Suryapet
-
నాతో మాట్లాడేందుకు టైం లేదు.. ఫోన్లో మాత్రం బిజీ!
సూర్యాపేట: భార్య కాపురానికి రావడంలేదని మద్యం మత్తులో సెల్టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాలస్వామి ఆరేళ్ల క్రితం పెద్దగూడెంకు చెందిన ఒంటెద్దు బాలమణిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జేసీబీ డ్రైవర్గా పనిచేసే బాలస్వామి నిత్యం మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడు. ఇదిలా ఉండగా భార్య కూడా ఇతరులతో తరచూ ఫోన్లో మాట్లాతుండటం వల్ల ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడగా.. బాలమణి రాయితో బాలస్వామిని కొట్టడంతో తలకు గాయమైంది. అనంతరం పిల్లలను తీసుకొని బాలమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం బాలస్వామి మద్యం సేవించి తన భార్యను కాపురానికి తీసుకురావాలని పోచంపల్లి పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్న సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐలు భాస్కర్రెడ్డి, లైలా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామి భార్యాపిల్లలను పిలిపించారు. కిందకు దిగిరావాలని ప్రాథేయపడగా.. కిందకి దిగుతున్నట్లు చేసి తిరిగి పైకి ఎక్కుతుండగా బిహార్కు చెందిన ఇద్దరు యువకులు చాకచక్యంగా టవర్ ఎక్కి అతడిని పట్టుకొని కిందికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్కు తరలించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా 11వ వార్డులో ఉన్న సెల్టవర్ కూడా బాలస్వామి ఎక్కగా.. టవర్ పైన కోతులు ఉండటంతో భయంతో కిందికి దిగివచ్చాడని స్థానికులు తెలిపారు. -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం చేపట్టారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. ఆలయ ఈఓగా చలపతిరావు మట్టపల్లి దేవస్థానం ఈఓగా టీవీ చలపతిరావు ఆదివారం ఆల య ధర్మకర్తల సమక్షంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్చార్జి ఈఓ పనిచేసిన జ్యోతి బదిలీకాగా జనగాంలో గల శ్రీచెన్నకేశవస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్న చలపతిరావును ఇక్కడకు బదిలీచేస్తూ దేవాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసింది. -
‘నీట్’కు 145 మంది గైర్హాజరు
సూర్యాపేటటౌన్ : జిల్లా పరిధిలో మొత్తం ఐదు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల, చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని మైనారిటీ గురుకులంతోపాటు సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట ప్రభుత్వ మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా సెంటర్లలో మొత్తం 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11.30గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30గంటల వరకే అనుమతించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థులను చెకింగ్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, బాలికలకు చెవుల దిద్దులు, పట్టీలు, దండలు ఏమి ఉన్నా తీయించారు. బందోబస్తును పరిశీలించిన ఎస్పీసూర్యాపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. బందోబస్తు వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలను డీఎస్పీ ప్రసన్న కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముగిసిన ‘నీట్’ భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 5 సెంటర్లలో 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష నేపథ్యంలో అన్ని సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదు సెంటర్లలో ప్రశాంతంగా పరీక్ష మొత్తం 763 మంది విద్యార్థులు హాజరు సూర్యాపేటలో పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ -
ఇల్లు మంజూరు చేయండి సారూ..
మఠంపల్లి : ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి సారూ.. అంటూ నిరుపేద ఒంటరి మహిళ వేడుకుంటోంది. వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. జాబితాలో గ్రామానికి చెందిన మహిళ షేక్మౌలాబి పేరు రాలేదు. దీంతో సదరు మహిళ తాను నివసిస్తున్న రేకుల కప్పు ఇల్లు వర్షం వస్తే కురుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. చేతులెత్తి మొక్కుతున్నా కలెక్టర్ సార్.. తనకు ఇల్లు మంజూరు చేయండి అంటూ ఆదివారం విలేకరుల ఎదుట తన గూడు గోడు వినిపించింది. ఫ రఘునాథపాలెంలో నిరుపేద ఒంటరి మహిళ వేడుకోలు -
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి 27 వేల పాఠశాలను 4 వేలకు తగ్గించాలని ప్రకటించడం ఖండించదగిన విషయమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య నేడు 65శాతంకి పైగా పెరిగిందన్నారు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం చేసి అమలు పరచాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణ మరి ఎక్కడా లేదన్నారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రమణాచారి, రేపాక లింగయ్య, రాచూరి ప్రతాప్, తల్లమల్ల హస్సేన్, యోగానంద,షేక్ ఉమర్, అబ్దుల్కరీం, మాధవరెడ్డి, వెంకట్ యాదవ్, బుద్ధ సత్యనారాయణ, జనార్దన్, వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ -
నేడు ఫణిగిరిలో మంత్రి జూపల్లి పర్యటన
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. సూర్యక్షేత్రంలో విశేష పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలినూతనకల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి(వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కోరారు. ఆదివారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ను రూ.6వేలకు పెంచడంతో పాటు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చి విస్మరించారన్నారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో వందశాతం రాయితీ కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల బ్లాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. త్వరలోనే వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ను ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆ సమితి మండల అధ్యక్షులు బాణాల వీరారెడ్డి, కొల్లూరి ఈదయ్య, కొణతం కృష్ణారెడ్డి, నగేష్, ఇమ్మారెడ్డి నవీన్రెడ్డి పాల్గొన్నారు. 440 అడుగులకు మూసీ నీటిమట్టంకేతేపల్లి : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం 440.90 (పూర్తిస్థాయి నీటిమట్టం 445) అడుగులకు చేరకుంది. వారం రోజులుగా హైదరాబాద్తో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. ఆదివారం ఎగువ నుంచి మూసీకి 100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.40 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో మరో నాలుగు అడుగుల నీరు చేరితే పూర్తిస్థాయిలో నిండనుంది. -
రైతు కూలీల సంక్షేమం పట్టని పాలకులు
కోదాడరూరల్ : రైతు కూలీల సంక్షేమంతోపాటు వారిని ఆదుకోవడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని లాల్బంగ్లాలో జరిగిన ఆ సంఘం జిల్లా 2వ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడాన్ని పాలకులు విస్మరించారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదల కోసం ఉపాధిహామీ పథకాన్ని తెచ్చి 16 కోట్ల మంది కూలీలకు పనులు కలిస్తుంటే నేడు బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి కూలీలను మోసం చేసిందని ఆరోపించారు. పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే నరేంద్రమోదీ ప్రభుత్వ దివాలాకోరు విధానాలపై రైతులు, కూలీలు, కార్మికులు ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సభలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్కుమార్, నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, కాకి మోహన్రెడ్డి, దశరథ, కునుగుంట్ల సైదులు, దాసరి శ్రీను, కనకరావు, పారెల్లి నాగయ్య, నగేష్, అజయ్, ఉదయగిరి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఫ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు -
కూరగాయల ధరలు కుతకుత!
తిరుమలగిరి (తుంగతుర్తి) : కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక్కో రకం కూరగాయల ధర 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరగడంతో మార్కెట్కు వెళ్లిన వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదేమంటే మార్కెట్కు కూరగాయలు రావడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడమే కారణంనెల రోజుల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండేది. దీంతో వారసంతలు, దుకాణాల్లో కూరగాయలను వినియోగదారులు విరివిగా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల స్థానికంగా కూరగాయల సాగు తగ్గి దిగుబడి పడిపోయింది. ఫలితంగా వ్యాపారులు హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుక రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దళారులు ధరలు పెంచేశారు. వారి నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు సైతం ధరలను మరింత పెంచడంతో వినియోగదారులకు పెనుభారంగా మారింది. కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్కు వచ్చిన మహిళలు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. రైతుకు దక్కని గిట్టుబాటు!కిలో కాకరకాయ ధర గతంలో రూ.30 నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం కిలో రూ.60 పలుకుతోంది. చాలా రోజుల పాటు రూ.25 ధర పలికిన టమాట ప్రస్తుతం రూ.40కి చేరింది. సొరకాయ, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్కెట్లకు కనీసం రూ.500 తీసుకొని వెళ్తేనే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేది కష్టమని మహిళలు వాపోతున్నారు. దళారులు తమకు తక్కువ ధర చెల్లించి కూరగాయలు కొంటున్నారని, తమకు ఏమాత్రం గిట్టుబాటు అందక నష్టపోతున్నామని కూరగాయలు పండించే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు కిలో రూ.80కి చేరిన మిర్చి, బీర, క్యారెట్ కాకర, చిక్కుడు రూ.60పైమాటే.. బెంబేలెత్తుతున్న పేద కుటుంబాలు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాము. నెల క్రితం రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెడితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.400 ఖర్చు చేసినా వారానికి సరిపడా రాని పరిస్థితి. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఖర్చు రెండింతలయ్యింది. – రమ, తిరుమలగిరి ప్రతి కూరగాయ ధర కిలో రూ.50కి పైగానే పలుకుతుంది. సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల పంటల సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు వంద శాతం సబ్సిడీలు ఇచ్చి పంటల సాగు పెంచితేనే ధరలు తగ్గుముఖం పడతాయి. – శ్రీనివాస్, తిరుమలగిరి -
ఏఐతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
కోదాడరూరల్ : ఏఐ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జీపీటీ, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటిగ్ వంటి విషయాలను నేర్చుకోవడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్కిరణ్, ఎంఈఓ సలీంషరీఫ్, హెచ్ఎం మార్కేండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా ఎస్పీసూర్యాపేటటౌన్ : ఎస్పీ నరసింహ బడిపంతులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. వారికి సాంఘిక శాస్త్రం పాఠాలను బోధించారు. ‘ఉత్తర ధృవం – దక్షిణ ధృవం’ అంశాన్ని విద్యార్థులకు వివరించారు. ఆయన బోధనతో విద్యార్థులను ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు సైతం ఆసక్తిగా తిలకించారు. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే కుమారుడిని చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ సన్మానించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎరువుల షాపు సీజ్మద్దిరాల : యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపును జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి సీజ్ చేశారు. మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ షాపు యజమాని యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆదేశానుసారం షాప్ను సీజ్ చేసి, లైసెన్స్ను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఏడీఏ రమేష్బాబు, ఏఓ అనిషారూహి, సిబ్బంది ఉన్నారు. నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతసూర్యాపేటటౌన్ : పట్టణంలో ఆదివారం జరిగే రీ–నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 (163 బీఎన్ఎస్ఎస్–2023) అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేర రాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, మైకులు, డీజేలతో ఊరేగింపులపై నిషేధం ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, కళాశాల ప్రిన్సి పాల్ పెరుమాళ్ల యాదయ్య, సిబ్బంది ఉన్నారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో జరుగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం సర్ పై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కేబినెట్ సమావేశం నిర్వహించి మరీ ధాన్యం కొనబోమని ప్రకటించింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేశారని, చివరకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు పార్టీ కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు రాంచందర్నాయక్, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
సదుపాయాల కల్పనలో రాజీ లేదు
హుజూర్నగర్ : ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్నగర్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు, ఈఈ రామకిషోర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, డీఈ చంద్రశేఖర్, ఏఈలు సరిత, ప్రసన్న, నాయకులు పాల్గొన్నారు. ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుక మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పా టు చేసిన కేక్ను మంత్రి కట్ చేశారు. నాయకులు మంత్రిని గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్, రాష్ట్ర పెరికకార్పొరేషన్ చైర్మన్ దొంగరి సత్యనారాయణ, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, మాజీ ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్, భూక్యా గోపాల్, శిరాంయాదవ్, సంపత్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి
మేళ్లచెరువు : గత పాలకులు నూతన మండలాలు ఏర్పాటు చేసి వదిలేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాటిని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. చింతలపాలెం మండలం బుగ్గమాధవరం వద్ద నిర్మిస్తున్న రాజీవ్గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిఫ్టు ద్వారా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని నాలుగు మండలాల్లోని 12 గ్రామాల్లో 14,100 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. గత 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా లిఫ్టు సౌకర్యం కల్పించి నట్లు తెలిపారు. అనంతరం చింతలపాలెం నుంచి మేళ్లచెరువు వరకు రూ.10 కోట్లతో నిర్మించిన రోడ్డు ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణం, దొండపాడు సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, రాములు నాయక్, తిరుపతిరావు యాదవ్, రంగా చారి, గురవయ్య, సైదులునాయక్ పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
యోగానంద ఆలయ ఆవరణలో గెస్ట్హౌస్
పది మంది ఎస్ఐల బదిలీసూర్యాపేటటౌన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పది మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ సూర్యాపేట ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్కు, ఎన్.బాలునాయక్ సూర్యాపేట రూరల్ నుంచి వీఆర్కు, ఎం.ఐలయ్య వీఆర్ నుంచి ఆత్మకూర్.ఎస్కు, ఎన్.సందీప్రెడ్డి వీఆర్ నుంచి సూర్యాపేట వన్ టౌన్కు, బి.మోహన్బాబు వీఆర్ సూర్యాపేట నుంచి సూర్యాపేటటౌన్–2కు, ఏడుకొండలు సూర్యాపేట వన్టౌన్ నుంచి వీఆర్కు, మహేంద్రనాథ్ సూర్యాపేట వన్టౌన్ నుంచి వీఆర్కు, ఎస్కే.రహీమొద్దీన్ వీఆర్ నుంచి సూర్యాపేట వన్టౌన్కు, ఆర్.కనకరత్నం వీఆర్ నుంచి సూర్యాపేట టౌన్– 2, వి.వెంకన్న వీఆర్ సూర్యాపేట నుంచి చివ్వెంల పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకం చేశారు. ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగల్యాధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధులలో స్వామివారి గరుడ వాహన సేవ చేపట్టారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆవరణలో పర్యాటక సంస్థకు సంబంధించిన అతిథిగృహ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని శనివారం సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో గెస్ట్హౌస్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు రూ.60 లక్షలు మంజూరు చేయించారు. దాంతో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ ఉమ్మడి జిల్లా డీఈ విద్యాసాగర్, ఏఈఈ మణికంఠ, ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని వారు చెప్పారు. వారి వెంట అధికారులు, ఆలయ అర్చకులు ఉన్నారు.ఫ స్థలాన్ని పరిశీలించిన అధికారులు -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలలో చిన్న పాటి ఘర్షణలకే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. ఇలాంటి వాటిని గ్రామాల్లోనే పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కింది కోర్టులో పరి ష్కారం కాని కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను సైతం జిల్లా కోర్టులో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మొత్తం 5,868 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్రావు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి పి.శివరామ్ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
మీ ఓటు.. మీ చేతుల్లోనే
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు, ప్రజలే స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ప్రత్యేక వెబ్లింక్ను అందుబాటులో ఉంచింది. కుటుంబం సభ్యుల తరఫున ఒకరు వివరాలను నమోదు చేసి, అవసరమైన ఫారాలను సమర్పించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. దాంతో వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా వివిధ కారణాలతో ఇంటి వద్ద అందుబాటులో లేని వారికి ఊరట కలుగ నుంది. 25 నుంచి ప్రారంభం వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీసర్శ్రీకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 నుంచి ‘సర్’ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మార్పులు–చేర్పులు చేయడం వంటివి కూడా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. జిల్లాలో 10.01 లక్షల ఓటర్లు సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2002 ఓటర్ల జాబితాలోని వివరాలతో పోల్చితే జిల్లాలో ఓటర్ల సంఖ్య తారుమారు అయినట్లు తెలుస్తుంది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండటం, 2016లో జిల్లాల విభజన కారణంగా ఓటర్ల వివరాల నమోదులో తేడాలు ఉన్నాయి. సూర్యాపేటతో పాటు యాదాద్రి జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. అధికారులు చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియ సమయంలో ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లుగా గుర్తించారు. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరు లాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 2 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. సర్లో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తప్పులను సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లోనూ ఎన్యుమరేషన్ నమోదుకు అవకాశం ఫ వెబ్ లింక్ను అందుబాటులో ఉంచిన ఎన్నికల సంఘం ఫ కుటుంబంలో ఒకరు ఫారాలు నింపినా ఓకే ఫ వివరాలు సరిచూసి ఓట్లు ఖరారు చేయనున్న బీఎల్ఓలు ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఎన్యుమరేషన్ (ఓటర్ల నమోదు/ వివరాల సేకరణ) చేసుకునే అవకాశం కల్పించింది. బీఎల్ఓలు ఇంటికి రాకముందే ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫారం పూరించాలి. ఆ వివరాలను బీఎల్ఏలు సరిపోల్చుకొని ఓట్లను ఖరారు చేస్తారు. కుటుంబంలోని ఎవరైనా అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in ద్వారా ఆన్లైన్లో ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లు తమ మొబైల్ నంబర్ లేదా ఓటరు కార్డు నంబర్ను ఉపయోగించి, ఫోనుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘ఈ–సైన్’ చేసి, వివరాలను నమోదు చేయవచ్చు. ఎన్యుమరేషన్ సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లు ఈ విధానం ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. -
నాన్న త్యాగమే.. నా విజయం
తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్రెడ్డి నల్లగొండ : మాది ఏపీలోని కడప జిల్లా చెన్నూరు. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సావిత్రి. మాది సాధారణ కుటుంబం. నన్ను, చెల్లిని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నాన్నకు అమ్మ తోడుగా నిలిచారు. మా నాన్న కుటుంబంలో పెద్దగా చదువుకున్నవారు లేరు. అందుకే మేమైనా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి వరకు కడపలో ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ నెల్లూరులో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మధ్యప్రదేశ్లోని ఐఐటీ ఇండోర్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. తర్వాత బెంగళూరులో రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సిద్ధమయ్యాను. రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకోలేకపోయినా నిరాశ చెందలేదు. నాన్న మాటలే ముందుకు నడిపించాయి తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ, తల్లి అవసరమైన సందర్భాల్లో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపారు. వారిద్దరూ ఎన్నో కష్టాలు పడినా మా చదువులో మాత్రం ఎలాంటి లోటు రానీయలేదు. నాన్న చెప్పిన ‘మాకు చదువు లేదు.. మీరు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి రావాలి’ అనే మాటలే నన్ను ముందుకు నడిపించాయి. మా చెల్లి శ్రీలత బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో ప్రయత్నంలో సక్సెస్ సివిల్స్ సాధించాలన్న నా కలను నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. మూడోసారి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ సమయంలో కుటుంబం నుంచి, ముఖ్యంగా నాన్న నుంచి ఎంతో మద్దతు లభించింది. వారి ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫలితంగా సివిల్స్లో మూడో ప్రయత్నంలో 151వ ర్యాంకు సాధించగలిగాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధులు నిర్వహిస్తున్న నేను ఐఏఎస్ సాధించడంతో అమ్మానాన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ నాన్న ఒకటే చెబుతుంటారు.. ‘ప్రజలకు నిజాయితీగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని. ఆ మాటలే నాకు మార్గదర్శకం. మంచి పేరు తెచ్చుకోవాలని నాన్న కోరిక.. ఫ చిన్నచిన్న వ్యాపారాలు చేసి మమ్మల్ని చదివించారు ఫ ఆయన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించాను ఫ నిజాయితీగా సేవలందించాలనే సూచన తప్పక పాటిస్తా నల్లగొండ అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరు శ్రీకాంత్రెడ్డి -
‘రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’
సాక్షి, సూర్యాపేట: దేశాన్ని కుదిపేసిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని.. బండి సంజయ్, సంగప్పలను కనీసం విచారించకుండానే.. రాత్రికి రాత్రే నిందితునికి బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.పోక్సో చట్టం అత్యంత బలమైన చట్టమని.. చట్టంలో 2020 లో వచ్చిన మార్పుల ప్రకారం సెక్షన్ 4లోని క్లాస్ 2(ఎఫ్) ప్రకారం, బెయిల్ ఇచ్చే ముందు, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వాలని,బాధితురాలి అభిప్రాయాలను సేకరించాలని కానీ, సైబరాబాద్ పోలీసులు మరియు ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలికి న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు.తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఏడాది పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడితే.. కేసు పెట్టిన మొదటి రోజే అరెస్ట్ చేయకుండా.. స్టేషన్ బెయిల్ ఇద్దామని చూశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటం తర్వాత 9 రోజులు దాచిపెట్టి తర్వాత లొంగుబాటు చూపెట్టారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రం బాల్క సుమన్, అశోక్ అనే వ్యక్తిని మాత్రం అన్యాయంగా నెలల తరబడి జైలులోనే ఉంచుతున్నారని మండిపడ్డారు. బాలికకు న్యాయం జరిగేవరకు చివరివరకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లనే నిందితుడు అరెస్టయ్యాడని గుర్తు చేశారు. తెలంగాణ బడేభాయ్ చోటే భాయ్ల బంధం ప్రజలకు అర్థమైందన్నారు. పోక్సో కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితుడు బండి భగీరథ్కు రాత్రికి రాత్రే బెయిల్ మంజూరు చేయించి.. ఇంటికి పంపించేందుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. -
మెరుగైన వైద్యం అందించాలి
సూర్యాపేటటౌన్ : వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులు, ఇన్–పేషెంట్, అవుట్–పేషెంట్ విభాగాలను పరిశీలించారు. వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్, ఆర్ఎమ్ఓతో పాటు వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమావేశఛర రోగులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. జనవరి నుంచి మే వరకు 1.12 లక్షల మంది అవుట్ పేషట్లు, 25వేల మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా మోకాలి చిప్పల మార్పిడితో పాటు ఇతర ఆర్థిపెడిక్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకంగా యూనిట్ను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ బ్లాక్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. ఆయన వెంట ఆర్ఎంఓలు గీతా వాణి, ప్రశాంతి, డాక్టర్లు మనీషా, సతీష్, ఉపేందర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూర్యాపేటటౌన్ : స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం తనిఖీ చేశారు. కంప్యూటర్ ల్యాబ్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్ను, టాయిలెట్లను పరిశీలించారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో తెలుగు పుస్తకం చదివించారు. స్పష్టంగా చదివిన వారిని అభినందించారు. బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ అశోక్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంట లకు చింతల పాలెం మండలం దొండపాడు, బుగ్గమాదారంలో లిఫ్ట్ పనులను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం రూ.10 కోట్లతో చేపట్టే మేళ్లచెరువు –చింతిర్యాల రోడ్డు పనులు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మఠంపల్లి మండలంలో రూ 2.20 కోట్లతో చేపట్టనున్న కామంచికుంటతండా నుంచి చింతలపాలెం రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బక్కమంతులగూడెం నుంచి అల్లీపురం వరకు రూ.42 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలిఫ డీఐఈఓ సులోచనారాణి ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈఓ సులోచనా రాణి అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. కళాశాల నూతన భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అధ్యాపకులు ఉత్తమ విద్యను అందిస్తున్నారని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ మారం హరిప్రసాద్, అధ్యాపకులు ఉన్నారు. నిరుపేదలను గుర్తించాలినూతనకల్ : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అర్హులైన నిరుపేదలను గుర్తించాలని గృహనిర్మాణశాఖ డిప్యూటీ డీఈ జబ్బార్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మార్గదర్శకాలపై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో గుడిసెలు, టార్పాలిన్ కవర్లతో ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో ఉంటున్న వారిని గుర్తించి అధికారులకు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. ఎంపీడీఓ సునీత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. రేపు రౌండ్ టేబుల్ సమావేశం సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం రూపొందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న సూర్యాపేట జడ్పీ హైస్కూల్లో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ హాజరు కానున్నారని, విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యావేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
అభివృది్ధ పనుల జాడేది..!
మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ పలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు, తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పడకేశాయి. మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదు. పట్టణంలో రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులకు ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసినా నేటికీ టెండర్లు ఖరారు కాక పోవడం విస్మయానికి గురి చేస్తున్నది. బిల్లులు సమయానికి రావేమోనన్న సందేహంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారే కానీ పనులు చేపట్టడంలో శ్రద్ధ వహించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ఖరారులో జాప్యం మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు జనవరిలో శంకుస్థాపన చేశారు. రూ.6 కోట్లతో మాలిపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, మరో రూ.6 కోట్లతో పలు వార్డులలో సీసీ రోడ్లు, రూ.3 కోట్లతో వివిధ కాలనీలలో సైడ్ డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయించారు. కాని నేటికీ ఆయా పనులకు టెండర్లు ఖరారు కాలేదు. పనులు చేస్తే బిల్లులు రావేమోనన్న సందేహమో, లేదా వేరే కారణమో తెలియదు కానీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టణాభివృద్ధి కింద తిరుమలగిరి మున్సిపాల్టికి రూ.15 కోట్లు మంజూరైనట్లు 8 నెలల క్రితం అధికారులు ప్రకటించారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు జనవరి 19న ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు చేయడానికి రోడ్లను శుభ్రం చేసి చదును కూడా చేశారు. ఆ తరువాత పనులు నిలిపివేశారు. దాంతో మున్సిపాలిటీ పరిధిలోని చాలా వార్డులలో రోడ్లు, సైడ్ డ్రెయిన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవడానికి టెక్నికల్ ఆమోదం కోసం ఉన్నతాధికారులకు పంపినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తున్నది. ఫ ఆరు నెలల క్రితం రూ.15 కోట్లతో శంకుస్థాపన ఫ నేటికీ ఖరారు కాని టెండర్లు ఫ రోడ్లు సరిగా లేక ప్రమాదాలు ఫ వెంటనే పనులు ప్రారంభించాలని స్థానికుల వేడుకోలు తిరుమలగిరి – తొర్రూరు ప్రధాన రహదారి నుంచి మాలిపురం చెరువు కట్ట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.6 కోట్లతో శంకుస్థాపన చేశారు. కాని పనులు చేపట్టలేదు. వివిధ గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే నిత్యం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి వచ్చి వెళుతుంటారు. రోడ్డు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి డబుల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి. కేశిడి కవితారెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్, మాలిపురం. తిరుమలగిరి పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. వాటితో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించాం. కానీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదు. ఆయా పనులకు మళ్లీ టెండర్లు వేయడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అనుమతి రాగానే టెండర్లు పిలుస్తాం. సీహెచ్.వెంకన్న, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి -
సర్ను సమర్థవంతంగా నిర్వహించాలి
నాగారం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ ఆదేశించారు. శుక్రవారం నాగారం జడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలు, బీఎల్ఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పుల సవరణకు ప్రభుత్వం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ నెల 25 నుంచి బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు కలిగిన వారి వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు. అనంతరం బీఎల్ఓలకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ షాహిన్బేగం, ఆర్ఐ జార్జి రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్ -
లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. -
సురక్షిత పట్టణంగా సూర్యాపేట : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రాన్ని సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట టౌన్–1 పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణను కొత్తగా ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసినట్లు ఆయన వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ఎస్ఐలు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూర్యాపేటటౌన్ : ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో రాబోయే రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయన జాగ్రత్తలు వివరించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం పొందవద్దని, ఆయా ప్రాంతాల్లో పిడుగు పాటు వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు వాతావరణంలో మార్పులను గమనించి ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకోలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్ 100ను సంప్రదించాలని కోరారు. ఫ పట్టణంలో అదనంగా 20 సీసీ కెమెరాలు -
సర్ పకడ్బందీగా చేపట్టాలి
తుంగతుర్తి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)ను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో బీఎల్ఓలకు శిక్షణకు సంబంధించిన మెటీరియల్స్ను ఆయన పంపిణీ చేశారు. ఈ నెల 25 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు కలిగిన వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దయానందం, ఎన్యూమరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో పూరిళ్లను గుర్తించాలిఫ గృహనిర్మాణశాఖ పీడీ సిద్ధార్థ చిలుకూరు : గ్రామాల్లో పూరిళ్లలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి జాబితా రూపొందించాలని హౌసింగ్ పీడీ సిద్ధార్థ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఇందిర్మ ఇళ్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, ఏఈ మూర్తి, ఏపీఓ వీరబాబు పాల్గొన్నారు. భవిత కేంద్రాల ద్వారా ఉపకరణాలుటీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి సూర్యాపేట : ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీయూఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి కోరారు. గురువారం ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి ఏఓ కె.శ్రీలతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 వరకు టెట్ ఉత్తీర్ణత సాధించేందుకు సుప్రీం కోర్టు గడువు విధించిందని, ఆలోగా టెట్ అర్హత సాధించని వారి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఉపేందర్, జితేందర్రెడ్డి, కోటిరెడ్డి ఉన్నారు. మోస్తరు వర్షంభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు వర్షం పడింది. సరాసరిగా 10.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతగిరి మండలంలో 39.6, కోదాడ మండలంలో 23.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగారం మండలంలో 3.5, తిరుమలగిరిలో 7.9, తుంగతుర్తి 8.3, మద్దిరాల 2.5, నూతనకల్ 10.6, జాజిరెడ్డిగూడెం 13.5, సూర్యాపేట 0.3, ఆత్మకూర్ 11.5, మోతె 15.4, చివ్వెంల 3.9, పెన్ పహాడ్ 3.9, మునగాల 9.4, నడిగూడెం 14.4, చిలుకూరు 16.5, గరిడేపల్లి 4.9, నేరేడుచర్ల 1.3, మట్టంపల్లి 1.2, హుజూర్నగర్ 14.1, మేళ్లచెరువు 18.3 చింతలపాలెం 8.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. ఈ వర్షంతో ఇటీవల రైతులు వేసిన పత్తి, మెట్ట పంటల విత్తనాలు మొలకెత్తనున్నాయి. -
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విపత్తు నిర్వహణ, సహాయక చర్యలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ తమ బాధ్యతలను గుర్తించి, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే కాలనీలను, ఎక్కువ ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉన్న ఏరియాలను గుర్తించాలని సూచించారు. వరద బాధితులను తరలించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తంచి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా
కోదాడరూరల్ : రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. గురువారం కోదాడ రూరల్ పోలీస్స్టేషన్లో వార్షిక తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం ద్వారా నేరాలను అరికట్టాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం పట్టణంలోని షీ టీం కార్యాలయాన్ని పరిశీలించారు. మహిళలు, విద్యార్థుల భద్రతపై అమలువుతున్న చట్టాలపై విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగించాలని సూచించారు. ట్రాఫిక్ స్టేషన్ను తనిఖీ చేసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, డీసీఆర్బీ సీఐ మగ్దూం అలీ, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, షీటీం ఎస్ఐ మల్లేశం, అఖిల్, అంజన్రెడ్డి, శేఖర్రెడ్డి, స్బిబంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం
నేరేడుచర్ల : వానాకాలం సీజన్లో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రస్తుతం జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి తెలిపారు. గురువారం నేరేడుచర్లలోని ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్లో 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారని, ఈ సంవత్సరం 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందన్నారు. జూన్ నుంచి పంట కాలం పూర్తయ్యే వరకు నిరంతరంగా యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులు ఒకే సారి కాకుండా అవసరమున్న మేరకు యూరియాను కొనుగోలు చేయాలని సూచించారు. మండలం యూనిట్గా గురువారం నుంచి యూరియా యాప్ ప్రారంభమైందన్నారు. ఎల్నీనో ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసే అవకాశాలు లేవని, సాగర్ ప్రాజెక్టులో కూడా సమృద్ధిగా నీరు లేనందున రైతులు వర్షాధార, ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావెద్, సహకార సంఘం సిబ్బంది ఉన్నారు. -
లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని గురువారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ పథకం..
భానుపురి (సూర్యాపేట) : పేదల సొంతింటి కలను నేరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటనలకే పరిమితమవుతోంది. మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించింది. ఈ ఇందిరమ్మ ఇళ్లు కొన్ని పూర్తి కాగా మరి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మొదటి విడతలో ఇళ్లు రాని వారికి జూన్ 2న రెండో విడతలో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ జిల్లా వ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక మాత్రం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా గుడిసె ఇళ్ల సర్వే చేపట్టింది. గుడిసెలున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో లబ్ధిదారుల ఎంపిక ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొదటి విడతలో 1600 ఇళ్ల గృహ ప్రవేశాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500ల చొప్పున జిల్లాకు 12,868 ఇళ్లను కేటాయించింది. ఇందులో 8,200 ఇళ్లు మంజూరయ్యాయి. 1600 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయగా 6200 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి మరో 400 నుంచి 500 వరకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడతకు ఎదురు చూపులు ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల జాబితాను ఇవ్వగా..మొదటి విడతలో అందరికీ ఇవ్వలేని పరిస్థితి. దాంతో ప్రభుత్వం దాదాపు ఆరు నెలలుగా రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. దాంతో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండోవిడతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడతను అసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, జాబితాలు వస్తాయని భావించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రకటనలే తప్ప.. ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే గుడిసెలు ఉన్న ఇళ్ల వివరాలను సేకరించారు. జిల్లాలో 3045 గుడిసె ఇళ్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చగా.. వీటిని మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 400 ఇళ్ల వరకు సర్వే పూర్తి కాగా.. మరో వారం రోజుల్లో మిగతా గుడిసె ఇళ్ల సర్వే పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రెండోవిడత ఇళ్లలో వీరికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. గుడిసెల వారితో పాటు మిగతా వారి ఎంపిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో దరఖాస్తు చేకున్న అర్హులు అయోమయానికి గురవుతున్నారు. ఫ జూన్ 2న జాబితాలంటూ ప్రభుత్వం ప్రకటనలు ఫ ఇంతవరకు మంజూరు కాని రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఫ గుడిసెల సర్వేతో మారిన ప్రాధాన్యతలు ఫ ఆందోళనలో అర్హులు -
చెట్ల కింద చదువులు
సూర్యాపేట హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలచెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండగా అదికూడా శిథిలావస్థకు చేరడంతో చెట్లకిందే చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పాఠశాలలో 35 మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలకు రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ పైకప్పు రేకులు పగిలిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు కారుతుండటంతో విద్యార్థులను గదుల్లో కూర్చోబెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. మౌలిక వసతులు సైతం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం విద్య కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఇలాంటి పాఠశాలలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తరగతి గదులు లేక.. పాఠశాలలో రెండు గదులు, అవి కూడా చిన్నగా.. వెంటిలేషన్ లేకుండా ఉన్నాయి. గదుల పైకప్పు రేకులు పగిలిపోవడంతో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయి. దాంతో ఉపాధ్యాయులు విద్యార్థులను చెట్ల కిందే కూర్చొబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. భవనానికి చెల్లించాల్సిన అద్దెను పాఠశాల గ్రాంట్లతో పాటు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు వెచ్చించి చెల్లిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు సొంత భవనం, సరైన తరగతి గదులు, ఆటస్థలం, ఇతర వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య స్థిరంగా ఉండిపోతోందని పేర్కొంటున్నారు. హరిజనవాడ ప్రాంతంలోని చిన్నారుల విద్యాభివృద్ధికి ఈ పాఠశాల కీలకంగా ఉన్నందున వెంటనే సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫ అద్దె భవనం.. అరకొర వసతులు ఫ సూర్యాపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఫ సొంత భవనం లేక అడ్మిషన్లపై ప్రభావం -
అధిక రసాయనాలతో భూమికి నష్టం
మద్దిరాల : పంటలకు అత్యధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గి దిగుబడి తగ్గుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్త డి.నరేష్ తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తల సహకారంతో గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో నేల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనీషారూహి, ఏఈఓ అయేషా, రైతులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై నిఘా
కోదాడరూరల్ : వానాకాల సీజన్ ప్రారంభమైనందున రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు అవసరమైన విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వాటితో సాగు చేస్తే సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా నుంచి మండలం వరకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. పోలీసుశాఖ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతోంది. దానికి తోడు అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక టీంలు నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా నుంచి మండలం వరకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీఏఓలతో పాటు జిల్లాస్థాయి అధికారులతో టీం ఏర్పాటు చేశారు. దాంతో పాటు డివిజన్, మండల స్థాయిలో టీంలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఎస్ఐ, ఏఓ, తహసీల్దార్తో కూడిన టాస్క్ఫోర్స్ బృందం విత్తన షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. మండల, డివిజన్ స్థాయిలో డీలర్లు, షాపుల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులకు అవగాహన నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోస పోవద్దని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయిస్తుంటారని, ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన తప్పక రసీదు తీసుకోవాలని, దానిని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫ గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ఫ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు ఫ రైతులను అప్రమత్తం చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు -
కాంగ్రెస్తోనే గోదావరి జలాల సాధన
అర్వపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే ఎస్సారెస్సీ కాలు వల నిర్మాణం, గోదావరి జలాల సాధన జరిగిందని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్హాల్లో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్కు అభివృద్ధి చేయడం తప్ప హత్య రాజకీయాలు తెలియవన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహించిందని ఆరోపించారు. అధికారం కోల్పోయిన బాధతో మాజీ మంత్రి జగదీష్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కిశోర్ కాంగ్రెస్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో న్యాయవాది యుగేంధర్, ఓయూ నేత నగేష్తోపాటు అనేక మందిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి హయాంలోనే ఈప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. త్వరలో లక్ష మందితో జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ధరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్రెడ్డి, నర్సింగ శ్రీనివాస్గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, నాయకులు మడ్డి పద్మ, శిగ నసీర్గౌడ్, రత్నం సంతోష్, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, మంచాల రాంమ్మూర్తి, మేకల రాంబాబు, ఉప్పలయ్య, భిక్షం, శ్రీధర్రెడ్డి, ఖాజ, శ్రీనివాస్, యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్
హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. బుధవారం హుజూర్నగర్లో ఆ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని, మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, రేవంత్ సర్కార్ అసమర్థ సర్కార్లాగా మారిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజాసేవ చేయడానికి యువతను స్వచ్ఛమైన రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎల్డీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈనెల 27న వరంగల్లో పార్టీ జాతీయ అక్ష్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్సింగ్ చౌదరి మార్గదర్శకత్వంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎల్డీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయన్నారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్గౌడ్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద దిలీప్కుమార్కు జిల్లా అధ్యక్షుడు నరేందర్గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరసింహారావు, విశాల్ పంజరి, రిషబ్ జైష్, కోశాధికారి గిరి కుండే పాల్గొన్నారు. ఫ టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ -
‘జాన్పహాడ్’ కాలువలకు మరమ్మతులు
ఫ కాలువ కట్టల వెడల్పు, లైనింగ్ పనులకు రూ.63 కోట్లు మంజూరు ఫ నేరేడుచర్ల మండలంలో ఆర్–3 కాలువ పనులు ముమ్మరం ఫ పట్టణ పరిధిలోనూ పనులు చేపట్టాలని రైతుల డిమాండ్ నేరేడుచర్ల : నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని జాన్పహాడ్ మేజర్, దాని పరిధిలోని 9 మైనర్ కాలువలు కొత్తకళను సంతరించుకోబోతున్నాయి. ఆయా కాలువలను మరమ్మతులు చేపట్టి లైనింగ్ వేసేందుకు నీటి పారుదల శాఖ రూ.63 కోట్ల నిధులు మంజూరు చేసంది. జాన్పహాడ్ మేజర్ నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో మొత్తం 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని పరిధిలో 38వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో మేజర్తోపాటు మైనర్ కాలువ కట్టలు బలహీనంగా మారి తరచూ గండ్లు పడడంతో సాగునీరు అందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తన శాఖ నుంచి నిధులు మంజూరు చేయించారు. వెంటనే జాన్పహాడ్ మేజర్, మైనర్ల మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో పనులు ముమ్మరం చేశారు. కొనసాగుతున్న ఆర్–3 పనులు జాన్పహాడ్ మేజర్ పరిధిలోని నేరేడుచర్ల మండలంలో 8 కిలోమీటర్ల పొడవు, 3,500 ఎకరాల ఆయకట్టు కలిగిన ఆర్–3 కాలువ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ముందుగా మండల పరిధిలో 6 కిలోమీటర్ల వరకు మరమ్మతులు, కాలువ వెడల్లు పనులు చేపట్టారు. ఇవి పూర్తికాగానే మరో వారం రోజుల్లో లైనింగ్ పనులు చేయనున్నారు. నేరేడుచర్ల పట్టణం గుండా వెళ్తున్న ఆర్–3 కాలువ పట్టణ పరిధిలోని రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీంతో ఇప్పటికే కాలువ కట్టలను ఆక్రమించి నివాస గృహాలు, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు. కొందరు నివాసితులు, వ్యాపారులు చెత్తాచెదారాన్ని కాలువలోనే పడేస్తుండడంతో పూడిక పేరుకుపోయింది. ఫలితంగా నీటి ప్రవాహం పెరిగినప్పుడు కాలువ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోంది. మరోవైపు నీరు వృథా అవుతుండడంతో కాలువ చివరి భూములకు సాగునీరు అందక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నారు. కాలువ లైనింగ్ పనులు పూర్తయితేనే పట్టణంలో నీటి వృథా అరికట్టబడి, చివరి భూములు సస్యశ్యామలం అవుతాయి. నీటి వృథాకు అడ్డుకట్ట పడేనా! ప్రస్తుతం ఆర్–3 కాలువ ఇరువైపులా పనులు జరుగుతున్నప్పటికీ.. పట్టణ పరిధిలో మాత్రం పనులు చేపట్టడం లేదు. దీంతో మళ్లీ పాత సమస్యే పునరావృతమై నీరు వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ గుండా వెళ్లే కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పనులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
‘సర్’కు రాజకీయ నేతలు సహకరించాలి
పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)ను మరింత పటిష్టం చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో ఎండ్–టు–ఎండ్ వ్యర్థాల సేకరణ, శానిటేషన్ అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి రమాదేవి, నాగరాజు, సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పారదర్శకంగా నిర్వహించేందుకు 18న బూత్ లెవెల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ ఇస్తారని వివరించారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా రెవిన్యూ అధికారి డి.ప్రేమ్రాజ్, నాయకులు రాజేశ్వర్రావు, అంజాద్, కరుణాకర్ రెడ్డి, సత్యనారాయణ, అబీద్, గోపి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ పిల్లలకు ప్రభుత్వ బడిలో అడ్మిషన్లు
తిరుమలగిరి (తుంగతుర్తి) : సూర్యాపేట మండలం మందలవాడలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న దండుగుల శ్రీలత తమ ఇద్దరు పిల్లలను బుధవారం తమ సొంత ఊరైన తిరుమలగిరి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రైవేట్లో చదువుతున్న తమ కుమార్తె దీక్ష శ్రీకి 3వ తరగతిలో, కుమారుడు శ్రీయాన్ 2వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేందుకు తమ పిల్లలను చేర్పించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, సత్యనారాయణరెడ్డి, వెంకటరామనర్సయ్య, సౌమ్యాబాయి, రవీందర్, గిరి పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం జరిపారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. డీఈఈ–సెట్ ఫేజ్2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలనల్లగొండ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సుల్లో 2026–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు డీఈఈ–సెట్–2026 ఫేజ్–2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదలైనట్లు ప్రభు త్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి జూన్ 18న డైట్, నల్లగొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్ ఆప్షన్, ఫేజ్–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 21న వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్, రోస్టర్ పద్ధతిన జూన్ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. అభ్యర్థులు జూన్ 25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 1 నుంచి క్లాస్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రాజీ కోసం బారులుహుజూర్నగర్ : ఈనెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా తమ కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు బుధవారం హుజూర్నగర్ పట్టణంలో కోర్టుకు పోటెత్తారు. వివిధ మండలాల నుంచి కక్షిదారులు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎక్కువ మంది ఒకేసారి రావడంతో క్యూలో నిలబెట్టి కోర్టు లోపలికి పిలిచారు. అనంతరం న్యాయమూర్తులు కక్షిదారులతో చర్చించారు. జాతీయ లోక్ అదా లత్ రోజు తుది తీర్పు ఇచ్చి రాజీ పత్రాలు అందజేయనున్నట్టు కోర్టు సిబ్బంది తెలిపారు. -
ఓట్లు తొలగించే పనిలో కాంగ్రెస్, బీజేపీ
హుజూర్నగర్ : కాంగ్రెస్, బీజేపీలు ఓట్లను తొలగించే పనిలో ఉన్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్కుమార్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే మనకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఆంధ్రా వాళ్లు రెండుసార్లు దొంగతనంగా నీళ్లు తీసుకుపోతుంటే చేతగాని స్థితిలో ఇక్కడి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నరేంద్రమోదీ కలయికతో వచ్చిన హైబ్రీడ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఎల్ఓలతో కలిసి మన ఓటర్లను కాపాడు కోవాలని, ప్రతి కార్యకర్త సమయానికి తగ్గట్టుగా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను, వార్డు మెంబర్లను టార్గెట్ చేసి దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దానికి కార్యకర్తలు భయపడ వద్దని మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పార్టీ కార్యకర్తలంతా ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, పిల్లుట్ల రఘు, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, మారిపెద్ది శ్రీను, బెల్లంకొండ అమర్, నియోజకవర్గంలోని ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మనకు స్వేచ్ఛ ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
కాలువ చివరి భూములకు నీరందించాలి
ఆర్–3 కాలువ లైనింగ్ పనులను పూర్తిచేసి కాలువ చివరి భూములకు నీరందేలా చూడాలి. కాలువకు మొదట్లో, చివర్లో మాత్రమే పనులు చేస్తున్నారు. పట్టణం గుండా వెళ్లే భాగంలో పనులు చేపట్టకపోతే నీరు ఎప్పటిలాగే వృథా అవుతుంది. అధికారులు స్పందించి పట్టణ పరిధిలోనూ పనులు చేపట్టాలి. – మన్నెం గురువయ్య, రైతు, నేరేడుచర్ల జాన్పహాడ్ మేజర్ కాలువ పరిధిలోని మేజర్, మైనర్ కాలువలకు లైనింగ్, మరమ్మతులు చేపడుతున్నాం. ఆర్–3 కాలువకు పట్టణ పరిధి మినహా మిగిలిన అన్ని చోట్లా లైనింగ్ పూర్తిచేస్తాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పట్టణ పరిధిలోనూ యుద్ధప్రాతిపదికన పనులు చేపడతాం. – అమరేందర్రెడ్డి, ఎన్ఎస్పీ డీఈఈ, నేరేడుచర్ల -
రైతు భరోసా ఏది?
భానుపురి (సూర్యాపేట) : రైతు భరోసా పథకం అమలుపై జిల్లా రైతాంగంలో గందరగోళం నెలకొంది. అసలు రైతు భరోసా ఉన్నట్టా.. లేనట్లా అనే సందేహాలు రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి సాయం గత యాసంగి సీజన్లో రెండు విడతల్లో కేవలం రెండెకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించింది. మిగతా నిధులను జమ చేయకపోగా.. ఈలోపు 2026–27 వానాకాలం వ్యవసాయ సీజన్ రానే వచ్చింది. రైతులు విత్తనాలను కొనుగోలు చేయడం, దుక్కులు దున్నుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అయినా ఇంతవరకూ గత యాసంగి సీజన్ రైతు భరోసా కానీ.. ప్రస్తుత సీజన్ నిధులపై గానీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఎకరానికి రూ.12 వేలు రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు చిన్నసన్నకారు రైతులే ఉన్నారు. వీరంతా పంటల సాగు కోసం బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అప్పులు తీసుకొస్తుంటారు. పంటల అమ్మకం సమయంలో తెచ్చిన ఈ అప్పులు తీర్చేందుకు సరిపోతుంది. దీనిని గమనించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా సంవత్సరానికి రూ.10వేలను రైతులకు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రూ.15వేలుగా హామీ ఇచ్చి.. ప్రస్తుతం సంవత్సరానికి రూ.12వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో.. యాసంగి సీజన్ ప్రారంభంలోనూ రూ.6 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా ఆలస్యంగానే..! సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2,89,371 మంది రైతులు ఉన్నారు. వీరు దాదాపు 6 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. గుంట భూమి నుంచి పది ఎకరాలకు పైబడి భూమిని కలిగిన రైతులు ఉన్నారు. వీరికి పంటల సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు రెండేళ్లుగా ఆలస్యంగా జమ చేస్తున్నారు. ప్రభుత్వం కొన్నిసార్లు పంటల సాగు పూర్తయిన తర్వాత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ప్రధానంగా నిధుల సమీకరణలో వస్తున్న ఇబ్బందులతో ఇలా జరుగుతోంది. ఈ పథకం ప్రారంభమైన 2018 నుంచి ఒకే విడతలో రైతులందరికీ పెట్టుబడిసాయం అందించారు. రానురాను నిధుల సమస్య కారణంగా విడతల వారీగా ఇస్తుండగా.. మొదటగా ఎకరం, రెండెకరాల భూమికి ఇస్తూ వస్తున్నారు. ఫ గత యాసంగి సీజన్లో రెండెకరాల వరకే జమ ఫ ప్రస్తుతం వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం ఫ పెట్టుబడి సాయానికి ఎదురుచూస్తున్న రైతులు ఫ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం 2025–26 యాసంగి సీజన్లో గతానికి భిన్నంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేసింది. భూమి ఉన్న రైతులందరికీ మూడు విడతల్లో రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు జిల్లాలో భూమి ఉన్న 2,87,371 మంది రైతులకు గాను.. 2.61 లక్షల మందికి మొదటి విడతగా గుంట భూమి నుంచి ఎకరం భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. మరో 25 రోజులకు రెండెకరాల వరకు.. అంటే దాదాపు 2 లక్షల మంది రైతులకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మూడో విడత విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నిధులను ప్రభుత్వం ఇస్తుందా.. లేదా.. అనే విషయంలో రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలుకావడంతో రైతులు వరి, పత్తి విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. వీరికి ఈ సీజన్ రైతుభరోసా నిధులపై స్పష్టత లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘సర్’ను పకడ్బందీగా నిర్వహించండి
భానుపురి (సూర్యాపేట) : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పకడ్బందీగా నిర్వహిస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 25 నుంచి నెల రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2002 నాటికి ఓటరుగా నమోదై, ప్రస్తుతం ఉన్న వారి వివరాలను ధృవీకరిస్తారని, ఒకవేళ 2002 నాటికి ఓటరు జాబితాలో పేరు లేకపోతే, వారిని తల్లి లేదా తండ్రి వివరాలతో మ్యాపింగ్ చేస్తారని స్పష్టం చేశారు. ఓటరు పేరు, తండ్రి పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉంటే సరిచేస్తారన్నారు. చనిపోయిన వారి పేర్లను శాశ్వతంగా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే, వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తారన్నారు. తుది డ్రాఫ్ట్ జాబితాలో పేరు నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామని, ఇందులో ఏవైనా లోపాలు కనిపిస్తే సంబంధిత ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ అడ్రస్ మార్చుకోవడానికి ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్డీఓలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ వి.రమేష్ తహసీల్దార్లు, సూపర్వైజర్లు, టెక్నికల్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నిధులున్నా.. నిరక్ష్యమేనా!
మఠంపల్లి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రధాన అంతర్ రాష్ట్ర రహదారి అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లి నుంచి హుజూర్నగర్ వరకు గల 25 కిలోమీటర్ల ప్రధాన రహదారిని అంతర్ రాష్ట్ర రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే రూ.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. కానీ, ఇప్పటికీ ప్రధాన రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది సిమెంట్ లారీలు.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలతోపాటు, మఠంపల్లి మండల పరిధిలోని భారీ సిమెంట్ పరిశ్రమలకు చెందిన వందలాది లారీలు, అతి భారీ వాహనాలు నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణిస్తుంటాయి. దీనివల్ల ఈ రోడ్డు అనునిత్యం రద్దీగా ఉంటోంది. రోడ్డు రద్దీగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 48 కల్వర్టులకు 36 పూర్తి.. రోడ్డు పనులు ప్రారంభించడానికి 25 కిలోమీటర్లలో సుమారు 48 చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉందని వాటిలో 36 కల్వర్టులు పూర్తిచేశామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. కల్వర్టుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ ప్రధాన రహదారి పనులు ప్రారంభించపోవడంతో వాహనాల రద్దీతో ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరుతున్నారు. మట్టపల్లి–హుజూర్నగర్ వరకు 25 కిలోమీటర్ల అంతర్ రాష్ట్ర రహదారిలో ప్రస్తుతం కల్వర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 48 చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా 36 చోట్ల కల్వర్టులు నిర్మించాం. డబుల్ రోడ్డు పనులు నెల రోజుల్లో ప్రారంభించి ఒక సంవత్సరం కాలంలోనే మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –శివకుమార్, ఆర్అండ్బీ ఏఈఈ మఠంపల్లి ఫ మట్టపల్లి–హుజూర్నగర్ రోడ్డుకు రూ.80 కోట్లు మంజూరు ఫ రెండేళ్లయినా నత్తనడకన పనులు ఫ భారీ వాహనాల రాకపోకలతో రద్దీగా మారిన రోడ్డు ఫ అంతర్ రాష్ట్ర రహదారిపై వాహనదారుల అవస్థలు -
ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం
నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కొలువైన ఆంజనేయస్వామికి మంగళవారం భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొలచిన దిలీప్కుమార్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ స్వామివారికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం తమలపాకులతో స్వామివారిని విశేషంగా అలంకరించి పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, పెలిజాల వెంకటరమణారావు, తాటికొండ వెంకట్రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, శ్రీనివాస్రావు, పోలవరపు బెనర్జీ, జెట్టి వెంకన్న, యడవల్లి వెంకట్రెడ్డి, దుర్గాప్రసాద్, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(నల్లగొండ ) : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. 2013 పీఆర్సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను వెంటనే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 పీఆర్సీని అమలు పరిచి బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోనగి రి శంకరయ్య, రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తు ల యాదగిరి, పల్రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్ల య్య, శ్రీను, విఎస్పి.రావు, వివి.రెడ్డి, వి ఎ.రెడ్డి, రవీందర్, ఎస్ఆర్రెడ్డి, ఎండీ.గౌస్ పాల్గొన్నారు. -
వేగవంతంగా సేవలు అందించాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు వేగవంతంగా సేవలు అందించాలని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషనన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి వేళల్లో గ్రామాల్లో బీట్, పోలీస్ సిబ్బంది, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, త్వరితగతిన స్పందించి న్యాయం చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. రాత్రి సమయంలో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు భద్రత కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు అర్వపల్లి : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏజీ రాంబాబు అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెంలో మన ఇసుక–మన వాహనంలో భాగంగా ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్లను ఆయన తనిఖీ చేశారు. మొబైల్ ఫోన్కు ఓటీపీ వచ్చాకే క్వారీలకు ట్రాక్టర్లు వెళ్లాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేయాలని ఆదేశించారు. ఇసుక లారీలు అధిక లోడ్తో వెళితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్ఐ మహమూద్, హెడ్ కానిస్టేబుల్ పాష, మైన్స్ సిబ్బంది ఉన్నారు. జీతాలు చెల్లించాలని వినతిసూర్యాపేటటౌన్ : డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్, జూన్ నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని, జిల్లా విద్యాశాఖ అధికారి అనుబంధ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. జూన్ 12 నుంచి పునర్నియామక పత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రాంసింగ్, జిల్లా కార్యదర్శి ఎండీ సాహెబ్ అలీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.క్రాంతికుమార్ పాల్గొన్నారు. 21న జిల్లా మహాసభలునూతనకల్ : కోదాడ పట్టణంలో ఈ నెల 21న నిర్వహించే ఏఐకేఎంఎస్ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్ కోరారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్గుబెల్లి వెంకట్రెడ్డి, దాసరి శ్రీనివాస్, ఎస్కె మైబెల్లి, సుంకిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ముప్పాని సుదర్శన్రెడ్డి, మల్లయ్య, పన్నాల వెంకట్రెడ్డి, జిలేలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతికి నిరంతర కృషి
సూర్యాపేట : రైతులు, మహిళా సంఘాల అభ్యున్నతికి నాబార్డు నిరంతరం కృషి చేస్తోందని నాబార్డు తెలంగాణ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాబార్డు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతలో నల్లగొండ క్లస్టర్ కింద ఉన్న సూర్యాపేటను.. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మార్చి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా నాబార్డు ప్రతినిధిగా డి.రవీందర్నాయక్ను నియమించినట్టు పేర్కొన్నారు. సూర్యాపేటలో ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డెయిరీ రంగాల్లో మూడు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ ప్రతినిధులు ఎల్.డి.ఎం నాగప్రసాద్ డీసీసీబీ సీఈఓ శంకర్రావు, టీజీబీ చీఫ్ మేనేజర్ అజయ్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ నరేష్, ఎన్జీఓ ప్రతినిధులు రమేష్, నిఖిల్ పాల్గొన్నారు. ఫ నాబార్డు సీజీఎం ఉదయభాస్కర్ -
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం
సూర్యాపేటటౌన్ : వానాకాలం సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులకు కారణమవుతుందని అన్నారు. మంగళవారం ఆయన సాక్షి ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ‘డ్రై డే’గా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో నీరు నిల్వ ఉండే పాత్రలు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు వంటి వాటిని పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా చూస్తారు. దోమల ఉత్పత్తిని అరికట్టడంలో డ్రై డే కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామాల్లో మురుగు నీరు నిలిచిన చోట డ్రై డే రోజు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు దోమల నివారణకు మందు చల్లుతారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలి. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పీహెచ్సీలో రక్త నమూనాలను తీసుకుని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో గల టీ హబ్కు పంపించి పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత రిపోర్టు మరుసటి రోజు రోగి ఫోన్కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తారు. చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది జ్వరాల బారిన పడినా, అనారోగ్యానికి గురైనా వెంటనే అక్కడికి వెళ్లేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో పది మంది డాక్టర్లతో ఒక టీం ఉంటుంది. అలాగే సూర్యాపేట, కోదాడ డివిజన్ స్థాయిలో పది మంది వైద్యులతో మరొక టీం, మండల స్థాయిలో మెడికల్ ఆఫీసర్తోపాటు వైద్య సిబ్బంది మొత్తం నలుగురితో ఒక టీంను ఏర్పాటు చేశాం. వీరు ఎక్కువ మంది రోగాల బారిన పడిన వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సేవలందిస్తారు. సూర్యాపేట జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒకటి జనరల్ ఆస్పత్రి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సమీప ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలి. సీజనల్ వ్యాధులను నివారించడం ప్రజల చేతుల్లోనే ఉంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ కాకుండా చూడడం, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. సీజనల్ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రతిఒక్కరూ ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలని కోరాం. జిల్లాలో దోమల నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు లేకుండా ప్రజలు కూడా సహకరించాలి. ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం ఫ ప్రతి పీహెచ్సీలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ -
కల్నల్ సంతోష్బాబు త్యాగం మరువలేనిది
సూర్యాపేట : అమర జవాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు త్యాగం మరువలేనిదని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన సంతోష్ బాబు త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం కోసం పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్బాబు వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, డీఎస్పీ ప్రసన్నకుమార్, కల్నల్ సంతోష్బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తొలిరోజు 13 శాతమే
మోగిన బడి గంట ● పండుగలా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం ● పాఠశాలల్లో విద్యార్థులకు పూలతో స్వాగతం ● అమావాస్య ప్రభావంతో తగ్గిన విద్యార్థుల హాజరుసూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమవడంతో జిల్లావ్యాప్తంగా బడి గంట మోగింది. పలుచోట్ల ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణాలను రంగురంగుల కాగితాలు, మామిడి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించారు. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి ఆప్యాయంగా స్వాగతం పలికారు. మొదటి రోజు బడులకు వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులు, ఉపాధ్యాయులను ఆనందంగా గడిపారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను మొదటి రోజే పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల్లో మిఠాయిలు పంచి విద్యార్థులను ఉత్సాహపరిచారు. తొలిరోజు అమావాస్య ఆటంకంతొలి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కేవలం 13 శాతం విద్యార్థులే హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా హాజరు శాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పనుల నేపథ్యంలో కుటుంబాలతో ఉండడం వంటి బడులకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వచ్చే రెండు మూడు రోజుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేతచాలా ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. దీంతో విద్యార్థులు కొత్త పుస్తకాలు రావడంతో ఆనందంలో మునిగిపోయారు. అమావాస్య కావడంతో కొత్త అడ్మిషన్లు కూడా ఎక్కడా రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాలే.. మొదటి రోజు పాఠశాలలకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాని పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్లతో పాటు ఒకటి రెండు హైస్కూళ్లలో విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలను ఓపెన్ చేసి ఖాళీగా కూర్చున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే పాఠశాలలకు వచ్చారు.క్రమశిక్షణతో చదవాలి : ఎస్పీ సూర్యాపేటటౌన్ : నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్న విద్యార్థులకు జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. మీ రక్షణ మా బాధ్యత.. ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవాలని పేర్కొన్నారు. కష్టపడి చదువుకోవాలని, తోటివారితో స్నేహంగా ఉండాలని, చెడు అలవాట్లకు గురి కావద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాల లేదా కళాశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో అనవసరమైన మెసేజ్లు పెట్టవద్దని, చదువులో మీ లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుంచి మీ ఫోన్లకు వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని కోరారు. వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మీ లక్ష్యాల సాధనలో క్రమశిక్షణే మీ అసలైన ఆయుధం. ఈ విద్యా సంవత్సరం మీకు విజయాన్ని అందించాలని ఆకాక్షించారు. -
‘సర్’లో బీఎల్ఏల పాత్రే కీలకం
అర్వపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు కీలకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. అర్వపల్లిలో సోమవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, బీఆర్ఎఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి జగదీష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడటానికి బీఎల్ఏలు జాగ్రత్తగా పనిచేయాలని కోరారు. గోదావరి జలాల విడుదల, యూరియా పంపిణీ, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలయికలో వచ్చిన హైబ్రీడ్ సీఎం రేవంత్రెడ్డి అని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ మంత్రులుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ సర్ పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికయుగేంధర్రావు, నేవూరి ధర్మేందర్రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్రెడ్డి, మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, మన్నె రేణుక, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, బొడ్డు రామలింగయ్య, పందిరి యుగేంధర్, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
బాధితులకు న్యాయం జరిగేలా కృషి
సూర్యాపేటటౌన్ : గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. బాధితుల సమస్యలు విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ కోరారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పత్తి, మిర్చి, వరి సాగు చేసే రైతులు అనుమతులు పొందిన విత్తన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, 112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ 8712686026కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన జెడ్పీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్కె.మెయినొద్దీన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువు కావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆయిల్ పామ్ రైతు సంఘం జిల్లా కార్యవర్గంసూర్యాపేట : ఆయిల్ పామ్ రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేటలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మన్నెం సదాశివరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యలమర్తి బ్రహ్మారెడ్డి, సహాయ కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా తూముల ఇంద్రసేనారావు, కోశాధికారిగా ఉమా మహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మీకాంతారావు, పులుసు వెంకటయ్య, కిరణ్ కుమార్, ఎస్.త్రివేది, పి.వెంకటేశ్వరరెడ్డి, ఎలికంటి దామోదర్ రావులు ఎన్నికయ్యారు. శివయ్యకు పుష్పార్చనమేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆయలంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పుష్పార్చనతోపాటు గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన,గోపూజ నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. -
రోడ్డు పనులపై వివాదం.. గోల్తండాలో ఉద్రిక్తత
అనంతగిరి : మండలంలోని కొత్తగోల్తండా గ్రామంలోని రోడ్డు పనుల విషయంలో వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. మూడు నెలలుగా క్రితం గోల్తండాలోని 8వ వార్డులో రోడ్డును ఎత్తుగా నిర్మించడం వల్ల తనకు నష్టం జరుగుతుందంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. దీంతో ఆయన రోడ్డుపై పోసిన మట్టిని తరలించాలని పంచాయతీ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓ హరిసింగ్, ఎంపీఓ సుష్మా పోలీస్ ప్రొటక్షన్తో కొత్తగోల్తండాకు చేరుకుని రోడ్డుపై పోసిన మట్టిని తొలగింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ఉన్న మట్టిని తరలిస్తున్న జేసీబీని అడ్డుకున్నారు. కాగా తమ సొంత ఖర్చులతో, సొంత స్థలంలో సీసీ రోడ్డు వేసుకున్నామంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిత్తక నెలకొంది. మట్టి తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నంచిన వారిని పోలీసులు అదుపు చేశారు. అనంతరం అధికారులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్తామన్నారు. రోడ్డుపై మట్టి తరలింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం ఉన్నతాధికారుల జోక్యంతో పనులు వాయిదా -
వృద్ధ తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలి
చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధాప్యంలో ఉన్న తల్లి దండ్రులకు పిల్లలు ఆసరాగా నిలవాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని భాషానాయక్ తండా గ్రామ శివారులోని స్నేహ నిలయాన్ని ఆమె సందర్శించారు. వృద్ధుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు పోషకాహారం అదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా పాలు, బ్రెడ్లు, పండ్లు అందించి, వారితో కొంతసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, కె.ప్రియదర్శిని పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పర్హీన్ కౌసర్ -
అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పరిష్కరించడానికి జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం మొదలైనందున డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ధాన్యం కొనుగోలులో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఈఓ అశోక్, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు పాల్గొన్నారు. ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టాలిప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన ఆహార భద్రతపై జిల్లాస్థాయి సలహా కమిటీ (డీఎల్ఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు నిత్యావసరాలు, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, మాంసం, గుడ్లు, స్వీట్లు అందేలా విక్రయదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 65వ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో చిన్న పిల్లలకు భోజనం, ఇతర ఆహార పదార్థాలు అందించే కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఏఎస్పీ రవీందర్రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఎస్ఓ మోహన్బాబు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీటీడీఓ శంకర్, ఎస్సీ డీడీ దయానందరాణి తదితరులు పాల్గొన్నారు. -
‘రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ,కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయని,ఆ రెండు పార్టీలు ఒక్కటై,తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించి,మమత బెనర్జీ పార్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అధికారంలోకి వచ్చాక అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.మాజీ మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓటు వినియోగించలేకపోయారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు,ఓటు తొలగించాలంటే ఖచ్చితంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సెక్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.2028లో కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం చేసి,దొంగ ఓట్లు వేయిస్తే,వెంటనే అధికారులకు ఫిర్యాది చేసి, ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని సూచించారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు, మ్యాపింగ్ టెక్నాలజీ ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా, వెంటనే అభ్యంతరాలు తెలుపుతూ,ఫారం 8 ద్వారా సరిచేసుకోవాలన్నారు.తెలంగాణలో అభివృద్ధి పథంలో నడవాలంటే,తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని,అందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా మన బూత్ లో ఉండే అన్ని కుటుంబాలను కలిసి అందరి ఓట్లు నమోదయ్యేలా చూడాలని,నిరంతరం బిఎల్ఓలను వెంట ఉండి ఓట్లు పోకుండా చూడాలన్నారు. తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి మల్లయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
విద్యార్థులు చెస్ పోటీల్లో రాణించాలి
సూర్యాపేట : హైదరాబాద్లోని నిజాంపేట్ రోడ్డు బాచుపల్లిలో ఎల్ఎస్కె చెస్ అకాడమీ, తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 11, 12 తేదీల్లో జరిగే మహా వీరచక్ర కల్నల్ సంతోష్ బాబు ఆల్ ఇండియా ఓపెన్ పిడే రేటెడ్ రాపిడ్ చెస్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని సత్తాచాటాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో తాము నిర్వహించే చెస్ పోటీల్లో పాల్గొని చాలామంది విద్యార్థులు విజేతలుగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలు ఇందిర, రవికుమార్, దీక్షిత్, జతిన్రెడ్డి, అఖిలేష్, చిద్విలాసినికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సంతోష్, ట్రెజరర్ వెంకట మురళి, ఉపాధ్యక్షుడు సాయికుమార్, జాయింట్ సెక్రెటరీ లింగారెడ్డి, ఆర్గనైజర్ కోచ్ శ్రీనివాస రాజు, మనోజ్రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టపల్లి క్షేత్రంలో నిత్యారాధనలు
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. తిరునక్షత్రోత్సవ పూజలు ప్రారంభం మట్టపల్లి క్షేత్రంలోని చైన్నెకి చెందిన యజ్ఞ వాటికలో శ్రీస్వాతీనక్షత్ర మహాయజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో 16 రోజులపాటు నిర్వహించే తిరు నక్షత్రోత్సవ పూజలను ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. శతాధిక యజ్ఞకర్త దివంగత ముక్కూరు నరసింహాచార్యర్ 82వ జయంతిని పురస్కరించుకుని శ్రీస్వామి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయఅనువంశిక ధర్మకర్తలు, స్వాతినక్షత్ర ట్రస్ట్ పీఠం చైర్మన్ ముక్కూరు శ్రీనివాసన్, చైన్నెకి చెందిన భక్తులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలో వైద్యురాలికి కాన్పు..
● ‘ఎక్స్’లో అభినందించిన మంత్రి పెన్పహాడ్ : ప్రభుత్వ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకుని మగబిడ్డకు జన్మనిచ్చిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) డాక్టర్ చిప్పలపెల్లి అనూషను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ‘ఎక్స్’లో ప్రత్యేకంగా అభినందించారు. పెన్పహాడ్ మండలం అనాజీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎంఎల్హెచ్పీ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనూష తన తొలి కాన్పు కోసం శనివారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. దీంతో అక్కడి వైద్యులు అనూషకు సాధారణ ప్రసవం చేశారు. ప్రభుత్వ వైద్యురాలు అయి ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుని ప్రభుత్వ వైద్యసేవల పట్ల నమ్మకం పెంచినందుకు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.ప్రతి గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికకోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో ఈ. కనిష్క్(కోదాడ), పి.ఆర్యన్ వర్మ(కోదాడ), ఈ.బాలగంగధర్రెడ్డి(నేరేడుచర్ల), బి.హరినందన్(సూర్యాపేట), ఎం.వర్షిత(నల్లబండగూడెం), జి.అనివిరెడ్డి(నేరేడుచర్ల) ఎ.శ్రీహిత (సూర్యాపేట), ఏ.ఆద్య(కోదాడ), ఏ.మిథిలా(కోదాడ)లు ఉన్నారు. వీరు ఆగస్టు, సెప్టెబంర్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–11, 13 పోటీల్లో పాల్గొననునానరు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ టి.రంగారావు, కోచ్లు ఎస్కె.ఖాజాజలీల్ అహ్మద్, ఎస్కె.ఖాజా పజి ల్, ఎస్కె.నిసార్ ఉన్నారు. హామీల అమలులో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదుమునగాల : ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం మునగాల మండలం ముకుందాపురంలో పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జూలకంటి విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, శిక్షణ క్లాస్ టీచర్ రమేష్, మండల కమిటీ సభ్యులు బోళ్ల కృష్ణారెడ్డి, చందా చంద్రయ్య, డి.స్టాలిన్రెడ్డి, వీరబోయిన వెంకన్న, శాఖ కార్యదర్శి సరికొండ నాగరాజు, వెంకటరెడ్డి, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
కోదాడ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్–ఎస్ఐఆర్) జరుగుతున్నందున పార్టీ శ్రేణులు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య పంక్షన్హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల బూత్స్థాయి నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ నాయకులకు ఉందని, ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని కోరారు. టీపీసీసీ నుంచి వచ్చిన ప్రత్యేక బృదం దీనిపై నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి -
ఉపాధ్యాయుల్లో అపోహలు తొలగించాలి
నల్లగొండ : ఈహెచ్ఎస్పై ఉపాధ్యాయుల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసి పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు కాళం నారాయణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు సత్తయ్య, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, నక్క యుగంధర్, సుదర్శన్రెడ్డి, డీవీఎస్ ఫణికుమార్, సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
రైతులు మురవంగా..!
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సాగుకు దన్నుగా జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున మొదలై ఉదయం 10 గంటల వరకు పలు మండలాల్లో వర్షం పడింది. ఈ వర్షంతో సాగు పనులు చేసుకోవచ్చని రైతన్నలు మురిసిపోతున్నారు. అత్యధికంగా ఆత్మకూర్(ఎస్) మండలంలో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పెన్పహాడ్, కోదాడ, నేరేడుచర్ల, పాలకవీడు, హుజూర్నగర్, మేళ్లచెరువు మండలాల్లో వర్షం పడలేదు. మొత్తంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 4.2 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 3.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిరుజల్లుల నుంచి మోస్తరు దాకా.. జిల్లాకు వాతావరణ శాఖ నాలుగురోజుల పాటు భారీ వర్షసూచన చేసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడింది. సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు నాగారం, తిరుమలగిరి, సూర్యాపేట, మునగాల, నడిగూడెం, అనంతగిరి, గరిడేపల్లి, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఇక తుంగతుర్తి 4.7 మిల్లీమీటర్లు, మద్దిరాల 2.1 మి.మీ, జాజిరెడ్డిగూడెం, మోతె 22.8, చివ్వెంల 1.5, చిలుకూరు 3.8 మిల్లీమీటర్ల చొప్పున మోస్తరు వర్షం పడింది. సాయంత్రం కూడా నూతనకల్, మద్దిరాల తదితర మండలాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. సాగుకు దన్నుగా.. జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు దన్నుగా మారాయి. ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పారలేదు. చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరలేదు. కానీ మెట్టపంటలకు అనుకూలమైన జల్లులు పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరితే ఈ వానాకాలం సీజన్లో బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లాలోని 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నాగారం, మద్దిరాల, తిరుమలగిరిలో ఇంకా వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వర్షం అత్యధికంగా ఆత్మకూర్(ఎస్)లో 23.2 మి.మీ. వర్షపాతం మరో నాలుగు రోజుల పాటు వర్షసూచన -
చౌటపల్లి–అల్లీపురం రోడ్డు పనుల అడ్డగింత
మఠంపల్లి: మండలంలోని చౌటపల్లి నుంచి అల్లీపురం వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన బీటీరోడ్డు పనులను ఆదివారం చౌటపల్లిలో స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొద్ది వెడల్పు మాత్రమే ఉన్న డొంకదారిని రెండువైపులా ఉన్న రైతులను సంప్రదించకుండా సుమారు 36 అడుగుల వెడల్పు తవ్వుతూ భూములను ఆక్రమించి, భూముల్లో జేసీబీతో మట్టిని తవ్వుతున్నారని ఆరోపించారు. రోడ్డు వెడల్పును తగ్గించడంతోబాటు మా భూములకు నష్ట పరిహారం చెల్లించేదాక పనులను సాగనివ్వబోమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లు నాగిరెడ్డి, తొడేటి వీరనరసింహ, కుందూరు నరసింహారెడ్డి, సింహాద్రి, నరసయ్య, ఎరబోలు నాగిరెడ్డి, అచ్చిరెడ్డి, ఐతగాని శ్రీను, నరసింహారావు, సత్యనారాయణ, వీరయ్య, కాశయ్య, సామ్రాజ్యం, రామయ్య, వీరబాబు, కిట్టయ్య, మంగమ్మ,వెంకన్న, గోపయ్య, సోమయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, కొండలు తదితరులు పాల్గొన్నారు. నష్ట పరిహారం చెల్లించేదాకా పనులు సాగనివ్వం చౌటపల్లిలో ఆందోళన చేపట్టిన రైతులు -
రైతన్న సాగుబాట
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతులు సాగు బాట పట్టారు. రోహిణికార్తె నుంచే వివిధ వ్యవసాయ పనులు చేపడుతూ వస్తున్నారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడడంతో పత్తితో పాటు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా వ్యవసాయ భూములను సిద్ధం చేస్తున్నారు. మరో ఒకటి, రెండు వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది పంట వ్యర్ధాల తొలగింపు, దుక్కులు దున్నడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పత్తి సాగు అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన విత్తనాల కొనుగోలుకు దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారు మళ్లు పోసుకునే పనులను ముమ్మరం చేశారు. సాగు అంచనా 6.20 లక్షల ఎకరాలు జిల్లాలో వానాకాలం సీజన్లో 6.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో వరి సాగే 4,94,500 ఎకరాల్లో ఉండనుండగా.. రెండోస్థానంలో పత్తి 90,800 ఎకరాల్లో సాగు కానుంది. వరి సాగు కోసం రోహిణి కార్తె నుంచే రైతులు నార్లు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పొలాలను దుక్కి దున్నుకుంటున్నారు. పదిరోజులు ఆలస్యంగా.. సాధారణంగా మేలోనే అకాల వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి మేలో వర్షాలు కురువక పోగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల కంటే ముందుగా కురిసే వర్షాలు సైతం జిల్లాలో 10 రోజులు ఆలస్యమయ్యాయి. గతేడాది మే 25 నాటికే వర్షాలు పడడంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆలస్యం కావడంతో పంట వ్యర్థాల తొలగింపులోనే ఉన్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట పంటల సాగు పనులను రైతులు ముమ్మరం చేశారు. వ్యవసాయ పనిముట్ల మరమ్మతులు, విత్తనాల కొనుగోలు, చేలను చదును చేయడం, ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం చేపడుతున్నారు. జిల్లాకు ఐదురోజుల పాటు వర్ష సూచన ఉండడంతో సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి. ఫ తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో బిజీ ఫ పంట పొలాల్లోని వ్యర్థాల తొలగింపు, దుక్కి దున్నే పనుల్లో మరికొందరు ఫ జిల్లాకు ఐదురోజుల పాటు వర్ష సూచన -
బాధితులకు భరోసా, భద్రత : ఎస్పీ
సూర్యాపేట : బాధితులకు తక్షణ భరోసా, రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డితో కలిసి పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. గత నెలలో నమోదైన కేసుల పూర్వపరాలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. బాధితుల ఇంటి వద్ద నుంచి కేసు నమోదు చేసే విషయంలో అలసత్వం వహించవద్దన్నారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీసీఆర్బి డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెపక్టర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాల పంపిణీ
ఫ 10వేల అడ్మిషన్లు లక్ష్యంగా బడిబాట ఫ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ ఫ రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభానికి ఏర్పాట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 950 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే గోదాం నుంచి ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పాఠ్య, నోట్ పుస్తకాలు చేరాయి. మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మా లక్ష్యం. అందుకే విద్యార్థి పాఠశాలకు వెళ్లిన రోజే వారికి పుస్తకాలు అందిస్తాం. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్.. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందిస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అడ్మిషన్ల పెంపుపై దృష్టిగత విద్యా సంవత్సరం బడిబాట ద్వారా 4వేల అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను కొత్తగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 1,900కు పైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. బడిబాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన..బడిబాట కార్యక్రమాన్ని విస్త్తృతంగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బడిబాట ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత లేదుపాఠశాలల్లో విద్యా బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత లేదు. కాకపోతే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర తక్కువ ఉపాధ్యాయులు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం.డిజిటల్, ఏఐ ద్వారా బోధన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులలో విద్యాబోధన అమలు చేస్తున్నాం. ఇంటర్నేట్ ఉన్న పాఠశాలకు ఏఐ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ బోధన అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా, పోటీ ప్రపంచంలో రాణించేలా అవసరమైన అన్ని వసతులు, సాంకేతిక సదుపాయాలు, బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఉరుములు వస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారు వీలైతే పక్కా భవనాలలో ఆశ్రయం పొందాలని, వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.కిడ్స్ ఫొటో కాంటెస్ట్లో చిన్నారికి బహుమతినడిగూడెం : మండల కేంద్రానికి చెందిన దివ్యశ్రీ, గెల్లా సంగమేశ్ దంపతుల మూడు నెలల కూతురు తుర్వి కృతిక కిడ్స్ ఫొటో కాంటెస్ట్లో బహుమతి సాధించింది. ట్రాయో కిడ్స్ కాంటెస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించిన లిటిల్ మైర్మెడ్ ఫొటో కేటగిరిలో కృతిక ఫొటోలను ఆమె తల్లిదండ్రులు అప్లోడ్ చేశారు. సదరు ఫొటోలు కిడ్స్ ఫొటో కాంటెస్ట్ సీజన్–31లో ఎంపికవడంతో సంస్థ వారు చిన్నారికి మెడల్, సర్టిఫికెట్ అందించారు. లక్ష్మీనరసింహునికి నిత్యపూజలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యురాలి ప్రసవంపెన్పహాడ్ : మండలంలోని అనాజీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎంఎల్హెచ్పీ(మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్)గా పని చేస్తున్న డాక్టర్ చిప్పలపెల్లి అనూష శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం చేరారు. ఆమె నార్మల్ డెలివరీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే ప్రసవం కావడం ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన వైద్యానికి నిదర్శనమన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకొని ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని కోరారు. -
సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర
అర్వపల్లి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరుతో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. శనివారం అర్వపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1205 బూత్లలో ఏ ఒక్క బూత్లోనూ కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏలను సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. బీజేపీ కుట్ర పూరితంగానే నట రాజన్ను రాజ్యసభ సభ్యురాలు కాకుండా చేసిందన్నారు. అక్రమంగా, అన్యాయంగా నామినేషన్ తిరస్కరణ జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఈసీల ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, సర్పంచ్లు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, మంచాల లలితారామ్మూర్తి, నాయకులు మేకల రాంబాబు, బైరబోయిన మహరాజు, జె.సోమయ్య, బాసపోలు శ్రీనివాస్, బింగి శ్రీకాంత్, విజయ్, ఖాజ, సైదులు, తదితరులు పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
ఆలేరు: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా కార్యకర్తలు కీలకం అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షినటరాజన్కు రాజ్యసభ అవకాశం రాకుండా కుట్రలు చేయడం మహిళల పట్ల బీజేపీ నిజమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ఓట్ల దోపిడీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల దోపిడీకి కూడా ప్రయత్నించడంపై మండిపడ్డారు. కొత్తగా వివాహమైన మహిళల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా మహిళా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్పై కుట్ర భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఆమె రాజ్యసభ నామినేషన్ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై ఇప్పుడు బిల్లు పెట్టినా ఓటు వేయడానికి కాంగ్రెస్ సిద్ధమేనన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి అలిగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ (33శాతం) బిల్లును తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో పోస్ట్ కార్డులపై మహిళల సంతకాలు సేకరించి వాటిని నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి పంపే ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో పోస్టుకార్డుల రాసి ప్రదర్శించారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను చైతన్య పరిచి, పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.ఫ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్రం విఫలం ఫ సీట్ల దోపిడీకి పాల్పడుతున్న బీజేపీ ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం -
సెలవు రోజుల్లోనూ ‘దోస్త్’ అడ్మిషన్లు
హుజూర్నగర్ : దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ఈ నెల 15 చివరి తేదీ అని, సమయం తక్కువగా ఉన్నందున రెండో శనివారం, ఆదివారం సెలవు రోజుల్లోనూ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, కౌన్సెలింగ్ పూర్తిగా ఉచితమని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక వసతులతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. మెగా లోక్ అదాలత్ను వినియోగించుకోవాలిహుజూర్నగర్ : ఈ నెల 20న జరిగే మెగా లోక్ అదాలత్ను కక్షి దారులు వినియోగించుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాంప్రసాద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కేసు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా శీరిన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య, సీనియర్ న్యాయవాదులు ఎన్. సత్యనారాయణ, కె. బాలకృష్ణ, కె.సైదులు, ఏజీపీ బి.సురేష్నాయక్, నగేష్ రాథోడ్, అడవి రాముడు, మౌలాబీ, బి.నరేష్, నాగూర్ బాషా, సైదా హుస్సేన్ పాల్గొన్నారు. -
డీసీసీబీకి పాత పాలకవర్గమే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. వెంటనే ఆయా పాలకవర్గాలను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని జిల్లా సహకార అధికారులకు (డీసీవో) సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్లగొండ డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి, ఇతర డైరెక్టర్లు మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమ, బుధవారాల్లో ఆయా పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించనున్నాయి. డీసీసీబీ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ తరువాత మళ్లీ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడగించకుండా, గత ఏడాది డిసెంబరు నెలలో వాటిని రద్దు చేసింది. జిల్లా కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించింది. దీనిపై డీసీసీబీలకు చెందిన కొందరు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జీవో 598పై స్టే విధిస్తూ గత నెల 21న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు.. డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లాల సహకార అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డీసీసీబీకి పాత పాలకవర్గమే ఉంటుంది.ఫ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పాలకవర్గాల రద్దు జీఓ సస్పెన్షన్ ఫ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం -
పాఠశాల గ్రంథాలయాలకు నిధులు
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం గ్రంథాలయాలను మంజూరు చేసింది. వాటికి సంబంధించిన గ్రాంట్లను విడుదల చేసింది. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని లైబ్రరీలలో కొత్త పుస్తకాల కొనుగోలుకు వీటిని ఖర్చు చేయనున్నారు. 903 స్కూళ్లకు నిధులుసూర్యాపేట జిల్లాలో 220 ఉన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో పాఠశాలకు రూ.5,198 చొప్పున, 683 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఒక్కో దానికి రూ.1,171 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు ఉపయోగపడే సబ్జెక్టు పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, బాలల కథల పుస్తకాలను కొనుగోలు చేయనున్నారు. పఠనాసక్తి పెంపొందించేందుకే.. విద్యార్థులు మొబైల్స్కు ఆకర్షితులవుతున్న తరుణంలో వారిలో పఠనాసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కమిటీలు విద్యార్థుల వయస్సు, అభ్యసన స్థాయికి అనుగుణంగా పుస్తకాలను ఎంపిక చేయనున్నారు. ఉన్నత పాఠశాలకు రూ.5198 పీఎస్, యూపీఎస్కు రూ.1,171 చొప్పున గ్రాంట్ విడుదల -
‘సర్’ పై అప్రమత్తంగా ఉండాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సర్ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి అడ్డదారిలో అధికారంలోకి రావడానికి పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పద్ధతినే ప్రయోగించారన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సర్ పేరుతో హరించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, చకిలం నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు వై.నరేష్, సుంకరి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి
భానుపురి (సూర్యాపేట) : మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్కు తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలైనా మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి నిరసన చేపట్టబోతే ముందే అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందించి వారిలో సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్యయాదవ్, వై. అరవింద్రెడ్డి, సముద్రాల రమేష్, తదితరులు ఉన్నారు. -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఎస్పీ
చివ్వెంల(సూర్యాపేట) : యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, మంచి భవిష్యత్ను నిర్మించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. శుక్రవారం మండలంలోని దురాజ్పల్లి శివారులోని ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో డ్రగ్స్పై విద్యార్థులకు నిర్వహించిన అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్ రహిత సమాజ కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అధికారులు, పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని అన్నారు. కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు వి.మహేశ్వర్, కనపక రత్నం, భరోసా ఎస్ఐ మౌనిక. షీటీం ఎస్ఐ నీలిమా, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికగరిడేపల్లి : మండలంలోని పొనుగోడు ఎంబీఆర్ ఫంక్షన్హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా మహాసభల్లో శుక్రవారం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ములకలపల్లి రాములు, ఉపాధ్యక్షులుగా పులుసు సత్యం, కొదమగుండ్ల నగేష్, జంపాల స్వరాజ్యం, నారసాని వెంకటేశ్వర్లు, సిరికొండ శ్రీను, సోమపంగా జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మట్టిపెల్లి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శిగా పోసనబోయిన హుస్సేన్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మిట్టపల్లి లక్ష్మీ, కడెం కుమార్ను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభల చివరి రోజున పలు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి విద్యార్థుల ఎంపికభానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవెలబుల్ పథకం కింద వివిధ పాఠశాలల్లో విద్యనందించేందుకు శుక్రవారం కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. 1వ తరగతిలో 89 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 82 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.దయానందరాణి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిస్యూట్ సొసైటీ కోఆర్డినేటర్ పద్మ, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘థ్రెడ్. పోచంపల్లి’ ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ పాల్గొన్నారు. -
మఠంపల్లి కవికి ప్రశంసా పత్రం
మఠంపల్లి : మఠంపల్లికి చెందిన కవి, గాయకుడు కర్ల శ్రీనివాస్ రాసిన కవితకు రాష్ట్రస్థాయిలో ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శనివారం రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనంలో కర్ల శ్రీనివాస్ పాల్గొని శ్రీపల్లె జనం గుండె తడి తెలంగాణశ్రీ కవితను రాసి వినిపించారు. ఆయన రాసిన కవితను ప్రసంసిస్తూ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యుడు దరువు అంజన్న, దరువు ఎల్లన్న ప్రశంసా పత్రం అందించారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
హుజూర్నగర్ : పట్టణంలోని మట్టపల్లి బైపాస్ రోడ్డులోగల గోదా, పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ, కల్పవృక్ష, అశ్వ, గజ, శేష, హంసవాహానాలపై శ్రీవారు, అమ్మవార్లను, అళ్వార్లను అధిష్టింపజేసి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. మొదట ఆలయంలో శ్రీవారి మూల మూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమం, పూర్ణాహుతి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. -
20న జాతీయ మెగా లోక్ అదాలత్
సూర్యాపేటటౌన్ : ఈ నెల 20న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన, డ్రంకెన్ డ్రైవ్, మోటారు ట్రాన్స్ఫోర్ట్ రోడ్డు నిబంధనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేసన్ జిల్లా అధ్యక్షుడిగా బండారి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం నాయకులు రామనర్సయ్య, పుప్పాల వీరన్న, సీహెచ్.భిక్షం, పుప్పాల రవికుమార్, బడుగుల సైదులు, హనుమంతరావు, శిరగాని యాకయ్య, సుధాకర్రెడ్డి, నల్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తుంగతుర్తిలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలుతుంగతుర్తి: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా మండల కేంద్రంలో ఆదివారం నార్కోటిక్లో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని షాపులు, పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. తని ఖీలు నిరంతరం కొనసాగుతాయని, గ్రామాల్లో మత్తు పదార్థాల రవాణా, వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ ఆర్ఎం బదిలీ రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యా రు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. -
ఆధునీకరణ ఆలస్యం..
అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తున్న ఎస్సారెస్పీ కాల్వలు ఆధునీకరణకు నోచడం లేదు. సీసీ లైనింగ్ లేక కోతకు గురై అధ్వానంగా మారాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు కోదాడలోని రెండు మండలాలు, సూర్యాపేటలోని మూడు మండలాలకు ఈ కాల్వల ద్వారానే గోదావరి జలాలు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం ద్వారా ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణం చేపట్టారు. 2008లో కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు లైనింగ్ చేపట్టక పోవడంతో కాల్వలు కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి ఇవే ఆధారంఎస్సారెస్పీ కాల్వల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల పరిధిలోని సుమారు 1.50 లక్షల ఎకరాల గోదావరి జలాలు అందుతున్నాయి. నియోజకవర్గంలో 69,70,71 ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు, టెయిలెండ్ ఉన్నాయి. వీటితో పాటు 20 వరకు మైనర్, సబ్మైనర్ కాల్వలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 180 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నాయి. ఇందులో కేవలం 71 డీబీఎం కాలువ నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల్లో 7కిలోమీటర్ల మేర లైనింగ్ నిర్మించారు. ముందుకు సాగని నీరుఎస్సారెస్పీ కాల్వలకు సీసీ లైనింగ్ లేక పోవడంతో ప్రస్తుతం కంపచెట్లు, పొదలు దట్టంగా పెరిగి కాల్వ కనిపించని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కాల్వ కోతకు గురవుతోంది. ప్రతి సీజన్లో అధికారులు కాల్వల ద్వారా గోదావరి జలాలను వదులుతున్నారు. కాల్వ లైనింగ్ లేక, చెట్లతో నిండి ఉండడంతో నీరు సాఫీగా పారడం లేదు. కాల్వ చివరి ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా గోదావరి జలాలు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు సుమారు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నిధులు మంజూరు కాక పోవడంతో పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల లష్కర్లు, సూపర్వైజర్లను నియమించిన ప్రభుత్వం ఆధునీకరణను మాత్రం చేపట్టడం లేదు. ప్రభుత్వం స్పందించి కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలో కాల్వల ఆధునీకరణకు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. – ఎం.సత్యనారాయణగౌడ్, నీటిపారుదల శాఖ ఈఈసీసీ లైనింగ్కు నోచని ఎస్సారెస్పీ కాల్వలు ఫ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిన కాల్వలు ఫ కాల్వ చివరి భూములకు అందని నీరు -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
జూన్లో పాఠశాల ఖర్చులు
అడ్మిషన్, ట్యూషన్ ఫీజు : రూ.5వేల నుంచి 25వేలు పుస్తకాలు, నోట్బుక్స్ : రూ.5వేల నుంచి 10వేలు యూనిఫాం : రూ.1500 నుంచి రూ.4వేలు షూస్, బ్యాగులు : రూ.1500 నుంచి రూ.3వేలు, స్కూల్ బస్ చార్జీలు : రూ.5వేల నుంచి 10వేలు సాగు ఖర్చులు (ఎకరాకు) వరి : రూ.20 వేల నుంచి 25 వేలు పత్తి : రూ.15 వేల నుంచి రూ. 20 వేలు మొక్కజొన్న : రూ.10వేల నుంచి రూ. 15వేలు కంది : రూ.10వేల నుంచి రూ.12 వేలు -
‘గ్రీన్ మ్యాట్’ దందా..
బెల్ట్ ఏకరూపకం ఇది కోదాడలోని కట్టకొమ్ముగూడెం వీధిలో ఉన్న బెల్ట్ దుకాణం. కొత్తవారు సైతం సులువుగా గుర్తు పట్టడానికి వీలుగా డబ్బాకొట్టు చుట్టూ గ్రీన్మ్యాట్ కడతారు. డబ్బాకొట్టు ఉండి దానికి మూడు వైపుల గ్రీన్ మ్యాట్ కట్టి ఉంటే అది బెల్ట్ దుకాణమని గుర్తు పట్టేందుకే ఈ ఏర్పాట్లు. కోదాడ పట్టణమే కాదు జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఇదే విధంగా కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేకుండా గ్రీన్ మ్యాట్ ఉన్న డబ్బాకొట్టు దగ్గరికి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాలు అన్ని వేళలా అందుబాటులో ఉండడం విశేషం.కోదాడ : పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అన్ని షాపులు ఒకే మోడల్లో కనిపించే విధంగా వాటిని ఏర్పాటు చేస్తుండడం విశేషం. గతంలో గ్రామానికి ఒకటి రెండు కనిపించే బెల్ట్ దుకాణాలు ఇపుడు ప్రతి వీధిలో రెండంకెల స్థాయికి చేరాయి. ప్రతి గ్రామంలో ఇదే ప్రధాన వ్యాపారంగా మారింది. గ్రామ రాజకీయాలకు, వ్యవహారాలకు ఈ దుకాణాలే కేంద్ర బిందువులుగా మారాయి. చిన్నా..పెద్ద తేడా లేకుండా వచ్చిన వారందరికీ అవసరమైన బ్రాండ్లు సరఫరా చేయడం వీటి ప్రత్యేకతగా మారింది. వ్యతిరేకులకు గాలం..గతంలో గ్రామంలో బెల్ట్షాపుల ఏర్పాటును యువజన సంఘాలతో పాటు చదువుకున్న యువకులు గట్టిగా వ్యతిరేకించేవారు. దాంతో అమ్మకాలు చేసే వారుకూడా గుట్టుగా వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బెల్ట్ దుకాణదారులు ఏదో ఒక రాజకీయపార్టీకి సానుభూతి పరుడిగా ఉంటూ వారి అండదండలతో దుకాణాలను నడుపుతున్నారు. గ్రామంలోని యువకులను చేరదీసి అరువుకు మద్యాన్ని ఇస్తుండడంతో వారు కూడ వ్యతిరేకించడం మానేశారు. ఎకై ్సజ్ పోలీసులు సైతం బెల్ట్ దుకాణాలను ప్రొత్సహిస్తున్నారని, సివిల్ పోలీసులు వీటి గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊళ్లను పంచుకొని వ్యాపారం..వైన్స్ దుకాణా దారులు గ్రామాలను పంచుకొని అక్కడి బెల్ట్ దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒకరి పరిధిలోని గ్రామాలకు మరొకరు మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం కోదాడ మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులకు పట్టణంలోని వైన్స్ యజమానులు మద్యం సరఫరా చేశారు. దాంతో వైన్స్ యజమానుల మధ్య గొడవలు జరిగి రోడ్డెక్కారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమలుకు నోచని ఎస్పీ హామీ ఆరు నెలల క్రితం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో పోలీసుశాఖ యువత కోసం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు పలు సమస్యలను లేవనెత్తారు. తమ గ్రామంలో బెల్ట్ దుకాణాల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారారని, గ్రామంలో పదికి పైగా బెల్ట్ దుకాణాలున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని యువకులు ఎస్పీని కోరారు. ఈ విషయమై విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు ఒక్క బెల్ట్ దుకాణం కూడా మూత పడలేదని ఆ గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డబ్బాకొట్టుకు మూడు వైపులా గ్రీన్ మ్యాట్.. ఇదే బెల్ట్ షాపుల కోడ్ ఫ కొత్తవారైనా సులువుగా గుర్తుపట్టేలా ఏర్పాట్లు ఫ గ్రామాలు, పట్టణాల్లో విచ్చల విడిగా బెల్ట్ దుకాణాలు ఫ అధికారులు పట్టించుకోక పోవడంతో జోరుగా వ్యాపారం -
రాజ్యసభలో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి
మునగాల : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని దివ్యాంగులకు కేటాయించాలని, తద్వారా దివ్యాంగులపై ఉన్న చిత్తశుద్ధిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో శనివారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు, ఇతర దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు, రాష్ట్ర నాయకులు కడియం నరేష్, జిల్లా అధ్యక్షుడు పసుల చంద్రయ్య, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ -
ప్రపంచంలోనే అరుదైనది మియాజాకి మామిడి
కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్ ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు. శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..మియాజాకి, థామిట్ క్వీన్, నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్కేజీ మ్యాంగో, బ్లాక్ స్టోన్ మ్యాంగో. గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను. – వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం -
మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గౌరవం
సూర్యాపేట అర్బన్ : ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యధితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి, పారిశుధ్యం, ఓటరు నమోదు తదితర అంశాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, డయల్ 100, లేదా 112 నంబర్లకు కాల్ చేస్తే పోలీసులే వారి వద్దకు వచ్చి అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏసీపీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్రావు, వార్డ్ కౌన్సిలర్ షేక్ జహీర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, డాక్టర్ అమూల్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.సమస్యల పరిష్కారమే ధ్యేయం చివ్వెంల(సూర్యాపేట) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన–ప్రగలతి ప్రణాళిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం మండలంలోని గుంజలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచనారాణి, తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్కుమార్, సర్పంచ్ బొలికొండ సైదులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వీధి కుక్కలకు ప్రత్యేక చికిత్స
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో మెంజ్ వైరస్తో చర్మవ్యాధుల బారిన పడిన వీధి కుక్కల చికిత్సకు బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ముందుకు వచ్చారు. ఇటీవల వీధి కుక్కల చర్మవ్యాధులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై స్పందించిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ షెల్టర్ డైరెక్టర్ ఎన్ఎస్కే కుమారి, సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఇప్పటి వరకు 194 వైరస్ సోకిన కుక్కలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి చికిత్స కోసం సుమారు రూ.1.80 లక్షల విలువైన ఇంజక్షన్లు, మందులను అమల సూర్యాపేటకు పంపించారు. జిల్లా బ్లూ క్రాస్ వలంటీర్ నరేందర్ నాయుడు వీటిని జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. హైదరాబాద్కు చెందిన బ్లూ క్రాస్ వలంటీర్లు లాలు, నరేష్ ప్రత్యేక వైద్య బృందంతో కలిసి కుక్కలకు చికిత్స అందించేందుకు సూర్యాపేటకు చేరుకున్నారు. శనివారం నుంచి పట్టణంలోని 48 వార్డులలో వైరస్ సోకిన కుక్కలను గుర్తించి దశలవారీగా చికిత్స అందించనున్నట్లు నరేందర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వార్డు కౌన్సిలర్లు కోడి శిరీష శివ, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుంటి సైదులు, అక్కినపల్లి జానయ్య, యాట వెంకన్న, పొలాగాని కృష్ణ పాల్గొన్నారు. బ్లూ క్రాస్ పర్యవేక్షణలో 194 కుక్కలకు వైద్య సేవలు -
హార్టికల్చర్ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు
గరిడేపల్లి : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.భగవాన్ తెలిపారు. శనివారం గడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాలిసెట్ 2026, ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. గడ్డిపల్లిలోని ఘంటాగోపాల్రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్, కేవీకేలో ఈ కోర్సు అందుబాటులో ఉందన్నారు. అర్హత గల విద్యార్థులు వినియోగించుకోవాలని మరిన్ని వివరాలకు సెల్ : 9603268682 నంబర్ను సంప్రదించాలని కోరారు. కుంట ఎఫ్టీఎల్లో అక్రమంగా ఫెన్సింగ్ ● ఆక్రమణను తొలగించిన మత్స్యకారులు, గ్రామస్తులు ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ఉన్న పోల్కమ్మ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో కొంత మంది ఫెన్సింగ్ వేయడం వివాదాస్పదమైంది. కుంటలోకి వెళ్లకుండా కొందరు అడ్డంగా ఫెన్సింగ్ వేయడంతో స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు కుంట వద్దకు వెళ్లి అక్రమ ఫెన్సింగ్ను నేలమట్టం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు జంగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నార్ల రమేష్, గంగరబోయిన శీను, జటంగి రామనర్సు, వీరబోయిన గంగయ్య, జంగా లక్ష్మణ్, పిడుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అంకితభావంతో సేవలందించాలినల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు. 20న జాతీయ లోక్ అదాలత్భువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి లత కోరారు. శనివారం ఆమె జిల్లాలోని జూనియర్ సివిల్ జడ్జీలు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఏపీపీఓలు, ఎకై ్సజ్ పోలీస్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజీ పడదగిన కేసులను త్వరగా గుర్తించి కక్షిదారులకు వెంటనే నోటీసులు అందజేయాలని ఆదేశించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా వ్యాప్తంగా విస్తృ ప్రచారం చేయాలనానరు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.మాధవి లత భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. బాలురకు వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. -
విస్తరిస్తున్న కాలనీలు..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తోంది. జాతీయ రహదారిపై ఉండడంతో వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో జనాభా కూడా పెరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులలో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ఆయా కాలనీల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక పోవడంతో ఖాళీ ప్లాట్లలో, ఇళ్ల మధ్యే మురుగు పేరుకు పోతున్నది. సీసీ రోడ్లు లేక..మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కొన్నిచోట్ల మట్టి రోడ్లు, మరికొన్ని ప్రాంతాల్లో గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో మట్టిరోడ్లు బురద మయంగా మారడంతో రాకపోకలు కూడా కష్టంగా మారుతోందని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నానరు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే గార్డెన్, ఇందిరమ్మ కాలనీ ఫేస్–1, ఫేస్–2, ఫేస్–3, తిరుమలనగర్, అంబేద్కర్నగర్, వెంకటేశ్వరకాలనీ, వినాయనగర్ కాలనీ, జమ్మిగడ్డ, స్నేహనగర్, సుందరయ్యనగర్ కాలనీలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన దురాజ్పల్లి, కుడకుడ, దాసాయిగూడెం, పిల్లలముర్రి గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా కాలనీలలో సరైన డ్రెయినేజీలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరంతా రోడ్లపై పారుతోంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో చేరి మురుగు నీటి కుంటలా మారుతోంది. ఇందులో పందులు స్వైరవిహారం చేస్తుండటంతో దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దోమల బెడదతో రోగాల పాలవుతున్నారు. వర్షం వస్తే మునుగుడే.. చాలా కాలనీలలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక పోవడంతో వర్షాకాలంలో కాలనీల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా కాలనీల్లో నిలిచి ఇళ్లను ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఎస్వీ డిగ్రీ కళాశాల వెనుకభాగం, ఆర్కే గార్డెన్, సుందరయ్యనగర్, స్నేహనగర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. గతంలోనూ కాలనీలు వరద నీటిలో మునిగిన సందర్భాలు ఉన్నాయి.తాగునీటికీ కటకటే..కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాంతో ప్రజలు నీటిని కొనుగోలు చేసి మరీ తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో బోరు ఉన్న వారు వాటిని వినియోగించుకుంటుండగా.. లేని వారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు సైతం పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తున్నదని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రాధాన్యత ఆధారంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. వర్షపు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కొత్త కాలనీలలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో సమస్యలనేకం ఇళ్ల మధ్యే, చెత్త, మురుగు మౌలిక వసతులు కల్పించాలని స్థానికుల వినతిమున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నిధులు కేటాయించి వసతులు కల్పిస్తాం. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడతాం. పట్టణంలోని వార్డులలో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం. చైర్మన్, వార్డు సభ్యుల చొరవతో ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేపడతాము. – సీహెచ్.హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
పెన్పహాడ్ : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ, చికున్న్గున్యా, వైరల్ ఫివర్, అతిసారం వంటి వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసిద్ధ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. మండలంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. చీదెళ్ల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం శ్రీడ్రై డ్ఙే ను పాటించాలని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ మోతీలాల్, మండల వైద్యాధికారి రాజేష్, ఆరోగ్య విస్తరణ అధికారి తాడూరి వెంకన్న, ఎంఎల్హెచ్పీ ప్రియాంక, ప్రేమ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ మాధవి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాంప్రసాద్ సంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసిద్ధ్ -
మెరుగైన ఫలితాలే లక్ష్యం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నాణ్యమైన విద్య అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సులోచనారాణి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం ఆమె సాక్షి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే.. సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరగతి గదులు, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యా బోధన జరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. గత కొన్నేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదలతో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ ఏడాది కూడా గతం కంటే మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, షూస్ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు ఈ ఏడాది ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు, షూస్, బ్యాగ్ను ప్రభుత్వం అందిస్తున్నది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది నుంచి డిజిటల్ విద్యఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధన నిర్వహిస్తాం. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సులభంగా పాఠాలను అర్థం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి కళాశాలకు నాలుగు ఐఎఫ్బీ ప్యానెల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా వచ్చింది. అధ్యాపకులు డిజిటల్ పద్ధతిలో బోధించనున్నారు. ఈ ఏడాది నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాంవిద్యా ప్రమాణాలు, ఫలితాలు, పోటీ పరీక్షల విజయాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది జూలై నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. ప్రతి రోజు స్లిప్ టెస్ట్లు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా వారు ఉత్తీర్ణత సాధించేలా చేస్తాం. ఈ ఏడాది నుంచి 20 ఇంటర్నల్ మార్కులు కలవనుండగా.. దీంతో ఎక్కువశాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ..వార్షిక పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తాం. వెబ్ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, ఆన్న్లైన్ పరీక్షలు, నిపుణుల మార్గదర్శకత్వంతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లపై దృష్టి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ D ÝëÇ Ð]l$«§éÅçßæ² ¿Zf¯]l…, AÌêµ-àÆý‡… A…¨…^ól Äñæ*^èl¯]l˘ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణిఅడ్మిషన్లు పెంచేందుకు.. గతేడాది నవంబర్, డిసెంబర్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు తమ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్లకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలపై అవగాహన కల్పించారు. పదో తరగతి పరీక్షల అనంతరం కూడా విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు పెరిగేలా చూస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 165 అడ్మిషన్లు వచ్చాయి. అడ్మిషన్ల గడువు కూడా ఉండటంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ పి.శివరాంప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవునికి ప్రకృతికి అవినావభావ సంబంధం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేయాలన్నారు. ప్రకృతిని ప్రేమించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్య వంతంమైన వాతావారణం అందించాలని సూచించారు. ప్రస్తుతం అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాంప్రసాద్ -
మార్కెట్ విలువ పెంపును ఉపసంహరించుకోవాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ వ్యాల్యూ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ పెరగడం వల్ల బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్ మరింత భారంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవాధ్యక్షుడు దేవత్ కిషన్నాయక్, రాష్ట్ర కోశాధికారి సైదులు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరి బొమ్మగాని శ్రీని వాస్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కంభంపాటి అంజయ్యగౌడ్, సభ్యులు వెన్న శ్రీనివాస్రెడ్డి, మాదిరెడ్డి గోపాల్రెడ్డి, మల్లయ్యగౌడ్, మారయ్యగౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ -
భారీగా పెరిగిన భూముల విలువ
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించగా.. అది శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరల్లో చేసిన మార్పులు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వర్తించనున్నాయి. ఈ క్రమంలో భూముల విలువ దాదాపు 15 నుంచి 100 శాతం పెరిగాయి. ప్రధానంగా మార్కెట్ డిమాండ్, అభివృద్ధి, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూముల విలువలను 50 నుంచి 100 శాతం మేర పెంచింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా గజం రూ.21,300 ధర పలుకుతోంది. ఇది బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువగా ఉండనుంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వ్యవసాయ భూముల ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు సవరించిన భూముల విలువ ప్రకారమే అదనపు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పలుమార్లు వాయిదా పడుతూ..!భూముల విలువను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా.. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలోనే మారిన భూముల విలువ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏ ప్రాంతంలో.. ఎంత మేర పెంచాల్సి ఉందన్న వివరాలను సబ్ రిజిస్ట్రార్ల నుంచి సైతం సేకరించింది. ఈ వివరాల నమోదుతో పాటు కొన్నిప్రాంతాల్లో సరైన ప్రతిపాదనలు రాకపోవడంతో వాయిదా వేసి ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోనూ లోపాల కారణంగా ఈ నెల 5 నుంచి అమలు చేసింది. వ్యవసాయ భూములు ఇలా..● జాజిరెడ్డిగూడెం మండలంలో ఎకరాకు గరిష్టంగా రూ.11,81,250, కొమ్మాలలో కనిష్టంగా ఎకరాకు రూ.3,93,750గా ఉంది. గరిడేపల్లిలో ఎకరాకు రూ.5.10 లక్షలు, కుతుబ్షాపురంలో రూ.3.93 లక్షలుగా ఉంది. ● తుంగతుర్తి మండలంలో నేషనల్ హైవే వెంట ఉన్న గ్రామాల్లో ఎకరానికి రూ.1,06,000 అత్యధికంగా, రావులపల్లిబండ రామారం, మానా పురం గ్రామాలలో ఎకరాకు రూ.70,000 అత్యల్ప ధరగా నిర్ణయించారు. ● నేరేడుచర్లలో అత్యధికంగా ఒక ఎకరం భూమి విలువ రూ.44,47,500, బోడలదిన్నలో అత్య ల్పంగా రూ.2,25,000గా నిర్ణయించారు. ● మఠంపల్లిలో ఎకరం రూ. 54,55,025, అల్లిపురం, గుండ్లపల్లిలో అత్యల్పంగా రూ. 3,93,750, పెన్హాడ్లో ఎకరం రూ.11.81లక్షలు, గాజుల మల్కాపురంలో ఎకరం రూ. 5.90 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయేతర భూముల విలువల రూ.10వేలకు పైనే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చాలా ప్రాంతాల్లో రూ.10వేలకు మించే భూముల విలువ సవరణ ఉంది. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్, పీఎస్ఆర్ సెంటర్, సీసీ బ్యాంక్ టు పోస్టాఫీస్, ఈద్గారోడ్డు టు సీసీ బ్యాంక్, కొత్త నేషనల్ హైవే టు అలంకార్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలో అత్యధికంగా గజం భూమి రూ.21,300గా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు, ఇళ్లకు డిమాండ్ ఉండడంతో భూము ల విలువను ప్రభుత్వం ఈ మేరకు పెంచింది. కనిష్టంగా సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో గజం రూ.5500లుగా నిర్ణయించింది. కోదాడలో వ్యవసాయేతర భూములకు అత్యధికంగా గజం రూ.26,400 ఉండగా, కనిష్టంగా బాలాజీనగర్లో రూ.2300గా ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్మెంట్ల విషయానికి వస్తే కోదాడలోని హుజూర్నగర్ క్రాస్రోడ్డులో ఒక ఎస్ఎఫ్టీ గరిష్టంగా రూ.2400, కనిష్టంగా రూ.1800 చొప్పున నిర్ణయించారు. హుజూర్నగర్ పరిధిలో గతంలో అత్యధి కంగా గజం రూ.13,300 ఉండగా పెంచిన ధరలతో రూ.20,300గా నిర్ణయించారు. కనిష్టంగా భూముల విలువ గజం రూ.3వేలుగా ఉంది. హుజూర్నగర్లో 80 శాతం మేర భూముల విలువ పెరిగింది. జిల్లాలో కమర్షియల్ భూముల విలువ 50 నుంచి 100శాతం పెంపు వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ సైతం సవరణ -
ఎరువు..బరువు
జిల్లా రైతులపై రూ.45 కోట్లకు పైగా భారం ఇప్పటికే డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టర్ల కిరాయిలు పెరిగినాయి. యూరియా ధర పెరగకున్నా డీఏపీకి బదులుగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెంచడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎరువులు పత్తితో పాటు వరిలోనూ చల్లల్సిందే. ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించాలి. – జటంగి సైదులు, రైతు, కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచింది. జిల్లా రైతాంగం ఈ ఎరువులను అవసరానికి మించి వాడతారు. ఒక్క బస్తా వాడాల్సిన చోట రెండు బస్తాలను వాడుతున్నారు. దాంతో భూమిలో సారం తగ్గుతోంది. రైతులు సంప్రదాయ సాగు వైపు మళ్లాలి. పశువుల ఎరువు, జీలుగ, పచ్చిరొట్టె వంటి వాటిని భూముల్లో చల్లుకోవాలి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారిభానుపురి (సూర్యాపేట) : ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో రైతులపై భారం పడనుంది. ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు పెరిగి విత్తనాలు, పురుగు మందుల ధరలు, భూమి దున్నకం ఖర్చులు పెరిగి రైతులు అవస్థలు పడు తున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడంతో సాగు ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. యూరియా, డీఏపీల ధరలు పెరగకపోగా.. కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఎరువుల ధరల పెంపుతో జిల్లా రైతాంగంపై ఒక్క వానకాలం సీజన్లోనే సుమారు రూ.45 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. 6 లక్షలకు పైగా ఎకరాల్లో సాగుసూర్యాపేట జిల్లాలో వానకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో అఽత్యధికంగా 4.90 లక్షల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. మిగతాది మెట్ట పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు ఉంటాయి. వ్యవసాయశాఖ అంచనాల మేరకు రైతులు 60వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుంటారు. డీఏపీ ధర ఇప్పటి వరకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా అధికంగా ఉండడంతో 14 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులను 40 నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల వరకు వినియోగిస్తున్నారు. ఇందులో చాలామంది రైతులు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఆర్థికంగా భారం మోస్తున్నారు. భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు యథాతధంగా యూరియా, డీఏపీలు పెరిగిన ధరలు ఇలా..డీఏపీ ధరలు అధికంగా ఉండడంతో ఇప్పటి వరకు అదేస్థాయిలో భాస్వరం, ఇతర లవణాలు ఉండే కాంప్లెక్స్ ఎరువులను రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇందులోనూ 20–20–00–13 వాడకం అధికంగా ఉంటుంది. 17–17–17, 151–15–15, 28–00–28 వినియోగం తక్కువగా ఉంటుంది. ఇక డీఏపీ వాడకం కూడా మోతాదుగా ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా జిల్లా రైతాంగం అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువులు, అందులోనూ 20–20–00–13 ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెరగింది. పాత ధర రూ.1600లు ఉండగా ప్రస్తుతం రూ.2100కు పెరిగింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.500ల వరకు పెరిగాయి. దాంతో జిల్లా రైతాంగంపై ఈ ఒక్క సీజన్లోనే రూ.45 కోట్లకు మించి భారం పడనుంది. -
8న సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం
చిలుకూరు : సీపీఐ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సమయానికి హాజరు కావాలని కోరారు. విశేషంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తులుసూర్యాపేటటౌన్ : జిల్లాలోని 91 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు అదే గ్రామ పంచాయతీ పరిధిలో నివాసితులై ఉండాలని, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమేనని, బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున 10 నెలల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలిచివ్వెంల(సూర్యాపేట) : రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డి.నరేష్ సూచించారు. శుక్రవారం మండలంలోని వాల్యతండాలో నిర్వహించిన రైతు అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సారాన్ని కాపాడ డాటానికి రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు చేయించి, భూమికి అవసరమైన పోషకాలను, ఎరువులను వినియోగించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ డి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ నాగులునాయక్, ఏఈఓ శైలజ, రైతులు పాల్గొన్నారు. -
ధాన్యం కాంటా వేయాలని ఆందోళన
తుంగతుర్తి : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా అన్నదాతకు కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో రైతుల గుండెలు మండిపోతున్నాయి. తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రైతు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాలోతు సీతారాం ధాన్యం పోసి రెండు నెలలు దాటినా కాంటాలు వేయడం లేదని ఆవేదనతో గురువారం తన ధాన్యపు రాశికి నిప్పు పెట్టబోయాడు. పక్కనే ఉన్న రైతులు అతడిని వారించి నిప్పు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కాంటాలు అయ్యేవని అన్నారు. కానీ ఈసారి సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ కేంద్రంలో హమాలీలు ఇష్టానుసారంగా కాంటాలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కాంటాలు సీరియల్ ప్రకారం త్వరత్వరగా వేయాలని డిమాండ్ చేశారు. -
మార్క్ఫెడ్లో ఎన్డీసీఎంఎస్ విలీనం
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (ఎన్డీసీఎంఎస్)ను ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీఓ త్వరలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఎన్డీసీఎంఎస్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నిడమనూరు, హుజూర్నగర్, సూర్యాపేట, దేవరకొండలో విలువైన గోదాములు, ఖాళీ స్థలాలను కొన్ని విక్రయించినప్పటికీ ఇంకా కొన్ని ఆస్తులు నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్ నాలుగు కోట్ల రూపాయల లాభాల్లో ఉంది. విత్తనాలు, ఎరువుల విక్రయం ద్వారా రైతులకు సేవలందిస్తూ సంస్థ లాభాలను గడిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం భువనగిరిలో సంఘానికి చెందిన గోదాములు, ఖాళీ స్థలాన్ని విక్రయించగా స్టేషన్ రోడ్డులో దుకాణాల సముదాయం ప్రస్తుతం ఉంది. ఇందులో 13 మడిగెలు ఉన్నాయి. 1987వ సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలోని సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గ్రేడింగ్, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారు. అప్పట్లో ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్డీసీఎంఎస్లో 120 మంది ఉద్యోగులు పని చేసేవారు. సహకార సంఘాలు రావడంతో ఎన్డీసీఎంఎస్పై ఉన్న బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. సంఘానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఎన్డీసీఎంఎస్తో ప్రయోజనం లేదని గుర్తించి వ్యయభారం తగ్గించుకునేందుకు మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీసీఎంఎస్ను మార్క్ఫెడ్లో విలీనం చేయడంతో సంస్థకు ఉన్న ఆస్తులు మార్క్ఫెడ్ పరం కానున్నాయి. మార్క్ఫెడ్లో విలీనమైతే రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థ మరిన్ని వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఫ రూ.కోట్లాది విలువ గల ఆస్తులు ఇక మార్క్ఫెడ్ చేతిలోకి ఫ రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం -
సూర్యాపేటలో రూ.192 కోట్లతో జనరల్ ఆస్పత్రి నిర్మాణం
ఈ నూతన భవనంలో ఐసీయూ, ట్రామా కేర్, మాతా–శిశు విభాగం, డయాలసిస్, అత్యవసర విభాగం, రోగులకు ఒకేచోట అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ ఐసీయూలు, వెంటిలేషన్ సదుపాయాలు, డయాలసిస్ కేంద్రం, డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ విభాగం, ప్రత్యేక ప్రసూతి, శిశు వైద్య విభాగాలు క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భవన నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు కూడా త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఉంది. అత్యవసర వైద్య సేవలు కావాల్సి వస్తే అంబు లెన్స్లో హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మంకు పరుగులు తీసే కాలం చెల్లబోతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో రూ.192 కోట్ల నిధులతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అందు బాటులోకి రానుంది. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి.సూర్యాపేటటౌన్ : జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సర్వజన ఆస్పత్రి (జనరల్ హాస్పిటల్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. అంతర్గత మౌలిక వసతుల ఏర్పాటు, విద్యుత్, ఆక్సిజన్ పైప్లైన్లు, వైద్య పరికరాల అమరిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లాతోపాటు సమీప జిల్లాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. రూ.192 కోట్ల వ్యయంతో.. సూర్యాపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న జనరల్ ఆస్పత్రి పక్కనే నిర్మిస్తున్న నూతన సర్వజన ఆస్పత్రి భవనానికి ప్రభుత్వం సుమారు రూ.192 కోట్ల మేర నిధులు మంజూరు చేసింది. బహుళ అంతస్తులతో విశాలమైన ప్రాంగణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 350 పడకలు ఉండగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనంలో మరో 650 పడకలకు సరిపడా నిర్మాణం జరుగుతోంది. మొత్తం కలిపి వెయ్యి పడకల ఆస్పత్రిగా మారనుంది. నూతన భవనంతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనంపైన అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. నూతన భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. రెండు భవనాలు కలిసి సుమారు 3.54 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక హంగులతో.. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో సర్వజన ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే సూర్యాపేట జిల్లా వైద్య రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. రోగులు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ లోపల నాలుగు భారీ లిఫ్ట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే సూర్యాపేట జిల్లా వైద్య సేవల రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నూతన జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం ఐదు అంతస్తుల్లో భవనం నిర్మాణం జరుగుతోంది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. –రాజశేఖర్, ఈఈ, టీఎంఎస్ఐడీసీ ఫ వేయి పడకలు.. నాలుగు లిఫ్టులు ఫ తుది దశకు చేరిన పనులు ఫ త్వరలో అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు -
కబ్జా కోరల్లో చెరువులు
మునగాల : నీటితో కళకళలాడాల్సిన చెరువు శిఖం భూములు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి.చెరువు సరిహద్దుల్లో ఉన్న కొంతమంది రైతులు శిఖం భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నప్పటికీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మునగాల మండల కేంద్రంలోని ఊరచెరువుతోపాటు తాడువాయి శివారులోని ఎర్రచెరువు ఆక్రమణకు గురవుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా మునగాల ఊరచెరువు, తాడువాయి ఎర్రచెరువులకు చెందిన శిఖం భూముల్లో కొంతమంది రైతులు యథేచ్ఛగా మట్టి తోలకం పనులు చేపట్టి, చదును చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు, నీటిపారుదల శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణదారులు రోజురోజుకూ మరింత రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా.. చెరువుల ఆక్రమణలపై స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఇరు శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కబ్జాల కారణంగా చెరువుల విస్తీర్ణం కుంచించుకుపోతోంది. దీనివల్ల భవిష్యత్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే చెరువులను నమ్ముకుని మత్స్య సంపదపై జీవనం సాగిస్తున్న వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి, చెరువుల ఆక్రమణలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాడువాయి ఎర్రచెరువు, మునగాల ఊరచెరువును కొంతమంది మట్టిపోసి చదును చేసి ఆక్రమణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు చేపడతాం. –వినయ్కుమార్రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఏఈఈ, మునగాల ఫ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఫ మత్స్యకారుల ఉపాధికి గండం ఫ ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు -
నూతన గ్రామ పంచాయతీ ఎదుట సర్పంచ్ నిరసన
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచ్ పొల్నేడి నర్సమ్మ గురువారం నూతన పంచాయతీ భవనం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అన్ని అనుమతులు ఇచ్చి, బిల్లులు మంజూరు చేసిన అధికారులే.. భవనాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతో భవన ప్రారంభాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను అధికారులు అవమానపరచడం తగదన్నారు. నూతన భవనాన్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. -
రూ.3 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం
హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో రూ 3.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హుజూర్నగర్ కొత్త బస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం గురువారం ఆయన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో మంత్రితో శంకుస్ధాపన చేయిస్తామన్నారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ పట్టణానికి వచ్చిన ఎండీకి ముందుగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్రెడ్డి, ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ తుసూర్షా ఖాన్, ఆర్ఎం కే.జాన్రెడ్డి, డీఎం డి.శ్రీనివాసరావు, ఏఎస్ఎం పి.నాగశ్రీ, సూపరింటెండెంట్ సీహెచ్ నాగిరెడ్డి, సుధాకర్రెడ్డి, సులువ చంద్రశేఖర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసం పోలీసు శాఖ అనుక్షణం కృషి చేస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింక్లను ఓపెన్ చేయవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100, 112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారులకు కేసు పత్రాలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం
సూర్యాపేట అర్బన్ : వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారానికి సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికై ంది. ఈ పురస్కారాన్ని శుక్రవారం హైదరాబాద్లోని టీజీపీసీబీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపల్ అధికారులకు అందజేయనున్నారు. నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలుసూర్యాపేటటౌన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 5వ తేదీ (శుక్రవారం) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 186 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదన్నారు. రాజకీయ కమిటీ వైస్చైర్మన్గా ప్రభాకర్కోదాడ, కోదాడ రూరల్ : ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా కోదాడ పట్టణానికి చెందిన ఓరుగంటి ప్రభాకర్ నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్లోని వాసవీభవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభాకర్కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. నిరుద్యోగాన్ని అరికట్టడంలో ప్రధాని విఫలం సూర్యాపేట అర్బన్ : దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని, వాటిని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పదేపదే భారతదేశంపై సుంకాలు విధిస్తున్నా.. వాటిని ప్రతిఘటించడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. పార్టీ జిల్లా శిక్షణ తరగతుల్లో మతోన్మాద విధానాలు– శాసీ్త్రయ ధృక్పథం అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి బోధించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా చలమల్లభానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ఉద్యమకారుల వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా చలమళ్ల నర్సింహ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ నరాల సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. -
బిగ్ షాక్: రేవంత్, ఉత్తమ్లకు అధికారుల డీమోషన్!
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు."ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! -
గ్రామ సభలను విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలకు మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లాలో నిర్వహించే గ్రామ సభలు, శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణలపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 72శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్బృందాలు నిఘా పెట్టాలన్నారు. వర్షపాతం తక్కువగా నమోదైతే ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. వన మహోత్సవానికి అటవీ శాఖ, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వారం రోజుల్లోగా సమగ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎఫ్ఓ దామోదర్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విశేషంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం నీరాజన మంత్ర పుస్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది. -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించించింది కేసీఆరేనని, అందుకే ఆయనను ప్రజలంతా తెలంగాణ జాతిపితగా పిలుస్తున్నారన్నారు. అది తట్టుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విషం కక్కుతున్నారని ఆరోపించారు. పదవులను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సాధనకై ముందుకు నడిపిన గొప్పనేత కేసీఆర్ అని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 24 కరెంట్ ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పటికే ఆంధ్ర పాలకులు, ఉద్యోగులు, ఆంధ్ర కుట్రదారుల పెత్తనం మొదలైందని, ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోందని విమర్శించారు. అప్రమత్తంగా ఉండి పోరాడకపోతే ఆగమైతమని, వాళ్ల కుట్రలను ఛేదించాలంటే మరొక తెలంగాణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
జ్వరమని పిలిస్తే తోడొచ్చిన అక్క.. చెల్లితో పాటే అనంతలోకాలకు
అర్వపల్లి, వేలేరుపాడు : ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అక్కాచెల్లెళ్లు సజీవ దహనమాయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల గోపయ్యకు ఇద్దరు కుమార్తెలు పూలమ్మ(64), సావిత్రి(61) సంతానం. పూలమ్మకు జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన శిగ వెంకటేశంతో, సావిత్రికి ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన వలగాని ఉప్పలయ్యతో వివాహం జరిగింది. పూలమ్మ భర్త వెంకటేశం 12 ఏళ్ల కిందట, సావిత్రి భర్త గోపయ్య 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లకు సంతానం లేరు. భర్త మృతిచెందిన తర్వాత పూలమ్మ తన తల్లిగారి ఊరైన కాసర్లపహడ్కు వచ్చి తమ్ముడు ఉయ్యాల అంజయ్య ఇంట్లో ఉంటోంది. సావిత్రి వేలేరుపాడులోనే నివాసముంటూ కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. సావిత్రి తన తమ్ముడు అంజయ్య కుమారుడు రవిని దత్తత తీసుకుంది. జ్వరం వస్తుందని చెల్లె ఫోన్ చేయడంతో.. కాసర్లపహాడ్లో ఉంటున్న తన అక్క పూలమ్మకు నెల రోజుల కిందట సావిత్రి ఫోన్ చేసి తనకు జ్వరం వస్తుందని.. తగ్గే వరకు ఉండిపొమ్మని కోరింది. దీంతో పూలమ్మ వేలేరుపాడులో ఉంటున్న చెల్లెలు సావిత్రి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. సోమవారం రాత్రి సావిత్రి ఉంటున్న రేకుల ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఇద్దరు వేర్వేరు మంచాలలో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సావిత్రి, పూలమ్మ సజీవ దహనమయ్యారు. ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయి. మంటలు పక్కనే ఉన్న లక్ష్మి అనే మహిళ ఇంటికి కూడా వ్యాపించడంతో ఆ ఇల్లు కూడా దగ్ధమైంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు కాసర్లపహాడ్ నుంచి మృతుల బంధువులు వేలేరుపాడుకు వెళ్లారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించగా, వారు అంత్యక్రియల నిమిత్తం కాసర్లపహాడ్కు తీసుకొచ్చారు. హత్య చేసి కాల్చేశారా..? ఈ అగ్ని ప్రమాదంపై మృతుల బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సావిత్రిది ఇల్లు రేకుల ఇల్లు కావడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఒక కోణంలో పోలీసులు భావిస్తుండగా.. మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు అక్కాచెల్లెళ్లను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేసిన అనంతరం సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి సజీవ దహనం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏలూరు పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఘటనా స్థలంలోని విద్యుత్ వైర్లు, ఇతర వస్తువులను సేకరించి విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో, కుక్కునూరు సీఐ ఎం. రమేష్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ అగ్నిప్రమాదంలో అక్కాచెల్లెళ్లు సజీవ దహనంఫ ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఘటన ఫ మృతుల తల్లిగారి ఊరు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ -
అభివృద్ధిలో సరికొత్త అడుగు
భానుపురి (సూర్యాపేట) : ఎందరో త్యాగధనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గేయాన్ని ఆలపించి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 5కోట్ల 13 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.307 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఆదా చేసుకున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 46,587 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని తెలిపారు. పేదింటి ప్రజల కల సాకారం దిశగా.. పేదంటి ప్రజల కల సాకారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 12,868 ఇళ్లను కేటాయించామని, ఇందులో 6,032 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో సీతారామస్వామి గుట్ట వద్ద 2,160 గృహాలకు మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 675 రెండు పడకల గదులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.397 కోట్ల 24 లక్షల నిధులను బ్యాంకుల ద్వారా రుణాలుగా ఇప్పించామని, జిల్లాలో రెండు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మోతె మండలం అన్నారెడ్డిగూడెం వద్ద పాలేరు వాగుపై ఎత్తిపోతల పథకం కోసం 204 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. 39 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.206 కోట్ల 37 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా..జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వంద పడకల ఏరియా హాస్పిటల్ ను 400 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. నూతన పల్లె దావాఖాల నిర్మాణాలకు, వివిధ పనుల కోసం రూ.334 కోట్ల 85 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ నరసింహ ఉన్నారు.ఫ త్వరలోనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం ఫ మహిళలకు రూ.307 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ లబ్ధి ఫ ఇరిగేషన్ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఫ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ యాసంగి సీజన్లో రూ.810 కోట్ల విలువైన ధాన్యాన్ని 48,897 మంది రైతుల వద్ద సేకరించామని చెప్పారు. వీరికి ఇప్పటివరకు రూ.530 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద 478 మంది రైతులకు రెండు కోట్ల 72 లక్షల విలువైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించినట్లు చెప్పారు. 2026– 27 వానాకాలంలో 50 శాతం సబ్సిడీపై 2500 క్వింటాల జీలుగు విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
న్యాయవాదుల సమష్టి కృషి ఫలితం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారుల న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చట్టాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం, ఇది న్యాయవాదులు సాధించిన సమష్టి కృషి ఫలితం. – నూకల సుదర్శన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సూర్యాపేట -
తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలి
– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మోత్కూరు : హైదరాబాద్లోని కొత్తపేట ప్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్లోని ఎల్బినగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతిపాలకవీడు: పాలకవీడు తహసీల్దార్గా పనిచేస్తున్న ప్రమీలకు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నది లభించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆమె పేరు ఉండడంతో ప్రమీలను మండల అధికారులు అభినందించారు. మూగజీవాలకు పెంటయ్య సేవలు అభినందనీయం కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మూగజీవాలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సీతరామయ్య కొనియాడారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో డాక్టర్ పెంటయ్య విశిష్ట సేవలను అభినందిస్తూ ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ పెంటయ్య కోదాడ ప్రాంతంలోని పశువులకే కాకుండా పక్క జిల్లాలు, పొరుగున ఉన్న ఏపీ ప్రాంత మూగజీవాలకు కూడా వైద్య సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ నల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్, సర్వీసింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ సియాజి రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం
సూర్యాపేటటౌన్ : ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెనన్స్ డేలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో జూన్ ఒకటి నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీలు లేదా ఆ పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. అధిక శబ్ధం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని పేర్కొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో ఎస్పీ నరసింహ -
వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
నాగారం : వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం నాగారం మండలం ఫణిగిరిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంక్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎస్ఓ మోహన్బాబు, తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, ఏపీఎం వెంకట్రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చామంతినరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వసతుల కల్పన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మంగళవారంతో 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 2016లో సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భవించన అనంతరం అభివృద్ధిని పరిశీలిస్తే అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సూర్యాపేటకు రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రహదారులు, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్, పోలీస్ పరిపాలన, వైద్య, విద్యా సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. జిల్లా స్థాయి పరిపాలన అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. -
పెరిగిన సాగు విస్తీర్ణం
వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న సూర్యాపేటలో సాగునీటి ప్రాజెక్టులకు భారీ ప్రాధాన్యం లభించింది. జిల్లాలో నాగార్జునసాగర్ కాలువల కింద 2,29,961 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్–2 2,13,175 ఎకరాలు, నాగార్జునసాగర్ లిఫ్టుల కింద 38,422 ఎకరాలు, మూసీ ప్రాజెక్టు కింద 15,230 ఎకరాలతో పాటు చెరువులు, ఇతర లిప్టులు, బోరుబావుల కింద కలిపి దాదాపు 6,20,886 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3,98,218 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఎస్సారెస్పీ స్టేజ్ –2 కింద రెండు పంటలకు సాగు నీరు అందించడంతో 2026 నాటికి 6.20 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే దాదాపు 2,21,500లకు పైగా సాగు భూమి పెరిగింది. -
వేడుకల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట అవతరణ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. రాష్ట్ర అవతరన వేడకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం అదనపు కలెక్టర్ హరిసింగ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం కలెక్టరేట్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉదయం 8 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరుల కుటంబ సభ్యులకు సత్కారం, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ, ప్రతిభా వంతులైన విద్యార్ధులకు సన్మానించనున్నట్టు పేర్కొన్నారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలిప్రజావాణిలో వచ్చిన అర్జీలను ప్రాధాన్యతాక్రమంలో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, డీసీఓ ప్రవీణ్ పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధాన్యం దిగుబడిలో ముందంజ
తెలంగాణ ఏర్పడక ముందు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేసేవారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, పెసర, కంది వంటి పంటల సాగు అధికంగా ఉండేది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో వరి సాగు అధికంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రెండు పంటలను విడుదల చేయడంతో వరిసాగు అధికమైంది. అధిక శాతం రైతులు వరి సాగువైపు మళ్లారు. తెలంగాణ ఏర్పడక ముందు 2.32 లక్షల ఎకరాల్లో ఉన్న వరి.. 2026 నాటికి 4.80 లక్షల ఎకరాలకు చేరింది. ప్రతి సీజన్లో జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండి.. రాష్ట్రంలోనే వరి దిగుబడిలో సూర్యాపేట ముందంజలో ఉంది. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి : ఉత్తమ్
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్లను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి మంత్రి పరిశీలించారు. మిగిలిన పనుల గురించి మంత్రి వాకబు చేస్తూ ఇలా ఆలస్యంగా చేస్తే ఎలా అంటూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు రూ.50 లక్షలతో ఏర్పాటు చేసి అనుసంధానించిన 372 సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్లు దొంతగాని శ్రీనివాస్, కొణతం చివెంకటరెడ్డి, వైస్ చైర్మన్లు తన్నీరు మల్లిఖార్జున్, నూకల సందీప్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ డి.రాధిక, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, కోతి సంపత్రెడ్డి, గెల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంమఠంపల్లి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో రూ.80లక్షలతో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈసభలో వైస్ చైర్మన్ బాబునాయక్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంజీనాయక్, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, అరుణ్కుమార్దేశ్ముఖ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్రెడ్డి, సర్పంచ్ వీరలక్ష్మిపాపయ్య, ఉపసర్పంచ్ కొత్తపల్లిశౌరీ, అరుణాసైదులు, బాబుతోపాటు డివిజన్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
7వ తేదీలోగా కళాశాలల్లో చేరండి
నడిగూడెం : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో చేరాలని ఆ విద్యాలయాల సంస్థ డీసీఓ సీహెచ్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 7వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఘర్షణపై విచారణగరిడేపల్లి : రెండు రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరి ఉద్యోగుల మధ్య జరిగిన గొడవపై సోమవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై కార్యాలయంలోని సిబ్బందిని, ఇతరులను విచారించి వివరాలను సేకరించారు. కార్యాలయం ఆవరణలో సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న విషయంపై, సర్వీస్ బుక్లో వివరాలను నమోదు చేయలేదనే అంశంపై ఆమె విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. ఆమె వెంట ఎంపీడీవో సరోజ తదితరులు ఉన్నారు. జిల్లా పోలీసులకు సేవా పతకాలుసూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలు వరించాయి. ఇందులో జిల్లా అదనపు ఎస్పీ యు.రవీందర్రెడ్డికి రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పతకం లభించింది. సీసీఎస్ ఏఎస్ఐ వెంకన్న, డీసీ ఆర్బీ కానిస్టేబుల్ శ్రీధర్, ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య, ఏఆర్ కానిస్టేబుల్ మధుమోహన్లకు సేవా పతకాలు వచ్చాయి. ప్రతిభ అవార్డులు పొందిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ అభినందించారు. ఉత్తమ సేవలకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు. శాస్త్రోక్తంగా నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విస్తరణ నల్లగొండ : వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్, సర్కిల్ కార్యాలయాలను విస్తరించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక డివిజన్తోపాటు 5 సిర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రటించింది. దీంతో జిల్లాలో అదనంగా ఆరు కార్యాలయాల ఏర్పాటు కానున్నాయి. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మహా శివుడికి పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. -
విద్యారంగంలో డిజిటల్ సేవలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద పాఠశాలల అభివృద్ధి డిజిటల్ తరగతి గదులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, గురుకుల విద్యాసంస్థల విస్తరణ, గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికితోడు చిలుకూరు, తిరుమలగిరి మండలాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరై పనులు జరుగుతున్నాయి. అలాగే కోదాడకు జవహర్లాల్ నవోదయ విద్యాలయం మంజూరైంది. -
నల్లగొండ డీఈఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యాధికారి(డీఈఓ) బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు. నేరాల నియంత్రణకు నిరంతర తనిఖీలు ● నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్నల్లగొండ : నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తారని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఆయన శనివారం అర్ధరాత్రి నల్లగొండలో నాకా బందీ నిర్వహించి వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నాఖాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారని వెల్ల డించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. -
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆలయ క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపికకోదాడరూరల్ : ఈ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్లను ఆదివారం కోదాడలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్–19 బాల, బాలికలు, సీని యర్స్ సీ్త్ర పురుషులకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. అండర్–19 విభాగంలో జె.గౌతమ్ (హుజూర్నగర్), ఏ.సంతోష్ (కోదాడ), ఎండీ. మహ్మద్ క్వాహీ (కోదాడ), ఎండీ.మహ్మద్ హాది (కోదాడ), సీనియర్స్ విభాగంలో జె.సంతోష్ (హుజూర్నగర్), కె.ఉత్తేజ్ (సూర్యాపేట), కె.అవినాష్ (హుజూర్నగర్), రవీందర్ (కోదాడ), కె.నైనిక(సూర్యాపేట) ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరి తోట రంగారావు, కోచ్లు ఖాజా జలీల్, ఖాజా ఫజల్, నిస్సార్ పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణ, మదుఫర్కపూజ, మాంగల్యధారణ చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, నరేందర్ పాల్గొన్నారు. -
20 మంది అధికారులు
119 ఆలయాలు..రామగిరి(నల్లగొండ) : నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయాల సంఖ్యకు, పర్యవేక్షించే అధికారుల సంఖ్యకు పొంతన లేకపోవడంతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అర్చకుల వేతనాలు, దేవుడి భూముల రక్షణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ వంటి కీలకమైన బాధ్యతలు ఇన్చార్జిల పాలనతో కుంటుపడుతున్నాయి.నల్లగొండ అసిస్టెంట్ కమిషన్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాగ్రి భువనగిరి, జనగామ జిల్లాలో మొత్తం 119 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కొక్కరు చొప్పున ఎండోమెంట్ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఐదుకు పైగా ఆలయాలకు ఒకే అధికారి..నిబంధనల ప్రకారం ప్రతి దేవాలయానికి ఒక పూర్తిస్థాయి ఎండోమెంట్ (కార్యనిర్వాహక) అధికారి ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండతో పాటు జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. దీనితో ఒక్కో అధికారికి సగటున ఐదు నుంచి ఆరు ఆలయాలకు అదనపు బాధ్యతలు (ఇన్చార్జి ఈఓగా) నిర్వహించాల్సి వస్తుంది. దూరభారాలు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఆలయాలను ఒకే అధికారి పర్యవేక్షించాల్సి రావడంతో వారు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి..నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పండగలు, ఉత్సవాల నిర్వహణ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆయాల దేవాలయాల పరిధిలో వేలాది ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు కేసుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. హుండీ లెక్కింపు, దాతల విరాళాలు, లీజుల వసూళ్లు వంటి ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ సకాలంలో జరగడం లేదు. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకుల సమస్యలను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. తక్షణ చర్యలు అవసరం..ఒక అధికారి వారంలో ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో ఒక ఆలయానికి కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల కనీస వసతుల కల్పన పూర్తిగా నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వైభవాన్ని, ఆస్తులను కాపాడాలంటే ప్రభుత్వం స్పందించి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎండోమెంట్ అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ శాఖకు సిబ్బంది కొరత ఒక్కో అధికారికి ఐదు, ఆరు ఆలయాల ఇన్చార్జి బాధ్యతలు కష్టతరమవుతున్న ఆలయ భూముల రక్షణ, ఉత్సవాల నిర్వహణ -
అండర్ పాస్ అయ్యేదెలా..?
మఠంపల్లి: మండలంలోని పలు గ్రామాల గుండా వెళ్లే రైల్వే లైన్ మార్గంలో అండర్పాస్లు ఏర్పాటు చేశారు. అయితే అండర్పాస్లు లోతట్టుగా ఉండడం, వరదనీటి పారుదల సౌకర్యం లేక పోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద నీరు అక్కడే నిల్వ ఉండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండలంలోని తీగెలచెరువుతండా, అవిరేణికుంట తండా, లాలితండా, తుమ్మలతండా, మంచ్యాతండా గ్రామాల పరిధిలో ఉన్న అండర్పాస్లు లోతుగా నిర్మించారు. కొద్ది పాటి వర్షం వచ్చినా ఇందులో భారీగా నీరు నిల్వఉంటోంది. 15 నుంచి నెలరోజుల పాటు అండర్పాస్ వద్ద బురద, నీరు నిల్వ ఉండి వాటి గుండా ప్రయాణించేందుకు ఆయా గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపడడంతో గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధి కారులు స్పందించి అండర్ పాస్ బ్రిడ్జీల కింద వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వరదనీటి నిల్వతో రాకపోకలకు అంతరాయం -
‘సర్’ పై ఫోకస్.. !
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’పై జిల్లాలో ఫోకస్ నెలకొంది. ఓవైపు అధికారులు, మరోవైపు రాజకీయ పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై దృష్టి సారించారు. జూలై 31లోగా ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. పలు కారణాలతో ఇప్పటి వరకు మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. మ్యాపింగ్తోనే బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు అధికార యంత్రాంగం, కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. అర్హులైన వారి ఓట్లు తొలగింపునకు గురి కాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తగ్గిపోవడంతో పాటు అధికార మార్పిడి కూడా జరగడంతో అధికార కాంగ్రెస్ ముందస్తుగా చర్యలు చేపట్టింది. పారదర్శకంగా ఉండేలా..!ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలకమైన ఓటర్ల మ్యాపింగ్, భౌగౌళిక సరిహద్దులు, పోలింగ్ కేంద్రాల పరిధికి అనుగుణంగా చేపడుతున్నారు. మొదటి విధానంలో 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాతో సరిపోల్చుతున్నారు. రెండో విధానంలో 2002 ఓటరు జాబితాను సేకరించి.. ఆ తర్వాత ఓటు హక్కు పొందిన వారి సంతానం సమాచారంతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 70 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో వారికి ఈ నెల 15 నుంచి 24 వరకు సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నారు.క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ చేస్తున్న బీఎల్ఓలు తమ ఓటర్లు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీల ప్రయత్నాలు బూత్ స్థాయిలో కమిటీలు, శిక్షణ -
హోటళ్లలో తనిఖీలు
యాదగిరిగుట్ట : పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఇన్చార్జి ఫుడ్సేఫ్టీ అధికారి శివశంకర్ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న మంత్రాలయం హోటల్లో సోయా సాస్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వంటలకు ఉపయోగించే నూనె ఓవర్ హీట్ కావడం, కిచెన్లో వంట పాత్రలపై మూతలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న త్రినేత రాఘవేంద్ర హోటల్లో సైతం ఛాయ్ పత్తా కలర్ ఎక్కువగా ఉందని, పిండి పదార్థాలు బాగులేవని గుర్తించారు. సన్నిధి ఎమరాల్డ్ హోటల్లో ఆరు సాస్ బాటిల్స్ గడువు ముగిసినట్లు గుర్తించారు. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపుతామని ఆయన వెల్లడించారు. త్రినేత్ర రాఘవేంద్ర, మంత్రాలయం హోటల్స్లో వాటర్ బాటిల్స్ శాంపిల్స్ తీసుకున్నామని, సోయా సాస్లను సైతం శాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా హోటల్స్ కిచెన్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని, శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. వరి కొయ్యలకు నిప్పు● గడ్డివాములు, పైపులు దగ్ధం ఆత్మకూరు(ఎస్) : మండల పరిధిలోని బొప్పారం శివారు ఏపూర్ తండాలో ఆదివారం వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 4ఎకరాలకు పైగా పంట చేలలో పచ్చని చెట్లు, గడ్డివాములు, విద్యుత్ స్టార్టర్లు, పైపులు మంటల్లో కాలిపోయాయి. స్థానికులు ఫైరింజన్ సహకారంతో మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని అధికారులు ఎంత హెచ్చరించినా రైతులు ఆపడం లేదు. సాగర్లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వేసవివ సెలవులతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకు అధిక సంఖ్యలో తరలివచ్చి సాగర్ డ్యాం, బుద్ధవనం సందర్శించారు. విజయవిహార్ అతిథి గృహంలో బస చేసిన పలువురు పర్యాటకులు ప్రత్యేక సైకిళ్లతో పాటు బ్యాటరీ వాహనాల్లో సంచరించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు విజయవిహార్ సమీపంలోని ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. ఇద్దరు ఐటీఐ ప్రిన్సిపాళ్ల బదిలీ ఆలేరు : ఆలేరు, భువనగిరి పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణను మేడ్చల్ జిల్లా శామీర్పేట ఐటీఐకు, భువనగిరి ప్రిన్సిపాల్ జయను హైదరాబాద్లోని సంతోష్నగర్ ఐటీఐకి బదిలీ చేశారు. గద్వాల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణను ఆలేరుకు, శామీర్పేట ఐటీఐ ప్రిన్సిపాల్ లలితను భువనగిరికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
యూజీడీ పనులు పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ పనుల తీరుపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైపులు, మ్యాన్న్ హోల్ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి, నెలల తరబడి కాంక్రీట్ పనులు చేయకుండా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. తవ్వకాల సమయంలో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి, దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో నల్లగొండ ప్రజారోగ్యశాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి, మున్సిపల్ ఏఈ కిరణ్కుమార్, ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఏఈ అనిల్కుమార్, రమాదేవి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేటి నుంచి ఇంటర్ తరగతులు
సూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత కళాశాలలు తెరుచుకోనుండగా.. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు. విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు ఉత్తమ ఫలితాల సాధనపై ఆయా కళాశాలల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో 87 జూనియర్ కళాశాలలు.. సూర్యాపేట జిల్లాలో మొత్తం 87 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు, గురుకులాలు, మోడల్, కేజీవీబీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచే పాఠ్యాంశాల బోధన ప్రారంభించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించింది. అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి..ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత విద్యా సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తెలంగాణ బ్రేక్ ఫాస్ట్ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో అల్పాహారం, మూడు రోజులు పాలు(150 మి.లీ.), మూడు రోజుల రాగిజావ అందించనున్నారు. అల్పాహారంలో ఇడ్లీ, మిల్లెట్ఇడ్లీ, ఉప్మా, దోసె, బోండాలు, పూరీలను అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్తోపాటు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. పునఃప్రారంభం కానున్న జూనియర్ కళాశాలలు జిల్లాలో 8 ప్రభుత్వ కళాశాలలు -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కనగల్ : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలకు చదువును దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ ఎంజీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదని విమర్శించారు. తాను హెలికాప్టర్లో, కారులో, బండిమీద ఎలా తిరిగినా జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఎంజీ యూనివర్సిటీని చేశామని.. ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందన్నారు. యూనివర్సిటీలో ఫార్మసీ, ఎల్ఎల్బీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ధర్వేశిపురం నుంచి కనగల్ –గుర్రంపోడు–దేవరకొండ మీదుగా డిండి వరకు రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీల్లో కనగల్ –గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, చిట్ల వెంకటేశంగౌడ్, ఎంపీడీఓ వేదరక్షిత, ఎంపీఓ సతీష్, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -
సర్కారు బడిలో స్పెషల్ కోచింగ్
చీమ – మిడతఫ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఫ నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో మూడేళ్లుగా కోచింగ్ ఇస్తున్న ఉపాధ్యాయులునార్కట్పల్లి : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నారు. గత మూడేళ్లుగా వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు. వేసవి సెలవులకు ముందే ప్రధానోపాధ్యాయుడు రాములు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఉన్నత చదువుల కోసం ప్రత్యేక కోచింగ్ ఇప్పించాలని సూచించగా.. డబ్బుల్లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆయనే స్వయంగా పాఠశాలలో ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. 50 మంది విద్యార్థులకు కోచింగ్..6 నంచి 10వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈ కోచింగ్కు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి) సంయుక్త సహకారంతో ఇద్దరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తున్నారు.ఐఐటీ కోచింగ్ తీసుకోవడం వలన నా పై చదువుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు కోచింగ్కు వస్తున్నాను. మ్యాథ్స్ మంచిగా అర్ధమయమ్యలా కోచింగ్ ఇస్తున్నారు. – భాషపాక లోకేష్, 10వ తరగతి గతంలో ఇంగ్లిష్లో వెనుకబడి ఉన్నాను. నెల రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకోవటం వలన ఇంగ్లిష్ రాయటం, చదవడం వస్తుంది. కోచింగ్ ఎంతో ఉపయోగంగా ఉంది. – గడ్డం శ్రీనిత్య, 8వ తరగతి మూడేళ్ల కితం ప్రధానోపాద్యాయుడు రాములు వచ్చి అడగడంతో ప్రతి వేసవిలో గత మూడేళ్లుగా నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో ఐఐటీ కోచింగ్ ఇస్తున్నాను. విద్యార్థులకు సులభంగా అర్థమమ్యేలా కోచింగ్ ఇస్తున్నాను. – రాపోలు మాధవ, ఉపాధ్యాయుడుదాతల సహకారంతో పాఠశాలలో చదువుకునే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటీ, స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇంగ్లిష్లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నాం. – రాములు, ప్రధానోపాధ్యాయుడు, నార్కట్పల్లి జెడ్పీహెచ్ఎస్ బామ్మ చెప్పిన కథవేసవి కాలంలో ఒక చీమ వానాకాలం కోసం ఎంతో కష్టపడి గింజలు మోసుకుంటూ ఆహారాన్ని కూడబెట్టుకుంటోంది. పక్కనే చెట్టు మీద ఉన్న ఒక మిడత చీమను చూసి, ‘అంత కష్టం ఎందుకు? నాలాగా హాయిగా పాడుకుంటూ ఆనందించొచ్చు కదా’ అని ఎగతాళి చేసింది. చీమ దాని మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. కొన్నాళ్లకు వానాకాలం రానే వచ్చింది. బయట అంతా వర్షం, ఎక్కడా ఆహారం దొరకలేదు. మిడతకు ఆకలితో ప్రాణం పోయేలా ఉండి, సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్లింది. అప్పుడు చీమ ‘కష్టపడాల్సిన సమయంలో పాడుకుంటూ కాలక్షేపం చేశావు, ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నావు. నీ బద్ధకమే నీకు శత్రువు’ అని చెప్పింది. నీతి: సమయాన్ని వృథా చేయకూడదు. కష్టకాలం రాకముందే మన భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.మంగినెపల్లి రోహిత్ చంద్ర, నకిరేకల్ మేము బొమ్మలు గీశామోచ్ -
వేతనాల్లో కోతపై తొందరెందుకు
సూర్యాపేటటౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కొత్త ఆరోగ్య పథకం కోసం మే నెల వేతనం నుంచే కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య అన్నారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి సంబంధించిన సర్వీసు బుక్లు, కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్ చేయడం ఇంకా పూర్తి కాలేదన్నారు. కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉండబోతుంది.? ఏయే ఆస్పత్రుల్లో సేవలు అందుతాయనే విషయాలు ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్ల డించలేదన్నారు. ఇవన్నీ పూర్తికాక ముందే హెల్త్కార్డ్కు సంబంధించిన డబ్బులను వేతనాల నుంచి కోత విధించడంలో ప్రభుత్వానికి అంత దొందరెందుకని ప్రశ్నించారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బి.దేవేందర్, గణిత, రాంసింగ్, కోటయ్య, సాహెబ్అలీ, ఫజల్ ఆబ్ఖాన్ పాల్గొన్నారు. యూటీఎఫ్ ఖండనరాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్తో కూడిన హెల్త్ కార్డులను అందించే క్రమంలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆర్థిక శాఖ మే నెల నుంచే ఉద్యోగుల వేతనాలలో 1.5శాతం మినహాయించడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, అనిల్ కుమార్లు ఖండించారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చలు జరపలేదని, రాష్ట్రంతో పాటు విజయవాడ, కర్నూలు పట్టణాల్లోనూ వైద్యం అందించాలన్న డిమాండ్ను పరిశీలించలేదన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య -
పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం
సూర్యాపేటటౌన్ : పొగాకు వ్యసనాన్ని అందరం కలిసి అడ్డుకుందామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని అంబేద్కర్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రంగు రంగుల ప్యాకేజీలు, సువాసనలతో కూడిన ఫ్లేవర్డ్ సిగరెట్లు, ఈ–సిగరెట్ల వంటి వాటికి యువత, పిల్లలు ఆకర్షితులై వాటికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులను నమలడం, ధూమపానం వల్ల నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాసివ్ స్మోకింగ్ వల్ల గర్భిణులు, చిన్న పిల్లలు తీవ్ర ఆరోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. వీటి నుంచి బయట పడే వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘టొబాకో సెసేషన్ సెంటర్స్’ ద్వారా కౌన్సెలింగ్, మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జి.చంద్రశేఖర్, టీబీ యూనిట్ ఆఫీసర్ పి. వెంకటపాపిరెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి అమూల్య, డిప్యూటీ డెమో వి.సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అన్ని శాఖల అధికారులు రోడ్డు భద్రతా చర్యల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఆర్అండ్బీ, రైల్వే, ఇరిగేషన్, ఆర్టీఓ, ఎడ్యుకేషన్, డీఎంహెచ్ఓ, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులతో శనివారం కలెక్టరేట్ వీసీహాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ కె. నరసింహతో కలిసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. రహదారులపై లోపాలను గుర్తించి సవరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో పౌరులు బాధ్యతగా ఉండాలని, ప్రమాద సమయంలో సహాయ సహకారాలు అందించే వారికి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఆటోలు, ట్రాలీలలో ఎక్కువ మందితో ప్రయాణం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఎంహెఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, ఆర్టీఓ జయప్రకాశ్రెడ్డి, డీపీఓ యాదగిరి, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కుట్ర
సూర్యాపేటటౌన్ : తెలంగాణ రైతాంగానికి అందుతున్న ఉచిత విద్యుత్ను ఎత్తివేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రైతుల ప్రయోజనార్ధం చేపట్టిన రైతుబంధు, ఉచిత విద్యుత్, ధాన్యానికి మద్దతు ధర వంటి వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మూడవ డిస్కం తీసుకొస్తామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు చెప్పడం, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదని ప్రభుత్వం చెప్పడం రైతులను నిలువునా మోసం చేసే ప్రయత్నమేనన్నారు. రైతుల పాలిట ఉరితా డుగా మారనున్న మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పార్టీ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఉప్పల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్ -
వంతెన కల.. నెరవేరుతున్న వేళ
గరిడేపల్లి : తాళ్ల మల్కాపురం పరిధిలోని ప్రజల వరద కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఇక్కడి పునాతన లోలెవల్ వంతెన స్థానంలో రూ.6.90 కోట్లతో నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను స్థానిక ప్రజలు మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.6.90 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఏప్రిల్ నెలలో ప్రారంభమైన వంతెన పనులు త్వరలో పూర్తి కానున్నాయి. తీరనున్న వరద కష్టాలు.. గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం పరిధిలో లోలెవల్ వంతెనపై నుంచి వర్షాకాలంలో స్వల్ప వర్షాలకే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కీతవారిగూడెం నుంచి మునగాల వరకు గల విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి కావడంతో.. వరదలు వచ్చినప్పుడల్లా రాకపోకలు నిలిచి పోతున్నాయి. దాంతో వెలిదండా, కొక్కిరేణి, కీతవారిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, రేగులగడ్డ తండా, రంగాపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల వరద కష్టాలు తీరనున్నాయి. ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు వారం రోజులుగా వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల వల్ల వాహనదారులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు వంతెన పక్కనే తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం వాహనదారులు ఈ రోడ్డు ద్వారానే ప్రయాణిస్తున్నారు. రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ తాళ్లమల్కాపురంలో కొత్త వంతెన నిర్మాణం ఫ రూ. 6.90 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ శరవేగంగా సాగుతున్న పనులుపురాతనమైన వంతెన కావడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. మా ఇబ్బందులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే రూ.6.90 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. మా ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. – యమగాని సైదులు, తాళ్ల మల్కాపురం -
సర్వీస్ బుక్ ఎంట్రీపై పంచాయితీ..
గరిడేపల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇద్దరు ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. మండలంలోని లచ్యాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మొయినొద్దీన్ వాహనాన్ని అడ్డుకొని తన సర్వీస్బుక్ ఎందుకు ఎంట్రీ చేయడం లేదంటూ నిలదీశాడు. తాను గతంలో పని చేసిన ప్రాంతాల జాయినింగ్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని సర్వీస్ బుక్లో నమోదు చేయడం లేదని, బుక్లో ఎంట్రీల కోసం రూ.3వేలు డిమాండ్ చేశారని సుధాకర్ ఆరోపించాడు. మొయినొద్దీన్ సోమవారం సూర్యాపేట జెడ్పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో తన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ అసిస్టెంట్ లంచ్ బాక్స్తో తనపై దాడి చేశాడని పంచాయతీ కార్యదర్శి ఆరోపించాడు. సిబ్బంది వారిద్దరిని వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నియంత్రించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 5న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు జరిగే ర్యాలీ, ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం జిల్లా కేంద్రంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ ఉమర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.భిక్షం, నాయకులు బొల్లెద్దు వెంకటేశ్వరరావు, కొచ్చర్ల వేణు, మున్నూరు నాగన్న, నకిరేకంటి వెంకన్న, బి.దేవేందర్, ఎ.రాంసింగ్, బి.క్రాంతికుమార్, ఫజల్ అయూబ్ ఖాన్ , ఎండీ సాహెబ్ అలీ పాల్గొన్నారు. -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
కొత్త పెన్షన్పై టెన్షన్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పెన్షన్ల టెన్షన్ పట్టుకుంది. సుమారు ఐదేళ్లుగా కొత్త పెన్షన్ల ఊసు లేకపోవడంతో వేలాది మంది వీటికోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడైనా తమకు పెన్షన్ అందుతుందా.. లేదా అనే టెన్షన్ దరఖాస్తుదారుల్లో పట్టుకుంది. పెన్షన్ దరఖాస్తుదారులు వారికి కావాల్సిన కులం, ఆదాయం, ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. 2022లో చివరిసారిగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా పెన్షన్లను మంజూరు చేసింది. నాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కొత్త పెన్షన్ మంజూరు కాలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులతోపాటు దివ్యాంగులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వితంతు పెన్షన్ల కోసం గ్రామాల్లో నాలుగేళ్లుగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవేకాకుండా ప్రజాపాలన సమయంలోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు రాగా.. వీటన్నింటిని ఆన్లైన్ చేసి వదిలేశారు. అనంతరం వితంతు పెన్షన్ కోసం దరఖాస్తులు ఇచ్చినా.. ఆన్లైన్ చేసే అవకాశం లేకపోవడంతో అధికారుల వద్దనే దరఖాస్తులు ఉండిపోయాయి. నాలుగేళ్ల తర్వాత.. నాలుగేళ్ల తర్వాత కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన రావడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో చాలామంది వితంతు, వృద్ధాప్య, గీత కార్మిక, దివ్యాంగ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా కొందరు పైరవికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ వద్దకు వచ్చే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే వాటిని ఆన్లైన్ చేసే వెసులుబాటు లేదని చెబుతున్నారు. ఫ నూతన పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఫ గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన అధికారులు ఫ ధ్రువపత్రాల కోసం కార్యాలయాల వద్దకు కొత్త దరఖాస్తుదారుల పరుగులువృద్ధాప్య 53,205 దివ్యాంగులు 18,458 వితంతువులు 56,277 ఒంటరి మహిళలు 6795 చేనేత కార్మికులు 873 కల్లుగీత కార్మికులు 6,552 ఎయిడ్స్ బాధితులు 1205 ఫైలేరియా రోగులు 2109 డయాలసిస్ రోగులు 258 -
వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తున్న కేంద్రం
అర్వపల్లి : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ విమర్శించారు. ఏఐకేఎంఎస్(ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ), ఎస్కెఎం(సంయుక్త కిసాన్ మోర్చా) పిలుపుమేరకు గురువారం జాజిరెడ్డిగూడెంలో ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) ఆర్డర్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలుచేయాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ఎంఎస్పీ చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పోలెబోయిన కిరణ్, పెద్దలింగయ్య, వడకాల బయ్యన్న, మధుకర్, రైతులు పాల్గొన్నారు. జూన్ 2న పాదయాత్రసూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ నుంచి సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగయ్య, సూరం రేణుక పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన టీ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఈ ప్రాంత ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బక్కని నర్సింహులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన టీడీపీ జాతీయ మహానాడులో బక్కని నర్సింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని వ్యాఖ్యనించడం సరైంది కాదన్నారు. వందలాది సంవత్సరాల క్రితమే ‘త్రిలింగ దేశం’గా వర్థిల్లిన ప్రాంతం తెలంగాణమని, తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ గురించి స్పష్టంగా ఉందని తెలిపారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, నాయకులు వెంకటేష్ నాయక్, జక్కలి గోపి, చింతకాయల మహేష్ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నరసింహుడి కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణాన్ని గురువారం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, వేద మంత్రోచ్ఛరణల నడుమ తలంబ్రాలతో కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, సాయిచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, నరేందర్ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు
రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్వేర్, ఆటోమేషన్, అధునాతన మ్యాన్ఫ్యాక్చరింగ్ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, నాగార్జునసాగర్లో అడ్వాన్స్డ్ మ్యాన్ఫాక్చరింగ్ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్ స్కేప్ డిజైన్, తిరుమలగిరిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాదగిరిగుట్టలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్డ్ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్, 29 నుంచి జూన్ 1 వరకు సరిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, జూన్ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. -
హోర్డింగుల జోరు.. జనం బేజారు
కోదాడ : అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, లైట్ బోర్డులు కోదాడ పట్టణవాసుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు గాలివానకు పక్కకు ఒరిగిపోయి రాత్రి సమయాల్లో డివైడర్ పక్కగా వెళుతున్న వారికి తగిలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎలాంటి అనుమతుల లేకుండా ఇష్టానుసారంగా వందల సంఖ్యలో డివైడర్ల మధ్య బోర్డులను ఏర్పాటు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ప్రకటనల బోర్డులు, లైట్బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయాలంటే సదరు సంస్థలు మున్సిపాలిటీ అనుమతుల తీసుకోవడంతోపాటు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లో హోర్డింగులను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ధరలు నిర్ణయించి టెండర్ల ద్వారా వివిధ సంస్థలకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. ఈ విషయంలో కోదాడ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారుల కనీస చొరవ తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. హోర్డింగులు పెట్టినవారి నుంచి రుసుము వసూలు చేస్తున్న దాఖలాలు లేవని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోదాడ పట్టణంలో డివైడర్లు కేవలం నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండడంతో వీటిమీద అదేస్ధాయిలో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. గాలి వానలకు ఇవి ఏమాత్రం పక్కకు జరిగినా వాహనదారులకు తగులుతున్నాయి. పుట్టిన రోజుల హడావుడి.. గతంలో కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో రాజకీయ నాయకుల, సినిమా హీరోల పుట్టిన రోజుల వేడుకల సమయంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేవారు. ఇటీవల ప్రతిఒక్కరూ ఇలాంటి వేడుకల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేస్తున్నవారిలో పలువురు పోకిరీలు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు చిత్రవిచిత్రమైన ఫోజులతో కటౌట్లు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు స్పందించి ఫ్లెక్సీల ఏర్పాటులో కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఫ జనం ప్రాణాల మీదకు తెస్తున్న హోర్డింగులు ఫ గాలి దుమారానికి ఒరుగుతున్న బోర్డులు ఫ అధికారుల నిర్లక్ష్యం.. మున్సిపల్ ఆదాయానికి గండి కోదాడ పట్టణంలో ప్లెక్సీలు, హోర్డింగ్లు ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి. దీన్ని మున్సిపాలిటీ ఆదాయ వనరుగా మార్చుకోవాలి. పట్టణంలో డివైడర్ల మీద కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లు అంటించడం సరికాదు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలకు, వివిధ సంస్థలకు కూడా బాధ్యత ఉండాలి. –పందిరి నాగిరెడ్డి, విద్యావేత్త, కోదాడ -
మూడు నెలలైనా అందని వాహన రిజిస్ట్రేషన్ కార్డులు
వాహన పరివాహన్ పోర్టల్ వచ్చిన తర్వాత జిల్లాలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్లు షోరూంలోనే నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతోంది. పెండింగ్లో ఉన్న కార్డులను దశల వారీగా ముద్రించి పంపిణీ చేస్తున్నాం. త్వరలో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. వాహనదారుల ఇళ్ల వద్దకే కార్డులు పంపిస్తాం. –జయప్రకాష్రెడ్డి, జిల్లా రవాణశాఖ అధికారి, సూర్యాపేట మార్చి నెలలో నేను కొత్త బైక్ కొన్నాను. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షోరూంలోనే పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఒరిజినల్ ఆర్సీ రాలేదు. నంబర్ వచ్చినప్పటికీ ఆర్సీ లేకపోవడంతో పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అధికారులు స్పందించి ఆర్సీ త్వరగా వచ్చేలా చూడాలి. –రమావత్ చాంప్లా, వాహనదారుడు ఫ జిల్లాలో సుమారు 900 కార్డులు పెండింగ్ ఫ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు సూర్యాపేటటౌన్ : కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులకు రిజిస్ట్రేషన్ కార్డు(ఆర్సీ)ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాహన్ విధానం అమలులోకి తీసుకొచ్చినప్పటికీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ద్వారానే ద్విచక్ర వాహనాలు, కార్లు (నాన్ ట్రానన్స్పోర్ట్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేది. కేంద్ర ప్రభుత్వం శ్రీవాహన్శ్రీవిధానం అమలులోకి తీసుకువచ్చిన తరువాత ఈ ఏడాది మార్చి 23 నుంచి రిజిస్ట్రేషన్ల బాధ్యతలను వాహన షోరూంల నిర్వాహకులకు అప్పగించింది. ఈ కొత్త విధానంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు ఇస్తున్నారు. అనంతరం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరు కేటాయించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినప్పటికీ వాహన రిజిస్ట్రేషన్ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్, ఫైనాన్స్ పనులకు ఇబ్బంది సూర్యాపేట జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు కలిపి సుమారు 900 రిజిస్ట్రేషన్ కార్డులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినవారు ఇప్పటికే తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించుకున్నారు. కానీ ఆర్సీ కార్డులు అందకపోవడంతో కార్యాలయాలు, షోరూంల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వాహనదారులు మూడు నెలల క్రితమే వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కార్డులు అందలేదని వాపోతున్నారు. ఆర్సీ లేకపోవడంతో బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సంబంధిత పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు. షోరూంలపై పెరిగిన భారం.. కొత్త విధానం ప్రకారం వాహనాల వివరాలు, యజమాని ఆధార్, చిరునామా ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెనన్స్, పన్ను చెల్లింపుల వివరాలను షోరూం నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యలు, డాక్యుమెంట్ల ధృవీకరణలో ఆలస్యం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదించిందని తెలుస్తోంది. కొన్ని షోరూంలలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది. రోజూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని సమయానికి అప్లోడ్ చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆందోళనలో వాహనదారులు.. ఆర్సీ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. పోలీసులు అడిగినప్పుడు మొబైల్లో డిజిటల్ కాపీలు చూపిస్తున్నప్పటికీ చాలాసార్లు వివరణ ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు త్వరగా అందేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం
జిల్లాలో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు తిరుమలగిరి మండలంలో రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్య అందుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలి. –ఐ.శాంతయ్య, మండల విద్యాధికారి, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 91 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత సంవత్సరం 31 ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించగా.. కొత్తవాటితో కలుపుకుని మొత్తం 122 పాఠశాలలు కానున్నాయి. వచ్చేనెల 12వ తేదీ నుంచి జిల్లాలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య మరింత అందుబాటులోకి రానున్నది. ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్టక్చర్, ఫర్నీచర్, ఇండోర్, ఔట్డోర్ ఆట వస్తువులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతి పాఠశాలకు రూ.1.70 లక్షల నిధులు కేటాయించనున్నారు. ఒక ఇన్స్ట్రక్టర్.. ఒక ఆయా ప్రతి పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్తోపాటు ఒక ఆయాను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలవారి గౌరవ వేతనం రూ.8000, ఆయాకు రూ.6000 లుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసి త్రీమెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ఫ్రీ ప్రైమరీ సెక్షన్ను ప్రారంభించాలని, ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఫ ఆటపాటలతో కూడిన విద్యా బోధనకు శ్రీకారం ఫ కార్పొరేట్కు దీటుగా ఆధునిక వసతులు ఫ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఇన్స్ట్రక్టర్ల నియామకం -
రాజకీయ బెదిరింపులకు భయపడం
సూర్యాపేట అర్బన్ : రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లబావి సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సీపీఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసి మాజీ సీఎం విజయన్పై ఈడీని అడ్డు పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అన్నారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి జిల్లా కమిటీ సభ్యులు ఏలుగురి గోవింద్, మేకనబోయిన శేఖర్ రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, సూర్యాపేట 3 టౌన్ కార్యదర్శి చిట్లింకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి -
తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని మిల్లర్లను సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ మోహన్బాబు, సివిల్ సప్లై డీఎం శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ హరిప్రసాద్, సర్పంచ్ బోయపల్లి కిషన్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సీఈఓ వినయ్కృష్ణారెడ్డి, ఏపీఎం లక్ష్మి ఉన్నారు. బాలికలకు సైకిళ్ల పంపిణీమహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్యల ద్వారా తిరుమలగిరిలో బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన ఆయన వారికి పలు సూచనలు చేశారు. సైక్లింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించేందుకే సైకిళ్లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లాజర్, ఏపీఎం లక్ష్మి, డీటీ జాన్ మహ్మద్, సీసీ నాగయ్య, ఎంఎస్ అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. దిగుమతులు వేగవంతం చేయాలిచివ్వెంల(సూర్యాపేట) : రైతులకు ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దుగుమతి చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మండలంలోని బీబీగూడెం శివారులో ఉన్న శివదుర్గ రైస్మిల్ను ఆయన తనిఖీ చేశారు. దిగుమతులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రావణి ఉన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ -
అభివృద్ధి నిధుల విడుదలలో వివక్ష
కోదాడ : బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్న గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో వివక్ష చూపుతున్నారని, దాంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టలేక సర్పంచ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పలువురు సర్పంచ్లతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ సర్పంచ్లు గెలవడంతో అధికార పార్టీ వారు ఆయా పంచాయతీలకు అభివృద్ధి నిధులు మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ నిర్వహించి వెంటనే బీఆర్ఎస్ సర్పంచ్లున్న పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్కుమార్, బట్టు శివాజీ, శీలం సైదులు, తొగరు రమేష్, జానకిరామాచారి, పల్లా నర్సిరెడ్డి, భూపాల్రెడ్డి, శంకర్నాయక్, ఉపేందర్, కందిబండ సత్యనారాయణ, సీతారాములు, పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఉన్నారు. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఫిర్యాదు -
లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్వి గ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి నాగవల్లి దళా లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 31న బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపికకోదాడరూరల్ : వచ్చేనెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అండర్–19 బాలబాలికల, సీనియర్స్ సీ్త్ర, పురుషుల విభాగంలో జిల్లా జట్టుకు ఈ నెల 31న క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ పట్టణంలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభం అవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లా వాసులకే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాలకు సెల్ : 9059068263, 96421 14372 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాల్య వివాహాలు అరికట్టాలిపెన్పహాడ్ : బాల్యవివాహాలు అరికట్టి బాలికల భవిష్యత్తుకు బాటలు వేయాలని సీడీపీఓ సుబ్బలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాలలో మహిళా వారోత్సవాలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నివారణపై గ్రామ ప్రజలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఒగ్గు కిరణ్, ఇటికాల శ్రీనివాస్, ఏపీఎం అంజయ్య, ఎల్సీపీఓ నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హనీఫా, స్వప్న, పంచాయతీ కార్యదర్శి అఖిల్, సోషల్ వర్కర్ శ్రీలక్ష్మి, జండర్ స్పెషలిస్ట్ రేవతి, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఒగ్గు సోమన్న, కిరణ్, సీసీ వెంకన్న పాల్గొన్నారు. అర్వపల్లిలో ఈదురు గాలుల బీభత్సంఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లితో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. కొద్దిపాటి వర్షపు జల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ఇళ్ల రేకులు గాలికి లేచిపోయాయి. దుకాణాల ఎదుట బోర్డులు ఊడిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు ఎగిపోగా జల్లులకు ధాన్యం కొంత మేరకు తడిసింది.


