Suryapet
-
మోగిన బడిగంట
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలినేరేడుచర్ల : కార్పొరేట్కు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కోరారు. గురువారం నేరేడుచర్ల జెడ్పీఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలున్నాయన్నారు. నేరేడుచర్ల జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి, ఎంఈఓ పుట్లూరి సత్యనారాయణరెడ్డి, హెచ్ఎం బట్టు మధు, ఇంపాక్ట్ ట్రైనర్ వీరవెల్లి శ్రీలత, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కొత్త లక్ష్మణ్, సభ్యులు నటరాజ్, వెంకట్, టీచర్లు వీరబాబు, వెంకటేశ్వర్రావు, అన్నపూర్ణ, నర్సింహారావు, నాగమణి, భానుమతి, జానయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, రాంమ్మూర్తి, బాబు, యాదగిరి పాల్గొన్నారు.సూర్యాపేటటౌన్ : బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో ఆట పాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో 2025–26 విద్యా సంవత్సరానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే ఉంది. పండుగ వాతావరణంలో.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఆయా పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు రంగు కాగితాలు, మామిడాకులు, కొబ్బరి మట్టలతో ముస్తాబు చేశారు. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలు ఇవ్వడమేకాకుండా వారి పై చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. 20శాతమే హాజరు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలు కలిపి 950 వరకు ఉన్నాయి. వీటిలో 73వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా తొలి రోజు 20శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. యూనిఫాం, పుస్తకాలు పంపిణీ.. తొలిరోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, జత యూనిఫాం, బ్యాగులు అందజేశారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల తల్లి దండ్రులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, యూని ఫాం, బుక్స్ తదితర అంశాలను ఉపాధ్యాయులు వివరించారు. ఫ విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఫ తొలిరోజు హాజరు అంతంతే.. ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
చివ్వెంల(సూర్యాపేట) : రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివ్వెంల, బీబీగూడెం గ్రామాల్లో రైతుల వద్ద నుంచి 441 దరఖాస్తుల వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రావణి పాల్గొన్నారు. సాగర్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు కాగా 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అంతకు మించి వచ్చే వరదనీటి ప్రవాహాన్ని సమర్థంగా దిగువకు విడుదల చేయాలంటే క్రస్ట్గేట్ల పనితీరు అత్యంతకీలకం. గత నెలలోనే ఈ గేట్లకు సీల్స్ వేయడంతోపాటు బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగుతున్నాయి. భద్రత పరంగా వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్, లింక్ సిస్టం ఫంక్షనింగ్ తదితర పనులు చేస్తున్నారు. ఒక్కోగేటును మ్యానువల్గా లేపి ట్రయల్ రన్ ద్వారా పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్లన్నింటిని ట్రయల్ రన్ చేసేందుకు పనులు ముమ్మరం చేసినట్లు చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు సూర్యాపేట : సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రజలసమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి పాటుపడతానన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాద శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణకు ఎస్సీ కులానికి చెందిన న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయశాస్త్ర డిగ్రీ ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.3వేల స్టైఫండ్, పుస్తకాల కొనుగోలుకు రూ.50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 17వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నంబర్ 2 ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారితో మాట్లాడారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపేది ఉపాధ్యాయ వృత్తి అని, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని అన్నారు. బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాలని, బాలల చదువుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యపరమైన చర్యలు తప్పవనిహెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలని, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలన్నారు. ఈ పాఠశాలలో చదివి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.10,116, ద్వితీయ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.5,116 జిల్లా పోలీసు శాఖ తరఫున బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ యం.ఉదయ శ్రీ, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. హుజూర్నగర్లో సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. సోషల్ మీడియా – ప్రాధాన్యత అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, నయా ఉదారవాద విధానాలు అనే అంశంపై కార్మిక సంఘం నేత శివకుమార్, భవిష్యత్ కర్తవ్యాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి వివరించారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వెంకటరెడ్డి, బ్రహ్మం, అనంత ప్రకాష్, యాకూబ్, నగేష్ పాల్గొన్నారు. -
ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు. -
ఉపాధిపై సాగు ప్రభావం
నాగారం : వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడం, విత్తనాలు విత్తే సమయం ఉండడం, ఉపాధి కంటే వ్యవసాయ పనులకు వెళ్తే రోజు వారి కూలి ఎక్కువ రావడం తదితర కారణాలతో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు తగ్గాయి. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.400 నగదు అందుతుండటంతో సాగు పనుల వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. గత నెలలో.. జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు రోజుకు సరాసరి 60 శాతం పైనే గత నెలలో హాజరయ్యేవారు. గతనెల 10న మొత్తం 475 గ్రామాలలో ఉపాధి పనులు నిర్వహించగా సరాసరి 80.50శాతంతో 38,240 మంది కూలీలు పాల్గొన్నారు. అదే నెల 20న సరాసరి 92.31 శాతంతో 43,848 మంది కూలీలు, ఈనెలలో 10వ తేదీన 475 గ్రామాలలో ఉపాధి హామీ పనులు నిర్వహించగా సరాసరి 57.0శాతంతో 26,868 మంది కూలీలే పనులు చేయడం విశేషం. అత్యధికంగా నడిగూడెం మండలంలో సరాసరి 134 శాతంతో 2012 మంది కూలీలు పాల్గొంటే.. అత్యల్పంగా చిలుకూరు మండలంలో సరాసరి 24శాతంతో 413 కూలీలు పనులు చేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు వచ్చేలా చూడాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నారు. ఆ లెక్కన పనులు జరుగుతున్న 475 గ్రామాలలో 47,500 మంది కూలీలు పాల్గొనాల్సి ఉంది. కానీ కేవలం 26,868 మంది కూలీలే పనులు చేస్తుండటం గమనార్హం. ఏం చేయాలి..? ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే సాగు కాలంలోనూ కూలీల రాక మరింత పెరగనుంది. రైతులకు ఆర్థికంగా ఉపయోగకరంగా మారనుంది. ఈ విషయంలో చర్చలు మినహా నిర్ణయాలు లేకపోవడం విశేషం. 2.62లక్షల జాబ్కార్డులు జిల్లాలో 23 మండలాల పరిధిలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2.62లక్షల జాబ్కార్డులు ఉండగా, వీటి పరిధిలో 5.70 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు 26,868 మంది ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణ పనులను చేపడుతున్నారు. కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో ఆశించిన స్థాయిలో కూలీలు రాలేకపోతున్నారు. విత్తనాలు వేసే పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. – వి.వి అప్పారావు, డీఆర్డీఓ ఫ ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపని కూలీలు ఫ గత నెలతో పోల్చితే తగ్గిన కూలీల హాజరు ఫ వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మొగ్గు -
పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది.. కాటన్, సెమికాటన్, సిల్క్తో అనేక వైరెటీలలో ఇక్కత్ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ప్రపంచంతో పాటు దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఎక్చేంజ్లో చేనేతవస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేనికై తే పేరుంటుందో వాటికి నకిలీల బెడద దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రింట్ఫొటోకు, పెయింటింగ్ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్, డుప్లికేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లికి మళ్లీ వస్తానన్నారు. జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు.. చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు ఉపేందర్, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికి నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్ వస్త్రాలు ధరిస్తున్నారు ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా ఫ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఫ సతీమణితో కలిసి భూదాన్పోచంపల్లి సందర్శన చేనేత గృహాల సందర్శన గవర్నర్ పోచంపల్లికి రాగానే తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్ గృహాలను సందర్శించారు. వారు గవర్నర్ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి ఈ వృత్తిని చేస్తున్నారని, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యుజియంను సందర్శించారు. అక్కడ కొకూన్స్, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేయడం ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్డిజైన్లను చూసి చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, ఆర్డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్, గజం అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్రెడ్డి, తహసిల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, అంకం పాండు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. బుధవారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై తగిన ఆధారాలతో ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులను పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులెవరైనా అమ్ముకున్నట్లు తెలిస్తే వారి రేషన్ కార్డులు రద్దవుతాయని ఆయన హెచ్చరించారు. సన్నబియ్యం పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ జాన్మహ్మద్, ఆర్ఐలు జార్జిరెడ్డి, సుజిత్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ బ్లాక్మెయిల్
చిలుకూరు మండలం సీత్లాతండాలో ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని యువకుడిని బ్లాక్మెయిల్ చేసింది. - 8లోసమస్యలతో స్వాగతం.. జిల్లాలో చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 536 అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేయగా అందులో సగం పాఠశాలల్లో ఇంకా పనులు పూర్తి స్థాయిలో కాలేదు. చాలా పాఠశాలల్లో పెయింటింగ్ పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు సమస్యలతో సతమతమవ్వాల్సిందేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం కింద 329 పాఠశాలలను ఎంపిక చేశారు. అయితే ఈ పథకం కింద చేపట్టిన పనులు చాలా పాఠశాలల్లో మధ్యలోనే ఆగిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం పనులను నిలిపివేశారు. -
బడి పిలుస్తోంది!
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంఫ ఏరువాక పౌర్ణమిగురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025రేపు తెలంగాణ ఉద్యమకారుల ధర్నాసూర్యాపేట : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలినడిగూడెం : జిల్లాలో 2025–06 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ కె.శ్రీనివాసచారి, డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ కోరారు. బుధవారం నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత బాధ్యత తీసుకొని ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్తో పాటు, పాఠశాల స్థాయి ప్రణాళికలతో విద్యా సంవత్సరాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలిసూర్యాపేటటౌన్ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజానికి రోగం వస్తే బాగు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాలు జరగకుండా చేయడం తమ బాధ్యతఅని, రోజూ రాత్రి పగలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. నేరాలు జరగకుండా ముందస్తుగా అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు విధుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం అంతా రోడ్డున పడుతారన్నారు. ఏదైనా సంఘటన జరిగితే 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలని సూచించారు. అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్లకు చిక్కితే ఆర్థికంగా లూటీ చేస్తారన్నారు. సూర్యాపేటటౌన్ : పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. నెల ఇరవై రోజుల పాటు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేలా రంగు కాగితాలు, మామిడితోరణాలు, కొబ్బరి మట్టలతో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. తొలిరోజే పుస్తకాలు, యూనిఫాం పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు యూనిఫాం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 4,65,600 పాఠ్యపుస్త కాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 3,24,875 పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాలు జిల్లా గోదాం నుంచి ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాఠశాలలకు చేర్చారు. అలాగే 49,374 మంది విద్యార్థులకు ఒక్కో జత చొప్పున ఇచ్చేందుకు యూనిఫాం సిద్ధం చేశారు. వీటిని స్వయం సహాయక సంఘాలు, మెప్మా సిబ్బందితో కుట్టించారు. రెతులు స్థానికంగానే విత్తనాలు కొనుగోలు చేయాలి నూతనకల్: రైతులు స్థానికంగానే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము సాగు చేసే విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల వాటి నాణ్యత ప్రమాణాలు తెలియక పంట దిగుబడిరాక నష్టపోతున్నారని ఆయన చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ల నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు రసీదును భద్రపర్చుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి మురళీబాబు, దుకాణ యజమానులు తదితరులు ఉన్నారు.అధ్యాపకులదే బాధ్యతఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అధ్యాపకుల దేనని డీఐఈఓ భానునాయక్ గుర్తు చేశారు. బుధవారం ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నూతన అడ్మిషన్లను పరిశీలించి మాట్లాడారు.ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు కార్పొరేట్ మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ఎందరో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గునగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు దశరథ, అశోక్, లక్ష్మయ్య, నాగార్జున ఉన్నారు.న్యూస్రీల్ఫ మామిడితోరణాలు, రంగుల కాగితాలతో స్కూళ్లు ముస్తాబు ఫ వేసవి సెలవుల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు ఫ తొలిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ ఫ పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పాఠశాల పాఠశాలల విద్యార్థుల సంఖ్య సంఖ్య ప్రాథమిక 690 34,000 ప్రాథమికోన్నత 78 13,500 జిల్లాపరిషత్ ఉన్నత 182 25,000 ఆదర్శ 09 6,500 కేజీబీవీ 19 3700 -
ప్రైవేట్కు దీటుగా బోధన
సూర్యాపేటటౌన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం.. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు సకాలంలో ఉచితంగా అందిస్తున్నాం.. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.. కార్పొరేట్ మోజులో పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి.. విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని డీఈఓ కె. అశోక్ తెలిపారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సాక్షితో పలు విషయాలు వెల్లడించారు. ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారుజిల్లాలో 690 ప్రాథమిక పాఠశాలలు, 78 ప్రాథమికోన్నత, 182 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 19కేజీబీవీలు, తొమ్మిది మోడల్ స్కూల్స్, నాలుగు మినీ గురుకులాలు, ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. బోధనకు ఇబ్బందులు కలగకుండా.. విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలుగకుండా సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన వారు, అలాగే ప్రమోషన్స్ రావడంతో సబ్జెక్టు టీచర్ల కొరత లేదు. ఇంకా ఎక్కడైనా విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే సర్దుబాటు చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా పని చేస్తున్నాం. జిల్లాలో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వేసవిలో వీరికి క్వాలిటీ విద్యపై వృత్యంతర శిక్షణ ఇచ్చాం. విద్యార్థులకు బోధనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉంది. జిల్లాలోని 18 పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) బోధన అందిస్తున్నాం. ఏఐ బోధన ద్వారా 20శాతం మంది విద్యార్థుల్లో 20 రోజుల్లో చదువులో మార్పు కనిపించింది. ఏఐ బోధనలో రాష్ట్రంలోనే మనం 6వ స్థానంలో ఉన్నాం. ఈ విద్యాసంవత్సరం మరిన్ని పాఠశాలల్లో ఏఐ బోధన కొనసాగిస్తాం. గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 40 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారికి సన్మానం కూడా చేశాం. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి చేశాం. టాయిలెట్స్, పాఠశాలల ఆవరణలు, బాత్రూంలు, తరగతి గదుల్లో పరిశుభ్రతతో రెడీగా ఉంచాం. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మొదటి రోజే వారికి యూనిఫాం, పుస్తకాలు అందజేస్తాం. మొదటి రోజు నుంచి మధ్యాహ్న భోజనం, రాగి జావ అందించనున్నాం. పాఠశాలల్లో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఫ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చాం ఫ ఏఐ బోధనలో రాష్ట్రంలో ఆరో స్థానం ఫ విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా బడిబాట ఫ సర్కారు స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి ఫ డీఈఓ అశోక్ -
ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి
భానుపురి (సూర్యాపేట) : ఆకాశమే హద్దుగా విద్యార్థులు అవకాశాల కోసం ప్రయత్నించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో బడిబాట కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తరగతిలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు మొదటి అడుగుగా భావించి విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. పిల్లలు దేశ భవిష్యత్తు అని, సమాజం వారి మీద ఆధారపడి ఉందన్నారు. ‘నేటి మీ ఆలోచనలే రేపటి మాటలుగా, పనులుగా, అలవాట్లుగా, గమ్యస్థానాలుగా మారి మీ జీవితాలను ఉన్న స్థాయికి చేరుకునేలా చేస్తాయి.. కాబట్టి మంచి గా ఆలోచనలు చేయాలి’ అని సూచించారు. విద్యార్థులు సమాజంలో మంచి దారిలో వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో, రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో, వ్యాపారాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండాలని దానికి ఏ సహాయం కావాలన్నా తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో బడి బయట ఒక్క విద్యార్థి కూడా లేకుండా అందరూ చదువుకోవాలన్నదే సంకల్పం అని తెలిపారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో ఉపాధ్యాయులు మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. పండుగ వాతావరణంలో ప్రారంభించాలి పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలని, గ్రామంలోని పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల చేతులమీదుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇప్పించాలని సూచించారు. జిల్లాలో మంచి ప్రతిభ చూపిన మూడు జిల్లా, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలకు నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు నవత పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్ రెడ్డి, సంక్షేమ అధికారి నర్సింహారావు, కోఆర్డినేటర్లు జనార్దన్, శ్రవణ్ కుమార్, రాంబాబు, డీసీఓలు, ఆర్ సీఓ లు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేయాలి భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. శంకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాన్ని సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మఠంపల్లి, పాలకవీడు, చింతలపాలెం మండలాల్లో అటవీ భూములు పొందిన గిరిజన రైతులు ఉన్నారని, సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సతీష్ కుమార్, భూ గర్భజలశాఖ అధికారి బాలునాయక్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా హార్టికల్చర్ – సెరీకల్చర్ అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, మఠంపల్లి, పాలకవీడు, చింతలపాలెం ఎంపీడీఓలు పాల్గొన్నారు.ఫ సమాజంలో విద్య ద్వారానే శాశ్వతమైన మార్పు ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
15న ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం
హుజూర్నగర్ : కోదాడలో ఈనెల 15న ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి భవన్లో ఆర్యవైశ్య మహాసభ పట్టణ, మండల సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, సంఘం నాయకులు బి.రామారావు, వి.నరసింహా రావు, పి.లక్ష్మీనరసింహారావు, బి.రాజా, వి.నాగేశ్వరరావు, పి.అశోక్, జి.విద్యాసాగర్, ఇ.కోటేశ్వరరావు, డి.నరసింహమూర్తి, కె.పాపారావు, వి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, రామ్నరేష్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, శ్రీమన్నారాయణ, నరసింహారావు అయ్యప్ప పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
నడిగూడెం : భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం నడిగూడెం మండలం రత్నవరంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రత్నవరంలో 113 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, నడిగూడెం తహసీల్దార్ వి.సరిత, ఆర్ఐ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ కళ్యాణి, రెవెన్యూ సిబ్బంది సుకేష్, భూమేష్, రాజు, శరత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెంకటసుబ్బారావుకు నివాళిభానుపురి (సూర్యాపేట) : భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతిని మంగళవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారావు చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వి.శ్యాంసుందర్ రెడ్డి, లైబ్రేరియన్లు ఎంవీ రంగారావు, డి.లలితాదేవి, కె.విజయ భాస్కర్, పి.సృజన పాల్గొన్నారు. పంట మార్పిడితోరైతులకు మేలుతిరుమలగిరి : పంట మార్పిడితో రైతులకు మేలు కలుగుతుందని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చౌహాన్, కేవీకే శాస్త్రవేత్త ఎ.కిరణ్ సూచించారు. మంగళవారం తొండ గ్రామంలోని రైతు వేదికలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతులు శాసీ్త్రయంగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ప్రణీత, వెంకట్రెడ్డి, అవినాష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మంగళవారం హుజూర్నగర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది పక్కదారి పడుతోందని, నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందన్నారు. దీంతో ప్రజలు ఆందోళలు, పోరాటాల బాట పడుతున్నారని చెప్పారు. ప్రజలు కదిలితే అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో సీపీఎం .. ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఉగ్రదాడి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉంటే మోదీ ప్రభుత్వం నాలుగో స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. పహల్గాంలో ప్రభుత్వ వైఫల్య కారణంగానే ఉగ్ర దాడి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి జరుగుతుందని ఇంటలీజెన్స్ ద్వారా ప్రభుత్వానికి ముందే తెలుసని అందుకే ప్రధాని మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. కాల్పుల విరమణ అనేది పాకిస్తాన్, భారత దేశానికి సంబంధించిందని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, పోలిశెట్టి యాదగిరిరావు, నాగారపు పాండు, ములకలపల్లి రాములు, కోట గోపి, పల్లె వెంకటరెడ్డి, పాండు నాయక్, దుగ్గి బ్రహ్మం, యాకూబ్, వి. సైదులు, పి. హుస్సేన్, శ్రీలం శీను, బాలు నాయక్ పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
రైతు నేస్తం.. సాగుకు ఉపయుక్తం
నాగారం : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతునేస్తం పేరుతో సాగులో మెళకువలు, సలహాలు, సూచనలు అందిచేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన రైతు వేదికల్లో దృశ్య, శ్రవణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులను పెంచే విధంగా నిపుణులు సలహాలు, సూచనలిస్తారు. అన్ని గ్రామాల రైతులు కార్యక్రమానికి హాజరై వీక్షించవచ్చు. మొదటి విడతగా మండలానికి ఒకటి చొప్పున 23 రైతు నేస్తం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి పలువురు శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆధునిక వ్యవసాయ విధానాలతోపాటు సస్యరక్షణపై సలహాలిస్తున్నారు. ఈ విధానం రైతులకు ప్రయోజనకరంగా ఉండడంతో మరిన్ని రైతు నేస్తం కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈనేపథ్యంలో అధికారుల ప్రతిపాదనల మేరకు తాజాగా కొత్తగా మండలానికి రెండు చొప్పున 46 కేంద్రాలు మంజూరయ్యాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన రైతు వేదికల్లో సామగ్రి అమర్చాల్సిఉంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా.. జిల్లాలోని 486 పంచాయతీల పరిధిలో 82 క్ల్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించి వాటి ద్వారా పలురకాల సలహాలు ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో రైతునేస్తం ఒకటి. దృశ్య, శ్రవణ సేవల విస్తరణకు వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా ఉండే ఉద్యాన, మత్స్య, పట్టుపరి శ్రమ, పశుసంవర్ధక, నీటి పారుదల శాఖలకు సంబంధించి సలహాలు అందిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి రైతు నేస్తం వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పశు సంవర్ధక శాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరయ్యే రైతుల అన్నిరకాల సందేహాలు నివృత్తి అవుతున్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన 46 గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తానికి సంబంధించిన ఎలక్ట్రా నిక్ పరికరాలను ఏర్పాటు చేయిస్తున్నాము. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారిఫ అధిక దిగుబడులు సాధించేలా రైతు నేస్తం కార్యక్రమాలు ఫ ఇప్పటికే 23 రైతువేదికల్లో కేంద్రాలు ఏర్పాటు ఫ తాజాగా మరో 46 కేంద్రాలు మంజూరు లక్ష్యాలివే.. రైతునేస్తం ద్వారా కర్షకులకు అధికారులు పలురకాల ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. జిల్లాకు మంజూరైన రైతునేస్తం యూనిట్లను రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సాయంతో దృశ్య, శ్రవణ విధానం కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. రైతునేస్తం నిర్వహణ మొత్తం ఏఈఓలకు అప్పగించారు. టీవీ, బ్యాటరీ తదితర విలువైన పరికరాలు కేంద్రాల్లో ఉంటాయి. సందేహాల నివృత్తికి.. జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని, సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాల పై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వివరిస్తున్నారు. తాజాగా మరిన్ని రైతు నేస్తం కేంద్రాలను విస్తరించడంతో మరింత మంది రైతులకు సేవలు అందుబాటులోకి వచ్చే ఆస్కారముంది. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
చివ్వెంల(సూర్యాపేట): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. హాస్పిటల్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాలను వైద్యాధికారి అనిషాను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చేస్తున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మందులు కావాలంటే వైద్య సిబ్బంది ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిషా, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి, స్టాఫ్నర్సు రమాదేవి పాల్గొన్నారు. -
ఉద్యాన రైతులకు ఊతం
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇలా.. తీగ జాతి కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా శాశ్వత పందిళ్లను రాయితీపై ఇవ్వనున్నారు. ఈ పథకం కింద 2025–26 సంవత్సరానికి రూ.50 లక్షలతో 100 యూనిట్ల శాశ్వత పందిళ్లను నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్కు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఒక్క రైతు 5 యూనిట్ల వరకు రాయితీ పొందే అవకాశముంది. సూర్యాపేట : ఉద్యాన పంటల సాగుకు ఊతం ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ పథకాలకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు రూ.2429.34 లక్షలను వివిధ పంటల సాగుకు కేటాయించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. గడిచిన మూడేళ్లలో 4,885 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా జిల్లా రైతాంగానికి వివిధ రాయితీలు ప్రకటించింది. ఆయిల్పామ్ దిగుబడి వస్తే కొనుగోలుకు జిల్లాకు పతంజలి కంపెనీని కేటాయించారు. ఈ ఏడాది దాదాపు 3వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయించాల్సి ఉంది. దీనికి రైతులకు రాయితీ కింద రూ.1759.37 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయల, పూల సాగుతో పాటు నీటికుంటల ఏర్పాటుకు ఆసక్తి గల రైతులను ప్రోత్సాహంచాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.216.86 లక్షలు కేటాయించింది. డ్రిప్, స్ప్రింక్లర్ల కోసం.. సూక్ష్మ నీటి పారుదల పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న రైతులు భూమి , నీరు, విద్యుత్ వసతులు కలిగి ఉండాలి.ఫ 2025–26 వార్షిక ప్రణాళిక ఖరారు ఫ ఈ ఏడాది ఆయిల్పామ్ లక్ష్యం 3వేల ఎకరాలు ఫ సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.216.86 లక్షలు కేటాయింపు ఫ ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం దరఖాస్తు చేసుకోవాలి 2025–26 సంవత్సరానికి ఉద్యాన పంటల సాగు లక్ష్యాన్ని ఖరారు చేశారు. ఆసక్తి గల రైతులు ఆయా డివిజన్ ఉద్యాన అధికారులకు దరఖాస్తు అందించాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నాగయ్య, జిల్లా ఉద్యాన అధికారి -
ఉపాధ్యాయుల సర్దుబాటు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. జూలై 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప బడుల నుంచి సర్దుబాటు చేయనున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో ఒక్కో పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఉపాధ్యాయుల సంఖ్య ఎంత తదితర వివరాలను ఎంఈఓల ద్వారా సేకరిస్తున్నారు. జిల్లాలో 950 పాఠశాలలు.. 3790 మంది ఉపాధ్యాయులు.. జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 182 జెడ్పీఉన్నత, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 690 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 3,790 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ ప్రతి పాఠశాలలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలోని ఎంఈఓల ద్వారా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు సేకరణ పూర్తి కాగానే సర్దుబాటు చేయనున్నారు. విద్యార్థుల చేరికల తర్వాత చేస్తే.. పాఠశాలలు పునఃప్రారంభంనాటికి సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని తొలుత విద్యాశాఖ భావించింది. అయితే ఈనెల 6 నుంచి బడిబాట నిర్వహిస్తున్నందున స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యపెరుగుతుందని అందువల్ల పాఠశాలలు పునఃప్రారంభం కాగానే టీచర్లను సర్దుబాటు చేస్తే ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. దీంతో సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసే గడువును జూలై 15వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కువ మంది విద్యార్థులు ఉండి తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు తక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ల నుంచి బదిలీ చేయనున్నారు. గతంలో మండల స్థాయిలో సర్దుబాటు చేసినా ఉపాధ్యాయులు వెళ్లకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. ఈసారి కలెక్టర్ నుంచి ఉత్తర్వులిప్పించాలని నిర్ణయించారు. విద్యార్థుల చేరికల తర్వాత సర్దుబాటు చేస్తే బాగుంటుందని టీచర్లు అంటున్నారు. ఫ విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా బదిలీలు ఫ జూలై 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం ఫ వివరాలు సేకరిస్తున్న జిల్లా విద్యాశాఖ ఫ జిల్లాలో 3,790 మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండాల్సిన టీచర్లువిద్యార్థుల సంఖ్య టీచర్లు 1నుంచి 10 ఒకరు 11 నుంచి 60 ఇద్దరు 61 నుంచి 90 నలుగురు 91 నుంచి 120 ఐదుగురు 121 నుంచి 150 ఐదుగురు 151 నుంచి 200 ఆరుగురు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఇలా.. ఎస్టీజీలు 1,693స్కూల్ అసిస్టెంట్లు 1,787 జీహెచ్ఎంలు 160ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 150 నిబంధనల ప్రకారం సర్దుబాటు చేస్తాం ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. బడి బాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా పని చేస్తున్నాం. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నాం. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు నాణ్యమైన, ఉత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తాం. –అశోక్, డీఈఓ కొన్ని పాఠశాలల్లో ఇలా.. తుంగతుర్తి జెడ్పీహెచ్ఎస్లో 11 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మునగాల మండలం నారాయణగూడెం జెడ్పీహెచ్ఎస్లో 16 మంది విద్యార్థులకు గాను ఎనిమిది మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. హుజూర్నగర్ మండలం అమరవరం ఎంపీపీఎస్లో 114 మంది విద్యార్థులు ఉండగా నలుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. చిలుకూరు మండలం జేరిపోతులగూడెం ఎంపీపీఎస్లో 101 మంది విద్యార్థులు ఉండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే ఇక్కడ పని చేస్తున్నారు. -
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రతి రెవెన్యూ గ్రామం, గ్రామపంచాయతీలే కాకుండా ఆవాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించినట్లు కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. నేషనల్ జల జీవన్ మిషన్ అమలుపై మంగళవారం ఢిల్లీ నుంచి డ్రింకింగ్ వాటర్ – శానిటేషన్ సెక్రటరీ అశోక్ కే.మీనా తెలంగాణలోని 16 జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీటిని సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరిశీలిస్తున్నామని, జిల్లాలో తొమ్మిది వాటర్ ట్రీట్ప్లాంట్స్ ఉన్నాయని, క్షేత్రస్థాయిలో తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో టెస్టింగ్ కిట్స్ ఉన్నాయని చెప్పారు. డీడబ్ల్యూఎస్ఎం (డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ మిషన్)పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పీఎం గతి శక్తి ద్వారా 5,404 కిలోమీటర్లు పైప్లైన్ మంజూరైందని, ఇప్పటికే 2,538 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు చెప్పారు. 552 మంది నల్ జల్ మిత్ర (గ్రామ మంచినీటి సహాయకులు)లను ఇప్పటికే నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు నాగేశ్వరరావు, అరుణాకర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ -
పఠనాశక్తి పెంచేలా..
ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున.. జిల్లాలో మొదటి విడతలో 22, రెండో విడతలో 9 మొత్తం 31 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపికయ్యాయి. ఈ పీఎంశ్రీ పాఠశాలలకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి ఒక్కో పాఠశాలకు రూ.10,000 చొప్పున మొత్తం జిల్లాకు 3,10,000 నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల దినపత్రికలు, మాసపత్రికలు కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాలకు మూడు దినపత్రికలు, మూడు చిన్నపిల్లల పత్రికలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. రోజూ విద్యార్థులు ఈపత్రికలు చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఏడాదిలో పది నెలల పాటు పత్రికల కొనుగోలుకు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. నాగారం : ప్రభుత్వ బడుల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. గతంలో తొలిమెట్టు, ఉన్నతి తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు క్షుణ్నంగా నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించి అమలు చేశాయి. దీంతో పాటు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలల విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందించేందుకు విజ్ఞాన, విహార యాత్రలు, వార్షికోత్సవాలు నిర్వహణకు ఏటా నిధులు విడుదల చేస్తోంది. తాజాగా విద్యార్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించేందుకు, పాఠశాల స్థాయి నుంచే పఠనాసక్తి పెంపొందించేందుకు పీఎంశ్రీ పాఠశాలలకు వార్త పత్రికలు, మ్యాగజైన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025–26 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి తెలుగు, హిందీ,ఉర్దూ, ఆంగ్లం భాషలకు సంబంధించిన మూడు చొప్పున దిన, బాలల వార,మాస పత్రికలు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఎల్ఐపీలో భాగంగా.. కొవిడ్ మహమ్మారి తర్వాత పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డిజిటల్ వ్యామోహంతో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గింది. దీన్ని పూరించేందుకు ఎల్ఐపీ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం)ని ప్రస్తుతం పాఠశాలల్లో అమలుచేస్తున్నారు. ఇందుకోసం లెర్నింగ్ కార్నర్ నిధులు ఉపయోగపడతాయి. వార్తా పత్రికలు, వ్యాసాలు, పిల్లల మాస పత్రికలు చదవటం, వాటిపై చర్చలు జరపటం వల్ల విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన పెరుగుతుంది. చక్కటి ఉచ్ఛారణతో మాట్లాడగలుగుతారు. ఉన్నత స్థాయి పరీక్షల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే పుస్తకాల పఠనమే కీలకం. విద్యార్థులకు సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు భాషపై పట్టు రావాలంటే వివిధ భాషలకు చెందిన దిన, వార, మాస పత్రికల పఠనం ఎంతో తోడ్పడుతుంది ప్రయోజనాలివీ.. ప్రస్తుతం పాఠశాలలు, గ్రంథాలయాల్లో కథలు, ఇతర పుస్తకాలు ఉన్నప్పటికి వార్తపత్రికలు, వార పత్రికలకు ప్రత్యేక బడ్జెట్ లేదు. దిన, వార పత్రికలు చదవడం వల్ల సమకాలీన అంశాలు, వివిధ రంగాల్లో రాష్ట్ర, దేశ పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. అన్ని భాషలపై పట్టు పెరుగుతుంది. రోజుకో ప్రత్యేక పీరియడ్ కేటాయించి పత్రికలు చదివించడం వల్ల తప్పులు లేకుండా చదవడం, రాయడం వస్తుంది. మాతృభాషపై పట్టు పెరిగితే మిగతా భాషలను తేలికగా నేర్చుకోవచ్చు. ఫ పీఎంశ్రీకి ఎంపికై న 31 బడుల్లో పత్రికల కొనుగోలుకు ప్రత్యేక నిధులు ఫ ఏడాదికి ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున.. ఫ జిల్లాకు మొత్తం రూ.3.10 లక్షలు మంజూరు ఫ పిల్లల్లో విజ్ఞానం పెంపొందించేలా ప్రణాళికసమకాలీన అంశాలపై అవగాహన పత్రిక చదవడం వల్ల విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలు పెంపొందుతాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వార్త పత్రికలు చదవడం అలవాటుగా మారితే సమకాలీన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. భాషపై పట్టు పెరగడంతో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. –కె.శ్రావణ్కుమార్, జిల్లా ప్లానింగ్ కోఆర్టినేటర్ ప్రతినెలా నిధుల కేటాయింపు వివరాలు (రూ.లలో) తెలుగు దినపత్రిక పత్రికలకు 250హిందీ/ఉర్దూ 250ఆంగ్ల దినపత్రిక 200తెలుగులో పిల్లల పత్రిక 100హిందీ/ఉర్దూలో పిల్లల పత్రిక 100ఆంగ్లభాషలో పిల్లల పత్రిక 100 -
నకిలీ విత్తనాలను అరికట్టాలి
భానుపురి (సూర్యాపేట) : నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్లు డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరిపడా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల వాళ్లు గ్రామాలకు వచ్చి నాణ్యమైన విత్తనాలు అంటూ రైతులకు అంటగట్టుతున్నారని, ఫలితంగా దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. రైతు భరోసాను అదేవిధంగా జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేయించి తూములకు లాకులు ఏర్పాటు చేసి లస్కర్లను వెంటనే నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, దాసరి శ్రీను, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, పగిడిమర్రి సోమయ్య, ధర్మాజీ, సామ నర్సిరెడ్డి, కామల శ్రీను, వీరనాయక్, మారయ్య,గాంధీ, బోనగిరి గిరి బాబు, కట్ల వీరన్న పాల్గొన్నారు. -
ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండ
సూర్యాపేట అర్బన్ : కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండ సాగిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు వి. కోటేశ్వరరావు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట పట్టణంలో వాణిజ్య భవన్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగ్జీవన్రాం విగ్రహం వద్ద రాస్తారోకో చేస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకోబోయారు. ఈక్రమంలో వాగ్వాదం చేసుకొంది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేశారని, అది మరవక ముందే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను కాల్చి చంపారని ఆరోపించారు. కార్యక్రమంలో మండారి డేవిడ్ కుమార్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్, పోలేబోయిన కిరణ్, మధు, శ్రీను, నాగయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు విదు్యత్ వెలుగులు
నాగారం, హుజూర్నగర్: అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు (ప్రీ ప్రైమరీ స్కూళ్లు)గా సేవలు అందించనున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు డిజిటల్ విధానంలో విద్యా బోధన అందించేందుకు ఆయా కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే విద్యుత్ సౌకర్యం ఉన్నవి.. విద్యుత్ సౌకర్యం లేని అంగన్ వాడీ కేంద్రాల వివరాలను అధికారులు సేకరించారు. 477 కేంద్రాల గుర్తింపు జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, చివ్వెంల ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే అద్దె, సొంత, పాఠశాల ప్రాంగణాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేని భవనాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. వాటిలో సొంత భవనాలు ఉన్న కేంద్రాలు 313 కాగా ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్నవి 461 కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇక అద్దె భవనాల్లో 435 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో విద్యుత్ సౌకర్యం ఉన్నవి 290, లేనివి 477 కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి విద్యుత్ శాఖకు నివేదికలు సమర్పించారు. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు ప్రతినెలా విద్యుత్ బిల్లులు చెల్లించడం భారంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని సంకల్పించింది. ఫ కరెంట్ సౌకర్యం లేని కేంద్రాలకు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఫ ఇప్పటికే వివరాల సేకరణ పూర్తి ఫ ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా యంత్రాంగం ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1,209సొంత భవనాలున్నవి 306అద్దె భవనాల్లో సాగుతున్నవి 452పాఠశాలల్లో నిర్వహిస్తున్నవి 451విద్యుత్ సౌకర్యం ఉన్నవి 732విద్యుత్ సౌకర్యం లేనివి 477 అధికారులకు నివేదిక అందజేశాం అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గల విద్యుత్ సౌకర్యంపై సర్వే చేసి ఆ నివేదికను కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులకు అందజేశాం. అంగన్వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం. – నరసింహారావు, జిల్లా సంక్షేమాధికారి -
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ కమిటీలో అగ్రస్థానంఫ ఉపాధ్యక్షులుగా ముగ్గురు ఫ ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. పార్టీ ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురిని నియమించగా, ప్రధాన కార్యదర్శులు ఐదుగురికి స్థానం లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి నియమితులయ్యారు. కొండేటి మల్లయ్య ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుమ్ముల మోహన్రెడ్డి నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ సంధ్యారెడ్డి, దైద రవీందర్, చనగాని దయాకర్, వి.రామారావుగౌడ్, చకిలం రాజేశ్వర్రావుకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే, ఇందులో గుమ్ముల మోహన్రెడ్డి, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నియామకాలతో వారు డీసీసీ అధ్యక్ష పదవికి దూరం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలిసూర్యాపేటటౌన్ : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి పిల్లల ఆరోగ్యం కాపాడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నంబర్ –2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా లోని ప్రతి మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు శానిటేషన్ వర్కర్లకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీ అంకతి వెంకన్న పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో లంబాడ, ఎరుకల కులాల విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద మంజూరైన 72 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద 3వ తరగతికి 36 సీట్లు, 5వ తరగతికి 18 సీట్లు, 8వ తరగతికి 18 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ దరఖాస్తులను ఈనెల 9 నుంచి 13 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను ఈనెల 17 వరకు అందించాలని, ఈనెల 20న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సమక్షంలో విద్యార్థుల ఎంపికకు లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వ సంస్థలను కాపాడుతాం
భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా ప్రభుత్వం కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆవరణలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి మాట్లాడారు. పాత బస్సులను, డీజిల్ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీంతో వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, వాటిలో మొదటి విడతలో 45 బస్సులను ఒకేసారి ప్రారంభించడం సంతోషదాయకంగా ఉందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లేందుకు అవకాశముందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీని ఆధునీకరించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం, ప్రజా రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం, ఆర్టీసీ పరిరక్షణ నినాదాలతో.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చుట్టుముట్టూ సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ అంటూ సూర్యాపేటకు ఉన్న ఖ్యాతిని గుర్తించి 79 బస్సులను కేటాయించామన్నారు. రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం, ఆర్టీసీ పరిరక్షణ అనే మూడు నినాదాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూర్యాపేట డిపో నుంచి హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ ప్రాంతాలకు ఈ ఎలక్ట్రికల్ బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో నల్లగొండలో కూడా ఎలక్ట్రికల్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసి బస్సులు మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అమ్మగారి ఇంటికి, పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను ప్రతి నెలా రూ.300 నుంచి రూ.350 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా కార్మికుల సంక్షేమం, భవిష్య నిధి, నూతన బస్సులు, కారుణ్య నియామకాలకు వినియోగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉపేష ఖాన్, వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఫ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఫ సూర్యాపేట డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులో ప్రయాణంఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, ఏఐసీసీ మెంబర్ సర్వోత్తమ్ రెడ్డి లతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులో కండక్టర్ ను జీరో టికెట్ జారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి నివాసం వరకు వెళ్లారు. ఆయన నివాసంలో భోజన విరామం అనంతరం ఖమ్మం కు బయలుదేరివెళ్లారు. -
ప్రజావాణి అర్జీలపై శ్రద్ధపెట్టాలి
ఫ ప్రజలకు సేవచేయడమే ఉద్యోగుల బాధ్యత ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిలో వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల బాధ్యత అని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలన్నారు. ఒకవేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులు, రిజిస్టర్ల నిర్వహణ, సరైన పద్ధతిలో ఫైల్స్ నిర్వహణకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. భూ సమస్యల దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజావాణికి రావాల్సిన అవసరం లేదని, జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులతో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులను అక్కడ అన్ని డాక్యుమెంట్లు జత చేసి ఽసమర్పించాలన్నారు. కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన మీగడ నర్సింహరావు కుమారుడు చరణ్ కుమార్కు భవిత కేంద్రం ద్వారా విద్యను బోధించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏ స్థాయిలో ఉందో అటవీ శాఖ ద్వారా వర్షం నీటి వినియోగం, వ్యవసాయ శాఖ ద్వారా ఏ పంటలకి ఎంత నీరు వినియోగిస్తున్నారో, ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్, మైక్రో ఇరిగేషన్ వివరాలు, నీటిపారుదల ద్వారా చెక్డ్యామ్ ల వివరాలు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా బోర్ వెల్స్ వివరాలు, ఇండస్ట్రీస్ ద్వారా పరిశ్రమలు ఎంత నీరు వినియోగిస్తున్నారో, పపంచాయతీరాజ్ మున్సిపాలిటీలు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ వివరాలు 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ఏ సెక్రటరీ మంద మకరంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలగిరిలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన విధంగా తగిన ఆధారాలతో రైతులు తమ దరఖాస్తులు సమర్పించి సహకరించాలని కోరారు. రైతులు సమర్పించిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి నిబద్ధతకు అనుగుణంగా తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.హరిప్రసాద్, ఆర్ఐ జార్జిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అనిత, అజయ్, చందు, వినోద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.ఫ సీసీఎల్ఏ సెక్రటరీ మంద మకరంద్ -
అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం -
నేడు కోదాడ పబ్లిక్ క్లబ్ బహిరంగ వేలం
కోదాడ: కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన భవనాన్ని ఆదివారం 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య చట్ట పరిధిలోని నిబంధనలకు లోబడి బహిరంగవేలం నిర్వహిస్తున్నామని క్లబ్ కార్యదర్శి బొల్లు రాంబాబు తెలిపారు. శనివారం కోదాడ పబ్లిక్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్ అధ్యక్ష , ఉపాధ్యక్షులు అమెరికాలో ఉన్నప్పటికీ వారిన సంప్రదించి, కార్యవర్గం తీర్మానం మేరకే వేలం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒక సామాజికవర్గానికి కట్టబ్టెడానికి ప్రయత్నం జరుగుతుందనేది అవాస్తమని అన్నారు. ఎవరు ఎక్కువ ధర పెడితే వారికే భవనాన్ని అమ్ముతామన్నారు. ఈ సమావేశంలో క్లబ్ జాయింట్ సెక్రటరీ చింతలపాటి శేఖర్, కార్యవర్గ సభ్యులు గుండపనేని వేణు తదితరులు పాల్గొన్నారు. ఫ క్లబ్ కార్యదర్శి రాంబాబు వెల్లడి -
గృహమే.. స్వర్గసీమ
‘గృహమే కదా స్వర్గసీమ’.. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అలసి సొలసి ఇంటికి చేరగానే.. ప్రశాంతమైన వాతావరణం ఉండాలని అంతా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే తమ స్థాయిలో ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణంలోనూ ట్రెండ్ మారింది. ఇంట్లో అడుగు పెట్టగానే వాహ్ అనేలా ఇంటీరియర్డిజైన్ చేయిస్తున్నారు. పీఓపీ, టైల్స్, ప్లేఉడ్స్, బెడ్స్, సోపాసెట్స్తో ఇళ్లను ఇంద్ర భవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా తమ ఇంటికి ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో పట్టణాల్లో చాలా ఇళ్లు నిర్మితమయ్యాయి. –రామగిరి (నల్లగొండ), సూర్యాపేటటౌన్, మిర్యాలగూడ టౌన్జూమర్ లైట్లు ‘ఇంటీ’రియర్ అదుర్స్ ఫ చూడగానే వాహ్ అనిపించేలా ఇళ్ల నిర్మాణం ఫ ఖర్చుకు వెనుకాడని యజమానులు ఫ కోట్ల రూపాయలతో గృహ నిర్మాణం ఫ ఇంటీరియర్కు రూ.లక్షల్లో వ్యయం ఫ చిన్న పట్టణాలకూ విస్తరించిన కల్చర్ -
10 నుంచి సీపీఎం శిక్షణ తరగతులు
సూర్యాపేట : ఈ నెల 10, 11, 12 తేదీల్లో హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగే సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఒకపక్క పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టులపై మారణ హోమం సృష్టించడం దారుణమన్నారు. శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. -
జిగేల్.. జిగేల్..
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్, ఇతర పనులను చేయిస్తున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీఓపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్పై లామినేట్స్ తెప్పించి కంటికి అందంగా కనిపించేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న ఆకర్షణీయమైన వస్తువులు, స్థానికంగా లభించే అందమైన కళాకృతులు, వేలాడే లైట్లు, కిటికీలు, టీ పాయ్ సొగసులు, ప్రత్యేక లైట్లతో సీలింగ్ డిజైన్లు ఆకర్షించేలా నిర్మించుకుంటున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ఇల్లంతా మరింత జిగేల్.. జిగేల్ మనేలా మార్చుకుంటున్నారు. ఇలా ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కాలానుగుణంగా ఒకరిని చూసి మరొకరు ఇంటిని నిర్మాణాన్ని చేపడుతున్నారు. -
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహన సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. బీజేపీని బలోపేతం చేయాలిమునగాల : పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మునగాల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు మైలారుశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతను పార్టీలో చే ర్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు భద్రంరాజు కృష్ణప్రసాద్, సాతులూరి హనుమంత్, జనార్దన్, రమేష్, జోగయ్య, సురేందర్రెడ్డి, సైదులు పాల్గొన్నారు. నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదలశాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు ఆదివారం నీటి విడుదల చేయనున్నట్లు నీటిపారుదలశాఖ డీఈ సత్యనారాయణ శనివారం సాయంత్రం తెలిపారు. నీటి విడుదల కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతుప్రతినిధులు హాజరు కావాలని కోరారు. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా.. ప్రస్తుతం 18 అడుగుల మేర నీరు ఉంది. -
ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్
అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కిచెన్, లివింగ్ రూం, డబుల్బెడ్ రూమ్కు ఉడ్ వర్క్కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఉడ్వర్క్కు సంబంధించి బెంగళూరు, ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. ఇంటికి ఇటాలియన్ టైల్స్ వాడితే లుక్కింగ్ గ్రాండ్గా ఉంటుంది. సీలింగ్లో ప్రొఫైల్ లైట్స్, బాల్కనీలో డబ్ల్యూ పీవీసీ సీలింగ్ బాగుంటుంది. ఉడ్ వర్క్లో కిచెన్, బెడ్ రూమ్లో 6 ఎంఎం డబ్ల్యూపీవీసీ వాడితే చెదలు రాకుండా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్లు చూపించిన ఇంటిని ముస్తాబు చేసి ఇస్తున్నాం. – జి.దినేష్, ఇంటీరియర్ డిజైనర్, నల్లగొండ ఆహ్లాదకర వాతావరణం ఉండాలి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అనుభవం ఉంటే తప్ప అందమైన ఇల్లు నిర్మించలేం. ఇంటికి కావాల్సిన డిజైన్లు అన్నీ డిజైనర్లు, అర్కిటెక్షర్ల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్స్ కోసం ఒకప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నల్లగొండలోనే లభ్యమవుతున్నాయి. – వై.పద్మ, ఇంటి యజమాని, నల్లగొండ -
లక్ష్యం చేరని ధాన్యం సేకరణ
నాగారం : యాసంగి సీజన్ ధాన్యం సేకరణ పూర్తయింది. రైతుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ దాదాపు 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల కంటే కొనుగోలు కేంద్రాలకు 10 వేల టన్నుల ధాన్యం తక్కువగా అమ్మకానికి వచ్చింది. దీంతో అధికారులు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరలేకపోయారు. 339 కేంద్రాల ద్వారా సేకరణ ఈ యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు 339 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 264 కేంద్రాల ద్వారా 2,89,150 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని 75 కేంద్రాల ద్వారా 50,850 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం రూ.770 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా రైతులకు రూ.690 కోట్లు చెల్లించారు. సన్నధాన్యానికి చెంది క్వింటాల్కు రూ.500 చొప్పున రూ.25 కోట్ల బోనస్ చెల్లించనున్నారు. ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో సేకరణ ముగియగా 54,648 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు. ఈ సీజన్లో మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. వచ్చే సీజన్లో ధాన్యం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఆలస్యమైన కొనుగోళ్లు ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కాగా జూన్ మొదటి వారంలోపే పూర్తయ్యాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, మిల్లులను తక్కువగా కేటాయించడం, లారీల కొరత తదితర కారణాలతో కొనుగోళ్లలో జాప్యం జరిగింది. దీనికితోడు గతేడాది జిల్లాలో 72 మిల్లులను కేటాయించగా.. ఈ ఏడాది కేవలం 34 మిల్లులే కేటాయించారు. సీఎంఆర్ సకాలంలో ఇవ్వకపోవడంతో కొన్ని మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. దీంతో మిల్లుల సంఖ్య సగానికి తగ్గి కొనుగోళ్లు ఆసలస్యమయ్యాయి. ఫ టార్గెట్ 3.50 లక్షల మెట్రిక్ టన్నులు ఫ కొన్నది 3.40 లక్షల మెట్రిక్ టన్నులే.. ఫ ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు ధాన్యం కొనుగోళ్ల వివరాలు.. కొనుగోలు కేంద్రాలు 339దొడ్డురకం ధాన్యం 2,89,150 మెట్రిక్ టన్నుల సన్నరకం 50,850 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం అమ్మిన రైతుల సంఖ్య 47,382సన్నరకం అమ్మిన రైతులు 7,266 రైతులకు చెల్లించిన డబ్బులు రూ.690కోట్లు చెల్లించాల్సిన డబ్బులు రూ.80కోట్లు 3.40లక్షల మెట్రిక్ ధాన్యాన్ని సేకరించాం ఈ ఏడాది యాసంగిలో రైతుల నుంచి 3.50లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దీనిలో దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని కలిపి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ధాన్యం సేకరణలో కొంత ఇబ్బందులు ఎదురైనా అధిక మించి కొనుగోళ్లను పూర్తిచేశాం. – ప్రసాద్, డీఎం, సివిల్సప్లయ్, సూర్యాపేట -
అత్యవసర మరమ్మతులు
సాగర్ ఎడమ కాల్వ కట్టను పటిష్ట పరిచేలా పనులుఫ రూ.1.26 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న మట్టి పనులు ఫ త్వరలో కంపచెట్ల తొలగింపు ఫ టెండర్ల ప్రక్రియలో తూములకు కొత్త షెట్టర్ల ఏర్పాటు నడిగూడెం : జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకట్టను పటిష్టం చేపట్టేందుకు అధికారులు అత్యవసర మరమ్మతులు మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా ఎడమ కాల్వకట్ట మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో పలుచోట్ల కాల్వకట్ట బలహీనంగా మారింది. ఇరువైపులా కంపచెట్లు పెరిగి లైనింగ్తోపాటు తూముల షెట్టర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడ.. ఎప్పుడు కాల్వకట్ట తెగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్వకట్టకు అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.26కోట్ల నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. రూ.12 లక్షల నిధులతో కాల్వకట్ట మరమ్మతులు నడిగూడెం మండలం రామాపురం 120 కిలోమీటరు వద్ద చెరువు వెంట ఉన్న సాగర్ ఎడమ కాల్వకట్ట ఇప్పటి వరకు రెండుసార్లు కుంగింది. దీంతో కాల్వకట్ట కూడా దెబ్బతిని బుంగలు పడి కట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో కాల్వకట్ట అత్యవసర మరమ్మతులకు ప్రభుత్వం రూ.12 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో కాల్వకట్ట చౌడుమట్టితో ఉన్న చోట్లలో ఆ మట్టిని పూర్తిగా తొలగించి కొత్త మట్టితో పటిష్టం చేస్తున్నారు. పనులు జరుగుతున్న క్రమంలో చాకిరాల నుంచి కృష్ణానగర్ వరకు ఈ కట్టపై రాకపోకలను నిలిపివేశారు. 10 రోజుల్లో కాల్వకట్ట మరమ్మతు పనులు పూర్తికానున్నాయి. కంపచెట్లు తొలగింపునకు.. మునగాల మండల కేంద్రం సమీపం నుంచి సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ 115 కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం 133 కిలోమీటర్ వద్దగల రంగుల వంతెన వరకు కాల్వ కట్టకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించేందుకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు చేపట్టనున్నారు. కొత్త షెట్టర్లు ఏర్పాటు చేసేలా.. పెన్పహాడ్ మండలం దోసపాడు 74వ కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం రంగుల వంతెన 133 కిలోమీటర్ వరకు సాగర్ ఎడమ కాల్వ కట్టపై ఉన్న 24 మేజరు కాల్వల తూములకు ఉన్న తుప్పు పట్టిన పాత షెట్టర్లను తొలగించి కొత్త షెట్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.99 లక్షలు మంజూరు చేసింది. ఇందుకు టెండర్లు స్వీకరించాల్సిఉంది. మట్టి పనులు కొనసాగుతున్నాయి కాల్వకట్టను పటిష్టం చేసేందుకుగాను నాలుగు రోజుల నుంచి మట్టి పనులు కొనసాగుతున్నాయి. కంపచెట్ల తొలగింపు పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. తూములకు కొత్త షెట్టర్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. తూములకు కొత్త షెట్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా మేజర్ కాల్వలకు కేటాయించిన కేపాసిటీ మేరకు నీటి విడుదల జరుగుతుంది. – సత్యనారాయణ, సాగర్ ఎడమ కాల్వ ఏఈ -
రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన
కోదాడ: పట్టణపరిధిలోని రామిరెడ్డిపాలెం వద్దఉన్న అనంతగిరికి చెందిన రంగనాథస్వామి ఆలయ భూములను శుక్రవారం రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. గత నెల 31న శ్రీఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలుశ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సర్వే నంబర్ 1024, 1025లో ఉన్న భూమి మొత్తం 24 ఎకరాలను సర్వే చేయాలని నిర్ణయించారు. దేవాలయ భూములను పరిశీలించిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఈదుల కృష్ణయ్య, ఆలయ కమిటీ చైర్మన్ తీగల నరసింహారావు, అనంతగిరి డీటీ శ్రీధర్, సర్వేయర్ నాగార్జున తదితరులు ఉన్నారు. ముగిసిన వేసవి శిబిరంసూర్యాపేట : బాల భవన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా కొనసాగుతున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగింది. శిబిరం ముగింపు సందర్భంగా విద్యార్థులు గాత్ర సంగీతం, వాయిద్యం, కుట్లు అల్లికలు, చిత్రలేఖనం నృత్యంతో పాటు మెడిటేషన్, సైన్స్ ప్రయోగ అంశాలను ప్రదర్శించి అలరించారు. ఈ కార్యక్రమానికి బాల భవన్ అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ రామ్మూర్తి హాజరై తిలకించి విద్యార్థులు, శిక్షకులను అభినందించారు. కార్యక్రమంలో బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి రిటైర్డ్ అధ్యాపకులు కవి హమీద్ఖాన్, అనంతుల జయ మ్మ, వెంపటి రాము, బాల భవన్ పేరెంట్స్ కమిటీ వెన్న కవితారెడ్డి, కార్టూనిస్టు పల్లె మణిబాబు, వెంకటేశ్వర్లు, మెడిటేషన్ గురువు భీష్మారెడ్డి, దాసరి ఎల్లయ్య, ఉమ, సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణాల మంజూరు సులభతరం నల్లగొండ టౌన్ : రైతులకు రుణాల మంజూరు సులభం చేయడం కోసం పాలసీల్లో మార్పులు చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార బ్యాంకు అంటేనే రైతుల బ్యాంక్ అని రైతుల అభివృద్ధికి బ్యాంకు సహాయ పడుతుందని తెలిపారు. రైతులు బ్యాంకులో రుణం పొంది ఏదైనా కారణం చేత మరణిస్తే వారికి ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్) సదుపాయం కల్పించాలని తీర్మాణించినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రాఫ్ వైజ్గా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి, సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. -
పంట నష్టపరిహారం విడుదల
నాగారం : మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు, వడగళ్లకు జిల్లాలోని పలు మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం విడుదల చేసింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 662 మంది రైతులకు రూ.110.41 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,104.07 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగినట్లుగా ఇందులో ముఖ్యంగా వరిపంట భారీగా దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. రైతన్నకు ఊరట! బోరు బావుల్లో నీరుండడంతో వరిపంట సాగుకు రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. అయితే అకాల వర్షాలు అన్నదాతలకు కడగళ్లు మిగిల్చాయి. మామిడి కాయలు సైతం నేల రాలాయి. ఎట్టకేలకు పరిహారం విడుదలైన పంట నష్టపరిహారంతో రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. పంట ఎంత నష్టపోయినా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ఫ ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ. 110.41 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఫ త్వరలోనే రైతులకు అందనున్న పరిహారం పంట నష్టం ఎకరాల్లో.. 1,104.07నష్టపోయిన రైతులు 662విడుదలైన పరిహారం రూ.110.41 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ ప్రభుత్వం జిల్లాకు రూ.110.41 కోట్ల పంట నష్టపరిహారం విడుదల చేసింది. ఈ పరిహారం డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట -
‘భూ భారతి’తో మెరుగైన సేవలు
నూతనకల్ : భూ భారతి చట్టం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. అనంతరం సోమ్లాతండాలో రేషన్ దుకాణంలో రికార్డులు, వన నర్సరీలను పరిశీలించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమయపాలన పాటిస్తూ బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ పండ్ల మొక్కలు అందించేలా స్థానిక సిబ్బంది పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు. -
ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి
సూర్యాపేట : ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హత్యకాండను వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరుస కాల్పుల కారణంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేయడం దారుణ చర్య అన్నారు. అది మరువక ముందే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను దారుణంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఘటనను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టులు పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి శోచనీయమన్నారు. పైగా ప్రధాని, హోంమంత్రి ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జూన్ 9న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంసీపీ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, గంట నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
మూసీని ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపుతాం ● గత ప్రభుత్వం గంధమల్లను పట్టించుకోలేదు ● ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. ● తిర్మలాపూర్ సభలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్తో పాటు సుమారు రూ.1051.45 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. గంధమల్లకు నీరెక్కడినుంచి ఇస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల తీరును ఆయన దుయ్యబట్టారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి గంధమల్ల జలాశయానికి నీటిని అందిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తిచేసి తీరుతామన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు, బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామన్నారు. గత సర్కార్ యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను సకాలంలో ప్రారంభించలేకపోయిందన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా.. నా పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంట పాదయాత్ర చేశానని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. మూసీ కాలుష్యం నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు గోసపడుతున్నారని, ప్రజల కన్నీటిగోస తీర్చడానికి ఆరునూరైనా మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపి తీరుతానని అన్నారు. గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం యాదగిరిగుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలోభక్తులకు కల్పించని సౌకర్యాలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గుట్టమీద ఎవరూ నిద్రించ వద్దని గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాము అధికారంలోకి రాగానే ఎత్తివేశామన్నారు. గుట్టపైకి ఆటోలను అనుమతించామని గుర్తుచేశారు. మహిళల అభివృఽధ్ధిలో భాగంగా ఇందిరామహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనులను అప్పగించామన్నారు. మహిళలపేరునే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కుంభం అనిల్కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, బండ్రు శోభారాణి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, భువనగిరి డీసీసీ అక్షాంశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన జనంశంకుస్థాపన చేసిన పనులు ఇవే.. రూ.574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి పనులకు రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.8.25 కోట్లతో మోటకొండూరులో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులకు రూ.22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు రూ.21.14 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు -
ఇక్కడి ప్రజల అదృష్టం
– ప్రభుత్వ విప్ అయిలయ్య ఆలేరు పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని, ఒకేసారి రూ.1000 కోట్లపైనా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గంధమల్లను రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజాప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 100కు పైగా చెరువును నింపుకున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలకు బదులుగా మద్యం దుకాణాలు ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తుందన్నారు. -
ప్రతి పేదవాడికి ఆహారభద్రత
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆహారభద్రత కల్పించడమే ధ్యేయమని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కల నేరవేర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకువచ్చి, అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి వ్యక్తి, ప్రతి రైతు మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేస్తామని, భూసేరణ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. గంధమల్ల రిజర్వాయర్ను ముంపు లేకుండా సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. -
వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు చాలా పవర్ఫుల్ అని, ఆయన దీవెనలతోనే తమ ప్రభుత్వం వచ్చిందన్నారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులు కల్పించాలని సౌకర్యాలపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయడంతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో ఐదేళ్లు కాంగ్రెస్దే అధికారమన్నారు. ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. -
మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
భానుపురి (సూర్యాపేట) : ఒక్కో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ఒక్కో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రెవేట్ ప్లే పాఠశాలలకు దీటుగా మార్చేందుకు ఒక్కో సెంటర్కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఇంజనీర్ల ద్వారా అంచనా విలువలు తయారు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పనులు చేపట్టాలని సూచించారు. బడిబాట కార్యక్రమంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు ప్రీ స్కూల్లో చేరేలా ప్రచారం చేయాలన్నారు. ఇంటి స్థలం ఉన్న ట్రాన్స్జెండర్స్కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, అలాంటి వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డి డబ్ల్యూఓ నరసింహారావు, సీడీపీఓలు రూప, శ్రీవాణి, శ్రీజ, పారిజాత, నిర్మల, కిరణ్మయి, సూపర్వైజర్లు చంద్రిక, అరుణ, సునీత, డీసీపీఓ రవి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ చైతన్య, సఖి ఇన్చార్జి హేమలత, ఎఫ్ఆర్ఓ వినోద్, పోషణ్ అబ్యాన్ కోఆర్డినేటర్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతు భరోసా వస్తుందా..
నాగారం : వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. భూములు దుక్కులు దున్ని, విత్తనాలు కొనుగోలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి వర్షాలు ముందస్తుగానే కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ తరుణంలో అన్నదాతలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వం గత యాసంగి సాయం రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అప్పుడు సాయం పొందని వారు... ఈ సారి రెండు సీజన్లవి కలిపి ఇస్తారా? ప్రస్తుతం వానాకాలంది ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 6.17లక్షల ఎకరాల్లో సాగు అంచనాజిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది, పెసర, జొన్న, మొక్కజొన్న.. ఇలా తదితర పంటలు 6.17 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమైన ఎరువులు తెప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. గత యాసంగికి సంబంధించి జనవరి 26నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఎకరా, రెండు.. ఇలా విడతల వారీగా 5 ఎకరాల లోపు వరకు పెట్టుబడి సాయం అందించారు. ఆ తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వానాకాలంవచ్చింది. ఈసారైనా పూర్తి స్థాయిలో సాయం అందుతుందా? లేదా? అన్నదాతలు మదనపడుతున్నారు. సాయం అందని వారు 37వేల మందికి పైనే.. జిల్లాలో 2,81,579 మంది రైతులు రైతు భరోసా పొందుతుండగా.. వీరిలో గత యాసంగి సీజన్లో 2,44,423 మంది రైతులకు పెట్టబడి సాయం అందింది. ఇంకా 37,156 మంది రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు విడతల వారీగా ప్రభుత్వం సాయం మంజూరు చేసింది. తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచి పోయింది. వానాకాలం పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు ఫ దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఫ 6.17లక్షల ఎకరాల్లో సాగు అంచనా ఫ యాసంగిలో 37,156 మందికి అందని సాయంపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాం నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఏటా వరి, పత్తి సాగు చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడి సాయం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అందలేదు. ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇప్పటికే భూమి దున్ని సిద్ధం చేశా. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా. ప్రభుత్వం త్వరగా సాయం అందిస్తే మాలాంటి రైతులకు మేలు కలుగుతుంది. –బోయిని నాగయ్య, రైతు, తుంగతుర్తి. యాసంగి సీజన్ రైతు భరోసా వివరాలు.. మొత్తం రైతులు: 2,81,579రైతు భరోసా పొందిన వారు: 2,44,423మంజూరైన సాయం: రూ.227.44 కోట్లు సాయం అందని రైతులు: 37,156 అందాల్సిన డబ్బులు: రూ.108.06కోట్లు -
నేటి నుంచి బడిబాట
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19వరకు బడిబాట నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆచార్య జయ శంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తారు. ఇంటింటికీ తిరిగి.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. శుక్రవారం నుంచి నిర్వహించే బడిబాటలో ఆయా గ్రామాలు, ఆవాసాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, పుస్తకాల పంపిణీ తదితర వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు. గత ఏడాది 2,700 మంది విద్యార్థులు చేరిక.. గత ఏడాది నిర్వహించిన బడిబాటలో జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 2,700 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అలాగే ఈ ఏడాది వేసవి సెలవుల ప్రారంభం నుంచే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తు బడిబాటలో సుమారు 3,034 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యం ఫ 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ ఫ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయనున్న ఉపాధ్యాయులు బడిబాటను విజయవంతం చేయాలి ప్రతి రోజు ఉదయం 7గంటలకే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తాం. ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతుంది. – అశోక్, డీఈఓ -
3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి సీజ్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని, మొత్తం 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన నేపథ్యంలో గురువారం సూర్యాపేట కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి సివిల్ సప్లయ్ అధికారి, డీఎం, డీఆర్డీఓ, డీసీఓ, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ, మెప్మా, సహకార సంఘాలు, మార్కెటింగ్ తదితర శాఖలు సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరించినందుకు అధికారులందరినీ ఆయన అభినందించారు. ట్రక్ షీట్ ఆన్లైన్లో నమోదైన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్ నాటికి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఖరీదు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేసులు నమోదైన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మూడునెలలకు ఒకేసారి సన్నబియ్యం కార్డుదారులందరికీ అందేలా జూన్ 30 వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వివి అప్పారావు, పౌరసరఫరాల శాఖ డీఎం ప్రసాద్, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి పద్మ, మెప్మా పీడీ రేణుక, అగ్రికల్చర్ అధికారి ప్రణవి, సివిల్ సప్లయ్డీటీ, ఆర్ ఐ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ధాన్యంకొనుగోళ్లు విజయవంతం ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు నాటడం, సంరక్షించడం దినచర్యలో భాగం కావాలని సూచించారు. అటవీ శాఖ కార్యాలయాన్ని చూస్తే చాలా ముచ్చటగా ఆహ్లాదకరంగా ఉందని, కలెక్టరేట్ చుట్టూ కూడా ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారి నాగయ్యకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీబీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ఙ్ అనే నినాదాన్ని తీసుకున్నారని, అందరం కలసి ప్లాస్టిక్ పొల్యూషన్ లేకుండా చేయాలని, రూరల్ ,అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పరిశ్రమల వల్ల గ్రీనరీ తగ్గిపోతుందని, అందరూ తమ వంతు కృషిగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీఓ వీవీ అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డీసీఓ పద్మ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీఓ వేణుమాధవ్, ఎఫ్ఆర్ఓ ఎస్. ఆనంద రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, మంజుల, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. -
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
ఫ రూ.1,500 కోట్ల పనులకు తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు ఫ అక్కడే సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు తుర్కపల్లి మండలం తిర్మలాపురం వేదిక కానుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి , సభలో పాల్గొననున్నారు. శంకుస్థాపనలు చేసే పనులు ఇవే.. ఫ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. టెంపుల్ సిటీలో 15 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం. దాతారుపల్లి రెవెన్యూ పరిధిలోని వైటీడీఏ స్థలంలో రూ.180కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం, దాతారుపల్లిలో రూ.15కోట్లతో నిరించే వేర్ హౌజింగ్ గోదాములకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఫ తుర్కపల్లి మండలంలోని గంధమల్ల రిజర్వాయర్ పనులకు, రాంపూర్తండా సమీపంలో 15ఎకరాల స్థలంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన. ఫ ఆలేరు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ రోడ్లకు, రూ.14.50 కోట్లతో కొలనుపాక, కాల్వపల్లి వాగులపై హైలెవల్ బ్రిడ్జిలు, రూ.30 కోట్లతో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్లకు, మోటకొండూర్లో రూ.10కోట్లతో ఎంపీపీ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలకు, ఆలేరులో రూ.15కోట్లతో నిర్మించే మార్కెట్ యార్డు గోదాములకు శంకుస్థాపన చేస్తారు. సీఎం టూర్ షెడ్యూల్.. సీఎం 2.40కి హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 3గంటలకు తిర్మలాపురం చేరుకుంటారు. 3.10కి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో పేదలకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్ అందజేస్తారు. 5 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. -
ఫ ధాన్యం లారీల బారులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నప్పటికీ వారి చేతికి డబ్బులు వచ్చేదాక ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీలో కాంటాలైన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించగా అక్కడ దిగుమతి కాక మూడు నాలుగు రోజుల వరకు బారులుదీరి నిరీక్షించాల్సి వస్తోంది. గురువారం సూర్యాపేట మండలం కాసరబాద సమీపంలోని ఓ రైస్ మిల్లు వద్ద దిగుమతి కోసం ధాన్యం లోడు లారీలు ఇలా బారులుదీరాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
మొక్కలు.. జీవకోటికి ప్రాణాధారం
చివ్వెంల(సూర్యాపేట) : మొక్కలు జీవకోటికి ప్రాణాధారమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూకృషి చేయాలన్నారు. మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ గోపు రజిత, బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటేడ్ సభ్యులు అల్లంనేని వెంటేశ్వర్రావు, గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకరత్నం, పెండెం వాణి, న్యాయవాదులు టి.భిక్షమయ్య గౌడ్, సుధాకర్ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సదస్సులుచివ్వెంల(సూర్యాపేట) : రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని బి.చందుపట్ల, ఉండ్రుగొండ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించి మాట్లాడారు. ఆయా గ్రామాల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, డిప్యూటీ తహసీల్దార్ పద్మజ, ఆర్ఐలు శ్రావణి, శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం తాళ్లగడ్డ (సూర్యాపేట) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడమే బీజేపీ లక్ష్యమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి పేర్కొన్నారు. 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలన – సంకల్పంతో సహకారం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గురువారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ మల్సూర్ గౌడ్, కో–కన్వీనర్లు తాళ్ల నరేందర్ రెడ్డి, జెనిగల శ్రీనివాస్ గౌడ్, జల్లా జనార్దన్, నాయకులు కిషన్, నరసింహ, నారాయణ, సాయిబాబా, కొండ హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్క్లబ్ భవన వేలం నిర్ణయం.. వివాదాస్పదం
కోదాడ: కోదాడ పబ్లిక్క్లబ్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనానికి వేలం వేసి విక్రయించాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం క్లబ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉండగా, నాలుగేళ్ల క్రితం పాతకార్యవర్గం జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా వేలం వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వేలం ప్రక్రియను అత్యంత గోప్యంగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా భవనం కోదాడ పెద్దచెరువు ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో ఉన్నా.. నాలా అనుమతులు లేకున్నా, పంచాయతీ అనుమతులు లేకున్నా క్లబ్ వారికి సంబంధం లేదని, పాటలో దక్కించుకున్న వారే ఇవన్నీ చూసుకోవాలని వేలం నిబంధనలు పెట్టారు. క్లబ్లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ సామాజికవర్గం తమ వారికి కారుచౌకగా ఈ భవనాన్ని కట్టబెట్టడానికి ఈ తతంగం నడుపుతోందని పలువురు క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో పబ్లిక్ క్లబ్ ఉంది. గతంలో ఇక్కడ జోరుగా పేకాట ఆడేవారు. క్లబ్కు రోజువారీగా రూ. లక్షల్లో ఆదాయం వచ్చేది. ఈ డబ్బుతో దాదాపు 15 ఏళ్ల క్రితం పట్టణ సమీపంలో రాఘవపురం వద్ద రూ.కోటితో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి నూతన భవన నిర్మాణం చేపట్టారు. క్లబ్కోసం కొనుగోలు చేసిన ఈ భూమి కోదాడ పెద్దచెరువు ఎఫ్టీఎల్లో కొంత భాగం, బఫర్జోన్లో కొంతభాగం ఉంది. దీంతో దీనికి నాలా, భవన నిర్మాణ అనుమతులు రాలేదని సమాచారం. అయినప్పటికీ నాటి క్లబ్ పాలకవర్గం తమకున్న పలుకుబడితో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసి నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ లోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేకాటక్లబ్లు మూత పడ్డాయి. ఆదాయం లేక పోవడంతో కొత్తభవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. అది పూర్తి కావడానికి మరో కోటిరూపాయలు అవసరం కాావడం, క్లబ్ వద్ద అంత డబ్బు లేక పోవడంతో 12 సంవత్సరాలుగా భవన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఫ ప్రస్తుతం క్లబ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అమెరికాలో ఉండగా వేలానికి నిర్ణయం ఫ నాలుగేళ్ల క్రితం చేసిన తీర్మానం ఆధారంగా వేలంపాట ఫ రూ.3.25 కోట్లుగా ధర ఫ వేలానికి నాలుగు రోజులే సమయం ఫ ఎఫ్టీఎల్లో ఉంటే తమకు సంబంధం లేదని నిబంధన నిబంధనల ప్రకారం వేలం వేయాలి కోదాడ పబ్లిక్క్లబ్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని నిబంధనల ప్రకారం వేలం వేయాలి. నాలుగు సంవత్సరాల క్రితం చేసిన తీర్మానం ఆధారంగా వేలం వేయవద్దు, తాజాగా తీర్మానం చేసి ప్రధాన పత్రికల్లో ప్రకటన ఇచ్చిన తరువాత తగిన సమయం ఇచ్చి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందుబాటులో ఉన్న సమయంలో వేలం నిర్వహించాలి. – సుంకర పుల్లయ్య, క్లబ్ శాశ్వత సభ్యుడుహడావుడిగా వేలం నిర్ణయం ప్రస్తుత కోదాడ పబ్లిక్క్లబ్ అధ్యక్షుడు గాయం పట్టాభిరెడ్డి, ఉపాధ్యక్షుడు వేనేపల్లి సత్యనారాయణలు ఇద్దరు కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో క్లబ్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని వేలం వేయాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వేలం వేస్తున్న విషయాన్ని రెండు రోజుల క్రితం కేవలం క్లబ్ నోటీస్ బోర్డులో పెట్టారు. అమ్మకం ధర రూ.3 కోట్ల 25 లక్షలుగా, ఽ వేలంలో పాల్గొనేవారు రూ.3 లక్షల 2 వేలు శనివారం వరకు చెల్లించాలని, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల మధ్య వేలం పాట నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. భవనం ఎఫ్టీఎల్లో ఉన్నా, నాలా, నిర్మాణ అనుమతులు లేకున్నా తమకు సంబంధం లేదని వేలం నిబంధనల్లో పేర్కొనడం గమనార్హం. ఇలాంటి నిబంధనలు పెట్టి వేలంలో ఎక్కువ మంది పాల్గొనకుండా చేసి తక్కువ రేటుకు తమ అనుయాయులకు కట్టబెట్టాలని చూస్తున్నారని కొంత మంది క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నడిగూడెం : సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జిల్లా సమన్వయకర్త సీహెచ్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇమామ్పేట గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చరర్లు ఇంగ్లిష్, గణితం పోస్టులకు, జాజిరెడ్డిగూడెం పాఠశాలలో గణితం, తుంగతుర్తి గురుకుల కళాశాలలో ఎకనామిక్స్, పీజీటీ ఇంగ్లిష్, పీజీటీ గణితం, పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, అలాగే బీఈడీ కూడా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇమామ్పేట గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బకాయి వేతనాలు చెల్లించాలిసూర్యాపేటటౌన్ : పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కె.వేణు కోరారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో నియమితులైన పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ అశోక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒకటి రెండు రోజుల్లో జీతాలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికే సదస్సులుహుజూర్నగర్ : భూ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. బుధవారం హుజూర్నగర్లోని టౌన్హాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు అందజేస్తే వాటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఆర్ఐలు గాలి శ్రీను, షరీఫ్, అధికారులు పాల్గొన్నారు. ఎన్జీ కాలేజీ డిగ్రీ ఫలితాలు విడుదల రామగిరి(నల్లగొండ) : ఎన్జీ కాలేజీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల ఫలితాలను బుధవారం ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు ఫలితాలను విశ్లేషించారు. బీబీఏ, బీకామ్ విభాగాల్లో అత్యధికంగా 87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థుల్లో బీబీఏ 83శాతం, బీకామ్ 80 శాతం, బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులు 69శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అడిషన్ సీఓఈ డాక్టర్ వైవి.ప్రసన్నకుమార్, అధ్యాపకులు కోటయ్య, చంద్రయ్య, నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలయంలోని వివిధ విభాగాలు, శాఖల అధికారులతో బుధవారం కొండపై గల అతిథిగృహంలో సమావేశం అయ్యారు. ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. పెండింగ్ పనులు, జరగాల్సిన అభివృద్ధిపై చర్చించారు. -
మూడు నెలలు.. ఆరుసార్లు!
నాగారం : రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ మొదలైంది. రెండు, మూడు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే పంపిణీ ప్రక్రియ ఇప్పుడు ఆలస్యమవుతోంది. ఎక్కువ బియ్యం ఇవ్వాల్సి రావడంతో అన్ని రేషన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. దీనివల్ల డీలర్లకు, లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోంది. బియ్యం పంపిణీకి వినియోగించే ఈ–పాస్ యంత్రాల అప్డేట్, మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ, మారిన సాఫ్ట్వేర్ తదితర కారణాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఒక్కొక్కరికీ బియ్యం పంపిణీకి సుమారు 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద వినియోగదారులు విసుగు చెందుతున్నారు. జిల్లాలో 610 రేషన్ దుకాణాలు జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ దుకాణాలు, 3.24 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో 9.31లక్షల మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. వీరికోసం మూడు నెలలకు గాను 1,78,000 క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు గుర్తించారు. ఆ మేరకు నిల్వలను సర్దుబాటు చేస్తున్నారు. ఆరు సార్లు వేలి ముద్రలు.. రేషన్ దుకాణాల్లో కార్డుదారుల్లోని ఒక్కో సభ్యుడికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డు కింద 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ ఇస్తుండటంతో ఎవరూ డబ్బులు చెల్లించడం లేదు. తెల్లరేషన్ కార్డుదారుల్లో ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుంటే వారికి నిర్దేశిత కోటా ప్రకారం ప్రతినెలా వీరికి 24 కిలోలు బియ్యం వచ్చేది. ఇందులో కేంద్రం వాటా కింద 20 కిలోలు, రాష్ట్ర వాటా 4 కిలోలు బియ్యం ఉంటాయి. (ఒకరికి వచ్చే 6 కిలోల్లో 5 కేజీలు కేంద్రం, మిగతా 1కిలో రాష్ట్ర వాటా). ఈ బియ్యం తీసుకునేందుకు కేంద్రం, రాష్ట్ర వాటాకు సంబంధించి వేర్వేరుగా (ప్రతినెలకు రెండు సార్లు) వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు.. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారు ఆరు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఒక్కో వ్యక్తి ఇన్నేసి సార్లు వేలిముద్ర వేయడం, మధ్యలో సరిగా ముద్ర పడకపోతే మరోమారు ప్రయత్నించాల్సి వస్తోంది. తర్వాత వారి బియ్యం కోటాను తూకం వేసివ్వాలి. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి 15 నిమిషాలకు పైగాసమయం పడుతోంది. దీంతో లబ్ధి దారులంతా వారి వంతు వచ్చేవరకు ఎదురుచూడక తప్పటం లేదు. దీనికి తోడు సర్వర్ బిజీ, నెట్ సిగ్నల్ సక్రమంగా లేకపోవడంతో, బ్లూటూత్ కనెక్ట్ కాకపోవడం తదితర అంశాలు వేధిస్తున్నాయి. అలాగే అంత్యోదయ కార్డులు కేంద్ర వాటా కింద రావడంతో వీరు ఒకసారి (మూడు నెలలకు మూడుసార్లు) వేలిముద్ర వేస్తే సరిపోతుంది. నెలాఖరు వరకు బియ్యం సరఫరా.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేపట్టడంతో ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేసేలా ఈపాస్ యంత్రాలు పనిచేస్తాయి. గతంలో ప్రతి నెల 15వ తేదీ వరకు పనిచేసేవి. ఇప్పుడు నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కార్డుదారులు ఒకేసారి రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడొద్దు, అందరికీ బియ్యం అందుతాయి. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. – మోదుగు శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి డీఎస్ఓ, సూర్యాపేట ఒక పూట సమయం పట్టింది రేషన్ బియ్యం కోసం దుకాణానికి వెళ్లి కార్డు సీరియల్లో పెట్టాను. నా సీరియల్ వచ్చేసరికి ఉదయం వెళితే మధ్యాహ్నం అయింది. నాకు ప్రతి నెలా 24 కేజీల బియ్యం వస్తాయి. మూడు నెలలకు కలిపి 72 కిలోల బియ్యం వచ్చాయి. వేలిముద్రలు వేసి బియ్యం తీసుకునేసరికి 20 నిమిషాల సమయం పట్టింది. – ఎస్.కె. మన్సూర్, తుంగతుర్తి రేషన్ బియ్యం పంపిణీకి అష్టకష్టాలు ఫ ప్రతి కార్డుదారుడు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సిందే ఫ ఒక్కో కార్డుకు 15 నిమిషాల సమయం ఫ రేషన్దుకాణాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు ఫ సాఫ్ట్వేర్ మార్చాలంటున్న రేషన్ డీలర్లురేషన్ దుకాణాలు 610ఆహార భద్రత కార్డులు 3,04,317 అంత్యోదయ కార్డులు 19,832 అన్నపూర్ణ 36 మూడునెలల కోటా 1,78,000క్వింటాళ్లుఒకేసారి కేటాయిస్తే.. కేంద్ర, రాష్ట్ర వాటాల కింద వచ్చే బియ్యానికి వేర్వేరుగా వేలిముద్రను తీసుకోవడం వల్ల జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో డీలర్లు, లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న వాగ్వాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలంటే ఒక కార్డులో ఎంత బియ్యం ఉంటే అంత మొత్తానికి ఒకేసారి వేలిముద్ర వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీలర్లు కోరుతున్నారు. దానికనుగుణంగా సాఫ్ట్వేర్ను మార్పు చేయాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఫలితముంటుందని చెబుతున్నారు. -
నకిలీ విత్తనాలకు అడు్డకట్ట ఏది!
ఫ యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా ఫ మాయమాటలతో రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు ఫ తాజాగా తిరుమలగిరిలో నకిలీ విత్తనాల తయారీ ముఠా గుట్టురట్టు ఫ టాస్క్ఫోర్స్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తేనే మేలు రైతులు అప్రమత్తంగా ఉండాలి నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రసీదుపొంది భద్రపర్చుకోవాలి. ఏదైనా అనుమానాలు ఉంటే అధికారులకు తెలియజేయాలి. ప్రత్యేక బృందాలతో నకిలీ విత్తనాలు అమ్మకుండా తనిఖీలు చేపడుతున్నాం. రైతులు అధికారులకు సహకరించాలి. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పీడీయాక్ట్ నమోదు చేస్తాం జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైన రైతులకు నకిలీ విత్తనాలను అమ్మితే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. రైతులు నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలి. – నరసింహ, జిల్లా ఎస్పీ భానుపురి (సూర్యాపేట) : ప్రతి సీజన్లో నకిలీ విత్తనాలతో జిల్లాలో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. సీజన్ కు ముందు విత్తనాలు, ఎరువుల దుకాణాలు తనిఖీలు చేయడంతో పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మెట్ట పంటల సాగు జోరుగా సాగుతుండగా అక్రమార్కులకు ఇదే అదునుగా మారింది. నిరక్షరాస్యులైన రైతులను టార్గెట్ గా చేసుకొని కల్తీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఓవైపు వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీల భరతం పట్టేందుకు ముందుకు సాగుతుండగానే అక్రమార్కులు ఇవేమీ పట్టనట్టుగా తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. నకిలీ విత్తనాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి మాయమాటలు చెప్పి రైతులకు అంటగట్టడమే కాకుండా.. ఏకంగా జిల్లాలోనే తయారీకి పూనుకుంటున్నారు. వాటిపై దృష్టి పెడితేనే... సూర్యాపేట జిల్లాకు ఏపీతోపాటు సరిహద్దు జిల్లాలైన మహబూబాబాద్, ఖమ్మం, జనగామనుంచి నిషేధిత బీటీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ విత్తనాలను ఏజెంట్లద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. అలాగే రైతులు ఏపీలోని గుంటూరు, నందిగామ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి సైతం కొనుగోలు చేసే విత్తనాల్లో ఈ నకిలీ విత్తనాలు కూడా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి లైసెన్సులు లేకుండా విత్తనాలను అందించే ఫెర్టిలైజర్ షాపుల్లోనూ ఈ నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక బృందాలు మరింతగా.. సూర్యాపేట జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల వరకు పత్తి సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను చదును చేసుకొని పత్తి విత్తనం నాటేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే విత్తనాలను కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఈ పత్తి సాగు ఈనెల చివరి వరకు రైతులు చేపట్టే అవకాశం ఉండగా నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు మరింత కఠినంగా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పోలీస్ రెవెన్యూ అధికారులతో కలిసి విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలను మరింత విస్తృతం చేయాల్సి ఉంది. తిరుమలగిరి మండలంలో ఓ వ్యక్తి నకిలీ విత్తనాల తయారీ కేంద్రమే నడుపుతున్నాడు. ఈ కేంద్రం ద్వారా తయారుచేసిన విత్తనాలను పలువురు రైతులకు విక్రయించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు తయారీ ముఠాను మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం సాగుతున్న తీరుకు ఈ సంఘటన అద్దంపడుతోంది.రైతులూ ఇవి పాటించండి.. ఫ ప్రధానంగా ఏజెంట్లు.. వ్యాపారులు చెప్పే మాయమాటలను నమ్మకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. ఫ ఉద్దెర ఇస్తారని చెప్పి వ్యాపారులు ఏవిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నేల స్వభావాన్ని బట్టి ఏ విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయో వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంది. ఫ లైసెన్స్డ్ డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్యాకింగ్ను సరిచూసుకోవాలి. ఫ ఏదికొన్నా రసీదు తప్పని సరిగా తీసుకోవాలి. రసీదుతో పాటు విత్తనాలకు సంబంధించిన ఖాళీప్యాకెట్ను పంట దిగుబడి చేతికందేవరకు భద్రపర్చుకోవాలి. ఫ నిషేధిత, గడువు ముగిసిన రకాల్ని పసిగట్టాలి ధర తక్కువని, లూజుగా విక్రయించే పత్తి, మిరప విత్తనాలను కొని మోసపోవద్దు ఫ అంగట్లో కూరగాయల్లా ఎక్కడ విత్తనాలు విక్రయానికి పెట్టినా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలి. ఫ రసీదులో రైతుపేరు, విత్తన కంపెనీ పేరు, చిరునామా, లాట్ నంబర్, ప్యాకెట్ల సంఖ్యను డీలర్లు తప్పక పొందుపర్చాలి. ఫప్యాకెట్పై లాట్నంబర్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, లేబుల్, విత్తన మొలకశాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకే
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. బుధవారం రాత్రి సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజాభరోసా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత కష్టపడి చదువి ఉన్నతస్థానానికి చేరాలని సూచించారు. గ్రామాల్లో అలజడులు సృష్టించి అశాంతికి కారణమయ్యేవారిని, అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని అన్నారు. ఎన్నికలు ఎలాంటివైనా గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో గొడవలు పడవద్దని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారని, మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సర్కిల్ ఎస్ఐలు శ్రీకాంత్, మహేశ్వర్, గోపీకృష్ణ పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
నారాయణరెడ్డి ఆశయాలు సాధించాలి
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో రావి నారాయణరెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గన్నా చంద్రశేఖర్ మాట్లాడారు. రావి నారాయణరెడ్డి .. దేశంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచారని, తనకున్న 500 ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిన త్యాగశీలి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య నివేదికకు సనేమిరా..
ఫ డెయిలీశానిటేషన్ రిపోర్ట్ యాప్పై నిరసన ఫ పదిరోజులుగా నమోదు చేయని పంచాయతీ కార్యదర్శులు ఫ ఇప్పటికే పాలకవర్గాలు లేక ఉన్న పనులతో సతమతమవుతున్నామని ఆవేదన నాగారం : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ నివేదికను ఎప్పటికప్పుడు డీఎస్ఆర్(డెయిలీ శానిటేషన్ రిపోర్డ్) యాప్లో నివేదించాలన్న ప్రభుత్వ నూతన మార్గదర్శకాలను పంచాయతీ కార్యదర్శులు పక్కన పెట్టారు. ఆన్లైన్ ద్వారా నివేదికలను అందజేయాలంటే తమకు భారంగా మారుతోందని చెబుతున్నారు. పది రోజులుగా ఆన్లైన్ నివేదికను యాప్లో నమోదు చేయడం లేదు. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 460 మంది కార్యదర్శులు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాలకవర్గాలు లేక, నిధులు విడుదలకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులుచేసి పంచాయతీల్లో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. డీఎస్ఆర్ యాప్లో పారిశుద్ధ్య నివేదికను రోజువారీగా నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి గత నెల 24న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిత్యం ప్రజల్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఈ నివేదిక తలనొప్పిగా మారిందని హాజరు నమోదును పది రోజులుగా నిరాకరించారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లో పనిచేస్తే యాప్ల పేరుతో తమకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ఆర్ యాప్ ఇలా.. పంచాయతీ పరిధిలో రోజూ ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారో యాప్లో నమోదు చేయాలి. తడి, పొడి చెత్త ఎంత పరిమాణంలో(కిలోల చొప్పున) సేకరించారో పొందుపర్చాలి. మొత్తం ఇళ్ల నుంచి రోజులో ఎంత పరిమాణంలో సేకరించారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక వంటి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చెత్త సేకరణలో తిరగమన డంతో రోజువారీ పనులు పడకేస్తాయని కార్యదర్శులు వాపోతున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యతో సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సర్వే, ఆహారభద్రత కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల కారణంగా సుమారు 10 యాప్లలో వివరాలు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరో యాప్తో ఇంకా కష్టాలు పెరుగుతాయని అంటున్నారు. మా కష్టాలు ఎవరూ గుర్తించడం లేదు పద్దెనమిది నెలలుగా పాలకవర్గం లేక, నిధులు లేక, పంచాయతీల అభివృద్ధికి అప్పు చేసి నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వ పథకాల పనుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లో ఉంటున్నాం. మా కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. తాజాగా యాప్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎంత పని చేసినా కార్యదర్శుల పనికి తగిన గుర్తింపు లభించడం లేదు. పారిశుద్ధ్య నివేదికను సైతం పదిరోజులుగా నమోదు చేయడం లేదు. మా సమస్యను ప్రభుత్వానికి నివేదించినా ఎలాంటి స్పందన లేదు. –ఎం.డీ.ఫరీద్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, ఉప జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా డెంగీ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించాలన్నారు. విధుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, అధికారులు డాక్టర్ కోటిరత్నం, జయమానూరి, డాక్టర్ నాజియా, డాక్టర్ శ్రీశైలం, వైద్య అధికారులు పాల్గొన్నారు. -
తొలి రోజు 1,975 దరఖాస్తులు
సూర్యాపేట : జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు మొదలైంది. ఈ చట్టం అమలు, విస్తృత ప్రచారంలో భాగంగా రెవెన్యూ సదస్సులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంగళవారం 23 మండలాల్లోని 33 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల నిర్వహణను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తిరుమలగిరి మండలంలో పర్యటించి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి. రాంబాబు కోదాడ నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. విడతల వారీగా.. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 3 నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూభారతి చట్టం అమల్లోకి రాగా మొదటి దశలో రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా, రెండో దశలో మే 5 నుంచి జిల్లాలోని గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయగా త్వరలోనే లబ్ధిదారులకు భూపట్టాలను అందించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గరిడేపల్లి మండలంలో దాదాపు 1,670 భూ సంబంధిత దరఖాస్తులు వచ్చాయి. 20 వరకు సదస్సులు జిల్లావ్యాప్తంగా 33 రెవెన్యూ గ్రామాల్లో తొలి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 1,975 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన రెవెన్యూ గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరగనున్న గ్రామాలు, తేదీల వివరాలతో సహా గ్రామస్థాయిలో అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు మండలానికి రెండు రెవెన్యూ సదస్సులు జరిగేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారురెవెన్యూ సదస్సులు ప్రారంభం ఫ జిల్లావ్యాప్తంగా భూభారతి చట్టం అమలు ఫ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తాళ్లగడ్డ (సూర్యాపేట): నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట మండలం కేసారంలో గల రైతు వేదికలో ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం’ అనే అంశంపై మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపాసాగర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్యతో కలిసి ఆయన రైతులకు అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం వాడడం ద్వారా 10 నుంచి 15 శాతం దిగుబడి పెంచుకోవచ్చన్నారు. రైతులు వ్యవసాయ పరిశోధన సంస్థల ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని, సాగు చేసేప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే అదే విత్తనాలను రెండు మూడు సంవత్సరాల పాటు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు.అనంతరం రైతులకు నాణ్యమైన విత్తనాల బ్యాగ్లను అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.కృష్ణ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్తయ్య, సుష్మ, లక్ష్మీ అనూష, స్వాతి, రైతులు పాల్గొన్నారు.ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
తిరుమలగిరి( తుంగతుర్తి): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 23 మండలాల్లో గల 32 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని పేర్కొన్నారు. జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, భూ సమస్యలు ఉన్న రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ముందుగా సదస్సులో దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలు అందించాలన్నారు. సదస్సులో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేయాలన్నారు. భూ భారతి చట్టంలో అధికారుల వికేంద్రీకరణ చేశామని ఎక్కువ శాతం దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన రైతు మాలోతు భిక్షం తన భూ సమస్య చాలా రోజుల నుంచి పరిష్కారం కావడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. భిక్షం సమస్యను కలెక్టర్ ఓపిక గా విన్నారు. ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్, డీఆర్డీఓ వివి అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్, డీపీఓ యాదయ్య, తహసీల్దార్ హరిప్రసాద్ , ఆర్ఐ జార్జి రెడ్డి , జూనియర్ అసిస్టెంట్ అనిత, అజయ్, వినోద్ , శ్రీశైలం సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కారం
చిలుకూరు: రైతులు తమ భూ సమస్యలను భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఆర్ఐలు మంత్రిప్రగడ సీతరామచందర్రావు, శ్వేత, కార్యదర్శి కార్తిక్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలినూతనకల్: వర్షపు నీరు వృథాకాకుండా నిల్వ చేయడానికి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డీఆర్డీఓ అప్పారావు సూచించారు. మంగళవారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మురుగు కాల్వల చివర ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాల పెరిగేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, ఎంపీడీఓ సునిత, ఎంపీఓ శశికళ, ఏపీఓ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాంతిరుమలగిరి (తుంగతుర్తి) : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాములలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని డీఈఓ అశోక్ తెలిపారు.మంగళవారం డీఈ రంగారావుతో కలిసి తాటిపాములలో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గత నెలలో గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మంత్రిని స్థానికులు కలిశారు. పాఠశాలలో గదుల కొరత ఉందని తెలియజేయడంతో రూ.3 కోట్లతో నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా అధికారులు పాఠశాలలో స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీధర్, హెడ్మాస్టర్లు ఎం.శ్రీనివాసులు, కె.సత్తయ్య పాల్గొన్నారు. రెండో ఇంక్రిమెంట్ ఇవ్వాలిసూర్యాపేటటౌన్ : సర్వీస్ రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులకు రెండో ఇంక్రిమెంట్ ఇవ్వాలని టీజీజేఎల్ఏ 475 అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సీహెచ్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు గుణగంటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 3,500 మంది అధ్యాపకుల సర్వీసులను 2023 మే 4న అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం వీరికి ఏటా ఇంక్రిమెంట్ ఉంటుందని, అయితే గత సంవత్సరం ఇచ్చారని, ఈ సంవత్సరం మాత్రం తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ జానియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆపారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్లో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చర్ అసోసియేషన్ 475 ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రెండో ఇంక్రిమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
యవ వికాసం.. మరింత ఆలస్యం
నాగారం : నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది. అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో లబ్ధిదారులకు సాయం అందించాల్సి ఉండగా పలు ఆరోపణల నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడింది. 486గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 486 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. 4.24 లక్షల కుటుంబాల పరిధిలో 13 లక్షల పైచిలుకు జనాభా ఉంది. రాజీవ్ యువ వికాసంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజికవర్గాలకు చెందిన 60,304 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల్లో నిరాశ.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం యూనిట్ల పంపిణీని వాయిదా వేయడంతో ఆయా కేటగిరీలకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తు దారులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం అయిదు విడతల్లో అక్టోబర్ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి విడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2 లో రూ.1లక్ష వరకు ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15 లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే నెలాఖరులోపు రాయితీ విడుదల చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియ వాయిదా పడటంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. ఈ విషయంపై సంబంధిత అధికారులను అడగగా ప్రభుత్వం నుంచి తదుపరి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు.ఫ యూనిట్ల పంపిణీ వాయిదా ఫ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో నిరాశ ఫ సర్కారు ఉత్తర్వుల మేరకు ముందుకెళ్తామంటున్న అధికారులు ఫ జిల్లా వ్యాప్తంగా 60,304 మంది దరఖాస్తుదారులుపూర్తిస్థాయి పరిశీలన తర్వాతే.. జిల్లాలో 1, 2 కేటగిరీల్లో 2,317 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించి రాష్ట్ర ఆవిర్భావం రోజున లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మరింత లోతుగా విచారణ చేసి నిజమైన లబ్ధి దారులకు మాత్రమే సాయం అందించాలన్న వినతులతో జూన్ 2న ప్రారంభం కావాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సామాజిక వర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎస్సీ 16,376 ఎస్టీ 8947 బీసీ 29,112 ఈబీసీ 1838 ముస్లిం మైనార్టీ 3935క్రిస్టియన్ మైనార్టీ 96 మొత్తం 60,304 -
వేగంగా ఇరిగేషన్ పనులు
ఫ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ పనులు వేగంగా చేపట్టి అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం సేకరించిన కలెక్టర్లను అభినందించారు. వచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రపరిచే, ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని పేర్కొన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో సన్నబియ్యంతోపాటు, ఇతర రేషన్ సరుకులు ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో ఫారెస్ట్ భూములన్నింటికి తిరిగి పచ్చదనం తెచ్చేలా తన కోటా నుంచి నిధులు ఇస్తానని ప్రకటించారు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండొద్దన్నారు. -
జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులుగరిడేపల్లి : తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని గడ్డిపల్లిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ భగవాన్ శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 10గంటల నుంచి వచ్చేనెల 26 వరకు దరఖాస్తులు సమర్పించాని పేర్కొన్నారు. ఆంగ్లమాద్యమంలో నిర్వహించే ఆయా కోర్సుల్లో 60 శాతం గ్రామీణ, 40శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేది. 31.05.2025 (శనివారం) సమయం : ఉదయం 11 నుంచి 12 గంటల వరకు కోదాడరూరల్ : కోదాడ పట్టణ పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65పై కట్టకమ్ముగూడెం క్రాస్రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు శుక్రవారం క్రాస్రోడ్డ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రాస్రోడ్డు మీదుగా పట్టణ పరిధిలోని ఉత్తమ్పద్మావతి నగర్, బాబునగర్, చిలుకూరు మండలం కట్టకమ్ముగూడెం, రాంచంద్రానగర్, కొండాపురం, మునగాల మండలంలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కోదాడ పట్టణానికి వచ్చిపోతుంటారని తెలిపారు. ఈ క్రమంలో క్రాస్రోడ్డు దాటుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు గురై మృతిచెందారన్నారని వాపోయారు. అరగంట పాటు ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ధర్నాలో ఆయా గ్రామాల నాయకులు రాయబారపు వెంకటేశ్వర్లు, పాయిలి కోటేశ్వరరావు, గిద్దె రాజేష్, వీరయ్య, సత్యనారాయణ, సందీప్, ఉపేందర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బొబ్బయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కట్టకమ్ముగూడెం క్రాస్ రోడ్డులో ధర్నా చేస్తున్న ప్రజలు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 55833 -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉత్తమ్
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2న (సోమవారం) జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ప్రభుత్వం చీఫ్గెస్ట్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రతినిధులను నియమించింది. కాగా జిల్లాలో జరిగే వేడకల్లో ఉత్తమ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలిసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని నంబర్–2 ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీల ప్రిన్సిపాళ్లకు ఐదు రోజులుగా కొనసాగుతున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐకేర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్దన్, కందిబండ శ్రవణ్ కుమార్, కోర్సు డైరెక్టర్ అనుములపురి సీనయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెల్లా ప్రసాద్, పెనుగొండ శ్రీనివాస్, వనమాల వెంకటేశ్వర్లు, నాగరాణి, దామెర శ్రీనివాస్, ధారాసింగ్, బాలునాయక్, సత్యనారాయణరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్రెడ్డి, ఎంఈఓలు ధరావత్ ధారాసింగ్, బానోత్ బాలునాయక్, మేకల జాన్రెడ్డి, బొల్లికొండ కోటయ్య, ఐకేర్ ఆసుపత్రి డాక్టర్ ఊట్కూరి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.డీసీసీ ప్రధాన కార్యదర్శిగా గెల్లి రవిహుజూర్నగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా హుజూర్నగర్కు చెందిన గెల్లి రవి నియమితులయ్యారు. శుకవారం ఆయనకు సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి, డీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రవికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు కోడి ఉపేందర్ యాదవ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.సహకార సంస్థలను అనుసంధానించాలినల్లగొండ టౌన్ : సహకార సంస్థలను జాతీయస్థాయిలో అనుసంధానం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో పాడి సహకార సంఘాలను డీసీసీబీలతో అనుసంధానం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–2026ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా జాతీయస్థాయిలో సహకార సంస్థలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సహకార సంఘాలను అనుసంధానం చేయడం వల్ల సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ప్రాథమిక పాడి సహకార సంఘాలు డీసీసీబీలో సేవింగ్ ఖాతా ఓపెన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు డీజీఎంలు, ఏజీఎంలు, పాడి సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. -
ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు
కోదాడ: కోదాడ పట్టణానికి సమీపంలో రామిరెడ్డిపాలెం వద్ద ఉన్న అనంతగిరి రంగనాథస్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించడానికి కొందరు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కొమరబండకు చెందిన నాటి అధికార పార్టీ నేత ఒకరు ఈ భూమి ఆక్రమణకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకొనగా ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సైతం ఆక్రమణను అడ్డుకున్నారు. తాజాగా శుక్రవారం అదే స్థలాన్ని మరో నేత ఆక్రమించడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటంటే.. కోదాడ పట్టణ సమీపంలోని రామిరెడ్డిపాలెం రోడ్డులో అనంతగిరి గ్రామానికి చెందిన రంగనాథస్వామి దేవాలయానికి సర్వే నంబర్ 1024, 1025లో అత్యంత విలువైన 24 ఎకరాల భూమి ఉంది. దేవాలయ ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు దీన్ని ఆలయానికి ఇచ్చారు. ఈ భూమిలో దాదాపు 20 ఏళ్ల క్రితం పేదలకు ఇందిరమ్మ ఇళ్లకోసం 5 ఎకరాలను ప్రభుత్వం తీసుకొని వారికి ఇళ్లను కట్టించింది. మిగిలిన భూమిని కొందరు రైతులు కౌలుకు చేసుకుంటూ దేవాలయానికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 30–05–2023న నాటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కాలనీకి ఆనుకొని ఉన్న ఆలయానికి చెందిన ఖాళీ స్థలాన్ని మట్టితో నింపి చదును చేసి ఆక్రమణకు ప్రయత్నించారు. దీన్ని రామిరెడ్డిపాలెం వాసులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రత్యేక కధనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆక్రమణ ఆగిపోయింది. తాజాగా శుక్రవారం అధికారపార్టీకి చెందిన నేత ఒకరు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి జేసీబీతో చదును చేయసాగారు. మట్టికూడా పోస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశించినా.. అనంతగిరి దేవాలయ భూమి ఆక్రమణకు గురువుతుందని, దీన్ని కాపాడాలని నాలుగు నెలల క్రితం అనంతగిరికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించి ఎమ్మెల్యే పక్కనే ఉన్న కోదాడ ఆర్డీఓను పిలిచి సదరు దేవాలయ భూములను సర్వే చేసి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐనప్పటికీ రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆక్రమణలు మళ్లీ జోరందుకున్నాయి. ఇక్కడ ఎకరం భూమి విలువ కోటి రూపాయలు ఉంటుందని రామిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాలి మా గ్రామ దేవాలయానికి చెందిన భూములు ఆక్రమణకు గురువుతున్నాయి. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము. సర్వే చేసి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయమని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మళ్లీ కొందరు అదే భూమిని ఆక్రమించేందుకు చూస్తున్నారు. ఇప్పటికై నా ఆక్రమణలను అడ్డుకుని స్థలాన్ని సర్వే చేసి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలి. – ఈదుల కృష్ణయ్య, న్యాయవాది, అనంతగిరి ఫ అనంతగిరి రంగనాథస్వామి ఆలయ భూములపై కన్నేసిన అక్రమార్కులు ఫ ఓ నేత కబ్జా చేయాలని చూస్తే గతంలోనే అడ్డుకున్న రామిరెడ్డిపాలెం వాసులు ఫ వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ ఫ అదే స్థలాన్ని మళ్లీ ఆక్రమించేందుకు చూస్తున్న మరో నాయకుడు ఫ రెండో సారి అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
అభివృద్ధికి పునరంకితం
ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలికలెక్టర్లదే ముఖ్యపాత్ర ఫ మంత్రి కోమటిరెడ్డి కేబినెట్ నిర్ణయాలను అమలు చేయడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్నింటా ముందుంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈఓ పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా 1,700 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. ఫ పేదల సంక్షేమానికి అధికారులంతా కట్టుబడి పనిచేయాలి ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అధికారులంతా అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు నిర్లిప్తత వదిలేసి పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉమ్మడి జిల్లాను అన్నింటా అగ్రస్థానంలో నిలపాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని మూడు జిల్లాల కలెక్టర్లను కోరారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈఓలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని మంతిర పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్.. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయా జిల్లాలకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఎస్పీ నరసింహ, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా సాగర్ క్రస్ట్గేట్ల మరమ్మతులు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్లు మరమ్మతుల పనులను అధికారులు ముమ్మరం చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 590 అడుగులుకాగా.. 546 అడుగుల నుంచి 26 రేడియల్ క్రస్ట్గేట్లు ఉంటాయి. స్పిల్వేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన వాక్వే బ్రిడ్జి మీదుగా వెళ్లి మరమ్మతు పనులు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తిచేసి.. క్రస్ట్గేట్లను ట్రయల్ రన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు గేట్లకు పట్టిన తుప్పును వదిలించడంతో పాటు క్రాక్లు, వంకరలు తిరిగిన వాటిని గుర్తించి సరిచేయడం, వెల్డింగ్ జాయంట్లను గుర్తించి బలంగా లేని చోట్ల తిరిగి వెల్డింగ్ పెట్టడం లాంటి పనులు చేశారు. తుప్పు నివారణకు యాంటీ కరోషన్ పెయింటింగ్ వేయడం, హైడ్రాలిక్ స్ట్రక్చర్ల కోసం ప్రత్యేకంగా తయారైన పెయింట్లను వేసే పనులు చేస్తున్నారు. గతేడాది వరదలు అధికంగా వచ్చి పలుమార్లు ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రబ్బరు సీళ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి మార్చుతున్నారు. పాతవి పనికి వచ్చే దగ్గర వాటిని వంకరలు తీసి మళ్లీ వేస్తున్నారు. గేట్లను ఎత్తేందుకు వినియోగించే ఇనుపత్రెడ్కు గ్రీజింగ్, ఆయిలింగ్ చేస్తున్నారు. అలాగే గేట్లను ఎత్తేందుకు వినియోగించే మోటర్లకు సంబంధించిన స్టార్టర్లు, గేర్బాక్సులు, కుబుల్స్ తదితర సామగ్రిని తనిఖీ చేస్తున్నారు. విద్యుత్ సరఫరా అయ్యే ప్యానల్ బోర్డుల్లో గల సామగ్రినంత చెక్ చేస్తున్నారు. అనుమానాలున్న చోట్ల స్ట్రక్చరల్ ఆడిట్ (ఐఐటీ, ఎన్డీఎస్ఏ వంటి సంస్థలతో) చేయిస్తారు. మరమ్మతు పూర్తికాగే గేట్లను డ్రైరన్ చేస్తారు. ఫ రెండు మూడు రోజుల్లో ట్రయల్రన్ -
వరికి బదులు ఆయిల్పామ్ను ప్రోత్సహించండి
సూర్యాపేట: రాష్ట్రంలో రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని, దీనివల్ల రైతులు తాలు, తరుగు పేరుతో ఎలాంటి ఇబ్బందులు పడరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలసి నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. అందులో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ఆయిల్పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయిపామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణాజలాలను పూర్తిగా వాడుకునేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని తెలిపారు. వివిధ పథకాల అమలులో ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, సంక్షేమానికి సంబంధించి శాసనసభ్యుల మాటే చివరి మాటగా పాటించాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు సిబిల్ స్కోర్లు అడగొద్దు: మంత్రి ఉత్తమ్ రాజీవ్ యువ వికాసం పథకం లబి్ధదారులను బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడగవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు ఆయకట్టు ప్లాన్ సంసిద్ధం చేసి ముందే ప్రకటిస్తామని, ఎస్సారెస్పీలో ఒండ్రు మట్టి తొలగింపు ప్రక్రియ మొదలైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదేవిధంగా చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ధాన్యం సేకరణలో ముందున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొన్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రజలు సంబురంగా ఉన్నారు: మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకంతో ప్రజలు సంబురంగా ఉన్నారన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, నల్లగొండ కలెక్టర్లు తేజస్ నంద్లాల్ పవార్, హనుమంతరావు, ఇలా తిపాఠి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. -
యూట్యూబర్ బయ్యా సన్నీ అరెస్టు కలకలం
సూర్యాపేటటౌన్, నూతనకల్: యూట్యూబ్ వ్లాగర్, బైక్ రైడర్ బయ్యా సన్నీయాదవ్ను నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతనకల్లో కలకలం సృష్టించింది. సన్నీయాదవ్ ఇటీవల పాకిస్తాన్లో పర్యటించి.. తన యూట్యూబ్ చానల్లో ఆ పర్యటనకు సంబంధించిన బైక్ రైడింగ్ వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలపై ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చెన్నైలో సన్నీయాదవ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కొంతమంది భారత సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన వేగులుగా మార్చుకోవటంతో వారిని భారత దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ కోణంలోనే సన్నీయాదవ్ను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆయనపై మార్చి 22న నూతనకల్లో కేసు నమోదైంది. ఈ కేసులో అతడికి బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం నూతనకల్ వచ్చి.. ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం తమకు తెలియదని సన్నీ కుటుంబసభ్యులు తెలిపారు. -
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి ఒక మోస్తారుగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ.. మూడు నెలల ముందుగా మే నెలలోనే వరదలు మొదలవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చింది. ఎగువ నుంచి 82 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లు రెండు మీటర్ల ఎత్తు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరదలు మొదలైతే గత ఏడాది కన్నా ముందుగానే ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉంటాయని సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 512.50 అడుగులుగా కాగా 135.9545 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు). ఫ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు -
పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాం అందించాలి
నాగారం : పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థుల స్కూల్ యూనిఫాం కుట్టడం పూర్తిచేసి అందించాలని డీఈఓ అశోక్ సూచించారు. గురువారం నాగారం మండల కేంద్రంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిచ్చింగ్ చేస్తున్న స్కూల్ యూనిఫామ్స్ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు నమోదయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో బడిబాట నిర్వహించి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ మారయ్య, ఎంఈఓ వాసం ప్రభాకర్, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. -
వన మహోత్సవానికి సిద్ధం
తాళ్లగడ్డ (సూర్యాపేట) : గ్రామాల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవాన్ని చేపట్టింది. ఈమేరకు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో జూన్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 475 నర్సరీలు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 59 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 54లక్షల పైచిలుకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం డీఆర్డీఓ ఆధ్వర్యంలో 475 నర్సరీలు ఉండగా ఈ నర్సరీల్లో మొత్తం 50.02లక్షల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం 40.472 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 10 లక్షల మొక్కలు విత్తు దశలో ఉన్నాయి. ఈ ఏడాది డీఆర్డీఒ ఆధ్వర్యంలో 28.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా మిగిలిన మొక్కలను వన మహోత్సవంలో భాగస్వాములుగా ఉన్న మరో 18 శాఖలకు మొక్కలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 5 నర్సరీలు ఏర్పాటు చేసి 2.439 లక్షల మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 1.93 లక్షల మొక్కలు పెంచి నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 54,39100 మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతఈ సారి ఎక్కువగా పండ్లు, నీడ, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఇతర ప్రదేశాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంరక్షణ ఉపాధిహామీ కూలీలు చూడనున్నారు. మున్సిపాలిటీల్లో మొక్కల సంరక్షణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. అఽత్యధికంగా డీఆర్డీఓ 28.870 లక్షల మొక్కలు, తర్వాత స్థానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ 15.532 లక్షల మొక్కలు, అత్యల్పంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4.5 వేల మొక్కలు నాటనున్నారు. 59లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ఫ సిద్ధంగా ఉన్న 54లక్షల పైచిలుకు మొక్కలు ఫ పండ్లు, నీడ, పూలు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యం ఫ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నాటనున్న అధికారులు ఆయా శాఖల వారీగా నాటాల్సిన మొక్కల వివరాలు అటవీ శాఖ 4,32,000 డీఆర్డీఏ 28,87,000 విద్యా శాఖ 45,000 రోడ్డు భవనాలు 50,000 నీటి పారుదల 2,57,000 వ్యవసాయ శాఖ 383,000 రెవెన్యూ 1,00,000 ఆబ్కారీ 94,900 మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి 15,53,000 వైద్య ఆరోగ్య 22,500 హోం శాఖ 47,600 పరిశ్రమలు 60,000 హార్టికల్చర్ 38,300 సాంఘిక సంక్షేమ 750 గిరిజన 10,000 బీసీ సంక్షేమ 450 మైనార్టీ సంక్షేమ 750 పశు సంవర్ధక శాఖ 750 నెలరోజుల్లో టార్గెట్ పూర్తిచేస్తాం నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నాటడం ప్రారంభిస్తాం. నాటిన మొక్కలు సంరక్షించడానికి ట్రీ గార్డులు, వాచర్లను సిద్ధం చేశాం. అధికారుల ద్వారా ఖాళీ ప్రదేశాలను గుర్తించాం. గుంతలు తీయించి నెలరోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను పూర్తిచేస్తాం. – సతీష్, జిల్లా అటవీ శాఖ అధికారి -
చిన్నారులకు వరం.. బాలభవన్
ఫ లలిత కళలపై వేసవిలో ఉచిత శిక్షణ ఫ శిక్షణ పొందుతున్న 670 మంది విద్యార్థులు సూర్యాపేట : లలిత కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని బాల భవన్ ఓ వరంగా మారింది. డ్యాన్స్, పేరిణి నృత్యం, ఆర్ట్, క్రాఫ్ట్, తబలా, మ్యూజిక్, కోలాటం, డ్రాయింగ్ ఇలా అనేక అంశాలపై విద్యార్థులకు నచ్చిన కళలపై వేసవి సెలవుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న బాల భవన్ను వసతుల దృష్ట్యా ఈ ఏడాది జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోకి మార్చారు. అక్కడే శిక్షణ ఇస్తున్నారు. జూన్ 11 వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణకు మొత్తం 670 అడ్మిషన్లు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు శిక్షణ నిర్వహిస్తుండటంతో చిన్నారులతో పాఠశాల ఆవరణ కోలాహలంగా ఉంది. ఈ శిక్షణకు మొత్తం 670 విద్యార్థులు అడ్మిషన్లు రాగా ప్రస్తుతం 350 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. డ్యాన్స్ నేర్చుకుంటున్నా నేను బాలభవన్లో నాలుగేళ్లుగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. వేసవి సెలవుల్లో ప్రతి రోజు తప్పకుండా శిక్షణకు హాజరవుతాను. నాకు గత ఉగాది పురస్కారాల్లో నంది అవార్డు, కళా ఉత్సవంలో స్టేట్ లెవల్ ద్వితీయ బహుమతి వచ్చింది. ఇక్కడ మాస్టర్లు డ్యాన్స్ బాగా నేర్పిస్తున్నారు. – వర్ష, విద్యార్థిని -
ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలి
జిల్లా వ్యవసాయాధికారితో 31న ఫోన్ ఇన్ ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేది. 31.05.2025 (శనివారం) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 55833 -
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. నర్సరీల పరిశీలననేరేడుచర్ల : నేరేడుచర్ల మండలంలోని సోమారం, బురుగులతండా, బొడలదిన్న గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను గురువారం జెడ్పీ సీఈఓ అప్పారావు పరిశీలించారు. నర్సరీల నిర్వహణను గ్రామ పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, సెర్ఫ్ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ సోమ సుందర్రెడ్డి, ఎంపీఓ నాగేందర్, ఏపీఎం శేఖర్, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు రమేష్, స్వరూప, పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు సుజాత, రజిత, శోభన్ తదితరులున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలిపెన్పహాడ్: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని వరి పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీదేవి, కేవీకే శాస్త్రవేత్త సీహెచ్ నరేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులమల్కాపురం గ్రామంలో వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, వివిధ పంటల్లో చీడపీడల యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్, ఏఈఓ కిరణ్, లక్ష్మీనారాయణ, ఆయిల్పామ్ ఫీల్డ్ ఆఫీసర్ నిఖిల్రెడ్డి, తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు
గరిడేపల్లి: వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జ్ డి.నరేష్ తెలిపారు. బుధవారం ఆయన కృషి విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిరోజు 3 గ్రామాల చొప్పున 23 మండలాల్లోని గ్రామాల్లో హైదరాబాద్ నుంచి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా వానాకాలం సీజన్కు అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్ వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారని వివరించారు. అదనపు ఎస్పీగా రవీందర్రెడ్డిసూర్యాపేటటౌన్ : జిల్లా పోలీస్ అడ్మిన్ అదనపు ఎస్పీగా రవీందర్రెడ్డి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా జిల్లా పోలీస్ అడ్మిన్ అదనపు ఎస్పీగా పనిచేసిన నాగేశ్వరరావు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రవీందర్రెడ్డి వచ్చారు. అనంతరం ఎస్పీ నరసింహను రవీందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీ నాగేశ్వరరావును ఎస్పీ సన్మానించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిచివ్వెంల(సూర్యాపేట) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి డి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్దులు పరిశీలించారు. సిబ్బంది వివరాలను మండల వైద్యాధికారి భవానిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో ఏఎన్ఎంలు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాకాలం కావడంతో ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పీహెచ్సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆయన వెంట వ్యాఽధి నిరోధక టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్, కోటి రత్నం, సిబ్బంది ఉన్నారు. దేశభక్తిని పెంపొందించడం అభినందనీయం కోదాడ: ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించడానికి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటుడు సుమన్ అన్నారు. బుధవారం కోదాడలో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయజెండాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్యంలో పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఖాళీగా ఉండకుండా దేశసేవ కోసం పనిచేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆపరేషన్ సిందూర్లో మరణించిన సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల, డాక్టర్ మధుసూదన్రావు, వెంకన్న, మహదేవ్, నవీన్, రహీం, నాగార్జున పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
భానుపురి (సూర్యాపేట) : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట మార్కెట్లోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అరికట్టి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులకు వానాకాలం సీజన్కు సరిపడా కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, యన్పీకే లాంటి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఏ రకం పత్తి విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయాన్ని ఆరా తీశారు. గుర్తింపు పొందిన డీలర్లు ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని సూచించారు. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, కృష్ణ సందీప్ ఇతర అధికారులు ఉన్నారు. -
శిశువిక్రయాల ముఠా అరెస్ట్ కలకలం
సూర్యాపేటటౌన్ : శిశువిక్రయాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వీరిలో 13మంది సభ్యులు ఉన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు దంపతులు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల నుంచి పిల్లలను తీసుకొచ్చి సంతానం లేనివారికి అక్రమంగా దత్తత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం 10 మంది పిల్లలను, గతంలో 28మంది శిశువులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 10 మంది పిలలను ఎక్కడెక్కడ అక్రమంగా దత్తత ఇచ్చారో గుర్తించి పోలీసులు వాహనంలో తీసుకురాగా.. దత్తత తీసుకున్నవారు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. పిల్లలను నల్లగొండలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేలా చూడాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాకు మొదటి విడతలో మంజూరై నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, పారిశుద్ధ్యంపై అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12,868 ఇందిరమ్మ ఇళ్లకుగాను ఫేజ్ వన్లో 4322 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఫేజ్ టూలో 8,546 లక్ష్యం ఉండగా 2017 లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, మండల స్పెషల్ అధికారులు త్వరగా ఎంపిక పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా జిల్లాలో 60,085 దరఖాస్తులకు 57,985 పరిశీలన చేసి బ్యాంకులకు పంపించామన్నారు. మిగిలిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీఎండబ్ల్యూఓ జగదీశ్వర్రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డీపీఓ యాదయ్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కోవిడ్ కట్టడికి అలర్ట్..
కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న వైద్య ఆరోగ్యశాఖ సూర్యాపేటటౌన్ : దేశంలో ఐదేళ్ల తర్వాత మళ్లీ కరోనా కొత్త వేరియంట్ వస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో కరోనా కేసులు నమోదైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు హుజూర్నగర్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐసోలేషన్వార్డులు ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ర్యాపిట్ కిట్ల కోసం ప్రతిపాదనలుకొత్త వేరియంట్ రూపంలో కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, నడిగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కరోనా పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు..కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక వార్డులో 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతోపాటు కరోనా నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో..కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి కరోనా సోకిన వ్యక్తులు వస్తే చికిత్స అందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒకవేళ తీవ్ర జ్వరం కోవిడ్ లక్షణాలతో రోగులు వస్తే ప్రత్యేకంగా ఉంచడానికి వైద్యశాలలో ఒక గది ఉందని, దానిలో ఉంచి చికిత్స అందిస్తామని వైద్యశాల సిబ్బంది చెబుతున్నారు. కోదాడ వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులో ఉంది. రోగులు వస్తే చికిత్స అందించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు. ఫ సూర్యాపేట, హుజూర్నగర్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు ఫ ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం ఫ ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఫ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు డాక్టర్ల సూచన హుజూర్నగర్లో తొమ్మిది బెడ్లు.. కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో హుజూర్నగర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు అప్రమత్తం అయ్యారు. ఆస్పత్రిలో మూడు ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో మూడు బెడ్ల చొప్పున మొత్తం తొమ్మిది బెడ్లను సిద్ధం చేసి ఉంచారు. ఆక్సిజన్ సిలిండర్, కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచారు. స్వీయ నియంత్రణ పాటించాలి ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. కరోనా వైరస్పై జిల్లా వైద్యశాఖ అప్రమత్తంగా ఉంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలో ఇంకా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. –డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ, సూర్యాపేట -
రుణలక్ష్యం రూ.11,866 కోట్లు
లక్ష్యం మేరకు అందించేలా చర్యలు తీసుకుంటాం లక్ష్యం మేరకు వంద శాతం రుణాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరగడంతోపాటు మళ్లీ రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వార్షిక రుణ లక్ష్యం మేరకు ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. –చింతల బాపూజీ, లీడ్ బ్యాంకు మేనేజర్, సూర్యాపేట నాగారం : జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికార యంత్రాంగం ఖరారు చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య, ప్రాధాన్యేతర రంగాలకు రూ.11,866.02 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలతోపాటు విద్య, గృహ, స్వయం సహాయక సంఘాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందించేలా ప్రణాళిక తయారు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి రూ.2871.86 కోట్ల అదనంగా పెంచారు. రుణ ప్రణాళికలో ఇలా.. జిల్లాలో 3.03 లక్షల మంది పట్టా భూములు కలిగిన రైతులు ఉన్నారు. ఈ వానాకాలంలో జిల్లాలో 6.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. అయితే ఈ సారి వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు (వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, గృహ నిర్మాణం తదితరాలు) రూ.9669.41కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు (వ్యక్తిగత రుణాలు, వాణిజ్యం, నాన్ ప్రియారిటీ సెక్టార్లకు) రూ.2196.79 కోట్లు కేటాయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అన్నదాతలకు అండగా ఉండేలా రుణ మొత్తాన్ని పెంచారు. రైతులు పంట పొలాల్లో సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, భూముల అభివృద్ధి, విత్తనోత్పత్తి, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, స్వయం సహాయక సంఘాలకు, విద్య, గృహ రుణాలు అందించేలా రుణ ప్రణాళిక తయారు చేశారు. గత ప్రణాళికలో లక్ష్యానికి మించి చెల్లింపులు.... జిల్లా వ్యాప్తంగా 23 బ్యాంకులు ఉండగా వాటి పరిధిలో 162 బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణవార్షిక ప్రణాళికలో జిల్లాకు 8994.16 కోట్లు ఖరారు చేశారు. అనంతరం 100శాతం లక్ష్యం పూర్తికాగా.. ఆయా రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో లక్ష్యానికి మించి అంటే గత ఏడాది రూ.1431.25 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారు. గత ఏడాది లక్ష్యం రూ.8994.16 కాగా రూ.10425.41 కోట్లు రుణాలు చెల్లించారు. వందశాతం అమలు చేస్తేనే.. జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలు వ్యవసాయం, తదితర రంగాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాయి. అలాంటి వారికి రుణాలు ఎంతగానో అవసరం. బ్యాంకుల ద్వారా రుణం మంజూరు కాకుంటే అధిక వడ్డీకి బయట అప్పుచేసి పెట్టుబడి పెడితే కష్టార్జితం మొత్తం అప్పులకు కట్టే వడ్డీకే సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. రుణ ప్రణాళిక తయారు చేయడమే కాదు.. వంద శాతం అమలు చేస్తేనే జిల్లా ప్రజలకు ఎంతో మేలు కలగనుంది. 2025–26 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు ఫ వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఫ చిన్నమధ్య తరహా పరిశ్రమకు సైతం.. ఫ గతేడాదితో పోలిస్తే రూ.2871.86 కోట్లు అదనం పంట రుణాలు : రూ.3861.42వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.2999.49చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: రూ.2418.38ఇతర ప్రాధాన్యత రంగాలు: రూ.390.12నాన్ ప్రియారిటీ సెక్టార్కు : రూ.2196.61 -
దత్తత పేరుతో శిశువుల విక్రయం
సూర్యాపేట టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్పహాడ్లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్కర్నూల్కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్కు చెందిన ఖాన్ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. శిశువుల విక్రయం ఇలా.. యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాలబాలికలకు 2025 సంవత్సరంలో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డులకు జూలై 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డుకు 5నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, ధైర్య సాహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి సేవారంగాలోల ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించారు. ఆన్లైన్లో national Awards (https://awards.gov.in) దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం దరఖాస్తు కాపీలను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు. భౌతిక శాస్త్రం అంటేనే నిజాన్ని నిగ్గు తేల్చేదిసూర్యాపేటటౌన్ : భౌతిక శాస్త్రం అంటేనే నిజాన్ని నిగ్గు తేల్చేదని, ఉపాధ్యాయులు ఈ సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని విద్యార్థులకు బోధిస్తే ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చని కోర్సు కో ఆర్డినేటర్ వి.యతిపతిరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని హనుమాన్ నగర్లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు రెండవ స్పెల్ శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల శిక్షణలో నియమ నిబంధనలు, క్రమశిక్షణ పాటిస్తూ రిసోర్స్ పర్సన్ చెప్పిన అంశాలను జాగ్రత్తగా ఆకళింపు చేసుకోవాలన్నారు. వీటిని పాఠశాలలో అమలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పీఎస్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రామలింగారెడ్డి, ఆర్పీలు అంకతి వెంకన్న, ఎస్. కె.ఖాదర్ బాషా, మధుసూదన్ రెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యత సూర్యాపేటటౌన్ : మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యతఅని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ సూచించారు. మనుషుల అక్రమ రవాణా పై ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం సూర్యాపేట కేజీబీవీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా ఉందని, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీనికి గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజయ్య, చంద్రయ్య, శ్రావ్యశృతి, శ్రావణ్, టీచర్స్ పాల్గొన్నారు. ఎస్ఈటీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక తాళ్లగడ్డ (సూర్యాపేట) : స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (ఎస్ఈటీ) అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకు న్నారు. సూర్యాపేట పట్టణంలో స్వామి నారా యణ గురుకుల పాఠశాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్ను కున్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలిగా వురిమల్ల గీత, ఉపాధ్యక్షులుగా హసానబాద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి సైదులు, కార్యదర్శిగా మట్టపల్లి సైదులు, కోశాధికారిగా పి.వనజ, జిల్లా కౌన్సిలర్గా షేక్ నీలోఫర్ లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక విద్యావిధానాన్ని పటిష్టపర్చడానికి కృషి చేస్తానన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
హుజూర్నగర్ : వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు హుజూర్నగర్ వ్యయసాయ మార్కెట్ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా మార్కెట్కు అవసరమైన 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం, మంచి నీటి సౌకర్యం, విద్యుదీకరణ, మఠంపల్లి సబ్ యార్డులో సీసీ రోడ్లు, పశువుల సంత ఏర్పాటు, తాగు నీటి వసతి, కోల్డ్స్టోరేజీ నిర్మాణాల విషయమై పరిశీలించారు. స్థానిక అధికారులను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ దేశముఖ్ రాధిక అరుణ్ కుమార్, మార్కెటింగ్ ఎస్ఈ లక్ష్మణ్ గౌడ్, వరంగల్ రీజియన్ జేడీ ఉప్పల శ్రీనివాస్, నల్లగొండ డీఈ రవీందర్, డీఎంఓ నాగేశ్వరశర్మ, ఉన్నత శ్రేణి కార్యదర్శి కె. శ్రీధర్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి -
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో డీఎఫ్ఓ సతీష్ కుమార్ కన్వీనర్గా నిర్వహించిన వన మహోత్సవం, అటవీ రక్షణ కమిటీ సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్, డీఆర్డీఏ కలిసి 50.4 లక్షలు, అటవీ శాఖ 2.3 లక్షలు, మున్సిపాలిటీలు 1.3 లక్షల మొక్కలు మొత్తం 54 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారని తెలిపారు. వర్షాకాలం మొదలైనందున జూన్ 10 లోపే మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అటవీ క్షేత్రస్థాయి పర్యటన, సర్వే, భూ సేకరణతో పాటు పంచానామా సమయంలో పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వివి అప్పారావు, ఆర్డీఓలు వేణు మాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, డీఐఈఓ భానునాయక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, దయానంద రాణి, జగదీశ్వరరెడ్డి, అబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్, పశుసంవర్థకశాఖ అధికారి శ్రీనివాస్, ఇండస్ట్రీస్ మేనేజర్ సీతారాం నాయక్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, ఎఫ్ఆర్ ఓ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం
కోదాడ రూరల్: చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 65వ నంబర్ జాతీయరహదారిపై కోదాడ మండలంలోని రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును మంగళవారం ఆయన తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. హైవేపై ప్రయాణించే ప్రతి వాహనాన్ని క్షుణ్టంగా పరిశీలించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా సన్నరకం వరిధాన్యం తీసుకురావద్దని, గోవులు, పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంట కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజితారెడ్డి, ఎస్ఐ అనిల్ ఉన్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి సూర్యాపేటటౌన్ : భూ సమస్యలు, తగాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయ భూమి హద్దులు, దారి, విస్తీర్ణం, నీటివనరులు లాంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. వీటిపై చాలా ఫిర్యాదులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పరస్పరం భౌతిక దాడులకు పూనుకోవద్దని సూచించారు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యలను పరిశీలించుకోవాలన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
బడి బస్సు భద్రమేనా..!
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై దృష్టిసారించడంలేదు. నూతన విద్యా సంవత్సరం పునః ప్రారంభానికి గడువు సమీపిస్తున్నా బస్సుల సామర్థ్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యంవహిస్తున్నాయి. మే 15వ తేదీతోనే ఫిట్నెస్ గడువు ముగిసినా పట్టించు కోవడం లేదు. 500కు పైగా ప్రైవేట్ పాఠశాలల బస్సులు.. జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు చేరవేసేందుకు 500కు పైగా బస్సులు వినియోగిస్తున్నాయి. ఫిట్నెట్ ఉంటేనే ఆ బస్సు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ అధికారుల వద్ద ప్రైవేట్ యాజమాన్యాలు వాహనసామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంది. ప్రస్తుతం కొన్ని బస్సులకు మాత్రమే ఫిటనెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఫిట్నెస్ చేయించుకోని బస్సులు జూన్ 12వ తేదీ నుంచి రోడ్ల పైకి వస్తే బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫిటెసెస్ పరీక్షలు చేయించని బస్సులు రోడ్లపైకి వస్తే అనుకోని ప్రమాదాలు సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాగా వేసవి సెలవు ల్లో పాఠశాలల, కళాశాలలు మూసి ఉన్నందున యజమాన్యాలు వారికున్న బస్సులను కిరాయిలకు పంపడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిం చుకున్నందున బస్సులకు ఫిటెనెస్ తప్పనిసరిగా చేయించిన తర్వాతే రోడ్లపైకి అనుమతించాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు దృష్టిసారిస్తే మంచిది..తమ పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు నెలకోసారి బస్సుల్లో ప్రయాణించి కండీషన్, పరిమితికి మించి విద్యార్థులను తర లిస్తున్నారా లేదా అనే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. పరిశీలించిన వివరాలను అధికారులకు తెలియజేయాలి. బస్సులో సమర్థవంతమైన డ్రైవర్, క్లీనర్, అటెండర్లు ఉన్నారా.. లేదా పరీక్షించుకోవాలి. ఫిట్నెస్ పత్రాలు లేకుంటే ఫిర్యాదు చేయాలి. ఇంటి నుంచి బస్టాప్ వరకు పిల్లలతో వచ్చి బస్సు ఎక్కించాకే తిరిగి వెళ్లాలి. బస్సులు, ఆటోలు ఇతర వాహనాల్లో పంపినప్పుడు ఎక్కువ మందిని కూర్చోబెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న విషయాన్ని మరువకూడదు. ఫిట్నెస్ లేకుంటే సీజ్ చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే యాయమాన్యాలకు తెలియజేశాం. ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను తరలించే బస్సులను సీజ్ చేస్తాం. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఇతర వాహనాలనూ సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్లును రద్దు చేస్తాం. జూన్ 12 వ తేదీ లోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. – సురేష్రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి ఫ వాహనసామర్థ్య పరీక్షలపై దృష్టిసారించని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫ జిల్లావ్యాప్తంగా 500కు పైగా ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఫ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభంప్రైవేట్ స్కూళ్లు 350విద్యార్థుల సంఖ్య 40,500బస్సులు 500నిబంధనలు ఇవీ.. స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఎల్లో కలర్ వేయించడంతో పాటు నాలుగువైపులా పాఠశాల పేరు రాయించాలి. డ్రైవర్కు నాలుగేళ్ల సీనియారిటీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ వివరాలను జిల్లా రవాణాశాఖ అధికారులకు తెలియజేయాలి. డ్రైవర్ కచ్చితంగా యూనిఫాం ధరించాలి. బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దు. మూడు నెలలకోసారి డ్రైవర్కు మధుమేహం, రక్తపోటు తదితర ఆరోగ్య పరీక్షలు చేయించాలి. విండ్ స్క్రీన్, వైపర్, లైటింగ్స్, మెకానికల్ కండీషన్ పని తీరును రిజిస్టర్లో రాయాలి. బడి బస్సుల పార్కింగ్ కోసం విద్యాలయాల ప్రాంగణాల్లో ప్రత్యేక స్థలం కేటాయించాలి. పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సుకు ఒక అటెండర్ను నియమించాలి. సీటింగ్ కన్నా ఎక్కువ మంది విద్యార్థులను తరలించడం నిషిద్ధం. -
బియ్యం నాణ్యత తగ్గకుండా చూడాలి
హుజూర్నగర్ : మిల్లర్లు ధాన్యం మరఆడించే సమయంలో బియ్యం నాణ్యత తగ్గకుండా ఉండేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. మంగళవారం హుజూర్నగర్లోని శృతి, శ్రీదేవి రైస్ ఇండస్ట్రీస్లను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మిల్లులకు వచ్చిన లారీలను ఎక్కువ సమయం నిలిపి ఉంచవద్దని, వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని వెంటనే దిగుమతి చేసుకొని లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆయన చెప్పారు. మిల్లర్లు ధాన్యం మర ఆడించేటప్పుడు బియ్యం నాణ్యత తగ్గకుండా ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం పట్టణంలోని గుట్టకు వెళ్లేదారిలో ఏర్పాటు చేసిన వెంచర్, రికార్డులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగార్జున రెడ్డి, డీటీ నాగేందర్, ఆర్ఐ లు ప్రమోద్, పాషా పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపర్చిన కేంద్రం
మఠంపల్లి: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్ర పాలకులు బలహీన పరిచారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం మఠంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలుచేస్తూ పార్లమెంట్ వ్యవస్థను పూర్తిగా వాళ్లకే ఉపయోగపడేలా చేస్తోందన్నారు. ఎన్నికల వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, న్యాయవ్యవస్థ పట్టాలు తప్పిందని,మీడియా మొత్తం కార్పొరేట్ శక్తులకు బందీ అయిందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, నాగారపుపాండు, భూక్యాపాండు నాయక్, వెంకటరెడ్డి, యాకూబ్, సైదులు పాల్గొన్నారు. -
శిశువుల ఆరోగ్యానికి మిషన్ ఇంద్రధనుష్
నాగారం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తోంది. శిశువులకు సోకే పోలియో, క్షయ, కాలేయ సమస్యలు, మెదడు వాపు, మీజిల్స్, డిప్తీరియా తదితర వ్యాధుల నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించటానికి పలు రకాల వ్యాక్సిన్లను మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో అందజేస్తున్నారు. సాధారణంగా ప్రతి వారం ఒక రోజు ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలను అందజేస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు వేయించడం లేదు. అలాంటి వారి కోసం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల్లో ప్రతి నెలా 21 నుంచి 28 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి వారిని గుర్తిస్తూ ఆయా టీకాలను అందజేస్తున్నారు. గర్భిణులకు సైతం టీకాలు ఇస్తున్నారు. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది 0–2 సంవత్సరాల శిశువులకు పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించటానికి టీకాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లాలో ఈ కార్యక్రమం 2023లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు నెలల పాటు నిర్వహించి చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. 2024లో కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది మళ్లీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మిషన్ ఇంద్రధనుష్ను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలుఫ శిశువు జన్మించగానే ఇవ్వాల్సిన టీకాలు బీసీజీ (టీబీ కోసం), ఓపీవీ(పోలియో రాకుండా), హెపటైటిస్–బి (కాలేయ సమస్యల నివారణకు). ఫ ఆరువారాలకు.. పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ ఫ పది వారాలకు.. పెంటావాలెంట్, ఓరల్ పోలియో, రోటా వైరస్. ఫ 14వారాలకు.. పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ ఫ16 నెలల అనంతరం.. ఎంఆర్, జేఈ, ఓరల్ పోలియో, డీపీటీ ఫ 9 నెలలు పూర్తయ్యాక..ఎంఆర్(మీజిల్స్, రుబెల్లా), జేఈ(జపనీస్ ఎన్సెపలిటిస్), పీసీవీ, ఐపీవీ–దీన్ని పూర్తి ఇమ్యునైజేషన్ అంటారు. ఫ ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభం ఫ టీకా తీసుకోని పిల్లలను గుర్తించి వ్యాక్సినేషన్ ఫ జూన్ వరకు ప్రత్యేక కార్యక్రమం టీకాలు వేయిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తల్లిదండ్రులు తమ రెండేళ్లలోపు పిల్లలకు నిర్దిష్ట సమయాల్లో సూచించిన టీకాలను వేయించుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. కొందరు అవగాహన లేమితో సకాలంలో టీకాలను వేయించుకోవటం లేదని గుర్తించి వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా టీకాలను వేస్తున్నాం. – రత్న, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి, సూర్యాపేట. వాక్సినేషన్ వివరాలు ఇలా.... సంవత్సరం కేంద్రాలు టార్గెట్ పిల్లలు టీకాలు వేసింది గర్భిణులు వ్యాక్సినేటెడ్ 2023 2,248 2,200 2,243 530 545 2025 ఏప్రిల్ 1,073 1,300 1,323 295 302 2025 మే 751 1,185 1,113 320 270 -
మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!
మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్టౌన్, నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది. -
సమస్యలు పట్టించుకునే వారే..
రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. - 8లోవిత్తనాల కొరత లేకుండా చూడాలి వానకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులంతా పంటల సాగు కోసం సిద్ధమవుతున్నారు. పత్తి విత్తనాల కొనుగోలుకు వెళ్తున్నారు. అధికారులు పత్తి , వరి విత్తనాల కొరత లేకుండా చూడాలి.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా అధికారులు చూడాలి. – గడ్డం అంజయ్య, రైతు -
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తుకు కచ్చితమైన సమాధానం తెలియజేయాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసంపై సూచనలను అనుసరించి జిల్లాస్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. మండలాలకు కేటాయించిన ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోజువారీగా, వారం వారీగా, పక్షం రోజుల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వస్తున్నందున స్వచ్ఛదనం –పచ్చదనంలో భాగంగా వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజావాణిలో 79 దరఖాస్తులు వచ్చాయని, అర్జీలను పరిష్కారం కోసం అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీడబ్ల్యూ ఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాసరాజు, శ్రీలత రెడ్డి, వినోద్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
ముంపు ముప్పు లేకుండా..
సూర్యాపేట అర్బన్ : రానున్న వర్షాకాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఏటా వర్షాకాలంలో కొన్ని కాలనీలు ముంపునకు గురవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతోపాటు భారీగా ఆస్తినష్టం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి వచ్చే వర్షాకాలంలో పునరావృతం కాకుండా ఆయా ప్రాంతాల్లో నాలాలు, మురుగు కాలువల్లో పూడిక తీయిస్తున్నారు. సమస్య ఎక్కడెక్కడంటే..సూర్యాపేట పట్టణంలో మానస నగర్, తాళ్లగడ్డ, సైనిక్పురి కాలనీ, జీకే గార్డెన్, తిరుమలనగర్ కాలనీలు వర్షాకాలంలో వరదలకు ముంపునకు గురవుతుంటాయి. భారీగా వరదలు వచ్చి ప్రతీసారి నీట మునుగుతుంటాయి. రాకపోకలు కూడా నిలిచిపోతుంటాయి. ఇళ్లలోకి నీరు చేరి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాల్వల్లో సాఫీగా వరద పారేలా అధికారులు ముందస్తు పూడికతీత పనులు చేపట్టారు. ముఖ్యంగా సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక నుంచి నల్లచెరువు వరకు, కొత్త 100 ఫీట్ల రోడ్డు నుంచి పుల్లారెడ్డి చెరువు వరకు, సద్దల చెరువు నుంచి వయా మెడికల్ కాలేజీ మీదుగా త్రివేణి ఫంక్షన్ హాల్ వరకు జేసీబీల సాయంతో చుట్టుపక్కల కంపచెట్లు తొలగిస్తూ.. పూడిక తీయించారు. తాళ్లగడ్డ 60 ఫీట్ల రోడ్డు, కొత్త బస్టాండ్, సైనిక్పురి కాలనీలో మురుగు కాలువల్లోనూ పూడిక తీయించారు. నిరంతర పర్యవేక్షణ వరదలతో కాలనీలు నీట మునగకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు నిరంతర పర్యవేక్షణ చేయను న్నట్లు అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా జేసీబీలు ఏర్పాటు చేసి నీటిని మళ్లించనున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. -
సేవాదృక్పథంతో విధులు నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : లైసెన్స్డ్ సర్వేయర్లు సేవాదృక్పథంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న భూముల సర్వే నిజాం కాలం నాటిదని, ఆ సర్వే సహాయంతో లైసెన్స్డ్ సర్వేయర్లు అప్డేట్ చేసుకుంటూ కచ్చితమైన మ్యాప్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం రూపొందించిందని, దీని అమలులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు భూముల మ్యాప్ పాస్బుక్లో ప్రింట్ ఇవ్వడానికి భూములను సర్వే చేసేందుకు సర్వేయర్ల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించామన్నారు. జిల్లాలో మొదటి విడత కింద 235 మంది అభ్యర్థులకు మే 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. న్యాయబద్ధంగా పరిష్కరించాలిఅభ్యర్థులంతా భూసమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరిస్తూ రైతులతో మంచిగా మెలగాలని కలెక్టర్ సూచించారు. భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి గెట్టు తగాదాలు లేకుండా, హద్దులను కాపాడడంతోపాటు సర్వేయర్ల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి స్కీం ప్రారంభించిందని తెలిపారు. 235 మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఎగ్జామ్ పెట్టి పాసైన వారికి సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం సంబంధిత శిక్షణ కిట్టును అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏడీ ఎస్ఎల్ఆర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ప్రకాష్, సర్వేయర్లు శ్రీనివాస్, శ్యామ్, సమీర్, అలెన్ జోసెస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పాలేరు వాగులో నీటిని వృథా చేస్తే సహించేదిలేదు
● ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ అనంతగిరి: పాలేరు వాగులో నీటిని వృథా చేస్తే సహించేది లేదని ఇరిగేషన్ ఈ ఈ సత్యనారాయణ అన్నారు. సోమవారం అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం శివారులో పాలేరువాగు, చెక్డ్యాంతో పాటు ఫ్లడ్ గేట్లను పరిశీలించి మాట్లాడారు. పాలేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాం ఫ్లడ్ గేట్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. వీరిపై నేలకొండపల్లి, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినట్లు తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, ఏఈ శ్రీనివాస్, భూక్యా రవినాయక్, బాబురావు, తేజావత్ వెంకటేశ్వర్లు, భూక్యా సురేష్ ఉన్నారు. -
రైతన్న సాగుబాట
రోహిణి కార్తె రాకతో వ్యవసాయ పనులు ప్రారంభంమంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025అణగారిన వర్గాలకు చదువును దూరం చేసే కుట్రసూర్యాపేట : అణగారిన వర్గాలకు చదువును దూరం చేసే కుట్రలో భాగమే గురుకులాలను రద్దు చేయడం అని పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ఇంటర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల మూసివేతను విరమించుకోవాలని కోరుతూ సోమవారం పీడీఎస్యూ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1985 నుంచి ఇంగ్లిష్ మీడియంలో దళిత విద్యార్థులకు విద్యను అందిస్తూ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న ఈ గురుకుల కళాశాలలను మూసివేడం దారుణమన్నారు. కార్యక్రమంలో సూరం విజయ్, వినయ్, వివేక్, సన్నీ, సాయి, మాతంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి హుజూర్నగర్ : సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులను ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ కోరారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని మార్కెట్లో నిర్వహించిన సివిల్ సప్లయ్ హమాలీ కార్మికుల (ఏఐటీయూసీ) యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హమాలీకార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేసి, ప్రమాద బీమా నష్టపరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలని, 60 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి రూ. 5 వేల పింఛన్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జి .మల్లయ్య, బి. రామ్మూర్తి, బి .సైదులు, పి. వెంకన్న, జె. మల్లయ్య, పి .గోపి, బాలాజీ, భిక్షం, వెంకన్న, కృష్ణ, వీరేశం శివ పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోరాడాలినూతనకల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటం చేయాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు, ఎంవీ ఫౌండేషన్ జాతీయ కో ఆర్డినేటర్ ఆర్. వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎంవీ ఫౌండేషన్ సామాజిక కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ మండల మాజీ కో ఆర్డినేటర్ రామచంద్రయ్య, చిప్పలపెల్లి రవి, విజయ్కుమార్, దండా సురేందర్రెడ్డి, సూరారపు వెంకన్న, దామోదర్నాయక్, అంజయ్య, చైతన్య, భారతమ్మ, రుజీనా పాల్గొన్నారు.భానుపురి (సూర్యాపేట): వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రోహిణి కార్తె ఆదివారం ప్రారంభం కావడంతో దుక్కులు దున్నడం, విత్తనాల కొనుగోలు పనుల్లో బిజీ బిజీగా మారారు. నైరుతి రుతు పవనాలు రెండు, మూడు రోజుల్లో రానుండడంతో ఈలోగా పత్తి పంట సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం 6.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. రోహిణి కార్తె ప్రారంభం.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరి సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పత్తిని రైతులు సాగు చేస్తుంటారు. మెట్ట పంటల సాగు కోసం ఈ రోహిణి కార్తెనుంచి పనులను మొదలు పెడుతుంటారు. ఆదివారం రోహిణికార్తె ప్రారంభం కావడంతో ఒకటి రెండు రోజులుగా రైతులు వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. పత్తి కట్టెను ఏరడం, తగులబెట్టడం, చెత్తాచెదారం తొలగించే పనులను ముమ్మరం చేశారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మరో వర్షం పడితే పత్తి విత్తనాలు విత్తుకునేందుకు వీలుగా తమ భూములను సిద్ధం చేస్తున్నారు. ఇక వరి సాగు చేసే రైతులు సైతం నార్లు పోసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి పొలాల్లో ఎలుగడ్డ దున్నుకొని జీలుగ విత్తనాల సాగుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు కొనుగోళ్లు.. మరోవైపు తనిఖీలు..పది రోజుల్లో పత్తి విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలను కొనుగోలు చేసేందుకు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేయడంతో పాటు ఏపీలోని నందిగామ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. విత్తనాల కొరత లేకుండా చూడడం తోపాటు వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు వరి సాగు అయ్యేవరకు ఇలాగే కొనసాగాలని రైతులు కోరుతున్నారు.వానాకాలం సాగు అంచనా..● సూర్యాపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రెయినేజీల్లో పూడికతీత ● రానున్న వర్షాకాలంలో వరద బారిన పడకుండా ప్రత్యేక ప్రణాళిక ● ఇటీవలే పనులు ప్రారంభించిన మున్సిపల్ యంత్రాంగంకార్డు మంజూరు నిరంతర ప్రక్రియ కొత్త రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ. పాత రేషన్కార్డులో పేర్లు లేకుంటే దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి వెంటనే కొత్త కార్డు మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో నూతనంగా 1,238 రేషన్కార్డులు మంజురు చేశాము. – మోదుగు శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి పౌరసరఫరాల అధికారి, సూర్యాపేట జిల్లా●న్యూస్రీల్ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 6.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుతాయని అంచనా వేస్తున్నాం. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగువుతుంది. ఎన్ని విత్తనాలు అవసరమో ఇప్పటికే అంచనా వేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందిస్తాం. నకిలీ విత్తనాలను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నాం. రైతులు మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలి. –శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దుక్కులు దున్నకం, విత్తనాల కొనుగోలులో బిజీ బిజీ ఈసారి ముందే పలకరించనున్న నైరుతితో కర్షకుల్లో హర్షం ఈసారి సాగు అంచనా 6.17 లక్షల ఎకరాలువేరుశనగ 400చెరుకు 60మిర్చి 15,150ఆయిల్పాం 4,000ఇతర పంటలు 150పండ్లు, కూరగాయలు 16,200మొత్తం 6,17,480ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నుల్లో) అవసరం నిల్వయూరియా 60,731 15,680డీఏపీ 14,580 855ఎంఓపీ 9560484కాంప్లెక్స్ 45,247 8,377ఎస్ఎస్పీ 5,275 532పంట ఎకరాలలో వరి 4,85,125పత్తి 91,000మొక్కజొన్న 45కంది 2650పెసర 2700 -
తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాలలు
కోదాడ: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ‘విద్య– వైద్యం ప్రభుత్వం బాధ్యత’ అనే నినాదంలో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఆయన చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రచార జాతా సోమవారం కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా కోదాడ రంగా థియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కారు బడులు నిలబడాలంటే ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు. అంతరాలు లేని చదువు ఉన్నప్పుడే ప్రభుత్వ బడులు మనగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పౌరస్పందన వేదిక కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఏ. మంగ, ధనమూర్తి, బుర్రా పుల్లారెడ్డి, బుర్రా సుధారాణి, వెంకటరమణ. పి. శ్రీనివాస్, నాగేశ్వరరావు, పాండురంగాచారి, ఆంజనేయులు, వెంకటేశ్వరరెడ్డి, బుచ్చయ్య, మోతి లాల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
పల్లెల్లో పారిశుద్ధ్య జోన్లు
పనితీరు మెరుగు.. పంచాయతీల్లో పారిశుద్ధ్య పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య జోన్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గృహాలు, విస్తీర్ణం బట్టి కార్యదర్శులు ప్రతి పంచాయతీలో జోన్లను ఏర్పాటు చేశారు. – కె. యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట●నాగారం : గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం–పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టింది. ఇంటింటికీ చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మురుగు కాలువలు, రహదారుల శుభ్రతను మెరుగుపర్చేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్య పెరిగిపోవడం, సరిపడా కార్మికులు లేక పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని గుర్తించిన ప్రభుత్వం పారిశుద్ధ్య జోన్లను తెరపైకి తెచ్చింది. ప్రతి గ్రామాన్ని నివాస గృహాలు, విస్తీర్ణం, కార్మికుల సంఖ్యను బట్టి పారిశుద్ధ్య జోన్లుగా విభజించారు. చిన్న పంచాయతీలైతే కనిష్టంగా 2 జోన్లు, పెద్ద పంచాయతీలైతే గరిష్టంగా 4 జోన్లను ఏర్పాటు చేశారు. ఈ కొత్త విధానంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సేంద్రియ ఎరువుల తయారీకి..ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలలో సగటున 300 గ్రాముల తడి, పొడి వ్యర్థాలు ఉత్పత్తి అవు తాయని అంచనా వేస్తున్నారు. డంపింగ్ యార్డుల్లో తడిచెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసి నర్సరీల్లో మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయించనున్నారు. పొడి చెత్తను తుక్కు దుకాణ నిర్వాహకులకు విక్రయించి వచ్చిన డబ్బులను జనరల్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీఓ, డీఎల్పీఓ, డీపీఓ స్థాయిలో తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు పల్లెప్రగతి యాప్లో కొత్త ప్రణాళికలను అప్డేట్ చేయనున్నారు. రోజూ వారి నివేదిక యాప్లో నమోదుజిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 1,272 జోన్లను ఏర్పాటు చేశారు. పంచాయతీల్లో జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాప్ను ఏర్పాటు చేయాలి. జోన్ల పరిధిలోని నివాస గృహాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్ల పొడవు, ఖాళీ స్థలాలను మ్యాప్లో ప్రదర్శించాలి. షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి మరుసటిరోజు మరో జోన్ పనులు ప్రారంభించనున్నారు. చక్రీయ పద్ధతి(సైక్లిక్ మెథడ్)లో మళ్లీ అవే జోన్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. రోజూవారీ పారిశుద్ధ్య నివేదిక(డీఎస్ఆర్)ను యాప్లో నమోదు చేయనున్నారు. పంచాయతీల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు ప్రణాళిక గృహాలు, విస్తీర్ణం, కార్మికుల సంఖ్యను బట్టి జోన్ల సంఖ్య చిన్న పంచాయతీల్లో కనిష్టంగా రెండు, మేజర్ పంచాయతీల్లో గరిష్టంగా నాలుగు జోన్ల చొప్పున ఏర్పాటుజిల్లాలో ఇలా.. గ్రామ పంచాయతీలు 486ఏర్పాటు చేసిన జోన్ల సంఖ్య 1,272 -
కొత్త రేషన్కార్డులు1,238 మంజూరు
చిలుకూరు: రేషన్ దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్కార్డులు 1,238 మంజూరయ్యాయి. నూతనంగా 11,752 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాత కార్డుల్లో చేర్చారు. కొత్త కార్డుదారులు వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రేషన్కార్డుల జారీ సరళతరం రేషన్కార్డుల జారీని ప్రభుత్వం సరళతరం చేసింది. దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల వ్యవధిలో కార్డు మంజూరు చేస్తోంది. కుటుంబ సభ్యుల పేర్లు కూడా చక చకా చేర్చుతున్నారు. కార్డు రాలేదని, కుటుంబసభ్యుల పేర్లు చేర్చడం లేదని కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, పాత కార్డుల్లో పేరు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆ పేరు తొలగించుకోవాలి. నిబంధన ప్రకారం అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు జారీ అవుతున్నాయి. కొత్త రేషన్కార్డులు, కుటుంభ సభ్యుల పేర్లను చేర్పించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి వారు అర్హులో కాదో నిర్ణయిస్తారు. రేషన్ దరఖాస్తులకు మోక్షం కొత్తగా చేర్చిన యూనిట్లు 11,752 వచ్చేనెల 1నుంచి కొత్త లబ్ధిదారులకు బియ్యం పంపిణీకొత్తగా మంజూరైన కార్డులు 1238రేషన్షాపులు 610కొత్తగా చేర్చిన యూనిట్ల సంఖ్య 11,752జిల్లాలో ఉన్న మొత్తంకార్డులు 3,26,057మొత్తం యూనిట్లు 9,85,061 -
ప్రశాంతంగా జీపీఓ పరీక్ష
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పాలనాధికారుల (జీపీఓల) నియామకానికి ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పరీక్ష ఎలాంటి ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 194 మంది అభ్యర్థులకు గాను 182 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష సెంటర్ను అదనపు కలెక్టర్ పి.రాంబాబు పరిశీలించారు. ఆయన వెంట చివ్వెంల తహసీల్దార్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, సిబ్బంది ఉన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలిమునగాల: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కోరారు. ఆదివారం మునగాలలో నిర్వహించిన డీవైఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబిల్ స్కోర్ ఆధారంగా యూ నిట్లు మంజూరు చేయాలనే నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పదిహేనేళ్లుగా రాష్ట్రంలో 30లక్షల మందికిపైగా నిరుద్యోగ యువత విద్య, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్, సైదులు, మండల కార్యదర్శి గడ్డం వినోద్, మండల అధ్యక్షుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
కోదాడ మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తాం
కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ను మోడల్ మార్కెట్గా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి ఉత్తమ్ నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రులకు వివరించారు. మార్కెట్లో నిర్వహిస్తున్న పశువుల సంతకు మరోచోట స్థలంతోపాటు మండలానికి ఒక వ్యవసాయ గోదాము నిర్మాణానికి నిధులు కేటాయించాలని, లింక్ రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పాలకవర్గం సభ్యులు కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారని పాలకవర్గం తెలిపింది. మంత్రులను కలిసిన వారిలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏపూరి తిరపతమ్మ, వైస్ చైర్మన్ ఎస్.కె బషీర్, మార్కెట్ కార్యదర్శి రాహుల్, మార్కెట్ డైరెక్టర్లు ఉన్నారు. ఫ మంత్రులు తుమ్మల, ఉత్తమ్ హామీ -
లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : భూ భారతి చట్టం అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తుదారులు స్వీకరించారు. ఎంపికై న వారి మొదటి జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. వీరికి ఈనెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం దిశగా.. భూ సమస్యలు, ఇతర భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్లు సమయంలో భూ నక్ష సమర్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ప్రభుత్వ సర్వేయర్ల కొరత దృష్ట్యా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా ఈనెల 17వ వరకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 519 మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియని అయోమయం అభ్యర్థులను వెంటాడింది. దరఖాస్తు సమయంలోనే నిర్ణీత ఫీజుకు వసూలు చేయడంతో అందరినీ శిక్షణకు ఎంపిక చేయాలని డిమాండ్ వినిపించింది. అయితే తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 257 మందిని శిక్షణకు ఎంపిక చేసిన ప్రభుత్వం మరో విడత మిగతా వారికి శిక్షణ ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించింది. మొదట్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నప్పటికీ తాజాగా జిల్లా కేంద్రంలోని శిక్షణకు ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి లైసెన్న్స్డ్ సర్వేయర్ల మొదటి జాబితా విడుదల కాగా వీరికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 50 రోజుల పాటు ఈ శిక్షణ ఉండనుంది. ఉదయం 10 గంటలకు శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న ఫారాలను తీసుకొని రావాల్సి ఉంది. అయితే మొదటి విడతలో ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత.. రెండో విడతలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆగస్టు మాసంలో శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట విడతలో శిక్షణ పొందిన సర్వేయర్ల సేవలను వినియోగిస్తూనే రెండో విడతలో ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఫ సూర్యాపేటలో నేటి నుంచి ప్రారంభం ఫ ఎస్వీ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి ఫ 50 రోజుల పాటు కార్యక్రమం ఫ తొలి విడతలో 257 మందికి అవకాశం లైసైన్స్డ్ సర్వేయర్లకు వచ్చిన అర్జీలు 519 మొదటి విడత ఎంపికై న వారు 257 శిక్షణ ఇవ్వనున్న రోజులు 50 -
ఒకేసారి.. 3 నెలల బియ్యం
చిలుకూరు: వర్షాకాలం నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు వచ్చేనెలలో ఒకటవ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒకేసారి సరఫరా చేయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో జిల్లాలో పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతినెలా సరఫరా చేసే ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్లు నుంచి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయనుండడంతో సుమారు 1,78,000 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విడతల వారీగా సరఫరా.. జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపులు ఉండగా వాటి పరిధిలో 3.24లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా షాపుల ద్వారా ప్రతినెలా సుమారు 6.50 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి వచ్చే మూడునెలలకు సంబంధించి ఒకేసారి జూన్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వచ్చేనెలలో మొత్తం 1,78,000 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యం తీసుకునేందుకు మూడుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ షాపుల్లో గరిష్టగా 300 క్వింటాళ్ల బియ్యం నిల్వ చేసుకునేందుకే సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేస్తే తగిన స్థలం ఉంటుందో లేదో అని వచ్చేనెలలోనే విడతల వారీగా షాపులకు బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుండడంతో రవాణా సమస్యలు, అధిక చార్జీలకు చెక్ పడనున్నప్పటికీ వాహనాల కొరత తలెత్తనుందని అధికారులు అంటున్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సమస్యలను అధిగమించి రేషన్ షాపులకు విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తాం. లబ్ధిదారులు కూడా మూడు నెలలకు సంబంధించి మూడుసార్లు వేలిముద్రలు వేసి ఒకేసారి బియ్యం తీసుకోవాలి. – మోదుగు శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి డీఎస్ఓ, సూర్యాపేట ఫ జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి వచ్చేనెలలో పంపిణీ ఫ వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం ఫ రేషన్ షాపులకు సరఫరా చేయనున్న 1,78,000 క్వింటాళ్ల బియ్యం ఫ జిల్లాలో 9,85,061 మంది రేషన్ లబ్ధిదారులకు ప్రయోజనంపంపిణీ చేసే బియ్యం వివరాలు ఎంఎల్ఎస్ పాయింట్ క్వింటాళ్లు సూర్యాపేట 54,000 కోదాడ 39,000తుంగుత్తురి 35,000 హుజూర్నగర్ 50,000 -
పాలేరు వాగును సర్వే చేసి హద్దులు గుర్తిస్తాం
ఫ కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ అనంతగిరి: పాలేరు వాగును సర్వేచేసి హద్దులు గుర్తిస్తామని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం శివారులో పాలేరు వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా కొంగర గ్రామానికి చెందిన పలువురు కొత్తగూడెం శివారులోని పాలేరు వాగులో గ్రామ ప్రజలను బెదిరించి చేపలు పట్టుకుంటున్నారని, వాగు హద్దులను గుర్తించాలని ఇటీవల కొత్తగూడెం గ్రామస్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్డీఓ సందర్శించి మాట్లాడారు. వాగు రెండు జిల్లాల సరిహద్దులో ఉండడం వల్ల చేపలు పట్టుకునే విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా కొత్తగూడెం సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాం సమీపంలో ఇటీవల ధ్వంసం చేసిన ఫ్లడ్ గేట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎన్ఎస్పీ ఏఈ శ్రీనివాస్, గ్రామపెద్దలు భూక్యా రవి నాయక్, భూక్యా బాబురావు, తేజవత్ వెంకటేశ్వర్లు, భూక్య సురేష్ నాయక్, బాష్యం సురేష్, బాణోతు వెంకటేశ్వర్లు, మునగ ఉపేందర్, భూక్యా రాజారాం, యడవెల్లి అమ్ములు, చేకూరి వీరబాబు, మాదాల రామారావు, మాదాల నాగరాజు, వంకా సురేష్, మునగ గోపి, నాగరాజు ఉన్నారు. కళాశాలల మూసివేత నిర్ణయం సరికాదుసూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయం సరికా దని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, జిల్లా అధ్యక్షులు బోయిళ్ల అఖిల్, అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
రైతు ప్రయోజనాలే లక్ష్యం
ఫ వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు ఫ పెద్ద ఎత్తున రుణ సదుపాయం, జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు ఫ ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1,100 కోట్లు ఫ గతేడాది కంటే రూ.483 కోట్ల అదనపు రుణాలు ఫ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డిసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తృతం చేశామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు ద్వారా ఇచ్చే రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1917లో ప్రారంభమైన డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గతంలో కంటే రుణ లక్ష్యం పెంపు బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలతోపాటు వ్యవసాయేతర, దీర్ఘకాలిక రుణాలను కూడా ఇస్తున్నాం. గతంలో కంటే ఈసారి రుణాల లక్ష్యాన్ని పెంచాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.483 కోట్లు అదనంగా ఇవ్వబోతున్నాం. 2023–24లో బ్యాంకు ద్వారా అన్ని రకాల రుణాలు రూ.344 కోట్లు ఇవ్వగా, 2024–25లో రూ.783 కోట్లు ఇచ్చాం. అందులో వ్యవసాయ రుణాలు రూ.100 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.181 కోట్లు, వ్యవసాయేతర రుణాలు రూ.206 కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.296 కోట్ల రుణాలను ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో అన్ని రకాల రుణాలను గతంలో కంటే పెంచాం. వ్యవసాయ రుణాలను రూ.150 కోట్లు, దీర్ఘకాలిక రుణాలను రూ.250 కోట్లకు, వ్యవసాయేతర రుణాలను రూ.300 కోట్లకు, బంగారు ఆభరణాలపై రుణాలను రూ.400 కోట్లకు పెంచాం. గతంలో కొత్త సభ్యులకు స్వల్పకాలిక పంట రుణాలను రూ.40 కోట్ల వరకే ఇచ్చే వారు. దానిని గతేడాది రూ.100 కోట్లకు పెంచాం. ఈసారి మరింత పెంచుతాం. మరో 6 కొత్త శాఖలు ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. రైతులకు డ్రోన్ల సహకారం రైతులకు బ్యాంకు సేవలను మరింత విస్తతం చేయబోతున్నాం. డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. బ్యాంకు పరిధిలోని 108 సహకార సంఘాల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. వాటిని ఈ వానాకాలం సీజన్లోనే అందజేస్తాం. బయటి మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతో రైతులు వరి, పత్తి చేలకు పురుగు మందులను పిచికారి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. -
ఫార్మర్ రిజిస్ట్రీ @ 14,221
నెల రోజుల్లో పూర్తిచేస్తాం రైతు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. క్లస్టర్ల వారీగా ఏఈఓలు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేస్తాం. గతంలో ధరణి పోర్టల్లో రైతుల సమాచారం ఉండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమవుతుంది. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఇకనుంచి ఈ ఐడీతోనే అందుతాయి. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట తాళ్లగడ్డ (సూర్యాపేట) : రైతులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డు (యూనిక్ ఐడీ) ఇవ్వాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా జిల్లాలో రైతుల నమోదు కార్యక్రమంపై ఈనెల 5వ తేదీన రెవెన్యూ క్లస్టర్ల వారీగా ఏఈఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఈనెల 13న రైతుల పేర్ల రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను ప్రారంభించగా ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా శనివారం వరకు 14,221 మంది రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో 7,442 మంది రైతుల రిజిస్ట్రేషన్లను కేంద్ర అప్రూవల్ చేసింది. వీరికి ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు చేసి విశిష్ట కార్డులను కేటాయిస్తున్నారు. ఈ ఐడీ ప్రామాణికంగా భవిష్యత్లో రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయనున్నారు. 82 కస్టర్ల పరిధిలో నమోదు ప్రక్రియ జిల్లాలోని 82 రెవెన్యూ క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ.. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అన్నదాతలు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానం చేసిన సెల్నంబర్తో ఏఈఓల వద్దకు వెళ్లి నమోదు చేసుకోసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఓటీపీని రైతు ఏఈఓకు చెబితే నమోదు పూర్తయి సదరు రైతుకు 11 అంకెల యూనిక్ ఐడీ జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు అప్రూవల్ అయిన రైతులకు కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఫ పన్నెండు రోజులుగా కొనసాగుతున్న రైతుల వివరాల నమోదు ప్రక్రియ ఫ ఇప్పటి వరకు అప్రూవల్ అయినవి 7,442 రిజిస్ట్రేషన్లు ఫ ఆధార్ తరహాలో విశిష్ట కార్డులు అందజేత ఫ భవిష్యత్లో రైతు పథకాలన్నింటికీ ఇదే ప్రామాణికం -
యూనిఫామ్ సిద్ధమవుతోంది
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి అందించేందుకు విద్యాశాఖ యూనిఫామ్ సిద్ధం చేయిస్తోంది. ప్రభుత్వం ఏటా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫామ్ అందజేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రతి విద్యార్థికి ఒక్కో జత యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గడిచిన విద్యా సంవత్సరం ముగిసే నాటికే వస్త్రం పంపిణీ చేసింది. గతంలో తరగతులు మొదలైన తర్వాత కూడా దుస్తులు అందించలేదు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా దుస్తుల కుట్టే బాధ్యతను ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మున్సిపాలిటీ పరిధిలో మెప్మా సిబ్బంది, గ్రామాల్లో వీఓఏలు ప్రతి విద్యార్థి కొలతలను సేకరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 50శాతం వరకు కుట్టుపని పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. 49,374 మంది విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు మొత్తం 950 ఉన్నాయి. వీటిలో బాలురు 23,547 మంది విద్యనభ్యసిస్తుండగా బాలికలు 25,827 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక్కో జత చొప్పున 49,374 జతలు కుడుతున్నారు. అయితే ఇప్పటి వరకు 24,579 జతలు పూర్తయ్యాయి. మిగతావి కూడా ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండో జత వస్త్రం కూడా వస్తుందని.. వాటి కుట్టుపని కూడా జూన్ 10వ తేదీలోపు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఒక్కో జతకు రూ.75 కుట్ట్టు కూలి.. విద్యార్థుల యూనిఫామ్ ఒక్కో జత కుట్టు కూలి కింద మహిళా సంఘాల సభ్యులకు రూ.75 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో రూ.50 మాత్రమే ఇవ్వడంతో కూలి గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ప్రభుత్వం గత విద్యాసంవత్సరం రూ.25 పెంచింది. దీంతో ఒక్కో జత రూ.75 ఇస్తున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా కొంత తోడ్పాటుకానుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే అందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫామ్ కూడా అందించేందుకు సన్నద్ధ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కో జత చొప్పున వస్త్రం రాగా కుట్టే పని కూడా 50శాతంపైగా పూర్తయ్యింది. ఈ నెల 31వ తేదీ లోపు మొదటి జత పూర్తి చేయిస్తాం. రెండో జత కూడా త్వరలో వస్తుంది. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిపామ్ అందజేస్తాం. – అశోక్, డీఈఓ, సూర్యాపేట ఫ ఇప్పటికే 50 శాతం కుట్టుపని పూర్తి ఫ మిగతావి 31లోగా పూర్తి చేయాలని అధికారుల ఆదేశం ఫ పాఠశాలలు తెరిచే నాటికి అందించేలా ప్రణాళిక ఫ మొదటి విడతలో ఒక్కో జత పంపిణీకి ఏర్పాట్లు -
సెర్ప్ ఉద్యోగుల బదిలీలు?
నల్లగొండ : పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో బదిలీలకు రంగం సిద్ధమైంది. దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేయడానికి రాష్ట్రస్థాయిలో నిర్ణయం జరిగింది. నిబంధనల ప్రకారం 30 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, వంద శాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎంత మంది, ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలి.. తదితర అంశాలపై శనివారం సెర్ప్ అధికారులు రాష్ట్రస్థాయిలో యూనియన్ నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. -
మెడికల్ మాఫియాను అరికట్టాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలో కొనసాగుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసి, అన్ని వర్గాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేటు యాజమాన్యాలకు విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న డీఎంహెచ్ఓను తొలగించాలన్నారు. అర్హతలు లేకున్నా, తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అఖిల్ కుమార్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, టీయూసీఐ, ఆయా సంఘాల నాయకులు పేర్ల నాగయ్య, ఎస్కే.గులాం, సంతోషి, కట్టా కల్పన, పేర్ల మల్లమ్మ, గుండ గాని రేణుక, ఎస్కే.కరీంబీ, విజయ్రెడ్డి, అంజయ్య, కట్టా రమేష్, పాల్వా యేసు, బొజ్జ ముత్తయ్య, పాల్వాయి అనసూయ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాలు మెరుగుపడేలా..
తాళ్లగడ్డ (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడంతోపాటు పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు, బోధనలో నాణ్యత, సాంకేతికత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలకు అర్థవంతమైన బోధన చేసేలా ఉపాధ్యాయులు నైపుణ్యాభివృద్ధి సాధించేలా ఈ వేసవి సెలవుల్లోనే వృత్యంతర శిక్షణ ఇప్పిస్తోంది. ఉపాధ్యాయుల్లో సామర్థ్య నిర్మాణం మెరుగుపరిచే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లాకేంద్రానికి సమీపంలోని దురాజ్పల్లిలో గల స్వామినారాయణ గురుకుల పాఠశాలలో 84 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీల) సమక్షంలో ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణ శనివారంతో ముగియనుంది. శిక్షణ ఇలా.. జిల్లాలో విడతల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించారు. మొదటి విడతలో కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే ఈ నెల 20 నుంచి సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాలను డీఆర్పీలు తర్ఫీదు ఇచ్చారు. ఈ రెండవ విడత శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. అలాగే మండల స్థాయి ఉపాధ్యాయులకు ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడవ విడతలో హెచ్ఎంలకు నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ ఉండనుంది. నైపుణ్యాభివృద్ధి.. సందేహాల నివృత్తి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్లో ధారాళంగా చదవడం రాయడంతోపాటు చతుర్విద ప్రక్రియల్లో పట్టు సాధించేలా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించారు. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న కృత్రిమ మేధ (ఏఐ) పాఠాలు అందిపుచ్చుకోవడం, విద్యార్థుల హాజరు శాతం పెంపు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడంతో బాటుగా ఆకర్షణీయమైన బోధన మెలకువలు నేర్పించారు. బోధనోపకరణాలు, ఉపాధ్యాయులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణలో భాగంగా పాఠశాల అభివృద్ధికి వచ్చే నిధులను సక్రమంగా, సమర్థవంతంగా ఉపయోగించడం, కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందిస్తూ తరగతులు నిర్వహించేలా పలు రకాల పద్ధతులను వివరించారు. బోధన సామర్థ్యాలు మెరుగు సహజంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారితో మెరుగైన బోధన ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న వృత్యంతర శిక్షణ వల్ల బోధనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. విద్యార్థుల లోపాలను సరిదిద్దుతూ సమర్థవంతంగా బోధించవచ్చు. – గుండు అంజనీకుమార్, ఉపాధ్యాయుడు చాలా విషయాలు నేర్చుకున్నాం.. వృత్యంతర శిక్షణలో చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా సాంకేతిక ప్రమాణాలు పెంపొందించే పలు రకాల పద్ధతులను వివరించాలి. తరగతి గదిలో పిల్లల మానసిక స్థితిని బట్టి ప్రయోగాత్మకంగా బోధిస్తే చదువుపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. – జోగం నరేష్, ఉపాధ్యాయుడు ఫ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాభివృద్ధి.. ఫ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా ఫ ఐదు రోజులుగా టీచర్లకు శిక్షణ ఫ నేటితో ముగియనున్న ప్రక్రియ ఉపాధ్యాయులు4,016ప్రభుత్వ పాఠశాలలు 1,050విద్యార్థులు 1,24,000 -
ఎన్క్వాస్ గుర్తింపు కష్టమే!
నాగారం : పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ఆమ్) ఉప కేంద్రాలు ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్–జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు) గుర్తింపు పొందడానికి నిధుల కొరత ఏర్పడింది. ఆయా కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో కొన్నింటికి ఎన్క్వాస్ గుర్తింపు లభించడం గగనంగా మారింది. అయితే ఎన్క్వాస్ బృందం తనిఖీల సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో మందులు నిల్వ ఉండాలి. మందులకు, వైద్యుడు, ఫార్మాసిస్ట్, ఏఎన్ఎంలకు గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కేంద్రాల్లో అందించే వైద్యసేవలు, వ్యర్థాలు, టీకాల నిర్వహణ, గర్భిణుల గుర్తింపు, మందుల పంపిణీ, కేంద్రం ఆవరణలో పచ్చదనం, జాతీయ పథకాల అమలు తీరుతోపాటు తదితర అంశాలు పక్కాగా ఉండాలి. ఇందుకుగాను ఒక్కో కేంద్రానికి కనీసం రూ.50 వేల నిధులు అవసరం. అయితే ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో జూన్లో ఎన్క్వాస్ బృందం తనిఖీలు చేయనుంది. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు కొన్ని కేంద్రాలను తీర్చిదిద్దలేని దుస్థితి నెలకొంది. 25 కేంద్రాలకు అవకాశం జిల్లాలో 166 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా ప్రస్తుతం 25 కేంద్రాలకు ఎన్క్వాస్ గుర్తింపునకు అనుమతి లభించింది. వీటిలో ఇప్పటివరకు నాలుగు పీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీలు, మరో రెండు ఆయుష్మాన్ మందిర్ (ఆమ్) ఆరోగ్య ఉప కేంద్రాలు ఎన్క్వాస్ గుర్తింపును పొందాయి. మిగతా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉప కేంద్రాలకు ఎన్క్వాస్ గుర్తింపు పొందేలా అన్ని హంగులతో తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రస్తుతం మోతె మండలం బుర్కచర్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని జూన్–3, గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని జూన్–6న తనిఖీలు నిర్వహిస్తామని ఎన్క్వాస్ బృందం నుంచి సమాచారం అందించింది. మిగతా వాటికి అన్ని హంగులతో ఏర్పాట్లు పూర్తిచేశాక తనిఖీలు చేయనుంది. గుర్తింపు పొందితే ప్రయోజనాలివే.. ఎన్క్వాస్ గుర్తింపు పొందితే పీహెచ్సీలకు ఏడాదికి రూ.3లక్షలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉప కేంద్రాలకు రూ.1.25 లక్షలు, యూపీహెచ్సీలకు రూ.2లక్షల చొప్పున మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుంది. అనంతరం గుర్తింపు రెన్యువల్ పొందితే మరో మూడేళ్లు ఈ సా యం అందిస్తారు. కేంద్రం అందించే సాయంలో 75 శాతం నిధులు కేంద్రాల నిర్వహణ, అత్యవసర మందుల కొనుగోళ్లు, తాగునీటి వసతి ఏర్పాటు, పచ్చదనం, పరిశుభ్రత తదితరాలకు వ్యయం చేస్తూ మెరుగైన వైద్యం అందించటానికి ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. మిగతా 25శాతం సిబ్బంది మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ప్రోత్సాహకాలు అందించటానికి వీలు కల్పించారు. ఫ ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు కరువు ఫ నిధుల లేమితో సమకూరని సౌకర్యాలు ఫ 25కు గాను 8 కేంద్రాలకే గుర్తింపు ఫ సందిగ్ధంలో మిగతా కేంద్రాలు ఫ జూన్లో తనిఖీలు ప్రారంభం జిల్లాలోని పీహెచ్సీలు 18అర్బన్ హెల్త్ సెంటర్లు 07బస్తీ దవాఖానాలు 04ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాలు 166 -
పొలాల్లో మట్టి తవ్వి.. రోడ్డు విస్తరణ పనులు !
నేరేడుచర్ల : మంత్రి ఉత్తమ్కుమార్ సొంత నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు పనులను సదరు కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నాడు. నిబంధనలు పాటిస్తే లాభాలు రావనే ఉద్దేశంతో నాణ్యత లేకుండా కల్వర్టులు, రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నాడు. పైగా ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల పొలాల్లో గాతులు తీస్తూ అందులో వెళ్లిన మట్టితో రోడ్డు విస్తరణ పనులు చేయిస్తున్నాడు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు నేరేడుచర్ల నుంచి వయా పత్తెపురం పెన్పహాడ్ మండలం దూపాడుకు వరకు దాదాపు 14 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను సూర్యాపేట పట్టణానికి చెందిన ఎస్కేఆర్ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దీంతో గతకొన్ని రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఇంత వరకు బాగనే ఉన్నా.. సదరు కాంట్రాక్టర్లు రోడ్డు విస్తరణ చేయాలంటే ఆ రోడ్డుకు మట్టిపోసి వెడల్పు చేయాల్సి ఉంటుంది. అయితే మట్టిని వేరే ప్రాంతాల నుంచి ప్రభుత్వం అనుమతితో తీసుకురావాలి కానీ దూరం వెళితే అధిక ఖర్చు అవుతుందని, ఎలాంటి లాభం ఉండదనే ఉద్దేశంతో రైతుల అనుముతుల తీసుకోకుండానే రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లతో 5 నుంచి 6 ఫీట్ల లోతు గాతులను తవ్వి మట్టిని రోడ్డుకు పోస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు మూడు కిలోమీటర పరిధిలోనే దాదాపు 40 మంది రైతుల పంటపొలాల్లో గాతులు తవ్వి ఆ మట్టిని రోడ్డు విస్తరణకు వినియోగిస్తున్నాడు. మా పంట పొలాల్లో ఎందుకు మట్టి తీస్తున్నావని ప్రశ్నిస్తే వారితో ఘర్షణ పడుతూ మీ దిక్కు ఉన్న చోట చెప్పుకొమ్మని బెదిరిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి నియోజకవర్గంలోనే రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని రైతులు కంటతడి పెడుతున్నారు. అయితే ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్ మట్టి కావాలంటే తప్పనిసరిగా రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సెస్ చెల్లించి మట్టిని తోలేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెస్ కట్టకుండానే కాంట్రాక్టర్ ప్రభుత్వ పని అని చెబుతూ ఎక్కడ మట్టి కనిపిస్తే ఆ మట్టిని టిప్పర్ల ద్వారా తీసుకెళ్తాన్నాడు. ఈ తవ్వకాలను నిలుపుదల చేయాలనే చూసే రెవవెన్యూ అఽధికారులను సైతం బెదిరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఫ నేరేడుచర్ల– దూపాడు రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్వాకం ఫ ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ స్థలమంటూ బెదిరింపులు ఫ గగ్గోలు పెడుతున్న నేరేడుచర్ల మండల రైతులు -
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు
సూర్యాపేటటౌన్ : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని జిల్లా ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని పేర్కొన్నారు. సంబంధిత అధికారులంతా సమన్వయంగా పనిచేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నిర్మూలనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉందని, ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ కగార్ను ఆపాలిసూర్యాపేట అర్బన్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్పై ప్రధాని, హోంమంత్రి హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి పూజలుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమం అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ వేడుక జరిపి నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం కృష్ణమ్మ తల్లికి ప్రహ్లాద్ఘాట్లో అర్చకులు హార తిపూజలు చేశారు. 30న తలనీలాలకు బహిరంగ వేలం మట్టపల్లి క్షేత్రంలో భక్తులు సమర్పించే తలనీలాల సేకరణకు ఈనెల 30న ఆలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్ తెలిపారు. ఏడాది కాలం తలనీలాల సేకరణకు నిర్వహించే ఈ వేలంకు రూ.4లక్షలు డిపాజిట్గా చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి గరిడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ అశోక్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదు రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచుకొని పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఛత్రునాయక్, ఎంఆర్పీలు ఆర్.రాంబాబు, సైదులు, రవీందర్, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, రాంబాబు, సీఆర్పీలు రామకృష్ణ, అశోక్, రాములు పాల్గొన్నారు. -
పెరుగుతున్న మూసీ ప్రాజెక్టు నీటి మట్టం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 636.50 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు మూసీలోకి గురువారం 540 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాంత్రానికి 636.50 అడుగులకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి పడిపోగా, గత 50 రోజుల్లో దాదాపు 15 అడుగుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవి కాలంలోనే ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 636.50 అడుగులకు చేరిన నీరు -
నేను హెల్మెట్ ధరించి ఉంటే మీతో ఉండేవాన్ని..
చిట్యాల: హెల్మెట్ ధరించకపోవటంతో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. అతడి దశదినకర్మ రోజున కుటుంబ సభ్యులు రూపొందించిన పోస్టర్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అజయ్కుమార్గౌడ్(26) ఓ ఫార్మసీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ నెల 18న అజయ్కుమార్గౌడ్ బైక్పై వలిగొండలో వివాహానికి హాజరై రాత్రి సమయంలో తిరుగు పయనమయ్యాడు. వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోకి రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కాల్వలో పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం నిర్వహించిన అజయ్కుమార్గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో.. ‘నేను హెల్మెట్ ధరించి ఉంటే ఈ రోజు మీ అందరితో కలిసి ఉండేవాడిని.. బైక్ నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలి’ అంటూ అజయ్కుమార్గౌడ్ మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు గ్రామంలోని రెండు చోట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు. -
ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్రెడిట్స్ తగ్గింపు సరికాదు
రామగిరి(నల్లగొండ): రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్కు కేటాయించిన 20 క్రెడిట్స్ను 12కు తగ్గించాలనే ప్రతిపాదన సరికాదని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి విరమించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) ఇంగ్లిష్ విభాగం అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంజీయూ ఇంగ్లిష్ విభాగం అధిపతి అరుణప్రియ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ అధ్యాపకులతో అత్యవసర సమావేశం నిర్వహించి, ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చేసిన తీర్మానాన్ని ఎంజీయూ వైస్ చాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్, డీన్ కె. అంజిరెడ్డికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రెడిట్స్ తగ్గించే నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంగ్లిష్ భాష ప్రాధాన్యతను గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యత తగ్గించేలా ఉన్నత విద్యామండలి ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. ఒకవైపు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ డిగ్రీ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్పిస్తామంటూ, మరోపక్క ఇంగ్లిష్కు ప్రాధాన్యత తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఇంగ్లిష్ అధ్యాపకులు ఈ. రాంరెడ్డి, చైతన్య, సుధ, చిలుముల సుధాకర్, హరికృష్ణ, వెంకట్, ప్రభాకర్, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట.. పైరుకు బలం
గుర్రంపోడు: వచ్చే వానాకాలం సీజన్లో ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగను పొలాల్లో సాగు చేసుకుని భూమిలో కర్బన సేంద్రియం పెంచుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు ఆయన మాటల్లోనే.. ● పచ్చిరొట్ట సాగుకు ఇదే అనువైన సమయం సాధారణంగా వానాకాలం తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుని పూత దశలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువులా పనిచేసి ప్రధాన పంటకు బలానిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు శాతం పైగా సేంద్రియ కర్బనం ఉండగా, మన దేశంలో ఒక్క శాతానికి మించి ఉండటం లేదు. ఏదో ఒక రకంగా భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకోవాలి. మే రెండో పక్షం నుంచి నుంచి జులై రెండో పక్షం వరకు రైతులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పంటలు సాగు చేసుకుంటే ఎకరాకు పది టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఈ పంటలు పూత దశలో నేలలో కలియదున్నడం ద్వారా ఎకరాకు 25 నుంచి 35 కిలోల నత్రజని, ఐదు కిలోల పొటాష్ లభ్యమవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు జనుము, జీలుగ సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ రాయితీపై జనుము, జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై 30 కిలోల బస్తా రూ.2137కు, జనుము 40 కేజీల బస్తా రూ.2510కు పంపిణీ చేస్తోంది. ● మాగాణుల్లో..మాగాణి భూములు జీలుగ సాగు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. దుక్కిని బాగా దున్నుకుని ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలు వేసుకోవాలి. పూత దశలో కలియదన్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వరి నాటు వేసే నాటికి జీలుగ కలియదున్నడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 45 రోజులు మించకుండా జీలుగను నీళ్లు పెట్టి కలియదున్నాలి.పండ్ల తోటల్లో ..పండ్ల తోటల్లో జనుము పంట సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పండ్ల మొక్కలు కాపునకు వచ్చేంత వరకు అంతరంగా జనుమును సాగు చేసి పూత వచ్చే సమయంలో కలియదున్నాలి. ఎకరాకు 15 కిలోల జనుము విత్తనాలు సరిపోతాయి. పండ్ల తోటలు ఏపుగా ఎదగడానికి పచ్చిరొట్ట ఎరువు ఎంతగానో దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పండ్ల మొక్కలు తెగుళ్ల బారిన పడకుంగా ఉంటాయి. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని పచ్చిరొట్ట ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చు. పండ్ల తోటల్లో జనుము సాగు వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. పచ్చిరొట్టను పండ్ల తోటల పాదుల్లో వేసి మట్టితో కప్పి వేయాలి. పచ్చిరొట్ట ఎరువుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్ట్
ఆత్మకూరు (ఎస్): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరపర్చారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరి గ్రామానికి చెందిన రావుల నరేష్ ప్రేయసికి అదే గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య లేనిపోని మాటలు చెప్పడంతో ఆమె నరేష్ దూరం పెడుతూ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ తన చావుకు కారింగుల లింగయ్యే కారణమని సెల్ఫీ వీడియో తీసి గత నెల 27న మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో పురుగుల మందు తాగాడు. అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అదే నెల 28వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై సిరోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. ఈ నెల 14న కేసును ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ దర్యాప్తు చేసి నరేష్ ఆత్మహత్యకు కారణమైన కారింగుల లింగయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సీఐకి ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ సహకరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యనార్కట్పల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం నార్కట్పల్లి మండలంలోని గోపలాయపల్లి వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో జరిగింది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలం చౌటబావి గ్రామానికి చెందిన ఏనాల వెంకట్రెడ్డి(36) చిట్యాలలో క్రేన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు గోపలాయపల్లి వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో పురుగుల మందు తాగి తన తమ్ముడికి ఫోన్ చేశాడు. తన పిల్లలను మంచిగా చూసుకో అని చెప్పి.. గోపలాయపల్లి గుట్టపై తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానంటూ తమ్ముడికి చెప్పాడు. వెంటనే వెంకట్రెడ్డి సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
బీబీనగర్ ఎయిమ్స్లో సాంకేతిక సమస్యలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు వైద్య కోసం వచ్చిన రోగులు గురువారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలోని కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పేషెంట్లు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వేచి ఉండక తప్పలేదు, స్థానికులు క్యూలైన్లో నిలిబడలేక తిరిగి వెళ్లిపోయారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొని రోగులకు సకాలంలో ఓపీ రిజిస్ట్రేషన్ జరిగేలా ఎయిమ్స్ అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పనిచేయని కంప్యూటర్లు ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద రోగుల ఇబ్బందులు -
లింగ నిర్ధారణ పరీక్షల కలకలం
నకిరేకల్: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా కొందరు డబ్బులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా నకిరేకల్ పట్టణంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్లోని ఓ స్కానింగ్ సెంటర్లో ఇటీవల లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకున్న మహిళ ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుని తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఈ బాగోతం బయటపడడంతో సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు తన ఇంటికి తాళం వేసి పరార్ కావడం నకిరేకల్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన అనూష నకిరేకల్లోని ఓ స్కానింగ్ సెంటర్ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. తనకు అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా స్కానింగ్లో ఆడశిశువు అనే తెలియడంతో మూడు రోజుల క్రితం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. తీవ్ర రక్తస్తావం కావడంతో ఆమె మృతిచెందింది. ఈ విషయం బయటకు పొక్కడంతో అనూష భర్త నగేష్.. తన భార్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబార్షన్ చేసిన ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు గురువారం నకిరేకల్ సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి నకిరేకల్లోని సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. చాలాకాలంగా కొనసాగుతున్న దందా.. నకిరేకల్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి గతంలో తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి భార్య లింగ నిర్ధారణ పరీక్షలపై మంచి అవగాహన పెంచుకుంది. స్కానింగ్ సమాచారం గర్భిణులకు తెలిపి వారి నుంచి సొమ్ము తీసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ వారిద్దరిని బయటకు పంపించారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదై కాగా.. సదరు వ్యక్తి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక తన ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. వీరికి దాదాపు 5 నుంచి 8 మంది ఏజెంట్లు ఉన్నట్లు తెలిసింది. నెలకు 15 నుంచి 20 రోజుల పాటు గుట్టుచప్పుడు కాకుండా స్కానింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు 10 నుంచి 15 మంది వరకు గర్భిణులకు పరీక్షలు చేసి ఒక్కొక్కరి నుంచి తమ ఏజెంట్ల ద్వారా రూ.35 వేలకు బేరం కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన భార్యతో స్కానింగ్ చేయించి అదే రూమ్లో దేవుళ్ల ఫొటోలు చూపించి కోడ్ రూపంలో గర్భవతి వెంట వచ్చిన బంధువులకు తెలియజేస్తారు. నకిరేకల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళ మృతితో వెలుగుచూసిన దందా -
మిర్యాలగూడలో చిరు వ్యాపారుల రాస్తారోకో
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో తోపుడు బండ్లను తొలగించడంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం చిరు వ్యాపారుల జడ్చర్ల–కోదాడ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పండ్లను హైవేపై పోసి సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించారు. చిరు వ్యాపారులు మాత్రం ఎమ్మెల్యే, కమిషనర్ రావాలంటూ నినాదాలు చేశారు. మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు మోతీరాం, జె. సోమనర్సయ్య, పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు రాంబాబు, సైదిరెడ్డి, మల్లికంటి లక్ష్మయ్య, ఏఎస్ఐ చంద్రయ్య బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ డీఈఈ వెంకన్న వారికి నచ్చజెప్పినా రాస్తారోకో విరమించలేదు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. తాము చాలా ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, రోడ్డు పక్కన పెట్టుకున్న తోపుడు బండ్లను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆందోళనను విరమించేదిలేదన్నారు. కనీసం ఫుట్పాత్ పైన అయినా బండ్లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. మాజీ కౌన్సిలర్లు జావీద్, ఆలగడప గిరిధర్, జానీ వచ్చి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో ఆందోళన విరమించారు. తోపుడు బండ్లు తొలగించడంతో కోదాడ–జడ్చర్ల హైవేపై ఆందోళన -
ఫ విశేషాలంకరణలో భక్తాంజనేయస్వామి
అదనపు ఎస్పీగా రవీందర్రెడ్డిసూర్యాపేటటౌన్ : హైదరాబాద్ సీసీఎస్లో అడిషనల్ డీసీపీగా పని చేస్తున్న యు.రవీందర్రెడ్డిని సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎం.నాగేశ్వర్రావును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలిభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్నకుమార్ గురువారం రాత్రి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు.మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాభిషేకం, అష్టోత్తర, సహస్ర నామార్చనలు, అమ్మవార్లకు సహస్రకుంకుమార్చనలు చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. నీరాజన మంత్ర పుష్పాలతోమహానివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయా చార్యులు, వంశీక్రిష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. అర్హతలేని డాక్టర్లపై కేసు నమోదు చేయాలిసూర్యాపేట అర్బన్: వచ్చీరాని వైద్యంతో ప్రాణాలు హరిస్తున్న అర్హత లేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది మారపాక వెంకన్న గురువారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు అని, వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టం జోక్యం చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. విలువైన ప్రాణాలు అర్హత లేని డాక్టర్ల చేతిలో గాలిలో కలుస్తుంటే సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
25వరకు లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈనెల 25 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్ యువ వికాస పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరీలవారీగా రిజర్వేషన్ నిష్పత్తిని అనుసరించి మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయికి లబ్ధిదారుల జాబితాను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డిప్యూటీ సీఈఓ శిరీష, మెప్మా పీడీ రేణుక, మత్స్యశాఖ అధికారి నాగయ్య, డిడబ్ల్యూ ఓ నరసింహారావు, డీటీడీఓ శంకర్, మైనార్టీ అధికారి జగదీష్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి, సర్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంవీఐ ఆదిత్య, ఆడిట్ అధికారి శ్యామ్ సుందర్ ప్రసాద్ పాల్గొన్నారు. బ్యాంకర్లు లక్ష్యాలు సాధించాలిబ్యాంకర్లు వారికి ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 4వ త్రైమాసికంలో సాధించిన లక్ష్యాలను ఎల్డీఎం బాపూజీ వివరించారు. వ్యవసాయ రుణాల్లో గడిచిన 2024–25 సంవత్సరంలో రూ.2242.48 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే రూ.4305.51 కోట్లు లక్ష్యం పూర్తి చేసి 146.32 శాతం వృద్ధి సాధించామన్నారు. అనంతరం 2025–26 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం గోమతి, నాబార్డ్ డీడీఎం రవీంద్ర నాయక్, ఎస్బీఐ ఏజీఎం అనిల్ కుమార్, అన్నిబ్యాంకుల అధికారులు, జిల్లా అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2,89,063 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 2,89,063 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మరో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, సివిల్ సప్లయ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
‘సఫాయిమిత్ర సురక్ష’ మరింత పటిష్టం
సూర్యాపేట అర్బన్: పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యపరిరక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడటానికి వీలుంటుందని భావిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా అనేకమంది పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సఫాయి సురక్షను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విధిగా వైద్యశిబిరాల నిర్వహణతోపాటు ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందజేయాలని సూచించింది. కార్మికులకు ప్రయోజనం కలిగేలా..సూర్యాపేట జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్ల ఉన్నాయి. వీటిలో 549 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు నిత్యం రోడ్లు ఊడ్చడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, చెత్త కుప్పలు ఎత్తడం లాంటి పనులు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూంపొందించారు. పీఎఫ్, ఈఎస్ ఐ సక్రమంగా వర్తింపజేసేలా శ్రద్ధ చూపాలని నిర్ణయించారు. వీరి కోసం గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆరోగ్య సంరక్షణ లాంటి సదుపాయాలు అందేలా చూడాలనుకున్నా ఎక్కడా అమలు కాలేదు. ఆ సౌకర్యాలను అందించేలా చూడాలని మరొకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించింది. తీవ్ర అనారోగ్యం ఉంటే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సమీపంలోని ఆసుపత్రులను సంప్రదించి వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో..స్థానిక వైద్యశాఖ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో శిబిరాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సాధారణ వైద్యం అందించే వీలుంటే ఇక్కడే చికిత్స చేయనున్నారు. వ్యాధి పరిమాణం ఎక్కువైతే రాష్ట్ర రాజధానికి తరలించనున్నారు.ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన పారిశుద్ధ్య కార్మికులకు వేసవిలో వచ్చే ఎండలతో వానాకాలంలో వచ్చే వర్షంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య రక్షణ కిట్లు ఇవ్వనున్నారు. చేతికి గ్లౌజులు, కాళ్లకు పొడవాటి బూట్లు, తల రక్షణకు హెల్మెట్ పంపిణీ చేయనున్నారు. అంటువ్యాధులను అరికట్టడానికి తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి విధిగా వైద్య శిబిరాల నిర్వహణకు ఆదేశం ఆరోగ్య పరిరక్షణ కిట్లు పంపిణీ చేయాలని సూచనమున్సిపాలిటీ పారిశుద్ధ్యకార్మికులు సూర్యాపేట 303 కోదాడ 176తిరుమలగిరి 63హుజూర్నగర్ 42నేరేడుచర్ల 28ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలకు ఒకసారి స్థానిక వైద్యులతో వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్లో పరీక్షలు చేయించాం. జూన్ రెండో వారంలో మళ్లీ చేయిస్తాం. సఫాయిమిత్ర సురక్ష అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నాం. – మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ -
వైద్యం మాఫియాపై నేడు చర్చా వేదిక
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యం మాఫియా ఆగడాలు, అధికారుల అలసత్వం నేపథ్యంలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానికంగా ‘సూర్యాపేట వైద్య రంగానికి ఏం రోగం వచ్చింది’ అనే పేరుతో చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం శాస్త్రోక్తంగా నిత్యపూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలు వుదీరిన స్వయంభూలను, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శనహోమం, నిత్యకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో వైభవంగా చేపట్టారు. అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి,అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు చేపట్టారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
తొలిరోజు 2,819మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,819 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించారు. మొత్తం 2,312 మంది విద్యార్థులకు 198 మంది గైర్హాజరు కాగా 2,114 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించారు. మొత్తం 765 మంది విద్యార్థులకు 60 మంది గైర్హాజరు కాగా 705 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. అదనపు కలెక్టర్ తనిఖీఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం -
కుమారి సేవలు మరువలేనివి
మునగాల: మునగాల మండలం కొక్కిరేణికి చెందిన ములకలపల్లి కుమారి చేసిన సేవలు మరువలేనివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొక్కిరేణికి చెందిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు సతీమణి కుమారి(48) అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. బుధవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో వారు పాల్గొని మాట్లాడారు. తొలుత కుమారి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాములు పార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎంతో ఓర్పుతో ఉంటూ అన్ని విధాల సహాయసహాకారాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతరాములు,ి జి.నరసింహారావు, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, ఎండి. జహంగీర్, వ్యవసాయ కార్మికసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, తప్పెట స్కైలాబ్బాబు, అర్.వెంకటరాములు ప్రసాద్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డబ్బికారు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, కోట రమేష్, పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, నాగారపు పాండు, కోట గోపి, మట్టిపెల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, బొప్పన పద్మ, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వట్టెపు సైదులు, మిట్టగణుపులు ముత్యాలు, షేక్ సైదా, దేవరం వెంకటరెడ్డి, బుర్రి శ్రీరాములు, నందిగామ సైదులు, రావులపెంట వెంకన్న, శంభయ్య పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో ఇక్కడ పని చేసిన డీఎస్పీ పార్థసారధి అరెస్టు అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో సైబరాబాద్ ఏసీపీగా పని చేస్తున్న ప్రసన్నకుమార్ ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించి డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,600 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్కు ఒక సీఎస్, డీఓలను నియమించారు. జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలు, కోదాడలో ఐదు , హుజుర్నగర్లో రెండు, తుంగతుర్తిలో రెండు, మఠంపల్లి, నేరేడుచర్ల తిరుమలగిరి, నడిగూడెంలో ఒక్కొక్క పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది.ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. ట్రాక్టర్ల కిరాయిలు చెల్లిస్తాం అర్వపల్లి: కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేస్తే కిరాయిలను చెల్లిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అర్వపల్లి, రామన్నగూడెంలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో ట్రాక్టర్కు కిరాయి రూ.300 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. వర్షాలు పడుతున్నందున కాంటాలైన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపాలన్నారు. లారీల కొరత కూడా తీరనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్లు రామరాజు జలేంధర్రావు, పాటి వెంకట్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అశోక్ పాల్గొన్నారు. రెండు ఆసుపత్రుల అనుమతులు రద్దుసూర్యాపేటటౌన్ : చట్ట విరుద్ధంగా వైద్యం నిర్వహిస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీకృష్ణ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను బుధవారం రద్దు చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలలో చట్టవిరుద్ధంగా వైద్యం నిర్వహిస్తుండటంతో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్యం బృందం తనిఖీలు నిర్వహించి, నివేదికను కలెక్టర్కు సమర్పించామని పేర్కొన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీకృష్ణ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను ఎంక్వయిరీ కమిటీ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు. క్రీడాప్రాంగణాల అభివృద్ధికి కలెక్టర్కు నివేదికనూతనకల్: జిల్లాలో క్రీడాప్రాంగణాల అభివృద్ధికి, నిధుల సమీకరణకు కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రామచందర్రావు వెల్లడించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మినీ స్టేడియాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ఇక నుంచి క్రీడలు తప్పా ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించకూడదని ఆయన ఆదేశించారు. క్రీడా ప్రాంగణాన్ని భద్రత కోసం పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఆర్ఐ కర్ణాకర్రెడ్డి పాల్గొన్నారు. -
71 వేల ఎకరాలకు సాగునీరు
హుజూర్నగర్, మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలో కృష్ణానదిపై ఏర్పాటు చేసే మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా వివిధ మండలాల్లోని దాదాపు 71 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం చింతలపాలెం పరిధిలోని అంజలి సిమెంట్ పరిశ్రమ ఆడిటోరియంలో మండలంలోని రాజీవ్గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఈమూడు లిఫ్ట్ల ద్వారా దాదాపు 71వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంభందించి భూ సేకరణను జూలై నాటికి పూర్తి చేసి పరిహారం చెల్లించాలని దేశించారు. 2008లో నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి సాగునీరు అందజేశామని , 2018 నుంచి దీనికి మరమ్మతులు చేయించక పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. మళ్లీ మన ప్రభుత్వ హయాంలో రూ 37.70 కోట్లతో చేపట్టిన నక్కగూడెం లిఫ్టు పునరుద్ధరణ పనులను 2025నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా నక్కగూడెం, చింత్రియాల, కిష్టాపురం, తమ్మారం గ్రామాల్లో 3200 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. రూ 1,450 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం పనులు 2026 ఆగస్టునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా మఠంపల్లి మండలంలో 20,500 ఎకరాలు, మేళ్లచెరువులో 15,800 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16,700 ఎకరాలు సాగులోకి తీసుకొస్తామన్నారు. రూ. 394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా మేళ్లచెరువు, కోదాడ, హుజూర్ నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల్లోని 12 గ్రామాలలో 14,100 ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. 2026 మే నాటికి ఈలిఫ్ట్ను పూర్తి చేయాలన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, ఎస్ఈ శివధర్మతేజ, ఆర్డీఓ శ్రీనివాసులు, ఈఈలు సత్యనారాయణ, రామకిషోర్, డీఈలు స్వామి, ఆనంద్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ భూపాల్ రెడ్డి, ఏఈ కానుగ శ్రీనివాస్, జీవన్కుమార్, దుర్గయ్య, శ్రీనివాస్, నాగార్జున పాల్గొన్నారు. ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ రాజీవ్గాంధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలపై సమీక్ష -
పెరిగిన వినియోగం.. అందని గృహజ్యోతి
పొదుపు అత్యంత కీలకం.. విద్యుత్ వాడకం విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వృథాను అరికట్టాలి. పొదుపు అత్యంత కీలకం. ఇంటిలో మనుషులు ఏ గదిలో అవసరం ఉంటే ఆ గదిలోనే లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు వినియోగించాలి. గృహజ్యోతి లబ్ధిదారులు మరింత పొదుపు పాటించాలి. వీరు 200 యూనిట్లకు మించి విద్యుత్ను వాడితే బిల్లు భారం భరించాల్సిందే. –శ్రీనివాస్, విద్యుత్శాఖ డీఈఈ, సూర్యాపేట. నాగారం : భానుడి ప్రతాపంతో ప్రజలతోపాటు పశుపక్ష్యాదులు విలవిలలాడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లను వదిలి బయటకు వస్తున్నారు. ఉపశమనం కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా గృహజ్యోతికి పలువురు దూరమయ్యారు. అమాంతం పెరిగిన వినియోగం జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి గృహజ్యోతి లబ్ధిదారులు 1,78,950 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు చేసుకుని సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల నుంచి ఆమోదం పొంది మార్చిలో 168 మంది, ఏప్రిల్లో 113 మంది అర్హులుగా ఎంపికయ్యారు. 200 యూనిట్లలోపు వినియోగించే వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ వినియోగించినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. పరిమితికి మించి వాడకంతో.. ఎండల తీవ్రత అధికంకావడంతో ఇళ్లలో ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. కొందరు ఏసీలు కూడా వాడుతున్నారు. పరిమితికి మించి వాడకంతో మార్చిలో 2,138 మంది, ఏప్రిల్లో 6,228 మంది గృహజ్యోతి పథకానికి అర్హత కోల్పోయారు. అలాగే మే నెలలో మాత్రం ఈ సంఖ్య భారీగా పెరగడంతో 10,225 మంది అనర్హులయ్యారు. మూడు నెలల్లో మొత్తం 18,591 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తించలేదు. ఫ వేసవిలో పెరిగిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలవాడకం ఫ 200యూనిట్లు దాటిన మీటర్ రీడింగ్ ఫ పథకానికి మూడునెలల్లో 18,591మంది దూరం ఫ విద్యుత్ పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు జిల్లాలో గృహజ్యోతి పథకం వివరాలు నెల మొత్తం అర్హులు పథకానికి దూరమైనవారు మార్చి 1,78,950 1,76,812 2138 ఏప్రిల్ 1,79,118 1,72,890 6228 మే 1,79,231 1,69,006 10,225 -
దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్గాంధీ
హుజూర్నగర్ : దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువ లేనివని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్ కుమార్ దేశ్ముఖ్, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య, అజీజ్పాషా, జేఎస్, అమర్నాధ్ రెడ్డి, మజీద్, మన్సూర్అలీ, మహేష్, యోహాన్, ఐల వెంకన్న పాల్గొన్నారు. -
జనార్దన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
సూర్యాపేట : జలగం జనార్దన్ (జన్ను) సార్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు చేస్తామని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. జలగం జనార్దన్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డులోగల చంద్ర పుల్లారెడ్డి నగర్లో ఆయన విగ్రహాన్ని నర్సయ్య ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ జన్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశంలో మోదీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ రాజ్యహింసను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను, వారితోపాటు అమాయక గిరిజనులను పిట్టల్లా కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. శాంతి చర్చలు చేద్దామని మేధావులు అన్ని రాజకీయ వర్గాలు ముందుకు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తోందన్నారు. ఎన్కౌంటర్లు ఆపి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగన్న, గొడ్డలి నరసన్న, వాసా పల్లయ్య, పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, ఉపాధ్యక్షురాలు సంతోషి, ఐతరాజు పద్మ, సయ్యద్ , సయ్యద్ హుస్సేన్, వీరబాబు కట్టా రమేష్ గొడ్డలి లింగన్న పాల్గొన్నారు. ఫ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య -
మొండికేస్తున్న మిల్లర్లు
జాజిరెడ్డిగూడెం మండలంలోని ఐకేపీ సెంటర్కు చెందిన ధాన్యం 20 రోజుల క్రితం కోదాడలోని ధనలక్ష్మి రైస్ మిల్లుకు వచ్చింది. మూడు రోజులు ధాన్యం దిగుమతి చేసుకోలేదు. అనంతరం ధాన్యం నాణ్యత లేదని తాము దిగుమతి చేసుకోబోమని చెప్పడంతో ఆ లారీని అక్కడి నుంచి చిలుకూరు మండలం బేతవోలుకు పంపారు. అక్కడ కూడా ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైతులను వెళ్లి మాట్లాడుకోవాలని చెప్పారు. అక్కడి నుంచి రైతులు వచ్చి మిల్లర్తో మాట్లాడారు. క్వింటాకు 4 కేజీలు తరుగు తీస్తామని దానికి ఒప్పుకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్ చెప్పడంతో రైతులు అంగీకరించారు. అప్పుడు ధాన్యం దిగుమతి చేసుకున్నారు. ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లపైనే అదనపు భారం కోదాడ డివిజన్లో ఉన్న 10 మిల్లులు అధికారులు చెప్పిన టార్గెట్ మేరకు ధాన్యం దిగుమతి చేసుకున్నారు. మిగిలిన 12 మిల్లులు ఇచ్చిన టార్గెట్లో 50 శాతం ధాన్యం కూడా దిగుమతి చేసుకోకపోవడంతో టార్గెట్ పూర్తి చేసిన తమనే అదనంగా ధాన్యం తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు అంటున్నారు. హుజూర్నగర్ డివిజన్లో 18 మిల్లులు ఉండగా ఐదు మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టిన అధికారులు మిగిలిన 13 మిల్లుల్లో 7 మిల్లులు టార్గెట్ పూర్తి చేశాయి. తమ మిల్లుల వద్ద ధాన్యం నిలువ చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని చెప్పినా అధికారులు వినకుండా తమకే అధికంగా ధాన్యం కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మిగిలిన 6 మిల్లులు 50శాతం మాత్రమే టార్గెట్ పూర్తి చేశాయని వాటికి ధాన్యం కేటాయించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని టార్గెట్ పూర్తి చేసిన మిల్లర్లు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు పూర్తి అయిన ధాన్యం నిలువ ఉంటే ఉన్నతాధికారులు ఊరుకోవడం లేదని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అదనంగా ధాన్యం కేటాయించక తప్పడం లేదని అధికారులు అంటున్నారు. దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న మిల్లులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అదితమ చేతిలో పని కాదని కిందిస్థాయి అధికారులు అంటున్నారు. సీఎంఆర్ ధాన్యం తీసుకోవడానికి కొర్రీలుఫ సన్నరకాల నుంచి నూక ఎక్కువగా వస్తుందని నిరాకరణ ఫ టార్గెట్ పూర్తిచేసిన మిల్లర్లకే అదనంగా ధాన్యం కేటాయిస్తున్న అధికారులు ఫ ఐకేపీ, పీఏసీఎస్ లోడ్ అంటేనే హడలిపోతున్న లారీ డ్రైవర్లు -
కష్టజీవుల రాజ్యం వస్తేనే సుందరయ్యకు నివాళి
నేరేడుచర్ల: కష్టజీవుల రాజ్యం వస్తేనే కమ్యూనిస్టు ఉద్యమనేత, బడుగుల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో సిరికొండ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో కోలాట దళంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అనంత ప్రకాశ్, నీలా రాంమ్మూర్తి, మర్రి నాగేశ్వర్రావు, శ్రీధర్, నాగ సైదులు, ధనుంజయ, సత్యం, మట్టయ్య, శ్రీను, హుస్సెన్, కోటయ్య, మట్టేష్, శ్రీను తదితరులున్నారు. -
లారీల కొరతలేకుండా చేస్తాం
అర్వపల్లి: ధాన్యం తరలింపునకు రెండు రోజుల్లో లారీల కొరత లేకుండా చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, తిమ్మాపురం, అడివెంల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆపరేటర్లు రైతుల వివరాలను వెంటనే ట్యాబ్లలో నమోదుచేసి, సకాలంలో బిల్లులు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్ పాటి వెంకట్రెడ్డి, కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నిఖిల్రెడ్డికి 11వ ర్యాంకు
మిర్యాలగూడ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ నిఖిల్రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించాడు. నిఖిల్రెడ్డి మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ శ్రీనివాస్రెడ్డి– సునంద దంపతుల కుమారుడు. నిఖిల్రెడ్డి తల్లి సునంద పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండగా, తండ్రి చాడ శ్రీనివాస్రెడ్డి వేములపల్లి మండల ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్నారు. నిఖిల్రెడ్డి ప్రాథమిక విద్యను మిర్యాలగూడలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్మీడియట్ విజయవాడ సమీపంలో గూడవలిల్లో చదివారు. ఐఐటీలో 91వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2019–20లో ఆడోబ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు. యూపీఎస్పీ పరీక్షలకు ఐదుసార్లు హాజరై ఐదవసారి ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఎంపికై న చాడ నిఖిల్రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ప్రతి సంవత్సరం విద్యా శాఖ బడిబాట కార్యక్రమం చేపడుతుంది. 15 రోజుల పాటు నిర్వహించే బడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, ఉచితంగా అందజేస్తున్న అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు, వసతుల గురించి వివరించారు. ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..● జూన్ 6వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై అవగాహన కల్పించాలి. ● 7వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలు సేకరించాలి. ● 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి కపత్రాలతో ప్రచారం నిర్వహించాలి. అంగన్వాడి కేంద్రాల్లో పోస్టర్లు అతికించాలి. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలి. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. ● 11న జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12వ తేదీన అమ్మ ఆదర్శ బడుల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించనున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేయనున్నారు. స్కూల్ యూనిఫామ్ ఇవ్వనున్నారు. ● 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం, గ్రామ సభ నిర్వహించనున్నారు. ● 16న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ దినోత్సవం జరపనున్నారు. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించనున్నారు. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించనున్నారు. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ● 17న సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. బాలికల వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. ● 18వ తేదీన తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర ఆధునీకరణ సౌకర్యాలు చూపిస్తారు. ● 19న బడి బయట కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పుస్తకాలను సిద్దం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో బడి బాట తరహా కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశం మేరకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి ముందస్తుగా కొనసాగిస్తున్నప్పటికీ జూన్లో మరోసారి చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ముందస్తు ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళుతున్నారు. బడిబాట నేపథ్యంలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు గ్రామస్తులను చైతన్యం చేయనున్నారు. ఫ జూన్ 6 నుంచి బడి బాట ఫ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన ఫ ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం -
నేడు ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బుధవారం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో బయలు దేరి 10 గంటలకు మేళ్లచెరువులోని ఓ సిమెంట్ పరిశ్రమలోని హెలిపాడ్లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 10.30 నుంచి 1 గంట వరకు చింతలపాలెం మండలంలోని ఎంబీసీ, నక్కగూడెం, బుగ్గమాదారం లిఫ్టు పనులు పరిశీలించి వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటలవరకు హుజూర్నగర్లో ఆర్అండ్బీ, జూనియర్, డిగ్రీ కళాశాలల నూతన భవనాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3. 30 వరకు హౌసింగ్ కాలనీ, ఐటీఐ, ఏటీఐ భవనాలను పరిశీలిస్తారు. 3.30 నుంచి 4.30 వరకు మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ను పారంభిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనంతగిరి మండలం శాంతినగర్లో నూతనంగా మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై అధికారులతో చర్చిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కోదాడ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళతారు. సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాంఅర్వపల్లి: సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అడిషనల్ డీఆర్డీఓ సురేష్రెడ్డి, మార్కెటింగ్ డీపీఎం ఆంజనేయులు స్పష్టం చేశారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సెర్ప్ 1వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను తొలగించడంతో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగరి , ఏపీఎం నగేష్, గిర్దావర్ వెంకట్రెడ్డి, ఏఈఓ ఎన్. సత్యం, రైతులు శంకర్, శ్రీరాములు, భిక్షం, మల్లయ్య, నరేందర్, నాగయ్య, లింగయ్య, సైదులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంనడిగూడెం: సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారిణి సీహెచ్.పద్మ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగి ఉండి అనుభవజ్ఞులైన, ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తులను సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బాలికల పాఠశాలల్లో బోధించడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 97045 50271, 80089 95137 నంబర్లలలో సంప్రదించవచ్చని సూచించారు. మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాంచివ్వెంల(సూర్యాపేట) : మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, దీనిపై ఆశాకార్యకర్తలు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ అర్బన్ పీహెచ్సీలో ఆశార్కర్లకు నిర్వహించిన లీగల్ లీటరసీ క్యాంపులో ఆమె మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు వసంత సత్యనారయణ పిళ్లే యాదవ్, ఏడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. నకిలీ విత్తన అమ్మకాలు, నివారణ చర్యలపై మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, విత్తన డీలర్లతో జిల్లా సీడ్ టాస్క్ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 –26 వానాకాలం సీజన్కు గానూ వ్యవసాయ శాఖ తరఫున ముందస్తు ప్లానింగ్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని విత్తన డీలర్లకు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు తీసుకొస్తే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 6281492368 కు సమాచారం అందించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ పథకాలపై మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య, కోదాడ డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు, సూర్యాపేట జిల్లా విత్తన డీలర్లు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ కల్తీ విత్తనాలు తీసుకొస్తే కంట్రోల్ రూం నంబర్ 6281492368కు సమాచారం ఇవ్వాలి ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
21 నుంచి తాడువాయి పీఏసీఎస్లో విచారణ
మునగాల: మునగాల మండలం తాడువాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై ఈనెల 21 నుంచి 23 వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు బహిరంగ విచారణ చేయనున్నట్లు సొసైటీ ఇన్చార్జి సీఈఓ చందా ప్రవీణ్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా సహకార అధికారి పద్మ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి. ఇందిరను నియమించారని తెలిపారు. రుణం తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ సొసైటీలో జమకాని రైతులు సరైన ఆధారాలతో కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఈనెల 21న విజయరాఘవపురం, నరిసింహులగూడెం, కలకోవ గ్రామాల రైతులు , 22న తాడ్వాయి, వెంకట్రాంపురం, మాధవరం, జగన్నాథపురం, 23న నేలమర్రి, రేపాల గ్రామాల రైతులు విచారణకు హాజరుకావొచ్చని కోరారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలితాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట పట్టణంలోని విజయ కాలనీలోగల బాల సదనంను ఆమె తనిఖీ చేశారు. పిల్లలతో ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఆహారం సరిగ్గా ఇస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొంపల్లి లింగయ్య, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుంకరబోయిన రాజు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.వెంకట రత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి, డి.ఎల్.ఎస్.ఎ నామినేటెడ్ మెంబర్స్ అల్లంనేని వెంకటేశ్వర్ రావు, గుంటూరు మధు, అడ్వకేట్స్ పాల్గొన్నారు. హామీల అమలులో విఫలంసూర్యాపేట అర్బన్: గొల్లకురుమలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెలంగాణ గొర్రెలమేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో చేతివృత్తిదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కడం లింగయ్య ఆధ్యర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్లకురుమలకు గొర్రెల కొనుగోలుకు రూ.2 లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, వజ్జ వినయ్, కంచుకోట్ల శ్రీనివాస్, రాజుల నాగరాజు, గుండాల లింగయ్య, వీరబోయిన సైదులు, చిట్లింగి యాదగిరి, కుక్కల సాంబయ్య, ఎం.సైదులు పాల్గొన్నారు. పెండింగ్ కరువు భత్యం విడుదల చేయాలిసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి మైలారపు వెంకన్న జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సంఘం జిల్లా కార్యాలయానికి రూ.80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్ అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మైలారపు వెంకన్న ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, జె.యాకయ్య, శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, వెంకటయ్య, బి.ఆడం, వి.రమేష్, రమేష్, డి.లాలు, కె .జ్యోతి, ఆర్.శ్రీను, అభినవ్ పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్నరు!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హతకు మించి వైద్యం గతంలో జరిగిన మరో సంఘటన చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే మూడో కాన్పులో మగపిల్లవాడు కావాలనుకున్నారు. మూడో సారి గర్భవతి కాగా స్కానింగ్ చేయించారు. ఆడపిల్లఅని తేలడంతో భర్తతో పాటు బంధువులు కలిసి ఆ గర్భిణికి అబార్షన్ చేయించాలనుకున్నారు. అయితే 11నెలల క్రితం హుజూర్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. మరో ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే నర్సుతో అబార్షన్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈవిషయం కాస్తా మీడియాకు తెలిసిందని వెంటనే పెదవీడు గ్రామ సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లి గర్భిణికి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్తో అబార్షన్ చేస్తుండగా వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సూర్యాపేటటౌన్: పవిత్రమైన డాక్టర్ వృత్తిని కొంత మంది అభాసుపాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాల. ఎంబీబీఎస్ చదవకపోయినా.. ఎం.డి. చేయకున్నా.. డాక్టర్లుగా చలామణి అవుతూ ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలు బలిగొంటున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అర్హతకు మించి వైద్యంతో నిండుప్రాణం బలి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి 20 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో నివాసముండే ఓ మహిళ గర్భసంచి సమస్య ఉందని వెళ్లింది. అయితే పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో బుడిగలు వచ్చాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఆ మహిళ కుటుంబ సభ్యులు మాత్రం ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేయాలని కోరారు. దీంతో వెంటనే వైద్యులు ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేస్తుండగా కడుపులో పేగు కట్టయింది. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. నార్మల్ ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని చెప్పి వైద్యులు ఆరు గంటల పాటు వైద్యం చేశారు. అయినా ఆ మహిళకు బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉన్నా వారం రోజుల పాటు అలాగే ఆ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేశారు. తీరా పరిస్థితి విషమించడంతో ఈ హాస్పిటల్ యాజమాన్యమే హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇక్కడ ఎం.డీ.గా చలామణి అవుతున్న విషయం తనిఖీల్లో బయటపడింది. సదరు డాక్టర్పై కేసు నమోదు అయినా ఆ ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ ప్రాణంపోయాక జిల్లా వైద్యాధికారి స్పందించి చర్యలు తీసుకోవడం గమనార్హం.ఫ వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఫ సూర్యాపేట పట్టణంలో తాజాగా వైద్యం వికటించి మహిళ మృతి కలెక్టర్కు నివేదికగత నెలలో సూర్యాపేటలో శరత్కార్డియాక్ సెంటర్, యాపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీసాయిగణేష్ , శ్రీకృష్ణ ఆస్పత్రుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు చేయగా నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. శరత్కార్డియాక్ సెంటర్లో డాక్టర్ లేకుండా ల్యాబ్ టెక్నీషియనే నడిస్తున్నాడు. యాపిల్ స్కానింగ్ సెంటర్లో డాక్టర్ కిరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఎం.డీ రేడియాలజిస్ట్గా చలామణి అవుతున్నాడు. శ్రీకృష్ణ ఆస్పత్రిలో డాక్టర్ రవిశేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్గా అవతారం ఎత్తి సర్జరీలు చేస్తున్నట్టు బట్టబయలైంది. సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్కుమార్ చైనాలో ఎంబీబీఎస్ చేసి ఎం.డీగా చలామణి అవుతున్న విషయం బయటపడింది విదితమే. ఈ నివేదికను కలెక్టర్కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు అందజేశారు. కాగా నాలుగు ఆస్పత్రులను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సీజ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ను సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడంతో నిబంధనల మేరకు మొదట నోటీసులు అందజేశామన్నారు. అయినా మార్పు రాకుండా నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రిని సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయ మనోహర, పీఓఎన్హెచ్ అనితా రాణి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇన్చార్జి డెమో మనోహర రాణి తదితరులు పాల్గొన్నారు. -
పేటకు రైలొస్తుంది!
సూర్యాపేట మీదుగా శంషాబాద్ – విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్కు కేంద్రం ఓకేఫ ఫైనల్ లొకేషన్ సర్వేకు నిధులు ఫ డోర్నకల్ – గద్వాల కొత్త లైన్కు గ్రీన్ సిగ్నల్ ఫ కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు కేటాయింపు ఫ రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన ఫ నిధుల కేటాయింపు వివరాలను పింక్ బుక్లో వెల్లడించిన రైల్వే శాఖ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా రెండు రైల్వే లైన్లు రానున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ కింద శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర రైల్వే శాఖ ఓకే చెప్పింది. అలాగే సూర్యాపేట, నల్లగొండ మీదుగా డోర్నకల్ – గద్వాల లైన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే పనులకు నిధులను కేటాయించింది. రైల్వే బడ్జెట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులు, ఎఫ్ఎల్ఎస్లకు కేటాయించిన నిధుల వివరాలతో కూడిన పింక్ బుక్ను ఇటీవల విడుదల చేసింది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు ఇలా.. ● మాచర్ల నుంచి నల్లగొండ వరకు 92 కిలోమీటర్లు పొడవునా రూ.458.26 కోట్లతో కొత్త రైల్వే లైన్కు ఓకే చెప్పింది. దానికి సంబంధించిన సేఫ్టీ పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించింది. ● రూ.77.80 కోట్లతో విష్ణుపురం నుంచి జాన్పహాడ్ వరకు 11 కిలోమీటర్ల పొడవునా కొత్తలైన్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీనికి సేఫ్టీ ఫండ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించింది. ● జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు వరకు 19.1 కిలోమీటరు పొడవునా కొత్త లైన్కు ఓకే చెప్పింది. దాంతోపాటు మేళ్లచెరువు–జాన్పహాడ్ లైన్ 24 కిలోమీటర్ల పొడవునా ఆధునుకీకరణ పనులకు రూ.513.20 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వరకు 14.25 కిలోమీటర్ల పొడవునా 3, 4 లైన్ల డబ్లింగ్ చేసేందుకు ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ఇందుకు రూ.29 లక్షలు కేటాయించింది. ● భువనగిరి– బీబీనగర్ మధ్య 15 కిలోమీటర్ల పొడవునా 3వ లైన్ డబ్లింగ్కు ఎఫ్ఎల్ఎస్కు రూ.30 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ –2 విస్తరణకు ఓకే చెప్పింది. దీనికి వివిధ పద్దుల కింద రూ. 110 కోట్లు కేటాయించింది. ● అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను కేటాయించింది. అలాగే యాదాద్రిలో 4 కిలోమీటర్ల పొడవునా బైపాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ● గుంటూరు– బీబీనగర్ మధ్య డబ్లింగ్కు సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు రూ.3.10 కోట్లు, బీబీనగర్–భువనగిరి మధ్య డబ్లింగ్ కోసం ఎఫ్ఎల్ఎస్కు రూ.30 లక్షలు కేటాయించింది. ● గుంటూరు – బీబీనగర్ మధ్య రూ.2,853 కోట్లతో చేపట్టే డబ్లింగ్కు, రూ.110.89 కోట్లతో విష్ణుపురం వద్ద బైపాస్ లైన్ నిర్మాణానికి ఓకే చెప్పింది. ● మోతుమర్రి– విష్ణుపురం మధ్య డబ్లింగ్కు నిధులను కేటాయిచింది. ● రూ.3.32 కోట్లతో మిర్యాలగూడ గూడ్స్ షెడ్ను అభివృద్ధి చేయనుంది.ఏళ్ల నాటి కల.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే, విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్ వరకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను చేపట్టింది. ఆ సర్వే గతేడాది చివరలో పూర్తి కావడంతో దానిని ఈ ఏడాది బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్తలైన్ ఎఫ్ఎల్ఎస్కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. దానికి రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది. -
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మే 22 నుంచి 29 వరకు రోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఐఈఓ భానునాయక్, డీఈఓ ఆశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్, శ్రీలత రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముక్త్యాల బ్రాంచ్ కాల్వకు లైనింగ్
మునగాల: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు అనుబంధంగా ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులకు రూ.184.60కోట్ల వ్యయంతో ఆదివారం శ్రీకారం చుట్టారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు చివరిభూములకు నీరు అందే విధంగా , నీటి ప్రవాహ వేగాన్ని పెంచడం, కాల్వ కట్టలను పటిష్టం చేసే పనులు చేపట్టనున్నారు. 45వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ముక్త్యాల బ్రాంచ్ కాల్వ మునగాల హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రారంభమై కోదాడ డివిజన్ పరిధిలో 16కిలో మీటర్లు, హుజూర్నగర్ డివిజన్ పరిధిలో 29కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. దీని కింద సుమారు 45వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ముక్త్యాల బ్రాంచ్ కాల్వపై తొమ్మిది అండర్ టన్నెల్స్, రెండు డబుల్లేన్ రోడ్డు బ్రిడ్జిలు ఉన్నాయి. కాగా కోదాడ డివిజన్ పరిధిలో మునగాల, చిలుకూరు మేజర్లు ఉండగా హుజూర్నగర్ డివిజన్ పరిధిలో చింత్రియాల, మఠంపల్లి, లింగగిరి, రాంపూర్, గుండ్లపల్లి మేజర్లు ఉన్నాయి. చివరి భూములకు నీరు అందకపోవడంతో.. ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ద్వారా చివరి భూములకు పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో ఏటా సాగుచేసిన వందల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కాల్వ కట్టలకు లైనింగ్ నిర్మిస్తే చివరిభూములకు పూర్తిస్థాయిలో నీరు అందే అవకాశం ఉందని నీరుపారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కాల్వ లైనింగ్ పనులకు ఉపక్రమించారు. మునగాల మండలంలోని బరాఖత్గూడెం నుంచి లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో పలు యంత్రాలు లైనింగ్ పనిల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఈ సారి కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ రూ.184.60కోట్లతో మునగాల హెడ్రెగ్యులేటర్ వద్ద పనులు ప్రారంభం ఫ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫ కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి పూర్తిచేసేలా ప్రణాళికలైనింగ్ పనులు కొనసాగుతున్నాయి ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. బరాఖత్గూడెం వద్ద ప్రస్తుతం పనులు వేగవంతం చేశాం. వీలైనంత త్వరలో లైనింగ్ పనులను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – ఉమ్మడి స్వప్న, డీఈ, నీటిపారుదల శాఖ , కోదాడ డివిజన్