Nirmal
-
హద్దులు చూపించాలి
నాకు వారసత్వంగా సర్వే నంబర్ 167లో విస్తీర్ణం 5.14 ఎకరాల భూమి ఉంది. నా భూమి పక్కన గల 163 సర్వేనంబర్లో ఉన్న వారితో కొంత భూతగాదా జరిగింది 2023 డిసెంబర్లో, నా భూమి హద్దులు చూపించాలని నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ పేరు మీద చలానా కట్టాను. అధికారులు వచ్చి భూమి కొలువగా 163 సర్వే నంబర్ నుంచి నాకు కొంత భూమి వస్తుందని తేలింది. నా ప్రత్యర్థి, నేను మరోసారి భూమి కొలవాలని ఏడీకి చలాన్ కట్టాం. నేటికీ సర్వే అధికారులు కచ్చితంగా మా భూమి ఇది అని హద్దులు చూపడం లేదు. – పల్సీ దేవీదాస్, లింబాకే డీసీవోపై చర్యలు తీసుకోవాలి మహమ్మద్ నబీ అనే వ్యక్తి 16 సంవత్సరాల వయస్సు(మైనర్గా) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సత్తనపల్లిలో సెప్టెంబర్ 20, 1994లో సబ్ స్టాఫ్గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఇదే వ్యక్తి మహమ్మద్ నబీ, షేక్ నబీ పేర్లతో చలామణి అయి సొసైటీ నుంచి జీతం తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో 2006లో వార్డు మెంబర్గా పోటీ చేశాడు. 2012 వరకు వార్డు మెంబర్ విధులు నిర్వర్తిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కూడా జీతం తీసుకున్నాడు. ఇప్పుడు అతడిని డీసీవో రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహమ్మద్ నబీపై చర్యలు తీసకుని అతను పొందిన జీతాన్ని రికవరీ చేయాలి. – బలష్టు రాజన్న, గోడల పంపు -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి
● మంత్రి సీతక్కనిర్మల్చైన్గేట్: మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతతో కూడుకున్న విషయమని, కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, ప్రభుత్వ పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని, అక్టోబర్ 2 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన స్థలాలను కలెక్టర్లు గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిర మహిళా శక్తి భవనాల పనులను నవంబర్లోపు పూర్తిచేయాలన్నారు. అంగన్వాడీలు జూన్ 11న పునఃప్రారంభం కావడంతో చిన్నారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని, ‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. కొత్తగా అంగన్వాడీలు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభరోజునే యూనిఫాం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం యూనిఫాంల స్టిచింగ్ పూర్తయ్యిందన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం అమలుతో జిల్లాలో ఇప్పటి వరకు 1,460 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని పాఠశాలల ప్రారంభంరోజే 48,874 మంది విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పనులు అనంతపేట సమీపంలో వేగంగా సాగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్ల ఏర్పాటు చేసేందుకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఎస్టీ మహిళలు, మారుమూల ప్రాంత మహిళలు స్వయం సహాయక బృందాల్లో తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త సభ్యుల చేర్పు కోసం గ్రామ పంచాయతీస్థాయిలో సమీక్ష జరుపుతున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో పి.రామారావు, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
కొత్త మంత్రులను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
నిర్మల్చైన్గేట్: నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయం అమలు కోసం పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కృషి చేస్తున్నారన్నారు. కొత్త మంత్రులు శ్రీహరి, లక్ష్మణ్కుమార్తో శ్రీహరి -
పరిహారం కోసం పోరుబాట
● పాత గ్రామాల్లో గుడిసెలు వేసి, వంటవార్పు కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తులు పరిహారం కోసం పోరుబాట పట్టారు. గ్రామాలను ఖాళీ చేసి ఏడాది గడిచినా పరిహారం అందలేదని సోమవారం రాంపూర్, మైసంపేట్ పాత గ్రామాల్లో గుడిసెలు వేసి, అక్కడే వంట వార్పు చేశారు. పునరావాస గ్రామాల్లో సాగు భూములను చదునుచేయించడం, పట్టాలు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. లేదంటే పాత గ్రామల్లోనే వ్యవసాయం చేసుకుంటామన్నారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత పునరావాస గ్రామస్తులతో మాట్లాడి డీఎఫ్వోకు పరిస్థితిని తెలియజేశారు. -
కంద కాల తవ్వకం ఆపాలి
నిర్మల్చైన్గేట్: పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాల తవ్వకం ఆపాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న కోరారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.రాజన్న మాట్లాడుతూ సారంగాపూర్ మండలం జౌలి గ్రామంలో 50 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వి వారిని తరిమేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.రామలక్ష్మణ్, సాయినాథ్, సుదర్శన్, గంగాధర్ పాల్గొన్నారు. -
అక్రమ పట్టా తొలగించాలి
నాకు కుంటాల మండలంలో 1.2 ఎకరాల భూమి ఉంది. మా తమ్ముడు నాకు తెలియకుండా ఆ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నడు. ఇప్పుడు నాకు రైతుబంధు కూడా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయండి. – జక్కుల గజ్జన్న, కుంటాల సర్వే నంబర్ మిస్సింగ్ మేము ముగ్గురం అన్నదమ్ములము. మా అన్న పట్టా భూమి అయిన 314/1లో 19 గుంటలు, 408/అ/1 లో 6 గుంటలు ఉంది. ఆ భూమిని నేను 2018 లో కొనుగోలు చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సర్వే నంబర్లు ఆన్లైన్లో కనిపించడం లేదు. ఇప్పటికే 20 సార్లు అధికారులకు పిర్యాదు చేశాను. సమస్య పరిష్కరించండి – కోరిపల్లి రవి, పోన్కల్ భూమి సర్కారుదంటున్నారు.. మాది కుంటాల మండలం అంబకంటి. 220, 324 సర్వే నంబర్లు మా అమ్మ కురుమే భూమి పేరుమీద 5.31 సాగుభూమి 1950 నుంచి 1970 వరకు ఉంది. తర్వాత కాలంలో ఈ భూమి సర్కారుది అంటున్నారు. పదేళ్లుగా తిరుగుతునా న్యాయం జరగడం లేదు. మా అమ్మ పేరు మీద ఉన్న భూమి వారసులమైన మా పేరిట రిజిస్టర్ అయ్యేలా చూడాలి. – గజ్వరి విట్టల్, అంబకంటి -
గోడు చెప్పుకున్నా.. గోస తీరడం లేదు!
● ప్రజావాణి అర్జీల పరిష్కారం జాప్యం ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి.. ● అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్నుఆ్నరు. నాలుగు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశొర్ కుమార్ అర్జీలు స్వీరించారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు వచ్చాయి. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఏవో సూర్యారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేసి, పనులు వేగవంతం చేఆయాలని ఆదేశించారు. గోవధశాల తరలించాలి మేము ఖానాపూర్ పట్టణంలోని శ్రీసాయినగర్, శ్రీరాంనగర్ కాలనీవాసులం. మా కాలనీలో ఉన్న గోవధశాల వలన ఇబ్బంది పడుతున్నాం. వీటి నుంచి వచ్చే వ్యర్థాలను కుక్కలు, పందులు లాక్కొని ఇళ్ల ముందు వేస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. అనారోగ్యంపాలవుతున్నాం. గతంలో కూడా అనేకసార్లు అధికారులకు విన్నవించాం. వధశాలను పట్టణ శివారుకు తరలించాలి. – సాయి నగర్, శ్రీరాంనగర్ కాలనీ వాసులు -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములవ్వాలి
నిర్మల్చైన్గేట్: బాల కార్మికు వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.రాధిక అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్బంగా సీ్త్ర, శిశు, వయోజనులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బాల కార్మిక నిర్మూలన చట్టంపై అవగాహన కార్యక్రమం గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక ప్రత్యేక అతిథిగా హాజరై బాల కార్మిక చట్టం ముఖ్యాంశాలను వివరించారు. పిల్లల హక్కులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి దేవి మురళి, ఎస్సై సందీప్, బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్ లైన్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్శక్తి కోఆర్డినేటర్ సబిత పాల్గొన్నారు.నిర్మల్ నుంచి రామేశ్వరానికి బస్సు నిర్మల్టౌన్: నిర్మల్ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు రామేశ్వరానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకుని నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే 36 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికై నా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రయాణపు తేదీ, చార్జీ వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
పునఃప్రారంభానికి సిద్ధం
నిర్మల్విప్లవ వీరుడా.. ఇక సెలవు..! అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది. ● డీఈవో రామారావుమంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 20258లోuబ్యాడ్మింటన్లో ప్రతిభ నిర్మల్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8న మంచిర్యాల్లో నిర్వహించిన చాంపియన్షిప్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–11 సింగిల్స్లో అర్జున్ 2వ స్థానంలో, డబుల్స్లో అర్జున్, అమన్ మొదటి స్థానంలో నిలిచారు. అండర్–11 బాలికల డబుల్స్ విభాగంలో శ్రీకతి, హర్షిత రెండోస్థానంలో నిలిచారు. అండర్–13 సింగిల్స్లో శ్రీహర్షిత్ మొదటి స్థానంలో నిలిచాడు. అండర్– 15 మిక్స్డ్ డబుల్స్లో ఆరాధ్య, శ్రీహర్షిత్ రెండోస్థానం సాధించారు. అండర్–15 బాలికల డబుల్స్లో ప్రతిభ, సహర్షి రెండో స్థానంలో నిలిచారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్, వన్నెల భూమన్న, సందీప్, ప్రశాంత్, మాణిక్యం, భారత్, శ్రీనివాస్, ముత్యం విద్యార్థులను అభినందించారు. లక్ష్మణచాంద: మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పునఃప్రారంభానికి సిద్ధం చేశామని డీఈవో తెలిపారు. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లా విద్యాధికారి పి.రామారావుతో ఇంటర్వ్యూ. సాక్షి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లాలో మొత్తం 787 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. సాక్షి: పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు మొదలయ్యాయా, ఎలా చేయిస్తున్నారు? డీఈవో: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచనల మేరకు ఇప్పటికే పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బందితో పనులు చేయించాం. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేయడంతో పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. సాక్షి: శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించడానికి ఎంపీడీవో, ఎంఈవో, ఇంజినీరింగ్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ విషయమై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో దగ్గరుండి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించాం. సాక్షి: విద్యార్థుల సంఖ్య పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రొషెసర్ జయశంకర్ బడిబాట. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6–14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారికి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను తెలియజేస్తూ తమ పిల్లలను చేర్పించేలాగా అవగాహన కల్పించాలని సూచించాం. అదేవిధంగా పాఠశాలలోని గత విద్యార్థులు సాధించిన పురోగతిని తెలియజేస్తూ పిల్లల సంఖ్యను పెంచడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు బాధ్యతతో విద్యార్థుల నమోదు పెంచేలాగా ఎంఈవోల ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాక్షి: అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో చేపడుతున్న పాఠశాలల పనులు పూర్తయ్యాయా? డీఈవో: జిల్లా వ్యాప్తంగా 628 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఇందులో ఇదివరకే 590 పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన 38 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి అవి కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయా? డీఈవో: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి వసతిని, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. ఏమైనా మరమ్మతులు ఉంటే వేసవిలోనే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అన్ని పాఠశాలలో ప్రారంభం నాటికి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా.. ఎంత మందిని సర్దుబాటు చేశారు. డీఈవో: కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. అటువంటి పాఠశాలలో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ జరుగుతోంది. పాఠశాలల ప్రారంభంనాటికి ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: విద్యార్థులకు అవసరమైన నోటుబుక్స్, పాఠ్య పుస్తకాలు ప్రారంభంరోజు అందిస్తారా? డీఈవో: జిల్లాలో మొత్తం విద్యార్థులకు పార్ట్ 1 పుస్తకాలు 3,40,220 అవసరం కాక ఇదివరకే అన్ని ఎంఈవో కార్యాలయాలకు సరఫరా చేశాం. అక్కడ నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. సాక్షి: మొదటి రోజే యూనిఫామ్ అందిస్తారా? డీఈవో: జిల్లాలో మొత్తం 48,874 మంది విద్యార్థులకు ఒక జత చొప్పున యూనిఫాం స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో కుట్టించాం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల వద్దకు వెళ్లి ఒక జత యూనిఫామ్ తీసుకోవడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం. న్యూస్రీల్ -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూ ర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ త రువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచే వివేక్కు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి వినోద్ కూడా పోటీలో ఉండగా చివరకు అధిష్టా నం వివేక్ వెంకటస్వామికే మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో వివేక్ వర్గీయులు శనివారం నుంచే జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. చెన్నూ ర్ పట్టణానికి చెందిన పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. హామీలు నెరవేర్చడమే లక్ష్యం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలిపారు. మంత్రిని కలిసిన నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నీలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచులు కుమ్మరి సంతోష్, గట్టు లక్ష్మణ్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జేక శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకుడు గుర్రం రాజన్న పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెన్నూర్ నుంచి అన్నయ్య వినోద్ తర్వాత మంత్రిగా తమ్ముడికి ఛాన్స్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వినోద్కు ఆశాభంగం తీవ్ర నిరాశలో ప్రేమ్సాగర్రావు కొంతకాలంగా కేబినెట్లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివారం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్సాగర్రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయనకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. -
చెరువుల వద్ద పర్యాటకుల సందడి
మామడ: మండలంలోని తుర్కం, యెంగన్న చె రువుల వద్దకు పర్యాటకులు తరలివచ్చారు. హై దరాబాద్ నుంచి వచ్చి ఎకో టూరిజం ద్వారా చె రువులను సందర్శించారు. విధి ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులు, వలంటీర్లు చెరువుల వద్దకు శనివారం రాత్రి చేరుకుని అట వీశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చే శారు. ఆదివారం సఫారీ వాహనంలో చెరువుల వద్దకు చేరుకుని సమీపంలో ఉండే పక్షులను కె మెరాల్లో బంధించారు. ప్రకృతి అందాలు తిలకించారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రేహె డ్ ఫిష్, ఈగల్, విష్లింగ్ డక్, పైడ్ కుకూ పక్షుల ను గుర్తించారు. అటవీ ప్రత్యేకత పర్యాటకులకు అధికారులు వివరించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు, ఎఫ్బీవో సరిత, సిబ్బంది ఉన్నారు.తుర్కం చెరువు వద్ద పర్యాటకులు -
వైభవంగా గజ్జలమ్మ జాతర
కుంటాల: మండల కేంద్రంలోని శ్రీగజ్జలమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవా రికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ఉల్లి గడ్డలు, ఓమ, పేలా లు, పుట్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గజ్జ లమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకూ నైవేద్యం సమర్పించారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కుంటాలకు చెందిన జుట్టు శ్రీధర్ దంపతులు అమ్మవారికి గ్రాము బంగారు ముక్కుపుడక బహూకరించారు. ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. పుష్కరిణి ప్రారంభంకుంటాల మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా వేద పండితుడు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. గోదావరి నది జలాలతో కోనేరులో శిఖరంపై గజ్జలమ్మ విగ్రహాన్ని ఉంచి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయానికి పోటెత్తిన భక్తులు -
బాల్య వివాహమంటూ తప్పుడు ఫిర్యాదు
ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామంలో ఆదివారం మైనర్ను ఇదే గ్రామానికి చెందిన యువకుడికిచ్చి బాల్యవివాహం చేస్తున్నట్లు ఎవరో 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చే శారు. దీంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీస్శాఖ అ ధికారులు శనివారం రాత్రి మేడంపల్లి గ్రామానికి చే రుకున్నారు. మైనర్లకు వివాహం చేయవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అయితే సదరు కు టుంబీకులు తమ కుమార్తె మేజర్ అని, ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించారు. అయితే ఇది ఆకతాయిల పనిగా భా వించిన అధికారులు వెనుదిరగడంతో ఆదివారం యువతి వివాహాన్ని జరిపించారు. దీంతో ఇరు కుటుంబాలవారు ఊపిరిపీల్చుకున్నాయి. ● మేజర్గా తేలడంతో జరిగిన పెళ్లి -
ప్రజాధనం పట్టదా?
ఈ ఫొటోలూ.. సోన్ మండలం శాకెర వద్ద స్వర్ణనదిపై నిర్మించిన చెక్డ్యామ్కు సంబంధించినవి. ఇటీవల ఈ డ్యామ్లో కొంత భాగాన్ని పేల్చివేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగానూ విమర్శలకు దారితీసింది. ప్రతీ వానాకాలంలో స్వర్ణ నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంటలకు అందించడంతో పాటు నిర్మల్ పట్టణానికి కొంతమేర తాగునీటిని అందించేందుకు 2016లో రూ.4.60కోట్లతో 175మీటర్ల పొడవుతో శాకెర శివారులో చెక్డ్యామ్ నిర్మించారు. అయితే.. రెండేళ్ల క్రితం సిద్ధాపూర్ సమీపంలోని జీఎన్ఆర్ కాలనీ జలప్రళయంలో చిక్కుకోవడానికి ఈ చెక్డ్యామే కారణం కావచ్చంటూ వాదనలు మొదలయ్యాయి. శాసీ్త్రయంగా ఎంతవరకు సమంజసమనేది తేలలేదు. మరోవైపు రూ.కోట్లు పెట్టి కట్టేముందు ఈ డ్యామ్తో ఎలాంటి ముంపు ఏర్పడుతుందన్న అంచనా వేయలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ముంపు ప్రాంతంలో నివాసం ఉండేందుకు జీఎన్ఆర్ కాలనీకి ఎవరు, ఎలా అనుమతిచ్చారన్న విషయమూ మరోసారి చర్చకు వస్తోంది. నిర్మల్: ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా ప్రభుత్వాని కి పక్కా లెక్కలుంటాయి. ఎలాంటి అంచనాలు, ముందస్తు లెక్కలు వేయకుండా పనులు చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. ఏ నిర్మాణాలు చేయాలన్నా.. ముందుగా వాటితో కలిగే లాభనష్టాలను లెక్కవేసుకున్న తర్వాతే చేపట్టాల్సి ఉంటుంది. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుంటేనే పనులు ముందుకు సాగాలి. కానీ.. ఇటీవల కొంతభా గం పేల్చేసిన శాకెర చెక్డ్యామ్ విషయంలో అధికా రులు అవేమీ పట్టించుకోలేదా? గాలికి కట్టేశారా? అని జిల్లావాసులు వాదన లేవనెత్తుతున్నారు. కూల్చివేతపై భిన్న వాదనలుఎక్కడ ఏ డ్యామ్నిర్మించాలన్నా కచ్చితంగా ముంపు ప్రాంతాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ని ర్మల్ సమీపంలో శాకెరలోనూ అలాగే నిర్మించారు. కానీ.. పైభాగంలోగల జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా వరదనీటిలో మునుగుతోంది. ఈ కారణంగా ఈ కాలనీకి దిగువన స్వర్ణ నదిలో గల చెక్డ్యామ్ ఎత్తు తగ్గిస్తే ముంపు తగ్గుతుందంటూ ఓ వాదన మొదలైంది. దీంతో ముంపు ప్రభావం తగ్గుతుందంటూ కొంతమంది ఈ అభిప్రాయాన్ని బలంగా తీసుకువచ్చారు. అసలు.. జీఎన్ఆర్ కాలనీ మునగడానికి ఈ చెక్డ్యామే కారణమంటూ శాసీ్త్రయంగా తేల్చకుండా నే కూల్చారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాలనీవాసుల క్షేమం కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ పని చేశామంటూ ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎలా అనుమతులిచ్చారో!ఎగువన ప్రాజెక్టు, దిగువన వానాకాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి నది పరీవాహకంలో, అది కూడా ముంపు ప్రాంతంలో ప్రజలు నివాసం ఉండేలా ఓ కాలనీకి ఎలా అనుమతులిచ్చారన్న వా దన ఇప్పటికీ ఉంది. ఈ వెంచర్ ప్రారంభంలోనే అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ దీన్ని అడ్డుకు నే ప్రయత్నం చేయగా, రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి మరీ ఇక్కడ వెంచర్ ఏర్పాటు వేశారు. అప్పట్లో ఏమాత్రం ముందుచూపు లేకుండా నది ఒడ్డునే ప్లా ట్లు చేశారు. ఊరికి కాస్త దూరమైనా.. తమకు అనుకూల ధరలో రావడంతో చాలామంది మధ్యతరగ తి కుటుంబీకులు అక్కడ ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు క ట్టుకున్నారు. మూడేళ్లుగా ముంపు కష్టాలెదురవుతుండగా వారంతా లబోదిబోమంటున్నారు. ఇలా జరుగుతుందని ముందే చెబితే.. ఇక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టేవాళ్లమే కాదని వాపోతున్నారు. తమకు ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే నదికి ఓవైపు ఉన్న జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా మునుగుతుండగా, మరోవైపు ముంపు ప్రాంతంలోనే డబుల్బెడ్రూంలు ఎలా నిర్మించారన్న వాదనా చర్చకు వస్తోంది. ఇటీవల కొంతభాగం పేల్చి కూల్చిన చెక్డ్యామ్ రూ.లక్షలు వెచ్చించేది కూల్చడానికా? పేల్చివేతలకు బాధ్యులు ఎవరో? పాలకులు, అధికారుల్లో తప్పెవరిది? ముంపు తప్పుతదనే గ్యారంటీ ఏది? చెక్డ్యామ్ కూల్చడంపై భిన్నవాదనలుఇరువర్గాల మాటల యుద్ధంజీఎన్ఆర్ కాలనీకి ముంపు తప్పించేందుకు చేపడుతున్న పనుల్లో భాగంగానే పాలనపరమైన ఆదేశాలతో శాకెర చెక్డ్యామ్లో కొంతభాగంలో ఎత్తు తగ్గించేందుకు పేల్చివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జీఎన్ఆర్ కాలనీ ముంపు వెనుక ఒకప్పటి పాలకులు ఉన్నారంటూ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆరోపిస్తుంటే.. తాజాగా చెక్డ్యామ్ పేల్చివేతపై ప్రజా ధనం వృథా చేస్తున్నారంటూ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మా జీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వర్గాల మధ్య మా టలయుద్ధం కొనసాగుతోంది. అసలు.. శాకెర చెక్డ్యామ్ ఎత్తు తగ్గించడంతో వరద ముంపు తప్పుతుందా? అనే విషయమై ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. ఈ సీజన్లో వచ్చే వర్షాలే ఏది సరైన నిర్ణయమో తేల్చాల్సి ఉంది. -
కేంద్రం కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి
నిర్మల్చైన్గేట్: పోడు భూములను అటవీ భూములుగా మార్చే కేంద్ర ప్రభుత్వ కుట్రల ను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర క మిటీ సభ్యులు ఆడివయ్య, ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఇంద్రనగర్లోని పార్టీ కార్యాలయంలో దుర్గం నూతన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా వీరు హాజరై మాట్లాడారు. ఖానాపూర్ ప్రాంతాన్ని కొత్తగా టైగర్ జోన్గా ప్రకటించడం అన్యాయమని, ఈ ప్రకటనతో జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ఇటీవల పట్టాలున్న భూముల్లో నూ రైతులను సాగు చేసుకోనివ్వడంలేదని తెలిపారు. దీని వెనుక గిరిజనులు, గిరిజనేతరులను ఊళ్ల నుంచి తరిమివేసే కుట్ర ఉందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గౌత మ్ కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొ మ్మెన సురేశ్, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంబు, ఫసియొద్దీన్, అవర్గ ముత్యం, నాగేల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్
మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారి ద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందని పార్టీ నాయకులంతా భావించారు. తీరా పదవి రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. -
ఘనంగా చండీయాగం
కుంటాల: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా, శనివారం గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం నుంచి గ ణపతి పూజ, పుణ్యాహవాచనం, నాంది, రక్షాబంధన, వాస్తు ఆరాధన, ద్వారపూజ, అఖండ దీప స్థాపన, అంకురార్పణ, వాస్తు క్షేత్రపాలక యోగిని నవగ్రహ సర్వతోభద్ర మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, పంచగవ్య పంచామృత నది జల సంప్రోక్షణ, చండీహోమం, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చివరకు వివేక్కే..?
● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు ● ప్రేమ్సాగర్రావు, వినోద్ను పక్కన బెట్టిన అధిష్టానం ● ఆదివారం ప్రమాణ స్వీకారం.. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దా టింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీటముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గతేడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా ఆదివారం కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖరారు అయినట్లు తెలిసింది. ముగ్గురి మధ్య పోటీ..జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చె న్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పో టీ పడ్డారు. గాంఽధీభవన్ నుంచి ఢిల్లీ వరకు పీసీ సీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ము గ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. చివరకు అధిష్టానం వివేక్నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్సాగర్, వినోద్ కంగుతి న్నారు. వారి అనుచరులూ ఊహించని షాక్కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నా రు. వివేక్కు పదవి రావడం వారికి మింగుడు ప డటం లేదు. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వర్గీ యులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతు న్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయన కు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానా లు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పద వి ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా స మీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణ లు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమో దం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మ రో వైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే తన సోదరుడు వి నోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నించారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధి ష్టానం వివేక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో వ్యక్తి..చెన్నూర్ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జ నార్దన్ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. దీంతో చెన్నూర్ నియోజకవర్గానికి మూడోసారి మంత్రి పదవి వరించనుంది. -
కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని అమ్ముల భూ షణ్ కరాటే అకాడమీలో 30 రోజులుగా కరా టే నేర్చుకున్న విద్యార్థులకు శనివారం వాసవీ ప్రైమరీ పాఠశాలలో బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 50మంది విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు తేజేంద్రసింగ్ భాటియా, పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని, కరాటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, చిరంజీవి, వంశీ, మృణాళిని, వినయ్కుమార్, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ని ఘటనపై విచారణ చేపట్టాలి
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని అంతర్నిలో ప్రభుత్వ పాఠశాల భవనం కూ లిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతర్ని ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. బాధ్యులైన డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులున్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
ప్రార్థన చేస్తున్న చిన్నారి త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశం వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిత్రులు, బంధువులకు కుర్బానీ అందించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద వివిధ పార్టీల నాయకులు ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ జానకీ షర్మిల, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. – నిర్మల్ టౌన్ -
నిర్మల్ జిల్లా... కళల ఖిల్లా
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కవులు, కళాకారులు, చరి త్రకారులకు నిలయంగా మారిందని ప్రముఖ కవి డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ, బన్నీ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన శిక్షణ శిబిరంలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసాపత్రాలు, పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్య క్రమంలో నృత్య శిక్షకురాలు నవ్య, కళాకారుడు చెని కారపు నాగరాజు, నరేశ్, మంజుల, శ్వేత, స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నో బీపీ.. నో షుగర్
● వృద్ధాప్యం వచ్చినా దరిచేరని రోగాలు ● బయటి ఫుడ్డు తినకపోవడమే కారణం ● అన్ని వంటలు నేటికీ కట్టెలపొయ్యిపైనే ● ఇంటింటా మట్టి పాత్రల వినియోగం ● ఆదర్శంగా నిలుస్తున్న మిద్దెచింత గ్రామంకడెం: మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈరో జుల్లో 30 ఏళ్లకే బీపీ, షుగర్ రావడం కామన్ అయిపోయింది. కానీ.. ఏడు పదుల వయస్సు దాటినా వీరికి నేటికీ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు దరి చేరలేదు. కనీసం కళ్లద్దాల అవసరం కూడా రా నీయకుండా హ్యాపీగా కాలం గడుపుతున్నారు. ఇందుకు కారణం వీరు బయటి ఆ హారం ముట్టరు. వారు పండించిన జొన్నలు, రాగులు, పప్పు దినుసులు, కూరగాయలనే ఆ హారంగా తీసుకుంటారు. దీంతో వారికి ఎలాంటి రోగాలు రావు. వృద్ధాప్యంలోనూ చలాకీగా ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తారు. ఎలాంటి రోగాలు దరి చేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యకర జీవితం గడుపుతున్న కడెం మండలంలోని మిద్దెచింత గ్రామస్తుల లైఫ్స్టైల్పై సండే స్పెషల్.. ప్రకృతి ఆహారమే ముద్దుప్రకృతిలో లభించే దుంపలు, ఆకుకూరలు, వేర్లను మిద్దెచింత వాసులు ఆహారంగా తీసుకుంటారు. ఈ మారుమూల ఆదివాసీ గ్రామానికి ఇప్పటికీ విద్యు త్ సౌకర్యం లేదు. ఆయిల్ ఇంజన్ల సాయంతో సా గునీరు అందిస్తూ వారికి కావాల్సిన అన్ని రకాల పంటలు పండిస్తారు. ఇప్ప పువ్వు, కంది కట్టెలను ఉడికించి జొన్న పిండితో బూరెలు చేసుకుని తిన డం వీరికి ఇష్టం. కంది పంట కోసిన తర్వాత ఇప్ప బూరెలు చేసుకునేందుకు కందికట్టెను ఏడాదంతా ఇళ్లలో నిల్వ చేసుకుంటారు. జొన్నరొట్టె, జొన్న, మక్క అంబలి, పెసర, మినుము, కంది, అనుములు వీరు పండించే ప్రధాన పంటలు. అడవిలో దొరికే కేస్కగడ్డ విషపూరితమైనదైనా దానిని ఏడుసార్లు ఉడికించి ఆహారంగా తీసుకుంటారు. కొబ్రాసీరు అనే వేర్లతో వీరు టీ చేసుకుని తాగుతారు. ఈ కారణంగానే ఎలాంటి రోగాలు తమ దరికి చేరవని గ్రామస్తులు చెబుతున్నారు. వారు పండించిన పంటలే ఆహారంగా తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కళ్లద్దాలు అవసరం లేదు నాకు 82 ఏళ్లు. ఇప్పటివరకు బీపీ, షుగర్ రాలేదు. ఎలాంటి రోగాలూ లేవు. మా గ్రామంలో వృద్ధులెవరికీ నేటికీ కళ్లద్దాలు రాలేదు. మాకు కరెంట్ లేనందునా చీకటి పడకముందే ఆహారం తీసుకుంటాం. సమయానికి నిద్రపోతాం. – ఆడ సోము పాత తరాన్ని అనుసరిస్తున్నాం మేము పాత తరాన్ని అనుసరిస్తున్నాం. చి న్నప్పటి నుంచి రసాయనాలు వేయని పంటలనే ఆహారంగా తీసుకుంటున్నాం. వ్యవసాయ పనుల్లో ముందుంటాం. కూరగాయలు, దినుసులు పండించి మార్కెట్లో విక్రయిస్తాం. – ఆత్రం మానిక్రావు -
అడెల్లు.. అమర్రహే!
● ముగిసిన ఉద్యమ ప్రస్థానం ● బీజాపూర్ ఎన్కౌంటర్లో ‘మైలారపు’ మృతి ● మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే.. ● విషాదంలో పొచ్చెర గ్రామం ● మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులు బోథ్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్(53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు మృతి చెందాడు. ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి అభ్యుదయ భావాలు కలిగిన అడెల్లు మరణవార్త జిల్లాలోని పొచ్చెర గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను ఆ ఊరు గుర్తు చేసుకుంది. అడెల్లు ప్రస్థానం ఇదీ..అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతారాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినాదం, పేదరికం అడెల్లును నక్సల్ వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడెల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలి పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారితనాన్ని తరచూ ప్రశ్నించేవాడు. విద్యాభ్యాసం..బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నిర్మల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. రాడికల్ నుంచి దళంలోకి..రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనే 1995 ప్రాంతంలో నక్సలైటుగా మారాడు. దళంలోకి ప్రవేశించాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి చత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివి జన్ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్మెంట్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళా న్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ఉమ్మ డి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్, పెంబి, ఖానా పూర్, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. కంతి లింగవ్వతో వివాహం..అడెల్లు దళంలో చేరిన సందర్భంలోనే అప్పటికే అందులో కొనసాగుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలిగా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్లో లింగవ్వ మహారాష్ట్ర, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. అప్పటి నుంచి అడెల్లు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఎట్లున్నడో అనుకునేలోపే..కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలని వారికి పట్టున్న అడవుల్లో కూంబింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. చివరి చూపు చూడాలని ఉంది నా తమ్ముడు అడెల్లును చివరి చూపు చూడాలని ఉంది. చిన్నతనంలో దళంలోకి వెళ్లాడు. ప్రజల కోసమే పని చేశాడు. ఇంతకాలం ఎక్కడున్నా బతికే ఉన్నాడనే ఆశ ఉండేది. ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు దాటింది చూసి. మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నా. – మైలారపు సీతారం, అడెల్లు సోదరుడు, పొచ్చెర మంచి చేయాలన్న తపన ఉండేది చిన్నప్పటి నుంచి అడెల్లుకు మంచి చేయాలన్న తపన ఉండేది. పేదల పట్ల సేవాగుణం చూపుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు. బాగా చదువుకునేవాడు. అడెల్లు ఎన్కౌంటర్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – నడికుంట నడిపి అడెల్లు, గ్రామస్తుడు -
మూగజీవాలపాలిట.. మృత్యుపాశాలు
● అప్రమత్తతతోనే ప్రమాదాలు నివారించవచ్చంటున్న అధికారులు ● తీగలు తెగితె వెంటనే సమాచారం ఇవ్వాలని సూచనలక్ష్మణచాంద: వర్షాకాలంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చని వి ద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యువాతపడుతున్నాఇ. ఆస్తి నష్టం జరుగుతోంది. తెగిపడిన విద్యుత్ తీగలను తాకడం, సొంతంగా మరమ్మతులు చేయడం వంటి వి ప్రమాదకరమని, ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్మల్ విద్యుత్ శాఖ డీఈ డి.నాగరాజు సూచించా రు. రైతులు, విద్యుత్ వినియోగదారులు వర్షాకా లంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సలహాలు ఇచ్చారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంతెగిన తీగలను తాకొద్దు: విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా లేదా లూజుగా ఉన్నా వాటిని తాకకూడదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తడి బట్టలు ఆరవేయొద్దు: ఇండ్లలో విద్యుత్ తీగలపై తడి బట్టలు ఆరవేయడం వల్ల షాక్ సంభవించే ప్ర మాదం ఉంది. జీఐ దండెం వైర్లలో ఇన్సులేషన్ సరి గ్గా లేకపోతే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. రేకులతో జాగ్రత్త: ఇంటి ముందు స్టీల్ రేకులు విద్యుత్ తీగలకు తాకకుండా చూసుకోవాలి, ఎందుకంటే వీటికి కూడా విద్యుత్ సరఫరా జరిగే అవకా శం ఉంది. పశువులను కట్టవద్దు: ఇనుప విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టివేయడం మానుకోవాలి, ఇది ప్రమాదకరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలుసర్వీస్ వైర్ల సమస్య: వర్షాకాలంలో సర్వీస్ వైర్లకు కార్బన్ వచ్చి విద్యుత్ సరఫరా సరిగ్గా జరగకపోతే, వాటిని మార్చుకోవాలి. విద్యుత్ తీగల దూరం: ఇండ్లకు ఆనుకొని విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలి. ఎర్తింగ్ ఏర్పాటు: ఇంటి విద్యుత్ వైరింగ్కు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ వైర్లను తాకకూడదు. సెల్ఫోన్ జాగ్రత్తలు: చార్జింగ్లో ఉన్న సెల్ఫోన్తో మాట్లాడటం, తడి చేతులతో స్విచ్ ఆఫ్ చేయడం వంటివి నివారించాలి. చేతులను గుడ్డతో తుడిచి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చార్జింగ్ వైర్ తీయాలి. ప్రమాద సమయంలో చర్యలువిద్యుత్ షాక్ నివారణ: ఎవరైనా విద్యుత్ షాక్కు గురైతే, ఆత్రుతగా వారిని తాకకూడదు. విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో వారిని విద్యుత్ సంబంధం నుంచి వేరు చేయాలి. సొంత మరమ్మతులు వద్దు: సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు సంభవించవచ్చు. ఎల్లప్పుడూ విద్యుత్ శాఖ సిబ్బంది సహాయం తీసుకోవాలి. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు నివారించడాని కి రైతులు, వినియోగదారులు పై సూచనలను కచ్చి తంగా పాటించాలని డీఈ నాగరాజు సూచించారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. జాగ్రత్తలతో ప్రమాదాలకు దూరం వర్షకాలంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిన, లూజ్గా ఉన్నా, ట్సాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినా సిబ్బందికి తెలియచేయాలి. వెంటనే తమ సిబ్బంది సరి చేస్తారు. ఏ సమస్య వచ్చినా తమ సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం.తెలిసీ తెలియక సొంతంగా మరమ్మత్తుతులు చేపట్టి ప్రమాదాల భారీన పడొద్దు. మా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తారు. – డి.నాగరాజు, డీఈ నిర్మల్ కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్కుగురై ఆరు ఎడ్లు మృతి చెందాయి. లక్ష్మణచాంద మండలం పార్పెల్లి తాండాలో విద్యుత్ షాక్తో నాలుగు రోజుల క్రితం గేదెలు మృతిచెందాయి. గడిచిన నెల రోజుల్లో విద్యుత్షాక్తో పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రైతులకు ప్రత్యేక సూచనలు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు: పంట చేనుల్లో ట్రాన్స్ఫార్మర్లను కనీసం 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి. గడ్డి నివారణ: విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గడ్డి లేకుండా చూసుకోవాలి. ఇది పశువులను ఆకర్షించకుండా ప్రమాదాలను నివారిస్తుంది. పశువుల జాగ్రత్త: పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. ఫెన్సింగ్ నిబంధనలు: పంటల చుట్టూ అటవీ జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసే ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా చేయడం చట్టవిరుద్ధం. రైతులు దీనిని నివారించాలి. చేపల పట్టుట: చేపలు పట్టడానికి విద్యుత్ వినియోగించడం కూడా చట్టవిరుద్ధం. ఇటువంటి చర్యలకు పాల్పడరాదు. -
ఇదెక్కడి ప‘రేషాన్’!
● మూడునెలల కోటాతో ఇబ్బందులు ● బయోమెట్రిక్ జాప్యంతో గంటల తరబడి క్యూ ● ఉదయం నుంచే దుకాణాల వద్ద పడిగాపులుభైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ముందస్తుగా ఒకేసారి పంపిణీ చేస్తున్నాయి. ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక కిలో కలిపి మొత్తం ఆరు కిలోల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం సానుకూలమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీ ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయోమెట్రిక్ సమస్యలతో...రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ప్రతీ నెల ఒక్కసారి వేలిముద్ర ద్వారా బియ్యం పొందే లబ్ధిదారులు, ఈసారి మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోలకు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక కిలోకు మరోసారి వేలిముద్ర వేయడంతో పాటు, వేర్వేరుగా కాంటా చేయడం వల్ల ఒక్కో లబ్ధిదారు?3కు 15 నిమిషాల సమయం పడుతోంది. దీనితో పంపిణీ ప్రక్రియలో గణనీయమైన జాప్యం జరుగుతోంది. అదనంగా, ఈ–పోస్ యంత్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడం లబ్ధిదా రుల ఆందోళనను మరింత పెంచుతోంది. భారీ క్యూ, సౌకర్యాల కొరతరేషన్ దుకాణాల వద్ద ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి పనులు, బయటి వ్యవహారాలను వదిలి రేష న్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అంతేకాక, దుకాణా ల వద్ద నీడ వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులు లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిల్వలపై ఆందోళనసాధారణంగా ప్రతీ నెల 16 నుంచి 20 తేదీల మధ్య రేషన్ బియ్యం పంపిణీ పూర్తవుతుంది. అయి తే, ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో బియ్యం నిల్వలు అయిపోతాయన్న భయంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ దీర్ఘ క్యూలు, ఆలస్యం వల్ల బియ్యం అందుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు పంపిణీ కొనసాగించాలని వారు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి సూచనలుప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియను సరళీకరించి, ఒక్కసారి వేలిముద్రతో మొత్తం బియ్యం పొందే వి ధంగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలా గే, సర్వర్ సమస్యలను త్వరగా పరిష్కరించడం, రేషన్ దుకాణాల వద్ద నీడ వసతులు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ఈ చర్యలు అమలైతే లబ్ధిదారుల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. మూడు గంటలు వేచి ఉన్నా... రేషన్ బియ్యం తీసుకునేందుకు మూడు గంటలపాటు వేచి ఉన్నా. ఒక్కొక్కరికి ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. దీంతో గంటల తరబడి ఆలస్యమవుతోంది. దుకాణాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎండలో నిల్చోలేక ఇబ్బంది పడుతున్నాం. – సాయినాథ్, భట్టిగల్లి, భైంసాఇంటి పని వదులుకుని... మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నరని దుకాణంకు వస్తే, ఇక్కడ గంటల కొద్ది ఆలస్యమైతుంది. ఆరుసార్లు వేలిముద్ర తీసుకుంటున్నరు. ఇంటి పని వదులుకుని దుకాణం వద్దనే గంటల తరబడి నిల్చున్న. – అనితా బాయి, భట్టిగల్లి, భైంసా -
బడిబాట లక్ష్యం పెంచాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్సారంగపూర్: బడిబాట కార్యక్రమం ద్వారా గతేడాదికన్నా అధికంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, లక్ష్యాన్ని మించి అడ్మిషన్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని యాకర్పెల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మండల వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులను చేర్పించారని ఎంఈవో మధుసూదన్ను అడిగి తెలుసుకున్నారు. గతేడాది 6వేల పైచిలుకు విద్యార్థుల లక్ష్యం చేర్చుకున్నామని తెలిపారు. ఈసారి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీవో అజీజ్ఖాన్, ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులుఅపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. యాకర్పల్లి గ్రామంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సును అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి పరిశీలించారు. మొత్తం 36 దరఖాస్తులు రా గా అందులో 19 దరఖాస్తులు కేవలం 241సర్వే నంబర్పైనే రావడంతో ఇదేంటని తహసీల్దార్ శ్రీదేవిని అడిగారు. తహసీల్దార్ బదులిస్తూ 241సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని కలెక్టర్కు వివరించారు. దీని విస్తీర్ణం 40.36 ఎకరాలని తెలిపారు. ఇదే సర్వే నంబరులో అసైన్డ్ పట్టాలు 40.36 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా 77.17 ఎకరాలకు పట్టాలు జారీ చేశారని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ ఇదేలా సాధ్యమని తహశీల్దార్ను అడిగారు. కాలక్రమేణా పట్టామార్పిడులు జరిగిన నేపథ్యంలో, అసలు పట్టాదారులు మరణించగా వారి వారసుల పేర్ల పై మార్పిడి, క్రయ విక్రయాల నేపథ్యంలో ఇలాంటి పొరపాటు జరిగి ఉండవచ్చని వివరించారు. సమస్య పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ఏర్పాటు చేసి 40.36 ఎకరాల భూమిని సర్వే చేయించాలని తహశీల్దార్కు సూచించారు. ప్రస్తు తం సాగుచేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఎవరైతే సాగుచేస్తున్నారో వారికే పట్టాలు ఉంచి మిగతా వారి పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం యాకర్పెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటారు. వరదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి నిర్మల్చైన్గేట్: వర్షాకాలంలో సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబరులో జిల్లా ఫ్లడ్ మ్యానువల్–2025 పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో నమోదైన వరదల వివరాలు, వాటి తీవ్రత, వాటివల్ల జరిగిన ఆస్తి, పంట నష్టం తదితర సమాచారాన్ని ఈ పుస్తకంలో సమగ్రంగా పొందుపరిచినట్టు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు వంటి అంశాలు ఈ మ్యానువల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం – 2010, మహిళ శిశు రక్షణ చట్టాల అమలు, పర్యవేక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మహిళా శిశు రక్షణ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. ఆసుపత్రులు రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, ప్రతీ ఆస్పత్రిలో రేటు చార్ట్ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతీ ఆస్పత్రిలో కనీస ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, బయో మెడికల్ వేస్ట్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్య సంస్థలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదు చేసుకోవాలన్నారు. పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలన్నారు. లింగ నిర్ధారణ చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 7337448722 ను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అన్ని వివరాలను ఆన్లైన్లో సమయానికి అప్డేట్ చేయాలన్నారు. అనంతరం పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డీసీహెచ్ఎస్ సురేశ్, సరోజ, సునీల్, ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కూలిన పాఠశాల భవనం
కుభీర్: పాఠశాల భవనం ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులపై పైకప్పు కూలి ఇద్దరికి తీవ్రంగా.. మరో ఇద్దరికి స్వల్పంగా గాయాల య్యాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన బాలబాలికలు.. వేసవి సెలవులు కావడంతో రోజూ ఈ పాఠశాల భవనం నీడలో ఆడుకుంటున్నారు. భవనం ఆవరణలో శుక్రవారం ఆడుకుంటుండగా, ఒక్క సారిగా పాఠశాల పైకప్పు ఒకవైపు కూలిపోయింది. పిల్లలు పరుగులు తీయడంతో.. కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.అక్కడే ఉన్న యువకులు వారిని రక్షించారు. ఈ ఘటనలో సాయికుమార్ (7), ప్రేమ్కుమార్ (7)కు తీవ్ర గాయా లయ్యాయి. తలకు గాయమైన ప్రేమ్కుమార్ను భైంసా ఏరియా ఆస్పపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. కాలు విరిగిన సాయికుమార్కు భైంసా ఏరియా ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.మరో ఇద్దరు చిన్నారులు ప్రణయ్ (6), అభినయ్ (6)లకు స్వల్ప గాయాలయ్యాయి. సాయి కుమార్, లక్ష్మణచాంద మండలం నుంచి వేసవి సెలవుల్లో అమ్మమ్మ గ్రామమైన అంతర్నికి వచ్చి ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటనపై ఎంఈవో విజయ్ కుమార్ను వివరణ కోరగా.. పాఠశాల పాత భవనం కావడంతో కూలిపోయిందని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు సుభాష్ మాట్లాడుతూ.. ఉదయం బడిబాట కార్యక్రమం అనంతరం భవనం కూలిపోయిందని చెప్పారు. ఈ భవనాన్ని కూల్చివేయాలని గతంలోనే డీఈవోకు లేఖ రాసినట్లు చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక భవనం కూలి ఉంటే.. ఘోరం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. -
● రూ.6వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ● ప్రోత్సహించిన ఇన్చార్జి ఆర్ఐ కూడా.. ● ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు
ఆశపడ్డారు.. పట్టుబడ్డారునిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. బాధితుడు తన గృహానికి ఇంటి నంబర్ కేటాయించడానికి అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి షోయబ్కు రూ.6వేలు ఇస్తుండగా అధి కారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆది లాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ ఇంటి యజమాని ఇటీవల ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. ఆ ఇంటికి సంబంధించిన అసిస్మెంట్ (ఇంటి నంబర్) కోసం చలానా కట్టి మున్సిపల్ రెవెన్యూ సెక్షన్లోని సంబంధిత అ ధికారులను కలిశాడు. ఇందుకు రూ.6వేలు లంచం ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ షోయబ్ అహ్మద్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ యజ మాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వా రి సూచన మేరకు ఆ యజమాని బిల్ కలెక్టర్కు లంచం ఇస్తుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు షోయబ్ను విచారించగా.. లంచం తీసుకునేలా సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ ఆర్ఐ సంతోష్ ప్రోత్సహించారని తెలిపాడు. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎ స్పీ తెలిపారు. ప్రభుత్వశాఖల ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 లేదా 9440446108 నంబర్లకు తెలుపాలని, సమాచారం ఇచ్చిన వా రివివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిర్మల్ మున్సిపల్లో ఏసీబీకి పట్టుబడ్డ ఇన్చార్జి ఆర్ఐ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి -
● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన్లోనే వరుస దాడులు ● తాజాగా ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు ● గతంలోనూ ఆఫీసర్లు పట్టుబడిన వైనం
నిర్మల్: ‘అరె.. మున్సిపాలిటీలో పనుందిరా..’ అని ఎవరైనా అంటే వెంటనే.. ‘ఎంతోకొంత ఇస్తే నే పనైతుందిరా..’ అని టక్కున చెబుతున్నారంటే.. ఇక్కడ పైసావసూల్ ఏ స్థాయిలో ఉందో అ ర్థం చేసుకోవచ్చు. ఇందుకు వరుసగా జరుగుతు న్న అవినీతి నిరోధకశాఖ దాడులే నిదర్శనం. ఓవై పు ఇలా వరుసగా ఏసీబీ దాడులవుతున్నా.. ప్రధానంగా రెవెన్యూ సెక్షన్ తీరుమారక పోవడం గమనార్హం. ఇంటి నంబర్ ఇవ్వడానికి రూ.ఆరువేల లంచం తీసుకుంటూ గురువారం నిర్మల్ మున్సి పాలిటీ రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ సంతోష్, కాంట్రాక్ట్ ఉద్యోగి షో యబ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాళ్లు చే యాల్సిన పనే అయినా.. అందుకు సరిపడా ప్రభుత్వం వేతనం ఇస్తున్నా.. అదనంగా లంచం ఇవ్వనిదే మున్సిపాలిటీల్లో ఏ పనీ చేయడం లేదు. దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తర చూ దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. వ సూలు రాజాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతీ పని కో రేటు కడుతూ వసూలు చేస్తూనే ఉన్నారు. తమ వద్ద పనికోసం వచ్చింది పెద్దోడా.. పేదోడా.. అనే తేడా కూడా చూడకుండా ఎంతో కొంత ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రధానంగా మున్సిపల్, రె వెన్యూశాఖల్లో ఈ తరహా లంచావతారులు చాలా మంది ఉన్నారు. ఇందులో కొంతమంది బాహా టంగానే డబ్బులు ఆశిస్తూ పనులు చేస్తుండగా, మరికొందరు కిందిస్థాయి, కాంట్రాక్ట్, అవుట్సో ర్సింగ్ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నా రు. అధికారుల వసూళ్ల దాహానికి గతంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది బలయ్యారు. ‘రెవెన్యూ’లో దోపిడీపర్వం బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయన్న ట్లు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే లంచాల లెక్కలు ఉంటున్నాయి. రెవెన్యూశాఖ అంటేనే చాలా మంది అధికారులు, సిబ్బంది పైసా ఇవ్వనిదే పని చేయరన్న పేరుంది. ఇక మున్సిపాలిటీల్లోని రెవె న్యూ విభాగమూ అదే దారిలో నడుస్తోంది. సకా లంలో పన్నులు వసూలు చేయని ఈ సెక్షన్ పైసలు దండుకునే పనిలో ఉందన్న ఆరోపణలున్నా యి. ఒక్క నిర్మల్ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలోనే ఏడాది వ్యవధిలో ముగ్గురు అధికారులు, సి బ్బంది ఏసీబీకి పట్టుబడ్డారంటే.. ఈ సెక్షన్లో ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో అంచనా వేయొచ్చు. ప్రధానంగా ఇంటినంబర్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యి. ప్రభుత్వ స్థలాలకూ ఇంటినంబర్లు కేటాయిస్తూ.. కబ్జా చేసుకోవడానికి అవకాశమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏసీబీ దాడికి సస్పెన్షన్కు గురైన అధికారికి బాధ్యతలు ఇవ్వడంపైనా ఫిర్యాదులున్నాయి. అయినా కలెక్టర్, స్థానిక సంస్థలను చూసుకోవాల్సిన అడిషనల్ కలెక్టర్ స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థాయిని బట్టి వసూళ్లు నెలనెలా ప్రభుత్వం ఇచ్చే వేతనాన్ని చాలామంది అధికారులు, సిబ్బంది లెక్కలోకి తీసుకోవడం లే దు. తాము చేయాల్సిన పనే అయినా.. ‘ఈ పని చేస్తే నాకేంటి..’ అన్నట్లుగా కొందరు ఉన్నతాధికా రులే మాట్లాడుతున్నారు. కొంతమంది అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనపై సదరు కార్యాలయాల్లో పనిచేసేవాళ్లే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. లంచాలు తీసుకునే సార్లతోపాటు సర్కారు చేసే పనుల్లో వాటాలు చూసుకునే అవినీ తిపరులూ తక్కువేం లేరు. జిల్లాలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఎవరిస్థాయిని బట్టి వారు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.నిర్మల్ మున్సిపల్ కార్యాలయంజిల్లాలోని పలు ఘటనలు గతేడాది జనవరి 25న నిర్మల్ మున్సిపాలిటీ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో) గంగాధర్, బిల్కలెక్టర్ నవంత్ ఓ ఇల్లు అసెస్మెంట్కు సంబంధించి రూ.3,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గతేడాది నవంబర్ 13న నిర్మల్ మున్సిపల్లో ఇన్చార్జి ఆర్ఐ, ఎస్టాబ్లిష్మెంట్ (సీ–సెక్షన్)ను కూడా చూస్తున్న జూనియర్ అసిస్టెంట్ షాకీర్ఖాన్ తమ విభాగంలోనే పనిచేసే బిల్కలెక్టర్ భరత్కు సంబంధించి సర్వీస్బుక్లో నమోదు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా ఇంటినంబర్ కేటాయింపు కోసం రూ.6వేలు వసూలు చేస్తూ ఇన్చార్జి ఆర్ఐ సంతోష్, అవుట్సోర్సింగ్ సిబ్బంది షోయబ్ ఏసీబీకి పట్టుబడ్డారు. -
నిర్మల్
నాణ్యతలేని విత్తనం? ఏటా నాణ్యతలేని విత్తనాలతో జిల్లా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కొనుగోలు సమయంలో దుకాణాల నుంచి రశీదులు తీసుకున్నా పరిహారం అందడం లేదు.10లోu శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 20252020 ఏప్రిల్లో జిల్లాలో తొలి కేసు జిల్లాలో 2020 ఏప్రిల్లో తొలి కరోనా కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా కొందరు మత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా జీరోకు పడి పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిభైంసాటౌన్: డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. గురువారం పట్టణంలోని గాంధీగంజ్లో పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, ఇతర వివరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డీల ర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూ చించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీఏ వీణ, ఏవోలు రవి, గణేశ్ ఉన్నారు. 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక వార్డులో 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ప్రతీ బెడ్కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. కరోనా నివారణకు అవసరమైన మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్లు స్వీయ నియంత్రణ పాటించాలి ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. కరోనా వైరస్పై జిల్లా వైద్యాశాఖ అప్రమత్తంగా ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలో ఇంకా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశాం. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో చికిత్స అందించేందుకు సిద్ధం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే రోజుకు 800–900 వరకు అవుట్ పేషెంట్లు, 200 మంది ఇన్పేషెంట్లకు చికిత్స చేస్తున్నాం. కోవిడ్, సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేకవార్డులు సిద్ధం చేస్తున్నాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టాం. – గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మల్చైన్గేట్: కొద్దిరోజుల క్రితం దేశంలోకి కోవిడ్ భూతం మళ్లీ ప్రవేశించింది. మరోవైపు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే కాలమిది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హె చ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 280 పడకలుండగా అన్నింటికీ ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 10 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. 20 పడకల కోవిడ్ వార్డును అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేశారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో 100 పడకలు ఉండగా ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల్లో మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నిర్మల్తో పాటు జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కోవిడ్ పరీక్ష కిట్లు రావాల్సి ఉంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కా న్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొ త్తంగా కరోనా కొత్త వేరియంట్తోపాటు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అప్రమత్తమైన అధికారులు కోవిడ్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ, చికిత్స కు ఏర్పాట్లు చేస్తున్నారు. మందులు, కిట్లు మొదలైనవి సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో ప్రత్యేకవార్డు సిద్ధం చేస్తున్నారు. వార్డులో బెడ్లు, ఫ్యాన్లు, వెలుతురు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాకు పైపులైన్లు సరి చేస్తున్నారు. సీజనల్ వ్యా ధులకు గురయ్యే వారికోసం జీజీహెచ్లో 20 పడకలు, భైంసా ఏరియా ఆస్పత్రి, ఖానాపూర్, నర్సాపూర్ (జి) పీహెచ్సీల్లో బెడ్లు సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో జ్వరాలు మే మూడో వారం నుంచి వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలు బు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు గానే పరిగణించి వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకుని భయపడవద్దని, వాతా వరణ మార్పులతోనే సీజనల్ వ్యాధులు వస్తుంటాయని వారు చెబుతున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ‘పది’ పరీక్షలకు తొమ్మిది మంది గైర్హాజరునిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు మొత్తం 35మంది విద్యార్థులకు 26మంది హాజరు కాగా తొమ్మిది మంది గైర్హాజరయ్యా రు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్లోగల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి పరమేశ్వర్ తనిఖీ చేశారు. గోరక్ష చట్టాలు అమలు చేయాలినిర్మల్చైన్గేట్: చట్టవిరుద్ధంగా కొనసాగుతు న్న గోవధ శాలలను మూసి గోరక్ష చట్టాలను అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం గోరక్ష జిల్లా సంయోజక్ జట్టి వెంకటేశ్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గుల్జార్ మార్కెట్, బాగులవాడ, పింజరు గుట్ట, గాజులపేట్, ఈద్గం, సోఫీనగర్, విశ్వనాథ్పేట్, బుధవార్పేట్, బోయవాడ ప్రాంతాల్లో జరుగుతున్న గోవధ ను వెంటనే ఆపాలని కోరారు. ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేసి, గు ర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. గోఆధారిత వ్య వసాయం చేస్తున్న రైతులు, గోపోషకులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరా రు. జన సమూహాల మధ్య పశుకళేబరాల నుంచి నూనె, టీ పొడి లాంటివి తయారు చేసే కర్మాగారాలు వెంటనే మూసివేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. అందుబాటులోకి వచ్చిన సీటీ స్కాన్ యూనిట్ నిర్మల్చైన్గేట్: మొక్క నాటుతున్న అభిలాష అభినవ్నిర్మల్ రూరల్: మొక్క నాటుతున్న డీఈవోన్యూస్రీల్ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కలెక్టర్ అభిలాష అభినవ్ -
చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి
నిర్మల్టౌన్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగా హన కలిగి ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూ చించారు. గురువారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ది వ్యపార్క్లో వాకర్స్కు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్క నాటారు. అనంతరం వివిధ చట్టాల గురించి తెలిపారు. బాలికల చట్టాల వినియోగాన్ని వివరించారు. కార్యక్రమంలో సెషన్స్ జడ్జి రాధిక, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలిమామడ: భూసంబంధిత సమస్యలపై దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. దరఖాస్తుల వివరాలను అధికా రులు రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినో త్సవం సందర్భంగా గ్రామంలో మొక్క నాటా రు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంకుడుగుంతల పరిశీలన
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో ఈజీఎస్ కింద నిర్మించిన ఇంకుడుగుంతల ను సెంట్రల్ వాటర్ కమిటీ మెంబర్ సతీశ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు తోడ్పడుతా యని తెలిపారు. జలశక్తి అభియాన్లో భా గంగా కేంద్ర అవార్డు కోసం ఇంకుడుగుంత ల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైనాన్స్ మేనేజర్ సందీప్, ఎంపీడీవో లింబాద్రి, ఏపీవో నవీన్, టీఏలు మా ధురి, శశిధర్, జైసింగ్, దేశ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలున్నారు. -
కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!
మంచిర్యాలక్రైం: మరొక్క రోజు గడిస్తే కొడుకు కాలేజీకి వెళ్తాడని తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. పదో తరగతి పూర్తి చేసిన తనయుడిని హైదరాబాద్లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించేందుకు ఫీజు కూడా చెల్లించారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి వెళ్లిన విద్యార్థి.. స్నానానికి క్వారీలోకి దిగి మృత్యువాత పడ్డాడు. కాలేజీకి వెళ్తాడనుకుంటే కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారికి కలిచివేసింది. ఈ సంఘటన మంచిర్యాల పోలీసుస్టేషన్ పరిధిలోని ఏసీసీ క్వారీ వద్ద చోటు చేసుకుంది.ఎస్సై తిరుపతి, విద్యార్థి కుటుంబ సంభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని జాఫర్నగర్లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సాదుల ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లావణ్య కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు హర్షిత్ (15), ధనుష్ ఉన్నారు. çహర్షిత్ను హైదరాబాద్లోని పాఠశాలలో చదివించారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా ఇంటర్ కోసం హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. ఈ నెల 5న కాలేజీకి వెళ్లాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు చేశారు.స్నేహితులతో వెళ్లి..హర్షిత్ చిన్ననాటి స్నేహితులు అందరూ పదో తరగతి పూర్తి చేసి వేర్వేరు కళాశాలల్లో చేరారు. గురువారం హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మంగళవారం ఏసీసీ క్వారీకి వెళ్లారు. బిర్యానీ పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. స్నానం చేసేందుకు హర్షిత్ పాటు మరో స్నేహితుడు క్వారీలోకి దిగారు. హర్షిత్ లోతుకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. గమనించిన స్నేహితులు భయంతో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక రోదిస్తూ వెళ్లిపోయారు. హర్షిత్ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి ప్రసాద్ స్నేహితులను ఆరా తీయగా.. సాయంత్రం క్వారీకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. స్కూటీ, నీటిమడుగు పక్కనే డ్రెస్, చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్రావు, ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా çహర్షిత్ మృతదేహం లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. క్వారీ ప్రాంతంపై నిఘా పెంచాలి ఏసీసీ క్వారీ దట్టమైన అటవీ ప్రాంతం. అత్యంత ప్రమాదకరమైన క్వారీ. పెద్ద పెద్ద నీటి మడుగులు ఉంటాయి. పైగా సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వడం కష్టమే. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతం వద్ద అధికారులు నిషేధం విధించారు. అయినా సరదాగా గడిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు ఏసీసీ క్వారీ అడ్డాగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏసీసీ క్వారీ ప్రాంతంపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
మిల్లర్లపై చట్టపరమైన చర్యలు
నిర్మల్చైన్గేట్: దీర్ఘకాలంగా సీఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వని రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారుల ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందే సీఎంఆర్ (కస్టమర్ మిల్లింగ్ రైస్) ధా న్యాన్ని దీర్ఘకాలంగా ఇవ్వని రైస్మిల్లర్లపై రెవె న్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొంతమంది మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, వారి ఆస్తులను గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇంకా బకాయిలున్న మిల్లర్లను గుర్తించి వారి ఆస్తులను బ్లాక్ చే యడంతో పాటు, బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సిందిగా సూచించారు. భవిష్యత్లో ఇలాంటి మిల్లర్లకు బ్యాంక్లు ఎలాంటి రుణాలు మంజూరు చేయకూడదని సూచించారు. మండ ల స్థాయిలో విత్తనాల దుకాణాలపై నిరంతర త ని ఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆ ర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
భూసమస్యలపై దరఖాస్తు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్లోకేశ్వరం: భూసమస్యల పరిష్కారానికి దరఖా స్తులు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం మండలంలోని ఎడ్దూర్, వట్టోలి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సులకు హాజరయ్యారు. రైతుల దరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అర్లి నుంచి ఎడ్డూర్ వరకు అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అదనపు కలెక్టరు కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీ ల్దార్ సర్వరాజ్ అహ్మద్, డీటీ రవీందర్ ఉన్నారు. నర్సాపూర్ (జి): మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు ని ర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. అంతకుముందు సమీప ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలను సందర్శించారు. బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో చర్లపల్లిలో 12, బూరుగుపల్లి (కె)లో ఒక దరఖాస్తు వచ్చిన ట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీటీ వాహిదొద్దీన్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్కుమార్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించొద్దు నిర్మల్చైన్గేట్: రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో సూచించారు. సోష ల్ మీడియాలో వైరలైన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియోపై జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెవె న్యూ సదస్సులో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సైని సస్పెండ్ చేసి, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3నుంచి 20వరకు రెండోవిడత సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 36 రెవెన్యూ గ్రామాల్లో వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
క్యాన్సర్ రోగులకు ఉపశమనం
● నిర్మల్లో చికిత్సకు ఏర్పాట్లు ● పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డులు ● త్వరలో అందుబాటులోకి సేవలునిర్మల్చైన్గేట్: జిల్లాలోని క్యాన్సర్ రోగులకు మంచిరోజులు రానున్నాయి. చాపకింద నీరులా మానవాళిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు సర్కారు బోధనాస్పత్రుల్లో ప్రత్యేక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని వై ద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో 20 చొప్పున పడకలతో జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ కేర్ కేంద్రంలో 10 పడకలను వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు.. మిగతా 10 పడకలను పాలియేటివ్ కేర్ (పక్షవాతంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించే) నిమిత్తం వినియోగించనున్నారు. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ఇదివరకే పాలియేటివ్ కే ర్ కేంద్రం ఉంది. ఇక్కడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకూ చికిత్స అందిస్తుండగా సేవలు విస్తరించనున్నారు. జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలను ఇటీవల ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానికంగానే చికిత్స జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న జెరియాట్రిక్ వార్డు, కీమోతెరపీ లాంటి సే వల కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఇద్దరు వై ద్యులు, ఆరుగురు నర్సింగ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా హైదరాబాద్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. జిల్లా జ నరల్ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రా గానే చాలామంది క్యాన్సర్ బాధితులు రెగ్యులర్ చె కప్లకు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే వీరి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ పొందన్నారు. బాధితులు పెరుగుతున్నందునే.. కేన్సర్ బారిన పడిన కొందరికి కీమోతోపాటు రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. కానీ.. ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోంది. నాన్ కమ్యూనబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తుండగా.. మహిళా ఆరోగ్య కార్యక్రమం ద్వారా బ్రెస్ట్, ఓ రల్, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపు కొనసాగుతోంది. వీరిలో వ్యాధి ప్రారంభ దశలో ఉంటే జిల్లాలోనే చికిత్స అందిస్తుండగా, సీరియస్ కేసులకు ప్రత్యేకంగా వార్డు లేదు. దీంతో కీమో, రేడియేషన్ థెరఫీ కోసం వారిని హైదరాబాద్కు పంపిస్తున్నా రు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేన్సర్ బాధితులు పె రుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడిక ల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ప్రత్యేకసెంట ర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జెరియాట్రిక్ వార్డులతో ప్రయోజనాలు మధుమేహం, హైపర్టెన్షన్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లాంటివి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉండటంతో వృద్ధాప్యంలో వాటిని ఎదుర్కోవటం కష్టతరమవుతోంది. అలాంటివారికి ప్రత్యేక వార్డుల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు (జెరియాట్రిషన్లు) అందుబాటులో ఉంటారు. వృద్ధులకు సరిపడా ఔషధాలు, చికిత్స అందిస్తారు. శారీరక, మానసిక, సామాజిక, ఆరోగ్య అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. వృద్ధులు ఎదుర్కోబోయే సమస్యలను ముందస్తుగానే గుర్తిస్తారు. ప్రతీ రోగి అవసరాలకు అనుగుణంగా చికిత్స విధానం రూపొందిస్తారు. ఒంటరిత నం, ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక సమస్యల ను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. వృద్ధాప్యంలో ఆరో గ్యకరమైన జీవనశైలి కోసం వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక సంరక్షణతో రోగులు త్వరగా కోలుకుంటారు. కీమోథెరపీ, కౌన్సెలింగ్ ఒకేచోట..రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచటంతో పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థ్యాన్ని పెంచేందుకు క్యాన్సర్ కేర్ కేంద్రాలు దోహదపడతాయి. క్యాన్సర్కు స్థానికంగా చికిత్స అందుబాటులో ఉండటంతో దూరప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రత్యేక క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఉండటంతో రోగ నిర్ధారణ, చికిత్స త్వరగా ప్రారంభమవుతాయి. ఇవి రోగ నియంత్రణకు సహాయపడతాయి. క్యాన్సర్ చికిత్సలో నైపుణ్యం కలిగిన వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాలు క్యాన్సర్ గురించి సమాజంలో అవగాహన కల్పించటానికి, నివారణ చర్యలను ప్రోత్సహించటానికి తోడ్పడతాయి. కీమోథెరపీ, కౌన్సెలింగ్ లాంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో ప్రారంభించనున్న జెరియాట్రిక్, క్యాన్సర్ చికిత్స సేవలను జిల్లా ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. చాలామంది నిరుపేదలకు ఈ సేవలు ఉచితంగా అందనున్నాయి. – రాథోడ్ సునీల్ కుమార్, జిల్లా జనరల్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ వార్డులు సిద్ధం చేశాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సూచన ల మేరకు త్వరలోనే జి ల్లా ప్రజలకు ఈ సేవల ను అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికో సం వైద్యులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించాం. – డాక్టర్ గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
● భూసారం పెరిగే అవకాశం ● అధిక దిగుబడులు సాధ్యం
లక్ష్మణచాంద: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించే అవకాశమున్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏటా ఒకే రకమైన పంట సాగు చేస్తే భూమిలో సారం క్రమంగా తగ్గి దిగుబడులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పంట మార్పిడి విధానంతో నేలలో పోషకాలు వృద్ధి చెందుతాయని, తద్వారా దిగుబడి పెరిగే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. చీడపీడలకు అడ్డుకట్ట ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని పంటలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశముంటుంది. పంట మార్పి డి చేసినప్పుడు పురుగు జీవితచక్రం నాశనమవుతుంది. వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగుల ను పంట మార్పిడి విధానంతో అదుపు చేయవ చ్చు. ఒకే లోతు వ్యవస్థ కలిగిన పత్తి, మిరప, వాణిజ్య పంటలను పంట మార్పిడి చేయకుండా సాగు చేస్తే ఒకే లోతు పొర నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల పూర్తిగా నిస్సారమవుతుంది. వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు నేల పైపొరల నుంచి పోషకాలను గ్రహిస్తాయి. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల ఉధృతి నిరోధానికి పంట మార్పిడి చేయాలి. ప్రయోజనాలివే.. వరి తర్వాత మినుము, పెసర, శనగ లాంటి పంటలు సాగు చేస్తే వరిలో వచ్చే సుడి దోమ, టుంగ్రో వైరస్ తెగుళ్లను నివారించవచ్చు. పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వు, మినుము లాంటి పంటలు సాగు చేస్తే పత్తి పంటను ఆశించే లద్దె పురుగు, పచ్చ పురుగుల బెడదను అరికట్టవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కా యతొలుచు పురుగు ఉధృతి తగ్గుతుంది. వరి వేసిన పొలాల్లో ముందుగా పుప్పు ధాన్యాలు సాగు చేస్తే నేల సారవంతమవుతుంది. వేరుశనగలో ఆకుముడతను నివారించేందకు పప్పు జాతికి చెందిన పంటలతో మార్పిడి చేయాలి. కంది, మిరప పంటల్లో ఎండు తెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. నులిపురుగు సమస్య అ ధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప లాంటి పంటల సాగును కొన్ని సంవత్సరాల వరకు ఆపా లి. ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను పప్పు జాతి పంటలైన పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలతో పంట మా ర్పిడి చేయాలి. ఆహార వాణిజ్య పంటలను పశుగ్రా స పంటలతో ఒకసారి, పప్పు జాతి పంటలతో మ రోసారి పంట మార్పిడి చేయడం లాభదాయకం. మార్పిడితో మంచి దిగుబడి అన్నదాతలు ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వే యొద్దు. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. దీంతో నేల సారం పెరిగి పంటలకు పోషకాలు స మృద్ధిగా అందుతాయి. తద్వారా మంచి ది గుబడులు సాధించవచ్చు. రోగ కారక పురుగుల జీవితచక్రం ముగియడంతో పంటలపై రోగాల ఉధృతి తగ్గుతుంది. – వసంత్రావు, ఏవో, లక్ష్మణచాంద -
నిర్మల్
పర్యావరణమే పరమౌషధం! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుతుండగా ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కథనం.. పంట మార్పిడి విధానమే మేలు గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202512లోu ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి భైంసాటౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్లో సూచనలు చేశారు. అలాగే భరోసా కేంద్రంలో కుటుంబ కలహాలకు సంబంధించి కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ ఇప్పించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, మల్లేశ్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఎస్సైలు శ్రీనివాస్, శంకర్, మహిళా ఎస్సై పెర్సిస్, షీ టీమ్ సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు. నిర్మల్: ఊరూరా.. వాడవాడలా.. జిల్లా నలుమూలలా గంజాయి భూతం వ్యాపించింది. యువతరా న్ని మత్తుకు బానిసలుగా మార్చి, వారి జీవితాలను నాశనం చేస్తోంది. దారుణమేమంటే.. బడీడు పిల్ల ల భవితనూ పీల్చేస్తోంది. నాలుగు డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థం సమాజాన్ని నాశ నం చేసే దిశగా తీసుకెళ్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా గంజాయిదందా విస్తరించడం ఆందోళనకరమైన విషయం. కొందరి స్వార్థం.. సమాజం నాశనం కుభీర్ నుంచి కడెం దాకా జిల్లావ్యాప్తంగా గంజా యి గుప్పుమంటోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికా రులు చేస్తున్న దాడుల్లో మారుమూల పల్లెలు, తండాల్లో గంజాయి సాగుతో పాటు మత్తుమందును పీలుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే కొన్ని శివారు ప్రాంతా లు గాంజా అడ్డాలుగా మారాయి. అడ్డదారుల్లో ఎ క్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థానికి సమాజమే నాశనమవుతోంది. తక్కువ పైసలతో ఎక్కువ మత్తు వస్తుందంటూ యువతను గంజాయివైపు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గంజాయితో పాటు మత్తుమందు ఇంజక్షన్ల ను విక్రయిస్తున్న ముఠా ఏకంగా జిల్లాకేంద్రంలోనే వెలుగులోకి రావడం తెలిసిందే. యువతతో మత్తు ఎక్కించడమే కాకుండా వారినే విక్రేతలుగా మారుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి గంజాయి వస్తోంది. గతంలో కొంతమంది యువకులు జిల్లా నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి గంజాయి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బడీడు పిల్లలకూ.. జిల్లాలో గంజాయి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువత వరకే ఆగిపోకుండా ఈ మత్తు బడీడు పిల్లలకూ చేరుతోంది. జిల్లాకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోనూ బడిపిల్లలు గంజాయి బారినపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది గంజాయికి బానిసలుగా మారి, డబ్బుల కోసం తమ ఇంట్లోనే దొంగతనాలు చేసిన దాఖలాలున్నాయి. పలువురు యువకులు రో డ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలూ కోల్పోయా రు. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్ల లను డీ అడిక్షన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. స్థాని కంగా కాకుండా నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రులకు వెళ్లి మానసిక చికిత్స చేయిస్తున్నారు. పెరుగుతున్న ఫిర్యాదులు జిల్లాలో రోజురోజుకూ గంజాయి తీవ్రతతో పాటు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల సమష్టి నిర్ణయం తీసుకున్నారు. గంజాయి విముక్త నిర్మల్ జిల్లా చే యాలన్న లక్ష్యంతో ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్తుమందులపై ఉక్కుపాదం మోపేందుకు అందరి సహకారం కావాలంటున్నా రు. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ పేరిట ఎస్పీ జానకీషర్మి ల పకడ్బందీగా గంజాయి అమ్మకాలపై దాడులు చే పడుతున్నారు. మత్తుపదార్థాలకు సంబంధించి స మాచారం 8712659599 నంబర్లో ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. ఈ నంబర్కు వస్తున్న ఫిర్యాదులు, వరుస తనిఖీల ఆధారంగా కొంతకాలంగా చాలా మంది గంజాయి విక్రేతలను పట్టుకుంటున్నారు. అవగాహన కల్పించేందుకు.. అవగాహన లోపం కారణంగానే ఎక్కువమంది యువకులు, విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నట్లు తేలడంతో ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాషఅభినవ్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ బృందానికి సంబంధించిన వాహనా నికి పచ్చజెండా ఊపారు. జిల్లా పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి బృందాలతో జిల్లా నలుమూలలా గంజాయితో కలిగే అనర్ధాలతో పాటు బాల్యవివాహాలు, బాలకార్మికులు తది తర అంశాలపైనా అవగాహన కల్పించనున్నట్లు క లెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, కళాకారులు సుదర్శన్, నాగరాజు, రఘునాథ్, లక్ష్మణ్, మాధవి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ ఫ్రీ నిర్మల్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్‘పది’ సప్లిమెంటరీకి ఏడుగురు గైర్హాజరు నిర్మల్ రూరల్: జిల్లాలో బుధవారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మందికి గాను నలుగురు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధి కారి ముడారపు పరమేశ్వర్ తనిఖీ చేశారు. న్యూస్రీల్డీఎస్సీ–2024 టీచర్కు షోకాజ్ నోటీస్! నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినందుకు రాష్ట్ర విద్యాశా ఖ అధికారులు ఓ ఉపాధ్యాయునికి షోకాజ్ నో టీస్ జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశా రు. జిల్లాకు చెందిన గైని సునీల్కుమార్ డీఎస్సీ–2024లో ఎస్జీటీ ఉద్యోగం పొందాడు. సర్టిఫికె ట్ వెరిఫికేషన్ సమయంలో అతను నకిలీ పత్రాలు అందించి ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ కు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలోని ఇతర జి ల్లాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా వి చారణ చేపట్టారు. విచారణలో గైని సునీల్ అందించిన స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉపాధ్యాయుని అనర్హుడిగా ప్రకటించి షోకాజ్ నోటీస్ జారీ చేయాల్సిందిగా డీఈవో రామారావును ఆదేశించారు. జిల్లాలో ‘మత్తు’పై ఉక్కుపాదం గంజాయి రహిత జిల్లాకు కృషి కలెక్టర్, ఎస్పీ సంయుక్త కార్యక్రమం ఊరూరా.. వాడవాడలా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ‘గాంజా గస్తీ’ చేపడుతున్న ఎస్పీ మత్తుతో భవిష్యత్ అంధకారం మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్ అంధకారమవుతోంది. ఉజ్వల భవిష్యత్ను చేతులారా నాశనం చేసుకోవద్దు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించిన ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం. మత్తురహిత జిల్లాకు కృషిచేద్దాం. – అభిలాషఅభినవ్, కలెక్టర్ కలిసికట్టుగా కృషి చేస్తేనే.. జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలపై శాఖాపరంగా సీరియస్గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ చేపడుతున్నాం. యువతను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కోసం ఐక్యంగా ముందుకురావాల్సిన అవసరముంది. – జానకీషర్మిల, ఎస్పీ -
పదేళ్లుగా తిరుగుతున్నా.. పట్టించుకుంటలేరు
ఖానాపూర్: ‘నా భూ సమస్యను పట్టించుకోరా..పదేళ్లకు పైగా తిరుగుతున్న. ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోవాలి.. నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న అరెకరం భూమి నాకు ఇప్పించాలి. ఎన్నిసార్లు తిరగాలి. ఇప్పుడైనా న్యాయం చేస్తరా.. చేయరా.. ఎవరూ పట్టించు కుంటలేరు. ఎప్పుడు చేస్తరు.. మోకా మీద నేనే ఉన్నా కనిపించడం లేదా’అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతు అల్లెపు వెంకటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే... సదస్సులో భూ సమస్యపై రైతు వెంకటి కుమారుడు పీటర్ దరఖాస్తు అందజేసి వెళ్లారు. ఆ తర్వాత వెంకటి సదస్సుకు వస్తూ వస్తూనే పంచాయతీ కార్యదర్శి భోజన్నను భూ సమస్యపై ప్రశ్నించసాగాడు. దీంతో తహసీల్దార్ సుజాత జోక్యం చేసుకొని సమస్య ఏదైనా ఉంటే చెప్పాలని వారించే ప్రయత్నం చేశారు. అయినా రైతు వినిపించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు.ఏఎస్ఐ రాంచందర్ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ‘నువ్వేం పోలీసువు’అంటూ ఆయన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా బలవంతంగా బయటకు లాక్కెళ్లాడు. రైతు ప్రతిఘటించడం, ఏఎస్ఐ లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్గా మారా యి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బా సర డీఐజీ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదీ భూ సమస్య నేపథ్యం.. అల్లెపు వెంకటికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఓ వ్యక్తికి 14 ఏళ్ల క్రితం ఎకరం భూమిని విక్రయించాడు. అయితే ఆయన ఎకరన్నర భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆలస్యంగా గుర్తించిన వెంకటితోపాటు కుటుంబ సభ్యులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండెకరాల్లో తానే ఉన్నానని, అర ఎకరం భూమి తనకే వచ్చేలా చూడాలని కోరుతున్నాడు. కాగా, ‘వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా.. మీరు చెబుతున్న ప్రజాపాలన ఇదేనా’అంటూ మాజీమంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
కడెం: నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి సాధ్యమని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.శేషు, మండల వ్యవసాయాధికారి పి.దినేశ్ అన్నారు. మండలంలోని పెద్దబెల్లాల్ రైతు వేదికలో ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. సాగులో నాణ్యమైన విత్తనం ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో ఏఈవోలు నవీన్, జె.సాయికృష్ణ, డి.శాలిని, రైతులు పొద్దుటూరి సంతోష్ రెడ్డి, అకుల శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
● కొన్ని నిర్మాణ దశలో.. ● మరికొన్ని శిథిలావస్థలో.. ● తాత్కాలిక రోడ్లతో పొంచి ఉన్న ప్రమాదం
ఖానాపూర్ :ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్, అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాల్లో రెంకొని వాగుపై సుమారు రూ.10 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. అధికారుల అలసత్వం కారణంగా తుది దశ పనులు సకాలంలో పూర్తి కాలేదు. ఈ వంతెన 20కి పైగా గ్రామాలతోపాటు మంచిర్యాల, జన్నారం వైపు వెళ్లే ప్రధాన రహదారిగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వరదలకే గతంలో తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు నెలల తరబడి రాకపోకలు నిలి చిపోయాయి. ఈ ఏడాది కూడా వానాకాలం మొదలైనా వంతెన పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సుభాష్నగర్లో.. సుభాష్నగర్ శివారులో హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు మీదుగా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ ఏడాది కూడా ఆ పరిస్థితి తప్పేలా లేదు. గతంలో వర్షాల కారణంగా ఈ రోడ్డు పలుమార్లు కొట్టుకుపోయాయి. దీంతో వాగు అవతలి వైపున ఉన్న మైనారిటీ స్కూల్ విద్యార్థులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిహద్దు గ్రామాల్లో లో–లెవల్ వంతెనలు.. తానూరు : మహారాష్ట్ర సరిహద్దులోని ఝరి(బి), ఝరి(బి) తండా, మొగ్లి, మసల్గా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో లో–లెవల్ వంతెనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే వాగులో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పొలాలు, చేల వద్దకు ఎరువులు తీసుకెళ్లడం కష్టమవడంతో రైతులు ముందస్తుగా నిల్వలు చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొగ్లి, మసల్గా గ్రామాల నుంచి మండల కేంద్రమైన తానూరుకు చేరాలంటే 10 కిలోమీటర్లు చుట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు హైలెవల్ వంతెనలు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని డీఈవో రామారావు సూచించారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం నాటికి బడులన్నిటినీ శుభ్రపరచి రెడీ చేయాలన్నారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే వసతులు, సౌకర్యాలను వివరించాలని సూచించారు. ఇందులో అధికారులు రమణారెడ్డి, సమన్వయకర్తలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్కుమార్, సలోమి కరుణ, శ్రావణి, మహేశ్వర్, కృష్ణవేణి, ఎంఈవోలు పాల్గొన్నారు. -
నిర్మల్
అంతర్జాతీయ సదస్సులో.. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో బాసర ఆర్జీయూకేటీ నుంచి 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు.8లోu బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రుతిక్కుమార్ ప్రతిభ కుంటాల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన అట్టోలి రుతిక్కుమార్ ప్రతిభ కనబర్చాడు. కుంటాలకు చెందిన చింత ప్రభ–అట్టోలి సంజీవ్కుమార్ దంపతుల రెండో కుమారుడు రుతిక్కుమార్ సోమవారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 874 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 137 ర్యాంకు సాధించాడు. తండ్రి సంజీవ్ కుమార్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మామడ మండలంలో వాటర్షెడ్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తల్లి ప్రభ కుభీర్ మండలంలోని గోడాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. రుతిక్ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు నిర్మల్ వాసవి పాఠశాలలో, ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివి పరీక్షలు రాసి అర్హత సాధించాడు. సతీశ్.. ఊళ్లో ఉంటే పిల్లల చదువులకు కష్టమవుతుందని కుటుంబంతో కలిసి నిర్మల్ వచ్చి అద్దెకుంటున్నాడు. ఉన్న పొలం కౌలుకు ఇచ్చి, జిల్లాకేంద్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కష్టపడుతున్నాడు. భార్య టైలరింగ్ చేస్తూ చేదోడుగా నిలుస్తోంది. పాప, బాబు ఇద్దరినీ పేరున్న స్కూల్లోనే వేశారు. ఈమధ్య సరైన మార్కెట్ లేకపోవడంతో ఉద్యోగం, పార్ట్టైం సంపాదన ఇబ్బందికరంగా మారింది. ఇంతలోనే జూన్ రానే వచ్చింది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే ఆ స్థాయిలో ఫీజుల చెల్లింపులు చదివించాల్సిందే. ఏ ఉద్దేశంతోనైతే ఊరు వదిలి పట్టణం వచ్చామో..! అది నెరవేరుతుందా..! అన్న డైలామాలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేసేది ఫీజుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. బడీడు పిల్లలున్న ప్రతీ ఇంట్లో ఇప్పుడు వారి చదువులు, ఫీజుల ముచ్చటే నడుస్తోంది.నిర్మల్: పాఠశాలలు మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. పరిమిత వసతులు, సామాన్యమైన బోధనా పద్ధతులతో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు ఇష్టపడక, అధిక ఫీజులతో కూడిన ప్రైవేటు చదువులు కొనేందుకు కష్టపడుతున్నారు. విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారడం, ఫీజుల భారం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తల్లిదండ్రులను కలవరపరుస్తున్నాయి. తల్లిదండ్రులకు ఆర్థిక భారం విద్యా సంవత్సరం ఆరంభం అంటేనే తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది. పుస్తకాలు, యూ నిఫామ్లు, బస్సు ఛార్జీలు, పరీక్ష ఫీజులు, వార్షిక ఫీజులు వంటి ఖర్చులు ఒక్క నెలలోనే కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా ఖాళీ చేస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు ఏడాది పొడవునా కష్టపడి సంపాదించిన డబ్బును ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. కొంతమంది తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేయడం, ఆస్తులను అమ్మడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత, బోధనా నాణ్యతలో లోపాలు తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల వైపు నెట్టివేస్తున్నాయి. అయితే, ఈ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి, అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు.. ప్రస్తుత పోటీ యుగంలో పిల్లలు విజయవంతం కావాలంటే నాణ్యమైన విద్య అవసరమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ ఆలోచనతో, చాలామంది తమ పిల్లలను జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పంపి, హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఐదు, ఆరు తరగతుల నుంచే ఈ ప్రయాణం మొదలవుతోంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబాలకు ఈ ఖర్చులు పెద్ద భారం కాకపోవచ్చు, కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఆర్థిక ఒత్తిడిని భరించలేక నలిగిపోతున్నాయి. ‘పిల్లలకు మంచి చదువు అందిస్తే ఆస్తులు లేకపోయినా భవిష్యత్తు బాగుంటుంది‘ అనే ఆలోచనతో ఎన్ని కష్టాలైనా భరిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘క్యాష్’ చేసుకుంటున్న స్కూళ్లు.. తల్లిదండ్రుల ఈ ఆవేదనను, ఆశలను కొన్ని ప్రైవేటు పాఠశాలలు నగదుగా మార్చుకుంటున్నాయి. ‘వరల్డ్, ఒలింపియాడ్, టెక్నో, ఐఐటీ, ప్రైమ్‘ వంటి ఆకర్షణీయమైన పేర్లతో, తాము ప్రత్యేకమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేస్తూ, విద్యా చట్టాలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల బలహీనతను ఈ పాఠశాలలు వినియోగించుకుంటున్నాయి. ఈ పాఠశాలలపై నియంత్రణ లేకపోవడం, బాధ్యతాయుతమైన అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఫలితంగా, ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. కరాటే బెల్ట్లు ప్రదానం నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఝాన్సీలక్ష్మీబాయి ఉచిత కరాటే శిక్షణలో 30 రోజులుగా బాలికలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 11 మంది బాలికలకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తేజేందర్సింగ్ భాటియా, ఉపాధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, అమ్ముల భూషణ్, కరాటే శిక్షకురాలు మృణాళిని, తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ త్వరలో పాఠశాలల పునఃప్రారంభం ఏటా పెరుగుతున్న ఫీజులు మంచిచదువు పేరిట వల ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిర్మల్టౌన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జూన్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఊరేగింపులు ధర్నాలకు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిషేధిత ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడరాదన్నారు. డీజేలు , లౌడ్ స్పీకర్ వంటివి పెట్టొద్దని తెలిపారు. ఈ సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ కింద శిక్ష అనుభవిస్తారని వెల్లడించారు. విద్యార్థుల నమోదుకు కళాజాతఅమలు కాని ఉత్తర్వులునిబంధనలు పాటించాలి.. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి. ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి లేదు. ఈ విద్యాసంవత్సరం వీటిపై దృష్టిపెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిసదుపాయాలతో విద్యనందిస్తున్నాం. –రామారావు, డీఈవో ఫీజుల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల ఆగడాలు అంతేలేకుండా పోయాయి. 2017 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతత్వంలోని ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2018 మార్చిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తూ ఏటా 10 శాతం ఫీజులను పెంచుకోవచ్చునని ప్రతిపాదనలు చేసింది. కానీ ఇంత వరకు ఆ కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 2020 ఏప్రిల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 46ను జారీ చేసింది. జీవో నంబర్ 01 ప్రకారం ట్యూషన్ ఫీజులను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ, ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకుని మండల విద్యాశాఖ అధికారులకు వరకు ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అధికారుల తీరుపై అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తరగతుల వారీగా నెలకు స్కూళ్ల ఫీజులు(రూ. లలో).. తరగతి కనిష్టం గరిష్టం నర్సరీ 800 1,200 1వ 950 1,800 2వ 1,000 2,000 3వ 1,100 2,500 4వ 1,200 3,000 5వ 1,300 3,000 6వ 1,350 3,500 7వ 1,400 4,000 8వ 1,500 4,000 9వ 1,550 4,500 10వ 1,600 5,000 -
రైతుల చెంతకే రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్లక్ష్మణచాంద/నిర్మల్ రూరల్: రైతుల భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల చెంతకే రెవెన్యూ అధికారులు వస్తారని సదస్సులు ఏర్పాటు చేస్తారని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని కనకాపూర్లో, నిర్మల్ రూరల్ మండలం అక్కపూర్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యు సదస్సులకు అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన కలెక్టర్కు ఎంపిడీవో రాధ కనకాపూర్ నర్సరీలో పెంచిన పైన్ ఆపిల్ మొక్క అందించి స్వాగతం పలికారు. తమ నర్సరీలో పెంచిన మొక్కతో స్వాగతం పలకడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు తనకు ఇద్దరు కుమారులని సమానంగా భూములు పంపకం చేసి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ అన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అన్నదాతలు తమ భూసమస్యల పరిష్కారానికి రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి సూచనల మేరకు జిల్లాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి పోర్టల్తో రైతులు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. గ్రామాలలో సదస్సులు నిర్వహించడానికి రెండు రోజుల ముందుగానే గ్రామంలో చాటింపు చేయించి రైతులకు తెలిసేలాగా చేస్తున్నామన్నా రు. తమ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సమయంలో ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలిపితే రశీదు పొందాలని సూచించారు. ఈనెల 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కుంటాల మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించామని, అక్కడ వచ్చిన సమస్యలలో 50 శాతం పరిష్కరించామని తెలిపారు. సదస్సులలో తీసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తామని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూసమస్యలు పరిష్కరించు కోవాలని సూచించారు. అక్కాపూర్ పాఠశాలలో తరగతిగదులు, ఇంకుడు గుంత, లైటింగ్ వంటి వసతులను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్ఖాన్ పాల్గొన్నారు. -
అందరికీ సమాన సేవలు
నిర్మల్టౌన్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు పోలీసు సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని, ధనిక, పేద తేడా లేకుండా అందరికీ సమాన సేవలు అందించా లని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీ సులకు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సేవా పతాకాలు అందుకున్న 17 మంది పోలీసులను అభినందించారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీణ్కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో..
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కార్యాలయంలో ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావుపటేల్, ఖానాపూర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జాతీయ పతాకాలు ఎగురవేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజాసంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రభుత్వం ఆదర్శంగా నిలుపుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్రావు, ఏఎస్పీ అవినాష్కుమార్ జెండా ఆవిష్కరణలు చేశారు. -
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అవతరణ వేడుకలు
అమరుల త్యాగఫలమే తెలంగాణ నిర్మల్చైన్గేట్: సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మొద ట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి, బహుమతులను అందజేశారు. వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అధికారులు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో... రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా పరి షత్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండా ఎగురవేశారు. జెడ్పీ సీఈవో గోవింద్, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
సంక్షేమంలో ముందంజ
నిర్మల్● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథం ● అన్నివర్గాలకు సమన్యాయం ● జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి ● రాష్ట్రఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ● జిల్లాకేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపరేడ్ కమాండెంట్గా ఏఎస్పీ నిర్మల్ టౌన్: హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా కమాండెంట్గా ప్రాతినిధ్యం వహించారు. సీఎం రేవంత్రెడ్డికి తన సిబ్బందితో గౌరవ వందనం చేశారు. ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిశారు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. IIలోuమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నటరాజ కళానికేతన్ ఎప్పం రంజిత ఆధ్వర్యంలో సుష్మ గ్రూప్ సభ్యులు పేరణి నృత్యం, స్వరూపిణి నృత్య కళాక్షేత్రం నవ్య ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు అదివో అల్ల దివో.., పాడ్యాం పాండవం నిత్య శ్రేషన్, బన్నీ సారథ్యంలో జయహో జయహో తెలంగాణ.. రాజశేఖర్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాన్విత గ్రూపు కారం పొడితో కదిలిన సెల్లె.. రోకల్ బండతో కదిలిన పల్లె పాటకు తెలంగాణ నృత్యం.. భైంసా పట్టణానికి చెందిన శర్వాణి సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని కీర్తిస్తూ నృత్యం.. శివ సాయి కళాక్షేత్రం కుభీర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి తెలిసేలా నృత్యం చేశారు. అనంతరం కళాకారులకు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల బహుమతులు అందజేశారు. డ్రగ్ ఫ్రీ నిర్మల్ లక్ష్యంగా.. నిర్మల్చైన్గేట్: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కళాజాత నిర్వహించనున్నట్లు వివరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాలల చట్టాలపైనా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మూడు నెలలుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజా గస్తీ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే యువత డ్రగ్స్కు దూరంగా ఉండేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్మల్: ‘అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో స్వరాష్ట్రం సాధించుకుని 11 ఏళ్లు నిండాయి. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్తో సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకుసాగుతోంది’ అని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అధికారిక వేడుక నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సందేశాన్ని చదివి వినిపించారు. ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ అన్నిరంగాల్లో దశదిశలా అభివృద్ధి చెందుతోందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాగా మారిన నిర్మల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ.. అన్నిరంగాల్లో ముందంజలో నిలిపే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. పథకాలతో ప్రజలకు లబ్ధి.. ● ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. ఆర్టీసీబస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,83,85,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ● ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామన్నారు. ● భూభారతి ద్వారా ప్రజల భూసంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. జిల్లాలో కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 667భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామన్నారు. ● రైతుసంక్షేమమే ధ్యేయంగా జిల్లాలో 71,565 కుటుంబాలకు రూ.658కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద 1.36 లక్షల మంది రైతులకు రూ.121కోట్లు ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ● విద్య, వైద్యరంగాల్లో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు రాజయ్య వివరించారు. అమ్మరక్షిత కార్యక్రమం ద్వారా 977 మంది గర్భిణులకు కౌన్సెలింగ్, వైద్యసేవలు, పోషణ మార్గదర్శకాలు అందించామన్నారు. ఈఏడాది పదోతరగతి ఫలితాల్లో జిల్లా 96.70 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. ● కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో చేపట్టిన బాలశక్తి ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. ఇప్పటి వరకు 19 వేల మంది విద్యార్థులకు హెల్త్స్క్రీనింగ్ చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలను అందించడం అభినందనీయమన్నారు. అలాగే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జిల్లా చారిత్రక, సాహిత్య, కళానైపుణ్యాలను ప్రస్తుత తరానికే తెలిపే ప్రయత్నం చేశారన్నారు. ● జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మహిళలు, పిల్లల కోసం పోలీసుశాఖ కృషిచేస్తోందన్నా రు. ఎస్పీ జానకీషర్మిల ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో తొలిసారి మహిళాకానిస్టేబుళ్లతో శివంగిటీమ్ను తయారు చేయడం ప్రశంసనీయమన్నారు. ● గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రస్థాయిలో ఎన్నోవిజయాలను సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల రికవరీలో రాష్ట్రస్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించడం, సమీకృత వ్యవసాయానికి పెప్సికో పురస్కారం అందడం అభినందనీయమన్నారు. అన్నిశాఖల ద్వారా ఆయారంగాల్లో వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి అనసూయ సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. . దుబాయ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఖానాపూర్: దుబాయ్లోని జేబల్ అలీ ప్రాంతంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గల్ఫ్ కార్మికులు తెలంగాణ తల్లి చిత్రపటం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు సాగర్, లక్ష్మణ్, గంగాధర్, రాకేశ్, వినయ్, పవన్సాయి, పెద్ది రవి తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలునిర్మల్ రూరల్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సోమవార్పేట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా పరీక్షల అధికారి పరమేశ్వర్ తెలిపారు. -
భూభారతిపై ఆశలు
● నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.. ● ధరణిలో పూర్తి వివరాలు లేక ఇబ్బందులు ● పెండింగ్లోనే వందల అర్జీలు ● కొత్త చట్టంతో పరిష్కారం అయ్యేనా? ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతుపేరు కొకినోల్ల రుక్మాబాయి. భైంసా మండలం ఇలేగాం శివారులో 203/క సర్వే నంబరులో రెండు ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వం 645936 నంబరుతో ముద్రించిన 351 క్రమ సంఖ్య ఆధారంగా పట్టాపాసుపుస్తకం జారీ చేసింది. 010435 యూనిక్ ఐడీ నంబరు కేటాయించి ఆన్లైన్లో వివరాలు నమోదుచేసింది. తర్వాత రెవెన్యూ సర్వే నిర్వహించి పట్టాపాసుపుస్తకంపై అన్ని సరిగ్గా ఉన్నాయని ముద్రించింది. ఆన్లైన్లో పహణీ తీసుకుని భైంసాలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరేళ్ల క్రితమే పంటరుణం తీసుకుంది. మరుసటి ఏడాది ధరణిలో కొత్త పట్టాపాసుపుస్తకం ఇవ్వలేదు. ఆన్లైన్లో మహిళా రైతు వివరాలు నమోదుచేయలేదు. దీంతో ఆన్లైన్లో గతంలో ఉన్న వివరాలన్ని కనిపించకుండాపోయాయి. కొత్త పహణీ రాకపోవడంతో రుణం రీషెడ్యూల్ కావడంలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పటీ పట్టాపాసుపుస్తకం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన సాయం కూడా అందడంలేదు. రుణ మాఫీకి అర్హత ఉన్నా.. కాలేదు. భైంసా: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో జిల్లాలో భూ సమస్యలు పెరిగాయి. ఒకరి భూమి మరొకరి పేరిట నమోదైంది. ఉన్న భూమి మాయమైంది. కొందరికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినా ఆన్లైన్లో భూమి చూపించడం లేదు. ఇలా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. పాసుపుస్తకంలో భూమి ఉన్న పొజీషి యన్లో లేక పోవడం, వారసత్వంగా రావాల్సిన పౌతి కోసం ధరణిలో ఆప్షన్ లేకపోవడం రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిసారి జిల్లా రైతులు తమ ఇబ్బందులను అధికారులకు చెబుతునే ఉన్నారు. వెంటాడుతున్న ఇబ్బందులు... జిల్లా రైతులను ధరణి సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో సాదాబైనామాల ద్వారా భూములు కొని క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఇచ్చారు. కొందరి దగ్గర రశీదులు ఉన్నాయి. మరికొందరి దగ్గర లేవు. దరఖాస్తులు ఇచ్చిన వారిలో చాలా వరకు క్రమబద్ధీకరణజరుగలేదు. పట్టాభూములై ఉండి కూడా నిషేధిత జాబితాలో వివరాలు చేర్చారు. చాలా మంది రైతుల పట్టాపాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, ఒకరి విస్తీర్ణం మరో రైతు పేరున చేర్చడం వంటి సమస్యలు ఉన్నాయి. గ్రామాల్లో ఎటుచూసినా హద్దుల సమస్య ప్రధానంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలకు వెళ్లేదారులు, జరినాలాలు, మూసి వేసిన రైతులకు అక్రమంగా పట్టాలు జారీచేశారు. జరినాలాలు మూసుకుపోవడంతో వర్షాకాలంలో రైతుల పంటపొలాలు జలమయమవుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా జరినాలాల భూముల వివరాలు ఎక్కడ కూడా నమోదుచేయడంలేదు. కొత్త చట్టంపై ఆశలు.. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి అమలు కానుంది. ఇప్పటికే కుంటాల మండలం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొని రైతుల వద్దకే అధికారులు వస్తారని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లోనూ మంగళవారం నుంచి భూ భారతి అమలు కానుంది. ప్రతీ మండలంలో ప్రత్యేక బృందాలు గ్రామాలకు వెళ్లి భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈలోగా జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్లలో రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని మండల రెవెన్యూ అధికారులను జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పరిష్కారంకాని సమస్యల అర్జీలు ఇచ్చేందుకు బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు. -
చెక్పోస్టు తనిఖీ చేసిన సీఐ
జన్నారం: మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తని ఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశం ఉన్నందువల్ల ముందస్తుగా ప్ర తీ వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఒకరిపై కేసు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన మహ్మద్ అలీమొద్దీన్ సోమవారం మహారాష్ట్ర నుంచి పశువులను తీసుకువచ్చి వధించేందుకు సిద్ధంగా ఉంచాడు. తన ఇంటి ముందు కట్టి ఉంచిన ఎనిమిది ఎద్దులను వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
ఆసిఫాబాద్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన రామ్చరణ్ (14)కు ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలుకు వేసిన ఇనుప రాడ్డును (ఇంప్లాంట్ రిమూవల్ ఆఫ్ క్లానికల్ బోన్ ఆపరేషన్) తొలగించారన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఉండడంతో రానున్న రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో హెర్నియా, ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు కూడా ఆందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన సేవలను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ విజయవంతంగా చేసిన వైద్యులు తిరుమలేష్, నర్సింగ్ స్టాఫ్ సుమిత్ర, హేమలతతో పాటు థియేటర్ అసిస్టెంట్ మౌనికను అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ కృష్ణ, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. -
సీవోఈ విద్యార్థుల ప్రభంజనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్–2025 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించింది. ఇందులో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా సీవోఈ విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు గత మే 18న నిర్వహించారు. 14 మంది పరీక్షకు హాజరుకాగా ఐదుగురు అత్యుత్తమ ర్యాంకులు, మరో నలుగురు ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. సదరు విద్యార్థులను ర్యాంకుల ప్రాతిపదికన మంగళవారం నుంచి కౌన్సిలింగ్కు పిలవనున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు షేక్ సుభాన్ 32,278, ఎస్.ఆదర్శ్ 3,285, కె.రంజిత్ 3,438, జి.చరణ్ 4,346, డి.రాజేందర్ 5,414 ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. కె.రామ్చరణ్ తేజ 296, సీ.హెచ్.సాయికుమార్ 311, ఎస్.వెంకటేశ్వర్ 1,952, బి.అంజిబాబు 4,790 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్కుమార్, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. -
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం
ఐఐటీ అడ్వాన్స్డ్లో అల్ఫోర్స్కు ర్యాంకులుజేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ విజయభేరికొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్–2025 ఫలితాల వివిధ కేటగిరీల జా తీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్.సాయిధృవ 557, ఎన్.అనిరుధ్సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్ 1,329, ఆర్.గోవర్ధన్ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్ రాజు 1,640, ఇ. శశిలాల్ 1,899, కె.విరేంద్రప్రసాద్ 2,120, డి.కార్తీక్రెడి్డ్ 2,150, ఎస్.విఘ్నేశ్ 2,293, డి.అభిరామ్ 2,349, ఎ.శశిప్రితమ్ 2,463, ఇ.అంకిత్సాయి 2,613, మహ్మద్ అబ్ధుల్ హక్ 2,766, డి.విశాల్ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది వి ద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కరీంనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్.పవన్ 204వ ర్యాంక్, ఎం.కార్తీక్ 1,009, బానోవత్ సుమన్ 1,049, బుర్ర మాధవ్ 1,471, నీరటి శ్రీచరణ్జోష్ 1,321, గుగులోతు శేఖర్ 1,328, ముదిగంటి రుషిశ్వర్రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్కుమార్ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్ ఇన్చార్జిలు, అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కరీంనగర్: జేఈఈ–అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్నాయక్ 194, డి.మహేశ్ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్.ఐశ్వర్య 1,129, ఠాగూర్ 1,274, నవదీప్ 1,701, నిస్సీ జాస్పర్ 2,172, ఎ.అజయ్ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్డ్ లాంగ్టర్మ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన ‘సహనా’
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహనారెడ్డి జాతీయస్థాయిలో 3,860 ర్యాంకు సాధించి సత్తా చాటింది. జిల్లాకేంద్రానికి చెందిన సాదు సారిక–రాంరెడ్డి దంపతుల పెద్ద కుమార్తె సహనారెడ్డి చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణిస్తోంది. పాఠశాల విద్యను స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాదులోని నారాయణ కళాశాలలో అభ్యసించింది. మెయిన్స్ ఫలితాల్లో 99.49 పర్సెంటైల్, అడ్వాన్స్డ్ 3,860 ర్యాంకును కై వసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంకును సాధించినట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఆర్జీయూకేటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
బాసర: బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలంగాణ ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఒక సామూహిక చైతన్యమని, సమానత్వం కోసం సాగిన పోరాటమన్నారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ, ఎంటెక్ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్ డాక్టర్ విట్టల్, నాగరాజు, డాక్టర్ మహేష్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కన్వీనర్ ప్రభాకర్ రావు, పీడీ శ్యాంబాబు, పీఈటీలు స్వప్న, వసంత, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పాల్గొన్నారు. ఉట్నూర్రూరల్: ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు?
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లో గతేడాది నవంబర్లో మహిళ హత్యకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి (55) స్నేహితురాలు భీమక్కతో కలిసి మంచిర్యాలలోని గణేశ్నగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కొంత కాలం తర్వాత ఇద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. నవంబర్ 30న అదే ఇంట్లో లక్ష్మి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. ఎట్టకేలకు హత్యకు సహకరించిన ఓ మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ద ర్శించుకునేందుకు సోమవారం తెలంగాణ, ఆ ంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆల య అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల అభ్యాసం టికెట్లు 280, 150 అక్షరాభ్యాసం టికెట్లు 425, వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా ఆలయానికి రూ.8.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొనసాగుతున్న క్రికెట్ ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అ సోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపే ట్ బెటాలియన్లో గ్రీన్, యెల్లో జట్లకు పోటీలు నిర్వహించగా మొదటి ఇన్నింగ్స్లో గ్రీన్ జ ట్టు 328 పరుగులు, యెల్లో జట్టు 274 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్లో యెల్లో జ ట్టు 158 పరుగులు, గ్రీన్ జట్టు 274 పరుగులు సాధించగా, గ్రీన్ జట్టు విజయం సాధించినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జి.చరణ్, బెస్ట్ బ్యాట్స్మెన్గా అవినాశ్ జాదవ్, బెస్ట్ బౌలర్గా అనిరుధ్ నిలిచారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణమంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. పది, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఐటీఐలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 1, 2024 నాటికి 14సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. మొదటి దఫా అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాఖలు ఈ నెల 2నుంచి 21 వరకు ఉంటుందని తెలిపారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆయా ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. తెలంగాణలో సింగరేణి కీలకంమందమర్రిరూరల్: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ కీలకమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ ఆధ్వర్యంలో సింగరేణి హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొత్త బొగ్గు బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్, ఎస్వో టూ జీఎం విజయ్ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: పట్టణంలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమయత్ నగర్కు చెందిన జాదవ్ గంగాధర్, గణేశ్, దిగంబర్ జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో డమ్మీ తాళాలను ఉపయోగించి 8 బైక్లను అపహరించారు. వాటిని అమ్మేందుకు స్థానిక బంగల్పేట్ శివారుకు వెళ్లినట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. -
సరిహద్దులో ‘ఏనుగు’ అలర్ట్
చింతలమానెపల్లి(సిర్పూర్): మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో అటవీశాఖ అధికారులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదీ తీర గ్రామాల్లోని ప్రజలను సోమవారం సాయంత్రం అప్రమత్తం చేశారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లి, బూరెపల్లి, కోర్సిని తదితర గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు. గతేడాది మహారాష్ట్ర వైపు చౌడంపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నదిని దాటి బూరెపల్లి గ్రామం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఏనుగు ప్రవేశించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. గతేడాది ఏప్రిల్లో మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన ఓ ఏనుగు దాడిచేయడంతో బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్, పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డిప్యూ టి రేంజ్ అధికారి హైమావతి ఆధ్వర్యంలో సరిహద్దులోని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వ్య వసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించా లని, ఏనుగుపై దాడికి ప్రయత్నించవద్దని సూచించారు. నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి పట్టణంలోని రహదారులపై ఏనుగులు తిరగడం సంచలనం సృష్టించింది. చాముర్షి తాలూకా అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు ప్రాణహిత నదివైపు సంచరించే అవకాశాలు ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
అ‘పూర్వ’ం.. ఆత్మీయ సమ్మేళనం
కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో 1992–93 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివినవారంతా ఆదివారం మండలంలోని కొండుకూర్లోగల ఫంక్షన్హాల్లో పూ ర్వవిద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకున్నా రు. ఆప్యాయంగా పలకరించుకుని ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. పాఠశాలలో చ దివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందజేశారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో.. దస్తురాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో 1996–1997 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివినవారంతా దస్తురా బాద్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పా ఠశాలలో చదివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా రు. విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. -
కొనుగోలు కేంద్రం పరిశీలన
సోన్: మండలంలోని పాక్పట్ల గ్రామంలోగల ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యంపై ఆరా తీశారు. తప్ప, తేమ శా తం పేరుతో రైతులను మోసగిస్తే సహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులను దోపిడీ చేసే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, సరికెల గంగన్న, మార గంగారెడ్డి, రమేశ్రెడ్డి, జక్క రాజేశ్వర్, నర్సారెడ్డి, ముత్యం, నర్సయ్య, గంగారెడ్డి, భీ ముడు, పోశెట్టి, రైతులున్నారు. -
ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ ఈనెల 13లోపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్య తిరేకత వస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో ప్రస్తుతం ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య.. ఎంత మంది ఉపాధ్యాయులున్నారు.. ఇంకా ఎంతమంది అవసరం ఉంది.. తదిత వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇవీ నిబంధనలు ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తాజాగా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. మొదటి ప్రాధాన్యం పంచా యతీ పరిధి, తర్వాత స్కూల్ కాంప్లెక్స్, ఆ తర్వా త మండలం, అనంతరం జిల్లా పరిధిలో సర్దుబా టు చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబా టు చేయాలని నిబంధనలున్నాయి. పరస్పర బ దిలీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదు. ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక పాఠశాలలు లేదా ఒక ఉన్నత, ప్రాథమిక పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉంటే వాటిని ఒక యూనిట్గా పరిగణించవ చ్చు. అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. ఇంకా మిగులు ఉంటే ఇతర అ వసరమైన స్కూళ్లకు పంపించాలి. ఈ ప్రక్రియ కోసం గత యూడైస్ వివరాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఉన్న పాఠశాలకు ఇద్దరు, 90 లోపు ఉన్న పాఠశాలకు ముగ్గురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలని, 200 దాటిన తర్వాత ప్రతీ నలభై మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కాగా, బడిబాట ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. విద్యాశాఖ ముందస్తు సర్దుబాటు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంజేస్తున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకా రం 60మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారని ఉండగా ఇది ఆచరణలో అ సాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒక టి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులుంటే ఇద్దరే ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. బోధనతోపాటు అనేక రకాల రి పోర్టులు, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంద ని, వాటికే ఒకరు సరిపోతున్నారని వాపోతున్నా రు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బడిబాట తర్వాతే చేపట్టాలి బడిబాట కార్యక్రమం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా... అదే విధంగా ఉంటుందా.. అనేది తెలుస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని సర్దుబాటు ప్రక్రియ చేపడితే బాగుంటుంది. – భూమన్నయాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పాఠశాలల వారీగా వివరాల సేకరణ 13లోపు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు -
నిర్మల్
ప్రకృతి సోయగం ప్రకృతిలో ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు పచ్చదనం పరుచుకున్న ఉమ్మడి జిల్లా అడవుల్లో వన్యప్రాణులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025భక్తులతో కిటకిటలాడిన ‘అడెల్లి’ సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్తోపాటు ఉమ్మడి నిజా మాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్తోపాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆల య కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్ ఆఽ ద్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పేరుకే అన్నట్లు మారిన పీజీ కాలేజీ భవనంన్యూస్రీల్ -
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం ఉదయం 9.55 గంటలకు సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 10 గంటలకు ముఖ్య అతిథి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 10.05 గంటలకు పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. 10.07 నుంచి 10.20 గంటల వరకు అతిథుల ప్రసంగం, 10.20 నుంచి 11గంటల వరకు వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 11.15 తేనేటి విందు తదితర కార్యక్రమాలుంటాయి. జిల్లా కేంద్రంలో సిద్ధమవుతున్న వేదిక -
దోమలకు చెక్ పెట్టాలి
నిర్మల్చైన్గేట్: దోమల అభివృద్ధిని అడ్డుకోవాలంటే లార్వా స్థాయిలోనే చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శుక్రవారం పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిపోయిన రంజన్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, చిప్పలు, టైర్లు, పగిలిపోయిన కుండలను తొలగించాలని సూచించారు. కూలర్లలో నీటిని వారానికి ఒకసారి పూర్తిగా తొలగించి తిరిగి నింపు కోవాలన్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు భోజారెడ్డి, ఆరోగ్య సహాయకులు పురుషోత్తం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మేకను కాపాడబోయి..
● బావిలో చిక్కుకున్న కాపరి బోథ్: మేకను కాపాడబోయి కాపరి బావిలో చిక్కుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన ఓ మేకల కాపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో మేకలను మేతకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు ఓ మేక పడిపోయింది. గమనించిన కాపరి మేకను కాపాడాలని బావిలోకి దిగాడు. తనకు తోడుగా వచ్చిన వ్యక్తి బావి బయట ఉండడంతో మేకను తాడు సాయంతో పైకి పంపించాడు. ఆ తర్వాత అతనూ పైకి రావడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని అతికష్టం మీద బయటకు తీశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ కూడా వచ్చింది. అప్పటికే కాపరి బావి నుంచి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరికొన్ని రోజుల్లో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వారం రోజులు గా భక్తులు భారీగా వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూ జలు చేయిస్తున్నారు. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులు వేకువజామున గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతి, శ్రీమహాకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరి పించారు. రూ.1000 అక్షరాభ్యాస టికెట్లు 255, రూ.150 అక్షరాభ్యాస టికెట్లు 650 విక్రయించా రు. ఇతర అర్జిత సేవల ద్వారా మొత్తం రూ. 8.70 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
బుద్ధ విగ్రహం తొలగింపుపై నిరసన
● భైంసా–బాసర జాతీయ రహదారిపై అంబేడ్కర్ వాదుల ఆందోళన ● బోరిగాం ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ముధోల్ : ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో ఇటీవల బుద్ధుని విగ్రహం తొలగింపు ఘటనపై దళిత సంఘాలు, అంబేడ్కర్వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో భైంసా–బాసర జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బుద్ధుని విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుమారు 5 గంటలపాటు ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రతిష్టించిన బుద్ధుని విగ్రహంపై దాడులు జరగడం బాధించిందని పలువురు పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హామీతో.. ఎస్పీ జానకీ షర్మిల శాంతియుతంగా చర్యలు చేపడతామని చెప్పినానిరసనకారులు కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ కోరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కతో చర్చలు జరిపారు. మంత్రి సంబంధిత అధికారులకు బుద్ధ విగ్రహం పునఃప్రతిష్టకు స్థలం కేటాయించాలని ఆదేశించారని విఠల్రెడ్డి, ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. రాబోయే సోమవారం బుద్ధ విగ్రహం ఆవిష్కరణ, బౌద్ధ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రభుత్వమే కాంస్య విగ్రహం నిర్మించి అందిస్తుందని హామీ ఇచ్చారు. పోలీసుల నిఘా మండలంలోని బోరిగాం గ్రామంలో ఉద్రిక్తతల దృష్ట్యా శుక్రవారం పోలీసులు నిఘా పటిష్టం చేశారు. దళిత సంఘాలు శుక్రవారం చలో బోరిగాంకు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి దళిత నాయకులు అధిక సంఖ్యలో తరలివస్తారని సమాచారం మేరకు ఉదయం నుండే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తును ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షించారు. గ్రామంలో ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. -
రైతన్నా.. జాగ్రత్త!
అప్రమత్తంగా ఉండాలి.. నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని, అదే సమయంలో రైతులకు నాణ్యతా విత్తనాల గుర్తింపుపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు కూడా బ్రాండెడ్, ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరలకు ఆకర్షితులై నాన్బ్రాండెడ్ విత్తనాలను కొనకుండా జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నారు.భైంసాటౌన్: మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు రైతులకు, వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఈ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. పేరు తెలియని, నాసిరకం విత్తనాల కారణంగా పంట మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నప్పటికీ, ఫలితాలు సంతృప్తికరంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. నాన్బ్రాండెడ్ విత్తనాల వల.. ఈ సీజన్లో వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లో విత్తనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాన్బ్రాండెడ్, నకిలీ విత్తనాలను తక్కువ ధరకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పత్తి, సోయా, వరి విత్తనాల్లో నాన్బ్రాండెడ్ రకాలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. అనధికార మార్కెట్ ద్వారా ఈ విత్తనాలు విక్రయిస్తున్నారు. తనిఖీలు నామమాత్రమేనా? నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం వ్య వసాయ, పోలీసు, రెవెన్యూ, సీడ్ కార్పొరేషన్ శా ఖలతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పా టు చేసింది. ఈ బృందాలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, నకిలీ విత్తనాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా ఈ తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు కొందరు డీలర్లతో లోలోపలి సంబంధాలు కలిగి ఉండడం వల్ల తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో నకిలీ విత్తనాల బెడద అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుచర్యలు తీసుకుంటాం... ప్రభుత్వ ఆదేశాలతో విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. స్టాక్ నిల్వలు, రిజిస్టర్లు పరిశీలిస్తున్నాం. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. గడువు ముగిసిన క్రిమిసంహారక మందులు విక్రయించొద్దు. – కోమల్రెడ్డి, ఆర్డీవో, భైంసాభైంసాలోని ఓ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు -
● శిల్పాలతో ఉపాధి పొందుతున్న సాయిశ్యాం ● శిల్పకళాధామం ఏర్పాటుచేసి పలువురి ఉపాధి.. ● ఐదు జిల్లాలకు ఇక్కడి నుంచే విగ్రహాలు..
శిల్పాలు చెక్కుతున్న సాయిశ్యాంకుభీర్: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కుచెందిన యువకుడు తన పూర్వీకుల నుంచి వస్తున్న కళను నమ్ముకున్నాడు. ఆదరణ లేని వృత్తే అయినా.. దానిని సరికొత్తగా ఆవిష్కరించాలనుకున్డాను. ఆధునిక విధానంలో పాత కళకు ప్రా ణం పోస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూ మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కుభీర్లో శిల్పకళకు ఆధునిక రూపం ఇస్తూ, కళాకారుడు సాయిశ్యాం. విశ్వకర్మ శిల్పకళాధామాన్ని స్థాపించి, తనకు ఉపాధి సమకూర్చుకోవడమే కాక, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఈ కళాధామంలో ప్రస్తుతం ఐదుగురు యువకులు పనిచేస్తుండగా, అవసరాన్ని బట్టి మరికొందరిని కూడా నియమించుకుంటున్నారు. కళాకారుల వంశంసాయిశ్యాం కుటుంబం మొత్తం కళాకారులతో నిండి ఉంది. ఆయన తాత వడ్ల పెద్దన్న కట్టెతో విగ్రహా లు తయారు చేయడంతోపాటు జానపద గురుభో ద పాటలు రాసేవారు, పాటలు పాడేవారు. తండ్రి శంఖర్ సిమెంట్, మట్టితో విగ్రహాలు తయారు చే స్తారు. తమ్ముడు నరేశ్ విగ్రహాల తయారీలో సాయిశ్యాంకు సహకరిస్తూ, నైపుణ్యం కలిగిన పెయింటర్గా కూడా పనిచేస్తున్నాడు. సాయిశ్యాం ఇంటర్మీడియట్, డ్రాయింగ్లో టీచర్ ట్రైనింగ్ కోర్సు(టీటీసీ) పూర్తి చేసి, ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా క్రాఫ్ట్, డ్రాయింగ్ బోధిస్తూ, మిగి లిన సమయంలో కళాధామంలో పనిచేస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యంసాయిశ్యాం నల్లరాయి, కృష్ణశిల, ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ), సిమెంట్, సుద్దమట్టితో రకరకాల విగ్రహాలు తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతి, గణపతి, కృష్ణుడు, శంకరుడు, ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవీదేవతల విగ్రహాలతోపాటు, శివాజీ, వివేకానంద, గాంధీజీ, అంబేద్కర్ వంటి దేశ నాయకుల, మహాత్ముల విగ్రహాలను కూడా నైపుణ్యంతో రూపొందిస్తారు. ఆర్డర్, అడ్వాన్స్ ఆధారంగా విగ్రహాలు తయారు చేసి ఇస్తారు. ఇక్కడి నుంచి నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గ్రామాలకు విగ్రహాలు పంపిస్తాడు. కళాధామంలో పనిచేసే కార్మికులకు జీతాలు, ఇతర ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతాయని సాయిశ్యాం తెలిపారు. అవార్డులు, గుర్తింపుసాయిశ్యాం కళాప్రతిభకుగాను అనేక అవార్డులు అందుకున్నారు. 2013లో హైదరాబాద్లో ట్రూ ఇండియన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి హోం మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం, 2018 లో గోల్కొండ క్రాఫ్ట్స్ సంస్థ నుంచి అవార్డులు అందుకున్నారు. 2025 జనవరి 26న కలెక్టర్ అభిలాష చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందారు. భవిష్యత్ ఆకాంక్షలు2015లో స్థాపించిన విశ్వకర్మ శిల్పకళాధామం ద్వారా సాయిశ్యాం అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, సహాయం అందితే మరింత మందికి శిల్పకళ నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని సాయిశ్యాం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుప్యా తండాకు చెందిన లావణ్య, ఆమె భర్త రాథోడ్ దినేష్ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ బంకులో పెట్రోలు పోయించుకుని తిరిగి నిర్మల్వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో అతివేగంగా సారంగాపూర్వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భూమేశ్ వారి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో లావణ్య, దినేష్కు స్వల్ప గాయాలు కాగా భూమేష్కు తలకు గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
కేసులకు భయపడేది లేదు..
● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ● బాధితుడికి పరామర్శ శ్రీరాంపూర్: కాంగ్రెస్ సర్కార్లో అక్రమ కేసులను భయపడేది లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం ఆమె న స్పూర్లో పర్యటించారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు కందుల ప్రశాంత్పై ఇటీవల సీసీసీ నస్పూర్ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఊరు శ్రీరాంపూర్లోని ఆయన నివాసానికి ఆమె వెళ్లి అతడితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడవద్దని, పార్టీ, తాను అండగా ఉంటామని చెప్పారు. కేసులతో జాగృతి నా యకులు, కార్యకర్తలను బెదిరించలేరని, తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం నస్పూర్ కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊరు శ్రీ రాంపూర్ వద్ద కవితను అభిమానులు గజమాలతో సత్కరించగా, మహిళలు మంగళహారతులతో స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అ ధ్యక్షుడు కందుల ప్రశాంత్, సింగరేణి జాగృతి శ్రీ రాంపూర్ కన్వీనర్ కుర్మ వికాస్, కార్యకర్తలు రత్నాకర్రెడ్డి, తొంగల రమేశ్, వినయ్ పాల్గొన్నారు. జర్నలిస్టు మునీర్ కుటుంబానికి పరామర్శపాతమంచిర్యాల: జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎండి.మునీర్ గత శనివారం మృతిచెందగా.. శుక్రవారం ఆయన నివాసంలో మునీర్ భార్య రిజ్వానా, కుమారుడు మయూర్, కూతుళ్లు ముజిభా, రేష్మా, తన్వీర్ గౌసియా, తమ్ముళ్లు సందాని, మొహియోద్దీన్లను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునీర్ తెలంగాణ ఉద్యమానికి చాలా కృషి చేశారని అన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు బ్రహ్మానందం పాల్గొన్నారు. లక్సెట్టిపేటలో..లక్సెట్టిపేట: ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో లక్సెట్టిపేట పట్టణంలో ఆగారు. పట్టణానికి చెందిన జాగృతి నాయకురాలు నిషా, విశ్రాంత ఉద్యోగి విజయసారథి ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జన్నారం మాజీ జెడ్పీటీసీ ఎర్రం చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. గులాబీ శ్రేణుల దూరం.. కవిత పర్యటనకు బీఆర్ఎస్తోపాటు టీబీజీకేఎస్ నేతలు దూరంగా ఉన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె సింగరేణి క్షేత్రంలో పర్యటించిన సందర్భంలో నేతలెవ్వరూ హాజరు కాలేదు. కనీసం మర్యాద పూర్వకంగానూ కలువకపోవడం సింగరేణిలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. గతంలో ఆమె సింగరేణి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కార్మికులు, కార్మిక నేతలతో పెద్ద కాన్వాయ్ వెంట ఉండేది. నేతల హడావిడి చెప్పనక్కర్లేదు. కానీ నేడు ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించలేదు. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దూరంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. -
మాంత్రికుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మంత్రపూజల ద్వారా నయం చేస్తానని ఆమైపె అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళకు అనారోగ్య సమస్య ఉండడంతో కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి సలహా మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సార్ఖానికి చెందిన అభినయ్కుమార్ను పిలిపించారు. అభినయ్కుమార్ గురువారం రాత్రి పూజల పేరిట మహిళను గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళ కేకలు వేయగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ పోలీసులు అభినయ్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధిత మహిళకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వన్టౌన్ సీఐ సునీల్కుమార్ పాల్గొన్నారు. -
చివరి దశకు సిరాల
నిర్మల్అపు‘రూప’ శిల్పి మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కు చెందిన యువకుడు శిల్ప కళలో రాణిస్తున్నాడు. నీటి కోసం ఎదురుచూపు శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 202510లోu ఏడాదికి 200 పని దినాలు కల్పించాలి నిర్మల్చైన్గేట్: ఉపాధి హామీ కూలీల కూలి రూ.600 పెంచి ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఉపాధి హామీ పనుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు ఇతర సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఉదయం సాయంత్రం రెండు ఫొటోలు తీసి పంపాలనే నిబంధన తొలగించాలన్నారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బర్కుంట గంగారం, తిమ్మాపురం ముత్తన్న నాయకులు చింతకుంట శంకర్, కదాం దినేష్, బీరోళ్ల నవీన్, కూలీలు కూతాడి విజయ, నీలగిరి పోసాని పాల్గొన్నారు. భైంసారూరల్: రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చివరి దశకు చేరుకున్నారు. దీంతో 1,800 ఎకరాల ఆయకట్టు రైతుల్లో సాగునీటి ఆశలు చిగురిస్తున్నాయి. ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ పనులను పర్యవేక్షిస్తూ అధి కారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికా రులతో సమీక్ష నిర్వహించారు. రైతులతో సమావేశమై, త్వరలోనే నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన తూము నిర్మాణం.. ప్రాజెక్టు ప్రధాన తూము నిర్మాణం చివరి దశలో ఉంది. పాత తూము స్థానంలో సిమెంటుతో కొత్త షెట్టరు నిర్మిస్తున్నారు. నిజాం కాలంలో 1902లో రాతి, సున్నంతో నిర్మించిన పాత తూము లీకేజీలతో నీరు వృథాగా బయటకు వచ్చేది. భారీ వర్షాలతో తెగిపోయిన ఈ తూమును ఇప్పుడు నూతన టె క్నాలజీతో నిర్మిస్తున్నారు. సీసీ డ్రైనేజీ నుంచి నీరు తూము ద్వారా కాలువలకు చేరేలా డిజైన్ చేశారు. కట్ట నిర్మాణం.. తెగిపోయిన కట్టను చదును చేసి, దాని అడుగు భాగంలో బండరాళ్లు పేర్చారు. చుట్టూ మట్టి, మొరం వేస్తున్నారు. ప్రధాన కట్ట నిర్మాణం చివరి దశలో ఉంది. భారీ టిప్పర్లతో మొరం, మట్టి వేస్తూ, నీరు నిల్వ ఉన్నా కట్ట తెగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన సిరాల ప్రాజెక్టు భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా విపత్తు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలం ముందు పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాలువలకు మరమ్మతు.. ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్న సమయంలో కాలువలపై దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులను రైతులు కోరుతున్నారు. ఎనిమిది కిలోమీటర్ల సీసీ కెనాల్కు భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల గండ్లు పడ్డాయి. కెనాల్లోని మట్టి, చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, తూముల మరమ్మత్తులు చేపట్టాలి. సిరాల, ఇలేగాం గ్రామాల మధ్య కెనాల్ పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. కాలువలపై శ్రద్ధ పెడితే పంట పొలాలకు నీరు సజావుగా అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. నీరందిస్తాం సిరాల ప్రాజెక్టు పనులు చివరి దశకుచేరుకున్నాయి. పనులు పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు నీరందించే విషయంపై దృష్టిపెడతాం. ఇప్పటికే ప్రధాన కట్ట పనులు చివరి దశకుచేరుకున్నాయి. ప్రధాన తూము, షెట్టరు పనులు కొనసాగుతున్నాయి. ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్, ఇరిగేషన్ డీఈ న్యూస్రీల్సీసీ రోడ్ల పరిశీలన లక్ష్మణచాంద: మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్ డీఈ యాదగిరి శుక్రవారం పరిశీలించారు. మండలంలోని రాచాపూర్, పొట్టపెల్లి(కె) గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్లను, దుర్గామాత షెడ్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఈ సంజయ్కుమార్ ఉన్నారు. 80శాతం పనులు పూర్తి సాగునీటిపై రైతుల ఆశ వేగంగా ప్రధాన తూము పనులు సిరాల ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది పూర్తయి పంటలకు నీరు అందుతుందని ఆయకట్టు రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా నీరు అందక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. సిరాల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో తానూరు మండలంలోని ఝరి, బెంబర, బోరిగాం, ఉమ్రి, బోల్సా, బోసి, బోంద్రట్, భైంసా మండలంలోని ఇలేగాం, పాంగ్రి, మాంజ్రి, దేగాం గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. ప్రాజెక్టులో నీరు నిలిచి ఉంటే, భూగర్భ జలాలు పెరిగి, తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తేవి కావు. ప్రధాన తూము, షెట్టరు పనులు -
అటవీ అధికారులపై కేసులు పెట్టాలి
బెల్లంపల్లి: పేద దళిత రైతులపై దాడులు చేస్తున్న అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధిత రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు సర్వే నంబర్ 65, 67లో ఉన్న భూములను ఐదు దశాబ్దాల నుంచి సాగు చేసి జీవిస్తున్నారని తెలిపారు. అటవీ అధికా రులు అడ్డుతగులుతూ దాడులకు తెగబడుతున్నార ని విమర్శించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం డీఏఓ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు బి.కేశవరెడ్డి, రైతులు బానయ్య, లింగయ్య, సతీష్, రాజయ్య, పర్వతాలు, మహిళలు పాల్గొన్నారు. -
ధాన్యం తరలించాలని రైతుల ఆందోళన
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టపడి పండించిన ధా న్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని తురాటి గ్రామ ఎక్స్రోడ్ వద్ద 61వ జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. ఈనెల 27న డొంగుర్గాం పీఏసీ ఎస్ కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన గొర్ల ప్రవీణ్కు చెందిన 1100 బస్తాల ధాన్యాన్ని ఒక లారీ, 4 ట్రాక్టర్లలో మామడ, కుంటాల, వానల్పాడ్, భైంసా రైస్ మిల్లులకు పంపారు. తేమశాతం సరిగా లేదనే కారణంతో మిల్లర్లు వాటి ని గురువారం వెనక్కి పంపించారు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మళ్లీ ధాన్యం తడిసింది. దీంతో శుక్రవారం రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఒకవైపు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారని, మిల్లర్లు మాత్రం తిప్పి పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సాయికిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు గంటపాటు రైతులు రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైతులు తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం అందించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణంలోని విత్తనాలు, పురుగుమందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రెగ్యులర్గా దుకాణాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ రాజు, అధికారులు ఉన్నారు. యూనిఫాం స్టిచ్చింగ్ నాణ్యతగా ఉండాలి.. నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం(ఏకరూప దుస్తులు) స్టిచ్చింగ్ నాణ్యంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఈద్గాం, మంజులాపూర్లో ఏర్పాటు చేసిన యూనిఫాం స్టిచ్చింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇవ్వబోయే దుస్తులు కచ్చితంగా కొలతలకు తగినట్లుగా ఉండాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్, తహసీల్దార్ రాజు ఉన్నారు. పుకార్లు నమ్మొద్దు నిర్మల్చైన్గేట్: ముధోల్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారా లు, పుకార్లు వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నట్లు గుర్తించామని, వాటిని నమ్మొద్దని కలెక్టర్ అభిలా ష అభినవ్ సూచించారు. బోరెగాం గ్రామంలోని సర్వే నంబరు 249 లోని ప్రభుత్వ భూమిని ఇటీవల కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు య త్నించగా రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత భూమి హద్దులను గుర్తించా రు. ఆక్రమణలు తొలగించారు. ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ని జిల్లా యంత్రాంగం నియమించిందన్నారు. ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నా రు. బోరెగాం గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
● ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ నిర్మల్ రూరల్/సోన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ సూచించారు. పోషకుల సమావేశంలో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ముఠాపూర్ ప్రాథమిక పాఠశాలలో, సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాలలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రతీరోజు ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల దశ నుంచి విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించబడుతున్నదని, ఈ సంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలతో పాటు డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లు ఉన్నాయని వివరించారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామ వీడీసీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఉందన్నారు. పాఠశాల హెచ్ఎంలు సుధాకర్, విద్యాసాగర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ గోదావరి,ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ ప్రచార జాతలో భాగంగా మండల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం ప్రచారం చేపట్టారు. అన్ని రకాల అర్హతలు కలిగిన, అంకిత భావంతో పనిచే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధధన చేస్తానని వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పోషకులను కోరారు. -
గురుకులంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
సారంగపూర్:మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్లలో గురుకులంలో చదువుకున్న అందుబాటులో ఉన్న విద్యార్థులందరికీ పాఠశాల సిబ్బంది ఆహ్వాన పత్రాలు పంపించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో తమకున్న అనుబంధాలను పంచుకున్నారు. అనంతరం అప్పట్లో తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించారు. అప్పటి ప్రిన్సిపాల్ చలపతి, ప్రస్తుత ప్రిన్సిపాల్ సంగీత, గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ నూతన కార్యవర్గం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ సమావేశానికి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్లుగా ఆర్.నారాయణరెడ్డి, గడ్డం జగన్నాథం, కేవీ ప్రతాప్, జి.భీమ్లానాయక్, అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కె.భాస్కర్, బి.గోవర్ధన్ రెడ్డి, జి.ఈశ్వర్, వి.మహేందర్, మారిన శృతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.తిరుపతి, కోశాధికారిగా యు.శంకర్, సంయుక్త కార్యదర్శులుగా మారిన వెంకటేశ్వర్లు, ఆర్.గోపాల్, సాంబశివరావు, ఎల్.హరిలాల్, అంకం సరిత, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.భానయ్య, కార్యవర్గ సభ్యులుగా మారిన చందర్, గుజ్జ మల్లేశ్, ఆర్వీ రామకృష్ణ, కె.మల్లేష్, సతీష్, రెడ్డి సతీష్, జి.శ్రీధర్, పి.శ్రీనివాస్, ఏ.జ్యోతి, జి.వెంకన్న, క్రాంతికుమార్, శరత్యాదవ్, సలహాదారులుగా ఎం.లక్ష్మణ్, ఆర్.శ్రీనివాస్రెడ్డి, పి.సాంబయ్య, సదానందం, వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
భైంసాటౌన్: నేటి ఆధునిక కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ వాటిని కాపాడుకోవాలని విశ్వమాంగళ్య సభ దక్షిణ భారత ఇన్చార్జి గాయత్రి లోమ్టే అన్నారు. గురువారం భైంసాకు వ చ్చిన ఆమె స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. మహిళలకు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలపై వివరించేందుకు విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా మహిళలకు ధ్యా నం, ప్రాణాయామం, యోగా, శ్లోకాలు నేర్పి స్తున్నట్లు వివరించారు. తద్వారా మహిళల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం, విద్యార్థి దశనుంచే బాలికలకు మాతృత్వంపై అవగా హన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. స మావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అ లివేణి, మండల అధ్యక్షులు సుష్మారెడ్డి, పట్ట ణ అధ్యక్షుడు రావుల రాము పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
లక్ష్మణచాంద: మండలంలో వరి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని తిర్పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున కల్లాల్లో ధాన్యం తడిసిపోతుందని తెలిపారు. రైతులకు నష్టం జరుగకుండా కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. గన్నీ సంచులు త్వరగా ఇచ్చి తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచాలని, లారీల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఆర్ఐ నరేందర్రెడ్డి, సిబ్బంది దినకర్ తదితరులు ఉన్నారు. -
గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. గోవుల రవాణా విషయంలో వెటర్నరీ డాక్టర్ నిబంధనలు పాటించాలని సూచించారు. గో వుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపా రు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏ ర్పాటు చేసిన చెక్పోస్టును, కొండాపూర్ సెంట్థామస్ స్కూల్ వద్ద గల చెక్ పోస్టును గురువారం ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సూచనలు చే శారు. గోవుల రవాణాను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీ సు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోవుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్ పోస్ట్ల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు..పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో మత సామరస్యానికి భంగం కలిగించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా, అస భ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకా కుండా జిల్లా ముఖ్య కార్యాలయంలో సోషల్ మీడియా సెల్ ప్రత్యేకంగా పరిశీలన చేస్తుంటారని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుబక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి, భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి భైంసాటౌన్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్కుమా ర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో హిందూ, ముస్లిం మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండు గ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు సహించేది లేదన్నారు. ఆర్డీవో కోమల్రెడ్డి మాట్లాడుతూ.. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్కుమార్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సీఐ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ శాంతియుతంగా నిర్వహించుకోవాలి ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకల్యాణి నిర్మల్టౌన్: బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్న కల్యాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్ పండుగకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా గోవులను వధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అర్బన్ తహసీల్దార్ రాజు, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి
లోకేశ్వరం: రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని ముధోల్ ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ నర్సయ్య అన్నారు. మండలంలోని రాజూర గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం గురువా రం నిర్వహించారు. వానాకాలంలో సాగుచేసే పంటలపై రైతుల ప్రశ్నలకు నర్సయ్య సమాధానం ఇచ్చారు. జీవన ఎరువుల వాడకం, రసాయనిక పురుగు మందుల వాడకం, త క్కువ యూరియా వడటం ద్వారా ఆదాయాన్ని ఎలా పొందాలో వివరించారు. మరో శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ చెట్లు పెంచడం వలన పర్యావరణానికి కలిగే మేలును తెలియజేశారు. వివిధ పంటలకు అవసరం మేరకు రసాయనాల వినియోగిస్తే పంట దిగుబడి శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లోకేశ్వరం ఇన్చార్జి పశువైద్యాధికారి రవీందర్, ఏవో గిరిరాజ్, ఏఈవోలు మౌనిక, రుచిత, ఎఫ్పీవో నవీన్ పాల్గొన్నారు. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. వేడుకలకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వేదికను పూలతో అలంకరించి, ప్రొటోకాల్ నిబంధనల మేరకు సీటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంటులు, షామియానాలు, తాగునీరు, అల్పాహారం, పండ్ల సరఫరా నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. పరిసరాలలో శుభ్రత పాటించాలని, పోలీస్, అగ్నిమాపక శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యశాఖ అత్యవసర మందులతోసహా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా.. ప్రణాళికాబద్ధంగా..
● సర్కారుబడులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి ● నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు ● ఇప్పటికే ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ● తాజాగా రాష్ట్రస్థాయిలో శిక్షణకు ఎంఈవోలునిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయ డం, నాణ్యమైన విద్య అందించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు మౌలిక సదుపాయాలు సమకూర్చడం, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ అందించడం, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టింది. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 19 మండలాల పరిధిలో 735 పాఠశాలలు ఉండగా, 69 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎంఈవోల నియామకంపాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరిచేందు కు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండల స్థాయిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (ఎంఈవోలు)ను నియమించి, వారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల కేంద్రంలో మూడు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమే శ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా వంటి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పాఠశాలల పర్యవేక్షణ, విద్యా నాణ్యత మెరుగుదలకు సంబంధించిన సూచనలు అందించారు. జిల్లాలోని 19 మండలాలకు చెందిన ఎంఈవోలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. జూన్ 6 నుంచి బడిబాట..2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ‘‘బడిబాట’’ కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించడం, డ్రాప్ఔట్ విద్యార్థుల ను తిరిగి చేర్పించడం, తల్లిదండ్రుల సమావేశాలు, పాఠశాలల అలంకరణ, పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్ల పంపిణీ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ దినోత్సవం, బాలికా విద్యా దినోత్సవం నిర్వహించి, బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు. డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలను తల్లిదండ్రులకు పరిచయం చేయడం, క్రీడా పోటీలు, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి.సమర్థవంతమైన బోధన కోసం..విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం అవసరమని ప్రభుత్వం భావించింది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ మూడు విడతలుగా వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లాస్థాయి నుంచి సబ్జెక్టు వారీగా ఎంపికై న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (డీఆర్పీలు) రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వీరు మండలస్థాయిలో ఎంపికై న మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ (ఎంఆర్పీలు)కు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో ఆధునిక బోధనా పద్ధతులు, ఎల్ఐపీ, ఎఫ్ఎల్ఎన్ వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించే అంశాలపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి కాగా, మూడో విడత శిక్షణ ఈనెలాఖరు నాటికి ముగియనుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల సంఖ్యను పెంచడం, విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన కార్యచరణలపై కూడా చర్చించింది. బడుల బలోపేతం కోసం.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల నుంచి మొదలుకుని డీఈవోల వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందేలా పటిష్టపర్యవేక్షణ ఉంటుంది. – పి.రామారావు, డీఈవో -
నీటి లభ్యత బట్టి పంటలు వేసుకోవాలి
● ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలం ● మక్క, సోయా, పసుపు విత్తుకోవచ్చు ● విత్తన కొనుగోలుకు రశీదు తప్పనిసరి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో అంజిప్రసాద్ నిర్మల్చైన్గేట్: పంటల అవసరాలు, నీటి లభ్యతను బట్టి సాగును నిర్ణయించాలనీ జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో జిల్లాలో కురుస్తున్న ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలమేనని తెలిపారు. తేలికపాటి భూముల్లో ఆరు, బరువు నేలల్లో ఏడు సెంటీ మీటర్ల వర్షం కురి సి మట్టి తేమగా ఉంటే మొక్కజొన్న, సోయా, పసు పు విత్తుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో వర్షాలను అంచనా వేయలేమని, నీటి సౌకర్యం ఉన్న పంటలకై తే డోకా లేదన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని తెలిపా రు. గురువారం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో మాట్లాడారు. ముందస్తు వర్షాలతో సాగుపై సందేహాలు, విత్తనాల ఎంపిక, ఎరువుల లభ్యతపై రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రైతు: పసుపులో అడుగు రోగం రాకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలి? – గంగారెడ్డి, పెంబి డీఏవో: పసుపులో అడుగు రోగం రాకుండా ట్రైకో డెర్మా విరిడిని వాడాలి. ప్రస్తుతం ఇది ఆదిలా బాదులో దొరుకుతుంది. మీరు మీ సంబంధిత ఏఈవోను సంప్రదిస్తే వారు తెప్పిస్తారు. రైతు: ఐదు రోజులుగా వర్షం కురుస్తుంది. మొక్కజొన్న పంట వేసుకోవచ్చా? – ముత్యం, రాచాపూర్, లక్ష్మణచాంద డీఏవో: నీటి వనరులు అధిక మొత్తంలో ఉంటే మొ క్కజొన్న పంటకు అనుకూలం. జూన్ మొదటి వారంలో మేలైన రకం చూసి విత్తుకోవచ్చు. రైతు: నాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడే పసుపు విత్తుకోవచ్చా? – మల్లేశ్, పీచర, లక్ష్మణచాందడీఏవో: సందేహం లేకుండా పసుపు విత్తనాలు వేసుకోవచ్చు. ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తిన తర్వాత అడుగు మందులు కూడా వేసుకోవచ్చు. కత్తెర పురుగు వస్తే విషపు ఎరను తయారు చేసి చల్లాలి. అదనపు సమాచారం కోసం స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే మరిన్ని సూచనలు సలహాలు ఇస్తారు. రైతు: దాన్ 75 రకం జిల్లాలో అందుబాటులో ఉన్నాయా? – మత్త రాజా బాబు, (మందపల్లి, పెంబి.), నారాయణ (నర్సాపూర్(జి))డీఏవో: దాన్–75 అనే కొత్తరకం వరి విత్తనాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేసింది. ఈ విత్తనాలు మార్కెట్లోకి ఇంకా రాలేదు. కానీ రాజేంద్రనగర్ యూనివర్సిటీకి వెళ్తే ఇస్తున్నారు. జిల్లాకు ఈ విత్తనాలు వస్తే రైతులందరికీ సమాచారం ఇస్తాం. రైతు: జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? – గంగారెడ్డి, నర్సాపూర్(జి))డీఏవో: జీలుగు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు దిలావర్పూరు మండలంలో రైతులకు పంపిణీ చేశాం. ఎకరానికి 10 కిలోల జీలుగ విత్తనాలకు ఒక యూరియా బస్తా మాత్రమే వాడాలి. రైతు: నకిలీ విత్తనాలు ఎలా గుర్తించాలి? – రాజన్న, జామ్, సారంగాపూర్డీఏవో: నకిలీ విత్తనాలు గుర్తించాలంటే మనం తీసుకున్న విత్తనాల పాకెట్ మీద ఉన్న లాట్ నంబర్ని బిల్లు మీద తప్పనిసరిగా రాయించా లి. అలా షాపు యజమాని రాయకపోతే అది నకిలీ విత్తనంగా భావించాలి. అలా మీ దృష్టికి వస్తే వ్యవసాయ శాఖలు అధికారులకు ఫిర్యాదు చేయాలి. రైతు: వరిలో ఏయే విత్తనాలు మేలైనవి; – బలరాం, లోకేశ్వరండీఏవో: వరిలో చాలా రకాల విత్తనాలు అందుబా టులో ఉన్నాయి. అందులో దోమ, అగ్గి తెగులు వంటి చీడపీడలను తట్టుకునే రుద్రూర్–1200, జేజీఎల్–27356, 1248, 11118, 1798, 2 –44, 5 –5204. ఆర్ఎస్ఆర్–15048, కునారం– 1638, ఎంటీ యూ–1262 రకాలు మేలైనవిగా చెప్పొచ్చు. ప్రభుత్వం సూ చించిన 33 రకాల విత్తనాలను వేసుకుంటే బో నస్ వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. రైతు: మక్క, సోయా విత్తనాలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు? – భూమన్న, కుంటాలడీఏవో: ముందస్తుగా కురుస్తున్న వర్షాలు మక్క. సోయా సాగు చేసేందుకు అనుకూలమే. నేల బాగా తడిసి తేమతో ఉంటే విత్తనాలు విత్తుకోవచ్చు. జూలై 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు లేక పోతే ఎండకు విత్తనం కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచు కుంటే మంచిది. రైతు: ఎర్రచౌక భూమిలో ఎటువంటి పంటలు వేయాలి? – దాసరి సుజాత, విట్టాపూర్, కుంటాలడీఏవో: ముందస్తు వర్షాలు కురుస్తున్న కారణంగా మొదట నేలని పూర్తిగా చదును చేసుకోవాలి. జూన్ మొదటి వారంలో ఎర్రచౌక భూములలో తొందరగా చేతికి వచ్చే పంటలను మాత్రమే వేసుకోవాలి. రైతు: మా పంట పొలాల్లో నీరు బాగా నిలువ ఉంటుంది. ఈ భూమిలో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? – శంకర్, మహాగావ్, భైంసాడీఏవో: మొదట మీ పంట పొలాల్లో ఉన్న నీటిని నాగలి పెట్టి కాలువలు తీసి బయటకు పంపించాలి. నీరు ఆగకుండా చూసుకోవాలి. ఇటువంటి నేలలో కంది, పత్తి వంటి పంటలు వేసుకోవచ్చు. -
ధాన్యంబస్తాతో కలెక్టరేట్కు..
● తేమ సాకుతో కొనడం లేదంటూ ఆవేదన.. ● కలెక్టర్ చాంబర్ ఎదుట రైతు నిరసన నిర్మల్: తేమ సాకుతో తమ ధాన్యం కొనడం లేద ని, కోతలు ఎక్కువగా పెడుతున్నారని ఓ రైతు కు టుంబం ధాన్యంతో కలెక్టరేట్కు వచ్చింది. లక్ష్మ ణచాంద మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు లింగన్న, శ్రీనివాస్ ఇద్దరూ గురువారం కలెక్టరేట్కు వచ్చారు. తమవెంట తీసుకువచ్చిన ధాన్యం బస్తాను మోసుకుంటూ కలెక్టర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వడ్లు పోసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారు. కొర్రీలు పెడుతున్నారు..బాబాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో సుమారు 600 బస్తాల ధాన్యం కొనడం లేదని వారు పేర్కొన్నారు. ధాన్యం తేమశాతం రావడం లేదని, ఎక్కువ కటింగ్ చేస్తానని ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. తమ బాధ తెలుపాలన్న ఉద్దేశంతోనే వడ్లబస్తాలతో కలెక్టరేట్కు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ను కలవగా, ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. -
ధాన్యం తిప్ప పంపిన మిల్లర్
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అధికారులు తడిచిన ధాన్యం కొంటామని చెబుతున్నారు. మరోవైపు మిల్లర్లు ధాన్యం సరిగా లేదని తిప్పిపంపుతున్నారు. మండలంలోని డొంగుర్గాంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లను చేపట్టారు. తురాటి గ్రామానికి చెందిన గొర్ల ప్రవీణ్కు చెందిన ధాన్యాన్ని ఈనెల 27న తూకం వేసి ట్రాక్టర్లలో కుంటాల రైస్ మిల్లుకు తరలించారు. ట్రక్ షీట్లో మాత్రం రైతు, రైస్ మిల్లు పేర్లు, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల వివరాలు ఏమీ లేకుండా తరలించారు. ఇలా తరలించిన ధాన్యాన్ని రెండు మూడు రోజుల తర్వాత మిల్లర్లు తేమశాతం సరిగా లేదనే కారణంతో గురువారం వెనక్కి పంపించారు. దీంతో సదరు రైతు చేసేదేమీ లేక మళ్లీ ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. -
గుండేగాం కష్టం తీరేదెప్పుడో!
● ప్రతీ వానాకాలంలో తప్పని ముంపు ● ఇటీవలి అకాల వర్షాలకు ఆందోళన ● పునరావాసం కోసం గ్రామస్తుల నిరీక్షణభైంసా/భైంసారూరల్: వారం రోజులుగా కురుస్తు న్న వర్షాలతో గుండేగాం వాసుల్లో మళ్లీ భయం ప ట్టుకుంది. భారీ వర్షాలు కురిస్తే ఈసారి కూడా నీట మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. గుండేగాం పునరావాసంపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావడంలేదు. ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీలో పునరావాసం విషయం ప్రస్తావించారు. ఇటీవలే కుంటాలలో నిర్వహించిన భూభారతి రెండో విడత కార్యక్రమానికి హాజరైన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో గుండేగాం పునరావాస విషయం చర్చకు వచ్చింది. ము ధోల్ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి పునరావాసం కల్పించాలని మంత్రులను కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గతంలోనే సర్వే పూర్తయినా.. గత ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే పూర్తి చేశారు. రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమని ప్రతిపాదించారు. భైంసా మండలం సిద్దూర్ శివా రులో సర్వేనంబర్ 73లో మూడెకరాలు గుర్తించి పు నరావాసం కల్పిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించిన నమూనాలు పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలో పునరావా సానికి రూ.66 కోట్లు అవసరమని మరో ప్రతిపాదన పంపించారు. ఈ నిధులు సరిపోవంటూ మరో రూ.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించా రు. ఇలా పలుసార్లు ఇచ్చిన నివేదికలన్నీ ప్రభుత్వం వద్దే మగ్గుతున్నాయి. మరోవైపు గుండేగాంవాసులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా.. ముంపు స మస్యకు పాలకులు పరిష్కారం చూపడంలేదు. రెండేళ్లుగా పునరావాస కేంద్రంలోనే.. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఇప్పటికీ గుండేగాం వాసులు ఉంటున్నారు. కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రతీరోజు అక్కడి పంట పొలాల్లో పని చేసుకుని సాయంత్రానికి ఇక్కడికే తిరిగివస్తున్నారు. ఇంకొంత మంది ఊరిలోనే ఉంటున్నారు. రోజూ రాకపోకలు కష్టమని వానాకాలంలో నీరొస్తే ఊరు నుంచి బయటికి వెళ్తారు. తగ్గగానే మళ్లీ గుండేగాంకు చేరుకుని ఇబ్బందుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. గ్రామం : గుండేగాం కుటుంబాలు : 270 ఆయకట్టు : 364 ఎకరాలు ప్రధాన సమస్య : పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం. పరిష్కారం : భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ నిర్మాణంతోనే.. పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రతీ వానాకాలంలో గుండేగాం గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదని గ్రామస్తులకు తేల్చిచెప్పారు. కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో కచ్చితంగా నీరు వస్తుందని గుండేగాం గ్రామస్తులు చెప్పినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ గుండేగాంను నీటముంచింది. వాగు పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్నవారు కట్టుబట్టలతో బయటకువచ్చారు. సమస్య పరిష్కరిస్తాం గుండేగాం గ్రామంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఇప్పటికే అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించాను. అధికారులతోనూ సమీక్ష నిర్వహించాం. ఈ వానాకాలంలో గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చాం. – పవార్ రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
పదవొస్తుందా?
● కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేల పోటాపోటీ ● పార్టీ, నామినేటెడ్ పోస్టులపైనా ఉత్కంఠ ● ‘హస్తం’ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మొదలు కావడంతో ఎవరిని ఏ పదవి వరిస్తుందోననే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతున్న తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరిని అమాత్య పదవి వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే మంత్రి యోగానికి అవకాశం ఉంది. వీరిలో చెన్నూర్, మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ బెర్త్ కోసం ఢిల్లీ దాకా లాబీయింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సామాజిక వర్గాలు, సీనియర్లు తదితర అంశాల నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవుల్లో మొండి ‘చెయ్యి’ ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులున్నా వారికి సముచిత అవకాశాలు రాలేదని నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆదివాసీ నాయకుడు కోట్నాక తిరుపతి ఒక్కరికే రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయన పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో జోడోయాత్రలో చురుగ్గా ఉండడంతో మొదటి దఫాలో ఆయనను పదవి వరించింది. ఇక కార్మిక సంఘాల కోటాలో జనక్ప్రసాద్కు రాష్ట్ర కనీస వేతన బోర్డు చైర్మన్గా అవకాశం దక్కింది. ఆ తర్వాత ఎవరికీ పదవు లు దక్కలేదు. ఇటీవల నామినేట్ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎవరికి అవకాశం రాలేదు. అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఉమ్మడి జిల్లా నాయకులకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు. తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవుల్లో తమకు అవకాశం వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరినప్పటికీ ఎవరికీ అవకాశం రాలేదు. కేడర్లో నారాజ్ ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకుని కష్టకాలంలోనూ పని చే స్తున్న వారున్నారు. సీనియర్ నాయకులతోపా టు అనేక మంది యువ నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన, కార్మిక అనుబంధ సంఘా ల నుంచి అనేక మంది ఉన్నారు. అందరూ తమ స్థాయిని బట్టి పదవుల్లో ప్రాధాన్యతను కోరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకుల పేర్లు పీసీసీ పదవుల్లో చోటు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపారు. వారితోపాటు నాయకులు కూడా తమకున్న పరిచయాలతో గాంధీభవన్లో ఇప్పటికే తమ బయోడేటాలతో కూడిన వివరాలు అందజేశారు. తమకు పదవుల్లో అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
భూసర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● లైసెన్స్డ్ సర్వేయర్లకు కిట్ల పంపిణీనిర్మల్చైన్గేట్: భూ సర్వే నిర్వహణలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కిట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని అనుసరించి భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 113 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు 50 రోజులపాటు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఏడీ ల్యాండ్ సర్వేయర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలి బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన బక్రీద్ పీస్ కమిటీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈద్గాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించా రు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పుకార్లు పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. బక్రీద్ పండుగకు పోలీస్శాఖ త రఫున జిల్లాలో పటిష్ట భద్రత చర్యలు చేపడతా మని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, పీస్ కమిటీ స భ్యులు, అధికారులు పాల్గొన్నారు. సేవలు అభినందనీయం ధర్మసేవ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధర్మసేవ ట్రస్ట్ జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో నిర్వహించిన ధీర వెల్నెస్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. లా భాపేక్ష లేకుండా ఫిబ్రవరి 25నుంచి ఏప్రిల్ 1వరకు జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జూ న్ 26న జిల్లాలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, అన్ని ఉన్నత పాఠశాలల్లో ర్యాలీలు నిర్వహిస్తామ ని తెలిపారు. జిల్లా పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలోని కళాజాత బృందాలు గ్రామాల్లో మత్తుపదార్థాల నిర్మూలన, మాదకద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై విశేష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్, సమన్వయకర్త లింబాద్రి, ధర్మసేవ మేనేజింగ్ ట్రస్టీ నిశాంత్రెడ్డి, ధీర ప్రో గ్రాం నిర్మల్ కోఆర్డినేటర్ ఎస్.స్రవంతి, డీసీవో గీత, ఏసీఎంవో శివాజీ, కేజీబీవీల ఎస్వోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా సావర్కర్ జయంతి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని బీజేపీ కా ర్యాలయంలో బుధవారం వినాయక్ దామోద ర్ సావర్కర్ జయంతిని నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ మాట్లాడుతూ.. సావర్కర్ దేశభక్తిని బ్రిటీష్ హింస కదిలించలేదని తెలిపా రు. ఆయన ధైర్యం, పోరాటం ఎప్పటికీ మరువరాదని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు దేశ అభివృద్ధికి దీప స్తంభమని కొనియాడారు. కా ర్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసె ల అర్జున్, పట్టణాధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, మండల ప్రధాన కార్యదర్శి విజ య్, నాయకులు గవాస్కర్, రాజు, కుర్మరాజు, రావుల్వార్ విఠల్, విజయ్ పాల్గొన్నారు. -
వలసదారులూ వెళ్లిపోండి...!
● దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ఆంక్షలు ● నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వారికి క్షమాభిక్ష పథకం అమలు ● ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల్లో ఆందోళన నిర్మల్ఖిల్లా: బతుకుదెరువుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వందలాది మంది కార్మికులు విజిట్ వీసాపై మలేషియా వెళ్లారు. కానీ అక్కడి ప్రభుత్వం వలస కార్మికులను తిరిగి వెళ్లి పోవాలని ఆంక్షలు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా విజిట్ వీసాపై వచ్చి అక్రమ వలసదారులుగా ఉంటున్న వారిని తక్షణమే స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ అక్కడి ప్రభుత్వం తాజాగా ‘క్షమాభిక్ష’ (ఆమ్నెస్టీ) పథకం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం మలేషియా దేశంలో పాస్పోర్ట్ లేకుండా ఉన్నవారితో పాటు తాత్కాలిక వర్క్ వీసాలు, విజిట్ పర్మిట్ వంటివి గడువు ముగిసినా అక్కడే తలదాచుకుంటున్న వలస కార్మికులు వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. క్షమాభిక్ష పథకం ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేవారు ఎటువంటి జైలు శిక్ష లేకుండానే 500 రింగిట్లు, మనదేశ కరెన్సీలో రూ.10వేలు జరిమానా చెల్లించి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నప్పటికీ, వీసా గడువు ముగిసిన వారితో పాటు, వీసాలు లేని వారందరినీ ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా పక్షం రోజుల్లో రిటర్న్ జర్నీకి అవకాశం కల్పించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వలసదారులందరూ మలేషియాలోని లాబువాన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంటు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 500 మంది.. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి కోసం మలేషియా వెళ్లిన వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 500 మంది వరకు ఉండవచ్చని ఎన్ఆర్ఐ రాష్ట్ర కమిటీ అడ్వైజరీ మెంబర్ స్వదేశ్ పరికిపండ్ల పేర్కొంటున్నారు. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వెళ్లిన వారంతా తాజా నిబంధనలతో స్వస్థలాలకు తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది మలేషియాలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలతో పాటు మలేషియా కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో మలేషియాలో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2,500 మంది వరకు ఉండగా తాజా నిబంధనలతో అందులో 500 మంది స్వదేశాలకు తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి గడువు 2026, ఏప్రిల్ 30 వరకు నిర్దేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
ఆదిలాబాద్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం జూన్ 14 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్ సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్ రాజ్, శృంగ్వార్పూర్ ప్రాంతాలు సందర్శించాలనుకునే వారికి గంగా రామాయణ పుణ్యక్షేత్ర ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. ఉజ్జయిని, త్రయంబకేశ్వర్, మహాకాళేశ్వర్ వంటి ఐదు జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే ప్రయాణికులకు మరో ప్యాకేజీ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి కలవారు www. irctctourism.com వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9281030712, 9701360701, 9281495845, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
వివాహం కావడంలేదని యువకుడు..
సోన్: వివాహం కావడంలేదని మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన గోలి సుదర్శన్ (31) ఆరునెలల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. తనకు వివాహం కావడంలేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై కేసు ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఖానాపూర్కు చెందిన జావిద్ ఖాన్పై మంగళవారం కేసు నమోదు చే సినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన అబ్దుల్ అజీజ్ ఇద్దరు కుమారులకు కాంట్రాక్ట్ పద్ధతిలో తహసీల్దార్ కార్యాలయంలో, సిటీ యూనియన్ బ్యాంక్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. వారి వద్ద నుంచి రూ.2లక్షల చొప్పున రూ.4లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితులు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. ద్విచక్ర వాహనం చోరీఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన దార్ల అశోక్ ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనం కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
నలభీములకు c/o కుభీర్
● మండల కేంద్రంలో 20 బృందాలు ● ఏడాది పొడవునా చేతినిండా పని ● జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ వంటల తయారీ కుభీర్: నిర్మల్ జిల్లాలోని కుభీర్ నలభీములకు (వంట మనుషులకు) ప్రసిద్ధి గాంచింది. మండల కేంద్రంలో సుమారు 20 బృందాలు ఉన్నాయి. ఒక్కో బృందంలో ఒక మాస్టారు, ఇద్దరు లేదా ముగ్గురు సహాయకులు ఉంటారు. అంతేకాకుండా కూరగాయలు కోయడానికి, చపాతీ, పూరీ, లడ్డూ, బాదుషా తయారు చేయడానికి మహిళలను కూలీకి మాట్లాడుకుని వెంట తీసుకెళ్తారు. జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాలకు వంటలు చేయడానికి వెళ్తారు. ఒక్కో శుభకార్యానికి మనుషుల లెక్కన రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటారు. ఏడాది పొడవునా పని.. కుభీర్కు చెందిన సుమారు 100 మంది మహిళలు, పురుషులకు ఈ రంగంలో ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోంది. వెజ్, నాన్వెజ్తో పాటు లడ్డూ, బాదుషా, జిలేబీ, కాకినాడ కాజా, చపాతీ, పూరీ, మజ్జిగ, కార, బూంద, పాపడాలు, అన్నం, పప్పు, కూరగాయలు.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. నాన్వెజ్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల ఫ్రై, బోటి.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం ఉన్నవారు రెండు నెలల ముందుగానే ఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకుంటారు. వారి వద్ద వంటకు సంబంధించిన కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తే మరిన్ని పాత్రలు కొనుగోలు చేసుకోవడంతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రధాన వంటాచార్యులు వీరే కుభీర్కు చెందిన ప్రధాన వంటాచార్యులు ఆరె లక్ష్మణ్, కందూర్ పోతన్న, పెద్ద పోతన్న, బత్తిని సాయన్న, మధు, కిని సంతోష్, బ్రాహ్మణ్ శేఖర్, బ్రాహ్మణ్ శేషు, జరి ముత్యం, సిద్దూర్ పోతన్న, పోతాజీ, సాకలి రాందాస్, కొబ్బాజి పోతన్న, బంక బాబు, బ్రాహ్మణ్ రాజు, చవాన్ విశ్వనాథ్, అడెల్లు, సాయినాథ్, గంగాధర్ ఉన్నారు. చేతినిండా పని మాకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉంటుంది. ఎండాకాలంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలోనూ చిన్నచి న్న శుభకార్యాలు ఉంటాయి. నావద్ద ముగ్గురు అనుచరులు ఉన్నారు. అవసరమైనప్పుడు మహిళా కూలీలను కూడా తీసుకుంటాను. – బ్రాహ్మణ్ శేఖర్, వంటాచార్యుడు, కుభీర్ ప్రభుత్వం ప్రోత్సహించాలి నేను 20 ఏళ్లుగా వంటలు చేస్తున్నా. ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఆర్థికసాయం అందిస్తే మరిన్ని వంటపాత్రలు కొనుగోలు చేసి మరికొందరికి ఉపాధి కల్పిస్తా. – ఆరె లక్ష్మణ్, వంటాచార్యుడు, కుభీర్ -
పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కప్పర్లకు చెందిన అనుప నారాయణ (32) వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం మద్యం సేవించి పంటచేనుకు వెళ్లాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేను యజమానికి సమాచారం ఇచ్చాడు. యజమాని చేను వద్దకు వెళ్లేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అంబులెన్సులో రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాధిక తెలిపారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 60 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం అక్షరాభ్యాస మండపంలో లెక్కించారు. రూ.77,77,746 నగదు, 126 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 440 గ్రాముల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. బాక్సింగ్ కమిటీ ఎన్నికశ్రీరాంపూర్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరుమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి కే.దేవేందర్ను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
తుర్కం చెరువును సందర్శించిన ట్రైనీ అటవీ అధికారులు
మామడ: మండలంలోని ఎకో టూరిజం సందర్శన కేంద్రం అయిన తుర్కం చెరువును ట్రైనీ అటవీ అధికారులు శిక్షణలో భాగంగా మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 42 మంది ట్రైనీ బీట్ అధికారులు తుర్కం చెరువుతోపాటు యెంగన్న చెరువు వద్ద వలస పక్షులను ప్రత్యేక కెమెరాలతో వీక్షించారు. చెరువులకు వస్తున్న పక్షుల రకాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవిలో పెరుగుతున్న మొక్కల రకాలను తెలుసుకున్నారు. వారివెంట ఎఫ్ఆర్వోలు శ్రీనివాస్రావు, స్వరూప, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, పీడీ కొండల్రావు ఉన్నారు. -
ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగదు అపహరణ
రెబ్బెన: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి హ్యాండ్బ్యాగ్లో నుంచి నగదు అపహరించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు చింతలమానెపల్లి చెందిన మహిళ మంగళవారం రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వరకు వచ్చింది. అక్కడి నుండి మంచిర్యాల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే కండక్టర్కు చూపించేందుకు తన హ్యాండ్బ్యాగ్లో ఉన్న ఆధార్కార్డును తీసేందుకు బ్యాగు తెరవగా అందులో ఉన్న రూ.15వేలు కనిపించలేదు. దీంతో బస్సును దేవులగూడ వద్ద ఆపి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది బస్సులో ఉన్న ప్రయాణికులందరి బ్యాగులను తనిఖీ చేసినా డబ్బులు లభించలేదు. అయితే రెబ్బెన బస్స్టాప్లో కొంతమంది ప్రయాణికులు బస్సు దిగిపోయారని, వారిలోనే డబ్బులను చోరీ చేసిన ఉండి ఉంటారని పోలీసులు భావించారు. ఘటనతో మంచిర్యాలకు వెళ్లే ప్రయాణికులు సుమారు 1:15 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్ను వివరణ కోరగా ఘటనపై బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. -
సమయానికి రారు.. పట్టించుకోరు!
హాజీపూర్ పీహెచ్సీ సిబ్బంది సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఉదయం సమయానికే తాళాలు తీసినా.. సిబ్బంది మాత్రం సమయం దాటాకే వస్తున్నారని, సాయంత్రం కూడా సమయం కాకముందే తాళం వేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్) -
క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–25 జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించారు. 200ల మంది క్రీడాకారులు పాల్గొనగా 90 మందిని ఎంపిక చేసి ఆరు టీంలుగా విభజించారు. ప్రతీ టీంను మిగిలిన అన్ని టీంలతో రెండు రోజుల పాటు ఆడించాలని భావించగా వర్షంతో వాయిదా పడింది. మంగళవారం జిల్లాలోని మూడు మైదానాల్లో ఎంపిక పోటీలు నిర్వహించినట్లు హెచ్సీఎల్ సెక్రటరీ కోదాటి ప్రదీప్, కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. మంచిర్యాలలోని ఉషోదయ పాఠశాల, గుడిపేట 13వ పోలీసు బెటాలియన్ మైదానం, మందమర్రిలోని సింగరేణి మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరు టీంలలో ప్రతిభ కనబర్చిన వారిని ఒక టీంగా చేసి, వారిని ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. -
జొన్న రైతుల తిప్పలు
కుభీర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజులుగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం జొన్నలు తెచ్చిన రైతులు వర్షంలో ఇబ్బంది పడ్డారు. మార్కెట్ యార్డు నుంచి తెలంగాణతల్లి చౌక్ వరకు రోడ్డువెంట వాహనాలు బారులుతీరాయి. బుధవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని అధికారులు చెప్పడంతో మంగళవారం భారీగా రైతులు జొన్నలు తీసుకువచ్చారు. యార్డులో ఇప్పటి వరకు సుమారు 28 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. మంగళవారం లారీలు రాక బస్తాలతో అక్కడే ఉండడంతో జొన్నలతో వచ్చిన వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. వర్షం కారణంగా టార్పాలిన్లు కప్పి ఉంచారు. జొన్నల కొనుగోళ్లు జూన్ 30 వరకు చేస్తామని గతంలో చెప్పారు. జూన్ 17 వరకు టోకెన్లు జారీచేశారు. తీరా ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఎత్తేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వానమ్మా.. జర ఆగమ్మా..!
● వారం రోజులుగా జిల్లాను వీడని వరుణుడు ● కల్లాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కొద్ది రోజులు ఆగాలని రైతుల వేడుకోలు ● తేమశాతం పెరగడంతో కోతలుకొనుగోళ్లలో జాప్యంపై ఆందోళనజొన్న రైతులకు నష్టం.. తానూరు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హిప్నెల్లి, బెంబర, తానూరుతోపాటుఆయా గ్రామాల్లో కొతకు వచ్చిన జొన్నపంట నెలావాలింది. కంకులకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్: ‘ఒక్కో యేడు ఎంత వేడుకున్నా జాడ కూడా ఉండవు. ఈయేడాదేమో.. జరంత ఆగుమంటే కూడా ఆగుతలేవు. గీ వడ్లు పోయేదాకన్నా ఓపిక పట్టమ్మా.. నీకు పుణ్యముంటది. చేసిన కష్టం చేతికందే వేళ.. నీళ్లపాలైతుంటే కన్నీళ్లు అగుతలేవు తల్లీ. ఇప్పటికే తాలుతప్ప అంటూ కోతలు పెట్టే మిల్లర్లు తడిసిన వడ్లంటే సగం పైసలే ఇస్తమంటరు. నిన్నే నమ్ముకుని బతికేటోళ్లం. అందరికీ అన్నం పెట్టేటోళ్లం. మమ్మల్ని పగబట్టినట్లు చేయకు..ఓ వానమ్మా.. జర ఆగిరావమ్మా..’ అంటూ కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యాన్ని తడికళ్లతో చూస్తూ వేడుకుంటున్నారు బాధిత రైతులు. జిల్లాల్లో ఇప్పటికే 80 శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా.. మిగిలిన వడ్లను వాన ముంచేస్తోంది. తడిసిన, మొలకల వచ్చిన వడ్లంటూ మిల్లుల్లో బస్తాకు 4 కిలోల చొప్పున కోతలు పెడుతున్నారు. అకాలంలో వచ్చిన అల్పపీడనం రైతన్నపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అకాలం ముప్పు తొలగక ముందే.. రుతుపవనాలు రావడంతో పది రో జులుగా జిల్లాను వర్షాలు వీడడం లేదు. మబ్బులు కమ్ముకుని, ముసురు పెట్టినట్లు వాన కురుస్తూనే ఉంది. కొన్నిమండలాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న, సంచుల్లో నింపిన ధాన్యం తడుస్తోంది. వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే తడిసిన ధాన్యానికి మొలకలూ వస్తున్నాయి. ఇక జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖతోపాటు జిల్లా అధికారులూ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలో ధాన్యం..కుంటాల: మండలంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. లింబా(కె), కుంటాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. కుప్పల నుంచి వరద నీరు తొలగించేందుకు రైతులు తిప్పలు పడ్డారు. కారు మబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. పొంగిన వాగులు.. కడెం: మండలంలోని ఉడుంపూర్, మిద్దెచింత, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. సారంగపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మండలంలోని ధని గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్–స్వర్ణ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి గంటన్నరపాటు ఆందోళన చేశారు. వర్షాల కారణంగా పంట కోయకుండా పొలాల్లోనే ఉండిపోయి నష్టపోతున్నామని తెలిపారు. ఇక, మార్కెట్కు తరలించిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో నష్టపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయి రైతులను దోచుకునేందుకు ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు. క్వింటాల్కు 6 కిలోల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారని తెలిపారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడతామని ఫోన్ద్వారా అధికారులను సీఐ సంప్రదించి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో ఈరహదారిపై రాకపోకలు స్తంభించాయి. పోలీసులు బోరిగాం మీదుగా వాహనాలను మళ్లించారు. ఆందోళన చేస్తున్న ధని గ్రామ ఽ రైతులు ఆందోళనలో రైతన్న.. ‘ఇదేం కాలమో.. ఏమో..! ముందస్తుగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది..’ అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఆలస్యంగా సాగు చేసి, హార్వెస్టర్లు సమయానికి అందుబాటులో లేక వరి కోతలు చేయనివాళ్లు, కోతలు కోసి ఆరబెట్టుకున్నవాళ్లు, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్న రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్నీ కొంటామంటూ ప్రభుత్వం, జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నా.. సదరు ధాన్యానికి రైసుమిల్లర్లు పెడుతున్న కొర్రీలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివరాలు..ధాన్యం కొనుగోలు అంచనా 1,62,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు 318కొనుగోలు చేసిన ధాన్యం 1,33,000 మెట్రిక్ టన్నులు ఇంకా రావాల్సిన ధాన్యం 40 వేల మెట్రిక్ టన్నులు కోతలు తప్పవు.. ప్రభుత్వం గ్రేడ్–ఏ ధాన్యం క్విటాల్కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్కు రూ.2,300 చొప్పున మద్ధతు ధర చెల్లిస్తోంది. ఈ ధర దక్కాలంటే ధాన్యంలో తేమ 17శాతం మించకూడదు. కానీ.. అకాలవర్షంతో ఆగమైన వాతావరణం రైతన్నను పరేషాన్ చేస్తోంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తేమశాతం అటుంచి, ధాన్యం తడవకుండా చూసుకోవడం రైతులకు పెద్ద పరీక్షగా మారింది. టార్పాలిన్లను కప్పుతూ.. తీస్తూ.. ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక తడిసిన ధాన్యాన్నీ సర్కారు ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తున్నా.. రైసుమిల్లర్లు సంచికి 3–4 కిలోల కోత తప్పదంటున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు.. నాకున్న ఎకరంన్నరతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసుకున్న. అకాలవర్షం కారణంగా ఇంతవరకు కోత కోయలేదు. ఇప్పుడింకా వానలు పడుతాయంటున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు. – వాసాల పోశెట్టి, జామ్, మం.సారంగపూర్ తడిసిన ధాన్యం కొనుగోలు.. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి, రైసుమిల్లులకు తరలిస్తున్నాం. సాధ్యమైనంత వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. –కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్లింబా(కె)లో వర్షపునీరు తొలగిస్తున్న రైతు -
మత్స్యశాఖ ఏడీపై చర్య తీసుకోవాలి
దస్తురాబాద్: మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్యపై చర్య తీసుకోవాలని మండలంలోని భూత్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ మత్స్యకారులు గోదావరి తీరంలో మంగళవారం నిరసన తెలిపారు. 2016లో హైకోర్టు తీర్పు ప్రకారం రాంపూర్ మత్స్య సహకార సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని, ఆ తీర్పు ప్రకారం జిల్లా మత్సశాఖ అధికారులు సంఘం ఏర్పాటు చేసి గోదావరి తీరంలో చేపల వేట సాగించాలని లైసెన్స్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి లైసెన్స్లు రెన్యూవల్ చేసుకుంటున్నామని, ఈసారి మాత్రం రెన్యూవల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్త చేశారు. లైసెన్స్లు ఇవ్వకుంటే ఇతర గ్రామాల వారు కూడా వచ్చే అవకాశం ఉందని, దీంతో గొడవలు జరుగుతాయని పేర్కొన్నారు. మత్స్యకారుల మధ్య గొడవ సృష్టించేలా వ్యవహరిస్తున్న ఏడీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంపూర్ మత్స్యకారులకు లైసెన్స్లు జారీ చేయాలని కోరారు. -
పేదల సొంతింటి కల సాకారం
● మంత్రి సీతక్క ● అభివృద్ధి పనులకు శంకుస్థాపనముధోల్/లోకేశ్వరం: పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోకేశ్వరం, ముధోల్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముధోల్ మండలం బ్రాహ్మణ్గావ్లో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామరావుపటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యగా స్టీల్ బ్యాంకును ఆవిష్కరించారు. దౌనెల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు, తానూర్ బీటీ రోడ్డు సహా రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. రూ.1.90 కోట్లతో కుంటాల–దౌనెల్లి రోడ్డు, రూ.5.9 కోట్లతో తానూర్–హుండా రోడ్డు రినివల్, రూ.10 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. లోకేశ్వరంలో కుమురంభీం విగ్రహావిష్కరణ లోకేశ్వరం మండల కేంద్రంలో కుమురంభీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు తమ సంస్కృతి, భాష, ఆచారాలను కాపాడుకోవాలన్నారు. హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అర్లి నుంచి ముధోల్ వరకు రోడ్డు నిర్మాణం, ముధోల్లో డిగ్రీ ఆశ్రమ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, వెడ్మ బొజ్జుపటేల్, భైంసా వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ ఆనంద్రావుపటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్రెడ్డి, ఆదివాసీ నాయకపోడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సట్ల అశోక్, ఉపాద్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్రావు, నాయకులు సుదర్శన్రెడ్డి, బోడికె సాయన్న, రాజేశ్బాబు, శ్రీధర్, చిన్నారావు, విగ్రహదాత జయసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన చివరి విడత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ బడులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు, విద్యా ప్రగతి, విద్యా కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ధి, పాఠశాలల్లో నూతన కార్యక్రమాల అమలు, విద్యార్థులను పోటీ పరీక్షల్లో పాల్గొనేలా చేయడం, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చూసుకోవడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలని వివరించారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అభినందనలు తెలపాలన్నారు. అనంతరం బాలశక్తి శిక్షణ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి దేవిప్రియ మాట్లాడుతూ బాలశక్తి కార్యక్రమం 4 ప్రధాన ఉద్దేశాలను వివరించారు. జూన్ 15 నుంచి జిల్లాలోని 118 ఉన్నత పాఠశాలల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో ఏఎంవో నరసయ్య, సీఎంవో ప్రవీణ్ కుమార్, రీసెర్చ్ ఉపాధ్యాయులు తోడిశెట్టి పరమేశ్వర్, మైసాజి, రాజశేఖర్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపిక
నిర్మల్ రూరల్: జిల్లాలోని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపికను కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ సురేశ్బాబు ఉపాధ్యాయుల ప్రదర్శనలు పరిశీలించారు. 88 మంది ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎం.ఎల్లన్న (ఎంపీపీ ఎస్ వానల్పాడు, బైంసా), జాడి శ్రీనివాస్(జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్), ప్రవీణ్కుమార్(ఎంపీపీఎస్ సేవాలాల్ తండా, లోకేశ్వరం)ను ఎంపిక చేసి వీరిపేర్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
రైతులపై మరో భారం
● రెట్టింపైన జీలుగ విత్తనాల ధర ● వానాకాలం సీజన్కు ముందే పెంచిన ప్రభుత్వం ● 30 కేజీల జీలుగ ధర రూ.2,137లక్ష్మణచాంద/మామడ: సాగు భూములను సారవంతం చేయడానికి ఖరీదైన రసాయన ఎరువులు, బయటి నుంచి మట్టి తరలించడం కన్నా, జీలుగ వ ంటి పచ్చిరొట్ట పంటలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. ఈమేరకు వ్యవసాయాధికారులు కూడా పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిస్తారు. జీలుగ సాగు నేల స్వభావాన్ని మెరుగుపరిచి, పంటల దిగుబడిని పెంచుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జీలుగ విత్తనాల ధరలను రెండింతలు పెంచింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసారం పెంచేందుకు.. జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి, 45 రోజు ల తర్వాత కలియదున్నడం ద్వారా నేల సారవంతం అవుతుంది. ఇది నీటి సామర్థ్యాన్ని పెంచి, 2% నత్రజని, సూపర్ పాస్ఫేట్, జింక్, కాల్షియం, ఇను ము వంటి సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్తు ంది. ఎకరానికి 10–12 కిలోల జీలుగ విత్తనాలను తొలకరి వర్షాల తర్వాత విత్తి, పూత దశలో దుక్కి దున్నడం ద్వారా 10 టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. ఒక టన్ను ఎరువులో 6 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాష్ లభిస్తాయి. ఇది రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, రైతుల పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది. జీలుగ ధరల పెంపు.. రైతు భరోసా సబ్సిడీపై స్పష్టత లేని నేపథ్యంలో, రైతులు పెట్టుబడికి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో జీలుగ విత్తనాల ధరలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది 30 కిలోల జీలుగ బస్తా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది రూ.2,137కి పెంచారు. ఈ ధరల పెంపు సాగు ఖర్చులను పెంచి, రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పంపిణీ ఆలస్యం.. మరోవైపు జిల్లాకు జీలుగ విత్తనాలు ఇంకా పంపిణీ కాకపోవడం రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట విత్తుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగుకు 3,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించారు. ఇవి 50% సబ్సిడీపై త్వరలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది 35 వేల ఎకరాలకు సరిపోతుంది. పెంచిన ధర తగ్గించడంతోపాటు త్వరగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
కుభీర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈవో రామారావు అన్నారు. సోమవారం మండలంలోని పల్సి ఉన్నత పాఠశాలలో గ్రామస్తులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం కావాలనుకునేవారు పాఠశాలల కమిటీ తీర్మాణాలను పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తైమిన్బేగం ఇంటికి వెళ్లి అభినందించారు. సమావేశంలో ఎంఈవో విజయ్కుమార్, ప్రధానోపాధ్యాయులు సురేష్, గ్రామపెద్దలు హన్మాండ్లు, రమేశ్, ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడాలి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెలో అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడి ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్, సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి సోమవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోసంపల్లె గ్రామాన్ని ఆనుకుని ఉన్న పీపీల్యాండ్ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బూక్యా రమేశ్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్టౌన్: నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిలకు విన తి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలువురు నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీపీఆర్వో కార్యాలయంలో డీపీఆర్వో విష్ణుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సభ్యులు మనోజ్, అశోక్, రవి, యోగేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: ఈ నెల 24 నుంచి 26 వరకు మంచిర్యాల ఎఫ్ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఏడుగురు పాల్గొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఇందులో పి.అభినయ (54–57), ఏ.కీర్తన (46–48), శ్రావణి (64–67) కేటగిరీలలో బంగారు పతకాలు సాధించగా నక్షత్ర కాంస్య పతకం సాధించింది. ఇందులో అభినయ, కీర్తన జూన్ 4 నుంచి 7 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండర్–17 బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ స్థాయికి ఎంపికై న అభినయ, కీర్తనలను అభినందించారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి
మార్కెట్ తరలించాలి పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్లో రోడ్లపై వ్యాపారాలు చేయడం వల్ల ఇంద్రనగర్ కాలనీకి వెళ్లడం కష్టంగా మారింది. ఇంద్రనగర్ నుండి విశ్వేశ్వరయ్య మార్గ్ వెళ్లే దారిలో మెయిన్ రోడ్డుపై ఉన్న డివైడర్ క టింగ్ను ఈ కూరగాయల మార్కెట్ వల్ల మూసివేశారు. దీనిని తిరిగి తెరిపించాలి. ఈ విషయంపై కలెక్టర్ చొరవ తీసుకొని సత్వర మే మార్కెట్ను మరో చోటుకు తరలించాలి. – ఇందిరానగర్ కాలనీవాసులు, నిర్మల్ ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి వెంగ్వాపేట్లోని కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తరలించి 30 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదు. అధికారులు త్వరగా స్పందించి ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో తరలించాలి. లేదంటే కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – వెంగ్వాపేట్ గ్రామ రైతులు నా భర్త ఉద్యోగం ఇప్పించాలి ఎస్డీసీఎల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నా భర్త కృష్ణకాంత్ గతేడాది మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నా భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కలెక్టర్గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నా భర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నాకు ఇప్పించాలని వేడుకుంటున్నా. – ఎన్.కల్పన, ఎల్లపెల్లి, నిర్మల్ నిర్మల్టౌన్: ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. రైతు రుణమాఫీ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, విద్య, వైద్యం, తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించాలి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని, వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి ఖానాపూర్ మండలం పాత తర్లపాడు గ్రామ శివారులోని 113 సర్వేనంబర్లో 1990లో ప్రభుత్వం 19 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలు కూడా ఇచ్చింది. ఇట్టి భూమిని సాగుచేసుకుంటున్నాం. ఇది అటవీ శాఖ భూమి అంటూ అధికారులు వ్యవసాయ పనులు చేపట్టిన ప్రతీసారి పనులకు ఉపయోగించే టాక్టర్లు, జేసీబీలను సీజ్చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి మా వ్యవసాయ భూమిలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా చర్యలు చేపట్టి మా నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి. – పాత తర్లపాడు గ్రామ రైతులు పింఛన్ ఇస్తలేరు సారూ.. నిర్మల్ మండలానికి చెందిన షేక్నైమా పుట్టుకతోనే బుద్ధిమాంధ్యం, అంగవైకల్యంతో బాధపడుతోంది. 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ రావడంలేదు. తన తల్లి సహాయంతో పలుమార్లు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చి కలెక్టర్కు తన గోడు వెల్ల బోసుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ -
జొన్న కొనుగోళ్లు నిలిపివేత..
భైంసాటౌన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలు పలుచోట్ల మూసివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముధోల్కు చెందిన రాజేశ్వర్ రావు దేశాయ్ అనే రైతు జొన్నలు విక్రయించేందుకు ఈనెల 23న టోకెన్ తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సోమవారం తీసుకురావాలని సూచించగా మాటేగాంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కేంద్రం మూసి ఉండడంతో నిర్వాహకులను ఫోన్లో సంప్రదించాడు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి చేరుకుని మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్కుమార్ను ఫోన్లో సంప్రదించగా కుంటాలలోని కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సదరు రైతు కుంటాల కొనుగోలు కేంద్రంలో జొన్నలు విక్రయించాడు. ‘సాక్షి’ చొరవతో జొన్నలు కొనుగోలు చేయడంతో రైతు కృతజ్ఞతలు తెలిపాడు. -
‘భరోసా’ ఇంకెప్పుడు?
లక్ష్మణచాంద: పంటల సాగుకు అవసరమైన వి త్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం గతంలో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తె చ్చి పంటలు సాగు చేసేవారు. దీంతో వడ్డీ చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవా రు. రైతుల పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి అందించి ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ గత వానాకాలంలో ఎకరానికి కేవలం రూ.10 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. సాగు పనులు షురూ జిల్లాలో ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే పంట చేలలోకి నల్లమట్టి, పశువుల ఎరువు తరలించి పొలమంతా చల్లుతున్నారు. దుక్కులు దున్ని విత్తనా లు వేయడానికి పంటచేలను సిద్ధం చేస్తున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4 లక్షల 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ప్రధానంగా సోయాబీన్ 1.10 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షల ఎకరాలు, పత్తి 1.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కంది 7 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 వేల ఎకరాలలో సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయం రూ.275 కోట్లు జిల్లాలోని 19 మండలాల పరిధిలోని 400 గ్రామాలకు చెందిన లక్షా 84 వేల మంది రైతులకు గానూ రైతు భరోసా కింద రూ.275 కోట్లు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయని డీఏవో అంజిప్రసాద్ పేర్కొన్నారు. ఆందోళన చెందుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటి వరకు రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు ఎలా కొనుగోలు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాం. – సాయన్న, రైతు, పొట్టపెల్లి ఆదేశాలు రాలేదు రైతు భరోసా నిధుల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్ ఇప్పటికీ ప్రకటన చేయని ప్రభుత్వం ఎదురుచూపుల్లో రైతులు అప్పులు తప్పవంటున్న అన్నదాతలు జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు స్పష్టతలేని వైనం... ఈ సారి ముందస్తుగానే రుతుపవనాలు వచ్చాయి. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కానీ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో రైతు భరోసా వస్తుందా? రాదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి రైతు భరోసాపై స్పష్టత ఇచ్చి ఖాతాల్లో నగదు జమచేసి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. -
ప్రాణ రక్షకులు
● ప్రమాద స్థలాలకు క్షణాల్లో చేరుతున్న పైలెట్లు ● క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ● వైద్య చికిత్సతో నిలబెడుతున్న ప్రాణాలు ● నేడు జాతీయ పైలెట్ దినోత్సవంచెన్నూర్: 108 అంబులెన్స్ పైలట్లు ప్రాణరక్షకులని.. ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే చాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. పైలట్ల సేవలను పలువురు కొనియాడుతున్నారు. సోమవారం జాతీయ అంబులెన్స్ పైలెట్ దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 అంబులెన్స్లు పని చేస్తున్నాయి. 176 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్లు ఆయా మండలాల పరిధిలో జరిగే రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలాలకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పైలెట్లు ప్రమాద స్థలాలకు చేరుకునేందుకు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లా అంబులెన్సులు పైలెట్ మంచిర్యాల 18 45 అదిలాబాద్ 25 60 నిర్మల్ 15 36 కుమురం భీం 15 35 -
శత జన్మదిన సందడి
● వాగ్దారిలో ఓ వృద్ధుడి వందో పుట్టినరోజు వేడుక నేరడిగొండ: మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడి శత జన్మదిన సంబురం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్య ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బదావత్ కిర్యానాయక్ 1925 మే 24న జన్మించాడు. శనివారంతో వందేళ్లు పూర్తికాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిర్యానాయక్ కేక్ కట్ చేశారు. తన ఆరోగ్యానికి జీవనశైలే కారణమని పేర్కొన్నాడు. కార్యక్రమంలో ఐదు తరాల వారసులు పాల్గొని సందడి చేశారు. -
రాణిస్తున్న ‘జాహ్నవి’
జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కె.జాహ్నవి ఏడో తరగతి చదువుతోంది. 2022 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ రాణిస్తోంది. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తితో శిక్షణలో చేర్పించినట్లు తల్లిదండ్రులు సంజుతాయి– రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా 7 రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చింది. మహారాష్ట్ర వార్ధాలో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. కళాశక్తి పురస్కారంతోపాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రం అందుకుంది. -
● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో పాల్గొని గిన్నిస్ రికార్డు ● బాలకేంద్రం చిన్నారుల ప్రతిభ
ఆదిలాబాద్: చిన్నారులు ఆయా వేదికల్లో శాసీ్త్రయ నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్నారు. అందులోనే రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. వారే జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ గిన్నిస్ రికార్డులకెక్కిన చిన్నారులు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 24, 25వ తేదీల్లో కూచిపూడి కళా వైభవం–మహా బృందనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 4,218 మంది నృత్యకారిణులు ఒకేసారి ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సాధించారు. వారిలో బాల కేంద్రానికి చెందిన 26 మంది కూచిపూడి చిన్నారి నర్తకులు ఉండడం విశేషం. గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులు.. గడ్డం శ్రీనిధి, దువాస హర్షిని, పన్నాల లాస్య, ఠాకూర్ హర్షిని, అక్షర గీత, క్షీరసాగర్ జాహ్నవి, సన్నిధి దేశ్ముఖ్, కుర్ర భవిష్య, జాబు శ్రీ వర్ధిని, ఆర్. ఓజస్విని, నాలంవార్ మహాలక్ష్మి, గుండేటి అశ్విత, ఉపలంచివార్ అక్షిత, కొంకటీ ఇతీక్ష, పోలాజి ఉమారాణి, మోర శ్రేష్ట, సామ మహతి, చిలుక ఆమని, మామిడి అక్షయ, అవరగొండ సంజన, యానాకి నక్షత్ర, మచ్చ సాత్విక, కటకం భావనశైని, కొండ్ర అలేఖ్య, కానిందే మహాశ్రీ, రామోజీ రచన. గిన్నిస్ రికార్డు సాధించిన బాలకేంద్రం చిన్నారులతో కలెక్టర్ రాజర్షి షా నాట్యశిఖామణి ‘ఆమని’ కై లాస్నగర్ కాలనీకి చెందిన చిలుక వెంకటస్వామి–అన్నపూర్ణ దంపతుల కుమార్తె ఆమని 2021 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అద్భుత కళా నైపుణ్యంతో అన్నమయ్య పురస్కారాన్ని సాధించింది. ఇప్పటివరకు 10 రికార్డులు సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రాన్ని అందుకుంది. -
పంచ్ అదుర్స్!
● మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ● 260 మంది క్రీడాకారులు హాజరు.. ● హోరాహోరీగా తలపడుతున్న బాక్సర్లుమంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు వేదికగా నిలిచింది. ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ (బాక్సింగ్ ఫెడరేషన్ అనుబంధం) పర్యవేక్షణలో ఈనెల 24న ప్రారంభమైన ఈ పోటీలు 26 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది బాక్సింగ్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. వయస్సు, బరువు ఆధారంగా విభజించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ శక్తివంతమైన పంచ్లతో ఆకట్టుకుంటున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ ఏర్పాట్లు పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించి, లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురి క్రీడాకారులను ‘సాక్షి’పలకరించగా తమ అనుభవాలు వెల్లడించారు. -
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి
మందమర్రిరూరల్/పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణా నికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (69) అ నారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో ఆదివారం ఉదయం మృతిచెందారు. నెల రోజు లుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని నివాసానికి తీసుకువ చ్చారు. మధ్యాహ్నం వరకు సందర్శనార్థం అక్కడే ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం పార్థివదేహాన్ని సాయంత్రం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్ మీదుగా ఈద్గాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ కోదండరామ్, యూనియన్ నేతలు, స్నేహితులు, తోటి పాత్రికేయులు, రాజకీ యనాయకులు, అభిమానులు నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా ప్రస్థానం మునీర్ ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా జిల్లాలో చెరగని ముద్రవేశారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, సీపీఐలో చురుకైన నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. 1981లో సింగరేణిలో కార్మికుడిగా చేరి, భూస్వాముల అరాచకాలపై పో రాటాలు చేశారు. 1982లో హత్య కేసులో నిందితుడిగా శిక్ష పొందినా, హైకోర్టు కేసును కొట్టివేసింది. ఇక జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో 40 ఏళ్ల్లు పనిచేశా రు. 2008లో సింగరేణి గోల్డెన్ హ్యాండ్షేక్ పథకం ద్వారా ఉద్యోగ విరమణ పొంది, జర్నలిజంలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్గా సమ్మెను విజయవంతం చేశారు. పలువురి నివాళి మునీర్ మృతికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. మునీర్కు భార్య రిజ్వానా, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
రికార్డుల ‘హర్షిణి’
జిల్లా కేంద్రంలోని ఠాకూర్ ప్రదీప్ సింగ్– అనూష దంపతుల కుమార్తె హర్షిణి కూచిపూడి నృత్యంలో అరుదైన రికార్డులను సాధిస్తుంది. 2022 నుంచి ఇప్పటివరకు 11 అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. 2022లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2023లో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ అండ్ రికార్డ్స్, జేమ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా రికార్డ్స్ దక్కాయి. ఇప్పటివరకు 40కి పైగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చింది. తల్లి ప్రోత్సాహంతో రాణిస్తున్నానని హర్షిణి తెలిపింది. -
మరోసారి సత్తా చాటుతా..
ఇటీవల పదో తరగతి పూ ర్తయింది. మంచిర్యాలలో ని ఖేలో ఇండియా ద్వారా బాక్సింగ్లో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు పాల్గొని సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించాను. సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ పతకం సాధించగా, ఓపెన్ స్టేట్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో మూడోస్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో ఆడినా పతకం అందుకోలేకపోయాను. మంచిర్యాలలో నిర్వహిస్తున్న పోటీల్లో గోల్డ్ పతకం సాధిస్తాను. – క్రితి అగర్వాల్, మంచిర్యాల జాతీయస్థాయిలో రాణిస్తా ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల టెన్త్ చదివాను. రాష్ట్రస్థాయిలో ఎస్జీఎఫ్లో రెండు గోల్డ్మెడల్స్ సాధించాను. బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీల్లో 46, 48 కేజీల విభాగంలో గోల్డ్మెడల్స్ సాధించాను. జాతీయస్థాయి పోటీల్లో నాలుగుసార్లు పాల్గొనగా ఒకసారి దేశంలోనే 8వ స్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాను. – నిహారిక, నిజామాబాద్ గోల్డ్మెడల్ సాధిస్తా రాష్ట్రస్థాయిలో సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్స్ సాధించాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గోవాకు ఎంపికయ్యాను. పదోతరగతి ఇటీవల పూర్తి చేయగా, 8వ తరగతి నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. జాతీయస్థాయిలో పాల్గొని గోల్డ్మెడల్ను సాధించాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నాను. – జె.అనుగ్రహ, హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆడేందుకు శిక్షణ ఇటీవల ఇంటర్ పూర్తయింది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడి గోల్డ్మెడల్ సాధించాను. జాతీయస్థాయిలో ఒకసారి ఆడి, సెమీఫైనల్ చేరాను. ఫైనల్ చేరేలా శిక్షణ తీసుకుంటూనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నా. జాతీయస్థాయిలో రాణించేలా బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. – సంస్కృతి, మంచిర్యాల -
ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు
ఇంద్రవెల్లి: ఖరీఫ్సీజన్ నేపథ్యంలో ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు విత్తన పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విత్తన పూజలు చేశారు. అమ్మవారికి నవధాన్యాలతో నైవేద్యాలు సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఆలయ మహారాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల ఆదివాసీలు ఉన్నారు. 108లో ప్రసవంబెల్లంపల్లి: పురిటినొప్పులతో బాధపడుతున్న 8 నెలల గర్భిణికి 108 సిబ్బంది ఎంతో నేర్పుతో ఆదివారం ప్రసవం చేశారు. కుమురం భీం జిల్లాలోని భీమన్గూడ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం పోసుబాయికి పురిటినొప్పులు వచ్చాయి. ఆశ కార్యకర్త సహాయంతో కుటుంబీకులు 108 అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రికి రెఫర్ చేయడంతో అక్కడికి తీసుకెళ్లారు. 8 నెలల గర్భిణి, రక్తం తక్కువగా ఉండటం, ఐదో కాన్పు కావడంతో అక్కడి వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. వెంటనే పోసుబాయిని మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సోమగూడెం శివారుప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డు పక్కన అంబులెన్స్ను నిలిపి ఈఆర్సీపీ వైద్యుడి సలహాతో ఈఎంటీ దుర్గం ఆత్మరావు, పైలెట్ అజయ్ ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని మంచిర్యాల మాతా శిశుకేంద్రానికి తరలించారు. బెల్లంపల్లి 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్ను కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. -
తడిసిన ధాన్యం కొంటాం
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి సారంగపూర్: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేద ని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి సారంగపూర్ చేరుకున్న అ న్వేశ్రెడ్డి మార్కెట్ యార్డు ఆవరణలో వరి ధా న్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది యాసంగిలో 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈసారి 60లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. అయినప్పటికీ రైతులు పండించిన చివరి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యు డు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మ న్ అయిర నారాయణరెడ్డి, స్వర్ణ ప్రాజెక్ట్ ఆయక ట్టు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పోతిరెడ్డి సుజాత–నర్సారెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, రాజన్న తదితరులున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
కుంటాల: అకాల వర్షాలు జిల్లాకు చెందిన అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జొన్నలు తడిసి ముక్కిపోయాయి. తడిసిన ధాన్యం బస్తాలు ఆరబెట్టేందుకు ఆదివా రం రైతులు ఇబ్బంది పడ్డారు. షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఖానాపూర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తోంది. కొన్నిచోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తింది. ఖానాపూర్, కడెం మండలాల్లోని స దర్మాట్ ఆయకట్టు కింద 50శాతం వరి కోతకు రా గా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదా తలు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణచాంద: నాలుగురోజులుగా కురుస్తున్న వర్షా లకు మండలంలోని రాచాపూర్ సమీపంలో రైతులు ఆరబోసిన ధాన్యం మొలకెత్తింది. ధాన్యం నుంచి మొలకను వేరు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కుంటాల: జొన్న కుప్పల చుట్టూ నిలిచిన వరదనీరు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు అన్నదాతల పాట్లు -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009–10లో పదోతరగతి చదివినవారంతా ఆదివారం మండలంలోని కనకాపూర్ కేఎన్ఆర్ గార్డెన్స్లో పూర్వవిద్యార్థుల స మ్మేళనం పేరిట కలుసుకున్నారు. వివిధ ప్రాంతా ల్లో ఉంటున్నవారంతా ఒక్కచోట చేరి ఒకరినొక రు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యో గక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు రవికుమార్, మోహన్రావు, నారా యణ, వకుల కుమారి, లక్ష్మణ్ను ఆహ్వానించి స న్మానించారు. పూర్వవిద్యార్థులు అశోక్, రాజు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పొన్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో.. మామడ: మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2010–11లో పదోతరగతి చదివినవారంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతా ఒక్కచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చది విన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడిపారు. పూర్వవిద్యార్థులు స్రవంతి, స్వప్న, కృష్ణవేణి, మౌనిక, అనిత, కళ్యాణి, నాగరాజు, అనిల్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
పంచ్ అదుర్స్! మంచిర్యాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు రెండోరోజుకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా హాజరైన 260 మంది క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025ఎవరెస్ట్ బేస్క్యాంపునకు ఎంపిక లక్ష్మణచాంద: ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు మండలంలో ని రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు చెందిన తొ మ్మిదో తరగతి విద్యార్థి జే గోకుల్నాయక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల నుంచి 100 మంది బాలికలు, 100 మంది బాలురను ఎంపిక చేసి ఇటీవల భువనగిరిలో మాలవత్ పూర్ణ ఆధ్వర్యంలో రెండురోజులు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపిక చేయగా ఇందులో గోకుల్నాయక్కు అవకాశం దక్కింది. గోకుల్నాయక్ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఒకరు 2024 జూన్లో రిటైర్డయ్యారు. ఇతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపేణా రూ.60 లక్షల వరకు రావాలి. ఇందులో గ్రాట్యూటీ రూ.16 లక్షలు, కమ్యూటేషన్ రూ.20 లక్షలతోపా టు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ డబ్బులు ఇంతవరకు అందలేదు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక అవసరాలకు ఇ బ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనుకున్న పనులు ఆగిపోయాయని ఆయన వాపోయారు. ఇలా ఉద్యోగ విరమణ పొందిన జిల్లాలోని పలువు రు ఏడాదైనా తమకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో నిత్యం ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 5,584 మంది పెన్షనర్లు ఉండగా గతేడాది ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసే 284 మంది రిటైర్డయ్యారు. వీరిలో కొందరికి పెన్షన్ వచ్చినా.. ఇతర బెనిఫిట్స్ కోసం ఏడాదిగా నిత్యం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రణాళిక తారుమారై.. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బుల కోసం వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారైనట్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు చేతికి అందితే పిల్లల వివాహాలు చేయాలని కొందరు, ఇళ్లు కట్టుకోవాలని మరి కొందరు, నిరుద్యోగులైన కుమారులకు వ్యాపారాలు పె ట్టించాలని ఇంకొందరు, భార్యకు బంగారం కొనా లని మరికొందరు వేసుకున్న ప్లాన్ తలకిందులై ని రాశతో ఉన్నారు. రిటైర్మెంట్ వేడుక అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకున్న తాము బంధువుల ముందు ప్రణాళికలు వేసుకోగా ఇప్పుడు మాట తప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని కొందరు పెన్షనర్లు తమ హక్కులు కాపాడుకోవడానికి తప్పనిసరి పరి స్థితుల్లో కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు ద్వారా వా రు తమ పెన్షన్ చెల్లింపులు, ఇతర పెన్షనరీ బెనిఫి ట్స్ పొందాలని కోరుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 28మంది కోర్టు మెట్లు ఎక్కారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ న్యాయపరంగా పొందేందుకు పోరాడుతున్నారు. మిగతా వారంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. న్యూస్రీల్ అందని ‘విరమణ’ ప్రయోజనాలు 284 మందికి తప్పని ఎదురుచూపు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ కోర్టును ఆశ్రయించిన 28 మంది రిటైర్మెంట్ రోజే ఇవ్వాలి ఉద్యోగి పనిచేసిన కాలంలో మూలవేతనం నుంచి కటింగ్ చేయించుకుని దాచుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బె నిఫిట్స్ను రిటైర్మెంట్ అయిన రోజే ఇవ్వాలి. జాప్యం చేస్తే డబ్బుల కోసం వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంచనాలు తారుమారై.. రాష్ట్రంలో మూడు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. జాప్యం చేయకుండా ప్రభుత్వం సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. – ఎంసీ లింగన్న, పెన్షనర్ల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి(25ఎన్ఆర్ఎల్277) ======= జిల్లాలోని పెన్షనర్ల వివరాలు జిల్లాలోని పెన్షనర్లు : 5,584 మంది బెనిఫిట్స్ రానివారు : 284 మంది కోర్టును ఆశ్రయించింది : 28 మంది -
పేదలకూ కార్పొరేట్ విద్య
● టెన్త్ మెరిట్ ఆధారంగా ఇంటర్లో సీట్లు ● ఈ నెల 31వరకు దరఖాస్తు గడువు నిర్మల్చైన్గేట్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చా లా కీలకమైంది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదవాలనే కోరిక ఉంటుంది. కానీ.. కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షే. కాగా, ప్ర తిభ గల పేద విద్యార్థుల కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకువచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వ ల భవిష్యత్కు బాటలు వేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 400పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఎయిడెడ్, కేజేబీవీ, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివినవారే అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు. ఇదీ.. ఎంపిక విధానం ఉచిత కార్పొరేట్ విద్య కోసం అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులతో పాటు ఆయా వర్గాలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో సీటు కేటాయించారో తెలుపుతూ దరఖాస్తులో పొందుపరిచిన సెల్ నంబర్కు సంక్షిప్త సమాచారం పంపిస్తారు. అందులో సూచించిన గడువులోపు వారికి కేటాయించిన కళాశాలకు వెళ్లి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేసి జాయిన్ కావాలి. నిర్ణీత గడువులోపు చేరకుంటే సీటు రద్దు చేసి ఆ తరువాత మెరిట్లో ఉన్న వారికి కేటాయిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేట్ విద్యాపథకం ప్రతిభ గల పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. – రాజేశ్వర్గౌడ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దరఖాస్తు విధానం ఇలా.. మీసేవా కేంద్రాల ద్వారా telangan aepass. cgg. gov. in లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయం, కుల ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించకూడదు. ఒక్కో విద్యార్థి పేరిట ప్రభుత్వం రూ.36 వేల చొప్పున సదరు కళాశాలకు ప్రోత్సాహకం అందించనుంది. -
ఫస్ట్రోజే పాఠ్యపుస్తకాలు
లక్ష్మణచాంద: పాఠశాలల పునఃప్రారంభం రోజే వి ద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాకు 90 శాతం పుస్తకాలను అన్ని మండలాల ఎమ్మార్సీలకు సరఫరా చేసింది. జిల్లాకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 3,40,220 అవసరముండగా ఇప్పటికే 3,06,740 వచ్చాయి. ఇంకా 33,480 పుస్తకాలు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వస్తాయని అధికారులు చె బుతున్నారు. పార్ట్–2 పుస్తకాలు సెప్టెంబర్లో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 6–10 విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలతోపాటు నోట్బుక్స్ అందజేయనున్నారు. 1–5 తరగతుల విద్యార్థులకు ఇంకా నోట్బుక్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వస్తే వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బడిబాట షెడ్యూల్ ఇలా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏటా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి. 7న ఉపాధ్యాయులు ప్రతీ ఇంటికి వెళ్లి బడీడు పిల్ల లను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. డ్రాపౌట్స్ను గుర్తించి పాఠశాలల్లో, ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి సమీప భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీన 6నుంచి 10వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాంలు అందించాలి. 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి. 16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) దినోత్సవాలను జరపాలి. అన్ని తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్ ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో తరగతి గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17న సమీకృత విద్య, బాలిక విద్యాదినో త్సవం నిర్వహించి బాల్య వివాహా లు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18న త ల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇత ర ఆధునిక సౌకర్యాలు చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వి ద్యార్థులకు వివరించాలి. 19న బడిబా ట ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించాలి. ఈ నెల 23 వరకు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 కేజీబీవీలు 18 మొత్తం పాఠశాలలు 848 మొత్తం విద్యార్థులు 71,390 అవసరమైన పార్ట్–1 పుస్తకాలు 3,40,220 ఇప్పటివరకు వచ్చినవి 3,06,740 ఇంకా రావాల్సినవి 33,480 -
ఘనంగా పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
నిర్మల్చైన్గేట్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మ హేశ్కుమార్ గౌడ్ జన్మదినాన్ని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఎంబడి రాజేశ్వర్ ఆ ధ్వర్యంలో పట్టణంలోని నగరేశ్వరవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంత రం డవ్ వృద్ధాశ్రమంలో అనాథలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మహాలక్ష్మివాడలో నిరుపేదల కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కా ర్యక్రమాల్లో కాంగ్రెస్ సేవాదల్ జిల్లా చైర్మన్ కందుల రాజేశ్వర్, కాంగ్రెస్ ఆదివాసీ జిల్లా చైర్మన్ బానావత్ గోవింద్నాయక్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రాకేశ్, నాయకుడు నాంపల్లి నర్సయ్య, ఎస్సీ సెల్ నాయకులు తలారి రాజేశ్వర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
సాహిత్యంలో ‘అరుణ’కిరణం ఇంద్రవెల్లి జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయురాలు బుట్టేవార్ అరుణ 1,937 కవితలు రాసి 10 సాహిత్య పుస్తకాలు ప్రచురించారు. బాలల్లో సాహిత్య ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 20258లోu ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కడెం: కడెం మండల సర్వేయర్ పవార్ ఉమాజీ ఏసీబీకి చిక్కాడు. మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గు గ్లవత్ ప్రభాకర్ తన తండ్రి మరణించగా అతని పేరిట ఉన్న ఐదెకరాల పట్టా మార్పిడికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సర్వేయర్ ఉమాజీ ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున రూ.25వేలు డిమాండ్ చేశాడు. ఒప్పందం మేరకు ప్రభాకర్ ఈనెల 20న రూ.12వేలు ముట్టజెప్పాడు. మిగతా డ బ్బులు ఇస్తేనే పని పూర్తవుతుందని సర్వేయర్ తెలుపగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆ శ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.7వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ సర్వేయ ర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, గతేడాది జనవరిలో లంచం తీసుకుంటూ తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య ఏసీబీకి పట్టుబడిన విషయం మరువక ముందే మరొక రెవె న్యూ అధికారి ఏసీబీకి చిక్కడం గమనార్హం. ● ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ● ఈనెల 17న ముగిసిన గడువు ● 26న ధ్రువపత్రాల పరిశీలన ● ఎంపికై నవారికి 50 రోజుల శిక్షణ ● త్వరలో అందుబాటులోకి సేవలునిర్మల్చైన్గేట్: భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, లా వాదేవీలు మరింత పారదర్శకంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయంలోనే భూమి కొలతలు, హద్దులు తదితర వివరాలతో కూడిన మ్యాప్ (స్కెచ్) కూ డా రైతులకు అందించాలని నిర్ణయించింది. అయి తే ఇందుకు అవసరమైన సర్వేయర్ల కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటోంది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పక్షం రోజుల క్రితమే దరఖా స్తుల స్వీకరణ ప్రారంభించి ప్రక్రియ పూర్తి చేసింది. సివిల్ సబ్జెక్ట్తో ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్హతలున్న వారు ఈనెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 26వ తేదీన అధికారులు వారి ధ్రువపత్రాలు పరిశీలించనున్నా రు. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయితే త్వరలోనే వారి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భూముల లావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాసీ్త్రయంగా జరిగేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తోంది. ఈ విధానాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురావడానికి కార్యాచరణ ప్రారంభించింది. ఎంపికై నవారికి 50 రోజుల శిక్షణ లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు నిరుద్యోగులు చేసిన దరఖాస్తులు పరిశీలించాక అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. ఈ నెలాఖరు నుంచే 50రోజుల పాటు వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవె న్యూ గ్రామాలవారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. అప్పటినుంచి రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన చేపట్టింది. భూమి హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే మ్యాప్లతో రిజిస్ట్రేషన్లులైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని అమలు చేయ డం ద్వారా భవిష్యత్లో భూములకు సంబంధించిన వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని సర్కారు భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆ భూమికి సంబంధించిన మ్యాప్ ఉండదు. కానీ.. లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్ కంటే ముందే భూమికి సంబంధించిన మ్యాప్ (స్కెచ్) తయారు చేస్తారు. దానిని సంబంధిత పోర్టల్ అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సర్వేయర్లు వాటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే ఆమోదిస్తారు. ఈ మ్యాప్లోనే అన్ని వివరాలుంటాయి. దీంతో ఇప్పుడున్న దానికంటే శాసీ్త్రయమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంటుంది. భూ భారతితో పాటు సర్వే మ్యాప్స్ రూపకల్పన కూడా ఒకే సమయంలో అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.న్యూస్రీల్శిక్షణ ఫీజుల వివరాలు రిజర్వేషన్ కేటగిరి ఫీజు ఓసీ అభ్యర్థులు రూ.10వేలు బీసీ అభ్యర్థులు రూ.5వేలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500జిల్లా వివరాలు జిల్లాలోని మండలాలు 19 రెగ్యులర్ సర్వేయర్లు 12 ఐకేపీ సర్వేయర్లు 5 భూముల సర్వే నంబర్లు 1,67,046 భూ విస్తీర్ణం 8,96,523.11 ఎకరాలు26న సర్టిఫికెట్ల పరిశీలన లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 212 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న ఉంటుంది. అనంతరం ఎంపికై న వారికి దాదాపు 50రోజులపాటు రెండు దశల్లో స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో ఉదయం థియరీ మధ్యాహ్నం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – రాథోడ్ సుదర్శన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, నిర్మల్ -
శాశ్వత భవనం నిర్మించాలి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీ ఎస్ మూడో సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్మల్లో శాశ్వత భవన నిర్మాణం చేపట్టా లని కళాశాల ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్రీనివాస్ డీఎంఈ నరేంద్రకుమార్ను కోరారు. ఈ మేరకు శనివా రం హైదరాబాద్లో రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎ డ్యుకేషన్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కోసం బస్సు వేయాలని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలని, కళాశాలలో మంటలు ఆర్పే పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రిన్సిపాల్ వెంట వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనోజ్కుమార్ ఉన్నారు. -
ఎక్స్రే సేవలు వినియోగించుకోవాలి
● బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ● డిజిటల్ ఎక్స్రే మిషన్ ప్రారంభం ● కొనుగోలు కేంద్రం పరిశీలన నర్సాపూర్ (జి): డిజిటల్ ఎక్స్రే సేవలు సద్విని యోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం డిజిటల్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వ సతులు లేక ప్రమాదాల్లో గాయపడ్డ వారిని నిర్మ ల్, భైంసా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తుండగా జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. త్వరలో దీనిని 50పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కొనుగోలు కేంద్రం పరిశీలన మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సందర్శించా రు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరి శీలించారు. సెంటర్ నిర్వాహకులు 3కిలోల చొ ప్పున అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. అధిక తూకం, రై స్ మిల్లుల్లో ధాన్యం కటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎ మ్మెల్యే ఫోన్లో ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. డీఎంహెచ్వో రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రమోద్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నా యకులు రావుల రాంనాథ్, దొడ్డికింది ముత్యంరెడ్డి, చంద్రకాంత్, నరేందర్, శ్రీకాంత్రెడ్డి, అర్జున్ ఠాకూర్, దత్తురాం, సుధాకర్, రాజేందర్, మహిపాల్, రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ సారంగపూర్: మండలంలోని సిర్పెల్లి నుంచి బండ్రేవుతండా వరకు రూ.75లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి భూమిపూజ చేశారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోగల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సారంగపూర్లో గన్నీ సంచుల కొరత ఉందని తెలుసుకుని సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడారు. ఆదివారం తప్పనిసరిగా సంచులు తెప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బీజేపీ మండలాధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు తిరుమలాచారి, నాయకులు సాహెబ్రావు, వీరయ్య, చంద్రప్రకాశ్గౌడ్, గంగారెడ్డి, విలాస్ తదితరులున్నారు. -
ముంగిటకే రైతు నేస్తాలు
నిర్మల్చైన్గేట్: జిల్లాలో 75శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీ విస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితోపాటు చీడపీడ ల బెడదతో ఎక్కువమంది రైతులు నష్టపోతున్నా రు. ఇలాంటి పరిస్థితి నుంచి అన్నదాతలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కా ర్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘మూస ప ద్ధతి మారాలి.. ఫలితం పెరగాలి’ అనే ఆలోచనతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వారి సమస్యలు తెలు సుకుంటున్నారు. సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను వానాకాలం సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 5నుంచి కార్యక్రమాలు షురూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధనాస్థానం, ఏరువాక కేంద్రం, ముధోల్, నిర్మల్ జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖలతో కలిసి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్లో కార్యక్రమం నిర్వహించారు. జూన్ 10వరకు జిల్లాలో లోకేశ్వరం మండలం రాజుర, కుంటా ల మండలం అంబకంటి, బాసర మండల మహిళా పూర్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందులో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులూ భాగస్వాములవుతున్నారు. ఈ అంశాలపైనే ప్రధాన ఫోకస్ దిగుబడి రాక నష్టపోయే రైతులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. వరిలో వెద, పత్తిలో అధిక సాంద్రత పద్ధతులు పాటించా లని చెబుతున్నారు. యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువు ల వాడకం పెంచాలని సూచిస్తున్నారు. ఇందుకో సం పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట, జీలుగు, పెసర వేసి కలియదున్నాలని చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకు తక్కువ కాలపరిమితి వంగడాలను సాగుచేయాలని సూచిస్తున్నారు. గట్లపై, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లు నాటాలని చెబుతున్నారు. దీని ద్వారా వాతా వరణంలోని సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని సూచిస్తున్నారు. అన్నిటికన్నా ప్రధానంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలని చెబుతున్నా రు. రెండు, మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పోషక విలువల ఆధారంగా ఇతర ఎరువులు వినియోగించాలని, ఎరువులు కొన్నప్పుడు రశీదు పొంది భద్రపర్చుకోవాలని చెబుతున్నారు. వీటితోపాటు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం అన్నదాతల చెంతకే శాస్త్రవేత్తలు కొనసాగుతున్న అవగాహన సదస్సులుసద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 5నుంచి జూన్10 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులు సద్వి నియోగం చేసుకోవాలి. అవగాహన కార్యక్రమాలతో రైతులకు మేలు జరుగుతుంది. – అంజిప్రసాద్, డీఏవో సూచనలు పాటించాలి వరిలో వెద, పత్తిలో అధికసాంద్రత పద్ధతి పాటించాలి. తక్కువ కాల పరిమితిలో దిగుబడి వచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి, మొక్కజొన్న సాగులో జంట సాళ్ల పద్ధతి అవలంబించాలి. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. – నర్సయ్య, ప్రధాన శాస్త్రవేత్త -
భూముల వ్యవహారం తేల్చాలి
నిర్మల్చైన్గేట్: గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామంలో రెవె న్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే ని ర్వహించి భూముల స్థితిగతులు తేల్చాలని ఆదివా సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో సాగు భూములపై అటవీశాఖ జోక్యం ఆపాలని శుక్రవారం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల బీసీ, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన వారు 50 ఏళ్లుగా రెవెన్యూ, ప్రభుత్వ, లావోణి పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల అ టవీ అధికారులు ఈ భూములు అటవీశాఖకు చెందినవని పేర్కొంటూ సాగు చేయొద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరి పి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పంద్రం ఆనంద్రావు, నాయకులు లింగన్న, బాబురావు ఎల్లయ్య, పోషన్న, పిట్ల ఎల్ల య్య, సాయిరెడ్డి, ఉప్పు రామవ్వ, మక్కల చిన్నక్క, ఇంకవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
ఖానాపూర్: కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాల కు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సుర్జాపూర్, బాదనకుర్తి తదితర గ్రామాల రైతులు డిమాండ్ చే శారు. శుక్రవారం మండలంలోని సుర్జాపూర్లో ఖా నాపూర్–మెట్పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తహసీల్దార్ సుజాత, ఐకేపీ ఏపీఎం భోజ న్న అక్కడికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. నాయకులు, రైతులు బూసి నరేందర్, బక్కశెట్టి అశోక్, శని గారపు శ్రావణ్, అన్ప హరీశ్, సుద్దాల మహిపాల్, బొమ్మెన రాకేశ్, బర్లపాటి రాజేందర్, పుప్పాల ఉపేందర్, తుప్ప నరేందర్ తదితరులున్నారు. -
భూ వివాదంపై విచారణ
ముధోల్: మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం భూవివాదంపై ఆర్డీవో కోమల్రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్కుమార్ విచారణ చే పట్టారు. కొంతమంది తన భూమి ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయన్న ఏప్రిల్ 27న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో భూవివా దంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల ని ఆర్డీవో, ఏఎస్పీని కమిషన్ ఆదేశించగా విచా రణ చేపట్టారు. వివాదంలో ఉన్న భూమికి కొ లతలు, హద్దులు నిర్వహించాలని సర్వేయర్ ప్రవీణ్ను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ శ్రీ లత ఆధ్వర్యంలో సర్వేయర్, ఆర్ఐలు నారా యణరావుపటేల్, సరస్వతి, రెవెన్యూ సిబ్బంది భూమికి కొలతలు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్, పంచా యతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులున్నారు. -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
● ఉద్యమంలో ఉమ్మడి జిల్లా వాసులు ● దశాబ్దాలుగా అడవుల కే పరిమితం ● వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు చేరిన పార్టీ ● ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చ ● నేతల కుటుంబాల్లో ఆందోళనసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ జిల్లా మావోయి స్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టు పా ర్టీని అంతం చేసేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతానికి కట్టుబడి పోరు బాట లోనే కొనసాగుతున్నారు. వారి ఆచూకీపై కు టుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉనికి కోల్పోతున్న ఉద్యమం! ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉనికి దాదాపు క్షీణించింది. వందలాదిమంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించారు. కొందరు లొంగిపోయారు. పార్టీ కేంద్ర కమిటీ స భ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్, 69) 2024 జూన్లో మరణించారు. సీనియర్ నాయకులు ఒగ్గు సత్వాజీ, కాసర్ల రవి (అశోక్), కంతి లింగ వ్వ, గడ్డం మధూకర్, సుమన్, రవిబాబు లాంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు. మావోయిస్టు రహిత జిల్లాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జా బితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగా ణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలా పాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బ లంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాల్లో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ఇప్పుడు అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు. కుటుంబాల్లో ఆందోళన దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇప్పటికీ కీలక స్థానాల్లో కొందరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ ఉద్యమ బాట వీడలేదు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇర్రి మోహన్ రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు. బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు. మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి. సలాకుల సరోజ: సీనియర్ నాయకురా లు, పార్టీ ప్రింటింగ్ప్రెస్ బాధ్యురాలు. జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో ఉన్నారు. చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్ష నిర్మల్చైన్గేట్: బాల్యవివాహాలను నియంత్రించాల ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్యవివా హాల నిర్మూలన, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, ఇసుక అక్రమ రవాణా, మున్సి పల్ అంశాలు, రహదారి భద్రత, ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధి కారులతో సమావేశమై మాట్లాడారు. గత రెండేళ్లలో జిల్లాలో 29 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చె ప్పారు. స్కానింగ్, రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాల ను తనిఖీ చేసి అర్హతపత్రాలు పరిశీలించాలని సూ చించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన క ల్పించాలన్నారు. డ్రంకెన్డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించిన దుకాణాదారులు, డీలర్లపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నిరోధించడానికి సంక్షేమ, పో లీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపా రు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే ట్రాఫిక్, మ హిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని చెప్పారు. గంజాయి, నిషే ధిత మత్తుపదార్థాలు వినియోగించినా.. రవాణా చేసినా టోల్ఫ్రీ నంబర్ 100 లేదా 8712659599కు సమాచారం అందించాలని సూచించారు. అనంత రం మత్తుపదార్థాల నిషేధంపై ముద్రించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఏఎస్పీలు అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, సంక్షేమ, వైద్యారోగ్య, పోలీస్, అబ్కారీ, ఆర్అండ్బీ, మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో పట్టాల పంపిణీ
కడెం: పునరావాస ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు పంపిణీ చేసిన భూములకు రెవెన్యూ పట్టాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల్లో శుక్రవా రం అధికారులు సమావేశాలు నిర్వహించారు. మరణించిన ఒకరిద్దరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఎంపిక చేసి మొత్తం 94మందితో తుది జాబితా ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో వీరందరికీ పట్టాలు అందుతాయని తహసీల్దార్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎఫ్ఆర్వో అనిత, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, ఆర్ఐ లక్ష్మణ్, సర్వేయర్ ఉమాజీ, హైటికాస్ ప్రతినిధి వెంకట్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
దస్తురాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకో వాలని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని మున్యాల జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణను గురువారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న డిజిటల్ కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్, ప్రధానోపాధ్యాయుడు వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలు ● డీఈవో పి.రామారావు లక్ష్మణచాంద/ఖానాపూర్: ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని డీఈవో రామారావు అన్నారు. మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాలలో, ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను గురువారం పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలని సూచించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంఈవోలు ఆర్.అశోక్వర్మ, ప్రేమ్సాగర్, మండల రిసోర్స్ పర్సన్లు అర్చన, శివరాణి, మోహన్, చంద్రమోహన్, తేజ, సాయన్న, గంగాధర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మహేందర్, సుధాకర్, డీఆర్పీలు తిరుమలేశ్, సుజాత, సీఆర్పీలు కవిత, వనిత, పాల్గొన్నారు. -
దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ
నిర్మల్చైన్గేట్: దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ అని అదనపు కలెక్టర్ ఫైజా న్అహ్మద్ అన్నారు. భాగ్యరెడ్డివర్మ 137వ జ యంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మంది రంలో గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ జ్యోతిప్రజ్వలన, చిత్రపటానికి పూలమాల చేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కి, ముఖ్యంగా దళిత మహిళల విద్యాభివద్ధికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషి అపూర్వమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు రాజేశ్వర్గౌడ్, శ్రీనివాస్, శంకర్, మోహన్సింగ్, నరసింహారెడ్డి, దళిత సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో..నిర్మల్టౌన్: భాగ్యరెడ్డివర్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భాగ్యరెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, సమ్మయ్య, ఆర్ఐలు రామ్నిరంజన్, రమేశ్, ఆర్ఎస్ఐలు రవికుమార్, రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కలు సిద్ధం చేయాలి
● బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వాణన్ నర్సాపూర్(జి): వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వాణన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని కేంద్రీయ హరిత నిధి వన నర్సరీ, ఈజీఎస్ నర్సరీలను గురువారం పరిశీలించారు. మొక్కలను బాధ్యతాయుతంగా సంరక్షించాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలో గతంలో నాటి ఏపుగా పెరిగిన వివిధ రకాల పండ్ల, ఇతర మొక్కలను పరిశీలించారు. అటవీ జంతువులకు, పక్షులకు ఆహారంగా అవి ఉపయోగపడతాయన్నారు. సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట డీఎఫ్వో నాగిని భాను, సారంగాపూర్ డీఆర్వో నజీర్ ఖాన్, ఎఫ్ఎస్వో అలేఖ్య, ఎఫ్బీవోలు సాయరెడ్డి, ఫాజిల్ హుస్సేన్ ఉన్నారు. -
పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: నిర్మల్ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్ట ర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. క లెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ పరిధిలో చే పట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్, రె వెన్యూ శాఖల అధికారులతో గురువారం సమీక్ష ని ర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. చెరువుల అభివృద్ధి, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల ని ఆదేశించారు. జూన్ 30లోపు గృహ, వాణిజ్య ప న్నుల వసూలు వంద శాతం వసూలు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యా ర్డుకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వార్డులో పారిశుద్ధ్య, డ్రై డే నిరంతరం కొనసాగించాలన్నారు. దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచాలని వీధి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ ప్రాంతా ల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కూడళ్ల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అ హ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
● అన్నదాతల ఆశలపై వాననీళ్లు ● కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం ● కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ● పలు మండలాల్లో ఆందోళనలు
తడిసిన వడ్లు కొనాలి..అకాలవర్షంతో కష్టప డి పండించిన ధా న్యం తడిసిపోయింది. నాతోపాటు చాలా మంది రైతుల పరిస్థి తి ఇలాగే ఉంది. తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చే సి, మద్దతు ధర ఇప్పించాలని కోరుతున్నాం. – జోగు రాజేశ్వర్, ఖానాపూర్వేగవంతం చేయాలి..పదిరోజుల నుంచి సెంటర్లోనే ధాన్యం పెట్టుకుని ఉన్నాం. ఈసారి వర్షాలు ముందుగానే వస్తున్నాయి. ఇంకా వానాలు పడుతాయన్న వాతావరణ సూచనలు ఉన్నాయి. ఇప్పటికై నా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. – కోడె సుధాకర్, నర్సాపూర్(జి)ఖానాపూర్ మండలంలోని రాంరెడ్డిపల్లెలో రాస్తారోకో చేస్తున్న రైతులునిర్మల్: కాలం ఎలా ఉన్నా.. రైతన్నకు కష్టం మా త్రం వెంటే ఉంటోంది. తన సమయం కాకున్నా.. అకాలంలో వచ్చిన వానలు పంట చేతికొచ్చిన రైతులను పరేషాన్ చేస్తున్నాయి. జిల్లాలో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన, సంచుల్లో నింపిన ధాన్యాన్ని తడిపేశాయి. ఇలా తడిసిన ధాన్యాన్ని చేతుల్లో పట్టుకుంటూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈమేరకు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలూ చేపడుతున్నారు. అకాల వర్షం.. జిల్లాలో యాసంగిలో 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఈ సీజన్లో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈమేరకు జిల్లాలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 1.07 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 30 వేల నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కొన్ని మండలాల్లో ఇంకా వరికోతలు, కల్లాలు, ధాన్యం ఆరబెట్టడం చేస్తున్నారు. మరోవైపు కొన్ని కేంద్రాల్లోనూ కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఇంతలోనే నైరుతీ రుతుపవనాలు, వాతావరణ మార్పులతో అకాలవర్షాలు దూసుకువచ్చాయి. రైతన్నకు సమయం ఇవ్వకుండా చేతిలో ఉన్న పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. సాగు ఆలస్యం.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో వరిసాగు కాస్త ఆలస్యంగానే ఉంటోంది. దాదాపు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాగా, మిగతా జిల్లాల్లో పూర్తయ్యే దశకు చేరాయి. జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఇంకా కొంతమంది రైతుల పంట కోత కూడా కాకపోవడం గమనార్హం. ప్రతీ సీజన్లోనూ ఇలాగే ఉంటుంది. కానీ.. ఈసారి వర్షాలు ముందుగా రావడం ఇక్కడ రైతులకు ఇబ్బందికరంగా మారింది. మరో రెండురోజులపాటు ఇలాగే వర్షాలు ఉంటాయన్న వాతావరణ సూచనల నేపథ్యంలో రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది టార్పాలిన్లను కప్పి, నీళ్లు రాకుండా కాలువలు తీసి, కట్టలు కట్టి పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారీగా వర్షాలు కురిస్తే మాత్రం వడ్లు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఆందోళన.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అన్నదాతలు అమ్ముకునే వేళకు అకాలవర్షం వచ్చిపడింది. చాలామంది ముందస్తుగా టార్పాలిన్లను కప్పి పెట్టుకున్నా.. ఆరబెట్టుకున్న ధాన్యంలోకి వర్షపునీ రు చేరింది. కాస్త ఏమరుపాటుగా ఉన్న రైతుల వడ్ల సంచులూ తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతన్నలను తిప్పలు పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో తేమశా తం వచ్చినా.. సీరియల్ నంబర్ వచ్చేదాకా వేచిచూడాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు రైస్మిల్లర్లు కూడా క్వింటాలుకు ఇంత అంటూ కోతలు పెడుతున్నారు. ఇవన్నీ ఎదుర్కొంటున్నా.. ఎంతోకొంత మిగులుబాటు అవుతుందనుకుంటున్న రైతన్న ఆశలపై ఇప్పుడు వాననీళ్లు వచ్చిపడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కింద అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని సదరు రైతులు కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే పలు మండలాల్లో ఆందోళనలను చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ కొనుగోలుకు భరోసా ఇస్తున్నారు. రోడ్డెక్కిన రైతులు తడిసిన ధాన్యం కోనుగోలు చేయాలని డిమాండ్ ఖానాపూర్/కడెం/మామడ/నర్సాపూర్(జి)/దస్తురాబాద్: : ఖానాపూర్, కడెం, నర్సాపూర్ (జి), మామడ మండలాల్లో రైతులు గు రువారం రోడ్డెక్కారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశా రు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఖానాపూర్ రైతులు ఎన్టీఆర్ చౌరస్తా, మండలంలోని రాంరెడ్డిపల్లె శివారులోని బాసర–మంచిర్యాల ప్రధాన రహదారిపై వేర్వేరుగా రాస్తారోకోలు చేశారు. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. మండలంలోని అంబారిపేట్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పరిశీలించారు. మామడ మండలంల పొన్కల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. నర్సాపూర్(జి) మండ ల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తరుగు పేరుతో కోతలు, హమాలీ, లారీల కొరతల కారణంగా రోజుల తరబడి ధాన్యం కుప్పలు అలాగే ఉంటున్నాయ ని రైతులు మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని షరతులు, కోతలు లేకుండా కొనుగోలు చేయాలని, జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్లో రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐఎంఎల్ నాయకులు మద్దతు తెలిపారు. కడెంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రైతులతో మా ట్లాడి, కొనుగోలకు హామీ ఇచ్చారు. నర్సాపూర్లో ధాన్యం తరలింపు జాప్యం, టార్పాలిన్ల కొరతతో రైతులు రాస్తారోకో చేపట్టగా, తహసీల్దార్ శ్రీకాంత్ సమస్య పరిష్కార హామీతో విరమించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కుప్పలు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల అదనపు తూకం, తరుగు కోతలతో కూడా నష్టపోతున్నామని పేర్కొన్నారు. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట, దస్తురాబాద్, బుట్టాపూర్ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 80 శాతానికిపైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఖానాపూర్ ప్రాంతంలో ఆలస్యంగా నాట్లు వేయడంతో ధాన్యం ఆలస్యంగా వచ్చిందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు దిగాలు చెందొద్దన్నారు. జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులను ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో ధాన్యం తూకం వేయిస్తామన్నారు. అధికారులు గంటగంటకు అప్డేట్లు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యంలో ఇష్టారాజ్యంగా కోతలు విధించిన 22 రైస్ మిల్లులపై ఇప్పటికే కేసులు నమోదు చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సహకార సంఘం అధికారులు, సిబ్బంది తీరుపై కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ధాన్యం తూకం వేసేందుకు నిర్వాహకులు కమీషన్లు ఆశిస్తున్నారని దీంతో తూకంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. గన్నీ సంచులు, హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు
● ఎస్పీ జానకీషర్మిలనిర్మల్టౌన్: రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. వర్షాలతో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో గురువారం ఫ్లడ్ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రిని పరిశీలించారు. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండనున్న దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతామన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్, రోప్ వస్తువులు వాడకంపై పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాంనిరంజన్, రమేశ్, ఆర్ఎస్సైలు రవికుమార్, రాజశేఖర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.