ మీట్కు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు హాజరయ్యారు. కార్యక్రమంలో అటారి డైరెక్టర్ మీరా, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.జేవీ ప్రసా ద్, కేవీకే ప్రతినిధి సంతోష్, రైతులు సోమిరెడ్డి వెంకట్రెడ్డి, సోమిరెడ్డి పెద వెంకటరెడ్డి, మంక్త్య, కోట్యా, సైదా, భిక్షం, సీనా పాల్గొన్నారు. -
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృ తాభిషేకం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టి కల్యాణం జరిపారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంగావించి మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల నుంచి వవ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నరసింహాచార్యులు, శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. -
కటకటాల్లోకి నాయక్
ఫ అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లు తీసుకుని మోసం చేసిన బాలాజీనాయక్ అరెస్టు ఫ డిపాజిట్ యాక్టు కింద కేసు నమోదు ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : అధిక వడ్డీ ఆశచూపి తన ఏజెంట్ల ద్వారా వందలాది మంది వద్ద రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన రమావత్ బాలాజీనాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ కేసు వివరాలు వెల్లడించారు. పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామం పలుగుతండాకు చెందిన రమావత్ బాలాజీనాయక్ 2020లో ఐస్క్రీమ్ పార్లర్ వ్యాపారం కోసం బంధువుల వద్ద రూ.5 లక్షలు రూ.2 వడ్డీతో అప్పుగా తీసుకుని వ్యాపారం చేసి నష్టపోయాడు. తర్వాత రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించి రూ.2 వడ్డీకి ఎక్కడా డబ్బులు దొరక్కపోవడంతో రూ.6 వడ్డీ ఇస్తానని ఆశచూపి అదే గ్రామానికి చెందిన పలువురి నుంచి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు వడ్డీకి తీసుకుని.. వారికి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు. కొంత మంది ఏజెంట్లను నియమించుకుని.. తండాలు, గ్రామాల్లో నూటికి రూ.10 వడ్డీ చెల్లిస్తానని డబ్బులు తీసుకుని వారికి ప్రామిసరి నోట్లు రాసిచ్చాడు. తీసుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఖరీదైన కార్లు, విల్లాలు కొని జనాలను నమ్మించాడు. నల్లగొండలో ఐటీ హబ్ తనదేనని, హైదరాబాద్లో వెంచర్లు చూపించి తనవేనని జనాలను నమ్మబలికాడు. 111 వైన్ షాపులకు టెండర్లు.. అప్పులు చేస్తూ రెండేళ్ల క్రితం జరిగిన వైన్స్ టెండర్లలో జిల్లాలో 111 షాపులకు టెండర్లు వేయగా.. ఒక్కషాపు మాత్రమే దక్కింది. డిపాజిట్ల కోసమే రూ.రెండున్నర కోట్లు ఖర్చు చేశాడు. స్టాక్ మార్కెట్లోనూ ఇంట్రా డే ట్రేడింగ్ (ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్)చేసి రూ.12.15 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆర్బీఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. మూడేళ్ల పాటు వడ్డీ ఇవ్వడంతో నమ్మిన జనం జనాల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్న బాలాజీనాయక్ వారికి మూడేళ్లకు పైగా వడ్డీ చెల్లించాడు. అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు.. మళ్లీ కొత్త వారి వద్ద అప్పులు చేశాడు. ఆరు నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వారు బాలాజీనాయక్ను నిలదీస్తుండడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో బాలాజీనాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు.. నిందితుడు బాలాజీనాయక్పై డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతని బంధువులు, బినామీల పేరున ఎలాంటి ఆస్తులు ఉన్నాయనేది విచారణ చేస్తామని వివరించారు. బాలాజీనాయక్ను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అతని సెల్ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. అతనికి 4 కార్లు ఉండగా.. ఒక పర్చునార్కారు, స్కార్పియో సీజ్ చేశామని, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, మిర్యాలగూడ, హయత్నగర్, నేరేడుచర్ల, పలు తండాల్లో ఇళ్లు, దామరచర్ల, వద్దిపట్లలో వ్యవసాయ భూములకు సంబంధించి రాసిచ్చిన ప్రామిసరి నోట్లు 36, 7 సెల్పోన్లు స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఎవరైనా.. ఎంత మొత్తం ఇచ్చారో.. ఆ వివరాలతో పీఏపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాటిని కోర్టుకు సమర్పిస్తామని, డబ్బులు ఇచ్చిన వారికి చట్టపరంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీలు రమేష్, మౌనిక పాల్గొన్నారు. బాలాజీపై 12 మంది ఫిర్యాదుపెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై శనివారం గుడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితులు ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. -
Telangana: చలాన్ రూల్స్ ఛేంజ్
సూర్యాపేట జిల్లా: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనానికి పోలీసులు చలాన్(జరిమానా) విధిస్తున్నారు. అయితే వీటిని చెల్లించడంలో వాహన దారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకపై అలా చేసేందుకు వీలు ఉండదు. కేంద్ర రవాణాశాఖ రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చలాన్ చెల్లించకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా పెండింగ్ పెడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.రోజుకు 200 కేసులుసూర్యాపేట జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు రోజుకు 200కు పైగానే నమోదవుతున్నాయి. హెల్మెట్ ధరించక పోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, వ్యతిరేక దిశలో వెళ్లడం, నో పార్కింగ్ ఏరియాలో వాహనం నిలపడం, అతి వేగంగా వెళ్లడం వంటి వాటిలో ట్రాఫిక్ పోలీసులు వాహనం ఫొటో తీసి చలాన్ విధిస్తున్నారు. వాహనానికి చలాన్ విధించిన విషయం వాహనదారుడి ఫోన్కు మొసేజ్ రూపంలో కూడా పంపిస్తున్నారు. ఈ చలాన్ను 30 రోజుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. కొందరు వెంటనే అప్రమత్తమై ఆన్లైన్లో చెల్లిస్తున్నా, చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇకపై చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది.పెండింగ్ ఉంటే కష్టమేచాలా మంది వాహనాలపై ఐదు నుంచి పది వరకు చలాన్లు పెండింగ్లో ఉంటున్నాయి. దొరికినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యం వహించడం వల్ల పెండింగ్ లిస్ట్ పెరుగుతూ పోతోంది. కానీ ఇక అది కుదరదు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్ను 45 రోజుల్లోపు చెల్లించాలి. 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉండి సదరు వాహనం పట్టుబడితే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయవచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే రవాణాశాఖ ఆ వాహనంపై లావాదేవీలకు అనుమతించక పోయే అవకాశం ఉంది.10 నెలల్లో 1.89 లక్షల కేసులుట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు రూల్స్ బ్రేక్ చేసే వాహనాన్ని ఫొటో తీసి చలాన్ విధిస్తున్నారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేస్తూ లైసెన్స్తో పాటు సరైన పత్రాలు లేని వాహనాలకు సైతం జరిమానా విధిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 1,89,889 కేసులు నమోదు చేశారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నంబర్ ప్లేట్లు, ఇతర వాహనాల నంబర్లను బిగించుకుంటున్నారు. దాంతో చలాన్లు వేసే సమయంలో అవి అసలైన వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగు తింటున్నారు. డూప్ల ఆట కట్టించేందుకు పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు సైతం చేపడుతున్నారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషే కం నిర్వహించారు. అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించొద్దుసూర్యాపేటటౌన్ : చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్కు ఇబ్బంది కల్గించవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పొట్టిశ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, వాణిజ్జ భవన్ సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై దుకాణాల ఏర్పాటును ఆయన పరిశీలించారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహించే వారిని దూరంగా జరిపి సర్దుబాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని, ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపవద్దన్నారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత తుంగతుర్తి: పరిసరాల పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అని సివిల్ జడ్జి ఎండీ. గౌస్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు యువత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 25 నుంచి ఐద్వా ఆలిండియా మహాసభలు సూర్యాపేట అర్బన్ : జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాదులో ఐద్వా 14వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రం కోసం ఐద్వా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర, సభ్యులు మేకనబోయిన సైదమ్మ, విజయలక్ష్మి, షేక్ ఖాజాబీ, ఇందిరాల త్రివేణి పాల్గొన్నారు. -
అన్నికేంద్రాలు ప్రారంభించాలి
భానుపురి (సూర్యాపేట) : సోమవారం నాటికి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణపై అధికారులతో సమావేశమై సమీక్షించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా కేంద్రాలు అవసరముంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ మోహన్బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్రెడ్డి, ఏపీడీ సురేష్, ఏడీఎం బెనర్జీ, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే దొడ్డు, సన్నరకం ధాన్యానికి వేర్వేరుగా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించారు. ఈ సీజన్లో రైతుల నుంచి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లయ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 4.82 లక్షల ఎకరాల్లో వరిసాగు వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4.82 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. దాంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా సివిల్ సప్లయ్శాఖ ముందస్తుగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోస పోకుండా ఉండేందుకు జిల్లాలో 298 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 168, పీఏసీఎస్ 132, ఇతరులు 36 చొప్పున సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండేలా, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యంలో తేమశాతం కారణంగా ఇబ్బందులు రాకుండా ప్రతి కేంద్రంలో డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్ష్యం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 10.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో సన్నరకం ధాన్యాన్ని రైతులు ఇంటి అవసరాలకు వాడుకుంటారు. దాంతో పాటు ఇతర ప్రైవేటు మార్కెట్లు, మిల్లులకు పోగా 2,36,289 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు 1,94,591 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం అమ్మకానికి రానుంది. ఈ ధాన్యం కొనుగోలుకు 1.07 కోట్ల గన్నీబ్యాగులు అవసరం కాగా ప్రస్తుతం జిల్లాలో 50 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని కేంద్రాలు ప్రారంభం నాటికి సమకూర్చనున్నారు. ఐకేపీ 168 పీఏసీఎస్ 132 ఇతరులు 36 మొత్తం 298ఫ 298 కేంద్రాల ఏర్పాటుకు అధికారుల కసరత్తు ఫ మూడురోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు ఫ చాలా మండలాల్లో ఇప్పటికే వరి కోతలు షురూ ఫ ఈ సీజన్ లక్ష్యం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు వానకాలం వరి సాగు : 4.82 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా : 10.30 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు వచ్చేది : 4,30,880 మెట్రిక్ టన్నులు సన్నరకం : 2,36,289 మెట్రిక్ టన్నులు దొడ్డురకం : 1,94,591 మెట్రిక్ టన్నులు -
గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి
మోతె : గ్రామస్థాయిలో బీజేపీని బలోపితం చేయాలని పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సిరికొండ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీతోనే గ్రామాలు అభవృద్ధి చెందుతాయన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన పలువురు కార్యకర్తలకు ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొల్లిశెట్టి కృష్ణయ్య, కనగాల నారాయణ, మన్మధరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శంకర్నాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి -
బాలికలు చదువులో రాణించాలి
చివ్వెంల : బాలికలు చదువులో రాణించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్కౌసర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం చేసిన చట్టాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. వెంకటరమణ, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్కౌసర్ -
42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం
సూర్యాపేటటౌన్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతమని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని విద్యాసంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అధికారిక లెక్కల ప్రకారం 56 శాతా నికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించకుండా తాత్కాలిక జీఓల ద్వారా కాలయాపన చేయడం దారుణమన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు మడిపల్లి సాయితేజ, అంజి, సుమన్, ఏర్పుల రవి, సాయి, లోకేశ్, రఘు, ఉమేశ్, వేణు, పవణ్సాయి పాల్గొన్నారు. -
అమెరికా సుంకాలపై నోరు మెదపని మోదీ
సూర్యాపేట అర్బన్ : భారత్పై అమెరికా 50శాతం సుంకాలు పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. భారత్పై అమెరికా సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే నెపంతో అమెరికా మన దేశంపై అధిక సుంకాలు విధించి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు. పాకిస్థాన్–భారత్ మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించినా ప్రధాని మోదీ కనీసం మాట్లాడక పోవడం దారుణమన్నారు. అమెరికా విధించిన సుంకాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కోట గోపి, చెరుకు ఏకలక్షి్, మేకనబోయిన శేఖర్, ధనియాకుల శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున్రెడ్డి -
గరిష్టస్థాయి వద్ద నిలకడగా సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్: సాగర్ జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 83,775 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 34,063 క్యూసెక్కులు మొత్తం 66,463 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలకు 17,317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు నీటిని నిలిపివేశారు. సాగర్ జలాశయం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టమైన 590 అడుగులు (312.0450 టీఎంసీల) వద్ద నిలకడగా ఉంది. -
పత్తి రైతులకు ప్రత్యేక యాప్
నాగారం : పత్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీకపాస్ కిసాన్శ్రీ యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారానే పత్తి విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టింది. పత్తి సాగు చేసిన రైతులు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇక పత్తి రైతులు చేలల్లో పని చేయడమే కాకుండా ఫోన్లో వివరాలు నమోదు చేయడం కూడా నేర్చుకోవాల్సిందే. యాప్లోనే వివరాలుపత్తి సాగు చేసిన రైతులు తమ వివరాలను కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు?, ఎప్పుడు? ఎంత సరకు? ఏ మార్కెట్? ఏ జిన్నింగ్ మిల్కు తెస్తున్నారు? వంటి విషయాలు కూడా పొందుపర్చాలి. పాస్ పుస్తకం వివరాలు, బ్యాంకు ఖాతాను కూడా అందులో యాడ్ చేయాలి. ఈ వివరాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేస్తుంది. లేని పక్షంలో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదు రయ్యే అవకాశం ఉంటుంది. నిబంధనలు పాటించాలిరైతులు తమ పత్తితో 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి. పొడువాటి దూది ఉంటే క్వింటాకు రూ.8,110, మధ్యస్థంగా ఉంటే రూ.7,100 కనీస మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో వానకాలంలో 90వేల ఎకరాల్లో పత్తి సాగైంది. యాప్ డౌన్లోడ్ ఇలా..రైతులు మొదట ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన ఫోన్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని అందులో ఎంటర్ చేయాలి. తర్వాత చేంజ్ ప్రొఫైల్, రిజిస్టర్ డిటెయిల్స్, బుక్ స్లాట్, భూమి నమోదు, స్లాట్, సేల్స్ వంటి సమాచారం పొందుపర్చాలి. పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తే వారి వివరాలనూ ఇందులో నమోదు చేయాలి.అవగాహన లేక ఇబ్బందులుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్పై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వారు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. దాంతో రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ టెక్నాలజీపై అవగాహన లేక అత్యధిక రైతులు అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. కపాస్ కిసాన్ ద్వారానే పత్తి విక్రయాలు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులకు ఇబ్బందులు -
నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం నిత్యారాధనలో భాగంగా నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజ వాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం
సాగర తీరంలోని బండలక్వారీ వద్ద మూడేళ్ల క్రితం మొదలైన నెల్లికల్లు ఎత్తిపోతల పనులు ముమ్మరమయ్యాయి. - IIలోయూరియా కోసం ఉదయం నుంచే క్యూఅర్వపల్లి: యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నరు. గురువారం అర్వపల్లిలోని మనగ్రోమోర్ ఎదుట రైతులు తెల్ల వారు జాము నుంచే క్యూ కట్టారు. పొద్దుగాల నుంచి వరుసలో నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్, చెప్పులు, ఇతర సామగ్రి పెట్టారు. మనగ్రోమోర్లో 250 బస్తాల యూరియా ఉండగా కొంతమంది రైతులకే అందింది. యూరియా దొరకని వారు వెనుదిరిగారు. -
93 షాపులకు 38 దరఖాస్తులే..
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 93 మద్యం షాపులకు ఇప్పటి వరకు వచ్చింది 38 దరఖాస్తులే.. దీనిని బట్టి వైన్స్ షాపుల టెండర్ ప్రక్రియ ఎంత మందకొడిగా సాగుతుందో తెలిసి పోతుంది. రెండేళ్ల పాటు మద్యం షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తూ సెప్టెంబర్ 26న ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వచ్చి 14 రోజులు అవుతున్నా దరఖాస్తు దారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి తొమ్మిది రోజుల్లోనే దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చింది 38 దరఖాస్తులేజిల్లాలో 93 వైన్స్ షాపులు ఉన్నాయి. వాటిని రెండేళ్ల పాటు నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ఎకై ్సజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే టెండరు దారులు రూ. 3లక్షల డిపాజిట్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో గురువారం నాటికి 38 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 4,338 దరఖాస్తులు వచ్చాయి. డిపాజిట్ పెరగడంతో వెనుకంజగతంలో మద్యం టెండర్ల దరఖాస్తుకు రూ. 2 లక్షల డిపాజిట్ ఉండేది. ఈ సారి దానిని రూ. 3 లక్షలకు పెంచారు. ఈ డిపాజిట్ నాట్ రిఫండబుల్గా ఉండడంతో దరఖాస్తు దారులు కాస్త సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపునకు దరఖాస్తు చేసేందుకు రూ.3 లక్షలు చెల్లించాలి. ఒక వేళ షాపు రాకపోతే సదరు డబ్బులపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే దరఖాస్తు దారులు కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి టెండర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దాంతో దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.చివరి మూడు రోజులే కీలకం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు కూడా వ్యాపారులను మోటివేట్ చేస్తున్నారు. చివరి 3 రోజులు దరఖాస్తులు సమర్పించేందుకు మంచి రోజులు ఉన్నాయని, ఆ రోజుల్లో దరఖాస్తు చేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. వాస్తవంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తే డిపాజిట్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ డిపాజిట్ ఏకంగా రూ. 3లక్షలకు పెంచడంతో చాలా మంది ఆలోచనలో పడ్డట్లు తెలిసింది. వాస్తవానికి వైన్స్ షాపులు నడపాలనుకున్న వ్యాపారులు కచ్చితంగా దరఖాస్తు చేసుకుంటారు. కానీ కొందరు లక్కీగా తమకు షాపు దక్కితే కొంత ఎక్కువకు అమ్ముకుందామనే వారు వెనుకడుగు వేస్తున్నారు. ఒక వేళ షాపు రాకపోతే రూ. 3 లక్షలు కోల్పోవాల్సి వస్తుందన్న ధోరణిలో వారు ఆలోచిస్తున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి టెండరు దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే షాపు రాక పోయినా పెద్దగా నష్టం ఉండదన్న భావనలో ఉన్నట్లు తెలిసింది.మందకొడిగా మద్యం టెండర్లు నోటిఫికేషన్ వచ్చి 14 రోజులవుతున్నా ముందుకురాని దరఖాస్తుదారులు పెరిగిన డిపాజిట్తో అనాసక్తి ఇక మిగిలింది తొమ్మిది రోజులే..దరఖాస్తులు ఇలా..ఎకై ్సజ్ సర్కిల్ వచ్చిన దరఖాస్తులుసూర్యాపేట 13తుంగతుర్తి 11కోదాడ 11హుజూర్నగర్ 03 -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
హుజూర్నగర్ : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం హుజూర్నగర్లో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకటో తారీఖున వేతనాలు పడడం తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. హెల్త్ కార్డులు, పెండింగ్ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు విప్పడం లేదన్నారు. ఎంతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే నిరాశ తప్ప మరొకటి లేదన్నారు. ఇటీవల జేఏసీ పునరుద్ధరణ జరిగినప్పటికీ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాలకు కార్యవర్గాలు ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి వరకు జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్. సుదర్శన్రెడ్డి, రాంబాబు, సంఘ నాయకులు హమీద్ఖాన్, వీరారెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, అంకతి అప్పయ్య, మొహినుద్దీన్, రఘు, జూలకంటి నర్సిరెడ్డి, చంద్రశేఖర్, ధర్మూరి వెంకటేశ్వర్లు, ఎంఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య -
విద్యార్థులకు కామెర్లపై డీఎంహెచ్ఓ ఆరా
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఆరెంజ్ పాఠశాల విద్యార్థలు కామెర్ల వ్యాధి బారిన పడుతున్న విషయమై డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ ఆరా తీశారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వాటర్ ప్లాంట్ను పరిశీలించి నీటి నమూనాలు సేకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా పాఠశాలలో చదువుతున్న 25 మంది విద్యార్థులు జ్వరంతో పాటు కామెర్లతో బాధపడుతుండడంతో వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. కామెర్ల వ్యాధి లక్షణాలు కనిపించిన విద్యార్థులు 15 నుంచి 28 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, డాక్టర్ శ్రీశైలం, సతీశ్, మాస్మీడియా అధికారి సంజీవరెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ సీతామహలక్ష్మి పాల్గొన్నారు. మేళ్లచెరువులో ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేసిన అధికారి తాగునీటి నమూనాల సేకరణ -
చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి
నూతనకల్ : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని సకాలంలో గుర్తించి దాని నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో పోషణ మాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకుంటే మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీవాణి, అసిస్టెంట్ సీడీపీఓ సాయిగీత, మండల వైద్యాధికారి లిఖిత్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజులత, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. , ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు -
నల్లగొండ ఉర్సుకు వేళాయే..
ఫ మూడు రోజులపాటు ఉత్సవాలు ఫ నేడు గంధం ఊరేగింపు రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉర్సు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం స్థానిక మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపుతో ఉర్సు ప్రారంభమవుతుంది. 10న దీపాలంకరణ, 11న ఖవ్వాలితో ఉర్సు మురుస్తుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. -
10న వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2025–26 విద్యాసంవత్సరంలో భాగంగా ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, 17 బాల, బాలికలకు ఈనెల 10వ తేదీన వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి డి.విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా పాఠశాలల్లో వెయిట్ లిఫ్టింగ్పై ఆసక్తి ఉన్న విద్యార్థులను పంపించాలని కోరారు. ఈ సెలక్షన్ పోటీలు నల్లగొండ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పైఅంతస్తులో నిర్వహిస్తామని, 2009 తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్కార్డు తీసుకురావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9703269840 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్యకల్యాణతంతును పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు , లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. సాగర్కు తగ్గిన వరద నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్కు ఎగువనుంచి వరద తగ్గింది. దీంతో మంగళవారం తెరిచిన 22 క్రస్ట్గేట్లలో 18 గేట్లు మూసి వేశారు. ఆరుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 1,00,409 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా ఆరు రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి 48,414 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,333 క్యూసెక్కులు.. మొత్తం 81,747 క్యూసెక్కులు దిగువ కృష్ణానదిలోకి వదులుతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండుగలకు స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమైనా బ్లూ లింక్స్ వచ్చినా, మెసేజ్ లు వచ్చినా వాటిని అనుసరించవద్దు. అపరిచితులు డబ్బులు అడిగితే స్పందించవద్దు. వాట్సాప్లో వచ్చే ఏపీకే ఫైల్స్, ఇతర బ్లూ లింక్స్ అనవసరంగా క్లిక్ చేయొద్దు. మీరు సైబర్ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలి. అలాగే సైబర్ క్రైం వెబ్ సైట్కు ఫిర్యాదు చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. – కె.నరసింహ, ఎస్పీ -
పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలి
అర్వపల్లి: చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం అర్వపల్లి పీహెచ్సీ, జాజిరెడ్డిగూడెం పల్లెదవాఖానాను ఆయన తనఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గర్భిణులు, పిల్లలకు టీకాలు వేయాలని, సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేశ్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, డాక్టర్ ఉదయ్, నర్సింగ్ అధికారులు సునీత, మాధవి సిబ్బంది పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ -
ఎడమ కాల్వ గండ్లకు మరమ్మతులు చేయిస్తాం
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని యాతవాకిల్ల వద్ద గల వేములూరు ప్రాజెక్టు ఎడమ కాల్వకు పడిన గండ్లకు యుద్ధ ప్రాతి పదికన మరమ్మతులు చేయిస్తామని నీటి పారుదల శాఖ ఈఈ అశోక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలోని వరదాపురం, మంచ్యాతండా గ్రామాల వద్ద ఎడమ కాల్వకు గండ్లు పడటంతో సాగునీరంతా వృథాగా వెళ్లిపోతుండటంతో ఆయాగ్రామాల రైతులు, నాయకులు చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఈఈతో పాటు అధికారులు ఆ గండ్లను పరిశీలించి కొలతలు తీయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పంటలకు సక్రమంగా సాగునీరందేలా చూస్తామన్నారు. ఈకార్యక్రమంలో డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్, నాయకులు, రైతులు మాళోతు బాబునాయక్, నాగేశ్వరరావు, కిషన్నాయక్ , కోట్యా నాయక్, లష్కర్ కోటాలు తదితరులు ఉన్నారు. -
చివరిగింజ వరకు ధాన్యం సేకరించాలి
భానుపురి (సూర్యాపేట) : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో వానాకాలం 2025–26 సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్పీఓ, మెప్మా శాఖలకు చెందిన కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 158, పీఏసీఎస్ 122, ఎఫ్పీఓ 15, మెప్మా 13 ఇలా మొత్తం 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతంలో ఉండకుండా ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో వేయింగ్ మిషన్, విద్యుత్, తాగునీరు, ఫ్లెక్సీపై నిర్వాహకుల పేరు ఫోన్ నంబర్, టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు, డ్రయ్యర్లు, ట్యాబ్ లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు గడ్డి, తాలు, దుమ్ము లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. మండలాల వారీగా షెడ్యూల్ తయారుచేసి ఎం ఎల్ ఎస్ పాయింట్ నుంచి కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, డీసీఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
ఇటీవల కోదాడకు చెందిన రిటైర్డ్ డాక్టర్కు డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ పేరుపై ఫేక్ సిమ్స్, ఆధార్ కార్డులు ఓపెన్ అయి మనీ లాండరింగ్ అయిందని భయపెట్టారు. మీకు ఇల్లీగల్ ట్రాన్జాక్షన్ అవుతున్నాయని, మేము చెప్పినట్టు చేస్తే సేఫ్లో ఉంటారని ఆ రిటైర్డ్ డాక్టర్ను భయపెట్టేవిధంగా మాట్లాడారు. మీరు కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే సేఫ్లో ఉంటారని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన సదరు రిటైర్డ్ డాక్టర్ తనకున్న నాలుగు బ్యాంక్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లకు రూ.1.08లక్షలు డిపాజిట్ చేశారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి జిల్లా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా సైబర్ కేటుగాళ్ల వలలో పడి చాలా మోసపోతున్నారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఓ వ్యాపారవేత్తకు ఇటీవల వాట్సాప్కు ఫినాల్టో డాట్ ఇండస్ అనే కంపెనీ పేరుతో మెసేజ్ వచ్చింది. ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పారు. దీంతో అతను మొదట రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.15వేలు వచ్చాయి. ఆ తర్వాత రూ.30వేలు ఇన్వెస్ట్ చేస్తే దీనికి డబుల్ వచ్చింది. ఇలా డబుల్ అమౌంట్ వస్తుండటంతో ఒకేసారి రూ.కోటి ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఆ డబ్బులు తిరిగి రాక షాక్కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంత అమౌంట్ సైతం హోల్డ్లో పెట్టినట్టు చెబుతున్నారు. ఫ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుతున్న వందల మంది బాధితులు ఫ ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే రూ.8.81కోట్లు కాజేసిన నేరగాళ్లు ఫ ఇప్పటి వరకు 614 సైబర్ క్రైం కేసులు నమోదు ఫ అనవసరమైన లింక్లు క్లిక్ చెయ్యొద్దంటున్న పోలీసులు -
వందశాతం ఉత్తీర్ణతే పరమావధి
నాగారం : పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సెప్టెంబర్–1 నుంచి జిల్లా పరిషత్, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. డిసెంబర్ నెలాఖరు వరకు సాయంత్రం వేళ, ఆ తర్వాత 2026 జనవరి–1వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. నిర్వహణ ఇలా... ఈ ఏడాది జిల్లాలో 5,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతి నిర్వహించడం, ముఖ్యమైన అంశాలను చదివించడం, విద్యార్థులు వెనుకబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు31వ తేదీ వరకు సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు ప్రతిరోజు ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అలాగే జనవరి–1 నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు చేపట్టనున్నారు. విద్యారులు తప్పనిసరి హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తూ..... వారి ప్రగతి పై చర్చించాలి. హెచ్ఎంలు పర్యవేక్షిస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆయా సామర్థ్యాల ఆధారంగా లఘు పరీక్షలు పెట్టాలి. విద్యార్థుల జవాబు లను పరిశీలించి చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉత్తమ ఫలితాల సాధన దిశగా ప్రేరణ కల్పిస్తున్నారు. వచ్చే జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి వారం ఒక్కో పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించి ప్రతిభను అంచనా వేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. గతేడాది ఉత్తీర్ణత... 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 96.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. ఈసారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫ కొనసాగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులు ఫ డిసెంబర్ వరకు సాయంత్రం వేళ ఫ జనవరి నుంచి రెండు పూటలా... ఫ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. ఎస్సీఈ ఆర్టీ రూపొందించిన అభ్యాస దీపికలతో విద్యార్థులను సన్నద్ధం చేయిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు అవసరమైతే ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. పదోతరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలి. ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలి. పర్యవేక్షణ అధికారులతో సలహాలు, సూచనలు సేకరించాలి. సబ్జెక్టు టీచర్లు సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు శ్రమించాలి. –అశోక్, డీఈఓ, సూర్యాపేట. జెడ్పీ ఉన్నత పాఠశాలలు 182కేజీబీవీలు 18ఆదర్శ పాఠశాలలు 09పదవ తరగతి విద్యార్థుల సంఖ్య 5,345 -
తక్కువ ధరకు అమ్ముకున్నాం
ప్రభుత్వం వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలు లేకపోవడంతో వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. ఈ వానాకాలం నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తే 5క్వింటాళ్ల పత్తి తీశాం. వరంగల్కు వెళ్లి అమ్మితే కేవలం క్వింటాకు రూ.5200 ధర పడింది. పత్తిని సాగు చేస్తే ఏం లాభం లేకుండా పోతోంది. పెట్టుబడులు రావడం లేదు. – చిత్తలూరి నాగరాజు, రైతు, ఆత్మకూర్ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో 6 సీసీఐ కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు తొండరపడి దళారులు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించొద్దు. మరో 15, 20 రోజుల్లో కేంద్రాల ఏర్పాటుకు అవకాశముంది. – సంతోష్కుమార్, మార్కెటింగ్ అధికారి -
నేరాల నిరోధానికి పటిష్ట ప్రణాళిక
హుజూర్నగర్ : నేరాల నిరోధానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్తో పాటు సీఐ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు వేగంగా పోలీసు సేవలు అందిస్తే ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కోర్టు విధులను పటిష్టంగా నిర్వహిస్తూ కేసుల్లో ఎక్కువ శిక్షలు పడేలా పోలీస్ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. సైబర్ మోసాలు జరగకుండా ప్రజలను చైతన్యంచేయాలని, రోడ్డు ప్రమాదాల వల్ల ఎవరూ మరణించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హుజూర్నగర్ను సేఫ్ టౌన్ ప్రాజెక్టుగా తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా సర్కిల్ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సర్కిల్ పరిధిలోగల హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి 50 కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళిక చేశామన్నారు. దీని ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, నేరాలు నిరోధించడం సులువు అవుతుందన్నారు. స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. సిబ్బంది కవాతు, యూనిఫామ్, పోలీస్ పరికరాలను, పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరి బాబు, సీఐ చరమందరాజు, ఎస్ఐలు మోహన్ బాబు, రవీందర్, నరేష్, బాబు, కోటేష్, ఆర్ఎస్ఐ అశోక్, డీసీఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్, సీసీ సందీప్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
నేరేడుచర్ల : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(పీఆర్టీయూ టీఎస్) సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నేరేడుచర్లకు చెందిన ఉపాధ్యాయుడు కొణతం వెంకట్రెడ్డిని నియమించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ(టీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పులగం దామోదర్రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తంగేళ్ల జితేందర్రెడ్డి, తీగల నరేష్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగల ఎల్లయ్య, మేకల రాజశేఖర్, గోదేశి దయాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యూసుఫ్, పాలకవీడు మండల అధ్యక్ష,. కార్యదర్శులు కొండా బాలకృష్ణ, గంధం ధర్మరాజు, మండల అసోసియేట్ అధ్యక్షులు అంజయ్య, మొహమ్మద్ జహీర్ఖాన్, ప్రగడ శేఖర్, నాగశంకర్, రాజేష్, శ్రీనివాస్, కొండయ్య, నాగరాజు, రమేష్, నారాయణరెడ్డి, కిరణ్కుమార్, తిరుపతయ్య, సూర్యం, బ్రహ్మానందం తదితరులు కొణతం వెంకట్రెడ్డిని అభినందించి హర్షం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు పెన్పహాడ్ : వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని, సకాలంలో హాజరుకావాలని డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధుల గుర్తింపును వేగవంతం చేయాలని కోరారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, మాతాశిశు సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద ఎంఎల్హెచ్పీలు రోజుకు 30 నుంచి 35మంది వరకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సిన్తో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈసమావేశంలో మండల వైద్యాధికారి రాజేష్, హెచ్ఈఓ వెంకన్న, సూపర్వైజర్లు వెంకయ్య, పూలమ్మ, అన్ని గ్రామాల హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మూసీ నాలుగు గేట్లు ఎత్తివేత కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. మంగళవారం ఈ ప్రాజెక్టులోకి 5,854 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 532 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజ్, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 49 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రం వరకు 644.05 అడుగులు (4.21 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అధ్యాపకులకు శిక్షణనల్లగొండ టూటౌన్ : ప్రతివిద్యార్థి సబ్జెక్టులో మెరుగైన అభ్యసనాన్ని, సాంకేతికంగా మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని ఎంజీయూ గణితశాస్త్ర విభాగం అధ్యాపకురాలు హైమావతి వివరించారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ అధ్యాపకులకు అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్పై శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రోగ్రాం, కోర్స్ లక్ష్యాల ఆధారంగా మూల్యాంకన విధానాన్ని అధ్యాపకులకు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువల రవి, మిర్యాల రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రెడ్డి జాగృతి నాయకుడు మాధవరెడ్డి వేసిన పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు మంగళవారం సూర్యాపేట పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం కల్పించే 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటే బీసీలమంతా ఏకమై తరిమికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు భూపతి నారాయణ గౌడ్, దాసరి వెంకన్న యాదవ్, నాయకులు శ్రీకాంత్, సంపత్ నాయుడు, సుదర్శన్, శ్రీనివాస్, విజయ్ కృష్ణ, దశరథ, రమేష్, వాసుదేవ్, నాగేందర్, రామచంద్ర యాదవ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నరేష్, జానకి రాముడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీపుర్లతో ఊడ్చారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యాధుల కాలం కాబట్టి ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, అనారోగ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చెత్త చెదారాన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లలో పడవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నగూరి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, ఏజీపీ షఫీఉల్లా, పోలీసులు పాల్గొన్నారు. ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో జైలు అధికారుల ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెను వివరాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలు, ఖైదీల గదులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు గుంటూరు మధు, కట్టా సుధాకర్ , జైలు సిబ్బంది పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
పొరపాట్లకు తావివ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా నామినేషన్ల సందర్భంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొదటి విడత సూర్యాపేట డివిజన్లోని 11 మండలాల్లో 112 ఎంపీటీసీ స్థానాలు, రెండో విడత కోదాడ, హుజూర్నగర్ డివిజన్లలోని 12 మండలాల్లో 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడతన అక్టోబర్ 9న, రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ ట్రైనర్ రమేష్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియపై పూర్తిస్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్.. నామినేషన్ల స్వీకరణ, నోటిఫికేషన్ జారీలో ఎలాంటి తప్పులు, కొట్టివేతలు, దిద్దిబాట్లు ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం 9వ తేదీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు, ఓటరు జాబితా సైతం ప్రచురించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని మండలాల ఆర్ఓలు, సహాయ రిటర్నింగ్ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, స్వీకరించాల్సిన ధ్రువపత్రాలు ఇతర అన్ని అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎఫ్ఓ సతీష్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
లింగ నిర్ధారణ చేస్తున్న నలుగురు అరెస్ట్
సూర్యాపేటటౌన్ : గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అబార్షన్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన ఆర్ఎంపీ నేరంటి ప్రవీణ్, నకిరేకల్కు చెందిన ల్యాబ్ టెక్నిషన్లు అమరావది కరుణాకర్, షేక్ వసీమ్, సీతారాంపురానికి చెందిన ఆర్ఎంపీ మనుబోలు రాంబాబు ఎలాంటి అర్హతలు లేకున్నా ఆర్ఎంపీ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. తమ దగ్గరకు వచ్చే గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.వేలకు వేలు దండుకుంటున్నారు. పరీక్షకు రూ.12వేలు కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు అయితే పిండాన్ని తొలగించేందుకు రూ.50వేలు తీసుకొని టాబ్లెట్ల ద్వారా గర్భస్రావం చేస్తున్నారు. నలుగురు కలిసి ఆల్ట్రాసౌండ్ మెషిన్ కొనుగోలు చేసి సీతారాంపురంలోని నేరంటి ప్రవీణ్ ఇంటి వద్దే పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. రాజీవ్నగర్ యూపీహెచ్సీ డాక్టర్ హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురి వ్యక్తులను పట్టుకుని వారి నుంచి ఒక ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఎలాంటి అర్హతలు లేకున్నా ఆర్ఎంపీలుగా చలామణి సీతారాంపురంలో పరీక్షలు చేస్తుండగా పట్టుకున్న పోలీసులు -
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేక చేసి, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత జోడుసేవోత్సవం తదితర పూజలు చేపట్టారు. -
‘సీఎంఆర్ఎఫ్’ నిందితుల అరెస్ట్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులు ఇన్ఫ్లో : 54,427 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 54,427 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,211 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,040 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 9,076 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు వరద కాల్వకు : 300 క్యూసెక్కులు- 8లోశాస్త్రోక్తంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృ తాభిషేకం గావించి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశరుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్ల కనీస వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కామళ్ల నవీన్, గంటా నాగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లకు (కేజీబీవీ, మిషన్ భగీరథ, అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్, గ్రామ పంచాయతీ) అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సామ నర్సిరెడ్డి, సీహెచ్.అంజయ్య, యాదగిరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ హితానికి ఎకో క్లబ్లు
నాగారం : మొక్కలే సకల జీవులకు జీవనాధారం.. మొక్కలు నాటి సంరక్షిస్తేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటే జీవుల మనుగడ సాఫీగా సాగుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించి వారిచేత మొక్కలు నాటించాలని విద్యాశాఖ భావించి పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి విద్యాశాఖ అధికారులు సర్కారు బడుల్లో ఒక్కో తరగతి నుంచి నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపికచేసి పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ క్లబ్లు (ఎకో క్లబ్లు) ఏర్పాటు చేశారు. ఇందులో అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ఈ క్లబ్లను ఈ విద్యా సంవత్సరం నుంచే ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్గా పేరు మార్చారు. వీటిద్వారా పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు. ఎకో క్లబ్ల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తూ భావితరాలకు పాఠం నేర్పనున్నారు. ప్రధాన లక్ష్యం ఇదీ..ఈ క్లబ్ల ద్వారా జీవ వైవిధ్యం, పర్యావరణం–వనరుల పునర్వినియోగం, మొక్కలు పెంచి వనాలు సృష్టించడం, పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం వంటి అంశాలపై కార్యక్రమాలు చేపట్టడం ప్రధాన లక్ష్యం. అందుకు సంబంధించిన కార్యాచరణ ఫొటోలు, వీడియోలు వైబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, పాఠశాలల యాజ మాన్య కమిటీ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటిని, విద్యుత్ను పొదుపుగా వాడుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. అమ్మ పేరుతో మొక్క..ప్రతి పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ప్లాస్టిక్ నిషేధం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం, వ్యర్థాలు, ఈ–వ్యర్థాలు తగ్గించేలా విద్యార్థులను, ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతున్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో ప్రతి విద్యార్థి వారి తల్లులతో కలిసి మొక్కలు నాటడం. లేదా అమ్మ పేరుతో మొక్క నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఆయా తేదీల్లో వచ్చే పర్యావరణ, ధరిత్రి, జల, ఓజోన్ దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారిని పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దడంలో ఎకో క్లబ్లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి.950 ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు సభ్యులుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఏడాది ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్గా పేరు మార్పు పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు -
1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను సోమవారం పెంచారు. వారబందీ విధానంలో గత వారం 1,429 క్యూసెక్కుల నీటిని వదలగా ప్రస్తుతం 1,613 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69, 70, 71 డీబీఎంలకు పంపిణీ చేస్తున్నారు. గతనెల 8వ తేదీ నుంచి వానాకాలం సీజన్కు సంబంధించి వారబందీ విధానంలో జిల్లాకు నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికసూర్యాపేట : తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేట పట్టణంలో సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడుగుంట్ల విద్యాసాగర్, కార్యదర్శిగా గజ్జల కృష్ణారెడ్డి, కోశాధికారిగా బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా స్వామి బుచ్చయ్య, కొక్కుల మోహన్రావు, దండా వెంకట్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంపటి పురుషోత్తం, మద్ది ఉపేందర్రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఈదుల శంకరయ్య, తంగెళ్ల రంగారెడ్డి, దాచేపల్లి సుజాత, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా నాగిరెడ్డి విజయమ్మ, ఉప్పల గోపాలకృష్ణయ్య, గుండా వెంకన్న, మొరిశెట్టి యోగి, కాసర్ల సురేందర్రెడ్డి, తాళ్లపల్లి రామయ్య, ఆకారపు ఉపేందర్, గజ్జల ధర్మారెడ్డి, పసుపర్తి కృష్ణమూర్తి, గుండా భిక్షపతి, కొండ్లె రంగయ్య ఎన్నికయ్యారు. నూతన కార్యకర్గంతో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా సలహాదారులు కర్నాటి కిషన్ దాండ్గే సుభాష్, ఆరె రామకష్ణారెడ్డి, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. 56 సర్పంచ్ స్థానాల్లో పోటీసూర్యాపేట అర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 9 జెడ్పీటీసీ, 56 సర్పంచ్, 59 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో ఉంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి బలమున్న చోట్లలో సొంతంగా పోటీ చేసి మతోన్మాద బీజేపీని ఓడిస్తామన్నారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. మూసీకి పెరిగిన వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం 2,248 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 8,761 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను పైకెత్తి 7,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 533 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644.15 అడుగుల(గరిష్ట నీటిమట్టం 645 అడుగుల) వద్ద స్థిరంగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
వీడని యూరియా కషా్టలు
నేరేడుచర్ల : నాన్ ఆయకట్టులో వరికోతలు, పత్తి ఏరడం మొదలైనా ఆయకట్టు ప్రాంత రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. సోమవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి (పీఏసీఎస్ కార్యాలయానికి) 444 బస్తాల యూరియా లోడు రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి జావిద్ ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. క్యూలో కూర్చొని పడిగాపులుమఠంపల్లి: మఠంపల్లి పీఏసీఎస్ గోదాముకు సోమవారం 20 టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు వందలాదిగా తరలివచ్చి బారులుదీరారు. ఈ క్రమంలో కొందరు రైతులు నిలబడలేక లైన్లో కూర్చున్నారు. సుమారు 200మంది రైతులకు రెండు బస్తాల చొప్పున అధికారులు యూరియా అందజేశారు. యూరియా అందని సుమారు 300 మంది వరకు రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈఓ తిరుపతయ్య మాట్లాడుతూ యూరియా రాగానే వెంటనే రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. -
పోటీకి ఎవరు మేటి?
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. షెడ్యూల్ వెలువడిందో.. లేదో ఆయా స్థానాల్లో ఎవరూ పోటీ చేస్తే బాగుంటుందనే విషయమై ముఖ్య నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎవరెవరు పోటీలో ఉంటారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్న వారెవరో ఆయా పార్టీల మండల అధ్యక్షులు వివరాలు సేకరించి జిల్లా ముఖ్యనేతలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పార్టీల ముఖ్య నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సహా ఎన్నికల్లో ఎలా ఓటర్ల వద్దకు వెళ్లాలనే విషయమై రహస్య సమావేశాలు నిర్వహించడమేగాక పలు సూచనలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను వీలైనంత త్వరగా ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పడ్డాయి. నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి సంబంధించి ఆశావహులతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రతి జెడ్పీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మండలానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలని అధిష్టానం జిల్లా ముఖ్యనేతలను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేస్తే జెడ్పీ పీఠం సులువుగా దక్కుతుందన్న అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో లబ్ధి పొందాలని చూస్తోంది. యూరియా సరఫరా, ఎస్సారెస్పీ నీటిని జిల్లాకు అందించే విషయాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేలా ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా బీజేపీ చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు ఉండగా.. బీసీల రిజర్వేషన్ శాతం పెరిగింది. ఈ క్రమంలో బీసీలకు గణనీయంగా స్థానాలు పెరిగి.. జనరల్ స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. తదనంతరం సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఆయా స్థానాల కోసం కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు. ఫ అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీల తీవ్ర కసరత్తు ఫ జెడ్పీటీసీ స్థానాలపై కన్ను ఫ ముగ్గురు ఆశావహులతో జాబితా తయారు చేస్తున్న కాంగ్రెస్ ఫ పార్టీ మండలాల అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ -
ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కబడ్డీ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలుకోదాడ: ప్రతిభ గల కబడ్డీ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని, దానికి నిదర్శనమే ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తృతీయస్థానం సాధించడమేనని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జట్టు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎండీ మహబూబ్జాని మాట్లాడుతూ.. కోదాడను కబడ్డీ క్రీడకు కేరాఫ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈదుల కృష్ణయ్య, జానకిరాంరెడ్డి, పంది కళ్యాణ్, జూలూరు వీరభద్రం, సైదులు, చలిగంటి రామారావుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. మట్టపల్లిలో వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ కు పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం జరిపించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టుకు 2,248 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గింది. మూసీ రిజర్వాయర్కు పదిహేను రోజుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పైగా వచ్చిన ఇన్ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తిన అధికారులు 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రం వరకు 643.80 అడుగుల(4.15 టీఎంసీలు)వద్ద నీరుంది. -
వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం
సూర్యాపేట అర్బన్: వీధి వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇదివరకు పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు అందించగా.. గత పది నెలలుగా ఆ పథకం నిలిచిపోయింది. దాని స్థానంలో తాజాగా లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు మహిళా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే కొంతమంది వీధి వ్యాపారులకు ఒకటి, రెండు విడతలుగా రుణాలు అందించగా.. ప్రస్తుతం మూడో విడత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రుణ సదుపాయం పెంపు ఐదేళ్ల కిందట వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించారు. వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు గురికాకుండా బ్యాంకుల ద్వారా నేరుగా స్వల్ప కాలిక రుణాలు అందజేశారు. వందల సంఖ్యలో మహిళా సంఘం సభ్యులు తీసుకొని చెల్లించడంతో ఎక్కువ మొత్తం రుణం పొందడానికి అర్హత సాధించారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు కూడా రుణాలు పొందే అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.10వేలు అందించారు. ఇప్పుడు లోక్ కల్యాణ్ మేళా ద్వారా రుణాన్ని రూ.15 వేలకు పెంచారు. రెండో విడత రూ.20వేలు అందించగా ప్రస్తుతం దీనిని రూ.25వేలకు పెంచారు. మొదటి, రెండో విడతల్లో సక్రమంగా చెల్లించిన వారిని రూ.50వేల రుణానికి ఎంపిక చేసి ఇవ్వనున్నారు. మున్సిపాలిటీల వారీగా ఫ పీఎం స్వనిధి పథకం స్థానంలో లోక్ కల్యాణ్ తీసుకువచ్చిన కేంద్రం ఫ పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు రుణాలు పొందే అవకాశం ఫ ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించిన అధికారులుజనాభా 1,53,000 75,000 35,850 18,474 14,853వార్డుల సంఖ్య 48 35 8 15 15నివాస గృహాలు 39,800 18,000 10,761 5,945 4,058మహిళా సంఘాలు 2,519 1,499 749 426 414మొత్తం సభ్యులు 24,737 14,990 7,490 4,230 4,140ఆర్పీల సంఖ్య 86 49 38 15 15 -
సర్వే@ 63 శాతం
నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఏకకాలంలో చేపట్టిన డిజిటల్ సర్వే, పంటల సాగు నమోదు జిల్లాలో ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 63శాతం సర్వే పూర్తి చేశారు. సెప్టెంబరు 1న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు సర్వే జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించి, రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. వాటిని సరిచేసి చివరి జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్నారు. వివరాలను శాటిలైట్కు అనుసంధానం చేయాలనే లక్ష్యంతో.. రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ కమతాలను, పంటల సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ వివరాలను శాటిలైట్కు అనుసంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తోంది. మొబైల్ యాప్తో క్ల్లస్టర్ పరిధిలోని ప్రతి ఏఈఓ 2వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలు ఈ ఏడాది నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఏఈఓ తన క్లస్టర్ పరిధిలోని భూ కమతాలకు వెళ్లి సర్వే నంబర్ను ఎంపిక చేసుకుని భూమిలో సాగు చేసిన పంటను ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా.. అన్నదాతలు సాగు చేసిన ప్రతి పంట వివరాలను అధికారులు సర్వే నంబర్ల ఆధారంగా నమోదు చేస్తారు. మొబైల్ యాప్తో సాగు విస్తీర్ణం అప్లోడ్ చేస్తారు. వరి పంటకు సంబంధించి రకాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం లేని భూముల్లో సాగు, రైతుల వివరాలను, ఆధార్ వివరాలను పరిగణనలోకి తీసుకుని యాప్లో నమోదు చేస్తున్నారు. 6.17 ఎకరాల్లో సాగు జిల్లాలో 6.17లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో వరి 4,85,125 ఎకరాలు, పత్తి 91వేల ఎకరాలు, కంది 2,650 ఎకరాలు, పెసర 2,700 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, మొక్కజొన్న 45 ఎకరాలు, మిర్చి 15,150 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, ఆయిల్పామ్ 4,000 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాలు, పండ్లు, కూరగాయలు 16,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిలో ఇప్పటి వరకు సుమారు 3లక్షల ఎకరాల్లో వరి, 80వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో ఇతర పంటల వివరాలను ఏఈఓలు సర్వేలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుల సంఖ్య : 2.81 లక్షలుక్లస్టర్లు : 82పంటల సాగు విస్తీర్ణం : 6.17 లక్షలు నమోదు చేసిన పంటలు : 3.90 లక్షలుఫ 3.90లక్షల ఎకరాల్లో పూర్తయిన డిజిటల్ సర్వే ఫ సాగైన పంటల నమోదు ముమ్మరం ఫ ఈనెల 25 లోపు పూర్తిచేసేలా కార్యాచరణ ఫ తుది జాబితాను 28న ప్రభుత్వానికి నివేదించనున్న అధికారులు ఫ ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో ప్రామాణికం కానున్న సర్వే రైతులకు బహుళ ప్రయోజనాలు పంట నమోదు, డిజిటల్ సర్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రైతుల పేరుతో పత్తి, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే వ్యాపారులు, మధ్య దళారులను నిలువరించవచ్చు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో తెలపడంతో పాటు ఎరువుల అవసరం, సంక్షేమ పథకాల అమలులో దీనిని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నడు పరిహారం అందించేందుకు ఈ వివరాలు చాలా ఉపయోగపడతాయి. -
గుర్తింపు పొందిన పార్టీలు 12
చిలుకూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి 12 రాజకీయ పార్టీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచే ఆయా అభ్యర్థులకు పార్టీలు బీ ఫారాలు అందజేస్తాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీలకు స్థానిక ఓటర్ల జాబితా ముద్రించి అందించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్ జాబితాను ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం, ఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ, జనసేన పార్టీలను మాత్రమే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందిస్తే వారికి పార్టీల గుర్తులు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే వారికి ఇతర గుర్తులు కేటాయించనున్నారు. ఫ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు ఫ ఆయా పార్టీలకు ఓటర్ల జాబితా అందించేందుకు ఏర్పాట్లు ఫ బీ ఫారాలు పొందిన అభ్యర్థులు పార్టీల గుర్తుతో బరిలోకి ఫ స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులు కేటాయింపు ఎంపీటీసీ స్థానాలు : 235జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు : 23పోలింగ్ కేంద్రాలు : 1272మొత్తం ఓట్లు : 6,94,815ముమ్మరంగా ఎన్నికల ప్రక్రియ జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1272 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిల్లో మొత్తం 6,94,815 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, వారి విగ్రహాలకు ముసుగులు వేశారు. కాగా.. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించే తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
సూర్యాపేట : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీసీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్, రాష్ట్ర సహాధ్యక్షుడు మన్నూరు నాగన్న అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగి జాన్ కిషోర్ను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. లోప భూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో కనీసం భద్రత, భరోసా లేకుండా జీవితాలను దుర్భరంగా గడుపుతున్న పరిస్థితి వచ్చిందన్నారు. క్రాఫ్ట్ టీచర్ జాన్ కిషోర్ ఉద్యోగ విరమణ పొంది సంవత్సరం గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేరెళ్ల దేవరాజు, పరమేష్ మల్లికార్జున్, రవీందర్, సుధాకర్, కేశవరెడ్డి, సైదులు, కేశవరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ టీజీసీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్ -
రుణ సౌకర్యం ఎంతో మేలు
ప్రధానమంత్రి స్వనిధి రుణాల్లో భాగంగా మాకు మొదటిసారిగా రూ.10వేల లోన్ ఇచ్చారు. తర్వాత రూ.20వేలు ఇచ్చారు. అవి పూర్తిగా కట్టాం. ఇప్పుడు రూ.50వేల రుణం తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఈ సౌకర్యం ఎంతో మేలు. – గౌస్య, కూరగాయల వ్యాపారి లోక్ కల్యాణ్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఇచ్చే రుణాలు పొంది వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బలపడి పలువురికి ఆదర్శంగా నిలవాలి. – సీహెచ్ హనుమంత రెడ్డి, మెప్మా పీడీ -
డబ్బు, మద్యంతో గెలిచేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పాలకవర్గ పార్టీలతో పాటు మతోన్మాదన శక్తులు డబ్బు, మద్యం, కులం, మతం, బంధుప్రీతితో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఎన్నికల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి సైదులు, ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు సంపేట కాశయ్య, దాసరి శ్రీనివాస్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్యకల్యాణతంతును ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలో భాగంగా నిత్య కల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. శనివారం వేకువజామున శ్రీస్వామి,అమ్మవార్లకు సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. మూసీకి కొనసాగుతున్న ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. శనివారం మూసీకి 2,579 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్లను పైకెత్తి 2,601 క్యూసెక్కుల నీటిని వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 529 నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందడి నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. శనివారం సాగర్కు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. కృష్ణాతీరం వెంట, ఎత్తిపోతల, అనుపు, బుద్ధవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించేందుకు లాంచీల్లో వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల రాతి, ఇనుప పనిముట్లు, బౌద్ధమతవ్యాప్తికి సంబంధించిన ఆనవాళ్లు, విగ్రహాలను సందర్శించారు. -
సానుభూతికి నో ఛాన్స్
తిరుమలగిరి (తుంగతుర్తి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా .. గతంలో ముందుగా ఒక నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలో ఏదో ఒకటి ముందు జరిగేది. ఇలా జరగడం వల్ల ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి దరిదాపుల్లోకి వచ్చి ఓడి పోయిన వారు మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈసారి సానుభూతికి ఛాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు సానుభూతిని మూటగట్టుకునే ఛాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరిశీలించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. రెండింటికీ పోటీ చేస్తే నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈసారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి తరువాత సర్పంచ్గా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ నేతలకు తలపోట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీల నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ ఏక కాలంలో ఎన్నికలు రావడంతో ఒక్కో ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని మళ్లీ గ్రామ స్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఇప్పుడు ఈజమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్దం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా అక్టోబర్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్ 15న నామినేషన్లకు చివరి రోజు, 27న రెండవ విడతకు నామినేషన్లు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 11న వెలువడతాయి. ఎన్నికలు జరిగిన తరువాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. ఫ ‘స్థానికం’లో ఒకేసారి ఎన్నికలు ఫ వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఫ ఓడి గెలిచేందుకు అవకాశం లేదు -
జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు
ఫ తుంగతుర్తిలో ముగిసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ఫ తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఫ జోహార్ దామన్న అంటూ అశ్రునివాళి ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, లక్ష్మణ్కుమార్, పీసీసీచీఫ్ మహేష్కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీతుంగతుర్తి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జనహృదయనేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తన గడి వెంట ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గౌరవసూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆర్డీఆర్ కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దామన్నను కడసారి చూసేందుకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్ దామన్న అంటూ నినాదాలు చేశారు. ప్రముఖుల శ్రద్ధాంజలి ఈ అంత్యక్రియల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వృద్ధుల వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్మేలు మందుల సామేలు, పద్మాతిరెడ్డి, కుంభం అనిల్ కుమార్రెడ్డి, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనిల్రెడ్డి రాజేందర్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, గాదరి కిషోర్కుమార్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, మహిళా కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఎస్పీ కె.నరసింహలతో పాటు పలువురు ప్రముఖులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. శోక సంద్రంలో తుంగతుర్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి తుంగతుర్తి ప్రజలతో పాటు, ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. జనహృదయనేతను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. దామోదర్ రెడ్డి పార్థివ దేహం శుక్రవారం రాత్రి తుంగతుర్తిలోని స్వ గృహానికి చేరే వరకు వేచి ఉన్నారు. అలాగే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నివాళులర్పించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. -
భూ సమస్యలను పరిష్కరించాలి
అర్వపల్లి: భూ భారతిలో వచ్చిన భూ సమస్యలపై విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీచేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నియమావళిపై తహసీల్దార్ శ్రీకాంత్కు పలు సూచనలు చేసి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. పీహెచ్సీలో రికార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. పీహెచ్సీకి కుర్చీలు, ఫ్యాన్లు సమకూర్చినట్లు తెలిపారు. మందుల స్టాక్, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఉపాధ్యాయ ఖాళీలు
676చిలుకూరు: వివిధ దశల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తికావడంతో జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఇదే క్రమంలో పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఈ ప్రక్రియతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరింది.కానీ ప్రాథమిక పాఠశాలలను మాత్రం టీచర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీ ఉపాధ్యాయుల ప్రదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఎక్కడెక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాల సేకరణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు పదోన్నతులు చేపట్టడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ముగిసిన పదోన్నతుల ప్రక్రియ అనంతరం జిల్లాలో 676 ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా ఎస్జీటీ, అత్యల్పంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లా విద్యాశాఖ పరిధిలో మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు 950 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 3,710 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 676 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టుల ఖాళీలు ఏర్పడడంతో డీఎడ్ అభ్యర్థులకు కలిసిరానుంది. స్కూల్ అసిసెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 70 శాతం పదోన్నతులకు వదిలివేయాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే ఆ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ సమయానికి పదవీ విరమణ ఖాళీలను బట్టి మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఫ పదోన్నతుల ప్రక్రియ పూర్తితో తేలిన లెక్క ఫ హైస్కూళ్లలో తీరిన ఉపాధ్యాయుల కొరత ఫ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలు ఫ ప్రస్తుతం పనిచేస్తున్నది 3,710 మంది ఫ ఉద్యోగోన్నతి పొందినవారి సంఖ్య 139 జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందినప్పటికీ కొంత మందికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లలేదు. జీహెచ్ఎంలుగా 23 మంది పదోన్నతి పొందగా 20 మంది జాయిన్ కాగా ముగ్గురు జాయిన్ కాలేదు. అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 28 మందికి పదోన్నతి రాగా 16 మంది జాయిన్ అయ్యారు. 8 మంది జాయిన్ కాలేదు. స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 14 మందికి 12 మంది జాయిన్ అయ్యారు. గణితంలో 13 మందికి 11 మంది జాయిన్ అయ్యారు. భౌతికశాస్త్రంలో ఆరుగురికి నలుగురు జాయిన్ అయ్యారు. జీవశాస్త్రం సబ్జెక్టులో 18 మందికి 15 మంది జాయిన్ అయ్యారు. సోషల్ సబ్జెక్టులో 31 మందికి 18 మంది జాయిన్ అయ్యారు. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లో ఆరుగురికి ఆరుగురు జాయిన్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 139 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందగా వారిలో కేవలం 102 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు పలు కారణాల దృష్ట్యా విధుల్లో చేరలేదు. -
జోహార్.. ఆరీ్డఆర్
సూర్యాపేట : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి (ఆర్డీఆర్) మరణవార్త విని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈనెల 2వ తేదీ రాత్రి 10.10 గంటలకు దామోదర్రెడ్డి మృతిచెందిన విషయం విదితమే. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపులి లాంటి దామన్నకు ఎవరూ సాటిరారని, దేవుడు తమకు అన్యాయం చేసి మా నాయకున్ని తీసుకెళ్లాడని దుఃఖించారు. జోహార్ దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల సందర్శనార్థం రెడ్హౌస్కు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో నివాళులర్పించిన అనంతరం రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్హౌస్)కు తీసుకొచ్చారు. తమ అభిమాన నాయకున్ని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు వేలాది మందిగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా తరలివచ్చారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాళాల వద్ద మధ్యాహ్నం 3గంటల నుంచే ప్రజలు వేచిచూశారు. మరికొందరు రెడ్హౌస్ వద్ద బారులుదీరారు. సాయంత్రం 5.15 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంది. దామోదర్రెడ్డి పార్థివదేహం ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ముందుభాగంలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి కూ ర్చుని తన తండ్రిని చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ గా పార్థివదేహాన్ని రెడ్హౌస్కు తీసుకెళ్లారు. వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కడసారి తమ అభిమాన నాయకున్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో తుంగతుర్తికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్డీఆర్ గడీ పక్కనే పామాయిల్ తోటలో మహా ప్రస్థానం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్లు అంత్యక్రియల కోసం చేపట్టిన పనులను పర్యవేక్షించారు. సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వేదాపు వెంకయ్య, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఫ తుంగతుర్తికి చేరిన రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహం ఫ అంతకుముందు సూర్యాపేటలో భారీ ర్యాలీ ఫ రెడ్హౌస్లో మంత్రి సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి, జైవీర్రెడ్డి, ప్రముఖుల నివాళి ఫ కన్నీటి పర్యంతమైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఫ నేడు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో దామోదర్రెడ్డి పార్థివదేహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, జూలకంటి రంగారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, దోసపాటి గోపాల్, వివిధ పార్టీల నాయకులు చెరుకు సుధాకర్, బడుగుల లింగయ్య యాదవ్, పిట్ట రాంరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి నివాళులర్పించారు. వీరివెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు సర్వోత్తమ్రెడ్డి వెన్నంటే ఉన్నారు. -
పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు ఉంచాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రతినెలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.. సెలవులు, పరీక్షలు ఎప్పుడు ఉంటాయో.. ఉపాధ్యాయులుకు తప్ప విద్యార్థులకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఒక విద్యాసంవత్సరంలో ఏ నెలలో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో అన్ని వివరాలు తెలిసేలా అకడమిక్ క్యాలెండర్లు ముద్రించి అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎన్సీఈఆర్టీ దీన్ని రూపొందించింది. ప్రతి పాఠశాల, ఎమ్మార్సీలో ఒక్కోటి, డీఈఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రెండు చొప్పున ఉంచాలని ఆదేశించింది. జిల్లాకు కావాల్సిన 882 క్యాలెండర్లను ఇప్పటికే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పంపించారు. వీటిని శనివారం (4వ తేదీ) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. క్యాలెండర్లో పొందుపర్చిన అంశాలివే.. వార్షిక షెడ్యూల్లో బడిబాట, పాఠశాల పున:ప్రారంభం, దసరా, క్రిస్మస్ సెలవుల వివరాలు ఉన్నాయి. అలాగే పరీక్షల షెడ్యూల్లో ఎఫ్ఏ–1 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షల వరకు ఏయే తేదీల్లో నిర్వహించాలో పొందుపరిచారు. స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్, 1–10వ తరగతి వరకు సిలబస్ ఎప్పుడు పూర్తి చేయాలి, రివిజన్ తరగతుల నిర్వహణ వంటి వివరాలు ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పనిచేసే సమయాలను పొందుపరిచారు. ప్రతి నెలలో నిర్వహించే కార్యక్రమాలు, సముదాయ సమావేశాలు, పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీల వివరాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్స్పైర్ అవార్డులు, సెమినార్లు వంటి వివరాలున్నాయి. జూన్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతినెలా పాఠశాల పనిదినాలు ఎన్ని ఉంటాయి.. పీటీఎం సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. కోకరిక్యులర్ యాక్టివిటీలో ఆరోగ్యం, కంప్యూటర్, కళలు, సంస్కృతి, విలువలు, జీవన నైపుణ్యాలపై వారంలో ఎన్ని పీరియడ్లు తీసుకోవాలో పొందుపరిచారు. ఫ విద్యా కార్యక్రమాలు, సెలవుల సమాచారంతో రూపకల్పన ఫ ఏ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలో తెలిసేలా ముద్రణ ఫ జిల్లాకు 882 క్యాలెండర్లు కేటాయింపు ఫ ఇప్పటికే ఎమ్మార్సీలకు చేర్చిన విద్యా శాఖ ఫ నేటి నుంచి పాఠశాలలకు పంపిణీ -
మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద పవిత్ర కృష్ణానదికి శుక్రవారం రాత్రి అర్చకులు హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో మంగళ వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్కు తరలించారు. అనంతరం చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలి సూర్యాపేట అర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ, మండల, పట్టణ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం అభ్యర్థులు, సానుభూతి పనులను గెలిపించాలని కోరారు. సీపీఎం పోటీచేయని చోట్ల పోటీ విషయమై శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాలు నిలిపివేతఅర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను నిలిపివేశారు. వారబందీ విధానంలో గతనెల 8వ తేదీ నుంచి నిరంతరాయంగా గోదావరి జలాలను వదులుతున్నారు. అయితే లోయర్ మానేర్డ్యాం నుంచి రెండో దశకు వారబందీ విధానంలో నీటిని నిలిపివేయడంతో జిల్లాకు ఆపారు. ఎల్ఎండీ నుంచి నీటిని పునరుద్ధరించగానే జిల్లాకు వదులుతామని నీటిపారుల శాఖ అధికారులు తెలిపారు. -
డాక్టర్ పెంటయ్య సేవలు అద్భుతం
ఫ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు ఫ కోదాడలో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటును ప్రశంసించిన రాయుడు కోదాడరూరల్ : కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మూగజీవులకు అందిస్తున్న వైద్యసేవలు అద్భుతమని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.సుబ్బారాయుడు ప్రశంసించారు. శుక్రవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించి ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణ ప్రాంత జంతువులకే కాక పరిస ప్రాంత జంతువులను కోదాడకు తీసుకొచ్చి వాటికి కూడా ఎంతో ఓపికతో డాక్టర్ పెంటయ్య చేస్తున్న వైద్యసేవలను చూసి అభినందించారు. అదేవిధంగా దాతల సహకారంతో పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి సంవత్సర కాలంగా రైతులకు తక్కువ ధరలకే మందులను అందజేయడం గొప్పవిషయమని అన్నారు. ఈ విధంగా ఏడాదిలో రూ.3.5కోట్ల అదనపు ఉత్పత్తుతులను సాధించి రివాల్వింగ్ ఫండ్తో ప్రణాళిక పద్ధతిలో మందులను తీసుకొచ్చి పాడి రైతులు, జీవాల పెంపకందారులు, పలు రకాల జంతువుల పోషకులకు మందులు అందజేస్తున్న డాక్టర్ పెంటయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట డాక్టర్ పెంటయ్య, వైద్యసిబ్బంది ఉన్నారు. -
కాంగ్రెస్ కసరత్తు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికపై నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంత నెలకొంది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అభ్యర్థులను ఎవరన్న దానిపై ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఈనెల 6వ తేదీ నాటికి పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్, ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సాధించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా, సూర్యాపేట చైర్మన్ పదవి బీసీకి, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే జెడ్పీ చైర్మన్ పదవి ఆశించే నేతలు సులభంగా గెలిచే జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు. ఎన్నికల మూడ్లోకి కాంగ్రెస్ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆశావహులు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికల మూడ్లోకి వచ్చేసారు. పోటీ చేయాలనుకునే వారంతా తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు ఆయా పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. జెడ్పీ పీఠం దక్కేదెవరికో..? ● నల్లగొండ జెడ్పీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఈసారి చైర్మన్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఈ అయిదు స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ఎస్టీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. అందులో అడవిదేవులపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, దామరచర్ల, తిరుమలగిరిసాగర్ స్థానాల్లో ఎస్టీ మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె వద్దంటే ఆమె కుమారుడు స్కైలాబ్నాయక్ సతీమణిని బరిలో దింపుతారన్న చర్చ జరుగుతోంది. ఆమె ప్రభుత్వ అధికారి అయినందున పోటీ కి ఆసక్తి చూపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ● సూర్యాపేట జిల్లా జెడ్పీ పీఠం బీసీలకు రిజర్వు కావడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టినా మంత్రులు ఇంకా దృష్టి సారించలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియల తరువాత దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. అయితే బీసీలకు రిజర్వు చేసిన గరిడేపల్లి, కోదాడ, నడిగూడెం, పెన్పహాడ్, నాగా రం, బీసీ మహిళలకు కేటాయించిన ఆత్మకూరు(ఎస్), చింతలపాలెం, మేళ్లచెరువు, నేరేడుచర్ల, సూర్యాపేట, జనరల్ మహిళలకు కేటాయించిన అర్వపల్లి, మఠంపల్లి, జనరల్ స్థానాలైన చిలు కూరు, చివ్వెంల, పాలకీడు స్థానాల్లో పోటీచేసి గెలిచే బీసీ నాయకులకు చైర్మన్ పదవి దక్కనుంది. ● యాదాద్రి–భువనగిరి జిల్లా పరిషత్ స్థానం బీసీ మహిళలకు కేటాయించారు. దీంతో ఇక్కడ బీసీలకు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లో బీసీ మహిళలు ఎవరైనా పోటీ చేసి గెలు పొందితే వారిలో ఒకరికి జెడ్పీ చైర్పర్సన్ అయ్యేందుకు అవకాశం దక్కనుంది. బీసీ మహిళలకు కేటాయించిన ఆలేరు, ఆత్మకూరు (ఎం), చౌటుప్పల్తో పాటు బీసీలకు కేటాయించిన అడ్డగూడూరు, భూదాన్పోచంపల్లి, గుండాల వలిగొండ జడ్పీటీసీ స్థానాలతో పాటుగా, జనరల్ మహిళలకు కేటాయించిన భువనగిరి, మోటకొండూరు, తుర్కపల్లి, జనరల్ అయిన బీబీనగర్, సంస్థాన్ నారాయణపురం, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ మహిళలు పోటీచేసే అవకాశముంది. ఫ జెడ్పీటీసీ సభ్యులు, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతల దృష్టి ఫ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిలో జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల కోసం అన్వేషణ ఫ నల్లగొండలో ఎస్టీ మహిళ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఫ పోటీచేసే యోచనలో రాగ్యానాయక్ సతీమణి లేదంటే కోడలు -
రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ అమలులో లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీల మీటింగులు, ర్యాలీలకోసం అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరికై నా ఎలక్షన్ పై సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేయాలనుకున్నా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీసీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, రాజేశ్వరరావు, లింగయ్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఆబిద్, కోట గోపి, స్టాలిన్, వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈ ఓ శిరీష, డీఎల్పీఓ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు విజయ దశమి
సూర్యాపేట అర్బన్: దసరా పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.శమీ, ఆయుధ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవిని ఆరాధించడం, ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం ఈ పండుగ ప్రత్యేకత. ఆయుధ పూజ పోలీసులు దసరా రోజు ఆయుధాలకు పూజలు చేస్తారు. అలాగే పరిశ్రమల్లో యంత్రాలు, ఇతర పరికరాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే చాలామంది దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేదా సహజంగా ఉన్న జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రావణ ప్రతిమలు ఏర్పాటు చేసి దహనం చేస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శమీ పూజకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్కెట్లలో సందడి కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. దీంతో బైకులు, ఎలక్ట్రికల్, వస్త్రదుకాణాలు, ఫుట్వేర్, లేడీస్ ఎంపోరియం, పూలు, పండ్లు, కూరగాయల దుకాణాలు రాత్రి పొద్దుపోయే వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి. రహదారులపై వాహనాల రద్దీ సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. షాపింగ్ చేసేందుకు ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లుండడంతో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు, బైక్లపై సొంతూళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. ఫ వేడుకలకు సిద్ధమైన ప్రజలు ఫ పట్టణాలు, పల్లెల్లో సందడి ఫ శమీ పూజకు, రావణ దహనానికి ఏర్పాట్లు -
నాణ్యమైన సేవలు అందిస్తాం
ఫ బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశం నల్లగొండ, రామగిరి(నల్లగొండ): బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. వెంకటేశం అన్నారు. బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పానగల్ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ప్రజలకు చవక, నమ్మదగిన సేవలను అందిస్తూ బీఎస్ఎన్ఎల్ ముందంజలో ఉందని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్టీటీహెచ్ ప్యాకేజీలు రూ.299, రూ.399లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, టీవీ ఛానల్స్, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్ఏ సత్యనారాయణ, ఏజీఎం సుబ్బారావు, శాంతికుమారి, రాములు, సురేందర్, వెంకన్న, నరేందర్, జీవన్కుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పండుగ గుర్తెరగం
నా చిన్నతనం నుంచి నేటి వరకు కూడా మా గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం చూడలేదు. మా గ్రామంలో గతంలో దసరా ఉత్సవాల సందర్భంగా కంకణం కట్టే విషయంలో కులాల మధ్య ఏర్పడిన ఘర్షణల వలన నేటికీ పండుగ జరుపుకోవడం లేదు. – పసునూటి అయోధ్య, మాచనపల్లి నా వయస్సు 34 సంవత్సరాలు. గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించక దాదాపు 42 సంవత్సరాలు. మా గ్రామంలో సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మధ్య ఆధిపత్య పోరుతో కంకణం కట్టుకునే విషయంలో ఏర్పడిన ఘర్షణ వలన దసరా జరుపుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి దసరా పండుగ జరుపుకునేలా చూడాలి. – పులుసు సతీష్గౌడ్, చిల్పకుంట్ల ● -
ప్లాస్టిక్ భూతంపై సమరం
ఫ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో 15 అడుగుల భూతం తయారీ ఫ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రీన్ క్లబ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రదర్శన సూర్యాపేట అర్బన్: సూర్యాపేట జిల్లా కేంద్నానికి చెందిన గ్రీన్ క్లబ్ ట్రస్టు కొన్నేళ్లుగా ప్లాస్టిక్ భూతంపై సమరం సాగిస్తోంది. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశంలోనే మొదటిసారిగా సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద మున్సిపాలిటీ సహకారంతో ఏర్పాటు చేసిన 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని బుధవారం ఆ క్లబ్ సభ్యులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్టు అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ రావణాసురుడి కంటే భయంకరమైనది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని పేర్కొన్నారు. విజయదశమి నుంచి ప్లాస్టిక్ను తరిమివేస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు తోట కిరణ్ సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు ముప్పారపు నాగేశ్వరరావు, తల్లాడ రామచంద్రయ్య, తొణుకునూరు మురళీమోహన్లను మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హనుమంతరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండి గౌసుద్దీన్, పర్యావరణ విభాగం ఇంజనీర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకు శ్రమించిన పోలీసులు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడగా.. దాని కింద పడి నలిగిపోయిన తూఫాన్ వాహనాలను బయటకు తీసేందుకు పోలీసులు అర్ధరాత్రి వరకు శ్రమించారు. యాసిడ్ ట్యాంకర్ తలకిందులుగా పడటం, అందులో యాసిడ్ ఉండడం, పోలీసులు రెండు జేసీబీలు, మూడు క్రేన్లు తీసుకొచ్చి ఐదు గంటలకు పైగా శ్రమించిన తర్వాత ట్యాంకర్ పైకి లేచింది. దానిని రోడ్డు పక్కకు ఉంచారు. అదేవిధంగా ట్యాంకర్ కింద నుజ్జునుజ్జయిన తూఫాన్ వాహనాలను బయటకు తీశారు. నాగార్జునసాగర్కు తగ్గిన వరదనాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 4,14,188 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్యులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 33,536, మొత్తం 3,94,858 క్యూసెక్యుల నీటిని దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువ, ఏఎంఆర్పీ, వరద కాలువలకు 19,330 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు. -
టైగర్ దామన్న ఇక లేరు
సూర్యాపేట : టైగర్ దామన్నగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో పేరుగాంచిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో ఆయన జన్మించారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి కుమార్తె వరూధినిదేవిని వివాహమాడారు. ఆయనకు కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట్రెడ్డికి స్వయానా సోదరుడు. దామోదర్రెడ్డి 1985 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు. పార్టీకి ఎంత కష్ట కాలం వచ్చినప్పటికీ పార్టీని వీడకుండా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో కార్యకర్తలకు అండగా నిలిచారు. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొడుతూ.. 1985 నాటికి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యంతోపాటు కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలుకలు ఉండడంతో కమ్యూనిస్టులను ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎర్రపహాడ్ జమీందారు జన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డికి స్వయంగా బావమరిది అయిన రాంరెడ్డి దామోదర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 1985లో దామోదర్రెడ్డి మొదటిసారి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటిదాకా తుంగతుర్తి నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. 1989లో మరోసారి గెలుపొందారు. మూడోసారి 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో నిలిచి సీపీఎం అభ్యర్థిపై విజయం సాధించారు. నాలుగోసారి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అదే సంకినేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఈసారి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో.. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి పోరెడ్డి చంద్రశేఖర్రెడ్డిపై విజయం సాధించారు. 1985 నుంచి వరుసగా తుంగతుర్తి నుంచి మూడుసార్లు గెలుపొంది ఒకసారి ఓటమి చవిచూసి మరోసారి గెలుపొంది నాలుగుసార్లు విజయం సాధించారు. అనంతరం సూర్యాపేట నుంచి 2009లో మరోసారి విజయం సాధించి మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994లో తెలుగుదేశం మిత్రపక్షాల హవాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలుపొందగా.. కేవలం తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే దామోదర్రెడ్డి గెలుపొంది కాంగ్రెస్ సత్తా చాటారు. 1985 కంటే ముందు తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టుల హవా కొనసాగి భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేలుగా పనిచేయగా దామోదర్రెడ్డి రంగ ప్రవేశంతో కమ్యూనిస్టుల ప్రాబల్యానికిగండి కొట్టినట్లు అయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన దామోదర్ రెడ్డి కనుమూయడంతో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది. పేటలో మూడుసార్లు ఓటమి దామోదర్ రెడ్డి 2014 నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో పోటీచేసి వరుసగా 2014, 2018, 2023లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి లోని వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 4వ తేదీన జరగనున్నాయి. మూడవ తేదీ 12 గంటలకు హైదరాబాదు నుండి ఆయన మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించి సూర్యాపేటలోని రెడ్హౌస్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అదే రోజు రాత్రి పార్థివదేహాన్ని తుంగతుర్తికి తరలించి 4వ తేదీ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జగదీష్రెడ్డి సంతాపం మాజీ మంత్రి దామోదర్రెడ్డి మృతి పట్ల సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.ఫ హైదరాబాద్లో కన్నుమూసిన రాంరెడ్డి దామోదర్రెడ్డి ఫ కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్కు జవసత్వాలు నింపిన నేత ఫ తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం ఫ గోదావరి జలాల సాధకుడిగా పేరు ఫ 3న సూర్యాపేటకు పార్థివదేహం ఫ 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు -
ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం
రాజాపేట : దసరా పండుగను రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ పండుగ రోజు స్వగ్రామానికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. రాజుల కాలం నుంచి గ్రామానికి చెందిన ఠాకూర్ వంశస్తులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు నిర్వహించి 9వ రోజు ఆయుధపూజ నిర్వహిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రం(సిరిమల్లె) వంశీయులతో కలిసి డప్పువాయిద్యాలతో గడికోటలోని మైసమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు చేస్తారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని తల్వార్లతో ప్రదర్శన నిర్వహిస్తూ జమ్మి కోసం బయల్దేరుతారు. గ్రామం శివారులోని సంఘమేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకుని జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. పూర్వం మాత్రం ఠాకూర్ వంశానికి చెందిన సత్యనారాయణసింగ్ తనకున్న లైసెన్స్ గన్ భుజానికి వేసుకుని ఊరేగింపుగా వెళ్లి శమిపూజ తర్వాత గన్తో రెండుమార్లు తూర్పుదిక్కు గాలిలోకి పేల్చిన అ నంతరం ప్రజలు జమ్మి తీసుకునేవారు. ఠాకూర్ సత్యనారాయణసింగ్ 1994 వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ప్రతి ఏడాది దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు గ్రామస్తులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు జాతీయ జెండా, తల్వార్లతో ర్యాలీగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. రామన్నపేట: రాన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కచ్చీరు వద్ద జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పటేల్ వంశస్థులు పండుగ రోజు తెల్లవారుజామున పాత జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఉదయం 10గంటల సమయంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి కొత్త జెండా కర్రకు అలంకరణ చేసి కొత్త తాడుతో జాతీయ జెండాను ఎగర వేయడం జరుగుతుంది. జాతీయ పతాకావిష్కరణలో గ్రామస్తులంతా పాల్గొంటారు. జమ్మిచెట్టు వద్దకు పూజకు వెళ్లే సమయంలో అక్కడే పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, కులపెద్దలకు కంకణాలు అందజేస్తారు. జమ్మిచెట్టు నుంచి జాతీయజెండా వద్దకు తిరిగి వచ్చి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా నిధానపల్లిలో బురుజుపైన, నీర్నెముల, శోభనాద్రిపురం, సిరిపురం గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.ప్రత్యేకంగా ఠాకూర్ వంశస్తులుదసరా రోజు జాతీయ జెండా ఆవిష్కరణ -
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఖమ్మం జిల్లాలో జన్మించినా తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన, ఆ తరువాత హైసూ్కల్ విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. తుంగతుర్తికి చెందిన వరూధినీ దేవిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. 1985లో రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008లో నియోజకవర్గాల పునరి్వభజన జరిగే వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకట్రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్లో దామన్నది ప్రత్యేక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డిమాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రిగ్బాంతికాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి అని ఆయనను తామంతా దామన్న అని పిలుచుకునే వాళ్లమని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని , ఒక నిజాయితీ గల నాయకుడిగా, ప్రజాసేవలో ఆయన చూపిన తపన ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు దుఃఖ సమయంలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు తుంగతూర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుండి అయిదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.దామోదర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతిమాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. దామన్న లేడు అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేదు, పార్టీ పటిష్ఠతకు దివంగత దామోదర్ రెడ్డి వేసిన పునాది బలమైనది. కాంగ్రెస్ తో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.కమ్యూనిస్టుల్బకంచుకోటలను ఛేదించిన ధీశాలి, అటువంటి మహానేత మననుండి నిష్క్రమించడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కీలకమైనది.పార్టీ కోసం,పార్టీ ఆశయాల కోసం,పార్టీ క్యాడర్ కోసం నిరంతరం పరితపించిన నేత దామోదర్ రెడ్డి. చివరి వరకు కాంగ్రెస్ పార్టీని ఊపిరిగా భావించిన యోధుడు దామన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దామోదర్ రెడ్డి మరణం.కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు. దామోదర రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నాయకులు, దామోదర రెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసింది.5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై మంత్రి కొండా సురేఖ ద్రిగ్బాంతితెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు దామోదర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ మహనీయుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సురేఖ ప్రార్థించారు.1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపుఅనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిదామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాలతల్లిదండ్రులు: నారాయణ రెడ్డి, కమలమ్మనలుగురు సోదరులు, సోదరీమణులుప్రైమరీ స్కూల్ కామేపల్లి, హైదరాబాద్ వివేక వర్ధిణి, వరంగల్ లో బీఎస్సీ, బీజెడ్సీజననం: 1952, 14 సెప్టెంబర్ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపు1992 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 2007 లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన దామన్ననాలుగుసార్లు తుంగతుర్తి, ఒకసారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు1994లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్(ప్రజా కాంగ్రెస్) గా పోటీ చేసి గెలుపు1999 లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు చేతిలో ఓటమి2004 లో తుంగతుర్తి నుంచే సంకినేనిపై దామన్న గెలుపు1985 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే1989 లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురిలో దామన్న ఒకరుతెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికలు 2014, 2018, 2023 లో వరుసగా మూడుసార్లు ఓటమి2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమిఎన్నికల పూర్తయ్యాక అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయిన దామోదర్ రెడ్డి -
అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీ, గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించినందున సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం ఆయన కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలోని 23 మండలాల జెడ్పీటీసీలు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 486 గ్రామపంచాయతీలు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 4,403 పోలింగ్ కేంద్రాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 1,272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 541 పోలింగ్ ప్రాంతాలు, 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టేజ్–1, స్టేజ్ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయగా, ఆర్ఓ, పీఓల శిక్షణ కార్యక్రమాలు మండలాల వారిగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్ లు పూర్తి వివరాలను ప్రదర్శించాలన్నారు. మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అలాంటి వార్తల వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో ఖర్చుగా చూపించనున్నట్లు చెప్పారు. మీటింగ్లు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రభుత్వ పథకాల మంజూరు, గ్రౌండింగ్, ప్రారంభోత్సవాలు ఉండవని, జిల్లా కలెక్టర్ మొదలుకొని కిందిస్థాయి వరకు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తారని చెప్పారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈ అప్పారావు, డీపీఓ యాదగిరి, నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్, సూర్యాపేట డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా సమాచార ఇంజనీర్ మల్లేశం, డిప్యూటీ సీఈఓ శిరీష, డివిజనల్ పంచాయతీ అధికారి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దు
సూర్యాపేటటౌన్ : అనవసరమైన లింక్లను అనుసరించి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టొద్దని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ సూచించారు. సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న ముగ్గురి బాధితుల ఖాతాల్లో రూ.28లక్షల నగదును తిరిగి జమ చేయించి వారికి కోర్టు ఉత్తర్వులను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుడి మొబైల్ ఫోన్కు బిజినెస్ ఆఫర్ ఉందని మెసేజ్ వచ్చిందని, బాధితుడు మెసేజ్ను అనుసరిస్తూ సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ టోల్ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్, పట్టణ పోలీసులు అప్రమత్తమై సంబంధిత బ్యాంకు వారిని అతడి అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదులో రూ.26.42 లక్షల నగదు హోల్డ్ చేయించినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ నగదు మహారాష్ట్రకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పశ్చిమబెంగాల్కు చెందిన బంధన్ బ్యాంక్ వినియోగదారుల ఖాతాలకు బదిలీ అయ్యిందని గుర్తించి కోర్టు ఆర్డర్స్ ద్వారా తిరిగి బాధితుడికి ఇప్పించినట్లు తెలిపారు. ఇదేవిధంగా మరో వ్యక్తికి రూ.51వేల నగదు, ఇంకొక వ్యక్తికి రూ.90వేలు వారి అకౌంట్లలోకి వేసినట్లు ఎస్పీ వివరించారు. డబ్బులు తిరిగి పొందిన బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కమ్యునికేషన్స్ హెడ్కానిస్టేబుల్ మహేష్, కానిస్టేబుల్ మహేష్ చారి, రాజేష్, సైదులు, నాగయ్య పాల్గొన్నారు. ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
డివైడర్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఫ మరో ఇద్దరికి గాయాలు నేరేడుచర్ల: కారు డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్ల పట్టణంలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ నిమ్మతోట తనూజ్కుమార్(27) తన స్నేహితులు ఎస్కే నహీం, మాసిబోయిన నరహరి, తోము లోకేష్తో కలిసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఓ ఈవెంట్కు సంబంధించి ఫొటోగ్రఫీ గురించి మాట్లాడేందుకు సోమవారం రాత్రి కారులో వచ్చారు. ఈవెంట్ గురించి మాట్లాడిన అనంతరం తాగునీటి కోసం మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్లకు చేరుకొని ఓ టీస్టాల్ వద్ద ఆగారు. టీస్టాల్ ము ందు కారులో నుంచి లోకేష్ను దింపి యూటర్న్ తీసుకొని వస్తామంటూ మిర్యాలగూడ రోడ్డులోని హెచ్పీ బంక్ వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తనూజ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న నహీం, నరహరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నిమ్మతోట తరుణ్గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన హర్షవర్థన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ను చూడటానికి మంగళవారం రెండు బైక్లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు. -
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలను మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడారు. శేష జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్రావు, వీరబాబు, జానయ్య, యజ్దాని, భ్రమరాంబ, భూపాల్రెడ్డి, హాజీనాయక్ పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై జంక్షన్ల విస్తరణకు చర్యలు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామం వద్ద ఉన్న జంక్షన్ను ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి ఏసీపీ పరిశీలించి మాట్లాడారు. దండుమల్కాపురం పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ ఉండడంతో భారీ ట్యాంకర్లు రోడ్డు క్రాస్ చేసే సమయంలో హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దండుమల్కాపురం, బొర్రోళ్లగూడెం, కై తాపురం గ్రామాల వద్ద ఉన్న జంక్షన్లను విస్తరిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ సహకారంతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. హైవేపై ప్రయాణించే వాహనాల వేగం జంక్షన్ల వద్ద తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఇంజనీరింగ్ విభాగం అధికారులు కిషన్రావు, శరత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ డీజీఎం విశ్వేశ్వరరావు, చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్మోహన్ పాల్గొన్నారు. ఫ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి -
వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
పెన్పహాడ్: పెన్పహాడ్ మండలంలో మంగళవారం వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు.. పెన్పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన దూబని లక్ష్మయ్య(35) తన వ్యవసాయం క్షేత్రంలో పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా.. మోటారుకు అనుసంధానించిన కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు ఉన్నారు. అదేవిధంగా చీదెళ్ల గ్రామానికి చెందిన సురభి సైదులు(46) ఇంట్లోని దండెం తీగకు చేపలు ఎండపెడుతుండగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ రెండు ఘటనలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. -
బాస్కెట్బాల్ క్రీడాకారిణికి సన్మానం
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం గారెకుంటపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకట్రెడ్డి కుమార్తె విహారెడ్డి మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో అండర్–16 బాస్కెట్బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున వైస్ కెప్టెన్గా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఇరాన్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మంగళవారం గారెకుంటపాలెం గ్రామంలో విహారెడ్డిని గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విహారెడ్డి చిన్నతనం నుంచే బాస్కెట్బాల్ క్రీడలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, రత్నమాల, ఉపేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొమ్మలతో సులభంగా బోధించేలా..
ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. పాఠ్యాంశాలను బొమ్మలతో బోధించేందుకు గాను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. యాదాద్రి భువనగిరి నుంచి.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మండలం గొలనుకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏ. జ్యోతిర్మయి కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాల బోధనా పద్ధతులపై శిక్షణ ఈ జాతీయ స్థాయి శిక్షణలో దేశంలోని పలు రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, బొమ్మలతో బోధన, స్వయంగా బొమ్మల తయారీ గురించి నేర్చుకున్నట్లు ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, చారిత్రాక కట్టడాలు, బోనాలు, బతుకమ్మ, ఇక్కడి విద్యా బోధన తీరు తదితర విషయాల గురించి ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులకు వివరించినట్లు ఆమె తెలిపారు. సీసీఆర్టీ సంచాలకులు రాజ్కుమార్ జ్యోతిర్మయికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఫ జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొన్న గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి విద్యార్థులకు సులభంగా బొమ్మల ద్వారా పాఠాలు బోధించడం ఎలా అనేది జాతీయ స్థాయి శిక్షణలో నేర్పించారు. పాఠ్యాంశాల్లోని పాత్రల ప్రకారం స్వయంగా బొమ్మలు తయారు చేసుకోవడం కూడా తెలిసింది. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న వినూత్న బోధన పద్ధతుల గురించి తెలుసుకున్నాను. తెలంగాణలోని బోధన విధానాన్ని వేరే రాష్ట్రాల టీచర్లకు వివరించాను. శిక్షణలో భాగంగా రుద్రమదేవి వేషధారణతో పాఠ్యాంశం బోధించే అవకాశం నాకు దక్కింది. విద్యార్థుల్లో పాఠాలు వినాలనే ఆసక్తిని పెంపొందించి, తద్వారా సర్కారు బడుల్లో హాజరుశాతం పెంచడమే నా లక్ష్యం. త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొమ్మలతో బోధనపై అవగాహన కల్పిస్తాను. – ఏ. జ్యోతిర్మయి, ఉపాధ్యాయురాలు, గొలనుకొండ ప్రాథమిక పాఠశాల, ఆలేరు -
హైవేపై అదుపుతప్పిన యాసిడ్ ట్యాంకర్
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పారిశ్రామికవాడ నుంచి మంగళవారం యాసిడ్ను లోడ్ చేసుకున్న ట్యాంకర్ ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో అన్లోడ్ చేసేందుకు బయల్దేరింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాములు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగానే ముందున్న వాహనాల రద్దీని గుర్తించి బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు. ట్యాంకర్ వేగంతో ఉండడంతో బ్రేకులు పడలేదు. దీంతో చేసేదేమీ లేక ముందుకు వెళ్తే ప్రాణనష్టం జరుగుతుందన్న ఆలోచనతో ట్యాంకర్ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమ వైపుకు తిప్పాడు. ఈ క్రమంలో ముందున్న రెండు కార్లను ఢీకొట్టాడు. హైవే వెంట ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ను ఢీకొని సర్వీస్ రోడ్డులోకి వెళ్లి అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడి ఆగిపోయింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రమాద సమయంలో ట్యాంకర్లో డ్రైవర్తో పాటు నేరేడుచర్లకే చెందిన క్లీనర్ నవీన్ ఉన్నారు. డ్రైవర్ రాములకు తీవ్ర గాయాలై ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ ట్యాంకర్ రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఒక్కో వాహనానికి రూ.11లక్షల చొప్పున నష్టపోయామని వాహనాల యజమానులు సిలివేరు శివ, కవిడె నర్సింహ బోరున విలపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయంలో అందులోని యాసిడ్ లీకై రోడ్డుపై పారింది. తప్పిన ప్రాణనష్టం ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో, వాహనాల పక్కన డ్రైవర్లు, స్థానికులు సుమారు 20మంది నిల్చున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు నిమిషాల ముందే వారంతా అక్కడి నుంచి వెళ్లి సమీపంలోని దుకాణాల కూర్చున్నారు. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ సర్వీస్ రోడ్డులో పార్కింగ్ చేసిన వాహనాలపై బోల్తా ఫ ట్యాంకర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసిన పోలీసులు, స్థానికులు ఫ ఆస్పత్రికి తరలింపు ఫ చౌటుప్పల్ పట్టణంలో ఘటన -
కుటుంబ సమస్యలతో ఉరేసుకుని ఆత్మహత్య
గుర్రంపోడు: కుటుంబ సమస్యలతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. చామలేడు గ్రామానికి చెందిన ఆవుల నరేష్(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నరేష్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనికి వెళ్లిన నరేష్ తల్లి ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. కుటుంబ సమస్యలతోనే నరేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని తెలంగాణ జెన్కో ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(సీఈ) మంగేష్నాయక్ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్ కంట్రోల్ రూమ్లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్ పవర్హౌస్ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు. సమస్యలు లేకుండా చూడాలని వినతి భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని సద్దుల చెరువు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జట్టుకొండ మాట్లాడుతూ సద్దుల చెరువు వద్ద ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న (మహా ప్రస్థానం) శ్మశాన వాటికను అమృత్ పథకం కింద కేంద్రం పునర్నిర్మించిందన్నారు. గతంలో ఆరు ప్లాట్ఫాంలు ఉండగా ప్రస్తుతం మూడింటిని నిర్మించారని చెప్పారు. మున్సిపాలిటీ విస్తరిస్తున్నందున ఈ ప్లాట్ఫాంలు సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చలమల్ల నర్సింహ, రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవి చంద్ర, జుట్టుకొండ అజయ్కుమార్ పాల్గొన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ శ్రీలక్ష్మీనరసింహస్వామికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల సంవాదం రక్తికట్టించారు. అనంతరం కల్యాణతంతు ముగించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు క్రిష్ణమాచార్యులు,పద్మనాభాచార్యులు , బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి ,ఆంజనేయా చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పనులకు బ్రేక్..!
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులకు బ్రేక్ పడనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలు లేకుండా పోనుంది. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. జిల్లా యంత్రాంగమంతా దాదాపు ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లింది. స్థానిక సంస్థల సమరం ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలనే పాటించాల్సి ఉంది.ఈ మేరకు మంగళవారం రాజకీయ పార్టీలతో ఎన్నికల కోడ్పై మండల స్థాయిలో జిల్లావ్యాప్తంగా సమావేశాలను నిర్వహించారు. అలాగే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనుమతి తప్పని సరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో.. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం వర్తించనున్నాయి. అభ్యర్థుల ఖర్చులపై నిఘా సైతం ఉండనుంది. ప్రకటనలు, గోడలపై రాతలు రాయించే సమయంలోనూ ఎన్నికల సంఘం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. బోనస్ అందేనా! గత యాసంగి సీజన్లో జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. దాదాపు 50,992 మంది రైతులకు రూ.25.17 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్తో ఈ బోనస్ చెల్లింపులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. ఎన్నికల నిబంధనలు అడ్డంకిగా మారితే మరో 45రోజుల పాటు వేచిచూడాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదు. 486 గ్రామపంచాయతీల పరిధిలో సీసీరోడ్ల నిర్మాణం నుంచి నూతన భవనాల వరకు ఏ ఒక్క కొత్త నిర్మాణం ఈ ఎన్నికల కోడ్ కారణంగా చేపట్టకూడదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపనలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే నూతనంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలుస్తోంది. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల పరిస్థితిపై స్పష్టత లేదు. జిల్లాకు నియోజకవర్గానికి 3500ల చొప్పున ఇళ్లు మంజూరు కాగా.. అదనంగా ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోనుంది.ఫ అమలులోకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి ఫ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్ ఫ ఎన్నికల సంఘం పరిధిలోకి జిల్లా యంత్రాంగం -
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం.. మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. మట్టపల్లి క్షేత్రం వద్ద..మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు