Nirmal
-
బాసరలో కలెక్టర్ దంపతుల పూజలు
బాసర: నిర్మల్ కలెక్టర్ భవేశ్మిశ్రా, తన సతీమణి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆదివారం బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా అతిథి గృహానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు బాసర ఎంపీడీవో దేవేందర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాశ్జాదవ్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆర్ఐ అభిమన్యు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి మొ క్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాతోపాటు నిజమాబాద్, హైదరా బాద్, కరీంనగర్, వరంగల్తోపాటు మహా రాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
నామినేటెడ్కు సహకారం
నిర్మల్కలెక్టరేట్లో వాసవీమాత జయంతి వేడుకలు నిర్మల్చైన్గేట్: వాసవీమాత జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా ఆయన పలువురు అధికారులు, సంఘాల నాయకులతో కలిసి వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలనలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఎన్నికల ద్వారా నియమితులయ్యే పాలకవర్గాల స్థానంలో, ఇకపై నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. నామినేటెడ్ వెనుక వ్యూహం.. గతంలో జరిగిన ఎన్నికల విధానం స్థానంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిని అమలు చేయడం ద్వారా అధికార పార్టీ తన క్షేత్రస్థాయి శ్రేణులను సంతృప్తి పరచాలని యోచిస్తోంది. సహకార చట్టం ప్రకారం, ప్రతీ పీఏసీఎస్ పాలకవర్గంలో చైర్మన్, వైస్చైర్మన్తో పాటు మొత్తం 13 మంది సభ్యులు ఉండాలి. అయితే, ప్రస్తుత నియామకాల్లో ఒక్కో సంఘానికి ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూనే, పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ఈ పదవులను కేటాయించేందుకు ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కసరత్తు ప్రారంభించారు. సహకార వ్యవస్థలో మార్పులు గతంలో రైతు ఓటు ద్వారా ఎన్నికై న డైరెక్టర్లు తమ చైర్మన్ను ఎన్నుకునే విధానం ఉండేది. ఇది గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరిచేది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈ ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలికి నేరుగా పదవులను భర్తీ చేయడం వల్ల పాలనాపరంగా ఎలాంటి మార్పులు వస్తాయనేది వేచి చూడాలి. ఏదేమైనా, ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో నెలకొన్న నిరాశను తొలగించి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందు కు ప్రభుత్వం వేస్తున్న ముందడుగుగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర పోటీ పడుతున్నారు. మే నెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో, పదవుల కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ నియామకాలు కేవలం పీఏసీఎస్లకే పరిమితం కాకుండా, డీసీసీబీ, డీసీఎంఎస్ స్థాయిల్లో కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్ల రూపంలోనే 17 మందికి అవకాశం దక్కనుంది. -
సమ్మర్ క్యాంపు ప్రారంభం
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని వాణి పబ్లిక్ స్కూల్లో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఆదివారం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి ప్రారంభించారు. పిల్ల లకు చదువుతోపాటు డ్యాన్స్ ఆటలు, పాటల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొంది చురుకుగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్ర రాంరెడ్డి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు డాన్స్ మాస్టర్ ధనరాజ్, జానపద కళాకారుల బృంద సభ్యులు బిరుకుల సురేశ్, సాయి కృప, కావ్య, స్వామి వాణి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్ పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన మున్సిపల్ చైర్పర్సన్
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక మహేందర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని హైదరాబాద్లో ఆదివారం కలిశారు. జిల్లా అధ్యక్షుడు రితేష్రాథోడ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఖానాపూర్ మున్సిపల్ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నూతన పురపాలక సంఘ భవన నిర్మాణం, ఆధునిక గ్రంథాలయ భవనం ఏర్పాటు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల స్థాపన, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు. అనంతరం సోమాజీగూడలో ఆదివారం పీఎం నరేంద్రమోదీ 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రితేష్ రాథోడ్ రాష్ట్ర నాయకులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు. -
ఆగ్రో డీలర్ల సమ్మెబాట..!
భైంసాటౌన్: జిల్లాలో ఆగ్రో డీలర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధనకు ఈనెల 27న(సోమవారం) ఒకరోజు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా డీలర్ల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులకు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. విత్తన, ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈబంద్ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్లు.. సమ్మె జయప్రదం చేయాలి.. తెలంగాణ రాష్ట్ర ఎరువులు, పురుగుమందులు – విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు ఈనెల 27న ఒకరోజు సమ్మె పాటిస్తున్నాం. ఈ మేరకు వ్యవసాయాధికారులకు నోటీసు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాం. డీలర్లు బంద్కు సహకరించాలి. – సంజీవ్రెడ్డి, డీలర్ల సంఘం అధ్యక్షుడు, భైంసా -
బాధ్యతలు స్వీకరించిన భవేశ్మిశ్రా
నిర్మల్చైన్గేట్: నిర్మల్ నూతన కలెక్టర్గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న భవేశ్మిశ్రాకు అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దయానంద్, డీఈవో భోజన్న, సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, రమణ, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
కులగణనలో గంగపుత్రులకు అన్యాయం
కడెం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో గుండ్ల, బెస్త, గంగపుత్రుల పేర్లను ప్రస్తవించలేదని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోకల శంకర్ అన్నారు. దుబాయ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కుల సంఘ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షల జనాభా ఉన్న గంగపుత్రుల కులం పేరును కాదని, అగ్నికులచేతియులని ప్రస్తావించారని పేర్కొన్నారు. దీంతో గంగపుత్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు. ప్రభుత్వం గుండ్ల, బెస్త, గంగపుత్ర పేర్లను కులగణన జాబితాలో చేర్చాలని కోరారు. గంగపుత్ర సంఘ నాయకులు బింగిరాజు, ప్రధాన కార్యదర్శి గంగనర్సయ్య, మేడి రమేశ్, నర్సయ్య, బోరే హిందయ్య, కిసాన్, రాజేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మండుటెండ.. నిండుకుండ
మండు వేసవిలో నిండుకుండ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. వేడికి చెరువులు, కుంటల్లో నీరు అడుగంటుతోంది. బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా లక్ష్మణ చాంద మండలంలోని కనకాపూర్ వాగు నిండుకుండను తలపిస్తోంది. సరస్వతీ కాలువ ప్రవహిస్తుండడంతో ఆ నీళ్లు వాగులో చేరి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచింది. దీంతో పశుపక్ష్యాదులకు తాగునీటి కష్టాలు తప్పాయి. – లక్ష్మణచాంద -
అద్దె బస్సులు.. ఆగమాగం
అన్నా ఆపే.. బస్సు కోసం పరిగెత్తుతున్న ప్రయాణికులు అంతా మా ఇష్టం.. నిర్మల్ బస్టాండ్ ఆవరణలో ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సులు అదుపు తప్పితే.. ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణంసమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్లు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో సంస్థ అద్దె డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులు నడుపుతోంది. అయితే తాత్కాలిక డ్రైవర్లు ఇష్టారీతిన బస్సులు నడుపుతూ ప్రయాణికులను ఆగం చేస్తున్నారు. బస్ స్టాపుల వద్ద ఆపకుండా వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులు పరిగెత్తి బస్సు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పడిపోతున్నారు. కొందరు ఫుట్బోర్డ్పై ఉండగానే ’రైట్’ అని డ్రైవర్లు బస్సు స్పీడ్గా నడుపుతున్నారు. ఇక అద్దె కండక్టర్లు మిషన్ ఆపరేటింగ్ రేట్ ప్రకారం టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో తాత్కాలిక డ్రైవర్లు బస్సులు ఇష్టానుసారం పార్క్ చేస్తున్నారు. ప్రయాణికులు నడవడానికి కూడా స్థలం లేకుండా నిలుపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు
నిర్మల్చైన్గేట్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కాం) ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం అర్హులను ఎంపిక చేస్తున్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాల శాఖ అధికారులు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఆసక్తి ఉన్నవారు germanytriplewin2025 @gmail. comకు దరఖాస్తులు పంపించాలి. ఎంపిక ప్రక్రియ ప్రాథమిక ఇంటర్వ్యూలో జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. ఎంపికైనవారికి ఉచిత శిక్షణ ఇస్తారు. ● ఆరు నెలల్లో ఏ2 స్థాయి 70 మార్కులతో పాసైతే కొనసాగుతారు. ● తర్వాత ముఖాముఖి టెస్ట్, బీ1/బీ2 సర్టిఫికెట్ ఉన్నవారికి ఫాస్ట్ట్రాక్. ● విమాన టికెట్ సహా అన్ని ఖర్చులు టామ్కాం భరిస్తుంది. వేతనం ఇలా.. ● శిక్షణ కాలంలో నెలకు 2,300 యూరోలు(సుమారు రూ.2.20 లక్షలు). ● పూర్తి గుర్తింపు తర్వాత 2,800 యూరోలు(సుమారు రూ.3 లక్షలు) ● ఓవర్టైమ్ అలవెన్స్తో అదనపు ఆదాయం వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయినవారు జర్మనీలో ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికై న వారికి జర్మన్ భాషపై శిక్షణ ఇస్తారు. ప్రత్యేక వసతులు, మంచి జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు 94400 51581, 94400 52081, 9440049645 నంబర్లలో సంప్రదించాలి. – జి.విజయలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారిఅర్హతలు.. తెలంగాణలో గుర్తింపు పొందిన కళాశాలల నుంచి జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేయాలి. వయసు 22 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. జీఎన్ఎం అభ్యర్థులకు కనీసం మూడేళ్ల అనుభవం, ఇండియన్ నర్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. పాలియేటివ్ కేర్, హోంకేర్, నర్సింగ్ హోమ్, ఇన్ పేషెంట్ లేదా ఆసుపత్రి అనుభవం ఉండాలి. -
మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం
భైంసాటౌన్: పట్టణంలోని మహాగాం మార్గంలో మినీ స్టేడియం ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇటీవల పలువురు రైతులు మినీ స్టేడియంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ మేరకు కొనుగోలు కేంద్రం సబ్ సెంటర్ ఏర్పాటు చేయించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి హాజరై కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, కిసాన్గల్లి సర్పంచ్ కుంట రాజలింగు, ఉప సర్పంచ్ సాయినాథ్, కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్, వడ్నప్ శ్రీనివాస్, సుభాష్, అమోల్, ఆత్మ డైరెక్టర్ మామిడి స్వామి, రైతులు పాల్గొన్నారు. -
తేలిన పరిషత్ ఓటర్ల లెక్క!
నిర్మల్కలెక్టర్ను కలిసిన ఖానాపూర్ పాలకవర్గం వేదం.. జీవన నాదం బాసరలోని శ్రీవేద భారతి పీఠం ఎంతోమందికి వేదవిద్యను అందిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేద జ్ఞానాన్ని అందించే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ నర్సాపూర్(జి): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. మండల కేంద్రానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు వేగవంతం చేయాలని, అర్హులకు ఇళ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్రెడ్డి, డీఈవో భోజన్న, ఎంపీవో తిరుపతిరెడ్డి, హౌసింగ్ ఏఈ మనీష, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ కై లాస్ పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిషత్ ఎన్నికల కోసం గతేడాది సెప్టెంబర్లోనే ఓటర్ల జాబితాలను ఖరారు చేసి, నోటిఫికేషన్ ఇచ్చినా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పుతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు మళ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతంలో ఉన్న ఓటర్లతోపాటు తాజాగా వచ్చిన ఓటర్లను కలుపుకుని ముసాయిదా జాబితాలను జిల్లాల యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి గురువారమే ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. శుక్రవారం ఆ జాబితాను అధికారులు ప్రకటించారు. పెరిగిన ఓట్లు 2,293.. 2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్లు జాబితాను శుక్రవారం అధికారులు ప్రకటించగా గతంతో పోలిస్తే 2,293 ఓట్లు పెరిగినట్లు తెలుస్తుంది. మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రియ? అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గడువు ముగిసి 22 నెలలు.. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పదవీకాలం ముగిసి 22 నెలలు అయింది. జిల్లాలో 2019, మే నెలలో 18 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం కొలువుదీరిన పాలకవర్గాల గడువు 2024 జూన్తో ముగిసింది. ఆతర్వాత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోగా.. అప్పుడప్పుడు చర్చ జరుగుతున్నా రిజర్వేషన్ల వ్యవహారంతో వాయిదా పడుతూ వస్తోంది. ఖానాపూర్: కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు శుక్రవారం కలిశారు. శాలువాతో సత్కరించి మొక్క అందించారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ను కలిసినవారిలో కౌన్సిలర్లు, నాయకులు బొప్పరపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, ప్రకాశ్గౌడ్, నల్ల రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. వివరాలు.. మండలం ఎంపీటీల మొత్తం పెరిగిన సంఖ్య ఓటర్లు ఓటర్లు దస్తురాబాద్ 5 12,894 22 కడెం 10 29,159 139 ఖానాపూర్ 8 23,657 117 పెంబి 5 10,886 13 మామడ 9 26,072 138 లక్ష్మణచాంద 9 24,577 126 నిర్మల్ రూరల్ 7 22,751 143 సారంగాపూర్ 14 39,516 189 సోన్ 8 21,801 105 దిలావర్పూ 6 18,744 87 నర్సాపూర్(జి) 7 20,238 111 లోకేశ్వరం 10 29,359 90 కుంటాల 7 19,055 87 భైంసా 11 33,970 278 ముధోల్ 10 28,754 159 తానూర్ 11 31,516 206 బాసర 6 15,728 83 కుభీర్ 14 40,625 200 జిల్లాలో పెరిగిన ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 23 వరకు తుది ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, అవసరమైతే.. మే నెలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలివ్వడంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆశావహులు సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా రాజకీయ పార్టీల్లోని ప్రధాన నాయకులతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అనుచరులను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తానూరు: దుకాణదారులు వ్యాపారాల్లో వినియోగదారులకు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్ఎంవో శంకర్ హె చ్చరించారు. తానూరులో దుకాణాలు, హో టళ్లు, స్వీట్హోంలను శుక్రవారం తనిఖీ చేశా రు. దుకాణాల్లో వినియోగించే త్రాసులు, తూ కం రాళ్లు, ఎలక్ట్రికల్ యంత్రాలు పరిశీలించా రు. సీల్ వేశారు. వస్తువులపై ఉన్న ధర కంటే ఎక్కువకు విక్రయించొద్దని సూచించారు. ని బంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో తనిఖీ అసిస్టెంట్ అధికారి రాజశేకర్రెడ్డి, సిబ్బంది రాజ్కుమార్, అయాజ్ఖాన్ తదితరులు ఉన్నారు. మొత్తం ఓటర్లు 4,51,595 పురుషులు 2,14,941 మహిళలు 2,36,642 ఇతరులు 12 -
బదిలీలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఈ బది లీల ప్రక్రియ కొనసాగనుంది. గతంలో ఉన్న బది లీల నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తూ, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా ఆన్లైన్ లేదా కౌన్సెలింగ్ పద్ధతిని అనుసరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే... మూడేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులను ఈదఫా బదిలీ చేయరాదని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఏఒక్క ఉద్యోగిని కూడా ఒకేచోట నాలుగేళ్లకు మించి కొనసాగించకూడదని కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. తద్వారా సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలగనుంది. వీరికి ఊరట.. ఏ క్యాడర్ లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట కల్పించారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ సమస్యలు ఉన్నా బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందుకు సంబంధించి మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. క్లిష్టమైన ప్రాంతాల్లో దీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు ఈసారి గుర్తింపు లభించనుంది. ప్రతీ శాఖ తమ పరిధిలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేసిన వారికి వారు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేలా వెయిటేజీ కల్పించనున్నారు. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు ఎవరూ స్వచ్ఛందంగా వెళ్లకపోతే, లాటరీ పద్ధతి ద్వారా పంపాలని నిర్ణయించారు. జిల్లాలోని మొత్తం ఉద్యోగులు 7,150 నిర్మల్ ట్రెజరీ పరిధిలో ఉద్యోగులు 4,079 భైంసా సబ్ డివిజన్ పరిధిలో 1,338 ఖానాపూర్ సబ్ ట్రెజరీ పరిధిలో 1,062 ముధోల్ సబ్ ట్రెజరీ పరిధిలో 671 -
జీజీహెచ్లో చలివేంద్రం
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకుల దాహార్తి తీర్చేందుకు నర్సింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. వేసవి తీవ్రత దష్ట్యా ఆస్పత్రికి వచ్చే వారందరూ ఈ ఉచిత తాగునీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్సింగ్, ఆర్ఎంవో డాక్టర్ రమేశ్, డాక్టర్ విశ్వనాథ్, నర్సింగ్ సూపరింటెండెంట్లు వనజ, విజయలక్ష్మి, ఆఫీస్ సూపరింటెండెంట్ నవీన్, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
శంకర్గౌడ్ ఆత్మాహుతికి ప్రభుత్వానిదే బాధ్యత
నిర్మల్టౌన్/భైంసాటౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు, పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిర్మల్, భైంసా పట్టణాల్లో ర్యాలీ తీశారు. నిర్మల్ డిపో నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. భైంసాలో డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. నాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని, ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. శంకర్గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, సీడీఎస్యూ జిల్లా కన్వీనర్ కిరణ్, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎన్.రెడ్డి, భైంసా డిపో జేఏసీ చైర్మన్ గంగయ్య, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
మొక్కుబడి వైద్యం
అరకొర వసతులు..నిర్మల్చైన్గేట్: పాలకులు పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని చెప్పినా, జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 1,000–1,200 మంది ఓపీ, అడ్మిషన్ కేసులు ఉన్నా సరైన సౌకర్యాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. హౌస్ సర్జన్లు, పీజీలు, ఎస్ఆర్లు మాత్రమే రోగులను పరీక్షిస్తున్నారు. తర్వాత వీరు సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. ఎమర్జెన్సీల్లో జూనియర్లు సరైన అనుభవం లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కీలక విభాగాల్లో సమస్యలు..గుండె, గ్యాస్ట్రో, న్యూరాలజీ, యూరాలజీ వంటి నిపుణులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మూడు గంటలు మాత్రమే ఓపీ సేవలు ఉండటంతో అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. పేదలు ప్రైవేట్ చికిత్సకు సాధ్యం కాక ఆసుపత్రిలోనే ఉండి బాధలు అనుభవిస్తున్నారు. పీహెచ్సీలలో వైద్యుల కొరతజిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముధోల్ సీహెచ్సీ ఉన్నాయి. పీహెచ్సీలో 40 పోస్టులకు 21 మంది పనిచేస్తున్నారు. పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు, దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక పోస్టుకు ఒక్కరు కూడా లేరు. నర్సాపూర్(జి)లో...మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిలో రోగులకు ఎక్స్రే సేవలు అందుతున్నప్పటికీ ఫిల్మ్ ప్రింట్ తీసే రిపోర్టు మిషన్ పని చేయడంలేదు. దీంతో రిపోర్టును రోగి ఫోన్కు పంపిస్తున్నారు. దగ్గు మందు మూడు నెలలుగా రావడంలేదు. లక్ష్మణచాందలో..వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ప్రతిరోజు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తున్నామన్నారు. వేసవిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల ఔషధాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి మారిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయని, నాణ్యమైన వైద్యం అందుతోందని పాలకులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందితో గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు. కానీ, సర్కారు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత మాటలకు.. అందే వైద్యానికి పొంతన ఉండడం లేదు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న మందులు, అందుతున్న వైద్య సేవలపై సాక్షి విజిట్ చేసింది. ఇందులో చాలా ఆస్పత్రుల్లో మొక్కుబడి వైద్యం.. అరకొర వసతులే కనిపించాయి. -
రెండో రోజు ఆర్టీసీ సమ్మె
నిర్మల్టౌన్: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. జిల్లా కేంద్రంలోని డిపో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయం నుంచి ప్ర యాణికులు బస్టాండ్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బ స్సులు నడిపారు. నిజమాబాద్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్ రూట్లలో ప్రైవేట్ బస్సులు నడిచాయి. కార్మికులు మాట్లాడుతూ.. త మ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వర కూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
వేసవి సెలవులు.. బస్సులు లేక తిప్పలు
బస్సు ఎప్పుడస్తదో.. నిర్మల్ బస్టాండ్లో బస్సుల కోసం నిరీక్షణ..2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 24(శుక్రవారం) నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం దీంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు గురువారం సాయంత్రమే ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నమే గురుకులాలకు చేరుకున్నారు. తర్వాత పిల్లలను తీసుకుని బస్టాండ్లకు చేరుకున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఊళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖానాపూర్, భైంసా వెళ్లే విద్యార్థులు నిర్మల్ బస్టాండ్లో గంటల తరబడి ఎదురుచూశారు. అడపాదడపా వచ్చిన బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు సొంత వాహనాలపై పాఠశాలలకు వచ్చారు. కొందరు ఆటోల్లో పిల్లలను తీసుకెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ హమ్మయ్య బండిమీద పోతున్నం.. ద్విచక్ర వాహనంపై ఇంటి బాట పడుతున్న విద్యార్థులు.. -
బడి ఆస్తులు భద్రం
లక్ష్మణచాంద: వేసవి సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. దాదాపు రెండు నెలలు పాఠశాలలు తెరుచుకోవు. ఈ నేపథ్యంలో గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆస్తులు చోరీ అయ్యాయి. ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో సెలవుల్లో పాఠశాలల ఆస్తుల సంరక్షణ ప్రధాన సమస్యగా మారింది. సెలవుల్లో గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి కిటికీలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేఉసిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి పాఠశాలల ఆస్తుల రక్షణకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు..జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడికి అనుసంధానం చేశారు. దీంతో నిరంతరం వాటిని చూస్తుడంటతో పాఠశాలలకు ఎవరు వస్తున్నారు అనేది ఇట్టే తెలిపోతుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. మార్గదర్శకాలు ఇవే...భధ్రపరచాల్సిన వస్తువులు ఇవే...లక్ష్మణచాంద పాఠశాలలో సీసీ కెమెరాజిల్లా సమాచారం.... ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 కేజీబీవీలు 18పోషకులు దృష్టి సారించాలి... ప్రభుత్వ పాఠశాలల ఆస్తుల రక్షణ కోసం ఆయా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పోషకులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తమ గ్రామాల్లోని పాఠశాలల ఆస్తుల రక్షణ గ్రామ యువత, పోషకులు తమ బాధ్యతగా భావిస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో తాత్కాలిక పద్ధతిన రాత్రి సమయంలో కాపాలదారులు నియమించాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తాత్కాలిక పద్దతిలో నియమించుకోవాలని ఎటువంటి ఆదేశాలు రాలేవని అధికారులు అంటున్నారు. -
పేరుకే వైద్యులు.. విధుల్లో కానరారు..!
భైంసాటౌన్: డివిజన్ కేంద్రమైన భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి భైంసా నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రా మాలు, మండలాల నుంచి సైతం రోగులు వస్తుంటారు. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 400 మంది పేషెంట్లు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో మొత్తం 28 మంది వైద్యులు ఉండగా 10 నుంచి 14 మంది మాత్రమే విధుల్లో కనిపిస్తున్నారు. వీరిలోనూ కొందరు మాత్రమే సకాలంలో విధులకు హాజరవుతున్నారు. మరికొందరైతే విధులకు వచ్చినా.. ఓపీ గదుల్లో మాత్రం కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. బుధవారం ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్ చేయగా 12:45 గంటలకే ఓపీ గదులకు తాళాలు కనిపించాయి. వైద్యులకు ముఖ గుర్తింపు హాజ రు ఇక్కడ అమలు కావడం లేదు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో వడదెబ్బ, నీరసం, డయేరియా వంటి వ్యాధులతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. అయితే, వార్డులో ఫ్యాన్లు ఉన్నా వేడిగాలితో ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి ఇబ్బంది లేదు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ మండలం డ్యాంగాపూర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, పోషకులతో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పోషకులు తల్లిదండ్రుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. విద్యార్థుల ప్రగతి వివరాలు తల్లిదండ్రులకు తెలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు సెలవులు ముగియగానే సమయానికి పాఠశాలకు రావాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నైపుణ్యాలు, అర్హతలు ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు వార్షిక ప్రగతి నివేదికలు అందించారు. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించి, బహుమతులు అందించారు. డీటీడీవో అంబాజీ, డీఈవో భోజన్న, సీపీవో జీవరత్నం, తహసీల్దార్ ప్రభాకర్, హెచ్ఎం శైలజ, సర్పంచ్ నవీన్యాదవ్ పాల్గొన్నారు. -
కుక్క కాటుకు మందు లేదు..
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రేబిస్ టీకాల కొరత తీవ్రంగా ఉంది. నె లకొంది. బుధవారం ఆసుపత్రిని సందర్శించగా ఈ విషయం స్పష్టమైంది. కుక్కలు, కోతుల కాట్లకు గురైన బాధితులకు పూర్తి డోసులు అందడంలేదు. వైద్యాధికారులు, సిబ్బంది మందుల కొరత కారణంగా పలువురు బాధితులకు మొదటి ఇంజక్షన్ మాత్రమే ఇచ్చి, రెండో, మూడో డోసులు వేయకుండా తిరిగి పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉన్నవారే ప్రాధాన్యత ఇస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. బుధవారం సుర్జాపూర్ గ్రామానికి చెందిన విజయ అనే మహిళ కాలును కుక్క కరవడంతో ఆస్పత్రికి చేరుకుని మొదటి ఇంజక్షన్ వేయించుకుంది. ఇక్బాల్పూర్ గ్రామానికి చెందిన భీమన్న కూడా కుక్క కాటుకు టీకా తీసుకున్నారు. అయితే శివాజీ నగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీనివాస్కు కోతి కరవడంతో మూడో డోస్ కోసం ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీకాలు లేకపోవడంతో తిరిగి పంపించారు. ‘‘మందుల కొరత ఉంది. ప్రస్తుతం మొదటి, రెండో డోసులు మాత్రమే వేస్తున్నాం. మూడో డోస్ కోసం మరోరోజు రావాలి’’ అని సిబ్బంది తెలిపారు. ఆస్పత్రిలో యాంటీ రేబిస్ వాక్సిన్ కొరత ఉందని సూపరింటెండెంట్ వంశీ మాధవ్ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. ఆస్పత్రిలో సమస్యలు..ఖానాపూర్ ఆస్పత్రిలో జనరల్ డ్యూటీ మెడికల్ అధికారి పోస్టుతోపాటు డెంటిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఎక్స్రే యంత్రం మదర్బోర్డ్ సమస్య కారణంగా పనిచేయకుండా నిలిచిపోయింది. దీంతో రోగులు ప్రైవేట్గా ఎక్స్రే తీసుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ కూడా పనిచేయకపోవడంతో సిబ్బంది, రోగులు ప్రైవేట్గా తాగునీటిని కొనుగోలు తెచ్చుకుంటున్నారు. వార్డుల్లో కూలర్ ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. కడెంలో వైద్యుల కొరత..కడెం: కడెం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం భవనం, రోగులకు సౌకర్యాలు ఉన్నా వైద్యుల కొరత ఏళ్లుగా తీరని సమస్యగా మారింది. ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం అన్ని రకాల మందులు, పరీక్షలు నిర్వహిస్తున్నా, ఫార్మసిస్ట్, ఏఏఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దస్తురాబాద్ ఆస్పత్రికి రాని డాక్టర్..దస్తురాబాద్: మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ రారు, అసలు ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ను కేటాయించడం లేదు. ఇన్చార్జి డాక్టర్తో నే నెట్టుకొస్తున్నారు. ఆ ఇన్చార్జి డాక్టర్ లోకేశ్వరం ఆరోగ్య కేంద్రంలో ఉంటున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో 5 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, హెచ్ఈవో, సీనియర్ ఆసిస్టెంట్, స్టాప్నర్సు, ఏఎన్ఎం సిబ్బంది కొరత ఉంది. రోగులకు వైద్యం అందిచే గదులలో ప్యాన్లు పనిచేయడం లేదు. ఆరోగ్య కేంద్రం ప్రహరీ రెండేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది. పెంబిలో వైద్యులు, సిబ్బంది కొరత..పెంబి: పెంబి ఆసుపత్రి వైద్యుడే స్థానికులతోపాటు ఖానాపూర్లోనూ వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. పెంబిలో రెగ్యూలర్ మెడికల్ అధికారి లేకపోవడంతో ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేస్తున్న రాజశేఖర్రెడ్డి మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు స్టాఫ్ నర్సులు, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
చీకట్లో ఇసుక దందా
తానూరు: జిల్లాలో చీకట్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ, అక్రమ దందా ఆగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లా బోధన్, మహారాష్ట్రలోని ధర్మాబాద్, కారేగాం, నాగని గ్రామాల నుంచి ఇసుక జిల్లాక అక్రమంగా చేరుతోంది. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారుల నిఘా రొనవడడంతో ఇసుక దందా జోరందుకుంటోంది. సరిహద్దు గ్రామాల్లో డంపులు.. మహారాష్ట్రలోని ధర్మాబాద్, కారేగాం, నాగని, నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతాల నుంచి అక్రమంగా రాత్రిపూత తెస్తున్న ఇసుకను తానూరు–ముధోల్ మండలాల సరిహద్దు గ్రామాలైన జౌలా(బి), ఎల్వత్, కోలూరు, వడ్గాం, వాడవన ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆర్డర్ల మేరకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఏజెంట్లు అధికారుల చేతులు కలిపి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తానూరు–ముధోల్ సరిహద్దులో ఇసుక మార్కెట్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తానూరు, ముధోల్ మండలాలు ఇసుక అక్రమ వాణిజ్యానికి హాట్స్పాట్గా మారాయి. జౌలా(బి), తానూరు శివారు ప్రాంతాల్లో భారీ ఇసుక కుప్పలు నిల్వ ఉన్నాయి. బడా వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కుమ్మకై తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేయించి, తెలంగాణ ప్రాంతాలకు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ తనిఖీలు.. అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు తానూరు ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. గత నెల మహారాష్ట్ర ధర్మాబాద్ నుంచి అక్రమంగా ఇసుక తెస్తున్న టిప్పర్ను పట్టుకుని జరిమానా విధించారు. తానూరు మండలం కోలూరులో ఇసుక టిప్పర్ను గుర్తించి జరిమానా విధించారు. పక్షం రోజుల క్రితం జౌలా(బి) గ్రామ సమీపంలో ఇసుక లారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రావాణా జరిగుతున్న విషయం తమ దృష్టికి రాలేదు. సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటాం. – హరిప్రసాద్, జిల్లా మైనింగ్ అధికారిఅనుమతి పత్రాలు లేకుండా.. అనుమతి పత్రాలు లేకుండా మహారాష్ట్ర నుంచి ఇసుకను తీసుకురావడం, పన్నులు చెల్లించకుండా అమ్మకం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇసుక వ్యాపారులు తక్కువ ధరకు పొరుగు ఇసుక కొని.. ఎక్కువ ధరకు స్థానికులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు రెవెన్యూ సిబ్బంది కొన్ని టిప్పర్లు లేదా ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తున్నప్పటికీ పోలీసులు ‘మామూలు’గా చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చోద్యం చూస్తున్న అధికారులు -
వన మహోత్సవం లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
నిర్మల్ఖిల్లా: వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే సంబంధిత శాఖల అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఎకై ్సజ్, మున్సిపల్, తదితర శాఖ ల ఆధ్వర్యంలో నాటే మొక్కలకు సంబంధించి ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీశాఖ ఆధ్వర్యంలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఎకై ్సజ్ అ ధికారి ఎంఏ రజాక్, డీఈవో భోజన్న, జెడ్పీసీఈవో భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె షురూ..
● అద్దెబస్సులు నడిపించిన యాజమాన్యం నిర్మల్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిపో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయం నుంచి ప్రయాణికులు బస్టాండ్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఆటోలు, వివిధ ప్రైవేటు వాహనాలపై ఆధారపడ్డారు. ఈ క్రమంలో అధికారులు అవసరమైన చోట తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం వంటి చర్యలు చేపట్టారు. భైంసా, నిజామాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్తో పాటు ప్రధాన రూట్లలో 70 బస్సులు రాకపోకలు సాగించాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కండక్టర్ లేకుండానే రైట్రైట్..! భైంసాటౌన్: ప్రభుత్వ తీరును నిరసిస్తూ భైంసా పట్టణంలోని డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. కాగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ హైర్ బస్సులు నడిపారు. అయితే కండక్టర్లు లేకుండానే బస్సులు నడపడంతో పురుషులు, మహిళలు ఉచితంగానే ప్రయాణించారు. భైంసా డిపోలో 47 హైర్ బస్సులు ఉండగా, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, తదితర రూట్లలో 31 సర్వీసులు నడిపినట్లు డీఎం హరిప్రసాద్ తెలిపారు. అన్ని రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
కేంద్రం నిధులతో గ్రామాల అభివృద్ధి
నర్సాపూర్(జి): కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ (జి), గొల్లమాడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తిమ్మాపూర్ (జి)లో రూ. 20 లక్షలతో జీపీ భవనం, రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణం, రూ.30 లక్షలతో సీసీరోడ్లు, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణం, గొల్లమాడలో రూ.24 లక్షలతో పెద్ద చెరువు అలుగు, చెరువు కట్ట మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ (జి) సర్పంచ్ ఆలూర్ రాజేందర్, గొల్లమాడ సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య , ఉప సర్పంచులు కొత్తపల్లి నరేష్, బట్టి భూమన్న, పీఆర్ డీఈ తుకారాం, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో జగన్నాథ్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి’
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని సౌన గ్రామస్తులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజు బుధవారం సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన సౌన గ్రామస్తులకు సర్వే నెం.10లో భూమిని కేటాయించి పట్టాలిచ్చారని, అయితే, ప్లాట్ల కేటాయింపు జరగలేదన్నారు. దీంతో ఏటా వరద నీటితో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో శేషరావు పటేల్, గణపతి, మారుతి పటేల్, చంద్రే భీంరావు, కే మారుతి, లక్ష్మణ్, భోజరాం, తదితరులు పాల్గొన్నారు. -
కో ఆప్షన్ ఎవరికో..?
నిర్మల్అగ్ని ప్రమాదాలపై చైతన్యం కల్పించాం నిర్మల్టౌన్: ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం కల్పించామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముందుగా అగ్నిమాపక శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై వారంరోజులు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమతంగా వ్యవహరిస్తే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో భారీ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. కా ర్యక్రమంలో సీపీవో జీవరత్నం, జిల్లా ఇండస్ట్రీయల్ అధికారి నరసింహారెడ్డి, డీఈవో భోజ న్న, ఫైర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భైంసాటౌన్: జిల్లాలోని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందడి మొదలైంది. ఇప్పటికే నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో అధికారులు ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయా బల్దియాల్లో నలుగురు చొప్పున సభ్యులకు పాలకవర్గంలో చోటు దక్కనుంది. ఇక, ఖానాపూర్లో వివిధ పరిణామాల నడుమ ఇటీవల నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ప్రధాన పార్టీల తరఫున పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిర్మల్లో 25, భైంసాలో 4 దరఖాస్తులు... జిల్లా కేంద్రమైన నిర్మల్ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకుంది. దీంతో సంఖ్యాబలం పరంగా దాదాపుగా అధికార పార్టీకి చెందిన సభ్యుల ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, అన్ని పార్టీల నుంచి 25 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భైంసా మున్సిపల్లో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కలిసి పాలకవర్గం కొలువుదీరింది. దీంతో ఇక్కడ బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. 12 సీట్లు గెలుపొందిన ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా తేలాల్సి ఉంది. ఇక్కడ సోమవారం వరకు 4 దరఖాస్తులు వచ్చాయి. చేతులెత్తే విధానంలో..ఈనెల 21న సాయంత్రం వరకు అధికారులు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం మూడు రోజుల తరువాత అర్హుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఆ తరువాత కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. బరిలో నలుగురు మాత్రమే నిలిస్తే కౌన్సిల్ ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చైర్మన్ సమక్షంలో కౌన్సిల్ సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక జరుపుతారు. -
కోతులు పట్టివేత
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా స్థాని కులు ఎదుర్కొంటున్న కోతుల సమస్య పరిష్కారా నికి సోమవారం మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు ముందు, పదవీ బాధ్యత స్వీకరణ అనంతరం మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ అప్పాల కావ్య, గణేశ్చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకా రం కోతులను పట్టించి కవ్వాల్ అటవీ ప్రాంతంలో వదిలేసే పనులు ప్రారంభించారు. కోతులు పట్టేవా రిని పిలిపించి వాటిని పట్టి వాటిపై రంగులు చల్లి అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. కోతులు పట్టేవారు వాటిని పట్టణ శివారులో, దగ్గరలో వది లేస్తే గుర్తుపట్టే విధంగా కోతులపై ఈ రంగులు చల్లుతున్నారు. ఈ కోతుల పట్టివేత కార్యక్రమం కొనసాగుతుందని అతి తొందరలోనే పట్టణ ప్రజ లకు కోతుల సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, కౌ న్సిలర్లు చెనిగారపు నరేశ్, గోపు గోపి, లక్కాకుల హరీశ్, కత్తి నరేందర్, నాయకులు రాజేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాసరలో అక్షయ తృతీయ రద్దీ
బాసర: అక్షయ తృతీయ పురస్కరించుకుని బాసర శ్రీజ్ఞానసరస్వతీ క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అమ్మవారికి వైదిక బృందం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. బంగారు లక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఈవో విజయ రామారావు వెల్లడించారు. అక్షయ తృతీయ రోజు గురుపూజోత్సవం సకల శుభాలను ఇస్తుందని వైదికులు వెల్లడించారు. -
●ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
వరి ధాన్యం తూకం చేయాలి లోకేశ్వరం: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని, కేంద్రం ప్రారంభించిన వెంటనే ధాన్యం తూకం చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని కన్కపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించక పోతే రైతులతో కలిసి కల్లూర్ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, గ్రామాల సర్పంచులు సునీల్, దడిగే జయలలిత, బీజేపీ మండల కన్వీనర్ బోడికె సాయన్న, జోహర్పూర్ సర్పంచ్ దయానంద్, ఆత్మా చైర్మన్ గన్ను నర్సారెడ్డి, ఏవో గిరిరాజ్, ఏపీఏం భోజన్న, నాయకులు మెండె శ్రీధర్, మహేందర్రెడ్డి, దడిగే భోజన్న, మంద బాస్కర్ ఉన్నారు. -
నిర్మల్ కోటలో మెట్లబావి
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లాలోని చారిత్రక కోటలపై జరుగుతున్న పరిశోధనలు కొత్త విశేషాలను వెలుగులోకి తెస్తున్నాయి. తాజాగా రహస్య మెట్లబావి చరిత్రాభిమానులను, జిల్లావాసులను అలనాటి నిర్మల్ వైభవం ఆకట్టుకుంటోంది. పద్మనాయకుల కాలంలో నిర్మితమైన బత్తీస్గఢ్ కోట తూర్పు దిక్కున బలమైన రక్షణ నిర్మాణాలతో నిలిచివుంది. ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోటలో సుమారు 500 మీటర్ల ఎత్తులో రాజులు సైనిక స్థావరంగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైనిక అవసరాల కోసం ప్రత్యేకంగా రహస్యంగా ఒక మెట్లబావిని నిర్మించారు. కోట తూర్పు భాగంలో ఉన్న ఈ బావికి చేరుకోవాలంటే రెండు గదుల గుండా లోపలికి వెళ్లాలి. పూర్తిగా దృఢమైన రాళ్లతో నిర్మించిన ఈ బావిలోకి దిగేందుకు సుమారు 200 మెట్లు ఏర్పాటు చేశారు. అబ్బురపరిచే నిర్మాణశైలి... మెట్ల బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది సాధారణ నీటి అవసరాల కోసం కాకుండా రహస్య స్థావరంగా ఉపయోగించినట్టు తెలుస్తోంది. బావి చుట్టూ సైనికులు పహారా కోసం కోట గోడల్లో రహస్య రంధ్రాలను ఏర్పాటు చేశారు. బయటి నుంచి వచ్చే కదలికలను గమనించేందుకు వీలుగా వీటిని విని యోగించినట్లు భావిస్తున్నారు. బావి అడుగుభాగం దీర్ఘచతురస్త్రాకారంలో ఉండగా, అక్కడి నుంచి సుమారు ఒక మీటరు వెడల్పుతో సొరంగ మార్గం నిర్మించారు. ఈ మార్గం ద్వారా శత్రువుల నుంచి తప్పించుకోవడం లేదా ఇతర కోటలకు చేరుకోవడం సాధ్యమయ్యేదని స్థానికులు చెబుతున్నా రు. ఈ సొరంగం ప్రస్తుతం సుమారు పది మీటర్ల వరకు పరిశీలించే వీలుంది. తెలంగాణలో అనేక మెట్లబావులు ఉన్నప్పటికీ, బత్తీస్గఢ్ కోటలోని ఈ రహస్య నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకుంది. రహస్య ద్వారాలు, భద్రతా ఏర్పాట్లు, సొరంగ మార్గం వంటి లక్షణాలు ఈ బావి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అరుదైన నిర్మాణాన్ని సంరక్షించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని డాక్టర్ తుమ్మల దేవరావ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్షేత్ర పర్యటనలో అబ్బడి రాజేశ్వర్రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సారంగపూర్/మామడ: రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మ ల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మామడ, పొన్కల్,కొరిటికల్, పరిమండల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల కొనుగోలుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు రోడెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఈవి షయంలో పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో మాట్లాడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇప్పించామన్నారు. అందుకే ప్రస్తుతం ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను విస్తరించామని తెలిపారు. కార్యక్రమాల్లో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ భీంరెడ్డి,తహసిల్దార్ శ్రీనివాస్రావు,ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఏవో సంద్య, పీఏసీఎస్ సీఈవో రాజేందర్, ఆలూరు సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, ధని సర్పంచ్ బడి పోతన్న, వైకుంఠాపూర్ సర్పంచ్ జంగం ఆనంద్, నాయకులు రావులరాంనాథ్,బాపురెడ్డి,కోండ్ర రాజారెడ్డి,చిన్నారెడ్డి పాల్గొన్నారు. -
మా జనాభా లెక్క తేల్చండి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జనాభా గణాంకాల వెనుక తమ జాతి ఉనికిని ఖతం చేసే కుట్ర ఉందని ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. ఇటీవల సర్వే అబద్ధాల పుట్ట అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన లేని అంకెలను తెరపైకి తెచ్చి ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది జనాభా కలిగిన తమ తెగను కేవలం 16 వేలుగా చూపడం ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 45 వేల మందికిపైగా నాయకపోడులు ఉన్నారని తెలిపారు. షెడ్యూల్డ్ తెగల జాబితాలోని సీరియల్ నంబర్ 6లో వివిధ తెగలను కలిపి ఉంచడం వల్లే ఈ గందరగోళం తలెత్తుతోందన్నారు. తమ తెగను ఇతరులతో ముడిపెట్టడం వల్ల జనాభా లెక్కింపులో లోపాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. రాబోయే జనగణనలో సీరియల్ నంబర్ 6 లోని ప్రతీ తెగకు విడివిడిగా కాలమ్ కేటాయించి, పారదర్శకంగా లెక్కింపు జరపాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. నిరసనలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, స్టీరింగ్ కమిటీ కన్వీనర్ సురపు సాయన్న, సాకి లక్ష్మణ్, మంద మల్లేశ్, సుంచు శ్రీనివాస్, అర్జున్ లింగన్న, శివ శంకర్, బోసని రాజేశ్వర్, గుమ్ముల శ్రీనివాస్, పుష్పుర్ సర్పంచ్ నర్సన్న, సర్పంచ్ తిరుపతి, దినేష్, గణేశ్, పోతురాజు శ్రీనివాస్, లింగల శ్రీనివాస్, శ్రీకాంత్, సాయికృష్ణ, ప్రభాకర్, బచ్చన్ పాల్గొన్నారు. -
బాధితుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: అర్జీదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎండలపై అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతోంది. రాబోయే 3–4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. అనవసరంగా బయటకు రావడం తగ్గించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళితే తప్పనిసరిగా వాటర్ బాటిల్స్, మజ్జిగ, ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లాలని సూచించారు. తలపై క్యాప్ పెట్టుకోవాలని, డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. వేసవిలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఘనంగా బసవేశ్వర జయంతి
నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర చిత్రపటానికి అదనపు కలెక్టర్లు, అధికారులతో కలిసి పూలమాలలు వేసి అంజ లి ఘటించారు. నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి, సమానత్వాన్ని సాధించేందుకు బసవేశ్వర మహారాజ్ కృషి చేశారన్నారు. మహిళల హక్కులు, మహిళ వివక్షత నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బ సవేశ్వర మహారాజ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒ క్కరూ బసవేశ్వర మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివా స్, మోహన్సింగ్, పలువురు సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
సారంగపూర్: స్వర్ణ గ్రామంలో ఆశ్రమ పాఠశాలను ప్రజాపాలన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం భోజనం వండిపెడుతున్నారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన విధంగా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల విషయంలో అశ్రద్ధ చేస్తే సహించేది లేదన్నారు. అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను మెనూ గురించి అడిగారు. ప్రతీరోజు మెనూ పాటిస్తున్నారా.. భోజనం రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. గణితశాస్త్రం ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, ఎంఈవో మహేందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచిఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 80 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలి.. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ అధికారి సంక్షేమ వసతి గృహాల్లో నిర్వహించే సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే–2026 గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాసరలో ప్రకటించిన నూతన యూనివర్సిటీ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఏటా సుమారు 4 వేల మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తున్నారు. పీజీ సౌకర్యం లేక పైచదువులకు దూరమవుతున్నారు. కూలీ పనులకు లేదా తక్కువ జీతాల ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పీజీ సెంటర్ను పునరుద్ధరించి, కొత్త కోర్సులు ప్రారంభించాలి. నిర్మల్ పీజీ సెంటర్ భవనాన్ని పూర్తిస్థాయిలో విద్యార్థులకే కేటాయించాలి. – సయ్యద్ హైదర్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, ఆమ్ ఆద్మీ పార్టీ -
భైంసాకు నిధులివ్వండి
భైంసా: భైంసా పట్టణ అభివృద్ధి కి నిధులు ఇవ్వాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవిని మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి కోరారు. హైదరాబాద్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులపై వినతిపత్రం సమర్పించారు. భైంసా పట్టణంలో పెరుగుతున్న జనా భా, విస్తరిస్తున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధి అత్యవసరమ ని వివరించారు. ముఖ్యంగా రహదారుల ని ర్మాణం, డ్రైనేజీ మెరుగుదల, తాగునీటి సరఫ రా, వీధి దీపాల ఏర్పాటు, పార్కులు, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీదేవి, భైంసాకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రగతి చక్రాలకు బ్రేక్
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీతో మంగళవారం పొద్దుపోయే వరకు జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. కానీ కమిటీ నాలుగు వారాల గడువు అడిగింది. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించింది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంసహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. నిలిచిన ఆర్టీసీ బస్సులు.. నిర్విరామంగా పరుగులు తీస్తున్న ఆర్టీసీ బస్సులు సమ్మెతో జిల్లాలోనూ నిలిచిపోయాయి. రెండు డిపోలలో బుధవారం నుంచి బస్సులకు బ్రేక్ పడింది. ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి. రోజుకు రూ.60 లక్షల నష్టం.. నిర్మల్ డిపోలో 156 బస్సులు, భైంసా డిపోలో 75 కలిపి మొత్తంగా 231 బస్సులు నడుస్తున్నాయి. నిర్మల్ డిపోలో డ్రైవర్లు 140, కండక్టర్లు 209 అలాగే భైంసా డిపో పరిధిలో 47 మంది డ్రైవర్లు, 48 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు డిపోల పరిధిలో బస్సులు దాదాపు రోజూ లక్ష కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ.60 లక్షల ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో ఆదాయం సంస్థ కోల్పోతుంది. -
జేఈఈలో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్టౌన్: నిర్మల్ అల్ఫోర్స్ జూనియర్ కళా శాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సెషన్–2 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చా రు. ఎస్.వర్తినిరెడ్డి ఆల్ ఇండియా–211 ర్యాంక్, కె.నచికేత్–593 , సీహెచ్.కవి–5,711, బి.తన్మయ్–13,326, సాయి శృతి–12,037, ఎండీ.సనాన్ ఉర్ రెహ్మన్–19,419 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. చైర్మన్ డాక్టర్ వి.నరేందర్రెడ్డి విద్యార్థులను అభినందించారు. మెరిసిన భైంసా విద్యార్థి.. భైంసాటౌన్: పట్టణానికి చెందిన పల్సికర్ సూర్యతేజ జేఈఈ మెయిన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. సోమవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 1549, ఓబీసీ విభాగంలో 279 ర్యాంకు సాధించాడు. పల్సికర్ శ్రీనివాస్, పద్మ దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, వీరి కుమారుడు సూర్యతేజ 9వ తరగతి వరకు భైంసాలోని ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ వరకు హైదరాబాద్లో చదువగా, ప్రస్తుతం ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో చైర్మన్ నరేందర్రెడ్డి -
డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలు
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభకు అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం స్కాలర్ షిప్ లభించింది. కళాశాలలోని ఏడుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున స్కాలర్షిప్ను నిర్వాహకులు సోమవారం అందజేశారు. ఇంటర్లో సాధించిన మార్కులకు ఈ స్కాలర్షిప్ అందజేశారు. బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎన్.హరిత, పి.అక్షయ, బి జెడ్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్న పి.శ్రావ్య, ప్రత్యూష, సాధన, సవిత, ఎంఎస్సీఎస్ విద్యార్థిని బి.హర్షితకు స్కాలర్షిప్ రావడంపై ప్రిన్సిపాల్ డి.కవిత హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపల్ ఎస్.వీణ అధ్యాపకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి నవరాత్రోత్సవాలు
కడెం: మండలంలోని దిల్దార్నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో కొండపై కొలువుదీరిన శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రోత్సవాలు ఈనెల 22 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 30న లక్ష్మీనరసింహుడి జన్మదినం(తిరునక్షత్రం)అభ్యంగము, అభిషేకం, అలంకరణ, నారసింహా సహ్రసనామార్చన, తనియవిన్నపం, తీర్థప్రసాదగోష్టి తదితర పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు వొద్దిపర్తి వెంకటరమణచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. -
సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం మాట్లాడారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందన్నారు. వివిధ శాఖల అధికారులు తమ విభాగాల పరిధిలో చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు కూడా విజయవంతంగా సాగాయన్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొనడం సంతోషకరమని, రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో దుర్గాప్రసాద్, వైద్యశాఖ అధికారి సౌమ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
మా చెరువులు పట్టవా?
నిర్మల్ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, చీఫ్ ఎలెక్టోరల్ కార్యాలయ ఈవీఎం రాష్ట్ర నోడల్ అధికారి బి.హరిసింగ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈవీఎం గోదాం తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, బీజేపీ, టీడీపీ, ఆమ్ఆద్మీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రవణ్రెడ్డి, సిరికొండ రమేశ్, హైదర్, మజార్, ముజాయిద్ అలీ పాల్గొన్నారు. నిర్మల్: వరుస కట్టినట్లుండే గొలుసుకట్టు చెరువులకు రాష్ట్రంలోనే నిర్మల్ ప్రసిద్ధి. ఎప్పుడో 450 ఏళ్ల క్రితం కాకతీయుల స్ఫూర్తితో ఓరుగల్లు రాజ్యం తరహాలో నిమ్మల చుట్టూ జలాశయాలను నిర్మించారు. జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఏ నేత వచ్చినా వీటి గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ.. ఇతర జిల్లాల్లో చెరువులను ఎలా అభివృద్ధి చేశారో.. ఇక్కడా అలాగే చేయండి.. అని స్థానిక పాలకులు, నేతలు, అధికారులూ అడగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లు.. తాజాగా పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 12జలాశయాల్లో బోటింగ్ను ప్రవేశపెట్టనుంది. అలాగే పలు అభివృద్ధి పనులనూ చేపట్టనున్నారు. ఇందులో ఇన్ని చెరువులున్న జిల్లా నుంచి ఒక్కటీ లేకపోవడం గమనార్హం. గొలుసుకట్టు.. తీసికట్టు.. కొయ్యబొమ్మలు, కోటబురుజులే కాదు.. నిర్మల్ అంటే గొలుసుకట్టు చెరువులకూ పేరొందింది. జిల్లాకేంద్రంతోపాటు మండలాల్లోనూ మినీ ప్రాజెక్టులను తలపించేలా చెరువులు ఉన్నాయి. నిర్మల్లోని గొలుసుకట్టు చెరువులను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కానీ పట్టించుకునే వారు లేరు. జిల్లాకేంద్రమైనా.. ఇక్కడ కనీసం ఒక పార్కు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు లేకపోవడంతో ఉన్న చెరువుల్లోనైనా బోటింగ్ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా జిల్లావాసులు కోరుతూనే ఉన్నారు. గతంలో నిర్మల్ బస్టాండ్ పక్కనున్న ధర్మసాగర్ను మినీ ట్యాంక్బండ్ చేస్తామని నిధులు వెచ్చించినా ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత వాకింగ్ ట్రాక్ వేసినా, వ్యూపాయింట్ కట్టినా ఏమాత్రం లాభం లేకుండా పోయాయి. ఆ చెరువులో ఇప్పటికీ మురికినీరు కలుస్తుండటంతో ఆ వైపు వెళ్లడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. గతంలో ఒకరిద్దరు కలెక్టర్లు బంగల్చెరువు, కంచెరోని చెరువులో బోటింగ్ కోసం ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చలేదు. కబ్జాలకు పనికొస్తున్నాయి.. సిద్దిపేట కోమటి చెరువు మొదలు అన్ని జిల్లాల్లో చెరువులు, జలాశయాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంటే.. జిల్లాలో మాత్రం కబ్జాలకు కేరాఫ్గా మారుస్తున్నారు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే చాలా చెరువులు కబ్జాల్లో ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల చుట్టూ కందకాలు తవ్వించినా లాభం లేకుండాపోయింది. చాలాచోట్ల వాటిని పూడ్చేసి మరీ, ఆక్రమణలు చేస్తున్నారు. లేక్ కమిటీ ఉన్నా.. ౖపైపె చర్యలే తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం పర్యాటకాభివృద్ధి పేరుతోనైనా పనులు చేపడితే చెరువులను కాపాడుకోవచ్చన్న భావన ఉంది. జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువుపట్టించుకోరూ...! అడిగేదెవరు..? ‘అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు..’ అని అంటారు. అలాంటిది జిల్లాకు ఇది కావాలి, అది కావాలి.. అని అడగకపోతే ఇచ్చేదెవరూ..!? అని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు చాలా చెరువులు ఉన్నా.. ఇక్కడి నుంచి కనీసం ఒక్క ప్రతిపాద కూడా వెళ్లలేదు. దీతో తాజాగా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న చెరువుల జాబితాలో జిల్లా పేరు లేదు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే నాలుగు చెరువులను ఎంపిక చేశారు. మన నేతలు, అధికారులు అడిగితే ఒక్క చెరువుకై నా చోటు దక్కేది. ఇక జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పర్యాటక మంత్రి అయినా కనికరించలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ ఉన్నా.. పట్టించుకుని, అడిగేవారు లేకపోవడంతో జిల్లాకు అభివృద్ధి పనులు రావడం లేదని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్, కేంద్రానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడేస్థాయి ఉన్న నేతలూ ఉన్నారు. కానీ.. ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఇందుకు ప్రధానంగా జిల్లా నుంచి చిన్నచిన్న ప్రతిపాదనలైనా పంపించడం లేదన్నది స్పష్టమవుతోంది. సీఎం స్వయంగా హామీ ఇచ్చిన యూనివర్సిటీపైనే కదలిక లేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికై నా పాలకులు, అధికారులు, అధికార పార్టీ నేతలూ పట్టించుకోవాలని, అభివృద్ధికి పాటుపడాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్టౌన్: జిల్లా న్యాయస్థాన సముదాయాల్లో ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బంది, పోలీసులకు అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో వైద్య సదుపాయాల విభాగాన్ని మంగళవారం ప్రారంభించారు. ఇక్కడ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవిందర్, మొదటి, రెండవ జూనియర్ సివిల్ జడ్జీలు భవిష్య, నిఖిత, స్పెషల్ జూనియర్ మేజిస్ట్రేట్ నర్సయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యుడు ముఖేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
అకాల అవస్థలు
ఓలలో వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులునిర్మల్ మార్కెట్ యార్డులో ఆరబోసిన మక్కలు ధాన్య తడవకుండా టార్పాలిన్ కప్పుతున్న రైతు జిల్లాలో మంగళవారం ఉదయం అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న, జొన్న ధాన్యాలు తడిశాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్డారు. కుంటాల మండలం ఓలా గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన మొక్కజొన్న పంటపై రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారు. నిర్మల్ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న మార్కెట్ యార్డ్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
మాజీ ఎంఈవోపై చర్య తీసుకోవాలి
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పంజేషాగల్లీ ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అకారణంగా మూసివేసిన నిర్మల్ అర్బన్ మాజీ ఎంఈవోపై చర్య తీసుకోవాలని మేవా, టీఎస్పీటీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఈవో భోజన్నకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఎంఈవోగా పనిచేసిన నాగేశ్వరరావు విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూసివేయించారని పేర్కొన్నారు. వారం రోజుల్లో పాఠశాలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇందులో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షబ్బీర్ అలీ, సాజిద్, ప్రవీణ్కుమార్, మక్షుత్ అహమ్మద్, అసిఫ్, ఫాజిల్ తదితరులు ఉన్నారు. -
కేజీబీవీ విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
కడెం: కేజీబీవీ విద్యార్థులు చదువు, క్రీడలతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో మంగళవారం స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్లో క్విజ్, డిబేట్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మందుల స్టోర్ పరిశీలించి ,స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో తహసీల్దార్ లచ్చిరాం, ఎంపీడీవో సునీత, ఎంపీవో శ్రీనివాస్, ఎంఈవో షేక్ హుస్సేన్, పీహెచ్సీ వైద్యాధికారి శివకుమార్, కేజీబీవీ ఎస్వో విమల, హౌసింగ్ ఏఈ వంశీ, తదితరులు ఉన్నారు. -
చేద్దామా.. సెల్ఫ్ ఎన్యుమరేషన్..!
భైంసాటౌన్: జనగణనకు అఽధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి స్వీయ నమోదుకు అవకాశమివ్వగా, మే 10 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయి జనగణన చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్యూమరేటర్లకు జన గణనపై శిక్షణ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో లేనివిధంగా ఈసారి సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ నమోదు)కు కేంద్రం అవకాశమిచ్చింది. దీంతో ప్రజలే తమ కుటుంబ సభ్యుల వివరాలను వెబ్సైల్లో నమోదు చేసుకోవచ్చు. తరువాత ఇంటికి వచ్చే ఎన్యూమరేట్లకు మళ్లీ ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. స్వీయ నమోదు తరువాత వచ్చే ఐడీ నంబర్ను వారికి చెబితే సరిపోతుంది. 1,548 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్.. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో తహసీల్దార్లు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు జనగణన పర్యవేక్షించనున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఇళ్ల జాబితాలను తయారుచేసి, ఆ కుటుంబాల్లోని వారి జీవన స్థితిగతులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 1,548 హౌస్ లిస్టింగ్ బ్లాక్ను గుర్తించారు. ఇప్పటికే ఆయా ఇళ్లకు సంబంధించి జియో ట్యాగింగ్, హద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఒక్కో బ్లాక్కు ఒక్కో ఎన్యుమరేటర్, ఆరుగురికి ఒక సూపర్వైజర్ ఉంటారు. స్వీయ నమోదు ఇలా.. ప్రజలే స్వచ్ఛందంగా జనగణన పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ముందుగా es.censusindia.gov.in అనే అధికారిక పోర్టల్ను సందర్శించాలి. అక్కడ సెల్ఫ్ ఎన్యుమరేషన్పై క్లిక్ చేస్తే లాగిన్ అని పేజీ వస్తుంది. ఇందులో రాష్ట్రం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యూజర్ నేమ్, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ నమోదు చేస్తే ఫోన్కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతుంది. శాటిలైట్ మ్యాప్ కనిపిస్తూనే చిరునామా, పిన్కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్యుపెన్సీ, రేఖాంశాల వివరాలు తీసుకుని మీ ఇంటిని మ్యాప్లో నమోదు చేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.. మీ ఇల్లు మట్టితో కట్టిందా..? సిమెంట్ ఇటుకలదా..? గోడల పరిస్థితి ఏంటి..? ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? తాగునీటి సౌకర్యం, టాయిలెట్ ఫె సిలిటీ, వంటకు వాడే ఇంధనం.. ఇలా సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, లింగం, విద్యార్హతలు, వృత్తి, వైవాహిక స్థితి.. ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ చేయాలి. తరువాత ఓ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దానిని మనం భద్రంగా దాచుకోవాలి. మే 10 నుంచి ఎన్యుమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నంబర్ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మన వివరాలను వారికి చెప్పాల్సిన అవసరం లేదు. -
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆల యం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలతోపా టు పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు అమ్మవారికి హారతి, అభిషేకం, నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఆలయంలో భ క్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు పర్యవేక్షించారు. 108 అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. -
తమిళనాడు ఎన్నికలకు నిర్మల్ పోలీసులు
నిర్మల్ టౌన్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు నిర్మల్ నుంచి 20 మంది హోంగార్డులు వెళ్తున్నారని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేసి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రయాణం, విధుల సమయంలో ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్, ఆర్ఐలు రామ్నిరంజన్రావు, శేఖర్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, హోం గార్డులు పాల్గొన్నారు. -
ఇక ప్రాదేశిక పోరు..!
నిర్మల్చైన్గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాలో అదనపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. అయితే జిల్లాలోని 2 పంచాయతీ డివిజన్ల పరిధిలోని 18 మండలాల్లో 18 జెడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగ నున్నాయి. నూతన జాబితా ప్రామాణికంగా.. 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలుంటే వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. మే నెలలో ఎన్నికలు... డిసెంబర్ నాటికి మండలాలవారీగా వివరాలు.. మండలం ఎంపీటీల పోలింగ్ మొత్తం ఓటర్లు సంఖ్య కేంద్రాల సంఖ్య దస్తురాబాద్ 5 24 12,894 కడెం 10 59 29,15 ఖానాపూర్ 8 48 23,657 పెంబి 5 32 10,886 మామడ 9 53 26,072 లక్ష్మణచాంద 9 49 24,577 నిర్మల్ రూరల్ 7 45 22,751 సారంగాపూర్ 14 77 39,516 సోన్ 8 43 21,801 దిలావర్పూర్ 6 34 18,744 నర్సాపూర్(జి) 7 38 20,238 లోకేశ్వరం 10 55 29,359 కుంటాల 7 35 19,055 భైంసా 11 67 33,970 ముధోల్ 10 53 28,754 తానూర్ 11 64 31,516 బాసర 6 31 15,728 కుభీర్ 14 86 40,625 పంచాయతీ డివిజన్లు 02 మొత్తం జెడ్పీటీసీలు 18 ఎంపీటీసీలు 157 పోలింగ్ కేంద్రాలు 892 వార్డులు 3,368 పురుష ఓటర్లు 2,13,805 సీ్త్రఓటర్లు 2,35,485 ఇతరులు 12 మొత్తం ఓటర్లు 4,49,302 ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. అదేరోజు ఫలితాలు ప్రకటించారు. జూన్లో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. గతేడాది జూన్తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. వాస్తవానికి రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబరు 29న నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీ లు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆరో తరగతిలో 216 విద్యార్థులు పరీక్షల కు హాజరు కావాల్సి ఉండగా 32 విద్యార్థులు, 7 నుంచి పదో తరగతి వరకు 164 విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 24 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు తెలిపారు. వైష్ణవి అనే విద్యార్థిని చేయి విరిగినా తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం పరీక్ష రాసేందుకు హాజరైంది. తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కుంటాల: కుంటాల ఆదర్శ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 6 తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో దర్శనం భోజన్న, ఎంఈవో ముత్యం, సీఎస్ ఎత్రాజ్ రాజు ఉన్నారు. -
ఇంద్రవెల్లి గాయానికి 45 ఏళ్లు
1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. అలాగే ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – ఇంద్రవెల్లిఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి. అసలేం జరిగింది.. స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్దమైన హక్కుల సాధన కోసం పీపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పా టు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉద యం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15 మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది వరకు మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. 33 ఏళ్లు.. నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రా ష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏ ర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల నడుమ నివాళులర్పి ంచడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పి స్తూ వచ్చారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపం నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో మళ్లీ నిర్మించింది. అమరవీరుల ఆశయ సాధన కోసం రిలే దీక్షలు నాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. -
వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
నిర్మల్టౌన్/భైంసాటౌన్: విద్యా సంస్థలకు మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది ఊళ్ల బాట పట్టనున్నా రు. తీర్థయాత్రలకు వెళ్లనున్నారు. సెలవుల్లో ఎటు వెళ్లాలి అనే విషయమై ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా సెలవుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మల్, భైంసా డిపో మేనేజర్లు పండరి, హరిప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్లలో క్యూ లు, రద్దీ కూడా పెరిగిందని వెల్లడించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువివరాలు వెల్లడించారు. సాక్షి : వేసవి రద్దీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పండరి, హరిప్రసాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఈ మేరకు నిర్మల్, భైంసా డిపోల పరిధిలోని బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. చల్లని నీరు అందిస్తున్నాం. కుర్చీలు, ఫ్యాన్లు తగినంతగా ఏర్పాటు చేశాం. సాక్షి :సెలవుల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా? పండరి : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సులను పెంచుతాం. బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కాకుండా అవసరం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. సాక్షి : ఎన్ని బస్సులు ఉన్నాయి. ఏయే రూట్లలో ఎక్కువగా నడుపుతున్నారు? పండరి : ప్రస్తుతం నిర్మల్ డిపోలో బస్సుల కొరత లేదు. డిపోలో మొత్తం 156 బస్సులు ఉన్నా యి. ఇందులో ఐదు రాజధాని, రెండు లహరి బస్సులు ఉన్నాయి. రాజధాని బస్సులు జేబీ ఎస్ , ఎయిర్పోర్ట్కు నడుపుతున్నాం. లహరి బస్సులు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు వరకు వెళ్తాయి. నిర్మల్ డిపోబస్సులు రోజుకు 66500 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఏసీ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. హరిప్రసాద్: భైంసా డిపోలో 75 బస్సులు ఉన్నాయి. వీటిలో 47 హైర్ బస్సులు, 28 సంస్థ బస్సులు ఉన్నాయి. 126 మంది కండక్టర్లు, 47 మంది రెగ్యులర్, 94 మంది హైర్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డిపో నుంచి ప్రతీరోజు 72 బస్సు సర్వీసులు నడుపుతున్నాం. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, నాందేడ్, ధర్మాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ, శనివారాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సు సర్వీసుల కొరత లేకుండా చూస్తున్నాం. సాక్షి : వేసవిలో ఆర్టీసీ బస్సుల టూర్లు ప్లాన్ చేస్తున్నారా? పండరి : ప్రతిసారి వేసవిలో ఆర్టీసీ బస్సుల విహారయాత్రను ఏర్పాటు చేస్తాం. ఈ వేసవిలో అయోధ్య, కాశీ, ప్రయోగ్రాజ్, రామేశ్వరం, అరుణాచలం, పూరి, కోణార్క్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ యాత్రలకు బస్సులు నడపడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈసారి గోవాకు కూడా స్పెషల్గా ప్లాన్ చేశాం. ఈ టూర్లకు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తాం. సాక్షి : కండక్టర్, డ్రైవర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పండరి : వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కండక్టర్ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మూడు రోజులకు ఒకసారి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నాం. అంతేకాకుండా డ్రైవర్లకు తలకు రుమాలు కట్టుకోవాలి, ఐదు లీటర్ల వాటర్ క్యాన్, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాం. సాక్షి : బస్టాండ్లలో ఫ్యాన్లు పనిచేయడం లేదు..! హరిప్రసాద్: భైంసా డిపో పరిధిలో భైంసా, ముధోల్, కుభీర్, బాసర, లోకేశ్వరం బస్టాండ్లు ఉన్నాయి. అన్ని బస్టాండ్లలోనూ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. అవిపని చేస్తున్నాయి. ఇంకా, ప్రయాణికుల కోసం బస్టాండ్లలో తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సాక్షి : బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పండరి : బస్సు షెల్టర్ లేక ఎండలో ఉంటున్న ప్రయాణికుల కోసం ప్రస్తుతం ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పలు బస్స్టాప్ల వద్ద షెడ్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ, ఎక్కడ షెడ్లు అవసరమో గుర్తిస్తున్నాం. రద్దీ ఉండే స్టాప్ల వద్ద త్వరలో షెడ్లు వేయిస్తాం. హరిప్రసాద్ : భైంసా పట్టణంతోపాటు నిర్మల్, నిజామాబాద్, కుభీర్ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎండలో వేచి ఉంటున్నారు. భైంసాలో నిర్మల్ చౌరస్తా, కుభీర్ మార్గంలో మున్సిపల్ చౌరస్తా, నిర్మల్ మార్గంలో అర్లి ఎక్స్రోడ్, ఇతర ప్రాంతాల్లో బస్షెల్టర్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. -
నిర్మల్
సందర్శకుల సందడి కడెం: కడెం ప్రాజెక్టు పరిసరాల్లో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. నిర్మల్, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించారు. బోటింగ్ చేశారు.‘ఓపెన్’కు సర్వం సిద్ధం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. టాస్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అశోక్ తెలిపారు. లోకేశ్వరం మండలంలో వ్యవసాయ పనులు మొదలు పెడుతున్న రైతులు -
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
నిర్మల్టౌన్: తల్లిదండ్రులు పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు శనివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు చాలా తీవ్రమైనవని, అలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం, శాశ్వత గాయాలు కలగవచ్చని వివరించారు. వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లాంటి ప్రాథమిక రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో తల్లిదండ్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సమ్మయ్య, ఆర్ఐ రామ్నిరంజన్, ఎస్సైలు, మైనర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భైంసారూరల్: అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మాటేగాం గ్రామంలో వాహనదారులకు, గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై శనివారం అవగాహన కల్పించారు. ద్విచక్ర వామనాదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సుప్రియ, పోలీసులు, వాహనదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.రోడ్డు భద్రత నియమాలు పాటించాలినిర్మల్టౌన్: రహదారి భద్రత నియమాలను వాహనదారులు పాటించాలని జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ శివారులోని ఆర్టీవో కార్యాలయంలో సిబ్బందికి రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని, వేగపరిమితులను కచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించొద్దని తెలిపారు. ఓవర్ లోడ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజేందర్, డీఈవో భోజన్న, ఎంవీఐ మహేందర్, ఆర్టీవో సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు. -
● డీడబ్ల్యూవో వినూత్న
పోషకాహార లోపం నివారణకు పోషణ్ పక్వాడ నర్సాపూర్ (జి): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలలో పోషకాహార లోపాలను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి(డీడబ్ల్యూవో) వినూత్న అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషకాహారంపై శనివారం అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి వ్యాధులు దరి చేరకుండా కాపాడాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్రెడ్డి, సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ లక్ష్మీవిశారద, ఐసీపీఎస్ దేవి మురళి, మిషన్ శక్తి డిస్టిక్ర్ట్ కోఆర్డినేటర్ సవిత, కేజీబీవీ ఎస్వో వీణ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
ఇంటికే పోషకాహారం
వేసవి నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు.. వేసవి నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి పోషకాహారం సరుకులు లబ్ధిదారుల ఇంటికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1, 2వ తేదీలలో అబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి సరుకులు తీసుకోవాలి. – వినూత్న జిల్లా సంక్షేమాధికారి లక్ష్మణచాంద: రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచే వేడి మొదలవుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఎండకు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే సమయంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అంగన్వాడీ కేంద్రాలలో సరైన వసతులు లేకపోవడం, కొన్ని కేంద్రాలలో ఫ్యాన్లు సరిగా లేకపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలు కూడా రావడానికి సుముఖత చూపడం లేదు. దీనిని అధిగమించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి అంగన్వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఇంటికే సరుకులు... ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి అంగన్వాడీ సరుకులను లబ్ధిదారులకు ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇది వరకే జిల్లా సంక్షేమ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఇంటికి సరుకులు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. జూన్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు జిల్లా వ్యాప్తంగా 19 మండలాలు 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం నాలుగు ప్రాజెక్టులు ఉ న్నాయి.నిర్మల్, ఖానాపూర్, భైంసా, ముధోల్ ప్రా జెక్టుల పరిధిలో 931 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో చిన్నారులు 56,588, గర్భిణులు 4, 904, బాలింతలు 4,798 మంది నమోదయ్యారు. పంపిణీ ఇలా... ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు బాలామృతం, 16 గుడ్లు, మూడు నుంచి ఆరేళ్ల వయసు వారికి రోజు 75 గ్రాముల బియ్యం 15 గ్రాముల పప్పు, ఐదు గ్రాముల నూనె, 30 గుడ్లు, 20 గ్రాముల మురుకులు అందిస్తారు. గర్భిణులు బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, 200 మి.లీ పాలు, 30 గుడ్లు పంపిణీ చేస్తారు. కేంద్రాల వద్ద లబ్ధిదారుల ముఖ హాజరు నమోదు చేసుకుని నెలకు అందచేసే సరుకులు పంపిణీ చేస్తారు. జిల్లా సమాచారం... జిల్లాలో ప్రాజెక్టులు 04 మండలాలు 19 గ్రామ పంచాయతీలు 400 అంగన్వాడీ కేంద్రాలు 931 చిన్నారులు 56,588 గర్భిణులు 4,904 బాలింతలు 4,798 -
ఉత్తమ డ్రైవర్లు వీరే..
పేరు : టీవీ.రావు సర్వీసు : 27 సంవత్సరాలు గతేడాది ప్రయాణించిన కి.మీలు : 63,232 పేరు : మల్లికార్జున్ సర్వీసు : 28 సంవత్సరాలు గతేడాది ప్రయాణించిన కి.మీలు : 76,988 పేరు : ఎంఏ.రవూఫ్ సర్వీసు : 18 సంవత్సరాలు గతేడాది ప్రయాణించిన కి.మీలు : 76,478 పేరు : ఎస్డీ.మునీర్ సర్వీసు : 18 సంవత్సరాలు గతేడాది ప్రయాణించిన కి.మీలు : 76,668 -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
నిర్మల్చైన్గేట్: జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ను కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నా రు. అర్హత ఉన్న ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌర సంబంధాల అధికారి, కమిటీ సభ్యులపై ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మార్గదర్శకాలను కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్డులు జారీ చేయకూడదని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకో వాలన్నారు. త్వరలోనే జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఇ.విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, కొండూరి రవీందర్, అల్లం అశోక్, ఆర్.మహేందర్, ఎంఏ. వసీం, రామెళ్ల రాజేశ్వర్, సిరిపురం నాగరాజు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
‘సీతక్కపై అసత్యప్రచారం సహించం’
ఖానాపూర్: మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శనివారం సెల్ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం బొజ్జు మాట్లాడారు. సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఆదివాసీ మహిళ అయిన మంత్రిపై అసత్య ప్రచారం తగదని, ఇది కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆ సమయంలో పరిమితస్థాయిలో జరిగిన అభివృద్ధిని పెద్దగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని విస్తృతస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రచారానికి కాకుండా పనితీరుకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేవారు. ఏడో వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పడిగెల భూషణ్, ఎంఏ మాజిద్, గాడ్పు సత్యం, దయానంద్, పొలంపెల్లి రమేశ్, పుప్పాల శంకర్, గొర్రె గంగాధర్, జమాల్ ఖురేషి, జంగిలి శంకర్, జన్నారపు శంకర్, ద్యావతి రాజేశ్వర్, శ్రీనివాస్రెడ్డి, స్వప్నిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బుట్టాపూర్ భగభగ
దస్తురాబాద్లో గొడుగులు పట్టుకుని వెళ్తున్న చిన్నారులు ఎర్రబడ్డ జిల్లా చిత్రమే ఎండ తీవ్రత జిల్లాలో ఎలా ఉందో చెప్పడానికి సాక్ష్యం. పొద్దు పొడిచింది మొదలు.. గంటగంటకూ వేడెక్కుతూనే ఉంది. పట్టపగలు పగబట్టినట్లు భానుడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. ఏప్రిల్ రెండోవారంలోనే ఎండ మండిపోతోంది. మొన్నటివరకు 42 డిగ్రీలకే ‘అమ్మో..’అనుకుంటే, శనివారం ఏకంగా 44.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దస్తురాబాద్ మండలం బుట్టాపూర్లో నమోదైన ఈ ఉష్ణోగ్రత ఈ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికం కావడం గమనార్హం. తీవ్రమవుతున్న ఎండల నుంచి ముందుజాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. – (నిర్మల్/దస్తురాబాద్) -
డాక్టర్స్ సెల్ జిల్లా చైర్పర్సన్గా జయశ్రీ
ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా చైర్పర్సన్గా డాక్టర్ జయశ్రీని నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈమేరకు జయశ్రీకి శనివారం నియామకపత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సూచన మేరకు జిల్లాస్థాయిలోని అన్ని అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమిస్తున్నట్లు వివరించారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలన్నారు. -
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
● అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మామడ: ఉపాధిహామీ కూలీలకు పనిప్రదేశంలో వసతులను కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని మామడ, లింగాపూర్ గ్రామాలలో శనివారం పర్యటించారు. మామడ చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. కూలీ లకు కల్పించిన వసతులను పరిశీలించారు. నీడ, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయమే పనులకు హాజరు కావాలని సూచించారు. అనంతరం లింగాపూర్ గ్రామంలో నర్స రీ పనులను, పొనికి వనం పెంపకాన్ని పరిశీ లించి వివరాలు తెలుసుకున్నారు. మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో సుశీ ల్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో శివాజీ పాల్గొన్నారు. -
జన గణనపై ఉపాధ్యాయులకు శిక్షణ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయులకు జనగణనపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవరత్నం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. న్యూమరేటర్లు, సూపర్వైజర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ రియుమరేషన్ విధానాన్ని పూ ర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ జనగణనలో సరైన కచ్చితమైన సమాచారం సేకరణ అత్యంత కీలకమన్నారు. ఉపాధ్యాయులకు మూడు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ పద్ధతులపై అవగాహన పెంచుకుని, జనగణన సమర్థవంతంగా నిర్వహించాలని సూచించా రు. రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ పీజీ.రెడ్డి, జిల్లా పరిశీలకుడు సౌరభ్, జిల్లా మాస్టర్ ట్రైనర్ రమేశ్, ఎస్వోలు లింబాద్రి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
● జిల్లాలో అందుబాటులో లేని పూల్ ● చెరువుల్లో ఈత నేర్చుకుంటున్న చిన్నారులు ● సెలవుల్లో చెరువులు, కుంటల బాట.. ● గతంలో ప్రాణాలు కోల్పోయిన వైనం..
ఈత.. అంటే చిన్న నుంచి పెద్దదాకా అందరికీ సరదా. అందులో వేసవిలో ఈత కొట్టడమంటే అందరూ ఎగిరి నీళ్లలో గంతేస్తారు. కానీ.. నిర్మల్వాసులకు ఆ సరదా తీరడం లేదు. జిల్లాగా ఏర్పడి దశాబ్దం గడిచినా పాలకులు, అధికారులు కనీసం ఒక్క స్విమ్మింగ్పూల్ కూడా కట్టించలేకపోయారు. దీంతో సరదా కోసం, సేద తీరేందుకు, ప్రత్యేకంగా ఈత నేర్చుకోవడానికి ప్రైవేటుగా అధికంగా డబ్బులు చెల్లించాలి. లేదంటే చెరువులు, కుంటల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇలా.. ఈతకు వెళ్లి పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. –నిర్మల్ జిల్లాకేంద్రంగా ఎదిగిన నిర్మల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఈత కొలను నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతూనే ఉన్నారు. కానీ.. పాలకులు శ్రద్ధ పెట్టడం లేదు. గతంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలోనే ఓ మూలన స్విమ్మింగ్పూల్ కూడా నిర్మిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ స్టేడియం నిర్మాణమే ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక ఈతకొలను నిర్మిస్తారన్న ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి. చేసేది లేక.. చిన్నారులు, పెద్దలు నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు పోయాయి.. సరదాగా నీళ్లలో ఈత నేర్చుకుందామని వెళ్లిన చిన్నారులు, యువకులు గతంలో నీళ్లలోనే కలిసిపోయారు. లోతు తెలియకుండా నీళ్లలోకి దిగడం, సరిగా ఈత రాకపోవడంతో పలువురు చిన్నారులు చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో పడి మృతిచెందారు. చాలా చెరువుల్లో ఇష్టారీతిన పూడిక తీయడంతో వర్షకాలంలో అవి నిండిపోయాయి. లోతు తెలియకుండా అందులోకి దిగిన పిల్లలు మృత్యువాత పడ్డారు. నిర్మల్ శివారులోని సిద్దాపూర్ వద్ద ఉన్న వాగు, సరస్వతి కెనాల్లోనూ ఈత కోసం వెళ్లి పలువురు యువకులు చనిపోయారు. ప్రైవేటు స్విమ్మింగ్పూల్స్ ఉన్నా.. పేద మధ్యతరగతి కుటుంబాలు ఫీజులు కట్టలేకపోతున్నారు. స్విమ్మింగ్పూల్ ఉంటే.. ప్రభుత్వం క్రీడాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్పూల్ను నిర్మించాలి. ఈత కొలను ఉండటం వల్ల దాంట్లో ప్రత్యేకంగా స్విమ్మింగ్ నేర్పించేందుకు కోచ్ ఉంటారు. ఆయన సంరక్షణలో చిన్నారులు ఈతను నేర్చుకుంటారు. అలాగే కొలను కూడా వయసు, ఎత్తులకు తగ్గట్లుగా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈత నేర్చుకునేలా నిర్మించి ఉంటుంది. దీంతో ప్రాణాపాయం ఉండదు. కొలనులోని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. చర్మవ్యాధులూ వ్యాపించవు. అందుకే ఈతకొలను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రీన్ఫీల్డ్ స్టేడియం పరిశీలించిన రాష్ట్ర బృందం
ఖానాపూర్: ఖానాపూర్లో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ స్టేడియం అభివృద్ధి పనుల నేపథ్యంలో రాష్ట్రస్థాయి పరిశీలన బృందం శుక్రవారం మినీస్టేడియాన్ని సందర్శించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి సమక్షంలో స్టేడియం పరిస్థితులను సమీక్షించింది. స్టేడియానికి అవసరమైన మౌలిక వసతులు, మరమ్మతు పనులు, క్రీడా పరికరాలపై వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఏటీజీ అసిస్టెంట్ ఇంజినీర్లు లక్ష్మి, సౌమ్య, మనోహర్, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
లక్షలు వెచ్చించారు.. వృథాగా వదిలేశారు
నిర్మల్ఖిల్లా: జిల్లాకేంద్రంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చేపల విక్రయ కేంద్రం వృథాగా మారింది. 2023లో భాగ్యనగర్ సమీపంలోని విశ్వేశ్వరయ్య మార్గ్లో దాదాపు రూ.65 లక్షల మత్స్యశాఖ నిధులతో నిర్మించిన ఈ ఆధునిక చేప ల మార్కెట్ ప్రారంభించిన నాటి నుంచి విని యోగంలేక వృథాగా పడిఉంది. మత్స్యకారులు, విని యోగదారుల సౌకర్యార్థం విక్రయాల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ఈ భవనంలో గ్రానైట్ ప్లాట్ఫామ్లు, చేపలశుద్ధి క్యాబిన్లు ఏర్పాటు చేశారు. అయితే వినియోగంలోకి తీసుకురావడంలో అధికా రుల అలసత్వం వహిస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఇప్పటికీ ఆరుబయట ఎండలోనే చేపల విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఖాళీగా ఉన్న భవ నం శిథిలావస్థకు చేరుతోంది. ఫ్లోరింగ్, గ్రానైట్ రా ళ్లు పగిలిపోవడం, భవనం రూపురేఖలు మారిపోవడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రివేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
బాసర మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక సమావేశం
బాసర: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్పై హైదరాబాద్లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో వైదిక బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇన్చార్జి ఈవో విజయరామారావు, స్థానాచార్యులు ప్రవీణ్పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్పూజారి మాస్టర్ ప్లాన్ అంశాలను స్థాపతికి వివరించారు. ఈ ప్లాన్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై చర్చించారు. అనంతరం తుది నివేదికను శృంగేరి పీఠాధిపతికి అందజేయనున్నట్లు వెల్లడించారు. శృంగేరి పీఠాధిపతి అనుమతి తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. -
పర్యాటక శోభ
చిత్తడి చెరువుకు ప్రతిపాదనలు ఇలా.. ● చెరువు సరిహద్దు, కృత్రిమంగా పక్షుల ఆవాసం ఏర్పాటు కోసం రూ.20 లక్షలు ● చెరువులోని మట్టి, ఇతర వ్యర్ధాల తొలగింపునకు రూ.10 లక్షలు. ● చెరువు చుట్టూ వృక్ష జాతుల పెంపకం కోసం రూ.20 లక్షలు. ● చెరువులోని కలుపు మొక్కల తొలగింపు కోసం రూ.20 లక్షలు ● నీటి వసతి చేప పిల్లలు విడుదల కోసం చెరు వు, అభివృద్ధి పనుల కోసం రూ. 25 లక్షలు ● ఎకో టూరిజం అభివృద్ధి కోసం రూ.30 లక్షలు ● పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు ● చెరువు కట్ట అభివృద్ధి కోసం రాతి కట్టడం ఏర్పాటు, తూము రిపేర్లు, కాలువల మరమ్మత్తుల కోసం రూ.15 లక్షలు. ● ఇతర అవసరాల కోసం రూ.10 లక్షలు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. లక్ష్మణచాంద: భూమిపై పొరలలో నీటిని నిల్వ ఉంచుకునే నేలలను తడిగా ఉండే నేలలను చిత్తడి నేలలుగా భావిస్తారు. ఇందులో ప్రధానంగా చెరువులు, సరస్సులు, మడ వనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యా ప్తంగా ఈ రకం నేలలు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ 4 శాతం నేలపైనే ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం జీవులు నివసిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. చిత్తడి నేలలు పలు రకాల జీవులు నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. వివిధ రకాల మొక్కలు, వృక్ష జాతులు, పక్షులు, చేపలు, నీటిలో పెరిగే వివిధ రకాల జీవరాసుల ఆవాసానికి ఈ నేలలు అనుకూలం. జనాభా పెరుగుదల, పట్టణీకరణ నేపథ్యంలో చిత్తడి నేలల చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. జీవుల మనుగడకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు మురికి నీటి వ్యర్ధాలు, పరిశ్రమల వ్యర్ధాలు ఈ చెరువుల్లోకి చేరడంతో నీరు కలుషితమై జీవజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతోంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దీనిని అరికట్టేందుకు చిత్తడి నేలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడి జీవుల మనుగడ సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నిర్మల్ జిల్లాలో.... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు సూచించిన సూచనల మేరకు జిల్లాలోని లక్ష్మణచాంద ఊర చెరువును, సో న్ మండలం పాక్పట్ల గ్రామంలోని మొసళ్ల చెరువును జిల్లా అటవీ శాఖ అధికారుల బృందం, రెవె న్యూ అధికారులు, ఇరిగేషన్, మత్స్యశాఖ, టూరి జం అధికారులు కలిసి పరిశీలించారు. అనంతరం అధికారుల బృందం సర్వే చేసింది. ఇందులో లక్ష్మ ణచాంద ఊర చెరువు, సోన్ మండలం పాక్పట్ల లో ని మొసళ్ల చెరువును చిత్తడి నేలగా అధికారుల బృందం గుర్తించారు. కానీ పాక్పట్ల మొసళ్ల చెరువును చిత్తడి నేలగా అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ అధి కారులు అభ్యంతరం తెలిపారు. దీంతో జిల్లాలో కేవలం లక్ష్మణచాంద ఊర చెరువును ఒక్కటే చిత్తడి నేలగా గుర్తించారు. అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గుర్తించిన జీవవైవిధ్యం సర్వేలో లిటిల్ గ్రేబ్, లార్జ్ ఎర్జెట్, ఓరియంటల్ డార్టర్, పర్పుల్ స్పామ్ పెన్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, రుడీ షెల్ డక్, స్పాట్ బిల్డ్ డక్, రెడ్ వాట్లెగ్డ్ లాప్వింగ్ వంటి పక్షులు కనుగొన్నారు. వృక్షాలు, జలజీవులు కూడా ఉన్నాయి. దీనిని అభివృద్ధి చేస్తే ఆక్రమణలు తగ్గుతాయి. కాలుష్యం నియంత్రించే అవకాశం ఉంటుంది. చెరువు శుభ్రం అవుతుంది. పక్షులకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేస్తారు. చేపలు పెరుగుతాయి. చెరువు చుట్టూ వృక్షాలు నాటి పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు. పర్యాటకంగా అభివృద్ధి లక్ష్మణచాంద ఊర చెరువును చిత్తడి నేల కింద ఎంపిక చేశాం. ఇందులో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖ, టూరిజం శాఖ అధికారులతోపాటు, సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ఎంతో ఉంది. చెరువు హద్దులు గుర్తించడం, మట్టిని తొగించడం, పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది. దీంతో మండల కేంద్రం ప్రజలతోపాటు ఇతర గ్రామాల ప్రజలు వస్తారు. దీంతో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – శ్రీనివాసరావు, ఎఫ్ఆర్వో, దిమ్మదుర్తి రేంజ్ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ వెలుమల ప్రభాకర్ అన్నారు. గెజిటెడ్ అధి కారులు, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షనర్ల సమస్య ల పరిష్కార కార్యాచరణలో భాగంగా శుక్రవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లులను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన మరో 64 డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ జి ల్లా జనరల్ సెక్రెటరీ పి.గంగారెడ్డి, అడిషనల్ సెక్రెటరీ నరేంద్రబాబు, కోచైర్మన్ లక్ష్మణ్, రమేశ్, కూడా ల రవికుమార్, రవికాంత్, శంకర్, విజయ్ కుమా ర్, దేవేందర్, కృష్ణారావు, హరిప్రసాద్, మహేంద్రచారి, సత్యపాల్రెడ్డి, గడ్డం శ్రీనివాస్, అశోక్కుమార్, జాదవ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు
ఆదిలాబాద్: జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేర్చేలా ఆదిలాబాద్లో అత్యాధునిక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ స్టేషన్తో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణశాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ‘ఓఎల్ఎస్ ఫీల్డ్ సర్వే’ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ మైదానం, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం 1,540 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 450 ఎకరాలు అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమి కోసం గతంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి చెందిన 700 ఎకరాలను సేకరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విమానాశ్రయంలో రక్షణ, పౌర అవసరాల కోసం 2.5 కిలోమీటర్ల మేర భారీ రన్వేను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుల సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, సర్వే నివేదికను మరో 20 రోజుల్లో కేంద్రా నికి అందజేస్తామని తెలిపారు. భూ సేకరణ వల్ల ప్రభావితమయ్యే నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే నష్టపరిహారం చెల్లింపులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, రవాణా పరంగా కొత్త పుంతలు తొక్కనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ సబర్వాల్, ఎస్.జి. ఇగ్లా, కల్నల్ నటరాజ్ వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రక్తహీనతను నివారిద్దాం
నిర్మల్టౌన్: ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. హీమోఫిలియా పురుషులలో ఎక్కువగా కనిపించే వ్యాధి అన్నారు. మన శరీరంలో రక్తస్రావాన్ని నియంత్రించే జన్యువులలో మార్పుల కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్తస్రావ రుగ్మతల సంఘానికి మద్దతు ఇవ్వడానికి, వయసు, లింగం లేదా నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ రుగ్మతలతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ సంరక్షణ , చికిత్స అందుబాటులో ఉండేలా ప్రోత్సహించడానికి ఈ రోజును అంకితం చేశారన్నారు. ప్రస్తుతం ఈ రక్తస్రావ రుగ్మతకు ఎటువంటి నివారణ లేదని, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సమత, డాక్టర్ విశ్వనాథ్, కిరణ్, నర్సింగ్ ఆఫీసర్లు వనజ, విజయలక్ష్మి, పారిజాతం బ్లడ్ బ్యాంక్ డీఈవో రాకే శ్, నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు . -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్టౌన్: వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిబ్బంది, పేషంట్లకు శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని , జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఓవర్ రోడ్ చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్ర మాదం సంభవిస్తే వెంటనే 101,100 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి శివాజీ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి, సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు లేకుండా తగినన్ని గన్నీ సంచులు, తూకపు యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించిన చెక్లిస్ట్ ప్రకారం సామగ్రి సమగ్రంగా ఉందో లేదో పరిశీలించి, పరికరాలు సక్రమంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు చేయాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని, ధాన్యం స్వీకరణలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ ప్రతినిధులు మహేశ్, మిలర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న కొనుగోళ్లకు సబ్ సెంటర్లు
● ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ భైంసాటౌన్: నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 30కిపైగా సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డిని కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అధిక మొత్తంలో రైతులు మొక్కజొన్న సాగుచేశారని ఆయనకు వివరించారు. ప్రధాన కొనుగోలు కేంద్రాలతోపాటు సబ్ సెంటర్ల ఏర్పాటుతో పంట అమ్మకానికి రైతులకు ఇబ్బందులు తొలగుతాయని ఆయన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
అర్హులందరికీ పథకాలు
● జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి మామడ: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి అన్నారు. మామడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలస్థాయి సమావేశం నిర్వహించారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అధికారులు, సర్పంచులు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో శంకర్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు ఉన్నారు. -
కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన రైతులు
లక్ష్మణచాంద: మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల రైతులు గురువారం రోడ్డెక్కారు. మండలంలోని వివిధ గ్రామాల్లో యాసంగిలో అన్నదాతలు సాగుచేసిన మొక్కజొన్న పంట చేతికివచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి రైతులు నష్టపోతున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు కనకాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో నిర్మల్ – మంచిర్యాల రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణి కనకాపూర్ చేరుకుని రైతులతో మాట్లాడారు. సోన్ సీఐ గోవర్ధన్కు సమాచారం ఇచ్చారు. ఎస్సై గోపితో సీఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తహిసీ ల్దార్ సరిత, మండల వ్యవసాయ అధికారి వసంత్రావు కనకాపూర్ చేరుకున్నారు. రైతులతో తహసీ ల్దార్ సరిత, ఏవో వసంతరావు మాట్లాడారు. లక్ష్మ ణచాందలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయాలని ఆదేశాలు వచ్చాయని, పీచర, చా మన్పల్లి, వడ్యాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కొనుగోలు కేంద్రాలను విస్తరించాలిభైంసా: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కోరా రు. హైదరాబాద్లో మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డిని గురువారం కలిసి రైతుల తరఫున వినతిపత్రాన్ని ఇచ్చారు. ముధోల్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాల్లోనూ సబ్ సెంటర్లను ప్రారంభించాలని కోరారు. ఈ విషయంపై మార్క్ఫెడ్ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు విఠల్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే సబ్సెంటర్లు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్మల్చైన్గేట్: నిర్మల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. నిర్మల్, సారంగాపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో కొత్తగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి గతంలో లేఖ కూడా రాసినట్లు తెలిపారు. పంట దిగుబడి మేరకు ఇంకా అవసరమైన ప్రాంతాల్లో మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడినట్లు తెలిపారు. -
జూన్ 2లోపు పీఆర్సీ ప్రకటించాలి
నిర్మల్చైన్గేట్: పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంటుతో జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ పెన్షన్ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయన్నారు. ఏక మొత్తంగా పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్లు వెంటనే విడుదలచేసి పెన్షనర్స్ కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కొత్త ఈహెచ్ఎస్ స్కీం విధివిధానాలు రూపొందించి, మే 1వ తేదీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ స్కీం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ బాధ్యులు ఎంసీ.లింగన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ పీజీ.రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేడు నల్ల బ్యాడ్జీలతో నిరసన.. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మండల, డివిజన్, జిల్లాస్థాయి కార్యాలయాల వద్ద ఉద్యోగుల ప్రధాన నాలుగు డిమాండ్లతోపాటు ఉద్యోగుల 64 డిమాండ్లు దశల వారీగా పరిష్కరించాలని శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలని టీజీ ఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్ తెలిపారు. ప్రతీ ఉద్యోగి తమ దగ్గరలోని మండల, డివిజన్, జిల్లా కార్యాలయాలకు భోజన విరామ సమయంలో చేరుకోవాలని సూచంచారు. కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వచ్చి నిరసనలో పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమ ముందస్తు అనుమతి కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. -
ఎకరం దాటని ‘భరోసా’?
నిర్మల్చైన్గేట్: యాసంగి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే జిల్లాలోని మొక్కజొన్న, జొన్న, శనగ పంటలు చేతికి వచ్చాయి. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. అయినా ఇప్పటికీ యాసంగి పంటలకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అన్నదాతకు అందలేదు. 20 రోజుల క్రితం ఒక్కో ఎకరాకు సంబంధించి రైతులందరి ఖాతాల్లో రూ.6 వేల పెట్టుబడి డబ్బులు జమచేశారు. క్రమంగా అందరికీ ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ, 20 రోజులు గడిచినా పెట్టుబడి ఎకరం దాటలేదు. దీంతో పంట కాలం పూర్తి కావొస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఖరీఫ్ సీజన్లో పూర్తిస్థాయిలో పెట్టుబడి అందలేదు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో చెల్లిస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వం రైతులందరికీ ఒకేసారి పెట్టుబడి అందించేదని, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక పెట్టుబడి సాయం చెల్లింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్... గత ప్రభుత్వం రైతుబంధు పేరిట పథకం అమలు చేయగా, కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పేరుతో ముందుకు సాగుతోంది. ఏడాది కాలం సాగు సాయం ఇవ్వకుండా పంట చేతిక వచ్చాక పథకం అమలు చేయడం రైతులను అసంతృప్తికి గురిచేస్తోంది. అది కూడా ఒకేసారి కాకుండా ఎకరం, రెండెకరాలు చొప్పున ఇస్తోంది. ఎకరానికి డబ్బులు జమ చేసేందుకు మొదట్లో వారం రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు మరింత సమయం పడుతోంది. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. ఒకేసారి పథకం అమలు చేయాలని కోరుతున్నారు. రెండు, మూడు విడతలపై అనుమానం? యాసంగి పంటల పెట్టుబడి సాయంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా విడతలవారీగా సాయం చే యడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి సీజన్ రైతుభరోసా డబ్బులను తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కేవలం ఎకరానికే రూ.6 వేల చొప్పున మార్చి 22న రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. మిగతావి రెండు, మూడు విడతల్లో చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. వ్యవసాయం మంత్రి మాత్రం పూర్తిగా చెల్లించామని ప్రకటిచారు. దీంతో యాసంగి సాయం చెల్లింపుపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నారు. అందరికీ వస్తుంది..జిల్లాలోని రైతులందరికీ రైతు భరోసా వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతీ రైతు ఖాతాలో ఎకరాకు సంబంధించి రూ.6 వేలు జమ చేసింది. మిగతా వాటిని త్వరలో వేసే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో రెండో విడత డబ్బులు జమవుతాయి. రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. – అంజిప్రసాద్, డీఏవో -
అటు తీర్మానం.. ఇటు బహిష్కరణ
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేటాయించిన రూ.15 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనను కౌన్సిల్ సభ్యులు తీర్మానించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం పాలక, ప్రతిపక్షాల మధ్య మరోసారి వాదనకు వేదికై ంది. ఈసందర్భంగా వైస్చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడకుండా తమతో కలిసి రావా లన్నారు. పాలకవర్గం ప్రతీవార్డును అభివృద్ధి చే యాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తోందన్నారు. వార్డుల అవసరాల ప్రకారం నిధులు, పనులు కేటా యించామన్నారు. ప్రతిపక్ష సభ్యులు అవగాహన రహిత పనులు చేయవద్దని సూచించారు. తాము అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకుని పాలన సాగి స్తామని, వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన.. పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ.15 కోట్ల పనులకు గతంలోనే చేపట్టిన టెండర్లను ఏకపక్షంగా రద్దు చేసి, మళ్లీ కొత్తగా పనులకు ఆమోదం తెలుపడం అప్రజాస్వామికమని బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. సర్వసభ్య సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆందోళన చేశారు. సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కొత్త పనులపై తీర్మానం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఉనికి చాటుకోవడానికి ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. చైర్పర్సన్, కమిషనర్, డీఈఈ, ముఖ్య అధికారులు లేకుండా మేనేజర్తో వైస్చైర్మన్ ఈ సమావేశం నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిపారు. తమ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశ తీరుపై మేనేజర్ మారుతితో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ తీరుపై అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఇందులో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సాదం అరవింద్, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
వినియోగదారులను మోసం చేయొద్దు
● డీఎల్ఎంవో శంకర్ కుంటాల: దుకాణదారులు వ్యాపారాల్లో విని యోగదారులను మోసం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని డీఎల్ఎంవో శంకర్ హెచ్చరించారు. కుంటాలలో దుకాణాలు, హోటళ్లు, స్వీట్ హౌస్లను గురువారం తనిఖీ చేశారు. దుకాణాల్లో వినియోగించే త్రాసులు, రాళ్లు, ఎలక్టాన్రిక్ యంత్రాలకు ఏటా సీల్ వేయించుకోవాలని సూచించారు. వస్తుపై ఉన్న గరిష్ట ధర కన్నా ఎక్కువకు విక్రయించొద్దన్నారు. వస్తువులపై గడువు ముగిసే తేదీ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో అసిస్టెంట్ అధికారి రాజశేఖర్రెడ్డి, సిబ్బంది రాజ్కుమార్, అయాజ్ఖాన్ పాల్గొన్నారు. -
రాజకీయ ముఖచిత్రంలో మార్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ, లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. దీంతో నాయకులకు అవకాశాలూ రానున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ స్థానాల సంఖ్య పెంచేందుకు పునర్విభజన బిల్లు ఆమోదం కోసం చర్చ జరుగుతోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒకేసారి అటు మహిళా నాయకులకు అవకాశాలు, ఇటు సీట్ల పెంపుతో అందరికీ అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో 50శాతం చొప్పున స్థానాలు పెంచితే రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయి. రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం 17ఉండగా.. కొత్తగా తొమ్మిది పెరిగి ఆ సంఖ్య 26 స్థానాలకు చేరుతుంది. ఇక రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 179 స్థానాలకు పెరుగుతాయనే అంచనా ఉంది. కొత్తగా 60 స్థానాలు పెరగనున్నాయి. 2011 ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనాభా 19 లక్షలు ఉంది. మహిళా జనాభా అధికంగా ఉండడంతో ఇక్కడ సీట్లు సైతం మహిళలకు రిజర్వు కానున్నాయి. ప్రస్తుతం మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులపై పార్లమెంటులో చర్చ కొనసాగుతోంది. ఆమోదం పొందితే మహిళలకు అవకాశాలు కలుగనున్నాయి. పునర్విభజన బిల్లుతో కొత్త స్థానాలు ఏర్పడనున్నాయి. ఎవరికి వారే అంచనాలు ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ ముఖచిత్రమే మారనుంది. ప్రస్తుతం పది అసెంబ్లీ స్థానాలైన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా, లోకసభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే అంచనా ఉంది. మొత్తం స్థానాలు 14లేదా 15కావొచ్చు. ఇక లోకసభ స్థానం కొత్తగా ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో కొత్తగా కనీసం ఐదు నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏ నియోజకవర్గం, ఏ మండలంతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సైతం మారనున్నాయి. మహిళలకు 33శాతం కోటా అమలుతో ఉమ్మడి జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు రిజర్వు కానున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు రానున్నాయి. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, మాజీలు, రాజకీయ ఆశావహులు ఎక్కడ పోటీ చేయాలో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మహిళలకు రిజర్వు చేసిన చోట్ల తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళా నాయకులను ప్రోత్సహించనున్నారు. కొన్ని చోట్ల తమ మండల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. అయితే జిల్లా భౌగోళిక సరిహద్దు, జనాభాను బట్టి ఏ ప్రాంతం కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడుతుందనేది ఇంకా స్పష్టత లేదు. -
ఎండల తీవ్రతపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్వో రాజేందర్ దిలావర్పూర్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అప్రమత్తం చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. మండల దిలావర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఓరల్ డీహైడ్రేషన్ సాల్ట్ ప్యాకెట్లు అందించాలని సూచించారు. వీటిని ప్రతీ ఆశకార్యకర్త వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు హెచ్పీవీ వాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. డిప్యూటీ విస్తరణాధికారి బారె రవీందర్, డీపీవో రాంచందర్, మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్కు వినతిపత్రం
నిర్మల్చైన్గేట్: నిర్మల్ పట్టణాభివృద్ధికి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధులతో చేపట్టనున్న పనుల టెండర్లను నూతన మున్సిపల్ పాలకవర్గం రద్దు చేస్తామంటోందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని కోరు తూ.. బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయన వెంట పట్టణాధ్యక్షుడు సుంకరి సాయి, బీజేపీ కౌన్సిలర్లు శ్రీరామోజు నరేశ్, కూన శశాంక్, ముత్యం, ధర్మాజీగారి ఈశ్వర్, విఠల్, ఖమ్మం సురేందర్ తదితరులున్నారు. -
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
భైంసాటౌన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ భైంసా అధికారి రవి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్ని మాపక సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించా రు. అనంతరం ఫైర్ అధికారి రవి మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 20వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరి గితే వెంటనే అగ్నిమాపకశాఖకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మాక్డ్రిల్ నిర్మల్టౌన్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మా క్ డ్రిల్స్ నిర్వహించారు. నిర్మల్ ఫైర్ స్టేషన్ అధికారి శివాజీ అగ్నిప్రమాదల నివారణపై అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ.. షాపింగ్ మా ల్స్, ఆస్పత్రి, ఫ్యాక్టరీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదం సంభవిస్తే వెంటనే 101, 100 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న శివాజీ -
చిత్తడి నేలల గుర్తింపులో వేగం పెంచాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చిత్తడి నేలల అభివృద్ధి ద్వారా పర్యాటక అవకాశాలు పెరిగి, జిల్లాకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని తెలిపారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పే ర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ నేలలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా చిత్తడి నేలలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో వచ్చే వారంపాటు వేడి గాలుల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలు, ట్రాఫిక్ కూడళ్లు తదితర ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థలు, రెడ్క్రాస్ తదితర సేవా సంస్థలను భాగస్వాములను చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ను అత్యవసరంగా సిద్ధం చేసి అమలు చేయాలని, ప్రదేశాల వారీగా వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ వెబ్సైట్ ద్వారా నిరంతరం పరిశీలించాలని అధికా రులకు ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డీహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మొబైల్ నంబర్ల నవీకరణ తప్పనిసరి రైతుల సంక్షేమానికి మొబైల్ నంబర్ల నవీకరణ ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయశాఖ చేపట్టినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం గ్రామాల వారీగా పట్టాదార్ పాస్బుక్లను వారి ప్రస్తుత మొబైల్ నంబర్లతో అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఎరువుల బుకింగ్ కోసం యాప్ వినియోగం, ప్రభుత్వ రాయితీలు, ఇతర వ్యవసాయ సేవలు పొందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి అని తెలిపారు. రైతులంతా ఏఈవోలను సంప్రదించి పట్టాదార్ పాస్బుక్ వివరాలు, మొబైల్ నంబర్ను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మొబైల్ నంబర్ నమోదు సమయంలో వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయబడుతుందని పేర్కొన్నారు. గతంలో తప్పుగా నమోదైన మొబైల్ నంబర్లను సవరించుకునేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు లేని వారు వెంటనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని, మొబైల్ నంబర్ల అప్డేటింగ్ ప్రక్రియకు ఏప్రిల్ 20వరకు గడువు ఉందని పేర్కొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి
భైంసాటౌన్: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తెలు సుకోవాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన రహదారులు దాటే క్రమంలో జీబ్రా క్రాసింగ్ పాటించాలని సూచించారు. పిల్లలు వాహనాలు నడుపవద్దని, తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించేలా కోరాలని చెప్పారు. విద్యార్థులు అరైవ్–అలైవ్ ఆంగ్ల అక్షరాకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు. అలాగే మానవహారం ఏర్పాటు చేశారు. వీరితో రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. పట్టణ సీఐ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు. -
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం, తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 20నుంచి 27వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 1,035 మంది పదోతరగతి, 821 మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప దోతరగతికి ఐదు, ఇంటర్కు నాలుగు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపా రు. దూరప్రాంత విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా అవసరం మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. డీఈవో భో జన్న, డీఐఈవో పరశురాం, తపాలాశాఖ ఇన్స్పెక్టర్, ఏసీజీఈ పరమేశ్వర్, ఆర్టీసీ, వైద్యశాఖ అధికా రులు రమేశ్, సౌమ్య పాల్గొన్నారు. -
నిర్మల్
సర్కారు ఆణిముత్యాలు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివిన పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో మెరిశారు. రాష్ట్రస్థాయిలో రాణించి ఆదర్శంగా నిలిచారు. నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి వ్యాక్సిన్ తప్పనిసరి భైంసాటౌన్: గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14–15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని డీఎంహెచ్వో రాజేందర్ సూచించారు. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం సందర్శించారు. పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. బాలికలు, వారి తల్లిదండ్రులకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీసీహెచ్ఎస్, భైంసా ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. 14–15 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్వో ఆకాశ్, వైద్యులున్నారు. రెండు వారాల ముందునుంచే..ఉదయం 7నుంచే సూర్యుడు ఎర్రగా మారిపోతున్నాడు. పొద్దున 10 గంటల నుంచే వేడిని పెంచేస్తున్నాడు. అప్పుడే ఇంట్లో, బయట దాదాపు 30–35 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మొదలవుతోంది. మధ్యాహ్నం 12నుంచి 3గంటల దాకా ఎండ తీవ్ర త విపరీతంగా ఉంటోంది. సాయంత్రం ఏడున్నర గంటల దాకా వేడి తగ్గడం లేదు. దీంతో పలు పాఠశాలలు పరీక్షలు వారం ముందే పూర్తిచేసి, 16నుంచే వేసవి సెలవులు ప్రకటించాయి. జిల్లాలో సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉంటా యి. కానీ.. ఏప్రిల్ చివరివారం నుంచి 43–44 డిగ్రీ సెల్సియస్గా నమోదవుతుంటాయి. ఈసారి రెండువారాల ముందు నుంచే ఈస్థాయిలో ఎండ మండిపోతోంది. ప్రస్తుతం 42–43 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. రెండు, మూడురోజు ల్లో 44డిగ్రీ సెల్సియస్కూ చేరుకుంటుందని వాతా వరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎప్పు డో మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడే ఇలా మండిపోతుంటే.. ఇక వచ్చేనెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. పనిచేయని ఫ్యాన్లు ఇళ్లల్లో ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తోంది. రూ.వేలు పెట్టి కూలర్లు, ఏసీలు కొనలేని పేద, మధ్యతరగతివారు వేడికి తట్టుకోలేకపోతున్నారు. చాలామంది అప్పు చేసో, నెలవారీ ఫైనాన్స్ లోనో తీసుకుని కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత కూలర్లను పక్కనపెట్టి ఈఎంఐలలో ఏసీలు తీసుకుంటున్నారు. బైక్, స్కూటీలపై కాకుండా కార్లలో డ్యూటీలకు వెళ్తున్నారు. ఇలా ఎండాకాలం ఖర్చులనూ మండిస్తోందని వాపోతున్నా రు. కాగా, ఎండాకాలంలో ఎండలు దంచి కొడు తుండగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాల ని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే మిన హా ఎండలో తిరగవద్దని చెబుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సీజ న్లో ఎండలో తిరగడం ఏమాత్రం మంచిదికాదు. అ త్యవసరమైతే అది కూడా తగిన జాగ్రత్తలతో బయట కు అడుగుపెట్టాలి. డీహైడ్రేషన్ కాకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ బి.రవి, ఎండీ, నిర్మల్ చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలో ఎట్టిపరిస్థితుల్లో ఆడుకోనివ్వద్దు. తరచూ మంచినీటిని తాగిస్తూ ఉండాలి. వీలైతే ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు తాగించాలి. వడదెబ్బ తగిలి నట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. – డాక్టర్ నాళం స్వప్న, చిన్నపిల్లల వైద్యురాలు, నిర్మల్ ‘బాబోయ్.. ఇదేం ఎండ..! ఇట్ల మండిపోతోంది..’ అంటూ జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలోనే గరిష్ట ఉష్ణోగ్రత 43–44 డిగ్రీల వరకు చేరుకుని పరేషాన్ చేస్తోంది. ఉదయం ఏడింటి నుంచే సూరీడు ఎర్రగా ఎదుగుతూ మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. కాసేపు బయట ఎండలోకి వెళ్లివస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక్కసారిగా నీరసం వచ్చేస్తోంది. ‘అమ్మో.. ఇంకాసేపు ఈ ఎండలో ఉంటే.. ఏమవుతుందో..! అన్న ఫీలింగ్ కలుగుతోంది. చిన్నారులు, పండుటాకులకు ఈ వేడి మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని, కచ్చితంగా వడదెబ్బ నుంచి ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. – నిర్మల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు -
ఆర్టిజన్ల ఆక్రందన!
నిర్మల్చైన్గేట్: విద్యుత్ కార్మికులపై జెన్కో, ఎన్పీడీసీఎల్ సంస్థలు వివక్ష చూపుతున్నాయి. అపరిష్కృత సమస్యలు పట్టించుకోకపోవడంతో కార్మికులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. దీంతో సమ్మె బాట పట్టి న ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వ ర్కర్లు ఆందోళన ఉధృతం చేశారు. విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం నాటి కి ఎనిమిదోరోజుకు చేరింది. వీరి సమ్మె ప్రభావం విద్యుత్ సరఫరాపై పడనుండగా అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థా యి పనులకు సిబ్బంది కొరత ఉంది. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రజలకు కరెంట్ కష్టాలు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజ లకు కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. ఓ వైపు సమ్మె విరమించాలని కార్మికులను ట్రాన్స్కో బెదిరింపులకు పాల్పడుతున్నా వారు ఖాతరు చేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. ఒకే సంస్థ అయినప్ప టికీ రెండు నిబంధనలు అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కనీస ప్రయోజనాలు వర్తించడం లేదు. కన్వర్షన్ అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 170 మంది ఆర్టిజన్ ఉద్యోగులు, 59 మంది అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పని చేస్తున్నారు. వీరంతా డివిజనల్ కార్యాలయాల ఎదుట నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. సమ్మెలో పాల్గొనద్దని హెచ్చరికలు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిన విద్యుత్శాఖ ఉన్నతాధికారులు సమ్మెలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆర్టిజన్ కార్మికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఏకంగా ఎస్మా ప్రయోగిస్తూ కార్మికులకు నోటీసులు పంపించి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ ఎనిమిదోరోజూ ఆర్టిజన్లు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నట్లు, నిరవధిక దీక్ష శిబిరంలో పాల్గొన్నట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. సమ్మెతో సిబ్బంది కొరత ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో సబ్స్టేషన్లలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ దశలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, ఈదురు గాలులు తదితర సమస్యలు ఎదురైతే ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవు. సమ్మె ప్రభావం సంస్థతోపాటు ప్రజలపై చూపనుంది. విధుల్లో జేఎల్ఎంలు, లైన్మెన్లు ఆర్టిజన్ కార్మికుల సమ్మెతో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లకు ఉన్నతాధికారులు డ్యూటీలు వేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ, వ్యవసాయ ఫీడర్లు, గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్ద సమస్యలు వచ్చినా.. కరెంట్ వైర్లు తెగిపడినా అక్కడికి వీళ్లు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. నిజానికి జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లలో 90 శాతం మందికి స్తంభాలు ఎక్కడం రాదని అధికారులు చెబుతున్నారు. ఈ పనులన్నింటినీ లైన్మెన్లు, ఆర్టిజన్ కార్మికులతో చేయించేవారు. వారు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పెరుగుతున్నాయి. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా ఈ నెల కరెంట్ మీటర్ రీడింగ్ పెండింగ్ పడినట్లు కూడా చెబుతున్నారు. -
శభాష్.. పోలీస్ అక్క
నిర్మల్: ‘చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో పురుష పోలీసుల కన్నా మహిళా సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. వారి ఇంటరాగేషన్ చాలా లోతుగా ఉంటుంది. బాధితులకు దగ్గర కావడం, వివరాలు రాబ ట్టడంలో వారిని మించినవారు లేరు. నిర్మల్ జిల్లా మహిళ పోలీసుల పనితీరు భేష్. ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలో ఏడాదిలోనే ఏకంగా జాతీయ స్థాయి ‘స్కోచ్ అవార్డు’ అందుకున్నారు..’ అంటూ పోలీస్ అక్కలతో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి మంగళవారం మాటామంతి నిర్వహించారు. నారీశక్తి, పోలీస్ అక్క, శివంగి తదితర కార్యక్రమాలను ఏడాది కిందట ప్రారంభించామని, వాటి పనితీరు గురించి ఎస్పీ జానకీషర్మిల వివరించారు. కార్యక్రమాల్లో భాగంగా తమ అనుభవాలను మహిళ కానిస్టేబుళ్లు డీజీపీతో పంచుకున్నారు. కేజీబీవీ, గురుకులాల విద్యార్థినులకు గుడ్టచ్, బ్యాడ్టచ్, వుమెన్ ట్రాఫి కింగ్పై అవగాహన కల్పించామన్నారు. బాసర గో దావరి వద్ద పలువురిని కాపాడినట్లు వివరించారు. ఏడాదిలోనే జాతీయ అవార్డు.. నిర్మల్ పోలీసుశాఖ పనితీరు బాగుందని, ప్రధానంగా మహిళా పోలీసులు వివిధ కార్యక్రమాల ద్వారా తమ సత్తాను చాటడంతోపాటు ఏడాదికాలంలోనే జాతీయస్థాయి అవార్డును అందుకోవడం పోలీసుశాఖకే గర్వకారణమని డీజీపీ ప్రశంసించారు. పోలీ స్ అక్కలకు స్కోచ్ అవార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బ్లూకోల్ట్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసి విధుల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. భరోసా కేంద్రం ప్రారంభం.. ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు డీజీపీ పేర్కొన్నారు. నిర్మల్రూరల్ మండలం ఎల్ల పల్లి సమీపంలో నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. కుటుంబ విభేదాలతో విడిపోయి మళ్లీ కలిసిన జంటలకు ప్రోత్సాహకంగా కానుకలు అందించారు. మహిళలు, బాలలపై నేరాలకు వేగవంతమైన స్పందనతోపాటు, బాధితులకు అన్నివిధాలా సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలకు భద్రతను పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్రెడ్డి తె లిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జి ల్లా సోన్ మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ముందుగా డప్పు చప్పుళ్ల మధ్య, ఆదివాసీల గుస్సాడీ నృత్యం చేస్తూ ఘన స్వాగతం పలికారు. రోడ్డు భద్రతపై డీజీపీ మాట్లాడారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనం నడుపొద్దని సూచించారు. ఈ సందర్భంగా ’అరైవ్ అలైవ్’ బ్రోచర్లు ఆవిష్కరించి, గ్రామస్తులు, అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలనిసూచించారు. రోడ్డు ప్రమాదాల్లోనే అధిక మరణాలు.. రాష్ట్రంలో అధిక శాతం మరణాలు రోడ్డు ప్రమాదా ల్లోనే సంభవిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలపై పూర్తి అవగా హన కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించ డం వల్ల కుటుంబాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహ నం నడపడం, మైనర్ డ్రైవింగ్ను ప్రోత్సహించొద్దని సూచించారు. ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, యువకులు, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అధికారులకు ఆదేశించారు. వారోత్సవాలకే పరిమితం కాకూడదు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ’ప్రజా పాలన – ప్రగతి’ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ’అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాలు కేవలం వారోత్సవాలకే పరిమితం కాకుండా, ఎల్లప్పుడూ రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు అందించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. జీవితం అమూల్యమైనది.. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, గ్రామస్తులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవడమే కాకుండా, ఆ విషయాలు ఇతరులకు కూడా తెలియజేయాలని కోరారు. జీవితం అమూల్యమైనది కాబట్టి దానిని కాపాడుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనదారులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడమే ’అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం సోన్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో డీజీపీ పాల్గొన్నారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, డీపీవో శ్రీనివాస్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీపీవో శ్రీనివాస్, ఎంవీఐ మహేందర్, పోలీసు అధికారులు, ఇతర అధికారులు, సర్పంచ్ వనజ పాల్గొన్నారు. -
భానుడి భగభగ
జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. మంగళవారం జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మధ్యాహ్నం బయటకు రావడానికి జనం జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనుల కోసం బయటకు వెళ్లేవారు తలకు క్యాప్లు పెట్టుకుంటున్నారు. కాటన్ దుస్తులు ధరిస్తున్నారు. ఉక్కపోత కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా పనిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ఎండవేడి తాళలేక ఇలా.. -
దేశం గర్వించే మేధావి అంబేడ్కర్
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశం గర్వించే మేధావి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు వివక్షకు గురవుతున్న కాలంలో, సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని ప్రశంసించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. అనంతరం జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కలెక్టర్ అధికారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి దయానంద్, సీపీవో జీవరత్నం, డీఈవో భోజన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆడపిల్ల పేరిట రూ.5 వేలు..
నిర్మల్ రూరల్: ఆడపిల్ల చదువులు, పెళ్లి రోజు రోజుకు భారమవుతున్న నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకు సహాయం చేద్దామని సదుద్దేశంతో నిర్మల్ మండలం అనంతపేట సర్పంచ్ మాదాస్తు సునీత ముందుకు వచ్చారు. గ్రామంలో పుట్టిన ప్రతీ ఆడపిల్ల పేరిట రూ.5 వేలు డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. రెండు శ్రీగంధం మొక్కలు అందిస్తామని తెలిపారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని మంగళవారం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటి నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఓ ఆడబిడ్డకు రూ.5 వేలు, రెండు శ్రీగంధం మొక్కలు అందించారు. -
అక్రమ పొత్తు దాచిపెట్టి బీజేపీ ప్రగల్బాలా?
ఖానాపూర్: బీఆర్ఎస్తో అక్రమ పొత్తుతో మున్సిపల్ పీఠం దక్కించుకున్న బీజేపీ అసలు విషయాన్ని దాచిపెట్టి, రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్లో మంగళవారం మాట్లాడారు. ఇక్కడేదో గొప్ప సాధించినట్లు ఖానాపూర్ సెగ ముఖ్యమంత్రికి తగలాలని చెప్పడం అవివేకమన్నారు. నిజానికి రాష్ట్రంలోని బీజేపీ నాయకులకే ‘‘బొజ్జు సెగ’’ గట్టిగా తగిలిందని వ్యాఖ్యానించారు. ఖానాపూర్ బీజేపీ–బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘‘లవ్ జిహాద్’’ బయటపడిందని ఆరోపించారు. సోమవారం ఖానాపూర్కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీ గెడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ చేసిన ఆరోపణలను ఖండించారు. పట్టణ ప్రజలు మూడు పార్టీలను సమానంగా ఆదరిస్తే, అక్రమ పొత్తుతో చైర్మన్ పదవి దక్కించుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ–బీఆర్ఎస్ మధ్య ఉన్న అక్రమ పొత్తుతోనే చైర్మన్ పీఠం దక్కిందని, ఈ విషయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ పాత్రపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒకలా, తరువాత మరోలా వ్యవహరిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.రెండు కోట్లకు అమ్ముడై మత రాజకీయాలకు సహకరించారని విమర్శించారు. ఖానాపూర్లో ఈ రెండు పార్టీలు కలిసి మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, హిందూ–ముస్లిం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ఆపాలని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పట్టణంలో అమలు చేయిస్తామని తప్పుడు హామీలు ఇచ్చారని, పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, ఆత్మ చైర్మన్ గాడ్పు సత్యం, డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నం సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్, సర్పంచుల ఫోరం మండ ల అధ్యక్షుడు గుగ్లావత్ రాజేందర్నాయక్, కౌన్సి లర్లు, నాయకులు నిమ్మల రమేశ్, గొర్రె గంగా ధర్, జంగిలి శంకర్, జన్నారపు శంకర్, చింతల మల్లేశ్, కిశోర్నాయక్, స్వప్నిల్రెడ్డి, రాజేశ్వర్, శేషాద్రి, ధర్మరాజు, రాజేశ్వర్, మల్లేశ్, శ్రీహరి పాల్గొన్నారు. -
హెచ్పీవీకి దూరం!
నిర్మల్చైన్గేట్: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్)క్యాన్సర్ను నిరోధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీలో జిల్లా వెనుకంజలో ఉంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14–15 ఏళ్ల మధ్య బాలికలకు టీకాలు వేస్తున్నారు. తొలి విడతలో భాగంగా జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు సీహెచ్సీలలో ప్రారంభించారు. రెండో విడతకింద గత నెల 30న జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదలు పెట్టారు. జిల్లాలో 7,684 మంది కిశోర బాలికలు.. జిల్లాలో 7,684 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమం అంచనా మేరకు విజయవంతం కావడం లేదు. మూడు నెలలపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 300 మంది బాలికలు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రారంభంలో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం పండుగలు, పరీక్షల నేపథ్యంలో వెనుకబడింది. ఇంకా రెండు నెలల్లో 7 వేల మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. పరీక్షల నేపథ్యంలో వెనుకంజ.. 14–15 ఏళ్ల బాలికల్లో అత్యధికులు ప్రస్తుతం 9, 10వ తరగతులకు చెందినవారే. పది పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులకు సైతం పాఠశాలల్లో ఎస్ఏ–2 ప్రారంభంకావడంతో పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నేపథ్యంలో టీకా తీసుకుంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు రావొచ్చని చాలా మంది బాలికలు వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు కూడా పాఠశాలలు, కేజీబీవీల్లో అవగాహన కల్పిస్తున్నా స్పందన తక్కువగానే ఉంది. టీకా ప్రాముఖ్యత ఇదే.. హెచ్పీవీ అంటువ్యాధి కారణంగా ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ కణజాలం సహా ఇతర యోనిరహిత కణజాలాల వద్ద క్యాన్సర్కు అడ్డుకట్ట వేస్తుంది. క్యాన్సర్ను నివారించేందుకు ఈ టీకా ముందస్తుగా వేస్తారు. వ్యాక్సిన్ వైరస్ రాక ముందే అందించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే కేంద్రం 14 నుంచి15 సంవత్సరాల బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా తీసుకోవచ్చు. హెచ్పీవీ టీకా పక్కనే క్యాన్సర్ను ప్రథమ దశలోనే కనుక్కునేందుకు చేసే పాప్ స్మెర్ పరీక్షలు వంటి ఇతర నివారణ చర్యలతో మహిళల ఆరోగ్య రక్షణను బలోపేతం చేస్తుంది. వ్యాక్సిన్తో ఉపయోగాలు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్లను ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడపిల్ల ల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకముందే టీకా తీసుకోవడంతో సంబంధిత క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది. సుమారు రూ.5 వేల ఖరీదు ఉండే ఈ టీకాను భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా పంపిణీ చేస్తోంది. -
ఘనంగా విషూపూజ
నిర్మల్: అయ్యప్ప శరణుఘోషతో జిల్లా కేంద్రం మార్మోగింది. అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌక్లో 16వసారి విషూ మహాపడిపూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన భార్గవ గురుస్వామి ఆధ్వర్యంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పూజ, భజన బృందాల కార్యక్రమాలు కొనసాగాయి. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు బద్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కనపర్తి విఘ్నేశ్, కోశాధికారి కుంటాల సాయినాథ్ తదితరులు ఏర్పాట్లు చేశారు. విషూ పూజలకు హాజరైన భక్తులు -
ట్రాఫిక్ ఠాణా కావాలి
● జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ఇబ్బంది నిర్మల్: రెడ్ సిగ్నల్.. కళ్లెదుటే ఎర్రగా కనిపిస్తున్నా.. కనీసం ఆపకుండా అలాగే దూసుకెళ్తున్నారు. ఎదురుగా వాహనాలు వస్తున్నా.. తప్పించుకుంటూ వాటి మధ్యలో నుంచే ప్రమాదకరంగా సిగ్నల్ పంజ్ చేస్తున్నారు. దీంతో కనీసం రోజుకో ప్రమాదం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇరువర్గాల మధ్య గొడవలకూ దారితీస్తున్నాయి. ఇది జిల్లాకేంద్రంలోని వాహనదారుల పరిస్థితి. చాలా చౌరస్తాల్లో సిగ్నల్స్ పేరుకే అన్నట్లుగా మారిపోయాయి. మరోవైపు.. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ఉదయం, సాయంత్ర వేళల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పండుగల సమయాల్లో బస్టాండ్, పాతబస్టాండ్ ఏరియాల్లో గంటలపాటు ఇబ్బందులు తప్పడం లేదు. వీటితోపాటు ఓవర్స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్డ్రైవ్, సైలెన్సర్లు మార్చి నడిపే వారి సంఖ్యా పెరుగుతోంది. ఇవన్నీ రోడ్డుప్రమాదాలకు దారితీస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట పడాలంటే జిల్లాకేంద్రంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఉండాలన్న డిమాండ్ పెరుగుతోంది. ‘అరైవ్.. అలైవ్..’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకు వస్తున్న రాష్ట్ర పోలీస్బాస్, డీజీపీ శివధర్రెడ్డి పలు సమస్యలతో పాటు కొత్త ఠాణాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. చూసేదెవరు.. ఆపేదెవరు? ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఏమవుతుంది..!? సిగ్నల్ జంప్ చేస్తే ఎవరేమంటారు..!? ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎవరు ఆపుతారు..!? ఈ ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో సమాధానాలు లేవు. ఎందుకంటే.. జిల్లాలో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు విభాగం లేదు. సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉండే జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సిబ్బందిలో నుంచే ట్రాఫిక్కు ప్రత్యేకంగా కేటాయించడం లేదని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు.. ప్రత్యేక ఠాణా ఉంటేనే..నిర్మల్తోపాటు ఏర్పడ్డ పలు ఇతర జిల్లాకేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు, లేనిచోట ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. జిల్లాకేంద్రంలో కూడా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలారోజులుగా ఉంది. జిల్లా పోలీసు అధికారులు సైతం గతంలో ప్రతిపాదనలను పంపించారు. ఈనేపథ్యంలో జిల్లాకు వస్తున్న పోలీస్బాస్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్మల్వాసులు కోరుతున్నారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలో శివాజీచౌక్ నుంచి డాక్టర్స్ లైన్ వరకు, మరోవైపు మంజులాపూర్, ఇంకోవైపు కొండాపూర్ వరకు వాహనాలు పెరగడంతోపాటు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ప్రధానంగా శివాజీచౌక్, ఈద్గాం, బస్డిపో దక్షిణముఖ ఆంజనేయ ఆలయం, ఆర్డీవో ఆఫీస్, జయశంకర్సార్ చౌరస్తా, వివేకానంద చౌక్, బస్టాండ్, అంబేద్కర్చౌరస్తా వాహనాలు ఇష్టారీతిన వెళ్తున్నాయి. నాలుగుచోట్ల సిగ్నల్స్ ఉన్నా.. చాలామంది వాటిని పట్టించుకోకుండానే వెళ్తూ ప్రమాదాలకూ కారణమవుతున్నారు. -
మరింత ప్రాతినిధ్యం
చట్టసభల్లో మహిళలకు నిర్మల్చైన్గేట్: రాబోయే పార్లమెంటు ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‘ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని తెలిపారు. 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని వివరించారు. త్వరలో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాయన్నారు. 2014కు ముందు ప్రభుత్వాలు స్కాములు తప్ప స్కీములు అమలు చేయలేదన్నారు. 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో స్కీములు తప్ప స్కాములు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు అభివృద్ధి ఏమీ చేయడం లేదని ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణను పూర్తిగా దోచుకుందని, కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో పాలన చేస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు తెలంగాణప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల సమస్యపై పోరాటం చేయాలని సూచించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ‘‘ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం మనకు మార్గదర్శకమన్నారు. వ్యక్తి నుంచి సమాజం, సమాజం నుంచి దేశం వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ప్రతీ కార్యకర్త పని చేయాలని సూచించారు. అదే భావనతో బూత్స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించడం, సేవాభావంతో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం అవసరమన్నారు. కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ఇన్చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, మేడిసెమ్మే రాజు, కుమ్మరి వెంకటేశ్ జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు -
నియామాలు పాటిస్తే ప్రయాణం సురక్షితం
నిర్మల్టౌన్: వాహనదారులు నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ‘అరైవ్ అలైవ్’ పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్ డిపో నుంచి శివాజీ చౌక్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మె ట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. వాహనాలు నడిపే ముందు కుటుంబాలను గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.నవీన్కుమార్, ఎస్టీ శకుంతల, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
విన్నపాలు.. బుట్టదాఖలు
నేను లోకేశ్వరం మండలం నరసింహనగర్ తండా వాసిని. నా పేరి ట, మా నాన్న పేరిట తలా ఐదెకరాల చొప్పు న భూమి ఉంది. గత ప్రభుత్వం నా ఎకరంనర పట్టా భూమిని లాక్కుని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. ఆ భూమిలో గ్రామ కారోబార్ జాదవ్ మహేందర్ ఇప్పుడు అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపి, ఆ భూమి నాకు ఇప్పించండి. – జాదవ్ కిషన్, నరసింహనగర్ తండా నేను 40 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లాను. నాకు మహాగాంలో 86/ఆ సర్వే నంబర్లో 2.22 గుంటల భూమి ఉండేది. దీనిని కౌలుకి ఇచ్చేవాడిని. రెండు సంవత్సరాల క్రితం మా దూరపు బంధువు నన్ను, నా ముగ్గురు కూతుర్లను బెదిరిస్తూ అక్రమంగా సాగు చేసుకుంటున్నాడు. అధికారులు విచారణ జరిపి నా సాగు భూమికి టైటిల్ బుక్ ఇప్పించాలి. నిర్మల్చైన్గేట్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించడం.. ఆన్లైన్లో నమోదు చేయడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్లు అరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అర్జీలు పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ పదేపదే చెబుతున్నా.. ఆయా శాఖల అధికారులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కలెక్టరేట్కు చేరుకుంటున్న బాధితులు ఉసూరుమంటున్నారు. ప్రతీ వారం 50 నుంచి 70 దరఖాస్తులు వస్తుండగా, ఈ వారం 100కు పైగా అర్జీలు వచ్చాయి. వీటిలో భూ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ.. గ్రామ, మండలస్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు కలెక్టర్కు చెప్పుకుంటే కొలిక్కి వస్తాయని ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిట్టూరుస్తున్నారు. జిల్లాలో కొన్ని ఎకరాల భూములు నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో ఉన్నాయి. బాధిత రైతులు పదే పదే విన్నపాలు ఇస్తున్నా.. జాబితా నుంచి తొలగించడం లేదు. ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చారు.. ఎందుకు తొలగించడం లేదో కూడా చెప్పడం లేదు. మీసేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో, ఆడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతానికిపైగా రిజెక్ట్ చేసి పంపుతున్నారు. కలెక్టరేట్కు వచ్చే బాధితులను పలకరిస్తే వారి బాధలు వర్ణనాతీతం. వినే వారికే కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ అధికారుల మనసు మాత్రం కరగడంలేదు. క్షుణ్ణంగా పరిశీలించాలి.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని, దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మేము నిర్మల్ జిల్లా చిత్రకారుల సంఘం సభ్యులం. జనవరి 14, 15 తేదీల్లో సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని డివైడర్ లకు పెయింటింగ్ వేయించడానికి మున్సిపల్ కమిషనర్ పనిని అప్పగించారు. పని చేసిన వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పాడు. పెయింట్ కొనుగోలు కోసం రూ 2,20,000 ఇచ్చారు. మిగతా బిల్లు నేటికీ ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే కమిషనర్ కాలయాపన చేస్తూ పట్టించుకోవడం లేదు. – నిర్మల్ జిల్లా చిత్రకారుల సంఘం సభ్యులు -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: అర్జీదారుల సమస్యలపై తక్షణం స్పందించాలని ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. సామాన్యులకు అండగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
రోడ్డు భద్రతతో సురక్షిత ప్రయాణం
సారంగపూర్: ప్రజలు రహదారిపై ప్రయాణించి క్షేమంగా ఇళ్లు చేరాలంటే తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల అన్నారు. మండలంలోని ధని గ్రామంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్–అలైవ్పై ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్యం పేపర్లలో, వార్తల్లో రోడ్డు ప్రమాదాల గురించి చదువుతూ, వింటూనే ఉన్నామన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ఒకసారి తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో నడిపే వ్యక్తితోపాటు ఎదురుగా వచ్చేవారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీరోజు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తామని, ప్రతీ వాహన చోదకుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రవాణాశాఖ, పోలీస్శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, ఎస్డీపీవో సాయికిరణ్ ఐపీఎస్, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్హాది, సర్పంచ్ పోతన్న, సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్, తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
నిర్మల్ రూరల్: దాదాపు నెలరోజులపాటు సాగిన పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ముగిశాయి. చివరి రోజు విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. చివరి పరీక్షకు మొత్తం 9,748 మంది విద్యార్థులకు 9,742 మంది హాజరయ్యారు. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13 వరకు జరిగాయి. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో స్పాట్ ప్రక్రియ కొనసాగుతోంది. నెల రోజులు ఒత్తిడితో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో సంతోషంగా గెంతులేశారు. మొత్తంగా, పరీక్షల ముగింపు విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పరీక్ష కేంద్రం ఆవరణలో విద్యార్థుల మాటామంతి.. -
కస్తూరిబా.. సరికొత్త రికార్డు
నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల విద్యార్థినులు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 83.6 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో ఏకంగా 96.8 శాతం మంది పాసయ్యారు. జిల్లాలోని 16 మండల కేంద్రాల్లోని కేజీబీవీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు నిర్వహించారు. 12 చోట్ల ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన బోధన, రెసిడెన్షియల్ వసతి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈసారి అద్భుత ఫలితాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. మెరిసిన గ్రామీణ బాలికలు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేజీబీవీ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 936 మంది పరీక్షలు రాయగా, 783 మంది(83.6%) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 660 మంది విద్యార్థులకు గాను 639 మంది (96.8%) పాసయ్యారు. మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం ఏటా పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చెందిన బాలికలే ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. వారికి కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ వసతి, పాఠ్యపుస్తకాలు, భోజనం, కాస్మెటిక్ వస్తువులు అందిస్తున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు పరీక్షల్లో రాణించడం విశేషం. ఆరు కాలేజీల్లో 100 శాతం.. జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్లో నర్సాపూర్, లోకేశ్వరం కేజీబీవీలు శత శాతం ఉత్తీర్ణత సాధించాయి. సెకండ్ ఇయర్లో దస్తురాబాద్, దిలావర్పూర్, కడెం, మామడ కేజీబీవీల్లో చదువుకున్న విద్యార్థినులందరూ ఉత్తీర్ణులయ్యారు. జిల్లా విద్యార్థినులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.. నర్సాపూర్ కేజీబీవీలో చదువుకున్న కీర్తన బైపీసీ సెకండ్ ఇయర్లో 988 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఫస్ట్ ఇయర్లో నిర్మల్ అర్బన్ కేజీబీవీకి చెందిన లాస్య ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో 496 మార్కులు సాధించింది. అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని కీర్తన 494 మార్కులు సాధించింది. వీరిద్దరూ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు అధ్యాపకులు తెలిపారు. వీరే కాకుండా, ప్రతీ కళాశాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. గ్రామీణ నేపథ్యం ఉన్న బాలికలు ఇలా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం జిల్లాకే గర్వకారణం. ఉత్తమ ప్రతిభకు కారణాలు.. కేజీబీవీల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి పలు కారణాలు ఉన్నాయి. -
జీవితమే శాశ్వతం
పరీక్ష తప్పితే జీవితం లేదనుకోవడం పొరపాటు. తమ పిల్లల పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. మందలింపులు చేపడితే సున్నితమైన మనస్తత్వం ఉన్న వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చాలామంది ప్రసిద్ధ వ్యక్తులు మొదట్లో చదువులు, పరీక్షల్లో విఫలమైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వారి జీవిత గాథలను గుర్తు చేసేందుకు ప్రయత్నించాలి. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే టెలి మానస్ 14416 నంబర్లో సంప్రదించాలి. – డాక్టర్ సునిల్, మానసిక వైద్యనిపుణులు (డీఎంహెచ్పీ) -
● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్ నంబరు 14416లో సంప్రదించవచ్చు
పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్ చెబుతున్నాడు.నిరుత్సాహం దరిచేరనీయొద్దుపరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్నిరాశ వద్దు..ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులుపౌల్ట్రీరంగంలో ఎదిగి.. -
గంగపుత్రులు.. ప్రాణదాతలు
బాసర: బాసర గోదావరి వద్ద భక్తుల భద్రత కోసం దేవస్థానం, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పవిత్ర గోదావరి నదిలో ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా శనివారం వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు పుణ్యస్నానం చేస్తుండగా నీటిలో మునిగిపోయారు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానిక గంగపుత్రుడు డప్పు నరేష్ చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరినీ ప్రాణాపాయం నుంచి కాపాడారు. గంగపుత్రుల సాహసం.. వరంగల్ జిల్లా నుంచి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం బాసర వచ్చిన ఇద్దరు భక్తులు, గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లిపోయారు. వెంటనే గమనించిన స్థానిక జాలరి తన ప్రాణాలను పణంగా పెట్టి నీటిలో దూకి, ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నీటి ప్రవాహం, లోతు గురించి పూర్తి అవగాహన ఉన్న గంగపుత్రులు లేకపోతే, ఈ ప్రమాదం విషాదంగా మారేదని స్థానికులు అంటున్నారు. ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు.. ఇక శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన అశ్విని అనే మహిళ, తన ముగ్గురు కుమారులతో కలిసి నదిలోకి దూకేందుకు ప్రయత్నిం చేసిది. అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు, నది ఒడ్డున అదనపు భద్రతా సిబ్బంది అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఉపాధి లేని గంగపుత్రులు గతంలో గోదావరిలో నాటుపడవలు నడుపుతూ గంగపుత్రులు ఉపాధి పొందేవారు. నది ఒడ్డునుంచి మధ్యలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులను చేర్చడం వీరి ప్రధాన వృత్తి. అయితే, రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు నాటు పడవ ప్రమాదంలో మృతిచెందడంతో, అధికారులు పడవలను పూర్తిగా నిషేధించారు. దీంతో గంగపుత్రుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం కొందరు చేపలు పట్టుకుంటూ, నది గట్టు వెంబడి తిరుగుతూ కష్టంగా జీవనం సాగిస్తున్నారు. నదీ ప్రవాహం వారికే ఎరుక.. స్థానిక గంగపుత్రులు గోదావరిని నమ్ముకున్నా రు. నది ప్రవాహ ఉధృతి, ఎత్తు పల్లాలు, లోతు, సుడుల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంది. దీంతో నదిలో ఎవరైనా మునిగిపోయినప్పుడు అందుబాటులో ఉన్నవారు సత్వరం స్పందిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు పోలీ సులు కూడా స్థానిక గంగపుత్రులను పిలిపించి గాలిస్తున్నారు. ‘మాకు నది నీటి ప్రవాహం బాగా తెలుసు. అందుకే వరంగల్ యువకులను కాపాడగలిగాం. కానీ, మా కుటుంబాల పోషణకు మాత్రం ఏమీ లేదు‘ అని గంగపుత్రుడు డప్పు నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమను లైఫ్గార్డులుగా నియమించి ఉపాధి కల్పిస్తే భక్తుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తామంటున్నాడు. పర్యాటక బోటింగ్ సిబ్బందిగా అవకాశం ఇస్తే, భక్తుల ప్రాణాలు కూడా కాపాడుతామని, తమకూ ఉపాధి దొరుకుతుందని గంగపుత్రులు వేడుకుంటున్నారు. పడవల నిషేధంతో.. గోదావరి నదిలో పడవలు నడపడాన్ని రెండేళ్ల క్రితం నిషేధించారు. దీంతో 60 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని స్థితికి చేరుకున్నాం. గోదావరి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమ్మల్ని దేవాదాయ శాఖ లైఫ్గార్డులుగా నియమించి ఉపాధి కల్పించాలి. దీంతో భక్తుల ప్రాణాలకు మేము రక్షణగా ఉంటాం. పర్యాటక బోటు నడిపి ఉద్యోగాలు ఇవ్వాలి. – సాయినాథ్, గంగపుత్రుడుచేపలు పడుతూ ఉపాధి.. మేము ముందుగా గోదావరిలో నాటు పడవలు నడిపి జీవనం సాగించేవాళ్లం. కానీ ప్రమాదాల కారణంగా ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఇప్పుడు చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నాం. మేము ఎప్పుడూ నది దగ్గరే ఉండడం వల్ల, ఎవరైనా ప్రమాదంలో పడితే వెంటనే గమనించి కాపాడగలుగుతున్నాం. ఈరోజు వరంగల్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులను ప్రాణాలతో కాపాడాం. సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పడవలు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి. – డప్పు నరేశ్, గంగపుత్రుడు -
కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న విక్రయించాలి
● రేపటి నుంచి నిర్మల్, సారంగపూర్లో కొనుగోళ్లు ● మార్కెట్ కమిటీల చైర్మన్లు భీమ్రెడ్డి, అబ్దుల్ హాదీ నిర్మల్చైన్గేట్/సారంగాపూర్: రబీ సీజన్లో రై తులు పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ సూచించారు. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో రైతులకు శనివారం టోకెన్లు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యా ర్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు రూ.2,400 మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగో లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ధూ మ్డా నాయక్, నాయకులు భూమారెడ్డి, పోతా రెడ్డి, రమేశ్, సాయన్న, రైతులు పాల్గొన్నారు. -
ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తా
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా తొలిసారి మహిళకు అవకాశం దక్కింది. 50 రోజుల తర్వాత పాలకవర్గం కొలువుదీరింది. అనూహ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పాలకవర్గం ఏర్పాటు చేశాయి. చైర్పర్సన్గా 9వ వార్డు కౌన్సిలర్ అంకం మౌనికను ఎన్నుకున్నారు. సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. ప్రజలు, పార్టీల సహకారంతో ఖానాపూర్కు ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తానని తెలిపారు. సాక్షి : మేడం కంగ్రాట్స్.. తొలి చైర్పర్సన్గా ఎలా అవకాశం వచ్చింది? చైర్పర్సన్ : ధన్యవాదాలు.. నేను 15 ఏళ్ల క్రితం బీజేపీలో చేరాను. నా భర్త మహేందర్ ప్రోత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రజాసమస్యలపై పోరాటాలు చేశా. దీనిని గుర్తించిన అధిష్టానం నాకు ఈసారి కౌన్సిలర్గా పోటీచేసే అవకాశం కల్పించింది. 9వ వార్డు నుంచి పోటీచేశా. ప్రజలు ఆదరించి గెలిపించారు. అనూహ్యంగా నాకు చైర్పర్సన్ అవకాశం రావడం గొప్ప గౌరవం. ఇది పట్టణ ప్రజల విజయం, సాక్షి : మీ విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం? చైర్పర్సన్ : నేను బీఎస్సీ ఎంపీసీ చదివాను. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయంగా కుటుంబం నుంచి నాకు మద్దతు ఉంది. అందుకే రాజకీయాల్లో రాణిస్తున్నా. నా భర్త 2019 మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీచేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఖానాపూర్ నియోజవర్గ కన్వీనర్గా ఉన్నారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రోత్సాహం, ప్రజల ఆదరణతో గెలిచాను. సాక్షి : చైర్సర్సన్గా మీ ప్రాధాన్యతలు ఏమిటి? చైర్పర్సన్ : ఖానాపూర్ పట్టణాన్ని ఉత్తమ ుున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరిస్తా. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తా. ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పిస్తాం. మెరుగైన విద్య, వైద్యం అందేలా చూస్తా. సాక్షి : పట్టణ అభివృద్ధికి మీ ప్రణాళిక ఏమిటి? చైర్పర్సన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తాం. పాలకవర్గ సభ్యులు, ప్రజలు, మేధావుల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అన్ని పార్టీలను కలుపుకుని పనిచేస్తాం. పట్టణాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు స్వీకరిస్తాం. సాక్షి : పట్టణంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమిటి? చైర్పర్సన్ : పట్టణంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తొలి సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారంపై చర్చిస్తాం. సభ్యుల సూచనల తర్వాత తరలించే కార్యక్రమం చేపడతాం. ప్రధాన సమస్యగా మారిన రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల సహాయం తీసుకుంటాం. బొడ్డోని కుంటలో డ్రెయినేజీ నీరు కలుస్తుంది. మురుగు నీరు చేరకుండా చూస్తాం. మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తాం. సాక్షి : డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తారా? చైర్పర్సన్ : ఈ సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉంది. గతంలోను తాము అర్హుల పక్షాన ఆందోళనలు చేశాం. అనర్హులను తొలగించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. డబుల్ బెడ్రూం కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తాను. అనర్హులను తొలగించిన వెంటనే అర్హులైన వారికి పట్టాలు ఇస్తాం. సాక్షి : నూతన మున్సిపల్ భవనం నిర్మించే ఆలోచన ఉందా? చైర్పర్సన్ : మున్సిపల్ కార్యాలయం పరిధిలో సుమారు 80 మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నారు. కార్యాలయం ఇరుకుగా ఉండడంతో ప్రతీరోజు కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. పాలకవర్గ సభ్యులతో చర్చించి నూతన మున్సిపల్ భవన నిర్మాణం చేపడతాం. సిబ్బంది కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. సాక్షి : తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చైర్పర్సన్ : రూ.22 కోట్ల కేంద్ర నిధులతో జరుగుతున్న అమృత్–2 పథకం పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూస్తాం. సాక్షి : శివారు కాలనీల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారు? చైర్పర్సన్ : శివారు కాలనీలు అయిన గాంధీనగర్, అంబేద్కర్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వాగుపై వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాం. అలాగే ప్రధాన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజీలు నిర్మిస్తాం. తాగునీరు అందేలా చూస్తాం. -
మక్కలు కొనాలని వినతి
కుంటాల: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు జీవీ.రమణారావు, కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్ మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డిని కో రారు. హైదరాబాద్లో శనివారం కలిసి వినతి పత్రం అందించారు. పంట చేతికొచ్చి 15 రోజు లైనా కొనుగోళ్లు ప్రారంభించలేదని తెలిపారు. అకాల వర్షాల కారణంగా రైతులు చేతికి వచ్చిన పంట నష్టపోతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఎండీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. -
పూలే మార్గంలో నడవాలి
నిర్మల్చైన్గేట్: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే చూపిన మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్డీవో రత్నకళ్యాణి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పూలే జయంతి వేడుకలు శని వారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపూలే అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శా ఖ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో..బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆ ధ్వర్యంలో డాక్టర్ రెవెల్లి అజయ్ అధ్యక్షతన మహా త్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, డీన్ విఠల్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని పూలేకు నివాళులర్పించారు. అణగారినవర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం పూలే చేసిన విశేష కృషిని వీసీ, డీన్ కొనియాడారు. అందరికీ విద్య అందాలన్న పూలే ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. -
ఘనంగా హోమియో దినోత్సవం
నిర్మల్చైన్గేట్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్లో ప్రపంచ హోమియో దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉదయం 6 గంటలకు యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ఆయుర్వేద యునాని హోమియోలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి అవసరమైనవారకి ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ నారాయణ, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేందర్, హోమియో వైద్యులు డాక్టర్ రాంప్రసాద్, సంతోషి, తిరుమల, ఆయుర్వేద వైద్యులు స్వప్న, వైష్ణవి, శ్వేత, మనీష, యునానీ వైద్యులు నిలోఫర్ అంజుమ్, డిస్ట్రిక్ ప్రోగ్రాం మేనేజర్ శ్రావణ్, ఫార్మసిస్టులు నర్సారెడ్డి, ప్రకాశ్, రమణ, వెంకటేశ్, విజయ్ ఆయుష్ సిబ్బంది, యోగా శిక్షకులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి
పెంబి: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మండలంలోని మందపల్లి గ్రామంలో కొత్త చెరువు ప్రాంతంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కూలీల ఫొటోలు అప్లోడ్ చేయడంలో పెంబి మండలం వెనుకబడి ఉందని, త్వరత్వరగా కూలీల ఫొటోలు అప్లోడ్ చేయాలని ఏపీవో ఎఫ్ఏలకు సూచించారు. అనంతరం మండల కేంద్రానికి వెళ్లారు. ఇటీవల భారత్ గౌరవ్రత్న శ్రీ సమ్మాన్ అవార్డ్ అందుకున్న డీఆర్డీవోను ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వప్నీల్రెడ్డి, నాయకులు శంకర్, భూమేశ్ సత్కరించారు. కార్యాక్రమంలో మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత, ఏపీవో రాజశేఖర్, ఎఫ్ఏలు భూమన్న, గోపి, నాయకులు రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
‘కాకతీయ’.. ఎన్నాళ్లీ పాతకథ..!?
కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికీ కాకమ్మ కథలు చెబుతోంది.. అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ నిర్మల్లో పీజీకాలేజీ కొనసాగుతోందని చెబుతోంది. కాకతీయ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల(పీజీ సెంటర్) అక్టోబర్ 1991లో స్థాపించబడింది. ఈ కళాశాల సోషియాలజీలో ఎం.ఫిల్తోపాటు ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, పీజీ డీసీఏ సబ్జెక్టులలో పీజీ కోర్సులు అందిస్తున్నట్లు ఇందులో పేర్కొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ మ్యూజియంను బలోపేతం చేయడానికి ఐటీడీఏ, డీఆర్డీఏ, జిల్లా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపింది. విశాలమైన కళాశాల భవనంలో తరగతి గదులు, రెండు సెమినార్ హాళ్లు, లైబ్రరీ, కంప్యూటర్ ప్రయోగశాల ఉన్నట్లు పేర్కొనడం విడ్డూరం. ప్రత్యేక భవనంలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నట్లు తెలుపడం మరింత హాస్యాస్పదం. అధికారిక వెబ్సైట్లో ఉన్నవన్నీ.. ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు భవనం తప్ప.. ఏవీ లేవు. ఆ భవనాన్ని నర్సింగ్ కాలేజీకి ఇచ్చారు. ఇక నిర్మల్ పేరు మీద కొనసాగుతున్న పీజీ కోర్సులకు ఎక్కడ క్లాసులు చెబుతున్నారో ‘కాకతీయ’కే తెలియాలి. -
అవగాహన లేకుండా వ్యతిరేకిస్తున్నారు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్మల్ టౌన్: బీజేపీ నాయకులు నిర్మల్ పట్టణంపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికా దని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని తప్పు పట్టారు. తమ ఉనికి కాపాడుకునేందుకే ధర్నా చేశారని విమర్శించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేటాయించిన రూ.15 కోట్ల ప్రత్యేక నిధులపై బీజేపీ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ నిధులు ఎమ్మెల్యే చొరవతో మంజూరు కాలేదని, అన్ని మున్సిపాలిటీలకు కేటాయించారని తెలిపా రు. గతంలో వార్డుల సమస్యలపై అవగాహన లేకుండా కేటాయించారన్నారు. అందుకే ఆ టెండర్లను రద్దుచేసి, వార్డు అవసరాన్ని బట్టి కేటాయించా లని పాలకవర్గం నిర్ణయించిందని తెలిపారు. అమృత్–2లో నిర్మల్కు నిధులు కేటాయించడంలోనూ ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నారు. లక్షకు పైగా జనా భా ఉన్న వాటిని అమృత్–1లో, 90 వేల జనాభా ఉన్న అన్ని మున్సిపాలిటీలను అమృత్–2లో కేంద్రం గుర్తించిందని తెలిపారు. నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచాలనే లక్ష్యంతో కొత్తపాలకవర్గం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్, చెనిగారపు నరేశ్, గోపు గోపి, ఎస్పీ.రాజు, లక్కాకుల హరీశ్, నాయకులు రాఘవేంద్రచారి, అడప పోశెట్టి పాల్గొన్నారు. -
టీటీసీడీఏ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అరవింద్
నిర్మల్చైన్గేట్: ది తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జిల్లా కేంద్రానికి చెందిన సాదం అరవింద్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని కెమిస్ట్ భవన్లో ఆయనను సత్కరించి ధ్రువీకరణ పత్రం, మెమొంటో అందించారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ టీటీసీడీఏ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కడంతో బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. కెమిస్ట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీటీసీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన సలహాదారు జనార్దన్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. -
ఉల్లాస్తో అక్షర వెలుగు
లక్ష్మణచాంద: గ్రామీణ ప్రాంత మహిళల్లో అక్షరాస్య త పెంపు లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ, వయోజన విద్యాశాఖలు సంయుక్తంగా ’ఉల్లాస్’ (అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ULLAS) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులుగా ఉన్న స్వయంసహాయక సంఘాల(డ్వాక్రా) మహిళలను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచే ఈ ’ఉల్లాస్’ కార్యక్రమం గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వయసుతో సంబంధం లేకుండా చదువు నేర్చుకునే ఈ మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల పరీక్షలుజిల్లాలోని 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 18,339 మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి పాఠాలు బోధించారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలు నేర్చుకున్న పాఠ్యాంశాలపై మార్చి 29న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 17,824 మంది మహిళలు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 54 మార్కులు వస్తే పాస్..ఉల్లాస్ పరీక్షలో ప్రధానంగా మూడు సబ్జెక్టులకు 150 మార్కుల పేపర్ను రూపొందించారు. చదవడం 50 మార్కులు, రాయడం 50 మార్కులు, గణితం 50 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 150 మార్కులకు కనీసం 54 మార్కులు సాధిస్తే ఆ మహిళలు ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఈ సరళమైన అర్హత ప్రమాణం ద్వారా ఎక్కువ మంది మహిళలు విజయం సాధించే అవకాశం ఉంది. ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యాలుఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు కేవలం అక్షరాస్యులుగా మారడమే కాకుండా, ఆర్థికంగా, సామాజికంగా కూడా సాధికారత సాధించే అవకాశం కలుగుతుంది. అక్షరాస్యత సాధించడం ద్వారా బ్యాంకు లావాదేవీలు స్వయంగా నిర్వహించగలుగుతారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పొందుతారు. కుటుంబ ఆరోగ్య, విద్యా విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. డిజిటల్ సేవలను వినియోగించుకుంటారు. జిల్లా సమాచారం..త్వరలో రెండోదశ.. మొదటి దశ తరగతులు విజయవంతంగా పూర్తి కావడంతోపాటు, పరీక్షలు కూడా స జావుగా నిర్వహించడంతో ఇప్పుడు రెండో దశ తరగతులను మే లేదా జూన్ నెలల్లో ప్రారంభించడానికి అధికారులు చర్యలు చే పడుతున్నారు. తొలి దశ తరగతుల నిర్వహణ సమయంలో పుస్తకాలు ఆలస్యంగా రావ డం, మధ్యలో ఎన్నికలు జరగడం వంటి కా రణాల చేత తరగతులకు కొంత అంతరా యం ఏర్పడింది. అయితే, రెండోదశ తరగతులను మాత్రం పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో శిక్షణ పొందే మహిళలకు సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. ఈమేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని, పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన మంత్రి మొదటి విడతగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్న కొనుగోళ్లు ఎక్కడా ప్రారంభించలేదని, త్వరలోనే నిర్మల్ జిల్లాలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీతో రైతుల పక్షాన మంత్రికి శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలిపారు. -
నిర్మల్
డిగ్రీ పరీక్షల్లో సంస్కరణలుకాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య వెల్లడించారు. మొక్కజొన్న పంట దగ్ధం జిల్లాలోని వివిధ మండలాల్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు భైంసాటౌన్: సాంకేతిక పరిజ్ఞానంతో అంగన్డీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలని ఎ మ్మెల్యే పి.రామారావుపటేల్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్లకు నూతన స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడు తూ.. పోషణ్ అభియాన్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు అందిస్తున్న పోషకాహారం, ఇతర వి వరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ యాప్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం కొత్త మోబై ల్ ఫోన్లు అందించిందన్నారు. కార్యక్రమంలో భైంసా సీడీపీవో సరిత, అంగన్వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.నిర్మల్: వచ్చే విద్యాసంవత్సరం కూడా జిల్లాలో ఉన్నతవిద్య అందని ద్రాక్షే. ఈసారి కూడా పీజీ కోసం పట్నం బాట పట్టాల్సిందే. సీఎం యూనివర్సిటీ ప్రకటించి మూడునెలలవుతున్నా.. జిల్లాలో ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేదు. అసలు.. ఏర్పాటు చేస్తారా, లేదా అనేదానిపైనా స్పష్టత కొరవడింది. జిల్లాకేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ పీజీకాలేజీ కథేంటో, క్లాసులు ఎక్కడ నడుస్తున్నాయో.. ‘వరంగల్’వాళ్లకే తెలియాలి. జిల్లాలో ఏటా కనీసం 4 వేల మంది విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసుకుంటున్నారు. వీరిలో 500లోపు మంది మాత్రమే పీజీ పూర్తిచేస్తున్నారు. వీరు కూడా ఉన్నతవిద్య కోసం హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్వంటి దూరప్రాంతాలకు వెళ్తున్నారు. మిగిలిన విద్యార్థులు డిగ్రీ పాసైనా అందుబాటులో ఉన్నతవిద్య లేక ఇంటివద్దే ఉపాధి, ప్రైవేటు ఉద్యోగాలు చూసుకుంటున్నారు. యూనివర్సిటీ.. స్పష్టత ఏదీ..!? త్వరలోనే బాసర ట్రిపుల్ఐటీలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని జనవరిలో నిర్మల్సభలో సీఎం ప్రకటించారు. మూడు నెలలు కావొస్తున్నా.. ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. పాలకులు, అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రకటనలూ రావడం లేదు. జిల్లా అధికారుల నుంచీ ఎటువంటి చొరవ లేకపోవడం గమనార్హం. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా విశ్వవిద్యాలయం పనులు మొదలవుతాయని విద్యార్థులు, జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఇంటిపట్టునే ఆడపిల్లలు.. రాష్ట్రంలోని చాలా డిగ్రీ కాలేజీల్లోనే పీజీ కోర్సులూ కొనసాగుతున్నాయి. జిల్లాలో ఉన్న పీజీకాలేజీ మూతపడింది. దేశంలోనే పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం జిల్లాకు మాత్రం అన్యాయం చేస్తోంది. దగ్గరలో అంటే నిజామాబాద్, డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. బస్సుల్లో పోయిరావడం ఇబ్బందికరమే. ఈనేపథ్యంలో మంచిమార్కులతో డిగ్రీ పూర్తిచేసినా.. జిల్లాలో చాలామంది ఆడపిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. చదవాలన్న తపన ఉన్నా.. స్థానికంగా ప్రైవేటు ఉపాధి, ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి. తీరని గ్యాస్ కష్టాలు!ఎన్నాళ్లీ.. నిర్లక్ష్యం..!? ప్రజల అమాయకత్వమా..!? నాయకుల అవగాహన లోపమా..!? పాలకుల నిర్లక్ష్యమా..!? అధికారుల పట్టింపులేనితనమా..!? ఏది ఏమైతేనేం.. ఎడ్యుకేషన్ హబ్గా మారాల్సిన జిల్లా.. ఉన్న కాలేజీలు, కోర్సులు పోయి ఖాళీ అవుతోంది. కొత్త యూనివర్సిటీ జిల్లాలో పెడతారా, పక్కనున్న ఆదిలాబాద్కు ఇస్తారా..! ఇప్పటికీ తేలడం లేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు, స్పష్టత తీసుకుందామన్న పట్టింపు ఉన్నవారూ కనిపించడం లేదు. చదువుల తల్లి కొలువైన జిల్లాలో విద్యావ్యవస్థ విషయంలో చిన్నచూపు ఉండటంపై జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. స్థానిక పాలకులు, అధికారులు, అన్నివర్గాల్లో సరైన చైతన్యం లేనికారణంగానే ఈ దుస్థితి ఉందని విద్యావంతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
యూనివర్సిటీ ప్రారంభించాలి..
జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభించాలి. జిల్లా విద్యార్థులకు ఉన్నతవిద్యను అందుబాటులోకి తీసుకురావాలి. – వెంకటేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నిర్మల్పై నిర్లక్ష్యం వీడాలి.. చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో ఉన్న పీజీకాలేజీని దూరం చేశారు. యూనివర్సిటీని ప్రకటించి, ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లాపై చిన్నచూపు చూడొద్దు. –కై రి శశి, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ చదువుకు దూరమవుతున్నారు.. జిల్లాలో ఉన్నతవిద్య అందుబాటులో లేకపోవడంతో చాలామంది డిగ్రీ విద్యార్థులు పైచదువులకు దూరమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థినులకు ఉన్నతవిద్య అందడం లేదు. –కై లాశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇప్పటికై నా దృష్టిపెట్టాలి.. బాసర ట్రిపుల్ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నిర్మల్ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు జిల్లాలో కొత్తకోర్సులు వచ్చేలా దృష్టిపెట్టాలి. – దిగంబర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
● రోడ్డెక్కుతున్న వినియోగదారులు ● ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న జనం ● పట్టించుకోని సివిల్ సప్లయ్ అధికారులు
భైంసాటౌన్: పశ్చిమాసియా యుద్ధం ఆగింది. రెండు వారాల సీజ్ఫైర్ ఒప్పందంతో ఇరువైపులా దాడులు ఆగాయి. యుద్ధం ఆగకముందు నుంచే భారత్కు ఎల్పీజీ నౌకలు వస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తోంది. అయినా నిర్మల్ జిల్లాలో మాత్రం గ్యాస్ కష్టాలు తీరడం లేదు. సరఫరాలో జాప్యమా.. ఏజెన్సీల నిర్లక్ష్యమా తెలియదు కానీ వినియోగదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. సిలిండర్ల కోసం రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓటీపీ వచ్చినా డోర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ వాసులు గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్దకే వెళ్లి సిలిండర్లు తెచ్చుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూరభారంతోపాటు వ్యయభారమవుతోందని చెబుతున్నారు. వంటగ్యాస్ కోసం ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా.. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా నో స్టాక్.. భైంసా పట్టణంలోని మైత్రి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నో స్టాక్ బోర్డు పెట్టి, మూడు రోజులుగా ఏజెన్సీ మూసి ఉంచుతున్నారు. ప్రతీరోజు వినియోగదారులు సిలిండర్ కోసం రావడం, నో స్టాక్ బోర్డు చూసి తిరిగి వెళ్లి పోతున్నారు. శుక్రవారం పట్టణంలోని పార్డి(బి) బైపాస్ రోడ్ సమీపంలో, భైంసా–నిర్మల్ హైవేపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఏజెన్సీ తెరిపించి టోకెన్లు ఇప్పించడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు. పట్టించుకోని అధికారులు.. జిల్లాలో వంటగ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఆందోళన చేసినప్పుడు, మీడియాలో కథనాలు ప్రచురితమైన సందర్భాల్లో నామమాత్రంగా ఏజెన్సీలు సందర్శించి వెళ్లిపోతున్నారు. ఏజెన్సీల్లో నో స్టాక్ అంటూ నే, మరోవైపు బహిరంగంగా వంటగ్యాస్ బ్లాక్లో లభ్యమవుతుండడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు వదులుకుని ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొంటున్నారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా.. గ్యాస్ ఏజెన్సీలు 16 మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,51,785 -
విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి
నిర్మల్టౌన్: విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని షీ టీం పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్, సోషల్ మీడియా వినియోగంపై శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ దాడులు ఎలా జరుగుతున్నాయో, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్లైన్ నంబర్ ఉపయోగించుకోవాలని సూచించారు. -
‘వెయ్యి ఉరులమర్రి’ చరిత్ర భావితరాలకు తెలియాలి
నిర్మల్: ప్రపంచ చరిత్రలోనే ఒకేసారి ఒకేచెట్టుకు వెయ్యిమందిని ఉరితీసిన ఘటన లేదని, స్వతంత్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల గురించి ముందుతరాలకు తెలపాల్సిన బాధ్యత అందరిపై ఉందని డాక్టర్ కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ కావేరి గ్రంథాలయంలో గురువారం రాంజీగోండు స్మారక సమితి, డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాంజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ చక్రధారి మాట్లాడుతూ నిజాం, ఆంగ్లేయుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యిమంది త్యాగాలను భావితరాలకు తెలపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించడంతోపాటు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. ప్రముఖ వైద్యుడు, సాహితీవేత్త డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ వెయ్యిఉరుల మర్రి ఘటన పోరాటాన్ని తొలి తెలంగాణ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించాలన్నారు. సామాజికవేత్త డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ నిర్మల్ చరిత్ర పునర్నిర్మాణం అవసరమన్నారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు అమరుల త్యాగాలను పాట రూపంలో వివరించారు. రాంజీగోండు స్మారకసమితి కన్వీనర్ పోలీస్ భీమేశ్ గతంలో చేసిన వాగ్దానాల మేరకు రాంజీగోండు మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ మాట్లాడుతూ వెయ్యి ఉరులమర్రి ఘటనపై పరిశోధనలు చేసి, పాఠ్యాంశంగా తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ దీపక్, సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కిశోర్, రాజమణి, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. రాంజీ పోరాటం అజరామరంజల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన మహోన్నత పోరాట యోధు డు రాంజీగోండ్ అని, ఆయన పోరాటం అజరామరమని ఆదివాసీ హక్కుల పోరాటసమితి తుడుందెబ్బ, జేఏసీ జిల్లాకమిటీ నాయకులు కీర్తించారు. రాంజీగోండ్ విగ్రహం, వెయ్యిఉరుల మర్రి స్థూపం వద్ద నివాళులర్పించారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ నిర్మల్ గడ్డపై రాంజీగోండు సాగించిన పోరాటం, త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నిర్మల్లో రాంజీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, వెయ్యి ఉరులమర్రి ప్రాంతాన్ని స్మారకకేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమాల్లో జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి తొడుసం గోవర్ధన్, నాయకులు మొసలి చిన్నయ్య, సూరత్ సాయన్న, బోసాని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రాత్మకం రాంజీగోండు బలిదానం
నిర్మల్చైన్గేట్: రాంజీ గోండ్ బలిదానం చరిత్రాత్మకమని నిర్మల్ గడ్డపై పోరాడి ప్రాణత్యాగం చేసిన వెయ్యి మంది వీరులను స్మరించుకోవాల ని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. రాంజీ గోండ్ వర్ధంతి పురస్కరించుకు ని జిల్లా కేంద్రంలోని చైన్గేట్ సమీపంలో ఉన్న రాంజీ గోండు విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఏక కాలంలో ఆంగ్లేయులు, నిజాం పాలకులతో పోరాటం సాగించి, ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని ఈ నేలపై నడిపిన వీరుడు రాంజీగోండు అని అభివర్ణించారు. కా ర్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిసమ్మె రాజు, జిల్లా ఆఫీస్ సెక్రట రీ అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీ క్, సుంకరి సాయి, సీనియర్ నాయకులు అయ్యన్నగారి రాజేందర్, కందుల హరీశ్ పాల్గొన్నారు. -
టెండర్ రద్దు నిర్ణయంపై బీజేపీ నిరసన
నిర్మల్ టౌన్: పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ. 15 కోట్లకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేయడాన్ని నిరసిస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చే ర్చారని గుర్తు చేశారు. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ పథకం కింద మొదటగా రూ.62.50 కోట్లు పట్టణంలో తాగునీటి సౌకర్యానికి మంజూరైనట్లు తెలిపారు. అలాగే మురికి నీటిశుద్ధి కోసం ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.42 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పట్టణ అభివృద్ధికి అత్యవరంగా రూ.50 కోట్లు అవసరమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే రూ.15 కోట్లు మంజూరు చేశారన్నారు. మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధిని అడ్డుకునేలా టెండర్ రద్దు నిర్ణయాన్ని తక్షణ మే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు సాదం అరవింద్, గంజి రాజు, శ్రీరామోజీ నరేశ్, శాంశంక్, ఖమ్మం సురేందర్, జింక సూరి, సాత్విక్, సూరజ్ నాయక్, విఠల్, డా.కృష్ణ మోహన్, ముత్యం, ఈశ్వర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నీళ్లు రాకుండా చూడండి
లక్ష్మణచాంద: వారం పది రోజుల్లో వరి పంటలు కోతకు రానున్నాయని, ఈ సమయంలో నీళ్లు వస్తే కోతలకు ఇబ్బంది అవుతుందని సంఘంపేట్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘంపేట్ చెరువుకు ఎగువన ఉన్న సరస్వతి కాలువకు గండి పడడంతో నీళ్లు చెరువులోకి వస్తున్నాయని రైతులు అంటున్నారు. దీంతో చెరువు పూర్తిగా నిండి మత్తడి పోస్తోందని, ఈ నీరంతా పొలాల్లోకి చేరితే పంటలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం చెరువు అలుగు వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ మధుకర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా సంఘంపేట్ గ్రామ సమీపంలో సరస్వతి కాలువ మత్తడి వద్ద గండి పడిందన్నారు. వడ్యాల్ చెరువులోకి నీటిని నింపడానికి వడ్యాల్ వద్ద సైఫన్ వద్ద గేట్లు పైకి ఎత్తి దిగువకు నీళ్లు వెళ్లేలాగా చర్యలు చేపట్టి సంఘంపేట్ చెరువులోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
డిమాండ్లు నెరవేర్చాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ విద్యుత్ అర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డివిజ న్, సర్కిల్ కార్యాలయంలో చేపట్టిన నిరవది క దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేసి అర్హత ఉన్న కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలన్నారు. అన్ మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని 2016 డిసెంబర్ 4 వరకు విలీనం కానీ కా ర్మికులను విలీనం చేయాలన్నారు. పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. -
అరైవ్ అలైవ్ వీక్ విజయవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా వచ్చే సోమవారం నుంచి ని ర్వహించే అరైవ్ అలైవ్ వీక్ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ వీక్ నిర్వహణపై, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణా లు కోల్పోతున్నారని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ, అధికారులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, రోడ్డు భద్రతపై ప్ర జలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ప్రజా పాల న – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి నిర్వహించే అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 13న గ్రామీణ స్థాయిలో, గ్రామసభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజ ల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వారం రో జులు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో ర్యాలీలు, మండలస్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ అరై వ్ అలైవ్ వీక్ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, డీఎంహెచ్వో రాజేందర్, జెడ్పీ సీఈవో శంకర్, డీసీఎస్వో రాజేందర్, డీపీఆర్వో విష్ణువర్ధన్, అధికారులు పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలినిర్మల్చైన్గేట్: జిల్లాలో పనిచేస్తున్న నామిన ల్ మస్టర్ రోల్(ఎన్ఎంఆర్) కార్మికులకు శ్రమకు తగిన వేతనం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించా రు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్లో, గురువారం, ఎన్ఎంఆర్ వేజెస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా దినసరి కార్మికుల వేతనాల పెంపు గురించి చర్చించారు. 2024 – 25 సంవత్సరానికి 15 శాతం, 2025 – 26 సంవత్సరానికి 10 శాతం, 2026 – 27 సంవత్సరానికి 5 శాతం వేతనాలు పెంచారు. కార్మికుల శ్రమ కు తగిన వేతనం ఇవ్వడం ద్వారా వారిని గౌరవించినవారమవుతామని కలెక్టర్ తెలిపా రు. కార్మికులకు సంబంధిత వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంద ని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగు, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్బీ అధికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ కాజేసిన బీపీఎం
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో పించన్దారుల డబ్బులను బీపీఎం కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మణచాంద బీపీఎం బొందలపాటి ప్రసాద్ మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు చెల్లించేందుకు గత నెల 28 నుంచి పింఛన్దారుల నుంచి ఐరిష్ తీసుకున్నాడు. కానీ ఇందులో కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి మరి కొందరికి ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు ఇస్తానని దాటవేస్తున్నాడని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బయటకు తెలియడంతో...గురువారం పోస్టాపీస్ వద్దకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తమ పింఛన్ డబ్బులు చెల్లించాలని ఆందోళన చేశారు. విషయం సర్పంచ్ కవితకు తెలియడంతో ఆమె పోస్టాపీస్ వద్దకు చేరుకుని బీపీఎంను నిలదీశారు. దీంతో అసలు నిజం బయటపడింది. వెంటనే ఆమె నిర్మల్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ వద్దకు బీపీఎం పింఛన్ డబ్బులు కాజేసిన విషయమై ఫిర్యాదు చేశారు.దీంతో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాపీస్ సందీప్ లక్ష్మణచాందకు చేరుకున్నారు. ఆయన పింఛన్దారులు, గ్రామస్తులతో మాట్లాడారు. పోస్టాఫీస్లో ఉండాల్సిన డబ్బులు రూ.3 లక్షలు ఆఫీస్లో లేవన్నారు. అలాగే పింఛన్దారుల ఐరిష్ తీసుకుని డబ్బులు చెల్లించనట్లుగా తెలిసిందన్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లేక్కతేలని డబ్బులు...లక్ష్మణచాందలో మొత్తం 1,518 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో 1,353 మంది ఐరిష్ తీసుకుని డబ్బులు చెల్లించినట్లుగా ఉంది. 165 మంది పింఛన్ తీసుకోనట్టుగా ఆన్లైన్లో చూపిస్తుంది. దీంతో ఇందులో ఎంత మందికి డబ్బులు చెల్లించాడో ఎన్ని డబ్బులు కాజేశాడో సరైన సమాచారం లేదు. ఆఫీస్ డబ్బులు రూ.3 లక్షలు, 80 మందికి చెందిన పింఛన్ డబ్బులు రూ.1.60 లక్షలతోపాటు సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించిన డబ్బులు ఎన్ని కాజేశాడో తెలియడం లేదు. -
డిజిటల్ అంగన్వాడీలు
లక్ష్మణచాంద: పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఆట పాటలతో కూడిన విద్యను అందించడంతోపాటు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా చేయడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శిశు మరణాల రేటును తగ్గించడంలో అంగన్వాడీ టీచర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కేంద్రాలకు వచ్చే సరుకులు, లబ్ధిదారుల వివరాలు, పౌష్టికాహార పంపిణీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సరైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. పాత ఫోన్లతో సాంకేతిక అవస్థలురాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందజేసింది. అయితే, వాటిలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తాయి. సిగ్నల్స్ అందకపోవడం, డేటా, నెట్వర్క్ సమస్యల కారణంగా ఆన్లైన్ నమోదు పనులు నిలిచిపోయేవి. గతంలో అందించిన ఫోన్లలో అంగన్వాడీ సమాచార నమోదు యాప్లు డౌన్లోడ్ కాకపోవడం మరో సమస్యగా మారింది. బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉండటం, కొద్ది సమయం వినియోగించిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడంతో టీచర్లు వాటిని పక్కన పెట్టి, తమ సొంత ఫోన్లతోనే సమాచారం నమోదు చేస్తూ వస్తున్నారు. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులుజిల్లా పరిధిలో 19 మండలాలు, 400 గ్రామ పంచా యతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పరిధిలో భైంసా, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ ఐసీ డీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 931 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పంపిణీకి సిద్ధంజిల్లాలో మొత్తం 931 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, టీచర్లు పనిచేస్తున్న కేంద్రాలకు మాత్రమే ఈ మొబైల్ ఫోన్లు అందచేయనున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలకు పంపిణీ చేయడం లే దు. ఈ కొత్త ఫోన్లతో యాప్ల వినియోగం సులభతరం కావడంతోపాటు, డేటా నమోదు వేగవంతం కానుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరో గ్య పర్యవేక్షణ మరింత కచ్చితత్వంతో జరగనుంది. త్వరలో పంపిణీ నూతన ఫీచర్లు కలిగిన మొ బైల్ ఫోన్లు అంగన్వాడీ టీ చర్లకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు 881 మొబైల్ ఫోన్లు వచ్చా యి. వాటిని టీచర్లకు త్వరలోనే అందజ్స్తాం. ఈమేరకు చర్యలు చేపడుతున్నాం. – వినూత్న, డీడబ్ల్యూవో జిల్లాకు 881 కొత్త ఫోన్లురాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు నూతన ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. దీంతో నిర్మల్ జిల్లాకు మొత్తం 881 మొబైల్ ఫోన్లు వచ్చినట్లు జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్(డీడబ్ల్యూవో) వినూత్న తెలిపారు. ఇందులో 826 ఫోన్లు టీచర్లకు, ముగ్గురు బ్లాక్ కోఆర్డినేటర్లకు, మిగిలినవి ఐసీడీఎస్ సూపర్వైజర్లకు కేటా యించనున్నారు. -
పార్టీని బలోపేతం చేయాలి
భైంసాటౌన్: నిరంతరం ప్రజాసమస్యలపై ప నిచేస్తూ బూత్స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం గురువారం నిర్వహించారు. ని యోజకవర్గంలోని 4 మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంస్థపై నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణా లు కలిగి ఉండాలన్నారు. భవిష్యత్ రాజకీ య, సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తలు తయారు కావాలని ఈ ప్రశిక్షణ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, అంత్యోదయ సూత్రం, సమాజంలోని చివరి వ్య క్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా పార్టీ కార్యకర్తలు పని చేయాల్సిన అవసరముందన్నా రు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, రవి పాండే, నగర్ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు గాలి రవి, రమేశ్, తాడేవార్ సాయినాథ్, పట్టణ అధ్యక్షుడు రాము పాల్గొన్నారు. -
అధికారికంగా గుర్తించరా?
నిర్మల్మునగ సాగు.. లాభాలు బాగు ఒక్క పంట సాగు చేయడమే కష్టమైన ఈ రోజు ల్లో ఓ రైతు ఏకంగా నాలుగు రకాలు సాగు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. భైంసాలో పోలీస్ ప్రజావాణి భైంసాటౌన్: పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఎస్పీ జానకీ షర్మిల హాజరై భైంసా డివి జన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 13మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కరించా లని సంబంధిత ఎస్హెచ్వోలకు సూచించా రు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏ ర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం పెండింగ్ ఫిర్యాదుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్: తెలంగాణకే తలమానికంగా నిలిచే ఘనమైన చరిత్రను మరుగున పడేస్తున్నారు. ‘గిరి’వీరు ల అసమాన పోరాటాలు, అడవి బిడ్డలు చేసిన ని రూపమాన త్యాగాలను పట్టించుకోవడం లేదు. ని ర్మల్గడ్డపై ఆంగ్లేయ–నైజాం సైన్యాలతో పోరాడిన రాంజీ సహా వెయ్యిమంది అమరవీరులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. కనీసం.. ప్రభుత్వాలు అధికా రికంగా నివాళులు అర్పించకపోవడం దారుణం. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఏం ప్రయోజనం లేదన్న వాదన వస్తోంది. చిన్నచిన్న వాటిని పట్టించుకునే వారికి.. ఇంతటి త్యాగాలచరిత్ర ఎందుకు పట్టడం లేదన్న ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది. ఎందుకు గుర్తించడం లేదు? చిన్నచిన్న ఘటనలు, గల్లీనేతలను గుర్తిస్తూ.. వర్ధంతులు, జయంతులను ఘనంగా నిర్వహిస్తున్న పా లకులు ఇలాంటి అమరవీరులను ఎందుకు గుర్తించడం లేదన్న ప్రశ్న ఏళ్లుగా జిల్లా అడుగుతూనే ఉంది. పేరు కోసం ఉత్సవాలు చేసే అధికారులు ఇంతటి ప్రాణత్యాగాలను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో రాంజీసహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించడం కేవలం ఆదివాసుల పనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాల ని, కనీసం నివాళులర్పించాలని ఆదివాసీ సంఘాలు, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. అధి కారులు, పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. నేడు అమరవీరుల వర్ధంతి రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులు అసువులు బాసిన ఏప్రిల్ 9న ఎవరు వచ్చినా, రాకున్నా.. ఆదివాసులు మాత్రం వారికి నివాళులర్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చైన్గేట్ వద్ద ఉన్న రాంజీగోండు విగ్రహం నుంచి ఎల్లపల్లి దారిలో గల అమరుల స్తూపందాకా సంప్రదాయ వాయిద్యాలతో వెళ్తున్నారు. తమదైన పద్ధతితో ఆ వీరులకు అశ్రునివాళుల ర్పిస్తున్నారు. ఈసారి కూడా అమరవీరుల స్తూపం వద్ద వర్ధంతి కార్యక్రమం ఉంటుందని రాంజీగోండు సేవాసమితి నిర్వహణ కమిటీ చైర్మన్ నైతం భీమ్రావు పేర్కొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ సోయం బాపూరావు వస్తారని, జిల్లావాసులు అధికసంఖ్యలో హాజరై అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు. -
ఐసీడీఎస్లో సిబ్బంది కొరత
భైంసాటౌన్: పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. సరిపడా ఉద్యోగులున్నా పలువురు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లోనూ టీచర్లు, ఆయాల కొరత ఉంది. టీచర్లు లేనిచోట ఆయాలతో నెట్టుకొస్తుండగా, ఇద్దరూ లేనిచోట ఇబ్బందులు నెలకొన్నాయి. భైంసా ఐసీడీఎస్ పరిధిలో భైంసా, కుభీర్, కుంటాల మండలాలున్నాయి. వీటి పరిధిలో 205 అంగన్వా డీ కేంద్రాలుండగా 20 టీచర్ పోస్టులు, 86 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భైంసాలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. సీడీపీవో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తుండగా, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యూటేషన్పై నిర్మల్కు వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్ను ముధోల్ ఐసీడీఎస్ నుంచి డిప్యూటేషన్పై కేటాయించినా, వి ధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. దీంతో ప్రస్తుతం భైంసా ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో, బ్లాక్ కోఆర్డినేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడం, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుచేసే బాధ్య త టీచర్లపై ఉంటుంది. పోస్టులు ఖాళీ ఉండడంతో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. -
వీబీ–జీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలి
లక్ష్మణచాంద: వీబీ జీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బర్కుంట గంగారాం డిమాండ్ చేశారు. సోన్ మండలంలోని కడ్తాల్, సాకెర గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రోజుకు రెండుసార్లు కూలీల ఫొటోలు తీసి అప్లోడ్ చేయడానికి సిగ్నల్స్ రాక అనేక గ్రామాల్లో పనులు చేయలేయలేపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కూలీలకు పిలుపునిచ్చారు. -
తెలంగాణ తొలి స్వాతంత్య్ర పోరాటం!
1857–60 మధ్య జరిగిన రాంజీగోండు పోరాటం, ‘వెయ్యి ఉరులమర్రి ఘటన’లను తెలంగాణ తొలి స్వాతంత్య్ర పోరాటంగా చెప్పుకోవచ్చు. అప్పటి జనగామ (ఆసిఫాబాద్) పాలకుడైన మర్సుకోల రాంజీగోండు తన బలగంతోపాటు తనకు అండగా వచ్చిన రోహిల్లాలను కలుపుకొని పోరాటం చేశాడు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆగడాలపై దాడి చేసేందుకు అక్కడి నుంచి వచ్చాడు. సామాన్య ‘గిరి’పుత్రులతో, సంప్రదాయ ఆయుధాలతోనే ఆంగ్లేయ–నైజాం సేనలను గడగడలాడించాడు. రాంజీసేనను ఓడించేందుకు ఏకంగా బళ్లారి నుంచి అదనపు బలగాలను రప్పించారు. దొంగ దెబ్బతీసి వారిని పట్టుకున్నారు. ఇకముందు తమకు ఎవరూ ఇలా ఎదురు తిరగవద్దన్న ఉద్దేశంతో వారిని దారుణంగా చితకబాది నిర్మల్–ఎల్లపెల్లి దారిలో గల పెద్ద మర్రిచెట్టుకు రాంజీసహా వెయ్యిమంది అనుచరులను ఒకేసారి ఉరితీశారు. ఇంతటి దారుణమైన ఘటన దేశచరిత్రలో ఎక్కడా లేదు. కనీసం పాఠ్యాంశంగానూ పెట్టలేదు. 2021లో కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్మల్కు వచ్చి ఈ వీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. -
‘సాదా’కు సై..
నిర్మల్చైన్గేట్: ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు దీనికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఇటీవల జీవో 76 విడుదల చేసింది. తెల్ల కాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన భూముల క్రమబద్ధీకరణ సాఫీగా జరగనుంది. జిల్లాలో పెండింగ్లో ఉన్న 9,620 దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. దీంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూభారతిలోనూ సమస్య రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన్ 6, రూల్ 6లో నిబంధనలు పొందుపరిచింది. దీని ప్రకారం ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలు పరిశీలించాలి. పీవోటీ, సీలింగ్, ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొనుగోలుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూభారతి చట్టంలోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. అఫిడవిట్ ఒకరు ఇస్తే చాలు భూముల క్రమబద్ధీకరణకు 2014, జూన్ 2కు పూర్వం తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మేందుకు, పంట రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం గత నెల 18న జీవో 76 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించనున్నారు. అభ్యంతరాలు రాకుంటేనే సర్టిఫికెట్ జీవో 76 ప్రకారం భూమి కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్తోపాటు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. అఫిడవిట్ అందించిన తర్వాత 30 రోజులు దరఖాస్తులను పెండింగ్ పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే సర్టిఫికెట్ రద్దు చేస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వెనక్కి ఇవ్వరు. అలాగే, జీవో 77 ప్రకారం సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకునేనాటికి గ్రామీణ ప్రాంతమై ఉండి, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయినా వాటిని పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు మండలం దరఖాస్తుల సంఖ్య బాసర 66 భైంసా 214 దస్తురాబాద్ 849 దిలావర్పూర్ 667 కడెం పెద్దూర్ 1,012 ఖానాపూర్ 386 కుభీర్ 648 కుంటాల 341 లక్ష్మణచాంద 664 లోకేశ్వరం 824 మామడ 1,113 ముధోల్ 755 నర్సాపూర్(జి) 332 నిర్మల్అర్బన్ 48 నిర్మల్రూరల్ 576 పెంబి 73 సారంగపూర్ 647 సోన్ 338 తానూర్ 67 మొత్తం 9,620 ఎలా చేస్తారంటే..? సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీవోల నేతృత్వంలో జరుగుతుంది. 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి 12 ఏళ్లు అనుభవంలో ఉన్నట్లు చూపాలి. 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 మధ్య అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్డీవో క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత హక్కుల రికార్డులో నమోదు చేసి కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు. -
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
భైంసా: నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటనలో జిల్లాకు రెండు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒకటి నిర్మల్ నియోజకవర్గానికి కాగా, మరొకటి ముధోల్ నియోజకవర్గానికి కేటాయించారు. ముధోల్లో కంటి ఆస్పత్రి వద్ద నిర్మల్ నియోజకవర్గంలో సిర్హాపూర్ వద్ద పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒక్కోదానికి రూ.200 కోట్లు ఒక్కోయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒకే క్యాంపస్లో సమీకృత విద్య అందుబాటులోకి తేనుంది. ఆధునిక సదుపాయాలతో కూడిన భవనాలు, డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా వసతులు తదితర సదుపాయాలు కల్పించనుంది. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ పాఠశాలలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవడం, భవిష్యత్లో ఉన్నత విద్యావకాశాలు పొందడం లాంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. స్కూళ్ల ఏర్పాటు నిర్ణయంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్గా దీటుగా.. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఈ స్కూళ్లలో బోధన ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ రూపొందిస్తామని తెలిపింది. 25ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవనాలు నిర్మించి డిజిటల్ విద్య అందించేలా కార్యాచరణ రూపొందించింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్లో విద్యార్థులకు అవసరమయ్యే ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణం తదితర వసతులు ఉండేలా డిజైన్ చేసింది. ఒక్కో లైబ్రరీలో 5వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనుంది. 900 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్హాల్ నిర్మించనుంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతి డార్మెటరీలో 10 బెడ్లు, రెండు బాత్రూమ్లు, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ తదదితర సదుపాయాలు కల్పించనుంది. పేద పిల్లలకు వరం ఈనెల 6న బాసర పర్యటన సందర్భంగా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ముధోల్ నియోజకవర్గంలో కార్పొరేట్ చదువులు అందనున్నాయి. నిరుపేద కుటుంబాల్లోని పిల్ల లకు ఇవి వరంగా మారనున్నాయి. – పవార్ రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
బాసర: బాసరలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్లు, అభివృద్ధి ప నులపై బుధవారం ఆలయ అతిథి గృహంలో రాష్ట్ర చీఫ్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ జోగారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించా రు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రణాళి కాబద్ధంగా, సమయానికి పూర్తయ్యేలా చూడాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, తా గునీరు, పారిశుద్ధ్యం, రవాణా ఏర్పాట్లపై ప్ర త్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచా యతీరాజ్, దేవాదాయ, మిషన్ భగీరథ, సాగునీటి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి ‘క్రిటికల్ కేర్’
నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రజలకు త్వరలోనే క్రిటికల్ కేర్ విభాగం సేవలు అందుబాటులోకి రానున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం జిల్లా జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో చివరిదశలో నిర్మాణంలో ఉన్న అత్యవసర వైద్యసేవల విభాగా న్ని తనిఖీ చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణ మ్యాపులను సంబంధిత అధికారులు కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనుల వివరాలు, పూర్తి కావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్సల గదులు, డ యాలసిస్ కేంద్రం, ఐసీయూ గైనిక్ విభాగం, ఎలక్ట్రికల్ యూనిట్, ఫైర్ సేఫ్టీ విభాగాలు పరిశీలించారు. మిగతా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని సూచించా రు. అనంతరం సమీపంలోని యూడీఐడీ (సదరం) కేంద్రం, డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్లు పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిని తనిఖీ చేసి అత్యవసర వైద్య సేవల విభాగం, రక్త నిల్వల గదిని పరిశీ లించి రిజిస్టర్లు చూశారు. బ్లడ్ బ్యాంక్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రికార్డుల్లో ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం పొందిన వారికి ఫోన్ చేసి వివరాలు సరిపోల్చారు. రికార్డులు, రసీదులు పకడ్బందీగా నిర్వహించాలని, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సీవీ శారద, తహసీల్దార్ రాజు, అధికారులు పాల్గొన్నారు. బస్తీ దవాఖానా తనిఖీ అంతకుముందు పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలోగల బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు సేవా దక్పథంతో వైద్యం అందించాలని, ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, అధికారి సౌమ్య, స్థానిక కౌన్సిలర్ తౌహిదుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
టీచర్ల పారితోషికం ఇప్పించండి
భైంసాటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఉపాధ్యాయులకు గౌరవ పారితోషికం చెల్లించాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు కోరారు. పట్టణంలోని సబ్కలెక్టర్ కా ర్యాలయంలో బుధవారం అజ్మీర సంకేత్కుమార్ను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో వెట్టి చాకి రి చేయిస్తోందన్నారు. పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పారితోషికంతోపాటు కులగణన పారితోషికం సైతం చెల్లించలేదని వాపోయారు. కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్నాయ క్, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మాజీ చందనే, సునీల్, భూక్యా సుభాశ్, మల్లయ్య, సాయిలు, తదితరులు పాల్గొన్నారు. -
టాలెంట్ టెస్ట్లో విద్యార్థి ప్రతిభ
భైంసా రూరల్: గతనెల 22న నిర్మల్లో 4, 5, 6 తరగతుల్లో ప్రవేశానికి పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మండలంలోని వానల్పాడ్ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి ఎస్.రిత్విక్ రాజు ప్రతిభ కనబరిచాడు. ఇందు కు హైదరాబాద్లోని ప్రగతినగర్లో గల పీపు ల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఈ విద్యార్థికి డిగ్రీ వరకు ఉచి త విద్య అందించనుంది. ఈ సందర్భంగా రి త్విక్రాజును బుధవారం సర్పంచ్ నాగలక్ష్మి వి నోద్, ఉప సర్పంచ్ సాయిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు వసంత, ఉపాధ్యాయులు ఎల్లన్న, శ్యామల, కార్యదర్శి గాయత్రి, గ్రామస్తులు గ జేందర్, రాజన్న తదితరులు అభినందించారు. -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు
సారంగపూర్: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ఆస్తపోలు సాయన్న(85) సోమవారం మండలంలోని కౌట్ల(బి)లోని తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. రాత్రి ఆటోలో మహారాష్ట్రకు వెళ్తుండగా రాంసింగ్ తండా వద్దకు చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న ముగ్గురు యువకులు ఆటోకు ఎదురుగా వచ్చారు. గమనించిన డ్రైవర్ ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సాయన్న అక్కడికక్కడే మృతి చెందగా అందులో ఉన్న తిరుపతి, లక్ష్మితో పాటు బైక్ నడుపుతున్న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సంజీవ్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రిపుల్రైడింగ్ చేస్తూ ప్రమాదానికి కారకుడైన సంజీవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
మొక్కజొన్నపంట దగ్ధం
బాసర: మండలంలోని సురెల్లి శివారులో రైతు పట్టేవార్ ఆనంద్కు చెందిన మొక్కజొన్న ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సదరు రైతు అరెకరంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను ఇటీవలే కోసి కుప్పగా వేశాడు. మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పంట దగ్ధమైంది. ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 108 సిబ్బందికి ఉత్తమ పురస్కారంజన్నారం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్నారం 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలట్లు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతీలో ఈఎంటీ కిషన్, పైలట్ రఫీక్ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టియానో, హెల్త్ కమిషనర్ సంగీత చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని జిల్లా ప్రోగ్రాం అధికారి సమ్రాట్, జిల్లా ఈఎంఈ కొండల్రావు అభినందించారు. -
సోమగూడంలో భూ వివాదంపై ఉద్రిక్తత
కాసిపేట: బెల్లంపల్లి మండలంలోని సోమగూడం భరత్కాలనీ, ఆకెనపల్లి శివారులో సర్వే నంబర్ 3లో 2.30 ఎకరాల భూమి స్వాఽధీనానికి కోర్టు ఆదేశాలతో మంగళవారం జేసీబీతో వచ్చిన అధికారులను భూ బాధితులు, స్థానిక నాయకులు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమగూడంలో ఉద్రిక్తత నెలకొంది. రాంకిష్టయ్య కుటుంబ సభ్యులు 2.30 ఎకరాల భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు రాంకిష్టయ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆ భూమిలో పలువురు అనధికారికంగా ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టారు. 13 ఇళ్ల నిర్మాణాలు ఉండగా మిగతా సగం ప్లాట్లుగా మారాయి. కోర్టు తీర్పు ప్రకారం 13 ఇళ్లను సైతం కూల్చివేసి మొత్తం భూమిని స్వాధీనపర్చుకోవాల్సిందిగా పేర్కొంది. గతంలో తీర్పుకు అనుకూలంగా కోర్టును ఆశ్రయించిన యజమానులకు పరిహారం ఇస్తామని బాధితులు తెలపడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వకపోవడంతో యజమానులు మరోసారి కోర్టును ఆశ్రయించగా కూల్చివేసేందుకు పోలీసు సిబ్బందితో యజమానులు జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా స్థానికులు తరలివచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు పైనే బైఠాయించారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య కోర్టు సమీపంలో చర్చలు జరిపి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, కనకరాజు, ఉపసర్పంచ్ విజయ–భూమయ్య పాల్గొన్నారు.


