breaking news
Nirmal
-
ముందస్తు టెండర్లు?
● ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు ● ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో గ్రామసభలు ● తీర్మానాలు సేకరిస్తున్న అధికారులు ● నవంబర్ వరకు గత షాపుల గడువు సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైన్షాపులకు ముందస్తు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో వైన్షాపులు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా పెసా యాక్ట్ ప్రకారం గ్రామసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుకూలంగా తాజాగా ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆ శాఖ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఏజెన్సీ గ్రామాల్లో గ్రామసభల ద్వారా తీర్మానాలు సేకరించి ఈనెల 27వరకు కమిషనర్కు పంపించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వం వైన్షాపులకు ముందస్తు టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు లిక్కర్ వ్యాపారుల్లో చర్చ మొదలైంది. తీర్మానాలు సేకరిస్తున్న అధికారులురెండేళ్ల కిందట అంటే.. 2023 నవంబర్లో బీఆర్ఎస్ హయాంలో వైన్స్లకు సంబంధించి టెండర్లు నిర్వహించారు. వచ్చే నవంబర్లో వాటి కాలపరిమితి ముగియనుంది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ కూడా ఎన్నికలకు ముందే ముందస్తు టెండర్లు నిర్వహించింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా, ఈ టెండర్లు నిర్వహించడం ద్వారా ఔత్సాహికుల్లో లిక్కర్ షాప్ దక్కించుకోవాలనే పోటీ కనిపిస్తుందని, తద్వారా అధిక ఆదాయం లభిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో డీపీఈవోలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో గ్రామసభల ద్వారా అక్కడ వైన్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తీర్మానాలు సేకరించే పనిలో పడ్డారు. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కమిషనర్ ఆఫీస్కు పంపించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంగా దీన్ని పిలుస్తారు. దీని పరిధిలో మొత్తం 192 వైన్స్లున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40, నిర్మల్లో 47, మంచిర్యాలలో 73, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 చొప్పున ఉన్నాయి. ఏటా సుమారు రూ.1,400 కోట్ల డిమాండ్ మేర మద్యం విక్రయాలు జరుగుతాయి. తీర్మానాలు సేకరిస్తున్నాం పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామసభల ద్వారా వైన్షాపులు ఏర్పాటు చేసేందుకు తీర్మానాలు సేకరిస్తున్నాం. ఎకై ్సజ్ టెండర్లను ముందస్తుగా నిర్వహించే విషయంలో మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – హిమశ్రీ, డీపీఈవో -
ప్రకృతి విపత్తులపై అవగాహన
ఖానాపూర్: వర్షాకాలం దృష్ట్యా గోదావరి, వాగుల పరిసరాల్లోని ప్రజలకు ప్రకృతి విపత్తులపై అవగాహన ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. మండలంలోని బాదనకుర్తి గ్రామంలో ప్రకృతి విపత్తులపై గురువారం అవగాహన కల్పించారు. వర్షాలు భారీగా కురిసి వరదలు సంభవించి న సమయంలో ముందస్తు జాగ్రత్తలు తెలియజేశా రు. వరదల నుంచి బయటపడే విధానం ప్రయోగా త్మకంగా వివరించారు. అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికా రి జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్రావు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది వినీత్, నవీన్, సందీప్, సోనూసింగ్, ఓం ప్రకాశ్, జావిద్, హుస్సేన్, మహేందర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పల్లె పోరు’కు సన్నద్ధం
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించడంతో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగే ఈ ఎన్నికల కోసం ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. గడువు ముగిసి ఏడాది దాటినా..2024 జనవరి 31న సర్పంచుల పదవీ కాలం ము గిసింది. జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కా లం ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు సామగ్రి సమకూర్చడం, సిబ్బంది కేటాయింపు, రిజర్వేషన్ల ఖరారు వంటి ఏ ర్పాట్లను చేపడుతోంది. ఓటరు జాబితాలు, బ్యాలె ట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. స్టేషనరీ, ఎన్నికల సామగ్రి జిల్లాలకు చేరాయి. బ్యాలెట్ విధానంలో..స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కల కోసం బ్యాలెట్ పేపర్లు ముద్రించబడ్డాయి, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేయబడి, వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడ్డాయి. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని సమాయత్తం చేయడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు ఇక్కడే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు గుర్తుల ఆధారంగా జరగవు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపబడింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాలో 157 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 65 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయబడుతుంది. మిగతా రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయిస్తారు. -
కురిసింది చినుకులే!
నిర్మల్శ్రావణం.. శుభకరం..! శ్రావణం.. శుభప్రదం.. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో అనేక పండుగలు రానున్నాయి. శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 20258లోu 28న వైద్యుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్మల్చైన్గేట్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపాదికన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మూడు, బస్తీ దవాఖా నాలో రెండు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఈనెల 28న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో రాజేందర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికార కార్యాలయం, ఎఫ్–25, సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తగిన అర్హత పత్రాలతో హాజరు కావాల ని పేర్కొన్నారు. వివరాలకు www.nirm al.telangana.gov.inను సందర్శించాలని సూ చించారు. నిర్మల్: గత నివేదికలతో పోలిస్తే.. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇప్పటిదాకా జిల్లా మొత్తం భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి కనీస ఇన్ఫ్లో లేదు. ప్రతీ సీజన్లో జులై చివరలో, ఆగస్టు మొదట్లోనే జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగైదేళ్లుగా ఈ రెండుమూడు వారాల్లోనే నమోదవుతున్నాయి. దాదా పు 2021నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నెల 26 వరకు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అ వకాశం ఉందని వాతారవణ శాఖ అంచనా వేసింది. కురిసే కాలమిదే..గత ఏడాది మినహా 2021నుంచి వరుసగా జిల్లాలో జులై రెండోవారం నుంచి ఆగస్టు మొదటివారం మధ్యలోనే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ● 2021లో జులై 22, 23 తేదీల్లో జిల్లా వర్షబీభత్సాన్ని చవిచూసింది. దాదాపు 190–200 మి.మీల. వర్షపాతం నమోదైంది. ఎగువన మహారాష్ట్రలో నూ భారీ వర్షాలు కురవడంతో స్వర్ణ, గడ్డెన్నవా గులు ఉప్పొంగాయి. జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్కాలనీని వరద ముంచెత్తింది. భైంసాలోని సుద్ధవాగు శివారు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ● 2022లోనూ జులైలోనే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ ఏడాది జులై 13న కడెం.. గుండెదడ పెట్టించింది. ఏకంగా నాలుగైదు లక్షల క్యూసెక్కులతో ప్రాజెక్టుపై నుంచి మహావరద ఉప్పొంగింది. ● 2023లోనూ జూలై నెలలో భారీ వర్షపాతం నమోదైంది. జులై 26న మరోసారి కడెం ప్రాజెక్టును భారీవరద ముంచెత్తింది. జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపునకు గురైంది. ● 2024లో మాత్రం ఆగస్టు చివరివారం, సెప్టెంబర్ రెండోవారం వరకూ వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గతేడాది సాధారణ వర్షపాతం 1060.7మి.మీ కాగా, ఏకంగా 1297.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇన్ఫ్లోనే లేదు..జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ఈ మూడు నిండాలంటే స్థానికంగా కురిసే వ ర్షాలు సరిపోవు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే ఈ మూడింటిలోకి వరద వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాతోపాటు పైన ఉన్న మహా రాష్ట్రలోనూ భారీవర్షాలు కురవలేదు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి రెండు మూడు రోజులుగా నాలుగైదు వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కానీ.. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి కనీస ఇన్ఫ్లో లేకపోవడం గమనార్హం. ఈనెలాఖరు, వచ్చేనెల మొదటివారంలోపు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు లాభసాటిగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్మల్చైన్గేట్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగుల పరీవా హక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు సూచించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేక సాయం అవసరమైనా నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 91005 77132 ను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి ● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జిల్లాలోని యూడైస్ కలిగిన అన్ని పాఠశాలల్లో పొగాకు రహిత సమాజంపై విద్యార్థులకు పోటీలను నిర్వహించి ఈనెల 31లోపు ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చే యాలని డీఈవో రామారావు సూచించారు. ఈనెల 25న పోస్టర్ మేకింగ్, 26న స్లొగన్స్/ పద్యాలు, 28న ర్యాలీ, 29 వీధి నాటకం అనే నాలుగు అంశాలలో కార్యక్రమాలు నిర్వహించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వివరించా రు. దీనికి సంబంధించిన సమాచారం పోర్టల్లో అందుబాటులో ఉందని తెలిపారు. పొగా కు వాడడంతో కలిగే అనర్థాలు, వ్యాధుల గు రించి ఉపాధ్యాయులు వివరించి, విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వారి ద్వారా తల్లిదండ్రులకు సమాజానికి అ వగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలని సూ చించారు. పోటీ నిర్వహించిన ఫొటోలు వీడియోలు https://innovateindia.myg ov.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ● సామగ్రి సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం ● ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల ఖరారు ● బీసీ రిజర్వేషన్కు ఆమోదం రాగానే షెడ్యూల్ ప్రకటన ● మొదలైన పంచాయతీ, పరిషత్ ఎన్నికల సందడి న్యూస్రీల్‘గడ్డెన్న’కు స్వల్ప ఇన్ఫ్లో భైంసాటౌన్: ఎగువన కురిసిన వర్షాలకు పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువా రం స్వల్ప(324 క్యూసెక్కులు) ఇన్ఫ్లో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 355.80 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.540 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. గతేడాది కురిసింది 493.6సాధారణం కన్నా తక్కువ.. ఈ సీజన్లో జూన్, జులై నెలల్లో సాధారణంగా 404 మి.మీల వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 288.7మి.మీలు మాత్రమే కురిసింది. గతేడాది ఇదే సమయానికి ఏకంగా 493.6మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ఆరంభంలో ఓ మోస్తరు వానలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. కానీ.. ఆతర్వాత నుంచి సరైన వర్షం లేక ఆకాశంవైపు చూడాల్సి వచ్చింది. రెండు రోజుల నుంచి ఓ మోస్తరు కురుస్తున్నా.. ఇప్పటికీ సరైన భారీ వర్షం పడకపోవడంతో రానున్న రోజుల్లో పంటలకు నీరెలా అని రైతులు కలవర పడుతున్నారు. డిగ్రీలో ప్రత్యేక అడ్మిషన్లు భైంసాటౌన్: డిగ్రీలో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు భైంసా జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్ కె.బుచ్చ య్య తెలిపారు. రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ప్రత్యేక అడ్మిషన్ కోసం ఈనెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 31న ప్రత్యేక కేటగిరీ (పీహెచ్/సీఏపీ/ఎన్సీసీ/క్రీడలు,అదనపు పాఠ్యాంశాలు)విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 3న సీట్ల కేటాయింపు, 6 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్, 11, 12 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షపాతం(మిల్లీమీటర్లలో).. ఇప్పటికీ నమోదు కాని భారీ వర్షాలు ఖరీఫ్కు ఈ 20 రోజులే కీలకం.. జిల్లాల్లో నాలుగేళ్లుగా వర్షబీభత్సం ఈసారీ భారీ వర్షాలకు అవకాశం వర్ష సూచన..ఈనెల 23 నుంచి 26 వరకు నిర్మల్ జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ అంచనా వేసింది. జిల్లాలో బుధవారం రాత్రి కొన్నిప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత నుంచి అడపాదడపా చినుకులు పడుతున్నాయే తప్పా భారీ వర్షం కురవడం లేదు. వాతావరణం మబ్బుపట్టి ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందేమోనని ఆశిస్తున్నారు. ఒకవేళ అతిభారీ వర్షాలు కురిస్తే అందుకు తగ్గట్లుగా జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉంది. గత అనుభవాల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలనూ అందుబాటులో ఉంచారు. -
‘పీఎం జన్మన్’ వేగవంతం చేయాలి
● కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూనాయర్ నిర్మల్చైన్గేట్: పీఎం జన్మన్(ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్) కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహా రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూనాయర్ కలెక్టర్లకు సూచించారు. ఢిల్లీ నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధార్ నమోదు, జన్ధన్ ఖాతాలు, పక్కా ఇళ్లు, పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయాలని వివరించారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆది కర్మయోగి కా ర్యక్రమాన్ని క్రమబద్ధంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాల్లో చేపడుతున్న మౌలిక వసతు లు, స్థల సేకరణపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడు తూ పీఎం జన్మన్ కింద చేపట్టాల్సిన అన్ని పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లభించిన గ్రామాల్లో అర్హు ల గుర్తింపు కోసం పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించాలని, సేకరించిన సమాచారం యాప్లో నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్నట్లు తెలి పారు. అంగన్వాడీలు, వసతి గృహాలు, ప్రైమరీ పాఠశాలలు, రోడ్డు కనెక్టివిటీ, మల్టీపర్పస్ సెంటర్లు నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్న ట్లు వివరించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీని వాస్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఎల్డీఎం రామ్గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
జీతాలొస్తలెవ్!
● ఉపాధి ఉద్యోగులకు మూడు నెలలుగా అందని వైనం ● ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చిరు ఉద్యోగులు లక్ష్మణచాంద: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా నిర్వహణకు వివిధ స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు నెలల జీతాలు పెండింగ్..జిల్లాలోని 18 మండలాల్లో ఉపాధి పథకంలో పనిచేస్తున్న 373 మంది సిబ్బందికి మూడు నెలలుగా (ఏప్రిల్, మే, జూన్) వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వీరు కూలీలకు పనులను కేటాయించడం, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం, వేతనాలు సకాలంలో చెల్లేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. వేతన బకాయిలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై చివరి వారానికి వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాలి.. ఉపాదిహామీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. త్వరలోనే నిధులు విడుదలవుతాయి. – నాగవర్ధన్, ఏపీడీ కుటుంబ పోషణకు అప్పులు.. ఉపాధిహామీ పథకంలో ఎఫ్ఏగా పనిచేస్తున్న మాకు గత ఏప్రిల్ నుంచి జీతాలు రావడం లేదు. కుటుంబ పోషణ కోసం ఇతరుల వద్ద అప్పులు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి. – రాములు, ఎఫ్ఏ, వడ్యాల్త్వరగా విడుదల చేయాలి గత మూడు నెలల నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా కుటుంబాలను ఆదుకునేందుకు వేతనాలు విడుదల చేయాలి. – రవిప్రసాద్ ఈసీ, దస్తురాబాద్జిల్లాలో సిబ్బంది వివరాలు..ఏపీవోలు 12 ఈసీలు 5 కంప్యూటర్ ఆపరేటర్లు 38 టెక్నికల్ అసిస్టెంట్లు 72 ఫీల్డ్ అసిస్టెంట్లు 207 ఆఫీస్ సబార్డినేట్లు 18 డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది 21 -
చట్టాలపై అవగాహన ఉండాలి
● జడ్జి రాధికకుభీర్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాధిక అన్నారు. మండలంలోని సాయినగర్(దొడర్నా)లో గురువారం న్యాయసేవా సదస్సు జరిగింది. రాధిక ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. చట్టాలు తెలిసి ఉంటే నేరాలు తగ్గుతాయని అన్నారు. మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. గిరిజన రైతులు నాసిరకమైన విత్తనా లు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. జిల్లాలో 18 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని వాట న్నింటిని పరిశీలించి ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు రిపోర్ట్ చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యంతోపాటు సంక్షేమ పథకాలు అందాలన్నారు. అనంతరం దొడర్నా ఆశ్రమ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల వివరా లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎంపీడీవో సాగర్రెడ్డి, ఏవో సారిక, ప్రభుత్వ వైద్యుడు రాథోడ్ విజయ్, ఎస్సై కృష్ణారెడ్డి, సఖీకేంద్రం ప్రతినిధి స్వేతారాణి, ఏఈవో జగదీశ్, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, రైతులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. -
వనమహోత్సవాన్ని సక్సెస్ చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్మల్చైన్గేట్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వనమహోత్సవం, ఇందిరమ్మ పథకం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనమహోత్సవంలో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో ఈ సంవత్సరం 69.55 లక్షల మొ క్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించినట్లు చె ప్పారు. ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో 44శాతం మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. మరో 15రోజుల్లోపు మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిచేసి జి యోట్యాగ్ చేయాలని సూచించారు. హార్టికల్చర్ మొక్కలు నాటేందుకు వ్యవసాయశాఖ సహకారం తీసుకోవాలని ఎంపీడీవోలకు తెలిపారు. మొక్కలు నాటిన వెంటనే వివరాలు అటవీశాఖ అధికారులకు పంపించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, మార్కౌట్ పూర్తి చే సిన ఇండ్ల పనులు తక్షణమే ప్రారంభించాలని సూ చించారు. ఇసుక కొరత రాకుండా తహసీల్దార్లు తగి న చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే త్వరగా పూర్తి చే యాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అదనపు క లెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీఎఫ్వో నా గిని భాను, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్రెడ్డి, డీ ఈవో రామారావు, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆర్.సుదర్శన్ తదితరులు వీసీలో ద్వారా పాల్గొన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్టౌన్: అర్హులంతా ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధి క సూచించారు. మహాలక్ష్మి పథకం కింద బుధవా రం నాటికి 200కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినందున నిర్మల్ బస్టాండ్లో వేడుకలు నిర్వహించారు. జడ్జి హాజరై మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, డిపో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, అసిస్టెంట్ ఇంజినీర్ నవీన్కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్ రెడ్డి, సిబ్బంది, మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగులకు చట్టాలపై సీనియర్ సివిల్ జడ్జి రాధిక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వం సులభ పరి ష్కార మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ ఆదేశాల మేరకు కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వం గురించి ప్రజలు, కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పింఛన్కు ఫేస్ రికగ్నిషన్
● నేడు హైదరాబాద్లో వర్క్షాప్ ● త్వరలో బీపీఎంలకు సెల్ఫోన్లు ● ఈ నెల నుంచే నూతన విధానంనిర్మల్చైన్గేట్: ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అందజేయనున్నారు. వేలిముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పెన్షన్లు ఇస్తున్న విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించేందుకు సులభంగా పింఛన్ అందజేసేలా ఫేస్ రికగ్నేషన్ విధానం అమలులోకి తెచ్చింది. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఫొటోలు తీసి అప్లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 24న బీపీఎంలకు ఫేస్ రికగ్నిషన్ యాప్ అప్ లోడ్ చేసిన సెల్ఫోన్లు అందజేయనుంది. జూన్కు సంబంధించిన పింఛన్లు ఇంకా ఇవ్వలేదు. ఈనెల 24 తరువాత ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు. వేలిముద్రలతో ఇబ్బందులు పింఛన్ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీస్లకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్ కాకపోవడంతో వారు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరో వైపు ఐరిష్లోనూ ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికా రులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు. జిల్లాలో 1,47,103 మంది పెన్షనర్లు ప్రస్తుతం రాష్ట్రంలో 10 రకాల పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఆయా కేటగిరీల్లో పింఛన్లు పొందే వారు జిల్లా వ్యాప్తంగా 1,47,103 మంది ఉన్నారు. వా రిలో వద్ధాప్య, వితంతు పింఛన్ దారులే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 35,150, వితంతు పింఛన్లు 36,326, వికలాంగుల పింఛన్లు 10,055, ఒంటరి మహిళల పింఛన్లు 2,110 మంది ఉన్నారు. మిగతావారు బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికు లు, హెచ్ఐవీ, పైలేరియా, డయాలసిస్ పేషెంట్లు పింఛన్లు పొందుతున్నారు. అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఆసరా పింఛన్ పొందుతున్న వారిలో కొందరు ఆధార్ కార్డుల్లో వయస్సును దిద్దించారు. తమకు ఎక్కువ వయస్సు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు పొందుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు సిఫారస్ చేసిన వారికీ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాప్ను పకడ్బందీగా రూపొందిస్తే నకిలీ పీఎఫ్ కార్డులతో బీడీ పింఛన్ పొందుతున్న వారి వివరాలు కూడా వెలుగుచూస్తాయి. లబ్ధిదారుల పూర్తి వివరాలు యాప్లో ముందుగా అప్లోడ్ చేస్తే అన్ని వివరాలు తెలిసే అవకాశముంటుంది. వివిధ సమస్యలకు చెక్ బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకువస్తోంది. ప్రభుత్వం అందజేసే సెల్ఫోన్లో బీపీఎంలు పింఛన్దారుల పేర్లు, వివరాలు అప్లోడ్ చేస్తారు. యాప్ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్ చెల్లించినట్లు నమోదు చేసి.. పింఛన్ మొత్తం అందజేస్తారు. ఇక నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వా రికి చివరిరోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్ డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతీ లబ్ధిదారుడికి సులభంగా పింఛన్ అందనుంది.ప్రభుత్వ ఆదేశాల మేరకే.. పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం, శిక్షణ ఉంటుంది. జిల్లా నుంచి ఒక ఎంపీడీవో, డీపీఎం, ఏపీఎంతోపాటు పోస్టల్ సిబ్బంది శిక్షణకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అధికారుల సూచనల ప్రకారం నడుచుకుంటాం. – శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్డీవో -
వైద్యులు సమయపాలన పాటించాలి
నిర్మల్చైన్గేట్: వర్షాల కారణంగా రోగుల సంఖ్య పెరిగే అవకాశముందని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం పట్టణంలోని బంగల్పేట్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగుల నమోదు, రోగనిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. రిజిస్టర్లు పరిశీలించి సమగ్రంగా నిర్వహించాల ని సూచించారు. మందుల గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలు, గడువు తేదీల ను తెలుసుకున్నారు. టీకాల గదిని తనిఖీ చేశారు. పారిశుధ్యం విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ప్రైవేట్’కు దీటుగా అన్ని రకాల వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. డీఎంహెచ్వో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక్కడ కాస్త నయం..
నిర్మల్, ఖానాపూర్తో పోలిస్తే భైంసా పట్టణంలో మొక్కల పెంపకం, నిర్వహణ కాసింత నయమే. డివైడర్ మధ్య మొక్కల పెంపకం బాగానే కొనసాగుతోంది. చెట్లు లేక ప్రకృతివనం, పార్కులు కళావిహీనంగా మారాయి. పనికొచ్చే చెట్లే లేవన్నట్లుగా.. జిల్లాకేంద్రంలో ఎటు చూసినా కోనోకార్పస్ చెట్లనే పెంచారు. వాటితో కలిగే లాభమేంటో ఎవరికీ స్పష్టత లేదు. కానీ నష్టాలపై మాత్రం చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూగర్భ జలాలు, మనిషి ఆరోగ్యానికీ ముప్పుగా ఈ చెట్లను పేర్కొంటున్నారు. కానుగ, కదంబం వంటివి ఉన్నా ఆవైపు ఆలోచన చేయడం లేదు. మొక్కలు నాటడం బాగానే ఉంది. కానీ.. చాలాచోట్ల విద్యుత్లైన్ల కింద నాటుతున్నారు. దీంతో అవి కాస్త పెరిగి పెద్దవి కాగానే కరెంట్ వైర్లకు తాకుతున్నాయి. దీంతో విద్యుత్ సిబ్బంది ఆ చెట్లను మొదటికే కొట్టేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినీనగర్తో పాటు పలు కాలనీల్లో ఇలాగే ఏపుగా పెరిగిన చెట్లను వైర్లకు తాకుతున్నాయంటూ కొట్టేశారు. కొన్నిచోట్ల మళ్లీమళ్లీ అదే పనిచేస్తున్నారు. తాజా సీజన్లోనూ పలుచోట్ల కరెంట్ వైర్ల కిందనే అధికారులు మొక్కలు నాటిస్తుండటం గమనార్హం. పదేపదే అదే తప్పు.. -
భైంసా సబ్ కలెక్టర్గా సంకేత్కుమార్
భైంసాటౌన్: భైంసా సబ్ కలెక్టర్గా అజ్మీరా సంకేత్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భైంసా ఆర్డీవోగా సీహెచ్ కోమల్రెడ్డి ఉండగా, ఆయన స్థానంలో సబ్ కలెక్టర్గా సంకేత్కుమార్ రానున్నారు. సివిల్స్–2022లో రెండో ప్రయత్నంలోనే 35 ర్యాంక్ సా ధించి ఐఏఎస్గా ఎంపికై న సంకేత్కుమార్ది మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామం. గిరిజన కుటుంబానికి చెందిన సంకేత్కుమార్ తండ్రి ప్రేమ్సింగ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా, తల్లి సవిత ఇస్రోలో పనిచేశారు. -
ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు హైదరాబాద్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కష్ణారావును కోరారు. ఈ మేర కు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఇందుకో సం సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో ఫ్యాక్ట రీ నిర్మాణానికి స్థల సేకరణ జరిగిన తర్వాత పరిశ్రమ నిర్మాణం నిలిచిపోయిందని పేర్కొన్నారు. పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతుంద ని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తె లిపారు. పాక్పట్ల గ్రామంలో సేకరించిన స్థ లం పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం కాకుంటే మామడ, నర్సాపూర్ (జి) మండలాల్లో స్థల సే కరణకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పా టు చేయాలని కోరారు. శ్రీహరిరావు వెంట నిర్మల్, భైంసా ఏఎంసీ చైర్మన్లు సోమా భీమ్రెడ్డి, ఆనంద్రావు పాటిల్ ఉన్నారు. మంత్రి జూపల్లికి వినతిపత్రం ఇస్తున్న శ్రీహరిరావు -
హరితం.. అలసత్వం!
● మున్సిపాలిటీల్లో ‘వన’నిరుత్సాహం ● నామమాత్రంగా నాటుతున్న మొక్కలు ● రోడ్ల మధ్య ఇష్టారీతిగా పెరిగిన చెట్లు ● మొక్కల సంరక్షణపై పట్టింపు కరువునిర్మల్: ‘పేరుకు పట్టణాలు. కానీ.. పల్లెలే నయం. మొక్కలు నాటడంలో అలసత్వం. పెరిగే దశలో కాపాడటంలో నిర్లక్ష్యం. చెట్లయిన తర్వాత పట్టింపులేనితనం. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పచ్చదనా న్ని పరిశీలిస్తే.. కనిపించేవి ఇవేగా..’ అంటూ ఆయా పట్టణాలవాసులు నిట్టూరుస్తున్నారు. ఏళ్లుగా ప్రతీ సీజన్లోనూ మొక్కలు నాటుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ సంపూర్ణ పచ్చదనం ఎందుకు లేదు..!? మొక్కలు నాటే ముందే ఏవి పెట్టాలి.. ఏ చెట్లు పెంచితే పర్యావరణానికి, ప్రజలకు మేలు చేస్తాయని ఎందుకు ఆలోచించడం లేదు..!? అన్న ప్రశ్నలూ వే స్తున్నారు. ఇప్పటిదాకా.. హరితహారం, వనమహోత్సవాల పేరిట మొక్కలపై పెట్టిన డబ్బుల లెక్కలూ తేల్చాలంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండోనెల పూర్తవుతున్నా.. ఇప్పటికీ నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఏదీ ఉత్సాహం? గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నా టిస్తే.. కాంగ్రెస్ సర్కారు వనమహోత్సవం పేరుతో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్ర మం నత్తనడకన సాగుతోంది. ఒక్కో మున్సిపాలిటీకి లక్షల్లో మొక్కలు నాటాలని లక్ష్యం విధించగా ఇప్పటివరకు వేలల్లో కూడా నాటలేదు. ఒకట్రెండు కార్యక్రమాలు నిర్వహించి, నాలుగైదు మొక్కలు నా టి చేతులు కడిగేసుకుంటున్నారు. సామూహికంగా మొక్కలు నాటడం, ఇంటింటికీ పంచడం తదితర కార్యక్రమాల్లో అలసత్వం కనిపిస్తోంది. నిధులు వృథాయేనా!? రాష్ట్రప్రభుత్వం మొక్కలు నాటడానికి ఏటా రూ.కో ట్లాది నిధులు వెచ్చిస్తోంది. ప్రజలు కూడా పన్నుల రూపంలో ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. కానీ.. ఆ నిధులు సద్వినియోగం చేయడం లేదన్న ఆరోపణ బలంగా ఉంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి భారీగా ఖర్చు చేసి నర్సరీలు నిర్వహిస్తున్నారు. గుంతలు తవ్వడం, ట్రీగార్డులు తదితర పనులకూ ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటి లెక్కల్లో మాత్రం ప్రతీ ఏడాది అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఏటా విరివిగా మొక్కలు నాటుతూనే ఉన్నా.. ఆ స్థాయిలో పచ్చదనం మాత్రం పెరగడం లేదు. పెరిగిన లక్ష్యం.. పెరగని మొక్క ఏటేటా మొక్కలు నాటే లక్ష్యం పెరుగుతూనే ఉంది. కానీ ప్రతీసారి నాటుతున్న మొక్కల సంఖ్య పెరుగుతుందే గాని నాటుకున్న మొక్కల సంగతి అధికారు లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అన్ని శాఖలూ కలిసి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. చాలా శాఖలు కనీసం పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లోనూ ఇదే అలసత్వం కనిపిస్తోంది. మొక్కలు నాటే లక్ష్యం పెరుగుతున్నా పెరిగే మొక్కలు మాత్రం తగ్గుతున్నాయి. మున్సిపాలిటీల్లో వనమహోత్సవం ఇలా.. మున్సిపాలిటీ లక్ష్యం (లక్షల్లో) నాటినవి పంపిణీ చేసినవి పూర్తయినలక్ష్యం నిర్మల్ 7.50 28,500 25,480 43,980 భైంసా 7.50 31,260 15,400 46,600 ఖానాపూర్ 4.80 15,000 1,033 16,033 -
ఒక్కరోజు శాస్త్రవేత్తగా పొన్కల్ విద్యార్థిని
మామడ: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సె ల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీని సందర్శించే అవకాశం పొన్కల్ జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని మేకల కావ్యకు దక్కింది. ఆ న్లైన్లో కావ్య దరఖాస్తు చేయగా ఆమెకు పి లుపురావడంతో గైడ్ టీచర్తో కలిసి హైదరా బాద్లోని సీసీఎంబీని బుధవారం సందర్శించింది. అందులో శాస్త్రవేత్తలతో కలిసి ఒక్కరో జు శాస్త్రవేత్తగా పనిచేసే, సెమినార్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ అవకాశం రా వడం తనకు ఆనందంగా ఉందని కావ్య తెలి పింది. కావ్యను పాఠశాల హచ్ఎం అరవింద్కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నిర్మల్చైన్గేట్: వరంగల్ రైతు డిక్లరేషన్ పేర్కొన్న హామీలు అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని, 10 రకాల పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని, ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన అమలు చేయాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలన్నా రు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నగారి ముత్యంరెడ్డి, నూతల శ్రీనివాస్రెడ్డి, రావుల రాంనాథ్, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హలో.. ఏసీబీ!
నిర్మల్: గతంలో ఏడాదిలో ఒకట్రెండు ఏసీబీ దాడులైతేనే జిల్లాలో చర్చనీయాంశంగా మారేది. ‘ఫలానా అధికారి ఏసీబీకి పట్టుబడ్డడట..’ అంటూ రోజుల తరబడి ప్రచారం సాగేది. కానీ.. ఇప్పుడు నెల వ్యవధిలోనే రెండు మూడు అవినీతి నిరోధక శాఖ దాడులు జరుగుతున్నాయి. ఒక్క నిర్మల్ మున్సిపాలిటీలోనే వరుసగా ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. స్టేషన్ బెయిల్ కోసం రూ.పది వేలు అడిగితే ఏకంగా ఎస్సైనే ఏసీబీకి పట్టించారు. ఇలా ఈమధ్యకాలంలో జిల్లాలో లంచావతారులపై చైతన్యవంతులు పైచేయి సాధిస్తున్నారు. లంచం అడిగితే చాలామంది ఏసీబీవైపు చూస్తున్నారు. భయాన్ని ఆసరా చేసుకుని.. సార్ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మళ్లీ మన పని ఆగుతుందేమో..!, ఏదైనా కారణం చెప్పి ఆపేస్తారేమో..! అన్న భయంతోనే చాలామంది కష్టమైనా లంచాలు ఇస్తున్నారు. బాధితుల భయాన్ని, అవసరాన్ని ఆసరా చేసుకునే చాలామంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వసూళ్లకు ఎగబడుతున్నారు. మండలాల్లో గ్రామీణుల అమాయకత్వాన్ని డబ్బులుగా దండుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్స్ వంటి నిత్యం ప్రజాసంబంధాలు ఉండే కొన్నిశాఖల్లో వాళ్లు చేయాల్సిన పనే అయినా.. అందుకు ప్రభుత్వం వేతనం ఇస్తున్నా అదనంగా లంచం ఇవ్వనిదే అధికారులు, సిబ్బంది ఏ పనీ చేయడం లేదు. పెరుగుతున్న చైతన్యం.. ‘ఏం సార్.. ఎందుకివ్వాలి సార్.. మీ పని మీరు చేయడానికి కూడా డబ్బులు ఇవ్వమంటారా.. ఇదెక్కడి అన్యాయం సార్..!?’ అన్న ప్రశ్నలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. వాళ్లు చేయాల్సిన విధినిర్వహణకు కూడా లంచాలు అడుగుతున్నవారిని నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మరో అడుగు ముందుకు వేస్తూ.. ఏకంగా ‘1064’కు కాల్ చేస్తూ ఏసీబీనే రంగంలోకి దించుతున్న ఘటనలూ పెరుగుతున్నాయి. జిల్లాలో ఈ మధ్యకాలంలో లంచాలు అడిగినవారిని ఏసీబీకి పట్టించాలన్న చైతన్యం కనిపిస్తోంది. ఇందుకు వరుసగా జిల్లాలో చోటుచేసుకుంటున్న అవినీతి నిరోధక దాడులే ప్రతక్ష్య ఉదాహరణ. ఫోన్ చేస్తే చాలు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్న వారెవరైనా ప్రజల నుంచి లంచాలను తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవు. అవినీతి నిరోధకశాఖ ప్రత్యేకంగా లంచాలను నిర్మూలించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. నిర్మల్ ప్రాంతం నుంచి ఇటీవల బాగానే కేసులు వస్తున్నాయి. ఎవరు లంచం అడిగినా.. కేవలం 1064 టోల్ఫ్రీ నంబర్ లేదా, 91543 88963 నంబర్కు ఫోన్చేసి చెబితే సరిపోతుంది. – జి.మధు, డీఎస్పీ, ఏసీబీరెండేళ్లలో జిల్లాలో నమోదైన ఏసీబీ కేసులుఅయినా మారడంలేదు.. బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నా.. అవినీతి నిరోధకశాఖ తరచూ దాడులు చేస్తున్నా.. కొంతమంది వసూల్ రాజాలు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ ప్రతీపనికి రేటు పెడుతున్నారు. పెద్దోడు, పేదోడు అనే తేడా కూడా చూడకుండా వసూలు చేస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలోనే ఒక ఏడాది వ్యవధిలో మూడు ఏసీబీదాడులైనా.. ఆరుగురు అరెస్టయినా.. వసూళ్లపర్వం మాత్రం ఆగడం లేదు. జిల్లాస్థాయి హోదాలో ఉన్న అధికారులే భారీమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచమిచ్చినా తప్పే.. డబ్బులిస్తే ఏపనైనా అయిపోతుంది.. అందరికంటే ముందే పూర్తవుతుంది.. అన్న ధోరణిలో కొందరు అధికారులు, సిబ్బంది అడగకున్నా లంచాలిచ్చి మరీ పనులు చేయించుకుంటున్నారు. ‘ఎంతోకొంత ఇస్తే వాళ్లే చేస్తారు. మళ్లీ ఎప్పుడైనా పనికొస్తారు..’ అంటూ ప్రోత్సహిస్తున్నవాళ్లూ ఉన్నారు. కానీ.. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్–1988 ప్రకారం లంచం తీసుకోవడంతోపాటు ఇచ్చినా నేరమే అవుతుంది. లంచంఅడిగితే.. 1064 నంబర్కు కాల్ జిల్లాలో పెరుగుతున్న చైతన్యం ఇటీవల విరివిగా దాడులు జంకుతున్న లంచావతారులు2023–24 05 2024–25 04 -
బాల్యంపై పుస్తకాల భారం
● వయసును మించిన బరువు ● మోయలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ● ప్రభుత్వ నిబంధనలకు ‘ప్రైవేటు’ పాతర లక్ష్మణచాంద: బాల్యం అంటేనే సుకుమారం. చిన్న పిల్లలతో పనులు చేయించొద్దని, బాలల హక్కులను కాపాడాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు పని పిల్లలకన్నా.. ఎక్కువ బరువు పిల్లల వెన్నెపూసపై వేస్తున్నాయి. ఇష్టానుసారం పుస్తకాలు కొనుగోలు చేయిస్తూ ఆర్థికంగా దోపిడీ చేయడమే కాకుండా.. పిల్లలపై వయసును మించిన భారం మోపుతున్నాయి. పుస్తకాల సంచి పేరుతో బస్తాలను మోసినట్లు మోయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ద్వారా పాఠ్యపుస్తకాల బరువుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, 2017లో తెలంగాణ ప్రభుత్వం జీవో 22 ద్వారా ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించినా, అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలు ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. పోటీపడి మరీ పుస్తకాల సంఖ్యను పెంచుతూ బాల్యంపై భారాన్ని మోపుతున్నాయి. ఎన్సీఈఆర్టీ నిబంధనలు ఇవీ.. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం, 1వ, 2వ తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు 1–3 కిలోలు, 3వ నుంచి 5వ తరగతి వరకు 2–3 కిలోలు, 6, 7వ తరగతులకు 4 కిలోలు, 8వ తరగతికి 4–5 కిలోలు, 9, 10వ తరగతులకు 5 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం 2017లో జీవో కూడా జారీ చేసింది. కానీ జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ ఈ నియమాలు పాటించడంలేదు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ, పాఠశాలలు అనవసరమైన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి నిర్మల్ జిల్లాలో 205 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వీటిలో 73,571 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 14 ప్రాథమిక పాఠశాలల్లో 2,417 మంది, 115 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 25,766 మంది, 76 ఉన్నత పాఠశాలల్లో 45,388 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలు నిబంధనలను పాటించకుండా, విద్యార్థులపై అధిక బరువును మోపుతూ, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. పాఠశాలలు అందించే అనవసరమైన పుస్తకాలు విద్యార్థుల బ్యాగ్ బరువును పెంచడమే కాక, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని కూడా భారీగా మార్చాయి. పరిష్కారం కోసం తల్లిదండ్రుల డిమాండ్ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు, కొన్ని పుస్తకాలను పాఠశాలలోనే భద్రపరచడం, డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించడం ద్వారా విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని వారు వాదిస్తున్నారు. జేఈఈ, నీట్ పేరుతో దోపిడీ ప్రైవేట్ పాఠశాలలు జేఈఈ, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల సన్నద్ధత పేరుతో ప్రాథమికస్థాయి నుండే విద్యార్థులకు అధిక సిలబస్ను బోధిస్తున్నాయి. వారి శక్తిని మించిన చదువులు చెబుతున్నాయి. ఈ సాకుతో తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ, విద్యార్థులకు మోయలేనంత పుస్తకాల బరువును అంటగడుతున్నాయి. జిల్లాలో 1వ నుండి 5వ తరగతి విద్యార్థులు 6–12 కిలోలు, 6వ నుంచి 10వ తరగతి విద్యార్థులు 17–20 కిలోల బరువును మోస్తున్నారు. ఈ అధిక బరువు విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.నిబంధనల ప్రకారం బడి సంచి బరువు తరగతుల వారీగా.. తరగతి బరువు 1, 2 1–3 కేజీలు 3, 5వ 2–3 కేజీలు 6, 7వ 4 కేజీలు 8వ 4–5 కేజీలు 9, 10వ 5 కేజీలు -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బా క్సింగ్ అకాడమీలో మంగళవారం రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి పో టీలకు ఎంపిక చేశారు. బాలికల విభాగంలో బి.అర్చన (30–33) కిలోల బరువులో, ఎల్. అర్చన, (35–37), డి.అశ్విత, (33–35)లో, డి.యోగిత (37–40)లో, పి.లహరిక, (40–43)లో, ఎస్.దీక్షిత (43–46) బరువు విభాగంలో ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ధ్రు వ (49–52) బరువులో, ఎస్.సౌరన్రెడ్డి(49–52), ఏ శ్రీనిధ్( 58–61) బరువులలో ఎంపికయ్యారు. వీరు ఈనెల 25 నుంచి 27 వరకు హై దరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొ ంటారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి ప్రత్యేకంగా అభినందించారు. -
హక్కుల కోసం పోరాడాలి
నిర్మల్టౌన్: దేశ పౌరులు హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ రాజేశ్కన్నా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో మానవ హక్కుల కమిషన్పై మంగళవారం అవగాహన సద స్సు నిర్వహించారు. రాజేశ్కన్నా మాట్లాడు తూ.. దేశ పౌరులకు ఉన్న హక్కులను వివరించారు. ప్రతీ పౌరునికి సాధారణంగా కొన్ని సెక్షన్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగో ఆవిష్కరించారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సాహిల్ఖాన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరి, నూర్జహాన్, షాబొద్దీన్, సోఫీ ఇమ్రాన్, షరీఫ్బిన్ హాది, ఇసాక్ అలీ, ఇంతియాజ్ పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలుకు సీఎం చొరవ చూపాలి
● ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ నిర్మల్ రూరల్: నూతన పీఆర్సీ అమలుకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ కోరారు. నిర్మల్రూరల్ మండలం డ్యాంగాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం సభ్య త్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయిందన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల అంశం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ప్రత్యేక యాక్ట్ రూపొందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు. పెండింగ్ డీఏలు, ట్రెజరీ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి, పాతపెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వసంత్, భూక్యా రమేశ్, తాళ్ల రవి, నాందేవ్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’కు ఇబ్బందులు లేకుండా చూడాలి
● వచ్చే నెల 15 వరకు భూసమస్యలు పరిష్కరించాలి ● రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డినిర్మల్చైన్గేట్: భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల భూసమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశా రు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచి వాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలి గిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరి ష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రెవె న్యూ సదస్సులకు వచ్చిన ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పనిచేసేలా చూడాలని, ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియాతోపాటు ఎరువులకొరత రాకుండా చూడాలన్నారు. వనమహోత్సవం త్వరగా పూర్తి చేయాలి.. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని, నిర్దేశించిన మొక్కలను కచ్చితంగా నాటాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ విజయవంతంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా 97 డిపోలు, 321 బస్స్టేషన్లలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన ఆహార పంపిణీ, వారంలో ఒకరోజు అధికారులు బస చేయాలని సూచించారు. కలెక్టర్ సమీక్ష.. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండింగ్ చేపట్టిన వారు, ఇంటి నిర్మాణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు భూ సమస్యలన్నీ భూభారతి ప్రకారం పరిష్కరించాలన్నారు. నోటీసులు జారీ చేసిన దరఖాస్తుదారుల భూ సమస్యలపై విచారణ జరపాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు అన్ని గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రైతులకు సరిపడినంత యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్గౌడ్, అంబాజీ శ్రీనివాస్, మోహన్సింగ్, ఎకై ్సజ్ అధికారి ఎంఏ.రజాక్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాప్లో జాబ్స్
● డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’తో ప్రైవేట్ ఉద్యోగ సమాచారం ● నిరక్షరాస్యుల నుంచి పీహెచ్డీ చేసిన అందరూ అర్హులే.. ● ఎప్పటికప్పుడు ఫోన్లకు నోటిఫికేషన్లునిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు ద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క ల్పించే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) యాప్ను ప్రవేశపె ట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫాం నిరుద్యోగులకు నమ్మకమై న ఉద్యోగ అవకాశాలు అంది స్తోంది. ఈయాప్తో యువత బోగస్ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఖాళీల సమాచారం..డీఈఈటీ యాప్ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు తమ ఖాళీల వివరాలను నేరుగా నిరుద్యోగుల మొబైల్ ఫోన్కు పంపిస్తాయి. ఈ సమాచారంలో ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వేతన వివరాలు, ఖాళీల సంఖ్య, మౌఖిక లేదా రాత పరీక్షల వివరాలు ఉంటాయి. ఈ విధంగా సమగ్ర సమాచారం అందిన నిరుద్యోగులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. యాప్లో కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా ఇది మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలను అందిస్తోంది. జిల్లా స్థాయిలో డీఈఈటీ..ఇప్పటి వరకు జిల్లా నుంచి 24 కంపెనీలు, 12 ఇండస్ట్రీలు, 8 సర్వీస్ సెంటర్లు డీఈఈటీలో నమోదు చేసుకున్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు మరిన్ని సంస్థలను నమోదు చేయించేందుకు కృషి చేస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్హతలు కలిగిన వారు వరకు ఎవరైనా ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్న ప్రైవేట్ రంగ ఖాళీలకు వారి అర్హతల ఆధారంగా అవకాశం పొందవచ్చు.డీఈఈటీ యాప్ ప్రయోజనాలు..డీఈఈటీ యాప్ నిరుద్యోగ యువతకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది: మోసపూరిత కంపెనీల భయం లేకుండా నిజమైన ఉద్యోగ అవకాశాలు. వివిధ నైపుణ్యాలు, అర్హతలు కలిగిన అభ్యర్థులకు తగిన ఉద్యోగాలను సూచించడం. నిరంతర నియామక ప్రక్రియలతో సమర్థవంతమైన సేవలు. ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు. రిక్రూట్మెంట్ డ్రైవ్లు, జాబ్ ఫెయిర్లలో అవకాశాలు. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు సహాయం, ప్లేస్మెంట్ సహకారం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..డీఈఈటీ యాప్లో రిజిస్టర్ చేసుకోవడం సులభం. ఆసక్తి ఉన్నవారు కింది విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్: డీ ఈఈ టీ అధికారిక వెబ్సైట్ https: //deet.telangana.gov.in లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీఈఈటీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, సెల్ నంబర్, ఈ– మెయిల్ ఐడీ, విద్యార్హతలు, టెక్నికల్ కో ర్సులు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆశించే ఉద్యోగ రకం, పని చేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేయాలి. నిరుద్యోగులకు ఊరట.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీట్ యాప్తో నిరుద్యోగ యువతకు ప్రయోజనం చే కూరుతుంది. యువత ఈ సదావకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అ ప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. డీట్ నమోదు చేసుకున్న యువత ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. – నరసింహారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి -
ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి
నిర్మల్చైన్గేట్: ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆశ వర్కర్స్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత లాంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈనెల 31న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. బైంసా ప్రభుత్వ హాస్పత్రిలో ఆశ వర్కర్లకు విశ్రాంతి గది కేటాయించాలన్నారు. ఆశ వర్కర్ ఫోన్ బిల్లు రూ.150 నుంచి రూ.300 పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగమణి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, కోశాధికారి రామలక్ష్మి, భాగ్య, ఇంద్రమాల, ముత్తవ్వ, సులోచన, కమల, స్వప్న, మమత, శ్యామల పాల్గొన్నారు. -
పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
కుంటాల: యాత్రికులు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందనిభైంసా డీఎం హరిప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని లింబా(బి) గ్రామం నుంచి మహా రాష్ట్రలోని పండరిపూర్, తుల్జాపూర్ భవాని, పర్లి వైద్యనాథ్ వెళ్లే బస్ సర్వీస్ను సోమవారం ప్రారంభించారు. యాత్రకు వెళ్లేందుకు ఒక్కో ప్రయాణికునికి రూ.2,300 ఛార్జి నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని ఎక్కడికై నా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు బైంసా డిపో నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ భారతి, వీబీవోలు శ్రీనివాస్, సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ భగవంత్రావు, సిబ్బంది సుభాష్, వికాస్, యాత్రికులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులు నియంత్రించాలి
● కలెక్టర్లకు సీఎం ఆదేశం నిర్మల్చైన్గేట్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు వురు మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల ని యంత్రణ, వరదల నష్ట నివారణ చర్యలు, వ్యవసా యం, సాగునీరు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, అధిక వర్షాలతో సంభవించే నష్టాలు నివారించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆగ స్టు 14వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇన్చా ర్జి మంత్రులు, శాసనసభ్యులు ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధి కారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమలు, దోమ ల లార్వాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య పనులతో వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులతోపాటు, అవసరమైన మందులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించా రు. వరదల నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నా రు. ఇప్పటికే జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాక్ వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, డీపీవో శ్రీనివాస్, డీఏవో అంజిప్రసాద్, డీఎంహెచ్వో రాజేందర్, డీఎస్వో రాజేందర్, నీటిపారుదల శాఖ అధికారులు రవీందర్, అనిల్, గణేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
ఎన్హెచ్ 61
ఫోర్లేన్గా ● ఫలించిన ఇద్దరు ఎమ్మెల్యేల కృషి ● విస్తరణతో తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు ● భైంసా–నిర్మల్ మార్గంలో తగ్గనున్న ప్రమాదాలు భైంసా:తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మల్–భైంసా మధ్య ఉన్న 61వ జాతీయ రహదారిని ఫోర్లేన్గా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన మంత్రి రహదా రి విస్తరణకు అంగీకరించారు. విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బాసరలోని సరస్వతీ దేవాలయానికి, మహారాష్ట్రలోని నాగ్పూర్, షిర్డీలకు వెళ్లే ప్రయాణికులు ఈ 61వ జాతీయ రహదారిని విస్తృతంగా వినియోగిస్తారు. నిర్మల్ జిల్లాలో ఈ రహదారి ప్రధాన రవాణా మార్గంగా విస్తరించి ఉంది. భైంసా పట్టణంలో జిన్నింగ్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు వంటి పరిశ్రమల కారణంగా ఈ రహదారిపై భారీ లారీలతో రోజూ రద్దీ ఉంటుంది. ప్రస్తుతం రెండు వరుసల రహదారిగా ఉన్న ఈ మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఫోర్లేన్గా విస్తరణతో ఈ సమస్యలు తీరి, ప్రయాణ సౌలభ్యం మెరుగుపడనుంది. రోడ్డు ప్రమాదాలకు చెక్..61వ జాతీయ రహదారిపై, ముఖ్యంగా భైంసా–నిర్మల్, భైంసా–బాసర (161బీబీ హైవే) మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గతేడాది 26 మందికి పైగా మృత్యువాత పడగా, 53 మందికి పైగా గా యాలపాలయ్యారు. ఇరుకై న రహదారి, ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించే స్థలం లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. ఫోర్ లేన్ విస్తరణతో ఈ ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, ఇది ప్రయాణికులకు సురక్షితమైన రవాణా అనుభవాన్ని అందిస్తుంది. భైంసాలో బైపాస్..ఫోర్లైన్ విస్తరణలో భాగంగా భైంసా పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం అవసరం. ప్రస్తుతం పార్డీ(బి) బైపాస్ నుంచి డిపో వరకు 4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పట్టణం మధ్య నుంచి వెళుతోంది. ఈ రహదారి వెంట వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ప్రైవేట్ పాఠశాలలు, జిన్నింగ్ ఫ్యాక్టరీలు, జనావాసాలు ఉన్నాయి. రోడ్డు దాటే సమయంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మిస్తే, పట్టణంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు తగ్గి, స్థానికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. బైపాస్ను పాత చెక్పోస్టుతో అనుసంధానిస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయి.భైంసా – నిర్మల్ జాతీయ రహదారి 53 కిలోమీటర్లు విస్తరణ..నిర్మల్ నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని క ల్యాణి వరకు 61వ జాతీయ రహదారిని తెలంగాణ పరిధిలో 53 కిలోమీటర్ల మేర ఫోర్లేన్గా విస్తరించనున్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా భైంసా నుంచి నిర్మల్ వరకు 41 కిలోమీటర్లు, భైంసా నుంచి తానూరు మండలం బెల్తరోడ వరకు మరో 12 కిలోమీటర్లు నిర్మాణం జరుగనుంది. తెలంగాణలో మొత్తం 15 రహదారులను ఫోర్లేన్గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.33,690 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. -
ఆశల ప్రయాణం
● జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం! ● మరోసారి రైల్వే మంత్రికి వినతి ● సర్వేపై సమీక్షించిన అశ్వినీ వైష్ణవ్ ● నెలలో డీపీఆర్ చేయాలని ఆదేశం ● వచ్చే బడ్జెట్పై జిల్లావాసుల ఆశ లునిర్మల్: దశాబ్దాలుగా కాగితాలపైనే సాగుతున్న ఆ దిలాబాద్ టు హైదరాబాద్ వయా నిర్మల్.. రైల్వేలై న్ నిర్మాణం విషయంలో ఈమధ్య కొంత కదలిక కనిపిస్తోంది. తాజాగా కేంద్రం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ ఈమార్గం నిర్మాణంపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించడం గమనార్హం. వరంగల్లోని కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను సందర్శించేందుకు శనివారం ఆయన ప్రత్యేక రైలులో హైదరాబాద్ నుంచి కాజీపేటకు చేరుకున్నా రు. ఈరైలులో నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత ఏలే టి మహేశ్వర్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వేలైన్ నిర్మాణం గురించి మంత్రి అశ్వినీవైష్ణవ్కు వివరించారు. నెలలో డీపీఆర్కు ఆదేశంగతంలో ఉన్న ప్రతిపాదనల మేరకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వయా నిర్మల్, ఆర్మూర్ మీదుగా రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ వె ల్లడించారు. ఈ లైన్కు సంబంధించిన తాజా సర్వే కూడా ఇటీవల పూర్తి కావడంతో ఆ వివరాలపై రై ల్వే అధికారులతో ఆయన సమీక్షించారు. నెలలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఈ మార్గానికి సంబంధించిన ప నులు ప్రారంభించాలని ఎమ్మెల్యేలు కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఏడాదిపైనే పట్టే అవకాశంరైల్వే నిర్మాణం అంటేనే తరాలు గడిచిపోతాయి. ఇ ప్పటికే జిల్లా మీదుగా లైన్ నిర్మాణం ముచ్చట వింటూ మూడు తరాలు పోయాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు ఆదిలాబాద్–హైదరా బాద్ లైన్ నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా స ర్వే మాత్రమే పూర్తయింది. ఇక దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్కు సంబంధించి డీపీఆర్, నిధులకు సంబంధించిన ఎస్టిమేషన్ సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించాలి. బోర్డు నుంచి ఆర్థికశాఖకు అక్కడి నుంచి కేంద్ర కేబినేట్కు వెళ్తుంది. ఆ తర్వాత బడ్జెట్లో పెట్టి ని ధులు మంజూరు చేయడం, టెండర్లు, భూ సేకరణ తదితర పనులుంటాయి. ఇవన్నీ కావాలంటే ఏడాదిపైనే పట్టనుంది. ఇందులో ప్రధానంగా రైల్వేబోర్డు సమావేశాలే చాలా జాప్యమవుతుంటాయి. హైదరాబాద్ వరకూ..రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ ప్రాంతాన్ని రాజధాని హైదరాబాద్తో మరింతగా అనుసంధానించడానికే కేంద్రం మొగ్గుచూపుతోంది. ప్రధాని మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నుంచీ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తూ వస్తోంది. 2023లో ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, బా న్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటా న్చెరు వరకు రూ.5,706కోట్లతో లైన్ నిర్మాణాని కి ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, డిచ్పల్లి మీదుగా పటాన్చెరు వరకు రైల్వేలైన్ ప్రతిపాదన చేసింది. ఆ మార్గాన్నే మా రుస్తూ 2023లో తాజాగా ప్రతిపాదనలు చేశా రు. ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేవలం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు లైన్ వేస్తే సరిపోతుందని, జాయింట్ వెంచర్కు తాము సిద్ధమంటూ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇందుకు అప్పట్లో కేంద్రం ఒప్పుకొ న్నా.. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జాయింట్వెంచర్కు ముందుకు రాకపోవడంతో అలాగే నిలిచి పోయింది. తాజాగా ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు (హైదరాబాద్) రూట్లో చేపట్టిన సర్వేనే రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ సమీక్షించారు. మరో వైపు ఏ రూట్ ప్రతిపాదించినా ముందుగా ఆది లాబాద్ వైపు నుంచి పనులు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇలాగైతే కనీసం ఆది లాబాద్–నిర్మల్–ఆర్మూర్ లైన్ త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. త్వరగా చేపట్టాలని కోరాం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా వయా నిర్మల్–ఆర్మూర్ మార్గానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరాం. త్వరలో ఈ లైన్కు సంబంధించి ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేఎల్పీనేత -
వనితకు భరోసా
● ప్రమాద బీమా పొడిగింపు ● ఎస్హెచ్జీలకు ప్రయోజనం నిర్మల్చైన్గేట్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమాద బీమాను 2029వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు భరోసా కల్పించినట్లయింది. జిల్లా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18–59 ఏళ్ల వారు స్వ యం సహాయక సభ్యురాలిగా ఉన్నట్లయితే బీమా పథకం వర్తిస్తుంది. సంఘాల్లో సభ్యులెవరైనా ప్ర మాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు, సహజ మర ణం పొందితే రూ.2 లక్షల బీమా పరిహారం సొ మ్మును వారి నామినీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. వారికి సంబంధించిన రుణాన్ని కూడా మాఫీ చేస్తారు. 50శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి రూ.5లక్షలు అందజేయనున్నారు. జిల్లాలో 505 గ్రామైక్య సంఘాలుండగా, 12,215 పొదుపు సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 1,34,002 మంది సభ్యులున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీరు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ వివిధ యూనిట్లు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు సభ్యులు ప్రమాదాల్లో మరణించగా వారికి రూ.30లక్షలు విడుదలయ్యా యి. వీటిని త్వరలో జిల్లా అధికారులు బాధిత కు టుంబాలకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే ‘ఏలేటి’పై పోలీసులకు ఫిర్యాదు
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిపై ఆదివారం స్థానిక అర్బన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భా గంగా రాష్ట్ర గీతాన్ని ఆలపించేటప్పుడు ఎమ్మెల్యే, సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి కుర్చీల్లోంచి లేచి నిలబడలేదని ఆరోపించారు. రాష్ట్ర గీతాన్ని అవమానపరిచి న వీరు వెంటనే తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మహేశ్వర్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి కష్ణమూర్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ పట్టణా ధ్యక్షుడు నాందేడపు చిన్ను, ఏఎంసీ చైర్మన్ సోమ భీ మిరెడ్డి, నాయకులు జునైద్, సమ్మర్, హరీశ్, రాకేశ్, రామకృష్ణ, పోశెట్టి, శ్రీకాంత్యాదవ్, సాయి, కిసర్, సంతోష్, ఫిరోజ్, సర్దార్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
అత్యవసర సేవలు అందేదెప్పుడు?
భైంసా: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న ముధోల్ నియోజకవర్గంలో అత్యవసర వైద్యసేవలు అందించే స్థాయి ఆస్పత్రులు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ, ఏడు మండలాలున్నా యి. భైంసాలో ఏరియాస్పత్రి ఉండగా, ముధోల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ఉంది. ఇక బాసర ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ)ను సీహెచ్సీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు సిబ్బందిని నియమించలేదు. మిగతా చోట్ల పీహెచ్సీలే..తానూరు, కుభీర్, కుంటాల, లోకేశ్వరం మండలా ల్లో పీహెచ్సీలే ఉండగా ఆయా మండలాల ప్రజ లకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. నియోజకవర్గంలో తండాలు అధికంగా ఉన్నాయి. అత్యధికంగా నిరుపేదలు ఉండే ఈ నియోజకవర్గంలో వైద్యం కోసం పక్కనే ఉన్న మ హారాష్ట్రకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. తానూ రు, ముధోల్, బాసర మండల వాసులు మహారా ష్ట్రలోని ధర్మాబాద్కు, కుభీర్, భైంసా మండలవా సులు నాందేడ్కు, కుంటాల మండలవాసులు ని ర్మల్కు, లోకేశ్వరం మండలవాసులు నిజామాబా ద్కు వెళ్లాల్సి వస్తోంది. పీహెచ్సీలను సీహెచ్సీలు గా అప్గ్రేడ్ చేస్తే ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. సీహెచ్సీల్లో సూపరింటెండెంట్, ఆర్ఎంవోలతో కూడిన వైద్యబృందం అందుబాటులో ఉండనుండగా అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మిగతా సిబ్బంది సంఖ్య కూడా పెరగనుండడంతో పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల సేవలు అందే అవకాశముంది. సేవలపై ప్రత్యేక దృష్టిముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వై ద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భైంసా ఏరియాస్పత్రిలో దాతల సహకారంతో రోగులకు బెడ్లు ఏర్పాటు చేయించారు. డయాలసిస్ సేవలు వినియోగంలోకి తీసుకువచ్చారు. శనివారం తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తంజేసి విషయం జిల్లా వైద్యాధికారితో ఫోన్లో తెలిపారు. త్వరలో బాసరలో సేవలు ముధోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యసేవలు అందుతున్నాయి. లోకేశ్వరం, కుంటాల, తానూరు, కుభీర్లో పీహెచ్సీలున్నాయి. అత్యధికంగా భక్తులు వచ్చే బాసర ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారనుంది. ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. అనేక మంది భక్తులు వచ్చే బాసరలో ఉత్తమ సేవలు అందించే విషయమై దృష్టిసారిస్తాం. – రాజేందర్, జిల్లా వైద్యాధికారి పీహెచ్సీల అప్గ్రెడేషన్ ఎప్పుడో! ఇబ్బందుల్లో ‘సరిహద్దు’ ప్రజలు భైంసా మున్సిపాలిటీలో ఇలా..భైంసా మున్సిపాలిటీలో ఏరియాస్పత్రి ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప రిధిలోని ఈ ఆస్పత్రి బస్టాండ్కు దగ్గరగా ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు ప్ర మాదం జరిగినా క్షతగాత్రులు ఇక్కడికే రా వాల్సి వస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడ్డా పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఇక్కడికే తెస్తుంటారు. ఈ ఆస్పత్రి భవనం ఇరుకుగా ఉంది. దీనిని జిల్లా ఆస్పత్రిగా మా ర్చాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వా నికి వెళ్లాయి. ప్రస్తుతమున్న ఒకే భవనంలో ప్రసూతి విభాగం, అత్యవసర వైద్యసేవలు, టీబీ విభాగం, రక్తనిధి కేంద్రం, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. మరో భవనం నిర్మించి ప్రసూతి ఆస్పత్రి, మరో జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తేనే వైద్యసేవలు సంపూర్ణంగా అందే అవకాశముంది. -
పోస్టర్ ఆవిష్కరణ
ఖానాపూర్: పట్టణంలోని ఎరుకలవాడలో ఆగస్టు 3న హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరా ట సమితి 29వ ఆవిర్భావ వేడుకల పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రాము, జిల్లా అధ్యక్షుడు లోకిని గోపి మాట్లాడారు. ఆవిర్భావ వేడుకలకు కులస్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు గర్క పెద్దగంగారాం, లోకిని జూని, గరక చిన్న య్య, జెట్టి శ్రీనివాస్, గర్క నర్సయ్య, కాండ్లి పోషన్న, గంగశ్రీనివాస్, కనకయ్య, రాజేశ్వర్, మహేశ్, రాము, పోసవ్వ, లక్ష్మి ఉన్నారు. -
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆల యం ఆదివారం కిటకిటలాడింది. ఇతర జిల్లాలను ంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు పూజలు చేశారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. అడెల్లి పోచమ్మకు మొక్కులుసారంగపూర్: ఆషాఢ మాసం చివరి ఆదివారం కా వడంతో అడెల్లి మహాపోచమ్మను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్లోని గండిపేట్ ఏరియా ఏసీపీ రమణాగౌడ్–భారతి దంపతులు అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ ఈవో భో జాగౌడ్, సిబ్బంది ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్మల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు దశరథ రాజేశ్వర్, ఆలయ డైరెక్టర్లు ప్రభాకర్గౌ డ్, నర్సారెడ్డి, లక్ష్మి, ఈవో రమేశ్, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సిబ్బంది ఉన్నారు. -
ఇన్నోవా కారులో ఆవుల అపహరణ
నిర్మల్ జిల్లా: దొంగలు దొంగతనానికి కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఖరీదైన ఇన్నోవా కారులో రెండు ఆవులను అపహరించుకెళ్లారు. కాస్త వింతగా అనిపించినా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యంతో నిజమేనని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని రాజేందర్, రాజవ్వకు చెందిన రెండు ఆవులు కనిపించలేదు. రాత్రి సమయంలో ఆవులు ఎక్కడికి వెళ్లాయోనని వెతికారు. శనివారం ఉదయం 8 గంటల వరకు జాడ కనిపించలేదు. దొంగతనం జరిగి ఉంటుందని భావించి సమీప ఇళ్లలో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట రోడ్డు పక్కన ఇన్నోవా కారును నిలిపి ఉంచి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఆవులను తీసుకెళ్లి వెనుకవైపు నుంచి లోపలికి ఎక్కించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆవుల చోరీకి ఇన్నోవా కారు వినియోగించడం, వెనుక వైపు డోరు తెరిచి ఎక్కించడం చూసి అవాక్కయ్యారు. బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నార్లు పోసిండ్రు.. నీళ్లే లేవు!
భైంసా: ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు వేయడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారుమడులు సిద్ధం చేసి నెల రోజులు దాటినా పొలాల్లో నీరు నిల్వ లేక నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిస్తేనే పొలాల్లో నీరు నిలిచి నాట్లకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పెరిగిన నారుమడులను నాటలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు, అప్రకటిత విద్యుత్ కోతలు రైతుల సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అడ్డంకులు 15 రోజులుగా వేసవిని తలపించే ఎండలు కొనసాగుతున్నాయి. విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదు. అప్రకటిత కోతలు మరింత ఇబ్బందిగా మారాయి. రోజువారీ సరఫరాలో కూడా చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లకు తాకడం వల్ల ట్రిప్ అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు, సమస్యను సరిచేస్తున్నామని సమాధానం చెప్పి దాటవేస్తున్నారు. దీంతో బోర్లు, బావుల్లో నీరున్నా కరెంటు కోతలతో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. సిరాల ఆయకట్టుకు మరో‘సారీ’ రెండేళ్ల క్రితం భారీ వర్షాలతో సిరాల ప్రాజెక్టు కాలువ తెగిపోయింది. ఈ ఏడాది ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ, కాలువల్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ ఆయకట్టు కింద 4 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అయితే బోర్లు, బావులు ఉన్న రైతులు దేగాం సబ్స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్పై ఆధారపడి సాగు చేస్తున్నారు. అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ విద్యుత్ సరఫరాతో ఒక మడి నీటిని నింపినా, మరుసటి రోజు నీరు ఇంకిపోతుంది. క్రమం తప్పకుండా త్రిఫేజ్ విద్యుత్ ఇస్తే ఈ సమస్య తీరుతుందని రైతులు పేర్కొంటున్నారు. వానలు లేక.. వరద రాక.. వెలవెలబోతున్న చెరువులు, కుంటలు బోర్లు, బావుల్లో నీరున్నా.. అప్రకటిత విద్యుత్ కోతలు ఆందోళనలో వరి రైతులు జిల్లావ్యాప్త సమస్యలు జిల్లా అంతటా వర్షాలు కురవకపోవడంతో, బోర్ల నీటిపైనే పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కోసం ఎదురుచూసినా, అవి కురిసే సూచనలు కనిపించడం లేదు. నిరంతర త్రిఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటే మొలకెత్తిన వరి, పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పంటలను కాపాడుకునే అవకాశం ఉంది. జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. ఇందులో 20 వేల ఎకరాలు బోర్లపై ఆధారపడతాయి. మిగతావి చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నీటిపై ఆధారపడి సాగుచేస్తారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వర్షాలు లేవు, పైగా కరెంటు కోతలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. -
పాఠం చెప్పి.. కలిసి భోజనం చేసి..
మామడ: మండలంలోని కొరిటికల్ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలను కలెక్టర్ అ భిలాష అభినవ్ శనివారం సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ఆంగ్ల అక్షరాలు, పదాలు చదివించారు. పదో తరగతి విద్యార్థుల కు పాఠాలు బోధించి పాఠ్యంశాలలోని గణితం, భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు అడిగి సమాధానాల ను రాబట్టారు. విద్యార్థులు ఆరంభం నుంచి ప్ర ణాళికతో చదివి బోర్డు పరీక్షలలో విజయం సా ధించాలని కలెక్టర్ సూచించారు. స్పష్టమైన ల క్ష్యంతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆ కాంక్షించారు. వంటగదిని పరిశీలించి, వంట మ నుషుల అనుభవం, భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజనం వడ్డించారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఉ పాద్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నా టారు. డీఈవో రామారావు, మండల ప్రత్యేక అఽ దికారి రాజనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివా స్రావు, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంఈవో వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొరిటికల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష అభినవ్ -
ఎడారి దేశంలో చిక్కుకున్న జిల్లావాసి
● చేయని నేరానికి గల్ఫ్లో ఇక్కట్లు ● సాయం కోసం కుటుంబీకుల వేడుకోలు నిర్మల్ఖిల్లా: మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. మిత్రులు దుబాయ్ లో మంచి వేతనంతో పనిచేస్తున్నారని తెలుసుకుని, ఉన్నత జీవనం కోసం గల్ఫ్ దేశంలో అవకాశాలు వెతకాలని నిర్ణయించాడు. స్థానిక సబ్ ఏజెంట్ సహాయంతో దుబాయ్లో హౌస్కీపింగ్ పనిలో చేరాడు. ఏడాదికిపైగా పనిచేస్తున్నాడు. అయితే, అనూహ్యంగా ఆయన బ్యాంకు ఖాతాలో 2 వేల ధిర్హంలు బదిలీ కావడంతో సంక్షోభంలో చిక్కాడు. అక్రమ నగదు బదిలీ కేసు.. రాజేందర్ స్వగ్రామానికి రావడానికి విమాన టికెట్ కొనుగోలు కోసం దుబాయ్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించాడు. అయితే, అక్కడి అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన నగదును అక్రమ బదిలీగా భావించి కేసు నమోదు చేశారు. దీంతో రాజేందర్ ఇండియాకు తిరిగి రాలేక ఆరు నెలలుగా దుబాయ్ పోలీస్ స్టేషన్లు, ఇండియన్ ఎంబసీ చుట్టూ తిరుగుతున్నాడు. విచారణ పేరిట ప్రతిరోజూ అధికారులను కలుస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. ఆందోళనలో కుటుంబం.. రాజేందర్ తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, తమ కొడుకును ఇండియాకు తిరిగి రప్పించాలని విన్నవించారు. ఆయన నిర్దోషి అని, అక్రమ నగదు బదిలీతో ఆయనకు సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై అవగాహన అవసరం రాజేందర్ సమస్య గురించి తెలుసుకున్న ప్రవాసీమిత్ర రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ ఎన్నారై కమిటీ సలహా సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇండియన్ ఎంబసీ, దుబాయ్లోని ప్రవాసీ హెల్ప్డెస్క్కు మెయిల్ ద్వారా సమస్యను తెలియజేశారు. రాష్ట్ర జీఏడీ గల్ఫ్ ప్రజావాణి అధికారులకు సమాచారం అందించా రు. విదేశాలకు వెళ్లే ముందు తగిన నైపుణ్యాలు, అవగాహన అవసరమని, నకిలీ ఏజెంట్ల బారినపడి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాలు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ మోసాలపై గల్ఫ్ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
నైపుణ్యాలు బోధించాలి
భైంసాటౌన్: విద్యార్థుల్లో విద్యావిషయక నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ అన్నారు. పట్టణంలోని పులేనగర్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఆదిలాబాద్ విభాగ్ పూర్వ ప్రాథమిక, నర్సరీ, రెండో తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు రెండురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. బోధనా పద్ధతులు, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ వేణుమాధవ్, నిర్మల్ జిల్లా కార్యదర్శి పురస్తు గోపాల్కిషన్, పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు డాక్టర్ నగేష్, గంగాధర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్పై పల్లెల పోరు
నిర్మల్‘గిరి’ గూడేలకు పండుగ శోభ ఆధునిక కాలంలోనూ ఆదివాసీలు తమ ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. అకాడి పండుగతో ప్రారంభమయ్యే ఆదివాసీల పండుగలు, దీపావళితో ముగుస్తాయి. 8లోu ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025ప్రజల రక్షణకు సిద్ధంగా ఉండాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: ప్రజల రక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ అధికారులతో శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్, కమ్యూనిటీ కాంటాక్ట్ కెమెరాలు, నేను సైతం ప్రోగ్రాం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సమాచారాన్ని ప్రతీ పోలీస్ స్టేషన్ సిబ్బంది భౌతికంగా పరిశీలించి, పది రోజుల్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, బస్టాండ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలలు ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను నిర్మల్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నివారణ, పబ్లిక్ మానిటరింగ్లో ఇది ఒక ముందడుగని అన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాలపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. సౌలభ్యం, త్వరిత పరిష్కారాల కోసం ప్రజలు ప్లాస్టిక్ వస్తువులపై ఆధారపడుతున్నారు. చిన్న, పెద్ద ఫంక్షన్లలో ప్లాస్టిక్ గ్లాసులు, విస్తర్లు ఉపయోగించి, వాటిని ఆరుబయట పారవేస్తున్నారు. స్టీల్ వస్తువుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని గ్రహించే స్థితిలో చాలామంది లేరని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించి, స్టీల్ బ్యాంకులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.లక్ష్మణచాంద: మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అనివా ర్యంగా మారింది. కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఇంటి సామగ్రి కొనుగోలు వంటి ప్రతి కార్యకలాపంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు విరివిగా వినియోగిస్తున్నాం. ఉపయోగం తర్వాత ఈ ప్లాస్టిక్ను ఆరుబయట పారవేయడంతో భూమిలో కలిసిసోవడంలేదు. సూక్ష్మజీవులకు, అన్నదాతలకు, జీవజాతులకు తీవ్రమైన హాని కలుగుతోంది. పశువులు తిని మృతిచెందుతున్నాయి. ఇక నిప్పు పెడితే ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయి. ఈ ప్లాస్టిక్ భూతం జీవవైవిధ్యానికి, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ బ్యాంకుల ఏర్పాటు.. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్టీల్ వస్తువులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ సంరక్షణకు దోహదపడవచ్చని భావన. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటివరకు 52 గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ బ్యాంకుల ద్వారా గ్రామాల్లో కార్యక్రమాలు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ గ్లాసులు, విస్తర్లకు బదులుగా స్టీల్ వస్తువులు వినియోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు. నిర్వహణ సమస్య.. స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటి నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. స్టీల్ బ్యాంకుల బాధ్యతను స్వయం సహాయక బృందాల మహిళలకు అప్పగించాలని సూచించినప్పటికీ, అధికారులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. అదనంగా, ఫంక్షన్లలో స్టీల్ వస్తువులను ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రం చేసి పంచాయతీలకు తిరిగి అప్పగించే ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణాలతో స్టీల్ బ్యాంకుల ఏర్పాటు పూర్తిస్థాయిలో సాగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసేలా చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేశాం. మిగిలిన గ్రామాలలో కూడా ప్రజలకు అవగాహన కల్పించి స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపడుతున్నాం. స్టీల్ బ్యాంకు నిర్వహణలో కొంత సమస్య ఉంది. దానిని పరిష్కరించేలా చూస్తాం. – ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్, నిర్మల్స్టీల్ బ్యాంకు బాగుంది.. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. – శ్రీకాంత్, నర్సాపూర్(డబ్ల్యూ)గ్రామంలో ఉపయోగిస్తున్నాం గతేడాది మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి గ్రామంలో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు, వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలు, వేడుకలకు ఉపయోగిస్తున్నాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించాం. – పడిగెల మహిపాల్, నర్సాపూర్(డబ్ల్యూ)న్యూస్రీల్ జిల్లాలో 52 గ్రామాల్లో స్టీల్ బ్యాంకు శుభకార్యాలు, ఇతర వేడుకల్లో వినియోగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరం.. ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ ప్రజలు అవగాహన పెంచితే పర్యావరణ హితం అవగాహన లోపం.. ప్లాస్టిక్ ప్రమాదకరం.. ప్లాస్టిక్ వినియోగంతో మనతోపాటు పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుంది. ప్లాస్టిక్ను వినియోగించి పడేయటంతో అవి భూమిలో కలిసిపోవడం లేదు. అందులోని రసాయనాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్లో వేడి ఆహారం తీసుకుంటే క్యాన్సర్, అల్సర్, పేగు సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు ప్లాస్టిక్కు దూరంగా ఉండి స్టీల్ వస్తువులను వినియోగించడం ఆరోగ్యానికి మేలు. పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం. – ప్రత్యూష, వైద్యురాలు, లక్ష్మణచాంద -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● చింతల రామచంద్రారెడ్డినిర్మల్చైన్గేట్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా కార్యశాల సమావేశం జిల్లా అధ్యక్షుడు రితేష్రాథోడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మహేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్థానిక సంస్థలన్నీ కై వసం చేసుకుని నిర్మల్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసేలా పనిచేస్తామన్నారు. బూత్, శక్తి కేంద్రాల వారీగా సమీక్షలు నిర్వహించి బీజేపీ పాలన ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ ప్రాభరి భస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్రెడ్డి, మేడిసెమ్మె రాజు, పైడిపెల్లి గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్ కార్డులు 29,386
● మరో 63,595 మందికి పాత కార్డుల్లో చోటు ● త్వరలో ప్రొసీడింగ్స్ అందజేత ● జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,33,471 ● లబ్ధిదారులు 7,33,913 మందినిర్మల్చైన్గేట్: పేదలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల ఎట్టకేలకు సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. దశాబ్దాలుగా రేషన్ వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈనెల 22న మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. కొత్త కార్డులు, సభ్యుల చేరిక పదేళ్లకుపైగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట కల్పిస్తూ, ప్రభుత్వం పాత కార్డుల్లో సభ్యులను చేర్చడంతో పాటు కొత్త కార్డులను మంజూరు చే సింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 33, 982 రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం, 29,386 కార్డులను మంజూరు చేసింది. అలాగే, 48,063 కుటుంబాల నుంచి 63,595 మంది కొత్త సభ్యు ల చేరిక కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంక్షేమ పథకాలకు తొలగిన అడ్డంకి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందడానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో, ఏడేళ్లుగా కొత్త కార్డులు లేక అర్హులు ఈ పథకాల నుంచి దూరమయ్యారు. గ్యాస్ సబ్సిడీ, ఉ చిత కరెంట్ వంటి గ్యారంటీ పథకాలు అందుకోలేకపోయారు. 2018 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిపివేయడంతో, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో, ప్రజాపాలన కార్యక్రమం, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. రేషన్ కార్డుల సంఖ్య.. జిల్లా వ్యాప్తంగా 412 రేషన్ దుకాణాల ద్వారా 2,33,471 కార్డులు, 7,33,913 మంది సభ్యులకు సేవలందుతున్నాయి. ప్రతినెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 4,253 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. కొత్త కార్డులు, సభ్యుల చేరికతో అదనంగా 600 మెట్రిక్ టన్నుల కోటా పెరిగింది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో 80% మంది మాత్రమే లబ్ధి పొందగా, సన్నబియ్యం పంపిణీతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలోని మొత్తం రేషన్ కార్డులు 2,33,471లబ్ధిదారులు: 7,33,913నెలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం : 4253 మెట్రిక్ టన్నులు నూతన కార్డులకు వచ్చిన దరఖాస్తులు: 33982మంజూరు అయిన రేషన్ కార్డులు: 29,386లబ్ధిదారులు : 89,308మెంబర్ యాడింగ్కు వచ్చిన దరఖాస్తులు 48,063 ఆమోదించిన దరఖాస్తులు 44,388 లబ్ధిదారులు: 63,595పంపిణీకి ఏర్పాట్లు.. జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్ల నమోదు కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 22 లోపు ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. – బి.రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
బాసర.. నో హాల్టింగ్
భైంసా: దేశంలో ప్రసిద్ధిగాంచిన సరస్వతీ అమ్మవారి క్షేత్రమైన బాసరకు నిత్యం రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కాచిగూడ నుంచి జోథ్పూర్కు కొత్త ఎక్స్ప్రెస్ రైలు (17605/06) శనివారం నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి హైదరాబాద్లోని కాచిగూడలో ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. బాసర భక్తుల నిరాశ ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రమైన బాసరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు వస్తారు. కానీ, ఈ రైలుకు బాసరలో హాల్టింగ్ లేకపోవడంతో భక్తులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు నిజామాబాద్లో మాత్రమే ఆగనుంది. ఆధ్యాత్మిక మార్గం..ఈ రైలు ఉజ్జయినీ జోతిర్లింగ క్షేత్రం మీదుగా వెళ్తుంది. బాసరలో హాల్టింగ్ ఇస్తే, గోదావరిలో పుణ్యస్నానాలు, జోతిర్లింగ దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఈ సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు బాసరకు రానున్నారు. ఈ సమయంలో ఈ రైలు హాల్టింగ్ మరింత కీలకం. ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విన్నవిస్తే బాసరలో రైలు నిలిచే అవకాశం ఉంది. ఆగేలా చూస్తాం కొత్తగా ప్రారంభమయ్యే రైలు అమ్మవారి క్షేత్రమైన బాసరలో ఆగేలా చూస్తాం. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ని కలిసి విన్నవిస్తాం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి కొత్త రైలుకు బాసరలో హాల్టింగ్ కోసం రైల్వే మంత్రిని కలుస్తాం. – రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే నేడు కాచిగూడ–జోథ్పూర్ రైలు ప్రారంభం తెలంగాణలో చివరి స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వని వైనం.. -
నిర్మల్
‘నానో’నే నయం ఖరీఫ్ సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నానో యూరియా వాడాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. బాసరకు అమాత్యుల క్యూ..● ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రుల రాక.. ● అభివృద్ధిపై స్థానికుల్లో చిగురిస్తున్న ఆశలు ● అమ్మవారి ఆలయం, ట్రిపుల్ఐటీ గతి మారేనా..?శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 202523న విద్యాసంస్థల బంద్ నిర్మల్టౌన్: D¯ðlÌS 23¯]l ÐéÐ]l$-糄ýS ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS B«§ýlÓ-Æý‡Å…ÌZ Æ>çÙ‰-ÐéÅ-ç³¢…V> ´ëuý‡-Ô>-ÌS-Ë$, þ°Ä¶æ$ÆŠ‡ MýSâêÔ>-ÌSÌS º…§Šæ °Æý‡Ó-íßæ-çÜ$¢-¯]l²r$Ï ÐéÐ]l$-糄ýS ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS ¯éĶæ$-MýS$-Ë$ ™ðlÍ´ëÆý‡$. hÌêÏ MóS…{§ýl…ÌZ° I½ VðS‹Üt-çßo-‹ÜÌZ ѧéÅ-Ǧ çÜ…çœ*ÌS ¯éĶæ$-MýS$-Ë$ çÜÐ]l*-ÐólÔèæ… Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Ó-íßæ…^éÆý‡$. M>…{VðS-‹Ü {糿¶æ$-™èlÓ… {Oò³Ðólr$, M>Æöµ-Æó‡sŒæ ѧéÅ-çÜ…-çܦ-ÌZÏ ïœkÌS °Ä¶æ$…-{™èl-׿ ^èlrt… ¡çÜ$-MöÝë¢-Ð]l$° ^ðlí³µ °Æý‡Ï-„ýSÅ… ^ólíÜ…§ýl-¯é²Æý‡$. RêäV> E¯]l² sîæ^èl-ÆŠæ, G…DÐø, yîlDÐø ´ùçÜ$t-ÌS¯]l$ ¿ýæÈ¢ ^ólĶæ*-ÌS-¯é²Æý‡$. ò³…yìl…VŠæ ÝëPÌS-ÆŠæḥíÙ‹³Ë$ Ñyýl$-§ýlÌS ^ólĶæ*-ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. hÌêÏ-ÌZ° {糿¶æ$™èlÓ M>Æöµ-Æó‡sŒæ {Oò³ÐólsŒæ ´ëuý‡-Ô>-ÌS-Ë$, þ°Ä¶æ$ÆŠ‡ MýSâêÔ>-ÌSÌS Ķæ$fÐ]l*-¯éÅ-Ë$ çÜÓ^èle…§ýl…-V> º…§Šæ ^ólĶæ*-ÌS° í³Ë$ç³#-°^éaÆý‡$. çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ ï³yîl-G‹ÜĶæÊ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ íÜ…V>Ç Ððl…MýS-sôæÔŒæ, HIG‹Ü½ Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ Æ>çßæ$ÌŒæ, G‹ÜG‹œI hÌêÏ MýS±Ó¯]lÆŠ‡ ¨VýS…-ºÆŠæ, HIG‹ÜG‹œ hÌêÏ MýS±Ó¯]lÆŠ‡ OMð Ìê‹Ù ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. భైంసా: బాసర, తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా కేంద్రం. ఈ క్షేత్రానికి ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రుల రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గత శనివారం బాసరను సందర్శించారు. తాజాగా గురువారం అర్ధరాత్రి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలు బాసర అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అధికారులతో సమీక్ష సమావేశాలు మంత్రి శ్రీధర్బాబు అమ్మవారి దర్శనం అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి బాసర అభివృద్ధి, అమ్మవారి ఆలయ అభివృద్ధి, ట్రిపుల్ఐటీ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రిపుల్ఐటీ వసతి గృహంలో అధికారులతో చర్చలు జరిపారు. గత నిధుల వివాదం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బాసర అభివృద్ధిపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసినప్పటికీ, కేవలం రూ.8 కోట్లు ఖర్చు చేసి, మిగిలిన రూ.42 కోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నిధులను తిరిగి విడుదల చేయాలని స్థానిక నాయకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు, కానీ ఫలితం కనిపించలేదు. ఆలయం చుట్టూ రాజకీయం.. బాసర ఆలయం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, నిధులు మంజూరు చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని, భిక్షమెత్తయినా గర్భగుడిని తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మంత్రులు కొండా సురేఖ, గడ్డం వివేక్ కేంద్ర ప్రభుత్వం బాసర అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రం గుర్తించడం లేదని విమర్శించారు. అదే సమయంలో, బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసిందని, భిక్షమెత్తే మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాసరకు రూ.50 కోట్లు మంజూరు చేసి, తిరిగి వెనక్కి తీసుకుందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య బాసర అభివృద్ధి విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మూడు రోజులు తపాలా సేవలకు అంతరాయం ఖానాపూర్: తపాలా సేవల్లో నూతన సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తపాలా సేవలకు మూడు రోజులు అంతరాయం కలగనుందని నిర్మల్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారి సందీప్ తెలిపారు. ఈ నెల 19 నుంచి 21 వరకు తపాలా సేవలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. నియోగదారులు, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. తపాలా సేవలన్నీ ఒకే ప్లాట్ఫామ్పై నిర్వహించేలా తపాలా శాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు. చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి న్యూస్రీల్భవిష్యత్తు ఏమిటి?బాసరకు ఆలయం, ట్రిపుల్ఐటీలతో ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా అధికారులు ఆలయ మాస్టర్ ప్లాన్, ట్రిపుల్ఐటీ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు గడ్డిగారి విఠల్రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్, వేణుగోపాలచారి అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కలుస్తున్నారు. మంత్రి కొండా సురేఖ గత శనివారం ఆలయ అభివృద్ధి కోసం నాలుగు విభాగాలుగా చేపట్టే పనులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొత్తానికి మంత్రుల పర్యటనలతో బాసర అభివృద్ధి ఊపందుకుంటుందా, లేక గతంలోలా గాలికి వదిలేస్తారా అన్న ప్రశ్న స్థానికులను వెంటాడుతోంది. అమ్మవారి ఆలయం, ట్రిపుల్ఐటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలపై అందరి దృష్టి నెలకొంది. -
మన కల్లూ కల్తీనే!
ఎకై ్సజ్ చర్యలు.. కూకట్పల్లి ఘటన తర్వాత జిల్లాలో ఎకై ్సజ్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 48 శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో 4 కల్తీ కల్లు కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్ చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 16 మందిపై కేసులు నమోదు చేశారు. చిట్యాల్ దాడిలో స్వాధీనం చేసుకున్న క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం కేసులో ఐదుగురిని రిమాండ్ చేయడంతోపాటు రెండు కార్లను సీజ్ చేశారు. అయినప్పటికీ, తనిఖీలు సంతృప్తికరంగా లేనందున, కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.ఖానాపూర్: జిల్లాలో తాటి, ఈత చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినా కల్లు మాత్రం ఊరూరా లభిస్తోంది. ఇంత కల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరూ ఆలోచించడం లేదు. దీంతో చెట్ట కల్లు స్థానంలో చేతికల్లు రాజ్యమేలుతోంది. ఇటీవల ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్లో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే నిషేధిత రసాయనం క్లోరల్ హైడ్రేట్(సీహెచ్), ఆల్ఫ్రాజోలం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎకై ్సజ్ అధికారులను కాదని, రాష్ట్ర టాస్క్ఫోర్స్ నేరుగా రంగంలోకి దిగడం స్థానిక అధికారుల పనితీరుకు నిదర్శనం. గతంలో కూడా కల్తీ కల్లు తాగి ఆస్పత్రి పాలైన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా కూకట్పల్లిలో కల్తీకల్లు తాగి 9 మంది మరణించడంతో జిల్లా ఉలిక్కిపడింది. చెట్టు కల్లు స్థానంలో చేతి కల్లు.. సహజంగా తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే కల్లు జిల్లాలోని కల్లు తయారీ కేంద్రాలు, కల్లు దుకాణా లు, కల్లు వనాలు, కంపౌండ్లలో అమ్మకాలు జరగాలి. అయితే, దీనికి విరుద్ధంగా సహజ కల్లుకు బదులు క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ రసాయనాలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. తాజా దాడుల్లో నిర్మల్ జిల్లాలోనే చిట్యాల్ వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో గుట్టుచప్పుడు కాకుండా క్లోర ల్ హైడ్రేట్ తయారు చేస్తుండడం ఈ దందా ఏమేరకు సాగుతోందో తెలియజేస్తుంది. ముంబైలోని భీవండి నుంచి ‘క్లోరో’ అనే ద్రవ పదార్థాన్ని తెప్పించి, దానిని గడ్డకట్టించి క్లోరల్ హైడ్రేట్గా మార్చుతున్నారు. ఈ దాడిలో 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 10 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు ఈ కల్తీ దందాకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జోరుగా కల్తీ కల్లు అమ్మకాలు.. జిల్లాలో 23 కల్లు సొసైటీలు, 99 కల్లు దుకాణాలు ఉన్నాయి. ఈ వాటి నిర్వహణపై ఎకై ్సజ్ అధికారులు తగిన దృష్టి సారిస్తున్నారా అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్ షాప్లలో లూజ్ విక్రయాల పేరుతో కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో బెల్ట్ షాప్లు, తెల్ల కల్లు దుకాణాలు, గుడుంబా విక్రయాలను అరికట్టాలని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా, ఫలితం కనిపించడం లేదు. నిరంతరం తనిఖీలు.. జిల్లాలోని కల్లు సొసైటీలతోపాటు కల్లు దుకాణాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. 4 కల్తీ కల్లు కేసులను సైతం నమోదు చేయడంతోపాటు అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 16 మందిపై కేసులు పెట్టి రిమాండ్ చేశాం. ఇటీవల టాస్క్ఫోర్స్తో కలిసి దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం పట్టుకున్నాం. బెల్ట్ దుకాణాలతోపాటు గుడుంబా స్థావరాలు, బెల్లం పటిక విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నాం. – ఎండీ.రజాక్, డీపీఈవో, నిర్మల్ కనుమరుగవుతున్న తాటిచెట్లు.. పెరుగుతున్న చేతికల్లు ఇటీవల జిల్లాలో పెద్ద ఎత్తున పట్టుబడ్డ క్లోరల్ హైడ్రేట్ కూకట్పల్లి ఘటనతో ఉలికిపాటు -
విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి రామారావునిర్మల్టౌన్: విజ్ఞానశాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జుమ్మెరాత్పేట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి అటల్ టింకరింగ్ శిక్షణ తోడ్పడుతుందన్నారు. ఈ ప్రయోగశాలను జిల్లాలోని 17 పాఠశాలలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు విలువైన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల పరికరాలు, ఒక లాప్టాప్, 25 టేబుళ్లు , మొత్తం రూ.25 లక్షల విలువైన సామగ్రి పాఠశాలలకు చేరిందన్నారు. వాటి వినియోగంపై రాష్ట్రస్థాయి నుంచి కోఆర్డినేటర్లు వచ్చి, జిల్లాలోని ఉపాధ్యాయులకు రెండు రోజులు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు నర్సయ్య, ప్రవీణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, శిక్షణ రిసోర్స్ పర్సన్స్ కళ్యాణ్రెడ్డి, పవన్ నిరంజన్ , హెచ్ఎం రవిబాబు, భౌతికశాస్త్ర, జీవశాస్త్ర, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధికి కృషి
కుంటాల: పంచాయతీల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో శుక్రవారం పర్యటించారు. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడేందుకు వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను తడి,పొడిగా వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేసి ఆదాయం పొందాలని సూచించారు. అనంతరం ఓలా ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో రహీంఖాన్, ఏపీవో నవీన్, హెచ్ఎం శ్రావణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు రాజు, రాజబాపు, గంగాప్రసాద్ తదితరులు ఉన్నారు. మంచె ఎక్కి.. మొక్కలను పరిశీలించి..! కుంటాల: మండలంలోని సూర్యాపూర్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో 4 వేల పండ్ల మొక్కలను పెంచి అధికారులు రక్షించారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గుట్ట ప్రాంతంపై ఉన్న మొక్కలను అధికారులు ఏర్పాటు చేసిన మంచైపె ఎక్కి పరిశీలించారు. మొక్కలను రక్షించిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. -
సర్కారు బడికే సై..
● మొగ్లీ గ్రామస్తుల తీర్మానం.. ● 75కు చేరిన విద్యార్థుల సంఖ్య తానూరు: ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని మండలంలోని మొగ్లీ గ్రామస్తులు నిర్ణయించారు. ఇటీవల వీడీసీ, గ్రామస్తులు సమావేశం నిర్వహించి తమ ఊరి పిల్లలను దూర ప్రాంతాలకు పంపించకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో విద్యార్థుల సంఖ్య 75కు చేరుకుంది. గ్రామ కమిటీ తరఫున ఇద్దరు వీవీలను నియమించి వారి వేతనాల కోసం కమిటీ నుంచి రూ.2 లక్షలు పాఠశాలకు విరాళంగా అందించారు. -
మాట నిలబెట్టుకోని కాంగ్రెస్
● ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకష్ణ మాదిగ ● జిల్లా కేంద్రంలో వికలాంగుల మహా గర్జన సదస్సు నిర్మల్టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో శుక్రవారం వికలాంగుల చేయూత పింఛన్దారుల మహా గర్జన సన్నాహ క సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ హాజరై మాట్లాడారు. పింఛన్దారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గద్వాల నుంచి మొదలైన ఈ సభలు వచ్చే నెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. 20 నెలల్లో వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రూ.40 వేలు నష్టపోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కాలం వెల్ల్లదీస్తోందని మండిపడ్డారు. ఇప్పటికై నా వికలాంగులకు పెన్షన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు, డయాలసిస్, హెచ్ఐవీ రోగులకు రూ.4 వేలు, కండరాల క్షీణిత కలిగిన వారికి రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 13న హైదరాబాద్లో పింఛన్దారుల మహా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వికలాంగు ల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, వీహెచ్పీఎస్ నాయకులు రాజేశ్వర్, వినోద్, భూమేష్, లత, పోసాని, కళావతి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీను, ఎంఎస్పీ కోఆర్డినేటర్ శనిగారపు రవి పాల్గొన్నారు. -
ఆర్ఎంపీలు యాంటిబయాటిక్స్ ఇవ్వొద్దు
లక్ష్మణచాంద: జిల్లాలోని ఆర్ఎంపీలు యాంటి బయాటిక్స్ రోగులకు ఇవ్వొద్దని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేంద ర్ ఆదేశించారు. మండలంలోని వడ్యాల్, లక్ష్మణచాంద గ్రామాల్లోని ఆర్ఎంపీ క్లినిక్ల ను గురువారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్సచేస్తున్న శాంతి క్లినిక్, వాణి క్లినిక్, మామడ మండలం పరిమండల్ గ్రామంలోని హారిక క్లీనిక్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆర్ఎంపీలు వారి పేరు ముందు డాక్టర్ అని రాయకూడదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట డాక్టర్ సౌమ్య, బారె రవీందర్ ఉన్నారు. హెచ్ఐవీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: హెచ్ఐవీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ అన్నారు. పట్టణంలోని విశ్వనాథ్పేట్లో సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెచ్ఐవీ నిర్ధారణ శిబిరాన్ని గురువారం సందర్శించారు. మీ దగ్గరికి వచ్చే ఆరోగ్య సిబ్బంది వద్ద హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల క్లస్టర్ మేనేజర్ నాగరాజు, జిల్లా సూపర్వైజర్ అనిల్కుమార్, బంగల్పేట్ అర్బన్ పీహెచ్సీ డాక్టర్ మనీషా, సూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయం.. పఠనోత్సాహం
● విద్యార్థుల్లో అభిరుచి పెంచేలా విద్యాశాఖ చర్యలు ● పాఠశాలల్లో గ్రంథాలయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ● ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు నిర్వహణలో శిక్షణ..నిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించే లక్ష్యంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నాయి. జిల్లాలోని 756 పాఠశాలల్లో ‘రీడింగ్ కార్నర్’ల పేరిట గ్రంథాలయాలు రూమ్ టు రీడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. వీటిలో కథలు, బొమ్మలు, వైజ్ఞానిక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. రోజువారీ బోధనలో గ్రంథాలయ పీరియడ్ను చేర్చారు. రోజుకు ఒక పీరియడ్ గ్రంథాలయ సమయంగా కేటాయించడం ద్వారా విద్యార్థులు చదవడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ పుస్తకాలు జిజ్ఞాస, మేధోశక్తి, భాషా సామర్థ్యాలను పెంచుతున్నాయి.ఉపాధ్యాయులకు శిక్షణ..గ్రంథాలయ నిర్వహణ, పఠన అభిరుచి పెంపొందించేందుకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి ఏ.గోపాల్ (పెండ్పల్లి), ఎం.ఎల్లన్న (వానల్పాడ్) ఈ శిక్షణకు వెళ్లారు. వారు జిల్లాకు వచ్చి స్థానిక ఉపాధ్యాయులకు తిరిగి శిక్షణ ఇవ్వనున్నారు.అభిరుచి అలవాటుగా మారేలా.. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పఠనాభిలాష వృద్ధి చెందితే, అదికాస్త అలవాటుగా మారుతుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు పురోగమనం ఉజ్వలంగా ఉంటుంది. ఇందుకోసం గ్రంథాలయ ప్రాధాన్యతపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ఉపాధ్యాయులు కూడా తమ పాఠశాలల్లో గ్రంథాలయ పీరియడ్ ఉండేలా చూస్తున్నారు. – పి.రామారావు, డీఈవో ●ప్రాముఖ్యత.. పఠన సామర్థ్యం: విద్యార్థులు వ్యక్తిగతంగా, బృందంగా పఠన అలవాటును అభివృద్ధి చేసుకుంటారు. వైజ్ఞానిక జిజ్ఞాస: రంగురంగుల పోస్టర్లు, కథలు, వైజ్ఞానిక పుస్తకాలు జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. సమాజ భాగస్వామ్యం: గ్రంథాలయ క్ల బ్ల ద్వారా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పె రుగుతుంది. -
సర్దుబాటు పారదర్శకంగా నిర్వహించాలి
నిర్మల్టౌన్: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావుకు గురువా రం వినతిపత్రం అందించారు. సర్దుబాటులో మొదట సీనియర్లకు అవకాశం ఇవ్వాలన్నా రు. వీరి విల్లింగ్ లేకుంటే జూనియర్కు అవకా శం కల్పించాలని తెలిపారు. ఉన్నత పాఠశాలలో ఎఫ్ఏసీ ప్రధానోపాధ్యాయులు పని ఒత్తి డి కారణంగా బోధన సరిగా చేయలేకపోతున్నారన్నారు. వీరిస్థానాల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఇందులో ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్నయాదవ్, లక్ష్మణ్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ఖాన్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్,శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ముగిసిన ఓఎల్ఐ, ఎంఎల్బీఏ శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతో కలిసి నిర్వహించిన ‘‘ఆర్గనైజేషనల్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (ఓఎల్ఐ), మెషిన్ లెర్నింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ (ఎంఎల్బీఏ)’’ కోర్సు విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం విద్యార్థులకు నాయకత్వ నైపుణ్యాలు, సాంకేతిక జ్ఞానం, డేటా ఆధారిత నిర్ణయాధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. 14 రోజుల ఈఇంటెన్సివ్ కోర్సు విద్యార్థులకు ఆర్గనైజేషనల్ లీడర్షిప్, ఎథిక్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, మెషీన్ లర్నింగ్ మోడల్స్, బిజినెస్ అనలిటిక్స్ ఫ్రేమ్వర్క్లో శిక్షణను అందించింది. థియరీతోపాటు, రియల్–టైమ్ కేస్ స్టడీస్, సిమ్యులేషన్ల ద్వారా విద్యార్థులలో ఆచరణాత్మక అంతర్దృష్టిని పెంపొందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇన్చార్జి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీధరన్, కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. -
వ్యాధి సోకితే 1962కు డయల్ చేయండి
జిల్లాలోని పశువులకు గొర్రెలకు, మేకలకు ఎలాంటి వ్యాధిలు సోకినా వెంటనే 1962 నంబరుకు డయల్ చేయాలి. 1962 అంబులెన్సు సిబ్బంది గ్రామాలకు చే రుకుని పశువులకు, మేకలకు, గొర్రెలకు చికిత్స అందిస్తారు. తగిన మందులు అందజేస్తారు. వ్యాధి తీవ్ర త ఎక్కువగా ఉంటే వైద్య నిపుణులకు సమాచారం అందించి మెరుగైన చికిత్సను అందిస్తారు. పశువైద్యుల సలహాలు సూచనల మేరకు చికిత్స చేయించుకోవాలి. ఇలెగాంలో మేకల మరణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – బాలిగ్ అహ్మద్, జిల్లా పశువైద్యాధికారి -
మేకలకు అంతుచిక్కని రోగం
● గుట్ట ప్రాంత గ్రామాల్లో ఎక్కువ ● ఇలేగాంలో 17 మేకలు మృతి ● చికిత్స అందేవరకు బతకడం లేదు.. ఈ ఫొటోలో చనిపోయిన మేకలను చూపుతున్న రైతు పేరు కదం దత్తురాం. ఇలేగాం గ్రామానికి చెందిన దత్తురాంకు మేకల పెంపకమే జీవనాధారం. 80 మేకలు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుట్ట ప్రాంతంలో మేకలను మేపుతున్నాడు. ఇటీవల మేకలను మేపి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఉద యం లేచి చూసేసరికి పది మేకలు మరణించాయి. కొన్ని మేకలు జలుబు చేసినట్లు బాధ పడుతుండడంతో పశువైద్యులకు సమాచారం అందించాడు. చికిత్స చేయించినా రోగం నయం కాక మరో ఏడు మేకలు మరణించాయి. మరణించిన మేకల విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేశ్వరం : జిల్లాలో మేకలు వింత రోగంతో మరణిస్తుండటం యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా, సీసీపీపీ(కంటైజెస్ క్యాప్రిన్ ప్లూరో నిమోనియా) వ్యాధి కారణంగా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో 17 మేకలు మరణించా యి. ఈ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం యజమానులలో అసంతృప్తిని పెంచుతోంది. సీసీపీపీ (కంటైజెస్ క్యాప్రిన్ ప్లూరో నిమోనియా) అనేది మైకో ప్లాస్మా క్యాప్రీ వైరస్ వల్ల సంక్రమించే ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన మేకలలో 50% మాత్రమే బతికే అవకాశం ఉందని భైంసా పశువైద్యాధికారి విఠల్ తెలిపారు. జిల్లాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. సరైన నివారణ చర్యలు లేకపోతే పశుసంపదకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇటీవల ఇలేగాం గ్రామంలో 17 మేకలు ఈ వ్యాధి బారిన పడి మరణించాయి. యజమానుల ఆందోళనలుజిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా మేకలు సీసీపీపీ వ్యాధితో మరణిస్తున్నాయి. సాయంత్రం మేతకు వెళ్లి వచ్చిన మేకలు ఉదయానికి మరణిస్తుండటం యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా అధికారులు ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో యజమానులు నిరాశతో ఉన్నారు. సీసీపీపీ వ్యాధి లక్షణాలు 106 డిగ్రీల వరకు జ్వరం, మూలుగుతూ ఉంటాయి. ఉబ్బసం వల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు నుంచి చీమిడి, కళ్ల నుంచి నీరు కారుతుంది. నిరంతరం పొడి దగ్గు ఉంటుంది. మేకను వెనక కాళ్లు పట్టి పైకి లేపి, తలను క్రిందికి వంచితే ముక్కు నుంచి నీటిలాంటి స్రావం కనిపిస్తుంది.చికిత్స, నివారణ చర్యలు తగిన మోతాదులో యాంటీబయాటిక్ మందులు వాడాలి. టైలోసిన్ ఇంజెక్షన్ను ఏడు రోజులు ఇవ్వాలి. పశువైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. మేకల పాకలను పరిశుభ్రంగా ఉంచడం, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. గుంపుగా మేకలు ఉండకుండా చూడాలి. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన మేకలను వేరుగా ఉంచాలి. వ్యాధి సోకిన మేకలను మంద నుంచి వేరుచేయాలి. -
స్వర్ణ ప్రాజెక్టు ఆధునికీకరణకు కృషి
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిసారంగపూర్: స్వర్ణ ప్రాజెక్టు ఆధునికీకరణకు తనవంతు కృషి చేస్తానని, ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం సాగునీరు విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టు ఆనకట్టపై రూ.32 లక్షలతో ఏర్పాటు చేసే లైటింగ్ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా సారంగాపూర్కు చేరుకుని స్వర్ణ ప్రాజెక్టు మధ్యకాలువ(జౌళినాళ)పై 46 లక్షలతో క్రాస్ రెగ్యూలేటరీ, ఎస్కేప్ రెగ్యులేటరీ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు గతంలో 10 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం కాలువలు సరిగా లేక, నిర్వాహణ లోపంతో విస్తీర్ణం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు సమీకరిస్తానని తెలిపారు. వర్షాలు ఆలస్యం అయిన నేపథ్యంలో నారుమడుల కోసం నీటిని విడుల చేశామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ తుక్కారాం, స్థానిక తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఏఈలు మధుపాల్, వేణుగోపాల్, మండల నాయకులు కాల్వ నరేశ్, తిరుమలచారి, విలాస్, గంగారెడ్డి, రాజేశ్వర్, నారాయణ, మోహన్, భీమలింగం, సామల వీరయ్య, చంద్రప్రకాశ్గౌడ్, రాజారెడ్డి, ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్ సబ్సెంటర్లుసారంగపూర్: ప్రజల రోగ్యం, వారి మెరుగైన జీవన విధానం కోసమే ఆరోగ్య ఉపకేంద్రాలను నిర్మిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని స్వర్ణ, కౌట్ల(బి), మలక్చించోలి, జామ్, ధని, గ్రామాల్లో ఒక్కోటి రూ.20 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రాలకు భూమిపూజ చేశారు. ధని గ్రామం నుంచి రాజరాజేశ్వర తండా వరకు రూ.1.60 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ తుక్కారాం, ఏఈ దేవీదాస్, వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్ రాజేందర్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ జవాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, నాయకులు రావుల రాంనాథ్, మోహ న్, భీమలింగం, సామల వీరయ్య, తిరుమలాచారి, విలాస్ కాల్వ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు
● విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత చేరిక.. ● 30 రోజులు ఇబ్బందిపడ్డ విద్యార్థులు లక్ష్మణచాంద: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలు ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలో ఆపివేయకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కస్తూరిబాగాంధీ బాలికా విదాలయాల (కేజీబీవీ)ను స్థాపించింది. ఈ విద్యాలయాలు ఇంటర్మీడియెట్ స్థాయికి అప్గ్రేడ్ అయ్యా యి. బాలికలకు వసతి సౌకర్యంతో కూ డిన విద్య ను అందిస్తున్నాయి. అయితే, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు నెల తర్వాత ఎట్టకేలకు జిల్లాకు వచ్చాయి. ఈ ఆలస్యంతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో 18 కేజీబీవీలు..జిల్లాలో 18 కేజీబీవీ సంస్థలు ఉన్నాయి. వీటిలో 15 కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1,200 మంది, ద్వితీయ సంవత్సరంలో 880 మంది చదువుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో కేజీబీవీలు జూన్ 12న ప్రారంభమయ్యాయి. పాఠశాలలో మొదటిరోజు పాఠ్యపుస్తకాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ, నెల రోజులు దాటిన తర్తా పుస్తకాలు వచ్చాయి. దీంతో కొందరు విద్యార్థినులు సీనియర్ విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలు సేకరించి చదువుకోగలిగారు, సీనియర్లతో సంబంధం లేని విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. రెండు రోజుల క్రితం పాఠ్యపుస్తకాలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది. నెల రోజులు ఇబ్బంది.. జూన్ 12న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రారంభం అయినరోజే పాఠ్య పుస్తకాలు అందేది. ఈసారి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో నెలరోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే తరగతులు నిర్వహించారు. పాఠాలు సక్రమంగా అర్థంకాక ఇబ్బంది పడ్డాం. – భవ్య ఇంటర్ విద్యార్థి కేజీబీవీ సకాలంలో అందిస్తే మేలు జిల్లాలోని కేజీబీవీ కళాశాలలో చేరిన విద్యార్థులకు కళాశాలలు పునః ప్రారంభమైన వెంటనే పాఠ్య పుస్తకాలు సరఫరా చేసేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు రానున్న కాలంలో సమస్య రాకుండా చూసుకోవాలి. – లక్ష్మి, ఇంటర్ విద్యార్థి కేజీబీవీ -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
● ఇంటర్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు లోకేశ్వరం/తానూరు: ఇంటర్లో మెరుగైన ఫలితా లు సాధించాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు అన్నారు. లోకేశ్వరం, తానూర్, ముధోల్ జూనియర్ కళాశాలలను గురువారం తనిఖీ చేశారు. అధ్యాపకులతో మాట్లాడారు. అడ్మిషన్లు పెంచాలన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. పోషకులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్ వాటిలో ర్యాంకులు సాధించేలా చూడాలన్నారు. విద్యార్థుల అపార్ నంబర్లను జనరేట్ చేయాలన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలని సూచించారు. తానూరులో ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో ప్రయోగశాల లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఐఈవో పరశురాం, లోకేశ్వరం కళాశాల ప్రిన్సిపాల్ గౌతం. ముధోల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అబ్దుల్ రెహమాన్, అధ్యాపకులు గంగాధర్, ప్రశాంత్, గణేశ్ ఉన్నారు. -
సమన్వయంతో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయం అవసరమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. విత్తన దుకాణా ల్లో నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఇప్పటివరకు 32 మంది బాల కార్మికులను గుర్తించి, 19 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాల్యవివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది 12 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించామన్నారు. పీసీ–పీఎన్డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో ఇప్పటివరకు 51 కేసులు నమోదవగా, 39 కేసుల్లో పరిహారం చెల్లించామని, 12 కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్ప టి వరకు 73 కేసులు నమోదు కాగా, 145 మంది అరెస్టయ్యారని, 525 కేజీల 305 గ్రాముల గంజా సీజ్ చేశామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను ని వారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ఎచ్ఏఐ, ఆర్అండ్బీ శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కడ్తాల్, సోన్ గ్రామస్తులు, ఇతర గ్రామాల పరిధిలోని నేషనల్ హైవే రూట్లపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భిక్షాటన నిర్మూలన, ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ, పోలీసు శాఖల మధ్య సమన్వయం..ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, బాల్యవివాహాల నియంత్రణలో సంక్షేమ, పోలీసు శాఖల మధ్య స మన్వయం కొనసాగుతుందన్నారు. చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణకు తనిఖీలు పెంచామన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
షార్ట్సర్క్యూట్తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది. -
రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రంగినేని శ్రీనివాస్ శాంతినగర్లోని మున్సిపల్ రోడ్డుకు తన బావ అమూల్ పేరిట డోర్ నంబర్ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మున్సిపల్ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులరైజేషన్ కోసం రూ.22,900 చలాన్ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్ సుశీల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్, అమూల్ను రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్, రూరల్ సీఐలు సునీల్ కుమార్, ఫణిందర్ పాల్గొన్నారు. ఐదుగురి రిమాండ్.. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ రమేశ్ కేఆర్కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్ ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, షేక్ ఆబిద్, షేక్ ఆదిల్, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, ఆదినాథ్, అతీఖ్, సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
నెన్నెల: ఈ నెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం రాజేంద్రప్రసాద్ (26) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్లో బొలెరో తీసుకున్నాడు. గిరాకీ లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నానని ఇంట్లో చెప్పుకుని బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వివరించారు. -
వైద్య కళాశాలకు అనాథ మృతదేహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని కాలేజ్రోడ్లో నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల, మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మందమర్రిలో నిస్సహాయ స్థితిలో రహదారి పక్కన ఉన్న వృద్ధురాలు(90)కు గత నెల 28 న మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచన మేరకు మేరకు ఆశ్రమంలో చోటు కల్పించారు. సదరు వృద్ధురాలు మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఎస్సై సూచన మేరకు మృతదేహాన్ని బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. అయినప్పటికీ మృతురాలికి సంబంధించి బంధువులెవరైనా ఉంటే 9701973636 నంబర్ను సంప్రదిస్తే మృతదేహం అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో వైద్యకళాశాల వినియోగిస్తుందని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ములుకాల కుమార్ తెలిపారు. -
● జ్వరంతో బాలిక మృతి ● ముత్తంపేటలో విషాదం
ఏడేళ్లకే నూరేళ్లు..●కౌటాల: ఆ బాలికకు ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. విషజ్వరం ఆ చిన్నారిని బలి తీసుకుంది. అల్లరు ముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రైపూర్ నాగేశ్వర్, జయ దంపతులకు కుమార్తె మన్విత (7), కుమారుడు ఉన్నాడు. నాగేశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మన్విత స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలికకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. రాత్రి తల్లి స్థానిక ఆశ వర్కర్ వద్ద పారాసిటమల్ మాత్రలు అడిగి వేశారు. జ్వరం తగ్గకపోవడంతో బుధవారం కౌటాల పీహెచ్సీకి తీసుకెళ్లగా సిబ్బంది మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద బట్టల్లోనే మూత్రం పోసుకుని కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. -
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌటాలలో చేతికి చిక్కి.. కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి.. ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్సైకిల్ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్సైకిల్తోపాటు మొబైల్ఫోన్ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. -
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మె స్రం సోము, హెచ్ఏలు శంకర్, వసంత్, ఏఎన్ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్కు చెందిన మణిశేఖర్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
సింగరేణి ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీశ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేతతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్పల్లి క్యాంపస్లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు. -
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ఆందోళన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని బీట్బజార్కు చెందిన విశ్వనాథం అనే వ్యాపారి ఇంటి ఎదుట బుధవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన శ్రీధర్ లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, ఇతర లావాదేవీలు కొనసాగిస్తుండేవాడు. ఈక్రమంలో పలువురి వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ఐపీ పేరుతో నోటీసులు పంపుతున్నాడనే సమాచారంతో అప్పు ఇచ్చిన రైతులు ఈ నెల 8 న శ్రీధర్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. వ్యా పారి విశ్వనాథం కూడా శ్రీధర్కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. దీంతో దండేపల్లిలో ఉన్న భూమి అప్పుకింద రాయించుకున్నాడని, అట్టి భూమిని బాధితులందరికీ పంచాలని బుధవారం రైతులు విశ్వనాథం ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గోపతి సురేష్ రైతులతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● చించోలి(బీ)లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ శిక్షణ పరిశీలన ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తనిఖీనిర్మల్చైన్గేట్: జిల్లాలో వర్షాలు, అకాల వరదలు సంభవించినపుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం చించోలి (బీ) సమీపంలోని ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎ ఫ్ బృందం సహాయక విన్యాసాలు, ప్రజలకు అ వగాహన కల్పించే ప్రదర్శనలను పరిశీలించారు. బృంద సభ్యుల పనితీరును అభినందించారు. వారి వద్ద ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎలా ఉపయోగపడతాయన్న అంశాలపై అధికారులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా గోదావరి, స్వర్ణ, ఎస్సారెస్పీ, క డెం ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలు, జీఎన్ఆర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరదల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు జిల్లా స్థాయిలో ఫ్లడ్ మా న్యువల్ తయారు చేసినట్లు తెలిపారు. కడెం, ఖా నాపూర్, సారంగపూర్, దస్తురాబాద్, భైంసా మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 15 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. వరదల సమయంలో ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూమ్ను సంప్రదించాలని సూ చించారు. అనంతరం మైనార్టీ పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో అదనపు ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో లక్ష్మీకాంతం, అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో తనిఖీలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ అభిలాష అభిన వ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాలు పరిశీలించారు. రోజువారీ ఓపీ వివరాలు తెలుసుకున్నారు. చిల్డ్రన్స్ వార్డును పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మందుల గదులు, టీకా నిల్వల గురించి తెలుసుకున్నారు. సరిపడా మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అ నంతరం ల్యాబ్ విభాగాన్ని పరిశీలించి అందుబా టులో ఉన్న పరీక్షల వివరాల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవుట్పోస్ట్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకుడు గోపాల్సింగ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
నిర్మల్చైన్గేట్: లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించ డం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్వో రాజేందర్ హెచ్చరించారు. భ్రూణ హత్యలను నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వైద్యారో గ్యశాఖ కార్యాలయంలో జిల్లా అడ్వైజరీ కమిటీ (పీసీ అండ్ పీఎన్టీఈ యాక్ట్ 1994) రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లల ప్రాధాన్యతపై గ్రామ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన చర్యల పై చర్చించారు. గర్భస్రావాలు నిర్వహించే ఆస్పత్రులు ఎంటీపీ ఆక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ సౌమ్య, విన్ని, వాసు, సఖీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ శ్వేత, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
పండుటాకులకు ఆదరణేది?
● శాపంగా మారిన వృద్ధాప్యం ● సాంత్వన దొరకక సతమతం ● వెలుగులోకి పలు ఘటనలునిర్మల్ఖిల్లా: ఆలనాపాలన లేక వృద్ధ దంపతులు తల్లడిల్లుతున్న ఉదంతాలు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. తమ బాగోగులు చూడడం లేదంటూ కొడుకులపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా యి. తమ స్థిర, చరాస్తులను అనుభవిస్తూ తమను మాత్రం దూరం పెడుతున్నారని పలువురు వృద్ధ త ల్లిదండ్రులు గోడు వెల్లబోసుకుంటున్నారు. వారంక్రితం కుంటాల మండలం లింబా (కే) గ్రామానికి చెందిన బంజ లక్ష్మి అనే వృద్ధురాలు తన పిల్లలు పోషణను విస్మరిస్తున్నారని భైంసా ఆర్డీవో కోమల్కు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ కమల్సింగ్ ఆ గ్రామాన్ని సందర్శించి వృద్ధురాలి పిల్లలతో మాట్లాడారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె బాగోగులు, యోగక్షేమాలు, సంరక్షణ చర్యలు చూసుకోవాలని సూచించారు. మూడు నెలల క్రితం దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తులు రాయించుకుని వారికి పట్టెడన్నం పెట్టకుండా తీవ్ర మానసికక్షోభకు గురి చేయగా అతడి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ఇటీవల సారంగపూర్, దిలావర్పూర్ మండలాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయి. చట్టాలున్నా చర్యలేవి? వయోవృద్ధుల సంక్షేమానికి సీనియర్ సిటిజెన్స్ యాక్ట్–2007 సక్రమంగా అమలులో లేదు. వృద్ధు ల సామాజిక, ఆర్థిక భద్రత, ఆస్తుల సంరక్షణ లాంటి వాటిపై తగిన చర్యలు లేవు. ఈ చట్టాలపై దృష్టి పెట్టి అవగాహన కల్పించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. చట్టాల అమలులో తాత్సారం చే యకుండా సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. యాక్ట్కు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి సంక్షేమ నియమావళిని రూపొందించాయి. 2011, 2019లో ఈ యాక్ట్కు కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేసినా, అవి పూర్తిస్థాయిలో అమలులోకి రా వాల్సి ఉంది. వయోవృద్ధులు ఎదుర్కొంటున్న స మస్యల పరిష్కారానికి ‘ఎల్డర్ లైన్ 14567’ పేరిట హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా పో షణ, సంరక్షణ, నిరాశ్రయ వృద్ధులకు తగిన సహకారం, చట్టపరమైన తోడ్పాటు, మానసిక భావోద్వేగాలకు కౌన్సెలింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. వృద్ధులపై వివక్ష వద్దు వృద్ధులపై వివక్ష చూపించడం తగదు. వారిని ని రాదరణకు గురి చేయొ ద్దు. ఎక్కడైనా వివక్ష చూపిస్తే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అవగాహన కల్పి స్తున్నాం. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వయోవృద్ధులు హెల్ప్లైన్ నంబర్ 14567కు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఫైజాన్ అహ్మద్, జిల్లా సంక్షేమశాఖల అధికారి -
‘భరోసా’తో వివాదాలు పరిష్కారం
● ఎస్పీ జానకీ షర్మిల ● భైంసాలో ప్రజావాణిభైంసాటౌన్: పట్టణంలో ప్రతీ బుధవారం నిర్వహించే భరోసా కేంద్రం కుటుంబ వివాదాల పరి ష్కారంలో సత్ఫలితాలిస్తోందని ఎస్పీ జానకీ ష ర్మిల తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడా రు. అంతకుముందు డివిజన్ పరిధిలోని పలువు రు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత ఎస్హెచ్వోలకు ఫోన్లో ఆదేశాలు, సూచనలు చేశారు. బాధితులకు స త్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రంలో కు టుంబ వివాదాల కేసులు, పురోగతి వివరాలు తె లుసుకున్నారు. కుటుంబ సమస్యలపై షీటీం సి బ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలి పారు. భైంసాలో భరోసాకేంద్రం ఏర్పాటుపై స్థా నికులు హర్షం వ్యక్తంజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఎస్పీ అవినాష్కుమార్, సీఐలు, ఎస్సై ఉన్నారు. మహ్మద్ గౌస్ సేవలు ఎనలేనివి పట్టణంలో ఎస్సైగా పనిచేసిన మహ్మద్ గౌస్ సేవలు ఎనలేనివని ఎస్పీ జానకీ షర్మిల కొనియాడా రు. గౌస్ ఇటీవల రిటైర్డ్ కాగా పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐలు, ఎస్సైలు గౌస్ విధి ని ర్వహణ తీరు కొనియాడారు. అనంతరం శా లు వాలు, పూలమాలలతో సన్మానించారు. సీఐలు గోపీనాథ్, నైలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లున్నారు. -
నిర్మల్
నారుమడులకు నీరేది? ‘స్వర్ణ’ ఆయకట్టు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వర్షాలు లేక ప్రాజెక్ట్ నిండకపోవడంతో నీరు రాక వరినా ర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025˘9లోu ‘కేంద్ర’ పథకాల పరిశీలన కుంటాల: మండలంలోని అందకూర్, అంబ కంటి తండాల్లో ఎల్ఎన్ఎం టీం సభ్యులు బు ధవారం కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించారు. ఈజీఎస్, సంసద్ ఆదర్శ గ్రామీణ యో జన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ డే తదితర పథకాలను టీం సభ్యులు నారాయణ, రాజేశ్వర్రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవో శ్రీనివాస్, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, ఏపీవో నవీన్, పంచాయతీ కార్యదర్శులు, రమ్య, సతీశ్, టీఏలు జైసింగ్, శశిందర్, ఎఫ్ఏ భోజన్న తదితరులున్నారు. నిర్మల్: పడుతూ ఆగుతున్న వర్షాలు, మళ్లీ మండుతున్న ఎండలు.. ఇలా వాతావరణంలో తీవ్రమార్పులతో పాటు అపరిశుభ్రతతో జిల్లాలో దోమలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరల్ ఫీవర్లు ఉండగా, ఇటీవల ప్రాణాంతక డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైరల్ ఫీవర్లు, జలుబు, జ్వరాలతో జిల్లాప్రజలు బాధపడుతున్నారు. మరోవైపు క్రమంగా డెంగీ అటాక్ చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు వందమంది వరకు డెంగీ బారినపడ్డట్లు సమాచారం. స్థానిక ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, హైదరాబాద్లో కొందరు చికిత్స పొందుతున్నారు. ప్రతీ వర్షాకాలం సీజన్ మొదలైందంటే.. డెంగీకి భయపడాల్సి వస్తోంది. ఈసారి సీజన్లోనూ దోమలు పెరుగుతున్నా యి. క్రమంగా బాధితులూ పెరుగుతున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో డెంగీకి కావాల్సిన వైద్య సదుపాయాలు, ప్లేట్లెట్స్ కౌంటింగ్ యంత్రం అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యంతోనే వ్యాప్తి.. చిన్నపాటి నిర్లక్ష్యంతోనే డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి రావడానికి కారణమైన దోమలను ఓ రకంగా మనమే పెంచుతున్నాం. ప్ర ధానమంత్రి నుంచి పారిశుధ్య కార్మికుడి దాకా స్వ చ్ఛత పాటించండి.. అని ఎంత చెబుతున్నా.. కనీ సం వినేవారే లేరు. ఈ నిర్లక్ష్యం కారణంగా పెరిగే అపరిశుభ్రతే టైగర్ దోమ వ్యాప్తికి కారణమవుతోంది. టైగర్ దోమ జీవిత చక్రం వారంరోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఇది మిగతా దోమలకు విరుద్ధంగా మంచినీటి నిల్వల్లోనే గు డ్లు పెడుతుంది. మన ఇంటి పరిసరాల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన కూలర్లు, పాత్రలు, టబ్బులు, బకెట్లు, పాత సామగ్రి, తాగి పడేసిన కొబ్బరిబోండాలు, చిప్పలు, సీసాలు, ఖాళీ పూలకుండీలు, ప్లాస్టిక్ గ్లాసులు, టైర్లు.. వీటిలోనే వర్షపునీరు చేరి నిల్వ ఉంటుంది. అలాంటి నీటి నిల్వలే ఈ దోమల ఉత్పత్రికి నివా సాలుగా మారుతున్నాయి. ఇవి గుడ్లు పెట్టిన వారంలోనే దోమగా మారి కుట్టడం గమనార్హం. ఆలస్యం చేస్తే ప్రమాదమే.. పగటిపూట ఎటాక్ చేసే టైగర్దోమ వరుసగా ఐదారుసార్లు కుట్టేందుకు ప్రయత్నిస్తుంది. అలా దాని బారిన పడితే ముందుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. జలుబు, వాంతులు, కీళ్లనొప్పులు, ఒంటిపై దద్దుర్లు, కంటి సంబంధ సమస్యలు మొదలవుతాయి. ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. చాలామంది సాధారణ జ్వరం అనుకుని ఇంటిపట్టునే ఏ ఆర్ఎంపీనో, స్థానిక ప్రాక్టీషనర్నో సంప్రదించి మందులు వాడుతుంటారు. అప్పటికీ తగ్గక పోతేనే అర్హత ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తుంటారు. ఈక్రమంలో ఏమాత్రం ఆలస్యం చేసినా.. ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. నిర్ధారణ పరీక్షతోనే డెంగీ ఉన్నదీ.. లేనిది తేలుతుంది. డెంగీ నిర్ధారణ పరీక్ష చేసుకున్న తర్వాత పాజి టివ్ రిపోర్ట్ వస్తేనే అవసరమైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో చికిత్స పొందాలి డెంగీ జ్వరంతోనే ప్రారంభమవుతుంది. తీవ్రమైన జ్వరంతో తలనొప్పి రావడం, బీపీడౌన్ కావడం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు తదితర లక్షణాలుంటాయి. జ్వరం తగ్గుతున్నట్లు అనిపించినా ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. చాలామంది సాధారణ జ్వరం అనుకుంటారు. కానీ, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ బీ రవి, ఎండీ, జిల్లా జనరల్ ఆస్పత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులుకార్మికులకు స్పెషల్ సెల్ నిర్మల్ఖిల్లా: అసంఘటితరంగ కార్మికుల సంక్షేమానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చే స్తూ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ ఎస్.శ్రీవాణి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ విభాగంలోని ప్యానెల్ అడ్వకేట్ వీ మధుకర్, ససర్డ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, పారా లీగల్ వలంటీర్లు ఎస్.కమలా కర్, జాప రాములు ప్రభుత్వ పథకాల అమలు లో కార్మికులకు తోడ్పాటునందిస్తారు. సేవలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.న్యూస్రీల్బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు నిర్మల్టౌన్: ఈనెల 17 నుంచి 20వరకు జిల్లా కేంద్రంలోని కొండాపూర్ వద్ద గల నిర్మల్ స్పో ర్ట్స్ అకాడమీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఏర్పాట్లు చేశారు. బుధవారం రిఫరీ పీవీఎ ల్ కుమార్, మ్యాచ్ కంట్రోలర్ భాస్కర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్గౌడ్ ఏర్పాట్లు పరిశీలించారు. అండర్–19 బాలబాలికలకు సింగిల్స్, డబుల్, మిక్స్ డబుల్ విభాగాల్లో పోటీలుంటా యని తెలిపారు. 17న క్వాలిఫైయింగ్ పోటీలు, 18 నుంచి 20 వరకు మెయిన్ డ్రా పోటీలుంటా యని పేర్కొన్నారు. కోఆర్డినేటర్లు భూమన్న, మధు, నందకుమార్, ప్రశాంత్ ఉన్నారు. జిల్లాలో దోమల స్వైరవిహారం పెరుగుతున్న జ్వర పీడితులు జిల్లాలో 100 మంది బాధితులు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిక చర్యలు చేపట్టాలంటున్న ప్రజలుపగటిపూటనే కుట్టే ‘టైగర్’..టైగర్ (ఎడిస్ ఈజీఫ్లై) ఈ దోమనే మనిషి ప్రాణాలు తీసే డెంగీకి కారకం. పగటి పూట మాత్రమే కుట్టే ఈ దోమ మనిషి ప్రాణాలనూ తీస్తుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది కుడుతుంది. రాత్రిపూట చీకటి ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. చూసేందుకు మామూలు దోమ కంటే చిన్నసైజులో ఉండే దీని కాళ్లు, రెక్కలపై తెల్లమచ్చలుంటాయి. నేలకు తక్కువ ఎత్తులో తిరుగుతూ.. ఎక్కువగా కాళ్లు, మడమల వద్ద కుడుతుంది. డెంగీ బారిన పడినవారికి తీవ్రమైన జ్వరం, జలు బు, వాంతులు, నొప్పులు మొదలవుతాయి. రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. -
గల్ఫ్లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్రాజ్, విహాన్ రాజ్లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నవోదయలో ఆటలపోటీలు
● 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్నగర్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి. జరుగనున్న ఈవెంట్స్ అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్నగర్ -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్కుమార్ -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్చైన్గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు. దరఖాస్తు గడువు.. అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అవగాహన లేమి.. బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీడీలు చుడుతున్న మహిళా కార్మికులుఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా బీడీ కార్మికులు నిర్మల్ 70,000 ఆదిలాబాద్ 3,000 కుమురంభీం 1,500 మంచిర్యాల 700 మొత్తం 75,200సద్వినియోగపర్చుకోవాలి బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్, బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్ అర్హతలు పదోతరగతి, ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు. దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు. తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం. విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో ఉపకార వేతనం (రూ.ల్లో) తరగతి స్కాలర్షిప్ 1 నుంచి 4 1,000 5 నుంచి 8 1,500 9 నుంచి 10 2,000 ఇంటర్ 3,000 డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000 -
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యతలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బేలలో యువకుడు..బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు. లింబగూడలో ఇంటర్ విద్యార్థి..సిర్పూర్(టి): మండలంలోని లింబగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గంజాయి కేసు నమోదునెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలుభీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు. కిరాణ దుకాణానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అతని భార్య వనిత ఇచ్చోడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీటీడబ్ల్యూఆర్జేసీ ప్రహరీ పక్కన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థా నికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా పద్మశాలి సంఘం సమన్వయకర్త, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వీనర్ ఆడెపు భూమన్న (61) సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్ను దాటే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
హాజరుశాతం పెంచాలి
తానూరు: విద్యార్థుల హాజరు శాతం పెంచాలని డీఐఈవో పరశురాం సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చూడాలని అధ్యాపకులు, ప్రిన్సిపాల్కు రాజశేఖర్కు సూచించారు. అనంతరం విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవనంలో సౌకర్యాలు లేవని అధ్యాపకులు, విద్యార్థులు డీఐఈవోను కోరారు. నూతన భవనం పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. స్పందించిన పరశురాం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భవన నిర్మాణం ప్రారంభించేలా చూస్తామని తెలిపారు. -
ఐఎంఏ ఆధ్వర్యంలో వనమహోత్సవం
నిర్మల్ఖిల్లా: ప్రకృతితోనే మానవ మనుగడ సాధ్యమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్మల్ శాఖ కార్యవర్గ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ సంఘ కార్యాలయంలో వైద్యులు దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు. ప్రకృతి ఒడిలో అనేక రకాల మొక్కలు ఫలాలను, నీడను, ఔషధాలను అందిస్తున్నాయని తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి అవి పెరిగే వరకు రక్షించాలని సూచించారు. అనంతరం వనమహోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ నిర్మల్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీధర్, ప్రమోద్చంద్రారెడ్డితోపాటు సీనియర్ వైద్యులు అప్పాల చక్రధారి, ఉప్పు కృష్ణంరాజు, రామకృష్ణ, జి.రమేశ్, దేవేందర్రెడ్డి, రఘునందన్రెడ్డి, శ్రీనివాస్, సుచిన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
డీ–1 పట్టాలపై సర్వే చేయాలి
●˘ MýSÌñæ-MýStÆŠ‡ AÀ-ÌêçÙ AÀ-¯]lÐŒæనిర్మల్చైన్గేట్: అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డీ–1 పట్టాల జారీపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీ–1 పట్టాలపై క్షేత్రస్థాయిలో స ర్వే చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. భూహక్కులపై స్పష్టత కలిగేలా దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్లో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, తహసీల్దార్లు, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
ఖానాపూర్: వర్షాకాలంలో అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలోని మినీ స్టేడియం ప్రాంతంలో వనమహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. పట్టణ పరిధిలోని ప్రజలకు మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు అందజేసి వాటిని పర్యవేక్షించే బాధ్యతను అధి కారులు, సిబ్బంది తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం తదితరులు ఉన్నారు. -
ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది ప డుతున్నారని, దీనిపై పోలీసులు దృష్టిసారించాల ని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్య, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై మంగళవా రం సమీక్ష నిర్వహించారు. మిస్సింగ్ కేసులు, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద ఉన్న కేసుల పురోగతిపై ఆరాతీశారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కేసుపై సమగ్ర విచారణ.. ఠాణాల్లో నమోదైన ప్రతీ కేసుపై సమగ్రంగా, సమర్థవంతంగా విచారణ చేసి కోర్టులో నేరం నిరూపించాలని ఎస్పీ సూచించారు. విచారణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. -
అజ్ఞాతం వీడుతున్నారు..!
● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్ కగార్తో పంథా మారిన వైనం దళంలోనే ఒక్కటై.. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూర్ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్వార్ గ్రూప్ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జీగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు, సొంతూరును విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజుకు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావో యిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా మావోయిస్టు దంపతులు అజ్ఞాతం వీడగా.. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉనికిని కోల్పోతున్న పార్టీ నిత్యం పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజులొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్(69) మొదలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్చార్జి కాసర్ల రవి ఉరఫ్ అశోక్, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. గత నెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జీ మైలరాపు అడెల్లు ఉరఫ్ భాస్కర్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది. మిగిలిందెందరు? గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్య నేత మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ ఉరఫ్ దాదా సింగరేణి కోల్బెల్ట్ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్కౌంటర్లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అన్న వచ్చిన 37ఏళ్లకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్వార్ సిర్పూర్ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్ జోన ల్ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. -
ఆగుడా.. సాగుడా..?
నిర్మల్బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. 10లోu బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025హంగిర్గా సొసైటీకి అవార్డుతానూరు: తానూరులోని హంగిర్గా సొసైటీకి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు లభించిందని సొసైటీ బ్యాంక్ చైర్మన్ నారయణరావుపటేల్, సీఈవో భుమయ్య తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హంగిర్గా సొసైటీ బ్యాంక్ రైతులకు రుణాలు అందించి, మెరుగైన రికవరీ చేయడంతో ఈ అవార్డు అందినట్లు తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన నాబార్డ్ 44వ వారికోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవార్డు ప్రదానం చేశారు. లక్ష్మణచాంద/భైంసా రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం నెమ్మదిగా సా గుతోంది. వరి, సోయాబీన్, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి పంటలను ఇప్పటికే రైతులు విత్తారు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో వరిసాగు ఆలస్యమవుతోంది. ఈ వానాకాలంలో జూలై 14 నాటికి సాధారణ వర్షపాతం 306.1 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, 224.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 26.7 మిల్లీమీటర్ల లోటువర్షపాతం ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద రాలేదు. దీంతో కడెం మినహా మిగతా జలాశయాలు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. దీంతో రైతులు వరి సాగు చేయాలా.. వేచి చూడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. సాగు అంచనా ఇలా.. జిల్లాలో మొత్తం 4.15 లక్షల ఎకరాల్లో పంటల సా గవుతాయని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూ పొందించారు. ఈ సీజన్లో వరి 1.35 లక్షల ఎకరా ల్లో, సోయాబీన్ 1.05 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 20 వేల ఎకరాల్లో, పసుపు 5,542 ఎకరాల్లో, కంది 9,693 ఎకరాల్లో, పెసర 210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ఆరుతడి పంటలు అంచనా మేరకు సాగు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు వాటికి అనుకూలంగానే ఉన్నాయి. వరి మాత్రం కేవలం 1,000 ఎకరాల్లోనే నాట్లు వేశారు. ఇప్పటికే నార్లు ఎదిగి ఉన్నాయి. భారీ వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం.. జిల్లా రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామ దేవతలకు పూజలు, జలాభిషేకాలు, భజనలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఒక భారీ వర్షం కురిస్తే చెరువులు, ప్రాజెక్టులు నిండి, భూగర్భ జలాలు పెరిగి, బోర్లు, కాలువల ద్వారా సాగుకు నీరు అందుతుందని ఆశిస్తున్నారు.ఆందోళన వద్దు.. జిల్లాలో ముందస్తు వర్షాలు కురిశాయి. ఇప్పుడు లేవు. భారీ వర్షాలు కురిసిన తర్వాతనే వరి నాట్లు వేసుకోవాలి.త్వ రలో మంచి వర్షాలు వున్నాయని వాతావరణ శాఖ తెలిపుతోంది. రైతులు ఆందోళన చెందొద్దు. ఆగస్టు 20 వరకు నాట్లు వేసుకోవచ్చు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ‘సరస్వతి’ నీళ్లు వస్తేనే.. మాది లక్ష్మణచాంద మండలం. మా మండలానికి సరస్వతి కాలువనే ప్రధాన ఆధారం. కాలువ నీళ్లు వస్తేనే చెరువులు, కుంటలు నిండుతాయి. పంటలు సాగవుతాయి. ఎస్సారెస్పీలో నీళ్లు లేక కాలువ రావడం లేదు. – రమణారెడ్డి రైతు భారీ వర్షం లేదు ఈయేడు ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. భారీ వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రస్తుతం బోరు బావుల్లో నీరు తగ్గింది. వారం రోజులుగా జల్లు వానలు కూడా కురవడం లేదు. భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. – విశ్వనాథ్, రైతు కోతల్గాం న్యూస్రీల్ ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు వర్షాలు లేక రైతుల ఇబ్బందులు జిల్లాలో 26.7 మి.మీల లోటు వర్షపాతం వెలవెలబోతున్న చెరువులు, కుంటలు వెయ్యి ఎకరాల్లోనే వరినాట్లు వెలవెలబోతున్న చెరువులు, కుంటలు.. జిల్లాలోని నిర్మల్, భైంసా, కోతల్గాం, తిమ్మాపూర్, కామోల్, లోకేశ్వరం, తానూరు, కుభీరు, కుంటాల, సారంగాపూర్, నర్సాపూర్, ఖానాపూర్ మండలాల్లో ప్రధాన చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. దీంతో వరినాట్లు ఎలా వేయాలో తెలియక వరణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బోర్లు, బావుల్లోనూ నీటిమట్టం తగ్గడంతో నాట్లు వేయడానికి వెనుకాడుతున్నారు. వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేయడం, ఎండ తీవ్రత పెరగడంతో సోయాబీన్, పత్తి, మొక్కజొన్న మొలకలు వాడిపోతున్నాయి. భూమిలో తేమ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
రైతులకు అండగా ప్రభుత్వం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ● కడెం ఎడమ కాలువకు నీటి విడుదలకడెం: రైతులకు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు ప్రాజెక్టు ఈఈ విఠల్, ఏఎంసీ చైర్మన్ భూషణ్తో కలిసి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ పంటలు వేసుకోవాలని సూచించారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రూ.9.46 కోట్లతో వరద గేట్లు మరమ్మతుల చేయించామని తెలిపారు. ఇటీవలే రూ.33.5 లక్షలతో ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టామన్నారు. త్వరలో ప్రాజెక్టులో పూడికను తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు రోడ్డుకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని పెద్దూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలో సెప్టిక్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. నచ్చన్ఎల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోలార్ ఫెన్సింగ్ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి, నచ్చన్ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ గంగన్న, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల, జన్నారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల్లో పీటీఎం
లక్ష్మణచాంద: మాధ్యమిక విద్య విద్యార్ధి దశలో అత్యంత కీలకమైనది. ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలకు పూలబాటవేస్తాయి. మాధ్యమిక విద్యలో విద్యార్థులు ఎంచుకునే గ్రూపులు భవిష్యత్లో వారు ఏం కావాలో నిర్ణయిస్తుంది. లక్ష్యం మేరకు కోర్సులను ఎంపిక చేసుకోవాలని విద్యావంతులు సూచిస్తుంటారు. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల్లో చాలా మంది ఉత్తీర్ణత సాధించలేక ఇబ్బందిపడుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేలా పీటీఎం(పేరెంట్ టీచర్ మీటింగ్)ను జూనియర్ కళాశాలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. సందేశం పంపి.... ఇప్పటి నుంచి కళాశాలలో నిర్వహించే పోషకుల సమావేశంపై రెండు రోజుల ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ప్రతీనెల లేదా రెండు నెలలకు ఒకసారి నిర్వహించే పోషకులు–అధ్యాపకుల సమావేశాలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు అయ్యేలాగా చూడాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతం, అప్పటి వరకు వారి ప్రగతి నివేదికలు సమావేశంలో చర్చిస్తారు. విద్యార్థులు ఏ దశలో ఉన్నారు, ఏయే పాఠ్యాంశాలలో వెనుకబడ్డారు. కళాశాలలో ఎలా ప్రవర్తిస్తున్నారు వంటి అంశాలకు తల్లిదండ్రులకు తెలియచేస్తారు. ఇంటికి వచ్చిన తరువాత విద్యార్ధి చదివేలాగా చూడాలని పోషకులకు సూచించనున్నారు. దీంతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేస్తారు. సమావేశాలతో ప్రతీ తల్లిదండ్రికి తమ పిల్లల అభ్యసన స్థాయి తెలుసుకుని వారిపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది. పకడ్బందీగా అమలు.. రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న పీటీఎం కళాశాలల ప్రిన్సిపాళ్లు పకడ్బందీగా నిర్వహిస్తే విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీనెల, లేదా రెండు నెలలకు ఒకసారి నిర్వహించి విద్యార్థుల స్థితిగతులు తల్లిదండ్రులకు వివరించి ఉత్తమ ఫలితాలు వచ్చేలాగా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని పోషకులు కోరుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు ప్రభుత్వ సూచనల మేరకు ఇంటర్ కళాశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించాలని అ న్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేస్తాం. పీటీఎం నిర్వహించడం ద్వారా వి ద్యార్థుల స్థితిగతులు తెలుసుకుని లోపాల ను సరిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించేందు కు అవకాశం ఉంది. – పరశురామ్నాయక్, ఇంటర్ నోడల్ అధికారిమంచి నిర్ణయం ఇంటర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచి తద్వారా మెరుగైన ఫలితాల సాధన కోసం పీటీఎం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి నిర్ణయం. దీంతో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. హాజరు, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. – పురుషోత్తం, వృక్షశాస్త్రం అధ్యాపకుడు, మామడ హాజరు మెరుగుపడెలా.. ఉత్తీర్ణత పెంచేలా.. ప్రభుత్వం కీలక నిర్ణయం జిల్లా సమాచారం.. మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 13 మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 2,240 సెకండియర్ విద్యార్థుల సంఖ్య 2,460 -
పోడు కోసం పోరాటం
● పునరావాస భూముల్లో హద్దురాళ్లు ● అడ్డుకున్న గిరిజనులు ● మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత ● పనులు నిలిపివేసిన అధికారులు కడెం: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామ పరి ధిలోని పెత్తర్పు సమీపంలో అటవీ భూమి కోసం గిరిజనులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాలకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ, ఆటవీ శాఖ అధికారులు పోలీసు బందోబస్తుతో మంగళవారం సర్వే చేపట్టారు. తాము ఏళ్లుగా సాగుచేస్తున్న పోడు భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతి రేకిస్తూ గొండుగూడ వాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు భూములు కేటాయించిన తర్వాతే పునరావాస గ్రామస్తులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. తమ భూములను వదులుకోమని పట్టుబట్టడంతో అధికారులు తాత్కాలికంగా సర్వే పనులను నిలిపివేశారు. గిరిజనులతో మాట్లాడిన ఆర్డీవో, ఎఫ్డీవో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎఫ్డీవో రేవంత్చంద్ర గోండుగూడ గిరిజనులతో మాట్లాడారు. 2015లో అటవీ భూములను పునరావాస గ్రామాల ప్రజల కోసం డీనోటిఫై చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఆర్డీవో తెలిపారు. చట్టప్రకారం రాంపూర్, మైసంపేట్ గ్రామాల పునరావాస ప్రజలకు భూములు చెందుతాయని తెలిపారు. ఈ సర్వే భూముల తుది హద్దులను గుర్తించేందుకేనని చెప్పారు. ఈ సర్వేపై ఆందోళన చెందవద్దని, ఏవైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఏఎస్పీ రాజేశ్ మీనా, సీఐ ఆజయ్, ఎస్సైలు సాయి కిరణ్, సాయి కుమార్ బందోబస్తు విధులను పర్యవేక్షించారు. -
ఆడంబరాలు వద్దు..
● సాదాసీదానే ముద్దు.. ● వేడుకల పేరుతో వృథా ఖర్చుపై మహిళల అభ్యంతరం ● పెరిగిన ప్లాస్టిక్ వినియోగంపై ఆందోళన ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తీర్మానంనిర్మల్ఖిల్లా: ఆడంబరాల పేరుతో డబ్బులు వృథా చేయవద్దని, సాదాసీదాగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ని ర్వహించాలని జిల్లా మహిళలు అన్నారు. పట్టణంలోని ఏఎన్.రెడ్డి కాలనీ క్లబ్హౌస్ సమావేశ మంది రంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి జి ల్లాకు చెందిన 150 మందికిపైగా మహిళలు హాజరయ్యారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో ఆడంబర ఖర్చులను తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తీర్మానించారు. ప్రస్తుతం ఉన్నత, మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలుసహా అన్నివర్గాల ప్రజలు శుభకార్యాలలో హంగు, ఆర్భాటాల పేరుతో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని పలువురు తెలిపారు. దీనిని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఆలోచనా విధానం మారాలి.. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానంలో వచ్చిన మార్పులకు తగ్గట్టు కుటుంబాల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని మహిళలు పేర్కొన్నారు. సమాజానికి ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణానికి హాని కలగని విధంగా శుభకార్యాలు నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల వినియోగాన్ని నివారించాలని, మొక్కల ప్రాధాన్యతను సమాజానికి తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు కేశపల్లి ఇందిర, అల్లోల వినోద, శిరీష, విజయలక్ష్మి, సుజన, సౌజన్య, సరళ, స్వరూప, సుమ, శోభ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో వసతులు కల్పించాలి
నిర్మల్: జిల్లాలోని కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలా ష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధి త అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. భవనాల పైకప్పు లీకేజీలు, మరమ్మతులు, అ దనపు మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు తదితర సమస్యలపై నివేదిక ఇవ్వాలని త హసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఉపాధిహామీ పథకం నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. అ నంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి న కలెక్టర్ పీహెచ్సీలకు అనుబంధంగా సబ్సెంటర్ల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించా లని సూచించారు. నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్ల పురోగతి వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. పూర్తయిన కేంద్రాల ప్రారంభా నికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా స మావేశాల్లో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, డీ ఈవో రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, కే జీబీవీల సమన్వయకర్త సలోమి కరుణ, తహసీ ల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్!
● త్వరలో పాఠశాలల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం ● ఆన్లైన్లోనే హాజరు నమోదు ● ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖలక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం (ఫేస్ రికగ్నీషన్ సిస్టం) రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు ఈ విధానం అమలులో ఉంది. ఉపాధ్యాయులకూ అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు.. గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల హాజరును 90 శాతానికి పెంచేందుకు ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టం) సత్ఫలితాలు ఇచ్చింది. ఈ విధానం కింద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సాంకేతికతతో రూపొందించిన యాప్ను 2023లో అభివృద్ధి చేశారు. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ను ఉపయోగించి, విద్యార్థుల ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఒకేసారి 15 నుంచి 20 మంది విద్యార్థుల హాజరును నమోదు చేస్తుంది. ఈ విధానం విద్యార్థుల హాజరు శాతాన్ని కచ్చితంగా లెక్కించడంతోపాటు, మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు తోడ్పడుతోంది. ఈ ఫలితాల ఆధారంగా, ఉపాధ్యాయుల హాజరు కోసం కూడా ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లాలో 2,571 మంది ఉపాధ్యాయులు.. జిల్లాలో 88 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 47 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, 1,176 మంది స్కూల్ అసిస్టెంట్లు, 1,237 మంది ఎస్జీటీలు, 11 మంది లాంగ్వేజ్ పండిట్లు, 12 మంది పీఈటీలుసహా మొత్తం 2,571 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధానం అమలైతే పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు మెరుగుపడనుంది. డుమ్మాలకు చెక్.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలా మంది సమయపాలన పాటించడం లేదు. ఇదే సమయంలో పాఠశాలకు వెళ్లకున్నా.. వెళ్లినట్లు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కొందరు ఆలస్యంగా బడికి వెళ్లి.. తొందరగా ఇంటికి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్ఆర్ఎస్ అమలయితే డుమ్మాలకు చెక్ పడుతుంది. సమయపాలన మెరుగుపడుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఆదేశాలు రాలేదు.. ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు నమోదుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేవు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు చేపడతాం. ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని ఆదేశిస్తే, అమలుకు సిద్ధంగా ఉన్నాం. – రామారావు, జిల్లా విద్యాధికారి -
‘తోడిశెట్టి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
● కవితా సంకలనాల్లో సోన్ ఎంఈవో కవితలు ● అభినందించిన జిల్లా సాహితీ వేత్తలు సోన్: మండల విద్యాధికారి, కవి, రచయిత తోడిశెట్టి పరమేశ్వర్కు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. ఆయన రాసిన కవితలకు ఇటీవల విడుదలైన రెండు కవితా సంకలనాల్లో స్థానం దక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విడుదలైన ‘సాహితీ విపంచి’ కవితా సంకలనంలో పరమేశ్వర్ రచించిన ‘సంఘర్షణ’ కవిత ప్రచురితమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విడుదల చేసిన ‘తల్లీ.. నీకు వందనం’ కవితా సంకలనంలో తోడిశెట్టి రాసిన ‘మా అమ్మ.. అపర బ్రహ్మ’ కవిత ప్రచురితమైంది. సాహిత్య, విద్యారంగంలో కృషి నాలుగు దశాబ్దాలుగా తోడిశెట్టి పరమేశ్వర్ ఆకాశవాణి ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల ద్వారా ‘వైజ్ఞానిక సౌరభాలు’, ‘విజ్ఞాన వీచికలు’, ‘సైన్స్ సందేహాలు.. సమాధానాలు’, ‘లోగిలి కుటుంబ గాధ రూపకాలు’ శీర్షికల కింద ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేశారు. జిల్లాలో ప్రముఖ కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన ‘అక్షర సౌరభం’, ‘మొల్లమాంబ సాహితీ వైభవం’, ‘వైజ్ఞానిక సౌరభాలు’ వంటి పుస్తకాలను రచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా తోటి సాహితీ మిత్రులతో కలిసి ‘నిర్మల భారతి’ సాహి త్య, కళా, సాంస్కృతిక, సామాజిక సంస్థను స్థాపించి, సాహితీ కార్యక్రమాలు, విద్యార్థుల కోసం వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. గుర్తింపు, అవార్డులు.. సాహిత్యం, విద్యారంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులను పరమేశ్వర్ అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రెండు కవితా సంకలనాల్లో ఆయన కవితలు ప్రచురితం కావడంపై జిల్లా కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పరమేశ్వర్ సాహిత్యం, విద్య, సామాజిక కార్యక్రమాల్లో చేస్తున్న కృషి యువ కవులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. -
‘ప్రజా’ ఫిర్యాదులు పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ నిర్మల్టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడును ఓపికగా విన్నారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ప్రజావాణికి భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర అంశాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూభారతి చట్టం అమలును తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని, దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే 55 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన భాగాన్ని తక్షణమే పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం రూ పొందించిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రెండోదశ జ్వర సర్వే 34 శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీడీవోలు వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని శాఖల పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిర్మల్ జిల్లా సంరక్షణ గృహాల్లో ఉండే అనాథ పిల్లలకు ప్రత్యేక ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. వీటి ద్వారా వారికి రూ.10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతుందని పేర్కొన్నారు. సబ్సిడీ చెక్కు అందజేత సారంగాపూర్ మండలం తాండ్ర(జి) గ్రామానికి చెందిన రైతు సందుపట్ల రాజేశ్వర్కు మల్బరీ సాగుకు షెడ్ నిర్మాణానికి సిల్క్ సమగ్ర–2 పథకం కింద రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. తొలి విడతగా రూ.93,775 సబ్సిడీ చెక్కు మంజూరు కాగా, కలెక్టర్ లబ్ధిదారుకు అందజేశారు. రైతులు వినూత్నంగా ఆలోచించి కొత్త పంటల సాగు చేసి, అధిక లాభాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సమస్యలు తీర్చాలి కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. గ్రామానికి రోడ్డు వెయ్యాలి. బస్సు సౌకర్యం కల్పించాలి. మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉ న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. – సాంగ్వి గ్రామ ప్రజలుకెనాల్ సరి చేయాలి సారంగాపూర్లోని అంబావాయి చెరువు కెనాల్ సరిచేయాలి. కెనాల్ సరిగా లేక 200 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. సమస్యను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. మీరైనా కెనాల్ను సరిచేయించి సాగునీరందించాలి. – సారంగాపూర్ రైతులు -
చైతన్యంతోనే సామాజిక ప్రగతి
● బహుజన సాహితీవేత్తలు, బీసీసంఘాల ప్రతినిధులు ● ‘బహుజనగణమన’ కవితా సంపుటి ఆవిష్కరణనిర్మల్ఖిల్లా: అణగారిన, బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం వస్తేనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పలువురు బహుజన, సామాజిక నాయకులు, సాహితీవేత్తలు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహం ఎదుట ప్రముఖ కవి, రచయిత జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజన గణమన’ అనే కవితా సంపుటిని సోమవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్ర ముఖ కవి డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం సాక్షిగా అందరికీ సమాన ఫలాలు అందాలంటే బడుగు బ లహీనవర్గాల్లో చైతన్య దీప్తి పెంపొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమ సమన్వయకర్త, కవి ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ.. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పొందినప్పుడే ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. మహాత్మాజ్యోతిబాపూలే స్ఫూర్తితో బలహీనవర్గాలందరూ సమష్టిగా ఉద్యమించాలని సూచించారు. రచయిత గౌరీ శంకర్ సామాజిక చైతన్యస్ఫూర్తితో ఈ కవితా సంపుటిని రచించారని కవి, సామాజికవేత్త తుమ్మల దేవరావు అన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్తలు, బీసీసంఘాల ప్రతినిధులు చిలుక రమణ, వేణుగోపాలకృష్ణ, విజయ్కుమార్, నేరెళ్ల హనుమంతు, కత్రోజు అశోక్, సిరికొండ రమేశ్, బిట్లింగు నవీన్, నాగోరావు, బొంపాల చిన్నయ్య, పోలీస్ భీమేశ్, శనిగరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల భద్రతకు ‘నమస్తే’
● కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో అమలు ● గుర్తించిన కార్మికుల వివరాలు యాప్లో నమోదుపథకంలోని ప్రధాన అంశాలు.. ● ఆరోగ్య సదుపాయం: ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం. ● సబ్సిడీ సాయం: పారిశుద్ధ్య సంబంధిత వాహనాల కొనుగోలుకు సబ్సిడీ. ● విద్యాసాయం: కార్మికుల పిల్లల విద్యకు ఆర్థిక సహాయం. ● పునరావాసం: ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ద్వారా కార్మిక కుటుంబాలకు పునరావాసం. నిర్మల్చైన్గేట్: మున్సిపాలిటీలలో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం ‘జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ(నమస్తే)’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో అర్హులైన కార్మికులను గుర్తించి, వారి వివరాలను ‘నమస్తే’ యాప్లో నమోదు చేస్తున్నారు. మరుగుదొడ్ల వ్యర్థాలు తొలగించే కార్మికులు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్హోల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త సేకరించేవారు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. కార్మికులకు భద్రత, పునరావాసం.. ‘నమస్తే’ పథకం పారిశుద్ధ్య కార్మికులకు ఒక వరంగా మారనుంది. కార్మికుల భద్రత, గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంతోపాటు, ప్రత్యేక పరికరాలు అందించడం, ఆధునిక సురక్షిత పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనో పాధి కల్పించడం ఈ పథకం లక్ష్యాలు. గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందజేయడంతోపాటు, యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడతారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. చెత్త సేకరణ కార్మికులకు కూడా.. పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా జీవనం సాగించే కు టుంబాలు డంప్ యార్డులు, చెత్త నిల్వ ప్రదేశాల నుంచి చెత్త సేకరించి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ కార్మికులు తమ వివరాలను అధికారులకు అందించి ‘నమస్తే’ యాప్లో నమో దు చేసుకోవచ్చు. నమోదైన కార్మికులకు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పించన్, ఆర్థికసాయం అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో ఏడుగురు, ఖానాపూర్లో ఇద్దరు, భైంసాలో ఒక కార్మికుడిని ఇప్పటివరకు గుర్తించి నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నమోదు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా కార్మికులను గుర్తించి యాప్ నమోదు చేస్తున్నాం. కార్మికులకు ముందుగా ఈ కేవైసీ చేయించి యాప్లో రిజిస్టర్ చేయిస్తున్నాం. అర్హులందరూ వివరాలు నమోదు చేసుకొని ప్రయోజనం పొందాలి. – ఎండీ అజారొద్దీన్, మున్సిపల్ పర్యావరణ ఇంజినీర్, నిర్మల్ -
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: ఆకస్మికంగా వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోదావరి తీర ప్రాంతాలైన దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, గొడిసెర్యాల గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం అవగాహన కల్పించారు. వరదల నుంచి బయటపడేందుకు ఇంట్లో ఉన్న వాటర్ బాటిళ్లు, క్యాన్లు, నూనె క్యాన్లు, ఎండిన సొరకాయ బుర్రలు, బైక్ టైర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఎత్తయిన ప్రాంతాల కు వెళ్లాలని తెలిపారు. తహసీల్దార్ విశ్వంభర్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్లు అమర్ ప్రాతాప్సింగ్, వినిత్కుమార్, సిబ్బంది నవీన్, నిరంజన్, కుమార్, సందీప్సింగ్ పాల్గొన్నారు. -
కడెం ఆయకట్టుకు సాగునీరు
● నేడు విడుదల చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు ● ఖరీఫ్ పంటలకు భరోసా.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద సాగుచేసిన ఖరీఫ్ పంటలకు సాగునీరు ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. జలాశయంలో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మంగళవారం ఉద యం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జూలై 14న ప్రాజెక్టు నీటిమట్టం 683.625 అడుగులు ఉండగా, ఈ ఏడాది 694.600 అడుగులకు చేరుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నా రు. తాజాగా అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ఆయకుట్టుకు నీటిని విడుదల చేస్తారని ప్రాజెక్టు ఈఈ విఠల్ తెలిపారు. కాలువ మరమ్మతు పూర్తి.. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు రూ.33.5 లక్షలతో కడెం, దస్తురాబాద్ మండలాల పరిధిలో 16 కిలోమీటర్ల మేర ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. పిచ్చిమొక్కలు, చెత్త, పూడికను తొలగించి, దెబ్బతిన్న కాలువలను బాగుచేశారు. ఈ మరమ్మతులతో కాలువ శుభ్రమై, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుంది. రైతుల్లో ఉత్సాహం.. కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా వానాకాలం సీజన్లో కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల పరిఽ దిలోని 68,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతేడాదికన్నా ముందుగానే నీటిని విడుదల చేస్తుండడంతో సాగు జోరందుకోనుంది. నిండు కుండలా కడెం ప్రాజెక్టుచివరి ఆయకట్టు వరకు వానాకాల పంటల సాగుకు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం. ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటిమట్టం ఉండడంతో సాగు నీటిని వదలాలని నిర్ణయించాం. ఇంకా రెండు నెలలు వర్షాలు కురుస్తాయి. మంచి వర్షాలు కురిస్తే యాసంగి పంటలకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. – విఠల్, ప్రాజెక్టు ఈఈ -
నాగేశ్వర సిద్ధాంతికి పురస్కారం
నిర్మల్: జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికి చెందిన ప్రముఖ పంచాంగకర్త గాడిచెర్ల నాగేశ్వరసిద్ధాంతి తెలంగాణ విద్వత్సభ నుంచి విశిష్ట పురస్కా రం అందుకున్నారు. హైదరాబాద్లో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతీస్వామి పురస్కారం ప్రదానం చేశారు. 95 ఏళ్లుగా గాడిచెర్ల కుటుంబం అందిస్తున్న పంచాంగ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా సోషల్ ఆడిట్
సోన్: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక సోమవారం నిర్వహించారు. ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. 2024–25 సంవత్సరంలో మండలంలో రూ.4.63 కోట్ల ఉపాధి పనులు చేపట్టినట్లు తె లిపారు. గ్రామాలలో తనిఖీ బృందాలు నిర్వహించిన తుది నివేదిక చదివి వినిపించారు. సో షల్ ఆడిట్ పారదర్శకంగా జరిగిందన్నారు. మాస్టర్ ఎంట్రీలలో తప్పులు జరగకుండా చూ సుకోవాలని ఇబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లక్ష్మయ్య, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ వెంకన్న, ఎంపీడీవో సురేశ్, హెచ్ఆర్ఎం సుధాకర్ ఎన్పీవో ఖలీల్ అహ్మద్, ఏపీవో మంజుల, ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
గౌతమ బుద్ధుని బోధనలు అనుసరణీయం
తానూరు: గౌతమ బుద్ధుని బోధనలు అనుసరించాలని భారతీయ బౌద్ధమహాసభ జిల్లా అ ధ్యక్షుడు రమేశ్బాబు వాగ్మారే సూచించారు. మండల కేంద్రంలోని బుద్ధవిహార్లో ఏర్పాటు చేసిన వర్షవాజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ సూచించి న 22 ప్రతిజ్ఞలను అనుసరించాలని తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధుని చరిత్ర వివరించారు. కా ర్యక్రమంలో భారతీయ బౌద్ధమహాసభ నాయకులు సురేకాంత్ పవార్, సాయినాథ్ బద్రే, భీంపవార్, అంబాదాస్ పవార్, రమేశ్ పవార్, ఆయా మండలాల భారతీయ బౌద్ధమహాసభ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పొదుపు బావుటా
నిర్మల్చైన్గేట్: వీధి వ్యాపారులను పొదుపు వై పు మళ్లించి వ్యాపార అభివృద్ధికి రుణాలందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్వశక్తి మహిళా సంఘాల తరహాలోనే కామ న్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లు ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే మెప్మా ద్వారా జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల్లో సీఐజీ గ్రూపుల ఏర్పాటు కు వీధి వ్యాపారులను గుర్తిస్తున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ బల్దియాల పరిధిలో పలువు రు చిరువ్యాపారాలు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీల్లో 115పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించగా మెప్మా అధికారులు స ర్వే చేసి గ్రూపులు ఏర్పాటు చేసే పనిలో ఉ న్నా రు. దీంతో ఆర్పీల సాయంతో సర్వే ప్రారంభించి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. నెలలోపు సంఘాలు ఏర్పాటు చేసి వారికి వ్యాపారాల్లో చే యూతనిచ్చేలా చర్యలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా తోపుడుబండ్లు, నడుచుకుంటూ వెళ్లి వ్యాపారం చేసుకునేవారిని గుర్తించనున్నా రు. మహిళా సంఘాలలాగే ఒక్కో సంఘంలో 10–12 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరి తో మొదట బ్యాంకుల్లో ఖాతాలు తీయించి పొ దుపు చేయించి లింకేజీ తర్వాత రుణాలిస్తారు. పెద్ద వ్యాపారాలు చేసుకునేలా.. కరోనా సమయంలో వీధి వ్యాపారులు రోడ్డున పడగా పీఎం స్వనిధి కింద రుణాలిచ్చారు. మొ దటి విడత రూ.10వేలు, రెండో విడత రూ.20వేలు, మూడో విడతలో రూ.50వేల చొప్పున జిల్లాలోని మూడు మున్సిపాలిటీ పరిధిలోని 11,043 మందికి రుణాలు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదాలను వారు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఎంతో తోడ్పడగా తాజాగా వీటిని నిలిపేశారు. ప్రస్తుతం ఈ గ్రూపులను ఏ ర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూత అందించేలా చర్యలు చేపడుతున్నారు. మొదట గ్రూపులను ఏర్పాటు చేసిన తర్వాత వారికి బ్యాంక్ లింకేజీ రుణాలిప్పించి మరింత పెద్ద వ్యాపారాలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సభ్యులకు బీమా సదుపాయం పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ.2లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మృతి చెందితే వారికి ఈ మొత్తం అందించనున్నారు. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు కార్డులు అందజేశారు. దుకాణాలు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్ ఉండనున్నట్లు సమాచారం. వీధివ్యాపారుల సంఘాలు ఏర్పాటు బ్యాంక్ల నుంచి లింకేజీ రుణాలు జిల్లాలో సర్వే చేపట్టిన అధికారులుజిల్లాలోని స్ట్రీట్ వెండర్స్ : 11,043 మున్సిపాలిటీ స్ట్రీట్ వెండర్లు గ్రూప్ లక్ష్యం నిర్మల్ 6,236 66 భైంసా 3,435 35 ఖానాపూర్ 1,372 14 చిరువ్యాపారులకు ఎంతో మేలు వీధివ్యాపారులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయిస్తున్నాం. వీరికి ఎంతో మేలు జరుగుతుంది. సంఘంలో పొదుపు చేసుకున్న అనంతరం బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. కుటుంబాలను పోషించుకోవచ్చు. – డీ సుభాష్, మెప్మా పీడీ పీఎం స్వనిధి పొందినవారు మున్సిపాలిటీ రూ.10వేలు రూ.20వేలు రూ.50వేలు నిర్మల్ 5,311 3,086 1,559 భైంసా 2,839 1,829 982 ఖానాపూర్ 1,113 695 464 -
అభివృద్ధిలో అగ్రగామి
దండెపల్లి/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: అభివృద్ధిలో మంచిర్యాల జిల్లా రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పుష్కల అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ట్, హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్, ఆటోనగర్ పార్క్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రల పర్యటనతో జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. మధిరతో సమానం.. మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళశక్తి సోలార్ ప్రాజె క్ట్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రా ణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తె లిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కోరినట్లు దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అభివృద్ధికి నాంది.. మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రియల్, ఆటోనగర్ పార్కుల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాలు సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్క్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు రూ.30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, న ల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వా సం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ప్ర శంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు. ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హైదరాబాద్తో సమాన వసతులతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలు స్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి.. అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.2 కోట్లతో కళా భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ పంచాయతీ పరిధి కవ్వాల్ టై గర్ రిజర్వ్ ఫారెస్ట్లో గాంధారీఖిల్లా సఫారీకి రెండు నూతన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు ఫారెస్ట్ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్లు జ్ఞాపికలుగా అందజేశారు. ప్రజల మద్దతుతో ముందుకు.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడు తూ.. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం జీవి తాంతం కృషి చేస్తానని చెప్పారు. ఇంద్రవెల్లి, న స్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండేపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇ రిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో టీజీఐఐ సీ వైస్ చైర్మన్, ఎండీ కే శశాంక్, అటవీశాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ శాఖాధి కారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధా న పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భా స్కర్, ఏసీసీ ప్రకాశ్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజం లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభు త్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కళాశాల గదులన్ని తిరిగి చూశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని మంత్రులకు వినతిపత్రం అందజేశారు. నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సభాస్థలి వద్ద ఉప ముఖ్యమంత్రి భటి, మంత్రులు శ్రీధర్బాబు, కృష్ణారావు, రాజనర్సింహ, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు -
‘కోట’ మరణం తీరని లోటు
నిర్మల్ఖిల్లా: సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ‘పాటే మా ప్రాణం’ సంస్థ కార్యవర్గ సభ్యులు కొనియాడారు. ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కా ర్యక్రమంలో కోట మృతికి సంతాపం తెలిపా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 700కు పైగా చి త్రాల్లో కమెడియన్గా, విలన్గా క్యారెక్టర్ ఆ ర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి తనదైన శైలి తో ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చెనిగారపు నా గరాజు, కళాకారులు నేరెళ్ల హనుమంతు, రమణ, వేణుగోపాల్వర్మ తదితరులున్నారు. -
ఎన్నాళ్లీ ట్రాఫికర్?
నిర్మల్: జిల్లాగా ఏర్పడి పదేళ్లు దగ్గరపడుతున్నా ఇప్పటికీ ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకో లేక పోతున్నాయి. ప్రధానంగా నిర్మల్, భైంసా, ఖా నాపూర్ మున్సిపాలిటీల్లో సమస్యలు ఏళ్లుగా తిష్టవేసి ఉన్నాయి. వీటిని ఇప్పటిదాకా సీరియస్గా ప ట్టించుకునేవారే లేరు. మూడు మున్సిపాలిటీల్లో పె రుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు క ల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా వి ఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రా‘ఫికర్’.. చెప్పుకోవడానికి, చూడటానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ.. నిత్యనరకం చూపిస్తోంది. పన్నులు క ట్టే ప్రజలు తమ కళ్లముందే ఇబ్బందులు పడుతు న్నా సంబంధిత మున్సిపల్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే వాదన పెరుగుతోంది. సా క్షాత్తు ఉన్నతాధికారులు ఉండే జిల్లాకేంద్రంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయని దుస్థితి ఉంది. ఇక రోడ్లపైనే ఇష్టారీతిగా పార్కింగ్లు, తోపుడుబండ్లు, దు కాణాలు కొనసాగుతుండగా బాటసారులు, వాహ నచోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్లో నిత్యనరకం జిల్లా కేంద్రమన్నట్లే గానీ.. ఇక్కడ ఉన్నన్ని ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కడా లేవు. ● చుట్టుపక్కల ఉన్న భైంసా, ఖానాపూర్ లాంటి చిన్నపట్టణాల బస్టాండ్లు చాలా నయం. కానీ.. జిల్లాకేంద్రమైన నిర్మల్ బస్టాండ్ పరిస్థితి మరీ దారుణం. ఎక్కడి నుంచి ఏ వాహనం వస్తుందో తెలియదు. బస్టాండ్లో నుంచి బస్సు బయటకు రావాలన్నా.. లోపలికి వెళ్లాలన్నా.. పెద్ద ప్రహసనమే. ఉన్నదే ఇరుకురోడ్డంటే ఆ రోడ్డులో సగం దాకా దుకాణాలు పెట్టేస్తున్నారు. ట్రాఫిక్ అధి కంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత నరకంగా మారుతోంది. ● వివేక్చౌక్ నుంచి మొదలు పెడితే పింజరిగుట్ట క్రాస్రోడ్డు వరకు పాతబస్టాండ్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉదయం 10నుంచి 8 గంటల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కొన్నేళ్లుగా వాహనాలను సెంట్ర ల్ పార్కింగ్ పెడుతున్నారు. ఇది ఇంకా ఇబ్బంది పెడుతోంది. బైక్పై వెళ్తే పరవాలేదు కానీ.. ఆటోలు, కార్లు ఇంకా భారీ వాహనాలైతే ఈ మార్గంగుండా వెళ్లడం కష్టమే. అత్యవసర పరిస్థితుల్లో 108, పోలీస్, ఫైర్ లాంటి వాహనాలు ఈ రూట్లో నుంచి వెళ్లే పరిస్థితి లేదు. ● ఎన్హెచ్–61పై ఉన్న ఈద్గాం చౌరస్తాలోనూ కనీసం సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఈ చౌరస్తా సమీపంలోనే ఐదారు పెద్ద స్కూళ్లున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బడిపిల్లలూ వెళ్లాల్సి ఉంటుంది. ఓవైపు హైవేపై భారీవాహనాలు మరోవైపు మున్సిపల్ వైపు నుంచి, ఆదర్శనగర్ వైపు నుంచి అధికసంఖ్యలో వచ్చే వాహనాలతో రోడ్డు దాటడం సమస్యగా మారుతోంది. ● ఆర్డీవో కార్యాలయం ఎదుట, జయశంకర్సార్ సర్కిల్, వివేక్చౌక్, అంబేద్కర్చౌక్లోనూ ట్రాఫి క్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఇక్కడ కూడా వాహనాలు ఇష్టారీతిన వస్తుండటంతో ట్రాఫిక్ దిగ్బంధంలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. సమస్య పరిష్కరిస్తాం జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య కొంత ఇబ్బందికరంగానే ఉంది. త్వరలోనే సిగ్నల్స్ సమస్య పరిష్కరిస్తాం. రోడ్లపై ఆక్రమణలు, పార్కింగ్ తదితర సమస్యలపై రెవెన్యూ, పోలీస్శాఖలతో సంప్రదించి చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ భైంసాలోనూ ఇబ్బందులే.. వాణిజ్యపరంగా పేరున్న భైంసా పట్టణం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేక ఇక్కడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా నిర్మల్చౌరస్తా–బస్టాండ్–గంజ్రోడ్డు వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ దాకా రోడ్డులో భారీ వాహనాలు వస్తే మరో వాహనం వెళ్లే పరిస్థితి లేదు. మిర్చియార్డు వద్ద రోడ్డు కూడా ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. బస్డిపో నుంచి పార్డీ(బీ) బైపాస్ రోడ్డు వరకు గల హైవేపై ఎక్కడా యూటర్న్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేక రాంగ్రూట్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఖానాపూర్లోనూ కష్టమే.. కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డా.. ఖానాపూర్ కష్టాలు తీరడం లేదు. రోజురోజుకూ ఇక్కడా ట్రాఫిక్ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ చేయకముందే డివైడర్ నిర్మించడం ఇక్కడ లోపంగా మారింది. తరచూ యాక్సిండెంట్లు అవుతున్నాయి. జగన్నాథరావుచౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపడం ఇబ్బందికరంగా మారుతోంది. ఇష్టారీతిన వాహనాల పార్కింగ్ సగం రోడ్డెక్కుతున్న దుకాణాలు మూడు మున్సిపాలిటీల్లో సమస్య పట్టింపులేని బల్దియా అధికారులు బాటసారులకు తప్పని ఇబ్బందులు నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో ఇదీ.. పరిస్థితి -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
తానూరు: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధవహించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ సూచించారు. తానూరు మండలం భోసి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలశక్తి కా ర్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల ఆరో గ్యం, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలశక్తి కార్యక్రమం అమలుచేస్తున్నట్లు తెలిపా రు. వైద్య పరీక్షలు కొనసాగించాలని, వారికి హెల్త్ కార్డులు అందించాలని వైద్యాధికారులను సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత బీసీ వసతిగృహం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజచేశారు. అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, డీఈవో రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాంగోపాల్, ఎంపీడీవో నసీరుద్దీన్ పాల్గొన్నారు. -
15న మహాధర్నా
నిర్మల్టౌన్: సంస్థల ఎన్నికలకు ముందే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని ఈనెల15న ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా తలపెట్టినట్లు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, నిర్మల్ జిల్లా బీసీ సంఘాల నాయకులు మారుగోండ రాము తెలి పారు. నిర్మల్ ప్రెస్క్లబ్లో శుక్రవారం మహా ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు 32 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లతో ఈనెల 15న నిర్వ హించే మహాధర్నాలో పార్టీలకు అతీతంగా బీసీలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రాము, లక్ష్మణచారి, సుభాష్రావు, పూదరి నరహరి, విశాల్, కపిల్, నయీం, శ్రీనివాస్, సంగన్న, వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్ పాల్గొన్నారు. -
కొండంత ఆశతో...
● ఆగిన బాసర ఆలయ అభివృద్ధి ● సమస్యల్లో ట్రిపుల్ ఐటీ ● క్షేత్రం అభివృద్ధీ అంతంతే.. ● నేడు బాసరకు మంత్రుల రాక భైంసా: తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం బాసర సరస్వతీ ఆలయం. ఇక్కడి ట్రిపుల్ ఐటీకి కూడా మంచి గుర్తింపు ఉంది. ఆలయం నిత్యం భక్తులతో, ట్రిపుల్ ఐటీ నిత్యం విద్యార్థులతో సందడిగా ఉంటాయి. అయితే, ఈ రెండు కేంద్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, సౌకర్యాల కొరత ఎదుర్కొంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రకటించినా, రూ.8 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మిగతా రూ.42 కోట్లు వెనక్కు వెళ్లాయి. వాటిని కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మొదటిసారిగా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి శనివారం వస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బాసర ట్రిపుల్ఐటీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సరస్వతీ ఆలయంలో సౌకర్యాల కొరత..దేశంలో రెండవ ప్రాచీన సరస్వతీ ఆలయంగా పేరొందిన బాసర క్షేత్రానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే భక్తులకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడి గోదావరి నదిలో స్నానాల సమయంలో జరిగే ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2021 నుంచి 2025 వరకు 127 మందికిపైగా భక్తులు నీటమునిగి మృతిచెందారు, ఈ ఏడాది ఇప్పటికే 8 మంది చనిపోయారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఆలయ అభివృద్ధి, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పరిపాలనలో లోపాలు..బాసర ఆలయానికి శాశ్వత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) లేరు. ఇన్చార్జి అధికారితో పరిపాలన కొనసాగిస్తున్నారు. దీంతో అవినీతి, నిర్వహణ లోపాలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే పరిపాలన గాడిన పడుతుందని భక్తులు ఆశిస్తున్నారు. వైద్య సౌకర్యాల లేవు..బాసరలో 9 వేల మంది విద్యార్థులు, వేలాది భక్తులు ఉన్నప్పటికీ, పెద్ద ఆస్పత్రి లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 30 పడకల ట్రిపుల్ఐటీ ఆస్పత్రి మాత్రమే ఉన్నాయి. అత్యవసర సమయాల్లో భైంసా, నిజామాబాద్కు తరలించాల్సి వస్తోంది. ఈ ప్రధాన సమస్యల పరిష్కారంపై మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు దృష్టిసారించాలి భక్తులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, బాసర పట్టణ ప్రజలు కోరుతున్నారు. ‘ట్రబుల్’ ఐటీ..ఇక రాష్ట్రంలో ఏకై క ట్రిపుల్ఐటీ క్యాంపస్ బాసరలో ఉంది. 9 వేల మంది విద్యార్థులతో ఉన్నప్పటికీ, మూడేళ్లుగా యూనిఫామ్, ల్యాప్టాప్, ఇతర సామగ్రి అందడం లేదు. 150 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నా యి. శాశ్వత వీసీ లేకపోవడం, పాత కాంట్రా క్టర్ల కొనసాగింపు, మెనూ ప్రకారం భోజనం అందకపోవడంతో విద్యార్థులు సమస్యల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన బాసర: ఆర్జీయూకేటీలో శనివారం నిర్వహించనున్న వనమహోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళిదర్శన్ శుక్రవారం పర్యవేక్షించారు. భద్రతా చర్యలు, విద్యార్థుల భాగస్వామ్యంపై సమీక్ష చేశారు. కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు సూచించారు. -
కేజీబీవీలకు కొత్త టీచర్లు..!
● వివిధ పాఠశాలల్లో 13 ఖాళీలు ● 2023లో నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగా భర్తీ నిర్మల్ రూరల్: పేద బాలికల విద్యను బలోపేతం చేసేందుకు, మధ్యలో చదువు మానకుండా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నేళ్లుగా కేజీబీవీలను అప్గ్రేడ్ చేస్తోంది. ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో నర్సాపూర్(జి), దిలావర్పూర్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, ఖానాపూర్ ప్రాంతాల్లో ప్రవేశాలు రెట్టింపు జరిగాయి. 6 వేల మంది విద్యార్థులు..జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా, ఇందులో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యను అందిస్తున్నారు. దాదాపు 6 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం 209 మంది టీచింగ్ సిబ్బంది, 227 మంది నాన్–టీచింగ్ సిబ్బంది ఉన్నారు. అయితే, విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్నిచోట్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత, మరికొన్ని చోట్ల వ్యాయామ ఉపాధ్యాయుల లేమి ఉన్నాయి. ఖాళీల భర్తీకి ఆదేశాలు..రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలలో ఉపాధ్యాయుల కొరతను గుర్తించిన ఉన్నతాధికారులు, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టారు. 2023లో నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ అభ్యర్థులతో ఈ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 13 ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ)లను, ఇంటర్మీడియట్ బోధనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్(పీజీసీఆర్టీ)లను నియమించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికను రూపొందిస్తున్నారు. 20 రోజుల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. వివరాలు...జిల్లాలోని మొత్తం కేజీబీవీలు 18విద్యార్థినుల సంఖ్య 6వేలు(సుమారు) టీచింగ్ స్టాఫ్ 209 నాన్ టీచింగ్ స్టాఫ్ 227 భర్తీ చేయనున్న పోస్టులు 13మెరిట్ ప్రకారం భర్తీ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూస్తా. 2023లో నిర్వహించిన రాత పరీక్షలో సాధించిన మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తాం. రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం భర్తీ ప్రక్రియ ఉంటుంది. – సలోమి కరుణ, కేజీబీవీ జిల్లా అధికారి -
నానో యూరియాతోనే అధిక దిగుబడి
● జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ లక్ష్మణచాంద: నానో యూరియా వినియోగంతో అన్నదాతలు అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ పేర్కొన్నా రు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల రైతులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించా రు. యూరియా వాడకం తగ్గించాలని సూచించా రు. అధిక యూరియా వినియోగంతో కలిగే నష్టాల ను తెలియజేశారు. నానో యూరియా వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ మండలంలో ఇది వరకు చేసుకోని రైతులు ఆయా క్లస్టర్ల పరి ధిలోని రైతు వేదికల వద్దకు వెళ్లి వెంటనే రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకో కుంటే కేంద్రం ఇచ్చే పథకాలు వర్తించవని తెలిపా రు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈట ల శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి వసంత్రావు, ఏఈవోలు పవిత్ర, సుష్మిత, మౌనిక, రైతులు పాల్గొన్నారు. -
సేంద్రియం.. ప్రోత్సాహం
● జిల్లాలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అమలు ● 13 మండలాల్లో 15 క్లస్టర్ల ఏర్పాటు ● ఒక్కో క్లస్టర్ పరిధిలో 125 మంది రైతుల గుర్తింపు ● 1,875 ఎకరాల్లో సాగుకు సన్నాహాలునిర్మల్చైన్గేట్: రైతులు పంటల దిగుబడి కోసం రసాయన ఎరువులను అధికంగా వినియోగిస్తుండటంతో భూసారం దెబ్బతినడంతోపాటు, రసాయనాలతో కూడిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా భూమి నిర్జీవం కావడం, పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ, రైతులను సేంద్రియ సాగువైపు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 13 మండలాల్లో 15 గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంచుకొని, ఏడాదిపాటు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు చర్యలు చేపట్టారు. జాతీయ మిషన్ లక్ష్యంవాతావరణ మార్పులు, చీడపీడల ఉధృతి, నీటి లభ్యత తగ్గుదల, ఉత్పత్తి క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి సేంద్రియ సాగువైపు మళ్లించేందుకు ఈ జాతీయ మిషన్ ఏర్పాటైంది. ఈ పథకం ద్వారా భూసారాన్ని కాపాడటం, పర్యావరణ పరిరక్షణ, రసాయన రహిత ఆరోగ్యకర ఆహారం అందించడం లక్ష్యంగా పనిచేస్తుంది. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా..ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి న మూనాలను సేకరించి, సేంద్రియ సాగు లాభాల ను వివరిస్తున్నారు. రెండు నెలల క్రితం గ్రామాల ఎంపిక పూర్తయింది. మట్టి నమూనాల సేకరణ పూ ర్తి చేసి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఎకరం భూమి కలిగిన రైతులను ఎంపిక చేశారు. మహిళా సీఆర్పీల నియామకంసేంద్రియసాగును విస్తరించేందుకు, గ్రామాల్లోని మహిళా సంఘాల నుంచి చదువుకున్న, వ్యవసా య అనుభవం కలిగిన మహిళలను కమ్యూనిటీ రి సోర్స్ పర్సన్(సీఆర్పీ)లుగా ఎంపిక చేస్తారు. వీరికి నెలకు రూ.4 వేల వేతనం అందిస్తారు. ఎకరంలో సాగు..ఎంపిక చేసిన రైతులు తమ పొలంలో ఒక ఎకరంలో సేంద్రియ సాగును చేపట్టనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా, ఏ పంట సాగు చేయాలో వ్యవసాయ అధికారులు సూచిస్తారు. రైతులకు మొదటి విడతలో వేప పిండి, వేప నూనె వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తారు. అలాగే, సేంద్రియ పంటలకు మార్కెట్లో ఉన్న డిమాండ్పై రైతులకు అవగాహన కల్పిస్తారు.పథకం ప్రధాన లక్ష్యాలు ● వ్యవసాయ ఖర్చులను తగ్గించడం. ● భూసారం, పర్యావరణ పరిరక్షణ. ● రసాయన రహిత, పోషక విలువలతో కూడిన ఆరోగ్యకర ఆహారం అందించడం. ● విభిన్న పంటల సాగుతో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం. అవగాహన కల్పిస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంఎన్ఎఫ్ పథకాన్ని అమలుచేస్తూ రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న నందిమళ్లలో ఇప్పటికే మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. సేంద్రియ సాగు ప్రోత్సాహానికి కేంద్రం అందించే రాయితీ నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – వికార్ అహ్మద్, మండల వ్యవసాయ అధికారి, సారంగాపూర్ ఇది మంచి పథకం.. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం ఎంతో ఉన్నతమైంది. ఈమేరకు దీనిని జిల్లాలో అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాం. 15 క్లస్టర్లలో 1,875 మంది రైతులను గుర్తించాం. త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిఎంపికై న కస్టర్ల వివరాలు..మండలం క్లస్టర్ గ్రామ పంచాయతీ దిలావర్పూర్ గుండంపల్లి కాల్వ నిర్మల్ రూరల్ చిట్యాల తల్వేద లక్ష్మణచాంద పీచర పీచర నర్సాపూర్(జి) చాకుపెల్లి నందన్ సారంగాపూర్ పొన్కూర్ జౌలి సోన్ మాదాపూర్ లోకల్ వెల్మల్ మామడ పోన్కల్ పోన్కల్ కుంటాల కుంటాల కుంటాల కుంటాల కల్లూర్ పెంచికల్పాడు కుబీర్ హల్దా చాత బైంసా వానల్పాడ్ సుంకిలి తానూర్ బెల్తారోడా బెల్తారోడా ముధోల్ తరోడ తరోడా, వెంకటాపూర్ లోకేశ్వరం గడ్చాంద భాగాపూర్ -
క్రమశిక్షణతో చదువుకోవాలి
లోకేశ్వరం: విద్యార్థులు వసతి గృహంలో క్రమ శిక్షణతో ఉంటూ చదువుకోవాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ సూ చించారు. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు కార్పెట్, నోట్బుక్స్ శుక్రవా రం అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలన్నారు. అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవాలని సూ చించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంభోజనం అందించాలన్నారు. హాస్టల్ సిబ్బంది స్థానికంగా ఉండి విద్యార్థులపై శ్రద్ధవహించాలని తెలిపారు. ఎంపీడీవో వెంకటరమేశ్, వార్డెన్ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
నిర్మల్టౌన్: భావితరాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్ఞాన సరస్వతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంగే శ్రీని వాస్ అన్నారు. ప్రెస్క్లబ్లో గురువారం మా ట్లాడారు. సమగ్ర విద్యాభివద్ధిలో భాగంగా భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా కొత్త విద్యాలయాలు అవసరమన్నారు. దివంగత ము ఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని జిల్లాల్లో విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగిందన్నా రు. 2009లో జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలను శ్రీజ్ఞానసరస్వతి యూనివర్సిటీగా నామకరణం చేసి రూ.55 కోట్లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ వైఎస్సార్ అకాల మరణంతో ఈ ప్రక్రియ నిలిచిపోయి రాష్ట్ర విభజన సమయంలో మరుగున పడిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూనివర్సిటీల ఏర్పాటు జరగలేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. -
ఘనంగా గురు పౌర్ణమి
నిర్మల్టౌన్: గురు పౌర్ణమిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని గండి రామన్న క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో అభిషేకం అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 48 గంటలపాటు కొనసాగిన అఖండ సాయినామ సంకీర్తన మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యహ్న హారతి అనంతరం వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. -
● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్రమంగా తగ్గుతున్న మహిళల సంఖ్య ● ఉమ్మడి జిల్లాలో జనాభా తీరిదీ ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఈ ఏడాది థీమ్.. ‘‘యువతకు న్యాయమైన, ఆశాజనక ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం’’ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో పుట్టుక చావులు జరిగిపోతున్నాయి. ఏటేటా జనాభా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే జనన, మరణాల సంఖ్య పెరుగుదల రేటు తగ్గిపోతోంది. మారుతున్న పరిస్థితులు జనాభాను నియంత్రిస్తున్నాయి. అందరికీ అన్ని సౌకర్యాల కల్పన మానవ సమాజంలో క్లిష్టంగా మారింది.. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో జనాభాతోపాటు పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి. తగ్గుతున్న మహిళా జనాభా ప్రతీ వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు సర్వేల్లోనూ లింగనిష్పత్తి తగ్గుతూ వస్తోంది. పురుషులకు సమానంగా సీ్త్రలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011అధికారిక జనాభా లెక్కల్లోనే ఇది స్పష్టమైంది. సీ్త్ర, పురుష సమానత్వం లేకపోతే సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు లింగనిర్ధారణ చేస్తు ఆడశిశువులను పురిటిలోనే చంపేయడం జనాభాలో అసమతుల్యతకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలే పుడుతున్నారు.. ‘సీఆర్ఎ్స్(రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) 2021 నివేదికలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 26576మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25124మంది జన్మించారు. అదే సమయంలో మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832మంది మరణించారు. పెరుగుతున్న వలసలు.. గ్రామాలు వదిలి విద్యా, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాల కోసం అధికంగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా పట్టణీకరణ పెరుగుతోంది. 2011లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా 43.8శాతం, ఆదిలాబాద్ 23.7శాతం, నిర్మల్ 21.4, కుమురంభీం జిల్లాలో 16.9శాతంతో పట్టణ జనాభా ఉంది. ప్రస్తుతం 2025నాటికి సంఖ్య మరింత పెరగనుంది. అయితే పట్టణాల్లో పెరుగుతున్న వలసలకు అనుగుణంగా శుభ్రమైన తాగు, ఉండేందుకు ఇల్లు, విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వసతలు కల్పన జరగాల్సి ఉంది. లేకపోతే అల్పాదాయంతో పేదరికంలో అధిక జనాభా మగ్గాల్సి వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతీ చదరపు కిలోమీటరకు జనసాంద్రత చూస్తే ఆసిఫాబాద్ జిల్లా తక్కువ ఉండగా, పట్టణీకరణ చెందిన మంచిర్యాల జిల్లాలో అధికంగా ఉంది. ప్రస్తుతం 2025 నాటికి జనసాంద్రత మరింత పెరగనుంది. వసతులు, సౌకర్యాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలతో ఆ ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతోంది. -
మత్తుకు దూరంగా ఉండాలి
పెంబి: యువత మత్తు, మాదకద్రవ్యాలకు దూ రంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించా రు. గంజాయి రహిత నిర్మల్లో భాగంగా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్, కోలాంగూడ గ్రామాలను ఏఎస్పీ రాజేశ్మీనతో కలిసి గురువారం సందర్శించారు. దట్టమైన అటవీ ప్రాంతంగుండా ఎడ్ల బండిలో గ్రామాలకు చేరిన ఎస్పీకి ఆదివాసీలు గుస్సాడీ వేషధారణతో, డోలు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువతకు గంజాయి, కల్తీ కల్లుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గంజాయి సాగు చట్టవిరుద్ధమని తెలిపారు. ఎవరైనా సాగుచేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రమాణం చేయించిన ఎస్పీ.. గ్రామస్తులతో గంజాయి సాగు, సేవనం, కల్తీ కల్లు, నిషేధిత గుడుంబా వినియోగం నివారించాలని ఎస్పీ గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. వాలీబాల్ నెట్లు, రైతులకు వర్షం నుంచి రక్షణ కవర్లు, పలువురికి రేషన్ బియ్యం పంపిణీ చేశారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 100 లేదా 8712659599 ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్, ఏసీబీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, పెంబి ఎస్సై హన్మాండ్లు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ జానకీషర్మిల -
● ఉమ్మడి కుటుంబాలతోనే మేలు ● చిన్నకుటుంబాలపైనే యువత ఆసక్తి ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
మంచిర్యాలటౌన్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/చెన్నూర్: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. యువజన భారతంగా వెలుగొందుతున్న దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనా ఉంది. గతంలో ఇద్దరు పిల్లలే ముద్దు అనే నినాదం ఉండగా.. ప్రస్తుతం ఒక్కొక్కరూ ముగ్గురు కంటే ఎక్కువ మందిని కనాలనే సూచన వస్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ యువతీ, యువకులు, పెళ్లయిన జంటలు 300 మందిని పలు అంశాలపై గురువారం సర్వే నిర్వహించింది. వీరిలో అధిక శాతం ఉమ్మడి కుటుంబాలతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలే చాలని.. భవిష్యత్ ప్రణా ళికలోనూ ఇద్దరే ముద్దు అని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి తదితర కారణాలతో చిన్న కుటుంబాలుగా వేరుపడడానికే మొగ్గు చూపారు. 4. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనమా.. చిన్న కుటుంబాల వల్లనా..?1.దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల కన్న ఎక్కువ మందిని కనాలన్న సూచనలపై మీరేమంటారు..3. మీది ఉమ్మడి కుటుంబమా..? చిన్న కుటుంబమా..? 2. పెళ్లి తర్వాత పిల్లలపై మీ ప్రణాళిక ఏమిటిపాటించాలిఇద్దరు చాలుఉమ్మడి కుటుంబాలుచెప్పలేంఇద్దరుచిన్న కుటుంబాలుఉమ్మడిచిన్నదే225328471664509 -
వర్సిటీకి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు
బాసర: బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)కి అందులో చదువుతున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం వర్సిటీని సందర్శించారు. వీసీ ఛాంబర్లో అధికారులు, బోధన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి..అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. భోజనశాల విస్తరణ, పరి శుభ్రత, వసతి గృహాల నిర్వహణపై సూచనలు చేశారు. రూ.3.20 లక్షలతో ఏర్పాటవుతున్న ‘ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్’లను పరిశీలించారు. పుష్కర ఘాట్ల పరిశీలన..అనంతరం కలెక్టర్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ భక్తుల భద్రత కోసం జాలీలు, ఇనుప స్తంభాలతో చైన్లు ఏర్పాటు చేయాలన్నారు. 100 రూముల అతిథి గృహం, నూతన దేవస్థానం కార్యాలయ భవనాన్ని తనిఖీ చేశారు. ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ గోవర్ధన్, ఆలయ ఈవో సుధాకర్రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎంపీవో గంగాసింగ్, ప్రసాద్గౌడ్ పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ట్రిపుల్ ఐటీ సందర్శన విద్యార్థులతో ముఖాముఖి -
నిర్మల్
సమస్య గుర్తింపు ఇక ఈజీ వివిధ విద్యుత్ సమస్యలు ఈజీగా గుర్తించేందుకు సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది.గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 20258లోu సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గోడం నగేశ్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలి ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగను ల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూ చించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఉ మ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, నాయకురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అ ధ్యక్షతన నిర్వహించిన దిశ కమిటీ సమావేశం గరంగరంగా సాగింది. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారుల అలసత్వం.. సమావేశానికి అధికా రుల గైర్హాజరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప నులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్య, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి ఆవాస్, కేంద్రప్రభుత్వం, ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పురోగతిపై శాఖలవారీగా సమీక్షించారు. ‘కేంద్ర’ పథకాలు అమలు చేయాలి గ్రామీణాభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎంపీ నగేశ్ తెలిపారు. అవి పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 275(1), సీసీడీపీ (కంప్రహెన్సివ్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్), ఎంపీసీ (మిషన్ ఫర్ ప్రొటీన్ చెయిన్) లాంటి పథకాల కింద జిల్లాకు వచ్చిన నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. అర్హులందరికీ ఉపాధిహామీ జా బ్కార్డులు జారీ చేయాలని, ప్రతీ కూలీకి 100 రోజు ల పనిదినాలు కల్పించాలని తెలిపారు. ఉపాధిహా మీకి అనుసంధానంగా జిల్లాలో చేపట్టిన రోడ్లు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల భ వనాలు, డ్రైనేజీ నిర్మాణాలకు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించాలని పేర్కొన్నా రు. సంబంధిత శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప నులను పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. ప్రధానమంత్రి అమృత్ 2.0, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం శ్రీ పథకా లను గుణాత్మకంగా అమలు చేయాలని పేర్కొన్నా రు. పట్టణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అర్హ త కలిగిన రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా చూడాల ని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు స మయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎం శ్రీకి ఎంపికై న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల రుణాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమాచారం లేకుండానే.. డిస్ట్రిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి జిల్లా అధికారులు అరకొర సమాచారంతోనే వచ్చారు. ఎంపీ గోడం నగేశ్ అడిగిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేక పేపర్లు తిరగేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని ఎంపీ అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్లో నిర్వహించే దిశ కమిటీ సమావేశానికైనా పూర్తి స్థా యి సమాచారంతో రావాలని ఆదేశించారు. సమాచారమున్నా గైర్హాజరైన శాఖలకు నోటీసులు అందించాలని కలెక్టర్కు సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఘనంగా అకాడి పూజలు కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల గిరిజనులు బుధవారం అకాడి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పిల్లాపాపలు, పాడి పంటలతో తమను చల్లగా చూడాలని పెద్దమ్మతల్లిని వేడుకున్నారు. ఆల యంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమీప అటవీ ప్రాంతంలో జంతుబలి చేసి ఆవులను దాటించారు. గిరిజనులు ఆత్రం దేవురావు, కోవ ప్రవీణ్ తదితరులున్నారు. న్యూస్రీల్సైబర్ నేరాలపై అవగాహన సోన్: సోన్ పోలీస్స్టేషన్లో నిర్మల్ ఏఎస్పీ రా జేశ్ మీనా ఆధ్వర్యంలో బుధవారం సర్కిల్ క్రై మ్ మీటింగ్ నిర్వహించారు. సైబర్ నేరాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతీ గ్రా మంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చోరీలు జరగకుండా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు పోలీస్స్టేషన్ లోని రికార్డులు పరిశీలించారు. సీఐ గోవర్ధన్రెడ్డి, సోన్, మామడ, లక్ష్మణచాంద ఎస్సైలు గోపి, అశోక్, శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. అధికారులకు ఎంపీ నగేశ్ సూచన సమాచారంతో రాలేదని నిలదీత కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం శాఖలవారీగా అధికారులతో సమీక్షకేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈజీఎస్ కింద అర్హులందరికీ 100రోజుల పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 926 అంగన్వాడీ కేంద్రాలుండగా, 201 కేంద్రాలు ప్రభుత్వ భవనాలు, 367 ప్రైవేట్ భవనాలు, 358 పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా 36 కేంద్రాలకు భవన నిర్మాణాలకు అనుమతులు లభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 భవన నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 600 మహిళా సంఘాలకు రూ.58 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. 130 పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 36 భవనాలకు అనుమతులు మంజూరు కాగా, ఇప్పటివరకు 10 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇందుకు రూ.కోటి 13 లక్షల నిధులు ఖర్చు చేసినట్లు వివరించారు. జిల్లాలో రూ.47 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అమృత్ 2.0 పథకం కింద మూడు నీటి ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు లభించాయని, పీఎంశ్రీ పాఠశాలల్లో బోధన నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు 11 సైన్స్ ల్యాబ్లు, 29 అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించినట్లు తెలిపారు. సమావేశంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫసల్ బీమా.. ఇవ్వని ధీమా
● పంటనష్టం జరిగితే పరిహారమేది? ● తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు లక్ష్మణచాంద: ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో అన్నదాతలకు అండగా నిలి చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలుకు నోచుకోవడంలేదు. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకం అమలులో ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలులోకి తెచ్చి పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందక తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ హయాంలోనూ నిరాశే.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు పథకం అమలు గురించి పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు దెబ్బతినగా బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయా రు. ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు పంటల బీమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. లక్ష్మణచాంద మండలం పీచర వద్ద కొట్టుకుపోయిన మొక్కజొన్న (ఫైల్) -
ఇక అంతరిక్ష విజ్ఞానం
నిర్మల్ఖిల్లా: ఖగోళ శాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకు జిల్లాలో తొలి విడతలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాల (ఆస్ట్రానమీ ల్యాబ్) లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా విద్యార్థుల్లో గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులపై అవగాహన పెరుగుతోంది. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో ఇప్పటికే సుమారు రూ.20 లక్షలు వెచ్చించి జిల్లాలోని నా లుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. నిర్మల్ రూరల్ మండలం అనంతపేట కస్తూరిబా బాలికల విద్యాల యం, సోన్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మామడ మండలంలోని పొన్కల్ జె డ్పీ ఉన్నత పాఠశాలు, తానూరు మండలం భో సి ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలలు ఇప్పటి కే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. పరికరాలు.. ప్రయోజనాలు ఖగోళ, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వి ద్యార్థుల్లో పెంపొందించేలా వివిధ రకాల న మూనాలు, విశ్వాంతరాళం, మానవ శరీర అవయవాల నమూనాలు తదితరాలు ఈ ప్రయోగశాలలో ఉన్నాయి. వాటి ఉపయోగాలివీ.. ● ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం, ఖగోళ శాస్త్ర విషయాలపై అవగాహన పెరుగుతుంది. ● ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలో హైరిజర్వేషన్ టెలిస్కోప్లు, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు, స్మార్ట్ టీవీలు, వివిధ శాసీ్త్రయ నమూనాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ● నేరుగా ఖగోళశాస్త్ర సంబంధిత వస్తువులను గమనించడం, వాటిని స్పర్శించడం, శాసీ్త్రయ వైఖరితో ప్రయోగాలు చేయడం, ఖగోళ శాస్త్ర భావనలను అర్థం చేసుకునే అవకాశం ఆస్ట్రా నమీ ల్యాబ్ల ద్వారా కలుగుతుంది. ● ఖగోళశాస్త్ర విషయాలపై విద్యార్థులకు అభిరుచి పెరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీపై కూడా ఆసక్తి ఎక్కువవుతుంది. ● విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇతర ఖగోళ పదార్థాలను స్వయంగా ప రిశీలించిన అనుభూతి ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు కలుగుతుంది. ● విద్యార్థుల్లో ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో అన్వేషణ దృక్పథం ఏర్పడుతుంది. సరికొత్త అనుభూతికి లోనయ్యా ల్యాబ్లోకి అడుగుపెట్ట గానే కొత్తగా అనిపించింది. నక్షత్రాలు, తోకచుక్కలు, అంతరిక్షం లాంటివన్నీ చక్కగా అమర్చారు. సైన్స్ పాఠాల్ని ఈ ల్యాబ్లో నేర్చుకోవడం ఆసక్తిగా ఉంది. ఉపాధ్యాయులు బోధించిన అంశం ఇక్కడ ప్రయోగాత్మకంగా చూపుతున్నారు. ఇది సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. – అర్జున్, పదోతరగతి, జెడ్పీహెచ్ఎస్, పొన్కల్ పాఠం, ప్రయోగం ఇక్కడే.. మా బడిలోని ఆస్ట్రానమీ ప్రయోగశాలలో మా సార్లు పాఠం బో ధించడమే కాకుండా ఇక్కడే ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. మాకు కూడా సరికొత్తగా అనిపిస్తోంది. నేర్చుకున్న అంశం శా శ్వతంగా గుర్తుండేలా ప్రయోగశాల దోహదం చేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. – రుచిత్, పదోతరగతి, జెడ్పీహెచ్ఎస్, పొన్కల్ విద్యార్థులకు పూర్తి ప్రయోజనం ఇప్పటికే అన్ని రకాల స దుపాయాలతో ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టమవుతున్నాయి. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక దృష్టితో జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. ఇవి విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష విషయాలపై అభిరుచి, ఆసక్తిని పెంచుతాయి. – పీ రామారావు, డీఈవోఅనుభూతికి లోనవుతారు ప్రత్యక్ష అనుభవాలు, పాఠ్యాంశం అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందుతుంది. తద్వారా ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. ఆస్ట్రానమీ ల్యాబ్ల ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాల ద్వారా ప్రత్యేక అనుభూతికి లోనవుతారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – అభిలాష అభినవ్, కలెక్టర్ అందుబాటులో ఆస్ట్రానమీ ల్యాబ్లు జిల్లాలో నాలుగు స్కూళ్లలో ఏర్పాటు పాఠ్యాంశాల బోధనకు ఊతం అనుభూతికి లోనవుతున్న విద్యార్థులు ఖగోళశాస్త్రంపై పెరుగుతున్న అభిరుచి -
కార్మికుల హక్కులు కాపాడుకుందాం
నిర్మల్చైన్గేట్: కార్మిక వర్గ హక్కులను కాపాడుకుందామని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ల రాజన్న పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భా గంగా బుధవారం జిల్లా కేంద్రంలో టీయూసీఐ ఆ ధ్వర్యంలో భగత్సింగ్ భవన్ నుంచి కార్మికులు ర్యా లీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరారు. కార్మిక వ్యతిరే క చట్టాలను రద్దు చేయాలని, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు, కనీస పింఛన్ రూ.9వేలు ఇవ్వాలని, కనీస మద్దతు ధరల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కార్మికశాఖలో తీసుకువచ్చిన పని గంటల పెంపు జీవో 282ను రద్దు చే యాలని కోరారు. బీడీ కార్మికులకు చేయూత పథ కం, జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరే క విధానాలు మానుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య మం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచారి, భూక్యా రమేశ్, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.గంగన్న, బ్యాంక్ మేనేజర్ రాథోడ్ శ్రీరామ్నా యక్, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి, లక్ష్మి, టీయూసీఐ జిల్లా నాయకులు ఎస్.లక్ష్మి, వీ మహేందర్, కిరణ్, గంగామణి, కిషన్, పోశెట్టి, రాజన్న, రాజు, భూమేశ్, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. బుధవారం పట్టణంలోని దివ్య గార్డెన్స్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగా హన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బాలల పై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, విద్యార్థులందరికీ పాఠశాల స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలలపై లైంగిక నేరాలకు పాల్పడినవా రికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపా రు. కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా చట్టం రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణుడు డేవిడ్ రాజు ఉపాధ్యాయులకు పోక్సో చట్టం, పాఠశాలల నిర్వహణ, వ్యక్తిత్వ వికా సం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అ నంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అ ధికారులు పోక్సో చట్టంపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి శ్రీవాణి, అదనపు కలెక్టర్ ఫైజా న్ అహ్మద్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, డీఈవో రా మారావు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్సారంగపూర్: వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయని, సీజన్ ముగిసేవరకు వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. మండలంలోని ధని ఆరో గ్య ఉపకేంద్రం, సారంగాపూర్ పీహెచ్సీని మంగళవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, నిత్యం సేవలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశా రు. పీహెచ్సీలో సిబ్బందితో సమావేశమయ్యారు. పర్యవేక్షణ సిబ్బంది, వైద్యులు, ఏఎన్ఎం, ఆశ కా ర్యకర్తలు నిత్యం గ్రామాల్లో పర్యటించి సమన్వయంతో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని తెలి పారు. వర్షాకాలం ముగిసే వరకూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాలను ఆయుష్మాన్ భారత్ సెంటర్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఎంహెచ్హెచ్వో వెంట మాస్మీడియా అధికారి రవీందర్, వైద్యాధికారులు అబ్దుల్ జవాద్, ప్రత్యూష, అష్రార్ సిద్దిఖీ, పర్యవేక్షకులు కృష్ణమోహన్గౌడ్, ప్రేమ్సింగ్, ఉషారాణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలినిర్మల్చైన్గేట్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు సకాలంలో అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో స్టాప్ డయేరియా, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో కార్యక్రమం నిర్వహణ అధికారులు డాక్టర్ ఆశిష్రెడ్డి, డాక్టర్ సౌమ్య, డీపీహెచ్ఎన్వో సాయమ్మ, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీడీఎం గంగాధర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
● వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ నారాయణదిలావర్పూర్: విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది జాప్యం చేయవద్దని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్–2)టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ చైర్మన్ ఎ.నారాయణ ఆదేశించారు. దిలావర్పూర్ సబ్స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుల పరిష్కార వేదిక మంగళవారం ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోదారులకు సిబ్బంది అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలు, స్తంభాలు, లూజ్ లైన్స్కు సంబంధించినవే ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 9 సమస్యలు రాగా, 5 సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశించారు. దిలావర్పూర్ ఏఈపై వచ్చిన ఫిర్యాదులపై ఏఈ డి.శంకర్ను వివరణ కోరారు. ట్రాన్స్కో ఎస్ఈ సాలియానాయక్, డీఈ నాగరాజు, ఏడీఈ వెంకటపతిరాజు, దిలావర్పూర్, సారంగాపూర్, లక్ష్మణచాంద నిర్మల్రూరల్ మండలాల పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్ ఏఈలు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
దస్తురాబాద్/ఖానాపూర్: ఇందిరమ్మ ఇళ్లను మహిళా సంఘాలు నిర్మించి లబ్ధిపొందాలని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో 40 మంది లబ్ధి దారులకు, ఖానాపూర్ పట్టణంలో పలువురు లబ్ధి దారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు మంజూరు చేసిందన్నారు. అయితే కొందరు డబ్బులు లేక నిర్మాణా నికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో వాటిని నిర్మించి లబ్ధి పొందాలన్నారు. త్వరలోనే రెండో విడత ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖానాపూర్, కడెం మండలాల్లో రెండు నెలల్లోనే పదివేల మంది కి రేషన్కార్డులు ఇచ్చామని వెల్లడించారు. ఖానా పూర్ మండలం బాదనకుర్తి పంచాయతీ పరిధిలోని చింతల్పేట్తోపాటు పట్టణంలోని తిమ్మాపూర్ పరిధిలో రూ.20 లక్షలతో నిర్మించే పీహెచ్సీ సబ్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు. మస్కాపూర్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద జరిగిన వనమహోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రమేశ్రెడ్డి, కాంగ్రెస్ దస్తురాబాద్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, నాయకులు రమేశ్రావు, వెంకన్న, శివ్వయ్య, కొమురవెళ్లి, శరత్రెడ్డి, పడిగెల భూషణ్, మాజిద్, దయానంద్, నిమ్మల రమేశ్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, షబ్బీర్పాషా, గంగనర్సయ్య, మడిగెల గంగాధర్, షౌకత్పాషా, జంగిలి శంకర్, రాజునాయక్, మాసుల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ కొలువుదీరేదెప్పుడో..
సారంగపూర్: జిల్లాలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి అడెల్లి మహాపోచమ్మ ఆలయం రూ.6.60 కోట్ల నిధులతో కృష్ణ శిలలతో పునర్నిర్మించారు. నిర్మాణం పూర్తయి నాలుగు నెలలు గడిచినా అమ్మవారి ప్రతి ష్టాపన కార్యక్రమం నిర్వహించడం లేదు. పునర్నిర్మాణ సమయంలో అమ్మవారిని బాలాలయంలోకి తరలించారు. ఇప్పటికీ ఆ ఆలయంలోనే అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. ఇరుకైన బాలాలయంలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు పాలకమండలి లేక ఆలయ ప్రారంభోత్సవం ఆగిపోయింది. ఇప్పుడు పాలకమండలి కొలువుదీరినా ఆలయాన్ని ప్రారంభించకపోవడంపై భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంలో ఇబ్బంది..గత ఏప్రిల్ 25న అడెల్లి మహాపోచమ్మ ఆలయ పా లకమండలి ఏర్పాటైంది. మూడు నెలలు గడిచినా నూతన ఆలయ ప్రారంభోత్సవం జరగలేదు. ప్రతీ ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి, ఇరుకై న బాలాలయంలో అమ్మవారి దర్శనానికి ఇబ్బంది పడుతున్నారు. సమీపిస్తున్న గంగనీళ్ల జాతర..సెప్టెంబరు 27, 28 తేదీల్లో గంగనీళ్ల జాతర నిర్వహించనున్నారు. జాతర సమీపిస్తున్నా ప్ర ధాన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాప న, ఆలయ ప్రారంభోత్సవానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నూతన ఆలయం ప్రా రంభోత్సవానికి 60 నుంచి 70 రోజుల సమ యం పడుతుందని అర్చకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ నెలలోనే ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. చర్చించి నిర్ణయిస్తాం.. ఆలయ పాలకవర్గం విషయంలో జాప్యం కారణంగానే ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఇటీవలే పాలకవర్గం కొలువుదీరింది. పాలకమండలి సమావేశంలో ఆలయ ప్రారంభోత్సవంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈవిషయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు, పాలక మండలి నిర్ణయం ప్రకారమే ప్రారంభోత్సవం నిర్వహిస్తాం. – రమేశ్, ఈవో, అడెల్లి మహాపోచమ్మ ఆలయం అడెల్లి ఆలయ నిర్మాణం పూర్తి.. విగ్రహ ప్రతిష్టాపనలో జాప్యం ప్రొటోకాల్ ప్రతిబంధకం..? పాలకవర్గం చొరవ చూపితేనే.. -
ఎట్టకేలకు వేతనాలు
● పంచాయతీ కార్మికులకు ఊరట ● మూడు నెలలవి ఒకేసారి చెల్లింపు లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ, మురికి కాలువల శుభ్రత వంటి కీలక పనులతో పల్లెలను మెరుగుపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కొన్ని నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ భారం మోస్తున్నారు. ఎట్టకేలకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులకు మూడు నెలల వేతనాలను విడుదల చేసింది. జిల్లాలో 1,520 మంది కార్మికులుజిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో 1,520 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తున్నారు. ఈ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు బకాయిలుగా ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించాలని కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. బుధవారం నుంచి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమా చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. కార్మికుల హర్షం..మూడు నెలల వేతనాలు ఒకేసారి విడుదల చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు చాలా తక్కువని అవి కూడా జాప్యం లేకుండా నెలనెలా చెల్లించాలని కోరారు. ఇబ్బందులు తొలగిపోతాయి మూడు నెలల నుంచి వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం తమ మూడు నెలల వేతనాలు విడుదల చేయడంతో మా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. – ఉదయ్ కిరణ్, పంచాయతీ కార్మికుడు, పీచర ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందుల గుర్తించింది. ఏ ప్రిల్, మే, జూన్ మూడు నె లల వేతనాలను ఒకేసారి వి డుదల చేసింది. పంచాయ తీ కార్మికుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – ఎర్రన్న, పంచాయతీ కార్మికుడు, మల్లాపూర్ -
మెరుగైన వైద్యం అందించాలి
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ సురేశ్ సూచించారు. భైంసా ఏరియా ఆస్పత్రి ని మంగళవారం సందర్శించారు. వార్డుల్లో కలియదిరిగారు. రోగులతో మాట్లాడి, సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. వర్షా కాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, రోగుల తాకిడికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేయవద్దన్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగై న చికిత్స అందించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట వైద్యులు అనిల్, విజయానంద్, కై లాష్ప తి, పద్మావతి, సుమల తదితరులు ఉన్నారు. -
ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి
ఖానాపూర్: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు ఎస్టీ బాలికల ఆశ్ర మ పాఠశాల, మస్కాపూర్, సుర్జాపూర్, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్లలో మంగళవారం సభ్యత్వ నమోదు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫారసులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులతోపాటు బకాయిపడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూమన్న, లక్ష్మణ్, నాయకులు గోవింద్నాయక్, రాజేశ్వర్, బాలాజీ, గంగాధర్, రాజన్న, అశోక్, మహేందర్ పాల్గొన్నారు. -
● ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం ● రెండు దశల్లో లెక్కించేలా ఏర్పాట్లు ● కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ?
నిర్మల్చైన్గేట్: జనగణనకు కేంద్ర హోంశాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027, మార్చి 1 నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితా తయారు చేసి, రెండో దశలో జనగణన నిర్వహిస్తారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. 2011లో చివరిసారిగా జనగణన జరగ్గా, 2021లో కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 16వ జనగణనలో కులగణన, జాతీయ పౌర పట్టికను కూడా చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీజనగణన కోసం కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్వో, సీపీవో, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారితో కమిటీ ఏర్పాటవుతుంది. మండలస్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సహాయకుడిగా వ్యవహరిస్తారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను నియమిస్తారు, వీరు కేంద్రం అందించిన ప్రశ్నావళి ఆధారంగా డేటా సేకరిస్తారు. ఎన్యుమరేటర్లకు శిక్షణ2026లో ఎన్యుమరేటర్లను నియమించి శిక్షణ ఇస్తారు. 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున, ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. వీరు మొదట గ్రామాల్లో ఇళ్లు, కుటుంబాల సంఖ్యను గుర్తిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరిస్తారు. పట్టణీకరణకు అనుకూలంగా..భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని, మున్సిపాలిటీలకు సమీపంలోని ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, రైల్వే కాలనీలు, విశ్వవిద్యాలయాలు, సైనిక శిబిరాలను ప్రత్యేకంగా గుర్తించి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా వివరాలు సేకరిస్తారు.2027లో జనగణన పూర్తి2026లో శిక్షణతోపాటు జనగణన ప్రక్రియ పై అవగాహన కల్పిస్తారు. 2027 జనవరి, ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి డేటా సేకరిస్తా రు. 2027 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటలలోపు జన్మించిన వారిని లెక్కలోకి తీసుకుంటారు. మార్చి 1 నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో మాన్యువల్గా జరిగిన జనగణనకు భిన్నంగా, ఈసారి మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తారు. -
సమ్మె జయప్రదం చేయాలి
భైంసాటౌన్/ముధోల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.హరిత కోరారు. భైంసా పట్టణంలో, ముధోల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీ ఎత్తివేయాలని, రాజీనామా చేసిన కార్మికులందరికీ కనీస పెన్షన్ రూ.9 వే లు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, బీడీ కార్మికులకు షరతులు లేని రూ.4 వేల జీవనభృతి తదితర డిమాండ్ల సాధనకు సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీడీ కార్మికులు లక్ష్మి, విజయ, బేబి, విజయలక్ష్మి, నరేశ్, మల్లేశ్, గంగాధర్, మధుకర్, సురేష్, విఠల్, రాజేశ్వర్, రాజు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రావొద్దు
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఇసుక లభ్యత, అక్రమ రవాణా నియంత్రణ, భూభారతి చట్టం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక బజార్లు ఏర్పాటు చేసి, ఆన్లైన్ విక్రయాలతో పారదర్శకతను పెంచనున్నట్లు తెలిపారు. ఇసుక నిల్వ స్థలాలను గుర్తించాలని, గ్రానైట్ సేకరణకు జీరో పర్మిట్ విధానం అమలు చేయాలని సూచించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు, ఇసుక ధరల నియంత్రణను నిర్ధారించాలన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డుల ఆమోదంలో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మైనింగ్ ఏడీ, జియాలజీ రవీందర్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, భూగర్భజలాల శాఖ అధికారి శ్రీనివాసబాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
కాలువలకు మరమ్మతు
కడెం: జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన కడెం, సదర్మాట్ ఆయకట్టు కాలువల నిర్వహణను గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేశాయి. దీంతో సాగునీటి కాలువలు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. చాలా వరకు రెండో పంట పండక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రతీ వర్షాకాలం ముందు కాలువల్లో పొదల తొలగింపు, పూడికతీత, మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ, నిధుల కొరతతో ఈ పనులు చేపట్టలేదు. ఫలితంగా, కాలువల ఆనవాళ్లు కోల్పోయి, నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంది. నిధుల కేటాయింపుతో పనులు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, కడెం ఎడమ కాలువ, సదర్మాట్ కాలువల మరమ్మతుల కోసం నిధులు కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ పనులను ప్రారంభించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, ఇరిగేషన్ అధికారులు మరమ్మతు పనులను త్వరితగతిన చేపడుతున్నారు. కడెం కాలువకు రూ.42.40 లక్షలు.. కడెం ఎడమ కాలువ మరమ్మతుల కోసం రూ.42.40 లక్షలు కేటాయించగా 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి. పొదల తొలగింపు, చెత్తాచెదారం (సిల్ట్) శుభ్రపరచడం, కాలువ కట్టల బలోపేతం వంటి పనులు చేపడుతున్నట్లు కడెం ఎడమ కాలువ ఏఈఈ మురళి తెలిపారు. సదర్మాట్ కాలువకు రూ.34.55 లక్షలు.. సదర్మాట్ కాలువకు రూ.34.55 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. 21.5 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. పొదల తొలగింపు, పూడికతీత, దెబ్బతిన్న కాలువ మరమ్మతులు, అవసరమైన చోట్ల కాలువ ఎత్తు పెంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు సదర్మాట్ కాలువ ఏఈఈ విశాల్ వెల్లడించారు. సమస్య పరిష్కారం.. ఈ మరమ్మతు పనులతో కడెం, సదర్మాట్ ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీటి సమస్య తీరి, చివరి ఆయకట్టు వరకు నీరు అందే అవకాశం ఉంది. రైతులు ఈ చర్యలను స్వాగతిస్తూ, వర్షాకాల సీజన్లో పంటల సాగుకు అవసరమైన నీటి సరఫరా సజావుగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేయిస్తున్నాం ఇటీవలే ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేసింది. కడెం ఎడమ కాలువతోపాటు, సదర్మాట్ కాలువ మరమ్మతు పనులు ప్రారంభించాం. కాలువల్లో పూడికతీత, పొదల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో పంటకు కూడా ఇబ్బంది ఉండదు. – విఠల్, ఈఈరైతులకు అండగా.. గత ప్రభుత్వం కడెం ప్రాజెక్ట్ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం కడెం రైతాంగానికి అండగా నిలిచింది. అధికారంలో రాగానే 9.26 కోట్లతో ప్రాజెక్ట్ మర్మమతులు పూర్తి చేయించింది. కడెం, సదర్మాట్ కాలువల మరమ్మతులకు నిధులు కేటాయింది. – పొద్దుటూరి సతీశ్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఏళ్లుగా పట్టించుకోని పాలకులు.. చాలావరకు ఆనవాళ్లు కోల్పోయిన వైనం.. కడెం, సదర్మాట్కు నిధులు కేటాయించిన ప్రభుత్వం మరమ్మతులు చేయిస్తున్న ఇరిగేషన్ అధికారులు సాగునీటి సమస్యకు పరిష్కారం -
నిర్మల్ ఐటీఐకి ఎక్స్లెన్స్ అవార్డు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఐటీఐ రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా ఎక్స్లె న్స్ అవార్డు అందుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం పురస్కారాన్ని ప్రిన్సి పాల్ కృష్ణమూర్తికి ప్రదానం చేశారు. జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి న రాజీవ్గాంధీ ఐటీఐ ఎంతో మంది యువతీ, యువకులకు, ఉద్యోగ, స్వయం ఉపాధి కోర్సులు అందించిందని, ఉపాధి కల్పనకు దోహదపడిందని ప్రిన్సిపాల్ వివరించారు. -
● ప్రజావాణిలో అర్జీదారుల వేడుకోలు ● సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న కలెక్టర్ ● గ్రీవెన్స్కు 91 దరఖాస్తులు
మేడం.. దయచూపండి!నిర్మల్చైన్గేట్: ‘మా సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు.. మేడం మీరైనా దయచూపండి’ అని ప్రజావాణిలో పలువురు అర్జీదారులు కలెక్టర్ను వేడుకున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 91 అర్జీలు వచ్చాయి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులను గౌరవిస్తూ వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. సమన్వయంతో పనిచేయాలి.. సంక్షేమ పథకాలు అమలులో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. భూభారతి చట్ట అమలుపై తహసీల్దార్లు పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అధ్యక్షతన త్వరలో నిర్వహించే దిశ కమిటీ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 9న జిల్లా కేంద్రంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సులు ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతీనెల 30వ తేదీన సివిల్ రైట్స్ దినోత్సవాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు.. మాది నిర్మల్ రూరల్ మండలం కౌట్ల(కె). నాకు నలుగురు సంతానం. గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి చెందిన మురుగు నీటిని గ్రామా పంచాయతీ కార్యదర్శి, మరో ఇద్దరితో కలిసి మా భూమిలోకి మళ్లించాడు. దీనిని ప్రశ్నించినందుకు నన్ను పంచాయతీ కార్యాలయనికి పిలిచి రూ.40 వేల జరిమానా దౌర్జన్యంగా కట్టించుకున్నారు. జరిమానా గురించి ఎవరికై నా తెలిపితే రూ.50 వేలు, మురుగు నీటి కాలువపై ఫిర్యాదు చేస్తే రూ.లక్ష జరిమానా విధిస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన అనుచరులుగా ఉన్న ఇద్దరు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. – బైకస్ చిన్నయ్య కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలు ఆపాలి మేము లోకేశ్వరం మండలం భామిని గ్రామస్తులం. మా గ్రామంలోని ఎర్రకుంట, భుర్కుంటతోపాటు గ్రామ కంఠం భూములను కొందరు ఆక్రమించుకున్నారు. ఇదే విషయమై తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. మీరైనా స్పందించి భూ కబ్జాలు ఆపాలి. – భామ్ని గ్రామస్తులు, లోకేశ్వరం మండలం ఆ స్కూళ్లను మూసివేయాలి.. జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలి. ఐదేళ్లుగా కొన్ని పాఠశాలల్లో ఎలాంటి అనుమతి లేకుండానే 7వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నాయి. ఈ విషయంపై డీఈవోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మీరైనా అనుమతి లేని పాఠశాలలను మూసివేయండి – ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం, నిర్మల్పట్టా చేయడం లేదు.. మా మామయ్యకు ముగ్గురు కుమారులు. చామన్పల్లి గ్రామం తిరుపెల్లి శివారులో 185/15,185/5,185/14/ఆ, 185/4/1, 184/1/ఆ తోపాటు మరో కొన్ని సర్వే నంబర్లలో 22 సంవత్సరాల క్రితం పలువురి వద్ద 8 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ భూములు వేరేవారి పేరు మీద రిజిస్టర్ అయినట్టు చూపిస్తున్నాయి. మా భూమి మాకు ఇప్పించండి. – బడ్డారి పెద్దలింగన్న కోడళ్లు, చామన్పల్లి, లక్ష్మణచాంద -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
సారంగపూర్: నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని దుర్గానగర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించే పాఠశాల భవనం పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 123 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో రోడ్లు లేని గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు తాను సదా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, కాల్వ నరేశ్, సామల వీరయ్య, చంద్రప్రకాశ్గౌడ్, గంగారెడ్డి, విలాస్, తిరుమలాచారి, రాజేశ్వర్, నారాయణ, కొరిపెల్లి రాజు, ప్రకాశ్, డీఈ తుక్కారాం, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి -
బోనస్ ఎప్పుడో..?
నిర్మల్డిగ్రీలో బంగారు పతకాలునిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ బయో టెక్నాలజీ పూర్తి చేసిన గుర్రం శ్రావ్య రెండు బంగారు పతకాలు సాధించింది. కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో బీఎస్పీ విభాగంలో ఒకటి, కెమిస్ట్రీ విభాగంలో మరో బంగారు పతకం సాధించింది. సోమవారం వరంగల్లో నిర్వహించిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా పతకాలను అందుకున్నారు. మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్చైన్గేట్: నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. తాళం సీల్, సీసీ కెమెరాలో రికార్డు దృశ్యాలను పరిశీలించారు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వారివెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు గజానంద్, సిబ్బంది రాజశ్రీ ఉన్నారు. లక్ష్మణచాందకు చెందిన రైతు కంతి చిన్న రాజేశ్వర్ యాసంగిలో పదెకరాల్లో సన్నరకం వరి పండించాడు. 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాడు. కేంద్ర నిర్వాహకులు సన్నవడ్లుగా నమోదు చేశారు. అయితే ధాన్యం మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు ఆయన ఖాతాలో జమయ్యాయి. బోనస్ డబ్బులు మాత్రం రాలేదు. రూ.లక్ష రావాల్సి ఉంది. త్వరగా చెల్లిస్తే వానాకాలం పెట్టుబడికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నాడు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీలు(ఫైల్)లక్ష్మణచాంద: రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తోంది. వానాకాలం సీజన్ నుంచి ఈ బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో యాసంగి సీజన్లో కూడా సన్నరకం వరినే జిల్లా రైతులు సాగుచేశారు. రికార్డు స్థాయిలో ధాన్యం.. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 318 కొనుగోలు కేంద్రాల ద్వారా 42,032 మంది రైతుల నుంచి మొత్తం 1,81,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో సుమారు 22 వేల మెట్రిక్ టన్నులు అధిక ధాన్యం సేకరణ జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ఇందులో 1,55,377 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం వరి ధాన్యం కాగా, 25,623 మెట్రిక్ టన్నులు సన్న రకం వరి ధాన్యం. ఈ సేకరణకు ఇప్పటివరకు రూ.419.66 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బోనస్ ఆలస్యం.. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 4,483 మంది రైతుల నుంచి 25,623 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం సేకరించారు. ఈ ధాన్యానికి సంబంధించిన మొత్తం డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ మాత్రం ఇంకా చెల్లించలేదు. ఈ బోనస్ కింద 4,483 మంది రైతులకు రూ.12.81 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి నెల రోజులైనా బోనస్ చెల్లింపులలో జాప్యంపై రైతులు నిరాశ చెందుతున్నారు. న్యూస్రీల్ కొనుగోళ్లు పూర్తయి నెల దాటినా జమకాని డబ్బులు త్వరగా చెల్లించాలని కోరుతున్న రైతులు జిల్లాకు రూ.12.81 కోట్లు పెండింగ్త్వరగా జమ చేయాలి.. యాసంగిలో సన్న వడ్లే సాగు చేశాను. 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఐకేపీ కేంద్రంలోనే విక్రయించాను. బోనస్ డబ్బులు మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. వానాకాలం పెట్టుబడికి తిప్పలైతాంది. త్వరగా బోనస్ జమ చేయాలి. – కట్కం నవీన్, లక్ష్మణచాంద త్వరలో ఖాతాల్లోకి.. సన్నరకం వరి ధాన్యం సాగుచేసిన రైతులకు ఇచ్చే బోనస్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు త్వరలోనే నేరుగా జమ అవుతాయి. – సుధాకర్, డీఎం పౌరసరఫరాల శాఖ జిల్లా సమాచారం... జిల్లాలో సేకరించిన వరి ధాన్యం 1,81,000 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యం 1,55,377 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం 25,623 మెట్రిక్ టన్నులు మొత్తం రైతులు 42,032 మంది చెల్లించిన డబ్బులు రూ.419.66 కోట్లు బోనస్ రావాల్సిన రైతులు 4,483 మంది రావాల్సిన బోనస్ డబ్బులు రూ.12.81 కోట్లు