breaking news
Nirmal
-
సర్.. పంపిణీ స్పీడ్.. స్వీకరణ స్లో!
కై లాస్నగర్: కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముమ్మరంగా సాగుతుంది. గత నెల 25 నుంచి ఈ ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఇంటింటికీ ఫారాలు అందజేసేందుకు బూత్స్థాయి అధికారులు (బీఎల్వో)లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఇంటిని సందర్శించడంతో పాటు అందుబాటులో లేని వారికి ఫోన్ ద్వారా సంప్రదిస్తూ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 98.2 శాతం ఈ ప్రక్రియ పూర్తయింది. అలాగే ఆదిలాబాద్లో 96.41 శాతం కాగా, కుమురంభీంలో 96.31శాతం, మంచిర్యాలలో 85.92 శాతం పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాల అందజేత వేగంగా సాగుతుండగా వాటిని పూరించి అందించే ప్రక్రియ మాత్రం స్లోగా ఉంది. ఫారాలను ఏ విధంగా నింపాలనే దానిపై ప్రజల్లో అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన కొంతమంది బీఎల్వోలు సైతం ఓటర్ల సందేహాలను నివృత్తి చేయకపోవడంతో వాటి నమోదులో జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గడువు ఉండటంతో ఫారాలు తీసుకుంటున్న ఓటర్లు వాటిని సక్రమంగా నింపాలనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో స్వీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. డిజిటలైజేషన్లో కుమురంభీం టాప్.. ఆదివాసీలు అత్యధికంగా ఉన్న కుమురంభీం జిల్లా డిజిటలైజేషన్లో అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 18.25 శాతం మంది ఓటర్లు తమ ఫారాలను బీఎల్వోలకు అందివ్వగా వారు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక మంచిర్యాలలో కేవలం 2.69 శాతం, నిర్మల్ జిల్లాలో 2.99 శాతం కాగా ఆదిలాబాద్లో 4.46శాతం ఇప్పటివరకు పూర్తయింది. ఓటరు పూరించి అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. ఈనెల 7వరకు అధికారికంగా ఫారాల పంపిణీ పూర్తి కానుంది. అనంతరం వాటిని స్వీకరించడంపై బీఎల్వోలు దృష్టి సారించనున్నారు. దీంతో వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరు ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ ఆదిలాబాద్ 4,66,784 4,50,042 20,815 నిర్మల్ 7,55,344 7,40,409 22,622 మంచిర్యాల 6,61,467 5,68,344 17,771 కుమురంభీం 4,55,596 4,38,503 83,137 -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రుతుపవనాల ప్రభావంతో ఈదురుగాలులు వీస్తాయి. జల్లులు కురిసే అవకాశం ఉంది. వాగ్దేవిగా పూజలు.. వాగ్దేవి అంటే జ్ఞానానికి అధిదేవత సరస్వతి, వేదాలను వర్గీకరించిన వేదవ్యాసుడు ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ దివ్యశక్తితో బాసర క్షేత్రంలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారు బాలాలయంలో వాగ్దేవిగా పూజలందుకుంటారు. ఋగ్వేద వాగ్దేవి సూక్తంలో స్తుతించబడిన జ్ఞానదేవత సరస్వతియే వాగ్దేవి, ద్వాపర యుగంలో వేదాలను నాలుగు భాగాలుగా విభజించి 18 పురాణాలు, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు ఆ జ్ఞానాన్ని క్రమబద్ధం చేశారు. అటువంటి వాగ్దేవి అంశతోనే బాసర క్షేత్రంలో శ్రీసరస్వతి వాగ్దేవిగా కొలువై విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. – సీతారామశర్మ, శృంగేరి పీఠం పండితులు -
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
ఖానాపూర్: యూరియా పంపిణీలో ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు అన్నదాతలకు శాపంగా మారాయన్నారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో సుమారు 60 శాతం మంది రైతులకు మాత్రమే స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, మిగిలిన 40 శాతం మందికి యాప్ ఆధారిత విధానం వల్ల యూరియా పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాస్బుక్ ఆధారంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాదిరె శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి, మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్ గుమ్ముల ఆనంద్, నాయకులు గిరి, శ్రావణ్, రవీందర్, భూమన్న, తిరుమలేశ్, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
జంతు ప్రేమికా.. జాగ్రత్త! రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పెట్స్ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అమ్మవారి సేవ అదృష్టం బాసర ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు మా కుటుంబానికి దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా, నాణ్యతలో రాజీ లేకుండా ఆలయ నిర్మాణం చేపడుతున్నాం. రూ.31 కోట్లతో పనులు ప్రారంభించాం. అవసరమైతే మరి ంత వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వందల ఏళ్లపాటు నిలిచేలా ఆలయాన్ని ని ర్మించడమే మా లక్ష్యం. నిర్మాణ కాలంలో భ క్తులకు ఇబ్బందులు కలగకుండా బాలాల యంలో దర్శనాలు ఏర్పాటు చేశాం. అమ్మవారి అనుగ్రహంతో మహాకార్యం విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తున్నాం. – నిర్మాణ దాత సూరప్పనేని పద్మప్రియ–సునంద్ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి నిర్మల్టౌన్: ప్రయాణికులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. ప్రయాణికుల కోరిక మేరకు ఆదివారం నిర్మల్ బస్టాండ్ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళశెంభు ,మధురై గుండా రామేశ్వరం వెళ్లి తిరుగు ప్రయాణంలో కంచిపురం, శ్రీకాళహస్తి మీదుగా నిర్మల్ చేరుకుంటుందన్నారు. ఈ టూర్ మొత్తం ఏడు రోజులు ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామన్నారు. 150 రూపాయల అక్షరాభ్యాస మండపంలో ఏర్పాటు చేసిన ముగ్గురు అమ్మవార్ల బాలాలయం -
చదువులు సాగేదెలా?
తానూరు: నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు పూర్తయినా ప్రభుత్వ జూనియర్ కళా శాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠాలు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను నోట్స్ ఆధారంగా మాత్రమే అభ్యసించాల్సి వస్తోందని వాపోతున్నారు. అందని ‘తెలుగు’ పుస్తకాలు.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల సిలబస్ మారింది. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఆంగ్లభాషలో పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. కానీ తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు నేటికీ కళాశాలలకు చేరుకోలేదు. కొన్ని కాలేజీల్లో తెలుగు మీడియం వారికి ఆంగ్ల భాషా పుస్తకాలు పంపిణీ చేయడంతో అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలు అర్థంకావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆంగ్లమాధ్యమం విద్యార్థులకు తరగతులు సజావుగా సాగుతున్నా తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు అందించాల్సి ఉండగా, ఈసారి నెల రోజులు గడిచినా సరఫరా కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని కళాశాలలకు పూర్తిస్థాయిలో తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లా వివరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 13 ప్రథమ సంవత్సరం విద్యార్థుల సంఖ్య : 2,558 ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య : 2,338 మొత్తం విద్యార్థుల సంఖ్య : 4,896 -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని, దీనిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్, ఖమ్మం వారి సహకారంతో ఏడు కంప్యూటర్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ... విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఉన్నత స్థాయిని అధిరోహించవచ్చన్నారు. దానికోసం శ్రద్ధ, క్రమశిక్షణ, కృషి అవసరమని పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెలిపారు. చదువుపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ డేనియల్, ఉపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాసర ఆలయాన్ని పరిశీలించిన అధికారులు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ ఈఎన్సీ వసంత నాయక్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శనివారం ఆలమారి సందర్శించి ప్రతిపాదిత అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఆలయ ఈవో అంజనీదేవి, స్థపతి మోతిలాల్, ఆర్కిటెక్ట్ మాధవీలతతో కలిసి గర్భగుడి పరిసరాలు, బాలాలయం, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వదించారు. -
కొత్త గుడిలో పునఃదర్శనం
భైంసా : బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో అమ్మవారి దర్శనం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతోంది. ఆలయ ప్రాంగణంలోని రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని శాస్త్రోక్తంగా బాలాలయంగా మార్చారు. శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన దారు విగ్రహాలను ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ప్రతిష్ఠించారు. శనివారం ఉదయం నుంచి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు, విశేష పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దర్శనం, సేవలు యథావిధిగా.. బాలాలయంలో అమ్మవారి దర్శనంతోపాటు నిత్యపూజలు, మహామంగళహారతి, అభిషేకాలు, అర్చనలు, అక్షరాభ్యాసం వంటి అన్ని సేవలను ప్రధాన ఆలయంలో నిర్వహించినట్లు కొనసాగిస్తారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులందరూ బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ప్రధాన గర్భగుడి మూసివేత.. పునర్నిర్మాణం సజావుగా జరిగేందుకు ప్రధాన గర్భగుడిలో సాధారణ భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. గర్భాలయంలో వేద పండితులు, అర్చకులు మాత్రమే ఆగమ శాస్త్ర ప్రకారం నిత్యపూజలు, హారతులు నిర్వహిస్తారు. భక్తుల దర్శన సౌకర్యాలన్నీ బాలాలయానికి మార్చారు. ప్రధాన ఆలయ నిర్మాణ బాధ్యతను హైదరాబాద్కు చెందిన దాత సురపునేని సునంద్ స్వచ్ఛంగా స్వీకరించారు. ప్రభుత్వ అనుమతితో ఆయన ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ నిధులతో పూర్తి చేయనున్నారు. నిర్మాణంలో సంప్రదాయ శిల్పకళ, ఆగమ శాస్త్ర నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల ఆశలు.. బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం దేశవ్యాప్తంగా అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఏటా లక్షలాది చిన్నారులు ఇక్కడ విద్యారంభం చేసి ఆశీర్వాదాలు పొందుతారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత మరింత వైభవంగా తీర్చిదిద్దబడే ఆలయాన్ని చూడాలని రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లోని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవో అంజనీదేవి మాట్లాడుతూ, పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తులు సహకరించి బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూల విరాట్ పునఃదర్శనం కొత్త గుడిలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా పూర్తయి, భక్తులకు మరింత శోభాయమానమైన ఆలయంలో దర్శనం కల్పించే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. -
అసంపూర్తి భవనాలు.. ఆరుబయట చదువులు
లక్ష్మణచాంద: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రభు త్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. లక్ష్మణచాంద మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు తగినంతగా లేవు. విద్యార్థులు సమస్యల మధ్య చదువుకుంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క గది మాత్రమే బాగుండగా, మిగతా నాలుగు గదుల నిర్మాణం అ సంపూర్తగా ఉంది. దీంతో ఇండోర్ షటిల్ కోర్టులో తరగతులు నిర్వహిస్తున్నారు. 2023లో ‘మన ఊరు మన బడి’ కింద రెండు గదులకు రూ.38 లక్షలు మంజూరయ్యాయి. అయినా ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇక చామన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో 1–5 తరగతుల్లో 35 మంది, ప్రీ–ప్రైమరీలో 10 మంది మొత్తం 45 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం మూడు గదులు మాత్రమే ఉండటంతో ఒకటి ప్రీ–ప్రైమరీకి కేటాయించారు. మిగతా రెండింటిలో నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. 2022లో రెండు అదనపు గదులకు రూ. 30 లక్షలు మంజూరైనా ఇంకా అసంపూర్తిగానే ఉ న్నాయి. పొట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతులకు 25 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు గదులు బాగున్నా, మిగతా మూడు గదులు వర్షం పడితే ఉరుస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం ఇబ్బందిగా ఉంది పొట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడు గదులు వర్షానికి ఉరుస్తున్నాయి. దీంతో అందులో పిల్లలు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి అదనపు గదులు మంజూరు చేయాలి. – సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు -
ముజ్గి పాఠశాలను తనిఖీ చేసిన అబ్జర్వర్
నిర్మల్ రూరల్: మండలంలోని ముజ్గి ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎస్సీఆర్టీ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్రస్థాయి అబ్జర్వర్ నాంపల్లి రాజేశ్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటల ద్వారా అభ్యసన పరిశీలించారు. తరగతిగది వాతావరణం, బొమ్మలు, ఆట వస్తువుల లభ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్వో ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిర్మల్కు శ్రీరాముని పాదుకలు
నిర్మల్టౌన్: అయోధ్య శ్రీరాముని పవిత్ర పాదుకలు, బాల అయోధ్య రాముడు, శ్రీరాముని ధనస్సు శనివారం జిల్లా కేంద్రంలోని నటరాజనగర్కు చెందిన ప్రకాశ్ నివాసానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీరాముడు పాదుకలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముని పాదుకలకు పూజలు చేశారు. హారతులు ఇచ్చారు. అయోధ్య నుంచి తీసుకువచ్చిన పవిత్ర పాదుకల దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశ్, ఆమెడ శ్రీధర్, మహేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు -
నిర్మల్
జై హరి విఠల.. మహారాష్ట్రలోని శ్రీవిఠల–రుక్మిణి స్వామివారి దర్శనం కోసం జిల్లా భక్తులు పండరిపూర్ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. విఠల నామస్మరణతో యాత్ర మొదలు పెట్టారు. డాక్టర్.. ఈవీ కార్.. జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు డాక్టర్ బీఎల్ఎన్రెడ్డి వృత్తిరీత్యా రోజూ తమ హాస్పిటల్తోపాటు వివిధ ఆస్పత్రులు, పేషెంట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వివిధ వైద్య సెమినార్ల కోసం ఇతర పట్టణాలు, హైదరాబాద్కూ వెళ్తుంటారు. ఈక్రమంలో నడపడానికి సౌకర్యంగా ఉండటంతోపాటు పర్యావరణానికి మేలు కలిగే వాహనం ఉండాలని ఈవీ కారు ఎంచుకున్నారు. ఈవీ నడపడం సౌకర్యంగా ఉందని, శబ్ద, వాయు కాలుష్యం ఉండదని, పర్యావరణానికీ మేలు చేస్తుందంటున్నారు.ఆటో మారింది.. ‘ఆదా’యం పెరిగింది జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్ ఇదివరకు పెట్రోల్ ఆటో నడిపేవారు. రోజుకు వందకిలోమీటర్ల మేర ఆటో తిప్పడానికి రూ.300 నుంచి రూ.350 వరకు పెట్రోల్కే ఖర్చయ్యేది. ఇటీవల ఈవీ ఆటో తీసుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటోతో వంద కిలోమీటర్ల మేర అయ్యే ఖర్చు ఏకంగా రూ.60కి తగ్గిందంటున్నాడు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. పంట మార్పిడిని ప్రోత్సహించాలినిర్మల్చైన్గేట్: పంట మార్పిడి విధానాన్ని, ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సూచించారు. హై దరాబాదులోని రాష్ట్ర సచి వాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధి కారులతో శనివారం వ్యవసాయ శాఖపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలలో అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ రైతులకు సరిపడా అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు స్వయంగా ఈ అంశంపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. వర్షాకాలం వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా సీఎస్ సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయి డ్ తదితర వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల వారీగా ప్రణాళికలను రూపొందించామన్నారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందిస్తామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వయంగా ఆస్పత్రులను తనిఖీ చేశామని, వైద్యాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఏవో అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న పాల్గొన్నారు. -
● పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు ● ఈజీ వినియోగం.. మనీ ఆదా.. ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం
నిర్మల్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతూనే ఉండటంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటంతో జిల్లాలో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్)ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు ఇప్పుడు జిల్లాకేంద్రంతోపాటు మండలాల్లోనూ పరుగులు తీస్తున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం లేకపోవడం, నడపడం ఈజీ కావడం, పర్యావరణానికీ మేలు ఉండటంతో ఉద్యోగులు, వ్యాపారులు, యువత ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. లెక్కేస్తూ.. తెచ్చేస్తూ.. నిర్మల్లో లీటర్ పెట్రోల్ రూ.117 ఉండగా, ఒక ఈవీ స్కూటర్ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం రూ.12 నుంచి రూ.18 మాత్రమే ఖర్చవుతోంది. అంటే సుమారు 100 కి.మీ ప్రయాణానికి ఈవీ ఖ ర్చు పెట్రోల్ వాహనంతో పోలిస్తే దాదాపు 10 నుంచి 15 రెట్లు తగ్గుతుంది. ఈనేపథ్యంలో రోజూ ఉ ద్యోగాలు, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారు పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలతో గణనీయమైన ఆదా అవుతోందని లెక్కేసి చెబు తున్నారు. గతంలో నెలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెట్రోల్ వాహనానికి ఖర్చయ్యేదని, ప్ర స్తుతం విద్యుత్ ఛార్జింగ్తో చాలా తక్కువ వ్యయంతోనే అదే దూరం ప్రయాణిస్తున్నామంటున్నారు. పర్యావరణానికీ ఊరట.. పొగ, కార్బన్ ఉద్గారాలు లేకపోవడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఈవీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల కొరత.. ఈవీ వినియోగం పెరుగుతున్నప్పటికీ జిల్లాలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేవు. తప్పని పరిస్థితుల్లో ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకోవడం ఒక్కటే కొంత ఇబ్బంది. రహదారులవెంట ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో రోడ్లపై వెళ్తున్న ఈవీ స్కూటర్లు ఈవీ–పెట్రోల్.. ఏది లాభం..! అంశం ఈవీ వాహనం పెట్రోల్ వాహనం ఇంధన వ్యయం ఫుల్చార్జ్కు రూ.12–18 లీటర్ పెట్రోల్ రూ.117 100కి.మీ. ప్రయాణ ఖర్చు రూ.10 –15మాత్రమే రూ.180–230(మైలేజీని బట్టి) నెలకు ఇంధన వ్యయం రూ.120–150 రూ.1,900–2,300 అదనపు ఖర్చు 00 రూ.800–రూ.1,000 నిర్వహణ చాలా తక్కువ ఇంజిన్ఆయిల్, ఫిల్టర్లు, సర్వీసింగ్ కాలుష్యం పొగ,శబ్ధ కాలుష్యం ఉండదు కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి చార్జింగ్/ఇంధనం ఇంట్లోనే చేసుకోవచ్చు పెట్రోల్బంక్కు వెళ్లాల్సిందే ప్రయాణదూరం ఒక్క చార్జ్కు 100–150కి.మీ ట్యాంకు నింపితే 300–500 కి.మీ. -
కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
నిర్మల్చైన్గేట్: దొడ్డి కొమురయ్య వర్ధంతిని క లెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్కుమా ర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి కాలంలో తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంకెళ్ల నుంచి బంధవిముక్తి చేసేందుకు పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఎంతో తెగువతో నిజాం నిరంకుశత్వానికి, దొరల ఆగడాలపై వ్యతిరేకంగా పో రాడారన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలు ప్రభుత్వాలు అధి కారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నా రు. దొడ్డి కొమురయ్య ఆశయాలను అందరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, పలువురు సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాధనం వృథా కావొద్దు
నిర్మల్: ‘వివిధ పథకాల పేరిట కోట్లు ఖర్చుపెడుతూనే ఉన్నాం. ఏ పథకం వచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రజాధనం వృథా అవుతోంది..’ అని ఎంపీ నగేష్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఫలాలు అందించాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ భవేశ్మిశ్రా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావు పటేల్, వెడ్మ బొజ్జుపటేల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా సమీక్ష... ఏడాది కాలంగా వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనులు, ఆర్థిక పురోగతిపై శాఖల వారీగా ప్రజాప్రతినిధులు సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఒక్కో శాఖ అధికారి ద్వారా వివరంగా అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల కేటాయింపులపై అభ్యంతరాలను తెలిపారు. ‘ఏరువాక–మన ఊరు మన చేను’ కార్యక్రమం, బ్యాంకు లింకేజీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వ్యవసాయ శాఖ ద్వారా పీఎంకేఎస్వై అమలు, యూరియా నిల్వలు, విద్యుత్ శాఖ మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్, విద్యాశాఖ సర్వ శిక్ష అభియాన్, పీఎం శ్రీ, మధ్యాహ్న భోజన పథకం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్, ఉద్యానవన, అటవీ, గిరిజన సంక్షేమ, క్రీడలు, పౌర సరఫరాలు, బీఎస్ఎన్ఎల్, నేషనల్ హైవే, లీడ్ బ్యాంక్ తదితర శాఖల పనితీరును సమీక్షించారు. పారదర్శకంగా అందిస్తాం.. జిల్లాలో అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్మిశ్రా పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్లు లేని 14 గ్రామాల్లో సర్వేలు, 70 గ్రామాల్లో రీ–సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాఖల వారీగా ఆయా అధికారులు తమ పురోగతిని వివరించారు. సమావేశంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
వంటకు గది ఉండాలి...
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్రత్యేకంగా వంటగది ఉండాలి. ఆరుబయట వంట చేయడం వర్షాకాలం మరింత ఇబ్బందిగా ఉంటోంది. – జాడి లింగవ్వ, నిర్వాహకురాలు, మున్యాల్ కిచెన్ షెడ్లు మంజూరు.. జిల్లాలో మొత్తం 412 పాఠశాలల్లో కిచెన్షెడ్లు లేకపోవడంతో తాత్కాలిక ఏర్పాట్లు, ఆరుబయట వంట చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 235 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు మంజూరయ్యాయి. మిగితాచోట్ల కూడా నిర్మాణాలను చేపడతాం. –భోజన్న, డీఈవో -
వసతి గృహం ఎత్తివేత..!
కుంటాల: అర్హులైన విద్యార్థులకు వసతితోపాటు భోజనం అందించేందుకు గతంలో కుంటాలలో ఎస్సీ వసతి గృహం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇందులో వసతి కల్పించారు. అప్పట్లో ప్రవేశాలు లేకపోవడంతో 2016లో వసతి గృహాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం ఆ భవనంలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతోంది. చదువులకు విద్యార్థులు దూరం.. ప్రస్తుతం కుంటాలలో బీసీ వసతి గృహం ఉంది. ఇందులో 100 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా అదనంగా మరో 15 మందికి అవకాశం కల్పించారు. కుంటాలలో ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు చదివేందుకు అవకాశంఉన్నా.. బాలురకు హాస్టల్ వసతి లేదు. మండలంలోని ఆయ గ్రామాల్లోని విద్యార్థులు కుంటాల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, ఆదర్శ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. వసతి సౌకర్యం లేక సుమారు 60 మంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లారు. దీంతో విద్యార్థులు చదువుల దూరం అవుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అధికారుల స్పందించి బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. ఎస్సీ వసతి గృహం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్తోపాటు సాంఘిక సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. వసతి గృహాన్ని తిరిగి ప్రారంభిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. జక్కల గజేందర్, సర్పంచ్, కుంటాల -
నిర్మల్
కట్టెలపొయ్యి మీదనే.. సరిపడా సిలిండర్లు లేక కుంటాల ఉన్నత పాఠశాలలో కట్టెలపొయ్యిపైనే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. మండలంలోని సూర్యాపూర్, ఓల, మెదన్పూర్, అంబుగామ, హనుమాన్నగర్తండా, సేవాదాస్నగర్తండా ప్రాథమిక పాఠశాలల్లో వంటగదులు లేవు. ఆరుబయట లేదంటే తమ ఇళ్లలో వంట చేసుకొని రావాల్సిన పరిస్థితి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో జాప్యం వద్దు భైంసాటౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓ టర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ ఆదేశించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఎన్యూమరేషన్ పంపిణీ శిబిరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడి సమస్యలు, అర్హులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫారాల పంపిణీ వేగవంతం చేయాలని అఽధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శశిభూషణ్ ఉన్నారు. చెట్టుకింద వంట.. సారంగాపూర్ మండలం సాయినగర్ గ్రామ పాఠశాలలో ఇలా చెట్టు నీడలో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యిపైనే. ఇక్కడ వంటగది లేదు. వర్షం పడితే నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనంలో వంట చేయాల్సిన పరిస్థితి. -
ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి
నిర్మల్టౌన్: ప్రజల నుంచి అందే ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టపరంగా చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీజీపీ సీవీ.ఆనంద్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరును సమగ్రంగా సమీక్షించి సంబంధిత జిల్లా పోలీస్ అధికారులతో శాంతిభద్రత పరిస్థితి నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలపై చర్చించారు. సైబర్ నేరాల నివారణ, కోర్టు లియాజనింగ్, పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు, క్రైం మీటింగ్ల నిర్వహణ, నార్కోటిక్ డ్రైవ్లు, ఆరైవ్ అలైవ్ కార్యక్రమం, రోడ్డు భద్రత చర్యలు, జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, ఏవో యూనుస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యేక దృష్టి పెట్టాలి..
పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ నగేష్ సూచించారు. ప్రతీజాబ్కార్డుదారుకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, రేషన్ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. సమాన పని కల్పించాలి..ఉపాధి హామీ పనుల్లో సమాన పనిదినాలు, సమాన వేతనం అమలు చేయాలని, అనుమతులు లభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సూచించారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు యూరియా యాప్ వినియోగంపై క్షేత్రస్థాయిలో సహాయం అందించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నచోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. బాదన్కుర్తిలో ఉపాధిహామీ పనులపై ఆడిట్ చేయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిశీలించాలని చెప్పారు. ప్రమాదాలు నివారించాలి.. భైంసా సమీపం 61వ జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. బాసర వంతెనను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. బాసర, తానూరు మండలాల్లో మిషన్ భగీరథ నీరందడం లేదని చెప్పారు. -
అక్రమ పట్టాలపై విచారణ జరపాలి
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో భైంసా–బాసర జాతీయ రహదారిపై వాలేగాం గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో చేశారు. వాలేగాంలో ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు మంజూరు చేసి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అక్రమంగా మంజూరైన పట్టాలను రద్దు చేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ పట్టాలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న భైంసా తహసీల్దార్ శశిభూషణ్, ఎస్సై సుప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు. -
రాష్ట్రస్థాయి ప్రత్యేక శిక్షణలో జిల్లా రీసోర్స్పర్సన్లు
నిర్మల్ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నిర్వహిస్తున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి సమీకృత ఇన్సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నుంచి రిసోర్సుపర్సన్లుగా ఉపాధ్యాయులు అబ్దుల్ అజీమ్, ఎ.కిషన్, ఎ.వనిత, కె. జ్యోతి, శశిరాజ్, ధీరజ్, వెంకటేశ్, చంద్రప్రకాశ్, రామ్మోహన్, నవీన్గౌడ్ పాల్గొంటున్నారు. ఈ శిక్షణలో భోదనలో నాణ్యత పెంపు, విద్యార్థి కేంద్రిత అభ్యసనం, వినూత్న బోధనా విధానాలు, తరగతి గది నిర్వహణ తదితర అంశాలపై మూడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ఈ నలుగురు రిసోర్స్ పర్సన్లు త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అందించనున్నారు. -
వ్యవసాయ శాఖ!
గాడితప్పిన భైంసా పట్టణంలోని కిసాన్గల్లికి చెందిన ఓ రైతు పట్టణంలోని గాంధీగంజ్లోని ఓ విత్తన దుకాణంలో తేజస్వితోపాటు మరో రకానికి చెందిన సోయా విత్తనాలు కొనుగోలు చేశారు. వాటిని విత్తగా తేజస్వి సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో డీలర్ను నిలదీయగా వేరే రకం సోయా విత్తనాలు ఇచ్చినట్లు తెలిసింది. పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ రకం విత్తనాలు మొలకెత్తకపోతే కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు. భైంసా వ్యవసాయాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భైంసా పట్టణంలో పలు ఎరువుల విక్రయ దుకాణాల్లో డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ భవేశ్ మిశ్రా దృష్టికి వెళ్లడంతో పట్టణంలోని ఓ ఎరువుల దుకాణం లైసెన్స్ సస్పెండ్ చేశారు. మరో ఆరుగురికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. భైంసా మార్కెట్లో తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని విత్తనాలు (ప్రిన్సిపల్ సర్టిఫికెట్) లేని విత్తనాలు ఎన్నో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. దుకాణాల్లో తనిఖీలు జరపాల్సిన స్థానిక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భైంసా టౌన్: డివిజన్ కేంద్రమైన భైంసా మార్కెట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్. భైంసా మండలంతోపాటు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి భైంసాకు వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి కూడా రైతులు విత్తనాల కోసం వస్తుంటారు. ఒక్క భైంసా పట్టణంలోనే ఏటా రూ.400 కోట్ల వ్యాపారం జరుగుతోంది. అర్బన్ ఏవో పోస్టు ఖాళీ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసా వ్యవసాయ మార్కెట్ అత్యంత కీలకమైంది. భైంసా మండల పరిధిలో దాదాపు 75కి పైగా ఎరువులు, విత్తనాల డీలర్ దుకాణాలు ఉన్నాయి. మండలంలో 33 గ్రామాల్లో 55 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో దుకాణాలపై పర్యవేక్షణ, రైతులకు అందుబాటులో ఉండేందుకు 2008లో ప్రభుత్వం అర్బన్ ఏవో పోస్టును మంజూరు చేసింది. ఈ పోస్టు పరిధిలో 75 దుకాణాలు ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు అందేలా చూడడం, అధిక ధరలకు విక్రయించకుండా చూడడం, రాష్ట్రేతర ప్రాంతాలకు విత్తనాలు, ఎరువులు తరలిపోకుండా పర్యవేక్షించడం ఈ అధికారి బాధ్యత. జూనియర్కు ఏడీఏ బాధ్యతలు..భైంసా ఏడీఏగా పనిచేసిన వీణ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జిల్లా కార్యాలయంలో సీనియర్ ఏవోలు ఉండగా వ్యక్తిగత కారణాలతో జూనియర్ ఏవోకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ను సంప్రదించగా ఆయన స్పందించలేదు. అర్బన్ ఏవో పోస్టు పునరుద్ధరణకు డిమాండ్ప్రస్తుతం ఖాళీగా ఉన్న అర్బన్ ఏవో పోస్టును తిరిగి భైంసా కార్యాలయానికే కేటాయించాలని రైతులు కోరుతున్నారు. భైంసా వంటి పెద్ద మార్కెట్ ఉన్న చోట సీనియర్ ఏఓను నియమించడం వల్ల విత్తనాలు, ఎరువుల విక్రయాలపై సరైన పర్యవేక్షణ ఉంటుందని, రైతులకు నాణ్యమైన వస్తువులు అందేలా చూడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పోస్టు పునరుద్ధరిస్తేనే..భైంసాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అర్బన్ ఏవో పోస్టును తిరిగి భైంసా కార్యాలయానికే కేటాయించాల్సిన అవసరం ఉంది. భైంసా వంటి పెద్ద మార్కెట్ ఉన్న చోట సీనియర్ ఏఓను నియమించ డం ద్వారా విత్తన, ఎరువుల విక్రయాలపై సరైన పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా రైతులకు నాణ్యమై న విత్తనాలు, ఎరువులు అందేలా చూడవచ్చు. కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించి, భైంసా మండల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.భైంసాలోని ఏడీఏ కార్యాలయంపోస్టు ఎత్తివేతతో నష్టం.. అయితే పలు అక్రమాల ఆరోపణలు ఉన్న జిల్లా వ్యవసాయ అధికారి వ్యక్తిగత కారణాలతో అర్బన్ ఏవో పోస్టు అవసరం లేదని ప్రభుత్వానికి లేఖ రాసి, ఆ పోస్టును డీఏవో కార్యాలయానికి తరలించారు. దీంతో స్థానిక రైతులకు తీరని నష్టం జరుగుతోంది. రూరల్ పరిధిలోని 33 గ్రామాలు, 75 దుకాణాల పర్యవేక్షణతోపాటు 9 మంది ఏఈఓల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో నాణ్యమైన పర్యవేక్షణ లోపిస్తోంది. విత్తనాల నాణ్యత లోపం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. -
పాఠశాలలకు అల్పాహారం నిధులు విడుదల
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అందించిన బ్రేక్ఫాస్ట్కు సంబంధించి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. 2023–24 విద్యాసంవత్సరం బిల్లులు మంజూరు చేయడం వంట కార్మికులకు ఊరటనిచ్చింది. నెలల తరబడి అల్పాహారం నిధులు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా విద్యాశాఖ అధికారులు వంట కార్మికులకు త్వరితగతిన చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, హాజరు శాతం పెంచేందుకు 2023–24లో దసరా కానుకగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమల్లోకి వచ్చింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఈ పథకంలో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. చాలామంది పిల్లలు దూర గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటుండగా అల్పాహారం ఉపయుక్తంగా మారింది. పథకానికి సంబంధించిన బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉండడంతో పూర్తిగా నిలిపివేశారు. తాజాగా పెండింగ్ బిల్లుల విడుదలతో వంట కార్మికులకు ఉపశమనం కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లాలో మొదట న్యూగర్మిళ్ల, చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్టర్బెడ్ ఎంపీపీఎస్, బెల్లంపల్లి నియోజకవర్గంలో 2ఇంకై ్లన్ ఎంపీపీఎస్లో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మరికొన్ని రోజులకు మరో 36 పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది. నిధుల మంజూరులో ఇబ్బందులతో పథకం నిలిచిపోగా.. విద్యార్థులు ఉదయం పస్తులతోనే పాఠశాలకు రావాల్సి వస్తోంది. మెనూ ఇలా..పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు 45 నిమిషాల ముందు అల్పాహారం అందించేవారు. సోమవారం ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరి, ఆలుకుర్మా లేదా టమాటా బాత్, సాంబార్, బుధవారం ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్ల్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు, శుక్రవారం ఉగ్గని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, శనివారం పొంగల్, సాంబార్ లేదా కూరగాయల పులావ్, పెరుగు, చట్నీ, ఆలుకుర్మా మెనూలో పొందుపర్చారు. నిధులు మంజూరు కాకపోవడం, నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో అల్పాహారం పథకం నిలిచిపోయింది. ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి.నిధులు మంజూరు ఇలా..జిల్లా నిధులు(రూ.లలో) ఆదిలాబాద్ 97,957 నిర్మల్ 4,70,000 మంచిర్యాల 19,35,336 ఆసిఫాబాద్ 8,50,935 -
పుస్తక జ్ఞానానికి సామాజిక కోణం జోడించాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు పుస్తక జ్ఞానానికి సామాజిక కోణాన్ని కూడా జోడించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోన్ కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, బోధన, వసతి, ఆహారం, పరి శుభ్రత తదితర అంశాల గురించి ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాసస్థాయిని పరిశీలించారు. అనంతరం వంటశాల, సరుకుల నిల్వ గది, భోజనశాలను తనిఖీ చేసి అక్కడి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. మెస్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన కూరగాయలు, ఆ హార పదార్థాలను మాత్రమే వినియోగించాలన్నా రు. అనంతరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టా రు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీ న సామాజిక, శాసీ్త్రయ, సాంకేతిక అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో జ్యోతి, ఎస్వో లతాదేవి ఉన్నారు. -
ఇంత దారిద్య్రమా!
భైంసా/కుంటాల: జిల్లాలోని కుంటాల మండలం అంబుగాం గ్రామానికి రహదారి సమస్య దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తోంది. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఈ సమస్యను ఎన్నికల సమయంలో నేతలు తమ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. తమను గెలిపిస్తే రోడ్డు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో తాజాగా గ్రామ యువకులు సోషల్ మీడియా వేదికగా రోడ్డు దుస్థితిపై ఓ వీడియో విడుదల చేసి మరోసారి గ్రామ రోడ్డు దుస్థితిని వెలుగులోకి తెచ్చారు. పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధ్వాన్నంగా ప్రధాన రహదారి.. అంబుగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, రైతులు, వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రమదానంతో తాత్కాలిక మరమ్మతు.. గత వర్షాకాలంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేసి రహదారిని తాత్కాలికంగా మరమ్మతు చేశారు. మట్టి, మురుగు, కంకరతో గుంతలు పూడ్చి రాకపోకలకు అనువుగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే భారీ వర్షాలకు ఆ తాత్కాలిక నిర్మాణం కొట్టుకుపోవడంతో ప్రస్తుతం రోడ్డు మళ్లీ పాడైపోయింది. ప్రజలే సొంత డబ్బులు వెచ్చించి రోడ్డు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెరవేరని వాగ్దానాలు.. ఈ సమస్యపై గతంలో కూడా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. రోడ్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరైనట్లు ప్రకటించినప్పటికీ పనులు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రతీ ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇస్తున్నా, ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్.. తమ ఊరి రోడ్డు సమస్యపై అధికారుల స్పందన కోరుతూ తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు గ్రామ యువకులు. ఈ వీడియోలో యువకులు రహదారి దుస్థితిని చూపిస్తూ ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కీలకమైన రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పాలకుల దృష్టికి -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
దస్తురాబాద్: పోలీసులు విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటి, పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ నిర్వహణ, శాంతి భద్రతల పరిస్థితులను, నేరాల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి తీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత సిబ్బందితో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పటుపై గ్రామ అభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే గోడిసీర్యాల గ్రామ గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామ పెద్దలకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట నిర్మల్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐ కె.సత్యానారాయణ, మల్లేశ్, ఖానాపూర్, కడెం ఎస్పైలు రాహుల్ గైక్వాడ్, సాయికృష్ణ, సాయికుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అపోహలతో ఆగిన టీకా!
నిర్మల్చైన్గేట్: ప్రాణాంతకంగా మారే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ను నివారించేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హెచ్పీవీ టీకా కు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేదు. బా లికల ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా టీకా ఇస్తు న్నా తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు, అవగాహన లోపం, సంప్రదాయ భావజా లం కారణంగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 14నుంచి 15ఏళ్లున్న బాలికలు 7,512 మంది ఉండగా ఇప్పటివరకు 3,675 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, సంప్రదాయ పద్ధతులను అ నుసరించే కుటుంబాలవారిని టీకా తీసుకునేందుకు ఒప్పించడం ఆరోగ్యశాఖకు సవాల్గా మారింది. దీంతో లక్ష్యం చేరుకోవడంలో ఆలస్యమవుతోంది. కార్యక్రమం ప్రారంభమిలా.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో టీకా పంపిణీ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. సాధారణంగా ఈ టీకాను ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ.వేలల్లో ఖర్చవుతుంది. మొత్తం ప్రక్రియకు సుమారు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వ్యయమవుతుంది. ఇలాంటి విలువైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నా ప్రజల్లో అవగాహన కొరవడి లక్ష్యం చేరని పరిస్థితి ఉంది. లక్ష్యం ఎందుకు చేరుకోలేదంటే.. టీకా ప్రారంభంలో బాలికలు పదో తరగతి పరీక్షల్లో బిజీగా ఉండటంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవ రూ ముందుకు రాలేదు. పరీక్షల తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించే బాధ్యత ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తల్లో చాలామందికి జనగణన విధులు అప్పగించారు. పెళ్లి తర్వాత గర్భధారణ సమస్యలు వస్తాయనే అపోహతో చాలామంది తల్లిదండ్రులు బాలికలకు టీకా వేయించేందుకు ఆసక్తి చూపడంలేదు. క్యాన్సర్ నివారణలో కీలక పాత్రహెచ్పీవీ వైరస్తో గర్భాశయ ముఖద్వార క్యాన్సరే కాకుండా ఇతర ప్రమాదకర క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతోపాటు పలు రకాలైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని పేర్కొంటున్నారు. సుమారు ఆరు రకాల క్యాన్సర్లను గణనీ యంగా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలి
నిర్మల్టౌన్: ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే స్పెషల్ జువైనెల్ పోలీస్ యూనిట్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్ వె ల్ఫేర్ కమిటీ, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యాశాఖలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశ్రమలు, హో టళ్లు, దాబాలు, గ్యారేజీలు, వర్క్షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, బస్టాండ్లు, రైల్వేస్టేష న్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ ఉపేందర్రెడ్డి, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా పోలీస్ అధికారులు, స్పెషల్ జువైనెల్ పోలీస్ యూ నిట్ ప్రతినిధులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అనిల్, శ్రీలత, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా కార్మిక అధికారి రాజలింగం, ముస్కాన్ జిల్లా ఇన్చార్జి ఎస్సై అజ య్, సబ్ డివిజన్ ఇన్చార్జి డబ్ల్యూఎస్ఐ శ్రావణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సత్వర సేవలందించడమే లక్ష్యం భైంసాటౌన్: సత్వర, పారదర్శక, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. పట్టణంలోని పాత రూరల్ పోలీస్స్టేషన్ ఆ వరణలోగల క్యాంపు కార్యాలయంలో నిర్వహించి న ప్రజావాణికి హాజరయ్యారు. అంతకుముందు స బ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి న అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించా రు. ప రిష్కారానికి సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. భరోసా కేంద్రంలో కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు ఇచ్చిన కౌన్సి లింగ్ను పరిశీలించారు. అనంతరం పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
నిర్మల్
ఆదర్శం ఈ ఉపాధ్యాయులు పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సొంత డబ్బులు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్నారు.గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026మౌలిక వసతుల పరిశీలననర్సాపూర్(జి): మండల కేంద్రంలోని జెడ్పీ ఉ న్నత పాఠశాలను తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి బుధవారం సందర్శించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏ ర్పాటులో భాగంగా తరగతి గదులు, విద్యార్థు ల సంఖ్య, ఆటస్థలం, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల సంఖ్య తదితర వివరాలు నమోదు చే సుకున్నారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వి ద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటుకు కృషి చేస్తోందని తెలిపారు. ఆయన వెంట డీఈవో భోజ న్న, ఎంఈవో సాయన్న, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ గంగాధర్గౌడ్, ఏఈ మహేశ్కుమార్, కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కల్పన, పీడీ దేవేందర్, ఉపాధ్యాయులున్నారు.నిర్మల్: జిల్లాలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. వరి, పత్తి, సోయాబీన్ తదితర విత్తనాలు వేసిన రైతులు ప్రాజెక్ట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం, సదర్మట్, స్వర్ణ, గడ్డెన్నవాగు తదితర ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతమున్న నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదపైనే ఆయకట్టు రైతుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటివరకు ఎగువన మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు లేక ప్రాజెక్ట్ల్లోకి వరద రావడం లేదు. జిల్లాలో 15శాతం లోటు జూన్లో జిల్లాలో సగటున సాధారణ వర్షపాతం నమోదైనా మండలాలవారీగా చూస్తే చాలా చోట్ల లోటు వర్షపాతమే కనిపిస్తోంది. జూన్ 1నుంచి 30వరకు జిల్లా సాధారణ వర్షపాతం 173.1 మి.మీ. కాగా, వాస్తవంగా 147.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 15శాతం లోటుతో జిల్లా మొత్తం మీద వర్షపాతం సాధారణ శ్రేణిలోనే ఉంది. జిల్లాలోని 19మండలాల్లో తొమ్మిది మండలాలు వర్షాభావ జాబితాలో ఉండగా, ఎనిమిది చోట్ల సాధారణ వర్షపాతం ఉంది. కుంటాల, పెంబి మండలాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. పెంబి మండలంలో అత్యధికంగా 273.1 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 56శాతం అధికంగా ఉంది. కుంటాల మండలంలో 202.5 మి.మీ. వర్షపాతంతో 20శాతం అధిక వర్షపాతం నమోదైంది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుత పరిస్థితి ఇలా.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగితే పంటలకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. జిల్లాలో లేకున్నా.. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి గణనీయంగా నీరు చేరే అవకాశముంటుంది. జిల్లాలో జలవనరులున్న చోట ఇప్పటికే రైతులు విత్తనాలు వేశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రానున్న రోజుల్లో చేరే వరద నీరే వానాకాలం సాగు భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ప్రస్తుతానికి ఎగువన కూడా ఆశించిన వర్షాలు లేకపోవడంతో జిల్లా ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో ప్రారంభం కాలేదు. -
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ భవేశ్ మిశ్రా ● మాతా, శిశు ఆస్పత్రి తనిఖీ నిర్మల్చైన్గేట్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైద్యులు, సి బ్బందికి సూచించారు. అనంతరం రికార్డులు, రిజి స్టర్లను పరిశీలించారు. 24గంటలు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు ఉచితంగా అందించా లని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, నవజాత శిశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షకురాలు సరోజ, అధికారులు గోపాల్సింగ్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్నిర్మల్టౌన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 31వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీ షర్మిల ఓ ప్రకటనలో తెలిపా రు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు, మత విధ్వేషా లు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, సందేశాలు, వీడియోలు, ఇతర అభ్యంతకర స మాచారాన్ని ప్రసారం చేసిన వారిపైనా చర్యలు త ప్పవని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. -
రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గంలో హ్యామ్ పథకం కింద మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న ఇతర రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులూ చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. బుధవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్, ఖానాపూర్, ఇంద్రవెల్లి, కడెం, పెంబి, జన్నారం మండలాల్లో హ్యామ్ పథకం కింద బీటీ రోడ్లు మంజూరు కావడంపై హర్షం వ్యక్తంజేశారు. అలాగే, పెంబి–అల్లంపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు కలెక్టర్తో కలిసి పర్యటించిన సందర్భంగా గుర్తించిన రహదారులు, మౌలిక వసతుల సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బొజ్జు ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రకృతి విపత్తులపై అవగాహన
సారంగపూర్: మండలంలోని స్వర్ణ గ్రామంలో ప్ర కృతి విపత్తులు తలెత్తిన సమయంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలపై శిక్షణ డెప్యూటీ కలెక్టర్ ఎల్లందుల రా కేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రకృతి విపత్తు ల నిర్వహణ సంస్థ అధికారి రాజేశ్ ప్రజలకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో తీవ్ర వర్షాభావ ప రిస్థితులు నెలకొన్న సమయంలో లోతట్టు ప్రాంతా ల్లో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి వివరించారు. అగ్ని ప్ర మాదాలు, వేడిగాలులు, పాముకాట్లు, ఇతర అవసరాలు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలన్న అంశాల గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 104, 108, 102 లాంటి టోల్ఫ్రీ నంబర్ల ద్వారా అందించే సహాయ సహకారాల గురించి వివరించారు. స్థానిక సర్పంచ్ మల్లయ్య, జీపీవో రమేశ్, గ్రామస్తులున్నారు. -
ప్రభుత్వ కళాశాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యాధికారి జా దవ్ పరశురాం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై గత విద్యాసంవత్సరంలో కళాశాల మంచి ఫలితాలు సాధించడంతో అభినందించారు. గతేడాదితో పోలిస్తే ఈ వి ద్యాసంవత్సరంలో కళాశాలలో ప్రవేశాలు పెరగడంతో ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ రికార్డులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ఆనందం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పసుపు విత్తనం @ కనకాపూర్
లక్ష్మణచాంద: జిల్లాలో పసుపు విత్తనానికి కేరాఫ్గా మండలంలోని కనకాపూర్ నిలుస్తోంది. గ్రామానికి చెందిన రైతులు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్, అంక్సాపూర్ గ్రామాలకు వెళ్లి అక్కడ పసుపు వి త్తనాన్ని కడాయి చొప్పున కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తారు. నిర్మల్ నుంచి మంచిర్యాలకు వెళ్లే జాతీ య రహదారి 61పై కనకాపూర్ వద్ద విక్రయిస్తున్నా రు. ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే ఇక్కడ లభించే పసుపు విత్తనాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో ని లక్ష్మణచాంద, మామడ, సోన్, దిలావర్పూర్, సారంగపూర్ తదితర మండలాల నుంచి రైతులు వస్తున్నారు. పసుపు విత్తనం ప్రారంభంలో రూ.6వేలు ఉండగా మంగళవారం కడాయికి రూ.7,500 ధర ఉంది. సీజన్లో 200 నుంచి వెయ్యి కడాయిల పసుపు విత్తనం అమ్ముడు పోతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు సుమారు 7–8 కడాయిల పసుపు విత్తనం పండుతుందని పేర్కొంటున్నారు. -
పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధే బల్దియా ప్రాధాన్యత అని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సమావేశంలో కమిషనర్ రవిబాబు, డీఈ హరిభవణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మైనార్టీలకు కొమ్ముకాస్తున్న పాలక వర్గం నిర్మల్చైన్గేట్: నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ ఒక వర్గానికే కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, పట్టణ నాయకుడు సాధం అరవింద్ ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. 42 వార్డులలో నెలకొన్న అనేక సమస్యలను పక్కన బెట్టి కేవలం మైనారిటీ వర్గానికి కొమ్ముకాసేలా ఎజెండాలు రూపొందించడం సరికాదన్నారు. బక్రీద్ పండుగకు సంబంధించి బిల్లులు ఆమోదం కోసం, జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ఈద్గా అభివృద్ధికి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.50 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. వర్షాకాలంలో పట్టణంలోని అనేక కాలనీల్లో రోడ్ల పైకి నీరు చేరుతుందని ఇటువంటి అత్యవసర పనులపై దృష్టి సారించాలని సూచించారు. 21వ వార్డులో జనావాసాలు లేకపోయినా డ్రైనేజీ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించడం సరికాదన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సాదం అరవింద్, కౌన్సిలర్లు శ్రీరామోజీ నరేశ్, జింక సూరి, కూన శశాంక్, విఠల్, సాత్విక్, ముత్యం పాల్గొన్నారు. -
దండేపల్లిలో అగ్ని ప్రమాదం
దండేపల్లి: మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇసీ్త్ర దుకాణం, చికెన్ సెంటర్, హోటల్ కాలిపోయాయి. స్థానిక అంగడిబజారు సమీపంలో గల గుడికందుల సత్తయ్యకు చెందిన ఇసీ్త్ర దుకాణం, దాని పక్కనే గల ఖాజామియాకు గల చికెన్ సెంటర్, దానిని ఆనుకుని ఉన్న రెడ్డవేని లచ్చనకు చెందిన హోటల్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సుమారు రూ.30వేలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చేపల వేట నిషేధం పాతమంచిర్యాల: జిల్లాలోని గోదావరి నది, అన్నారం, సుందిళ్ల బ్యారేజీతోపాటు మైనర్ ఇరిగేషన్, ప్రాజెక్టులు, రాళ్లవాగు, గొళ్లవాగు, ముల్కల్ల వాగు ప్రాజెక్టు, పోతనపల్లి, నీల్వాయి ప్రాజెక్టుల్లో చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నుంచి ఆగస్టు 31వరకు జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో చోరీతలమడుగు: మండలంలోని కొత్తూర్ గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు వెండి కిరీటాలు దొంగిలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హనుమాన్ విగ్రహానికి ఉన్న వెండి ఆభరణాలు దొంగిలించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి జాగిలాలతో వచ్చిన పోలీసులు ఆలయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆలయంలో చోరీకి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటుందన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
‘పొనికి’కి ప్రాణం పోయండి
● వనాల పెంపకంతో భవిష్యత్తు ఆశలు మామడ: నిర్మల్ కొయ్యబొమ్మలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కొయ్యబొమ్మల తయారీకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. జిల్లాలోని అటవీ ప్రాంతా ల్లో పొనికి కర్ర ఎక్కువగా లభించడం, ప్రోత్సాహం ఎక్కువగా ఉండటంతో ఈ పరిశ్రమ విరాజిల్లింది. ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోపాటు పొనికి కర్ర లభ్యత తగ్గిపోవడంతో కొ య్యబొమ్మల పరిశ్రమ ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొయ్యబొమ్మల తయారీకి అవసరమైన పొనికి కర్రను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పొనికి వనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుతున్నారు. పొనికి వనాల పెంపకం.. కొయ్యబొమ్మల పరిశ్రమకు ప్రోత్సాహంగా డీఆర్డీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మామడ, సారంగపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో దాదాపు పది ఎకరాల్లో పొనికి వనాలు పెంచుతున్నారు. మామడ మండలంలోని లింగాపూర్ అటవీ ప్రాంతంలో 620 మొక్కలు రాయదారి అటవీ పరిధిలో 200 మొక్కలు, ముందరితండా అటవీ పరిధిలో 750 మొక్కలు నాటి పెంచుతున్నారు. సారంగపూర్ మండలంలోని మహబూబ్ఘాట్ అటవీ ప్రాంతంలో 2 వేల పొనికి మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీలకు నిర్వహణ బాధ్యత.. నాలుగు సంవత్సరాల క్రితం నాటిన పొనికి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ మొక్కల పెంపకానికి 4 లక్షల రూపాయలు వెచ్చించారు. ఈ ఏడాది నుంచి ఈ మొక్కల నిర్వహణ బాధ్యతను ఈజీఎస్ నుంచి గ్రామ పంచాయతీలకు అప్పగించారు. దీంతో వనాల నిర్వహణ గాడితప్పింది. వేసవి కాలంలో నీటి కొరత మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపింది. అధికారులు స్పందించి మొక్కలను కాపాడాలని కళాకారులు కోరుతున్నారు. కొయ్యబొమ్మల తయారీకి అవసరమైన పొనికి కర్ర సిద్ధం కావాలంటే 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమకు కొత్త జీవం వస్తుందని కళాకారులు ఆశిస్తున్నారు. మొక్కలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాలతో నాలుగేళ్ల క్రితం మండలంలోని రాయదారి, లింగాాపూర్, ముందరితండా అటవీ ప్రాంతంలో పొనికి మొక్కలు నాటించాం. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పది నుంచి పదిహేను సంవత్సరాలకు పొనికి కర్ర కొయ్యబొమ్మల తయారీలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – శివాజీ, ఈజీఎస్, ఏపీవో, మామడ -
గుప్తనిధుల కలకలం!
తాండూర్: తాండూర్ గ్రామ శివారులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. తాండూర్ పాత గెస్ట్హౌజ్ వెనకాల ఉన్న ఓ వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను మంగళవారం తెల్లవారుజామున పలువురు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గుంత తవ్విన ప్రాంతంలో అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ తవ్వకాలు గుప్త నిధుల కోసం చేశారా? లేక ఏదైనా క్షుద్ర పూజలు చేయించారా..? అనేది తెలియడం లేదు. తాండూర్, భీమిని రహదారికి కొద్ది దూరంలోనే ఈ తవ్వకాలు జరపడం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలిసిన స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. -
‘ఏడు’పిస్తున్న ప్రభుత్వం
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడిచినా, నిర్వహణకు చేసిన ఖర్చులకు పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఎన్నికల ఖర్చు సుమారు రూ.7.90 కోట్లు కాగా, ఇప్పటి వరకు 3.05 కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.80 లక్షలు ట్రెజరీలో ఉన్నాయి. ఇంకా రూ.4.05 కోట్ల వరకు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కార్యదర్శులకే సంబంధించినవి. బదిలీల నేపథ్యంలో ఆందోళన.. ఇటీవల పంచాయతీ కార్యదర్శుల బదిలీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం వెచ్చించిన డబ్బులు వస్తాయా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ జీతం నుంచి, మరికొందరు అప్పు తెచ్చి ఖర్చులు చేశారు. ఏడు నెలల నుంచి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీ అయిన వారు ఈ బకాయిలు ఎలా పొందాలని ఆందోళన చెందుతున్నారు. మూడు దశల్లో ఎన్నికలు.. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో 400 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పెద్ద గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉన్న చోట సుమారు 50 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. వారికి ముందు రోజు బ స, భోజనం, ఎన్నికల రోజు అల్పాహారం, మ ధ్యాహ్న భోజనం, టీలను కార్యదర్శులు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు, కుర్చీలు, టేబుల్స్ సమకూర్చారు. దీనికి ఒక్కో పంచాయతీకి సుమారు రూ.25 వేల వరకు ఖర్చయ్యాయి. కానీ ఆ కార్యదర్శికి ఇప్పటి వరకు మండల అభివృద్ధి అధికారి నుంచి రూ.10 వేలు మాత్రమే అందాయి. చిన్న పంచా యతీలకు రూ.18 వేలు ఖర్చయితే కేవలం రూ.8 వేలు చెల్లించారు. మిగిలిన నిధులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో వీడియో గ్రాఫర్లకు కూడా డబ్బులు చెల్లించలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. వివరాలు: మొత్తం ఖర్చు(ప్రతిపాదన) రూ.7.90 కోట్లు తొలి విడత రిలీజ్ నిధులు రూ.3.85 కోట్లు ఖాతాలో జమైన నిధులు రూ.3.05 కోట్లు ట్రెజరీలో పెండింగ్లో ఉన్న నగదు రూ.80 లక్షలు రెండోవిడత రావాల్సిన నిధులు రూ.4.05 కోట్లు -
బొక్కలగుట్ట హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందమర్రి సీఐ పర్స రమేశ్, పట్టణ ఎస్సై శ్రీధర్లు వివరాలు వెల్లడించారు. బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి వెంకటేశ్(40) హత్యకు సంబంధించి అతని భార్య గజ్జి మమత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తన వివాహంలో వెంకటేశ్ కీలకంగా వ్యవహరించాడనే భావనతో అతనిపై నిందితుడు ఒడ్డేపల్లి రాజ్కుమార్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల మొబైల్ ధ్వంసమైన విషయంలో మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. జూన్ 28న రాత్రి గ్రామంలోని చిప్పరి శ్రీనివాస్ ఇంటి సమీపంలో వెంకటేశ్తో మరోసారి గొడవపడిన రాజ్కుమార్ అక్కడే ఉన్న సిమెంటు రాయితో అతని తలపై బలంగా బాది దాడిచేశాడు. స్థానికులు గమనించి వెంకటేశ్ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడని సీఐ వివరించారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఈ మేరకు నిందితుడిని కుర్మపల్లి ఫ్లైఓవర్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
అమ్మవారి చెంత వజ్రంశు
భైంసా: నేటి తరం పిల్లల చేతులు స్మార్ట్ఫోన్ స్క్రీన్లకే అతుక్కుపోతుంటే 14 ఏళ్ల బాలుడి వేళ్లు మాత్రం వీణతంత్రులతో దివ్య స్వరాలు పలికిస్తున్నాయి. ఆధునిక సంగీత హోరులోనూ ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని గుండెలకు హత్తుకొని, చారిత్రాత్మక బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అతి పిన్న వయస్కుడైన ‘ఆస్థాన వైణికుడు’గా నిలిచాడు బొల్లి వజ్రాంశు. అరుదైన భాగ్యం.. సకల కళలకు ఆదిదేవత బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఒక్క రోజైనా ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తే చాలని దేశంలోని ఎందరో దిగ్గజ కళాకారులు కోరుకుంటారు. అటువంటి పవిత్ర క్షేత్రంలో ఇప్పటివరకు ఆలయ చరిత్రలో మరే ఇతర పెద్ద విధ్వాంసుడికి కూడా దక్కని మహాభాగ్యం వజ్రాంశుకు దక్కింది. కేవలం ఒక్కరోజు వేదికను పంచుకోవడమే పరమావధిగా భావించే కళాలోకంలో.. ప్రతీ శుక్రవారం అమ్మవారి అత్యంత పవిత్రమైన దేవీ చతుష్షష్టి ఉపచార పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన నాద అర్చన చేసే అరుదైన అవకాశాన్ని ఆలయ యంత్రాంగం బాలుడికి కల్పించింది. దైవానుగ్రహం.. వజ్రాంశు కుటుంబంలో ఎవరికీ సంగీత నేపథ్యం లేదు. తండ్రి డాక్టర్ బి. బాలకృష్ణ బాసర ఆర్జీయూకేటీలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టడంతో వీరి కుటుంబం హైదరాబాద్ నుంచి బాసరకు మారింది. తల్లి కస్తూరి వజ్రాంశులోని ప్రతిభను గుర్తించగా.. ప్రముఖ వీణా విధ్వాంసులు మల్లెల వెంకటరమణ గోవింద మూర్తి వజ్రంలా తీర్చిదిద్దారు. విజయాల ప్రయాణం -
‘గిరి’ గూడేల్లో అకాడి సంబురం
కెరమెరి: గిరి గూడేల్లో అకాడి సంబురాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు తమ గూడేల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ తర్వాతనే ఆదివాసీలు ఇతర పండుగలు జరుపుకుంటారు. గూడెల్లో ప్రారంభమైన అకాడి పండుగ గురుపౌర్ణిమ నాటికి ముగుస్తుంది. అనాధిగా వస్తున్న ఆచారాలను ఆదివాసీలు నేటికీ పాటిస్తున్నారు. చినుకు రాలినా.. దుక్కి దున్నినా, విత్తనాలు వేసినా.. వానలు కురవక పోయినా.. పంటలు చేతికొ చ్చినా.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఆషాఢ మాసంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమయ్యే అకాడి పండుగను 15 రోజులు నిర్వహిస్తారు. ప్రథమ పండుగ అకాడి ఆషాఢ మాసంతో ప్రారంభమయ్యే పండుగల్లో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. వేడుకల్లో భాగంగా గ్రామం నుంచి పులిమేరలో ఉండే బాబ్రి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుకింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ధి చేసిన అనంతరం పుసుపుతో గీతలు గీశారు. అనంతరం పాడిపశువులకు రక్షణ కల్పించే దేవతగా కొలిచే రాజుల్ పేన్కు ప్రత్యేక పూజలు చేశారు. వనంలోనే భోజనం తయారు చేసి నైవేద్యం సమర్పించారు. అక్కడే వనభోజనాలు చేశారు. తర్వాత లక్ష్మణ రేఖ గీతను గీసి గీతపై నుంచి పశువులను అడవుల్లోకి తరలించారు. అడవుల్లోని చెట్ల ఆకులను దేవునిగా భావించి అకాడి పేన్ పూజ చేశాక ఆకులను ఇంటికి తీసుకెళ్లారు. తుర్ర వాయించాల్సిందే.. ఆదివాసీలు ఆచార వ్యవహారాల్లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఒక్కో కోడిని కొనుగోలు చేసి దేవతకు బలిచ్చారు. కోడి తమ జాతకం చెబుతుందని నమ్ముతారు. అలాగే అడవిలోకి వెళ్లిన పశువులు తిరిగి ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలనేది వారి ఆచారం. పశువులు ఎక్కడికి వెళ్లినా ఈ తుర్ర వా యిస్తే పశువులు తిరిగి వస్తాయని వారి నమ్మకం. ఏత్మాసార్ పేన్కు పూజలు అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్కు పూజలు చేశారు. ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు ఆరగించిన తర్వాత ఈ పూజలు ప్రారంభమయ్యాయి. ఏత్మాసార్ పేన్ పూజ నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అడవుల్లో వనభోజనాలు అకాడి పూజలు చేసిన తర్వాత ఏత్మాసార్ పేన్కు పూజలు చేస్తాం. అనంతరం నాలుగు నెలల పాటు పూజలు చేయాల్సి ఉంటుంది. గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఈ పండుగలో భాగంగా మొక్కుంటారు. అడవుల్లో వనభోజనాలు చేస్తాం. – ఆత్రం లక్ష్మణ్ రావు, సర్పంచ్, మోడి రాజుల్ దేవతకు పూజలు అకాడి పండుగ అనాధి నుంచి వస్తున్న ఆచారం. ఈ పండుగ జరుపుకున్నాకే మిగితా పండుగలు చేసుకుంటాం. రాజుల్ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తాం. – పెందోర్ దంబిరావు, కటోడా, సాకడ -
ఆటో ఢీకొని ఒకరికి గాయాలు
ఖానాపూర్: మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కడెం మండలం మద్దిపాడగ గ్రామానికి చెందిన ఆకుల అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. -
బాధ్యతాయుత సేవలకు గుర్తింపు
నిర్మల్టౌన్: బాధ్యతాయుత సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వారు పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీస్ శాఖ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకా లంలో అందేలా చూస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున వారికి వారి కుటుం్చదిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స బ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. ఆస్పత్రి ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆ రా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు, ఆస్పత్రిలో వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుధ్య మెరుగుపర్చాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
సాత్నాల: నేటి కాలంలో కొందరు చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే భోరజ్ మండలం లేఖర్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. మర్రి చెట్టు వద్ద పెట్టిన తన హారతి పళ్లెం ఎవరో పక్కన పెట్టారని మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పవర్ గౌతమ్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏఎన్ఎంగా పని చేసే రుక్మ జ్యోతి(35) సోమవారం వటసావిత్రి వ్రతం ఉందని పూజ చేసేందుకు హారతి పళ్లెంతో మర్రిచెట్టు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఎవరో తన హారతి పళ్లెం పక్కన పెట్టారని వారిని పిలిచి మందలించాలని ఇంటికి వచ్చాక భర్తతో గొడవ పడింది. భర్త రాములు ఎంత సర్ది చెప్పినా ఆమె వినలేదు. సాయంత్రం మళ్లీ అదే విషయంపై భర్తతో గొడవ పడింది. దీంతో గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక రాములు జ్యోతిని తన బంధువుల ఇంట్లో వదిలేసి వచ్చాడు. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన జ్యోతి ఇంటిపైన ఉన్న రూమ్లో పడుకుంది. మంగళవారం ఉదయం భర్త వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ వెల్లడించారు. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. -
సామూహిక వీణానాదం
బాసర: జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో 80 మంది వీణా వాయిద్యకారులు మంగళవారం సామూహిక వీణానాదం ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీణా వాయిద్యకారులు ఒకే వేదికపై వీణానాదాలతో అమ్మవారికి సంగీత సేవ సమర్పించారు. ప్రశాంతి, ఉమాదేవి మార్గదర్శకత్వంలో నిర్వహించిన కార్యక్రమాన్ని నాగలక్ష్మి సమన్వయం చేశారు. వీణా నాదానికి నరసింహ వర్మ త బల, గంగాధర్ గౌడ్ కీబోర్డ్ సంగీత సహకారం అందించారు. శ్రీమతి ధనలక్ష్మి, శ్రీమతి అరుంధతి గానం చేసి కార్యక్రమానికి మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి పాల్గొన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కూల్చివేతతానూరు: మండలంలోని వడ్ఝరి(భి) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారుల సమక్షంలో మంగళవారం భవనాన్ని జేసీబీతో కూల్చివేశారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. దీంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారుల అనుమతితో ఎంఈవో నరేందర్ సమక్షంలో కూల్చివేశారు. జేసీబీతో భవనం కూల్చివేస్తున్న అధికారులు -
రెవెన్యూ శాఖ నుంచి ‘ఔట్’!
బాసర: రెవెన్యూ శాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టైపిస్టులుగా పనిచేస్తూ శాఖ పనితీరుకు వెన్నెముకగా నిలిచినవారు ఉద్యోగ భద్రత లేక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భూముల రికార్డుల నిర్వహణ, ధరణి సేవలు, ఎన్నికల విధులు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవల వరకు అనేక ముఖ్యమైన బాధ్యతలను వారు సమర్థంగా నిర్వర్తించారు. తాజాగా వీరిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమని, రెండు దశాబ్దాల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 62 మంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 62, నిర్మల్ జిల్లాలో 21 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అందరినీ విధుల నుంచి తొలగించినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మండలానికి ఒక ఆపరేటర్తోనే పనులు నిర్వహిస్తున్నారని, దీంతో సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. పెండింగ్లో 12 నెలల వేతనాలు... ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదిగా వేతనాలు రావడం లేదు. కుటుంబాల గడవడం ఇబ్బందిగా మారింది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. జీతాలు లేక అప్పుల పాలవుతున్నామని, కుటుంబాలను పోషించడం భారంగా మారిందని వారు వాపోతున్నారు. 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖ కోసం అంకితభావంతో పనిచేశామని, ప్రతీ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించామని, ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలను గుర్తించి విధుల్లో కొనసాగించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రజాసంఘాల మద్దతు.. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మానవతా దృక్పథంతో స్పందించి వేలాది కుటుంబాలకు రోడ్డున పడకుండా చూడాలని వేడుకుంటున్నారు. బాసర తహసీల్దార్ కార్యాలయం -
‘ఇందిరమ్మ’ ఇంట తీవ్ర విషాదం
బెల్లంపల్లి: బెల్లంపల్లి టేకులబస్తీలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బెల్లంపల్లి వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులబస్తీలో నివాసం ఉంటున్న మల్లెంపల్లి శంకర్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేయడానికి శంకర్ సిద్ధపడి అతని చెల్లెలు మల్లేశ్వరి, బావ కుమ్మరి రాము(43)ను ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. సోమవారం ఇందిరమ్మ ఇంటికి స్లాబ్ వేశారు. అనంతరం ఇంటిళ్లిపాది బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేశారు. చీకటి పడ్డాక రాము ఇంటి శ్లాబ్ ఎక్కి కింద పడిపోయాడు. అర్ధరాత్రి గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఎస్హెచ్వో సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎడ్లబండి పైనుంచి పడిన రైతు మృతి చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం రవీందర్రెడ్డి(57) అనే రైతు ఎడ్లబండి పైనుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీందర్రెడ్డి జూన్ 16వ తేదీన వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం ఎడ్లబండిపై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో అతనికి మెడ విరిగి పోగా నడుము కూడా దెబ్బతింది. వెంటనే మంచిర్యాలకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కూడా నయం కాకపోగా వైద్యులు సూచనల మేరకు ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో మంగళవారం ఇంటి వద్ద రవీందర్రెడ్డి మృతి చెందాడు. అతనికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమార్తె బొమ్మ మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. విద్యుత్ షాక్తో షోరూం కార్మికుడు..ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గల టీవీఎస్ షోరూంలో కార్మికుడిగా పని చేస్తున్న కుంట రమణ గౌడ్ (38) మంగళవారం విద్యుత్షాక్తో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. టీవీఎస్ షోరూంకు వాహనాల లోడ్తో వచ్చిన లారీకి రమణ గౌడ్ సైడ్ చూపిస్తుండగా, లారీకి విద్యుత్ వైర్లు తగిలాయి. ఈక్రమంలో లారీని పట్టుకున్న రమణకు విద్యుత్షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్లో వలస కార్మికుడు..నిర్మల్ఖిల్లా: జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన వలస కార్మికుడు శివరాత్రి నర్సింహులు(44) దుబాయ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులు కుటుంబ పోషణ, ముగ్గురు పిల్లల చదువుల భారం కారణంగా గత ఏడాది దుబాయ్కు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఇటీవల పనిలో ఉండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అనారోగ్యం తీవ్రరూపం దాల్చడంతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆయన పనిచేస్తున్న సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం మృతుడి భార్య లక్ష్మికి ఫోన్ ద్వారా తెలియజేశారు. సారంగపూర్ గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్ఆర్ఐ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను జిల్లాకేంద్రంలో కలిసి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. ఆయన దుబాయ్లోని సామాజిక కార్యకర్త గుండెల్లి నర్సింహతో ఫోన్లో మాట్లాడి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. స్వదేశ్ను కలిసిన వారిలో సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సామల వీరయ్య, శివరాత్రి గురుస్వామి, దండుగుల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ రైతు..నర్సాపూర్(జి): మద్యం మత్తులో పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన అరుల్ల నాగరాజు (52) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆదివారం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అప్పులు ఉన్నాయని కొత్తగా ట్రాక్టర్ ఎందుకు కొనుగోలు చేశావని భార్య సత్యమ్మ మందలించింది. అదేరోజు రాత్రి బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లాడు. క్షణికావేశంలో తాగిన మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. సోమవారం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మంగళవారం భార్య సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. -
నిర్మల్
అమ్మవారి చెంత ‘వజ్రం’శు నేటి తరం పిల్లల చేతులు స్మార్ట్ఫోన్ స్క్రీన్లకే అతుక్కుపోతుంటే 14 ఏళ్ల బాలుడి వేళ్లు మాత్రం వీణతంత్రులతో దివ్య స్వరాలు పలికిస్తున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ‘ఆస్థాన వైణికుడు’గా నిలిచాడు బొల్లి వజ్రాంశు.పట్టెడు అన్నం పెట్టించండి సారూ.. లోకేశ్వరం: ‘సార్ మాది వట్టోలి గ్రామం. నాకు ఇద్దరు కొడుకులు.. రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి గెంటేసిండ్రు. అన్నం పెడ్తలేరు’ అని ఓ వృద్ధ మహిళ కలెక్టర్కు తన గోడు వెల్లబోసుకుంది. వట్టోలి గ్రామానికి చెందిన జంగం గంగవ్వ మంగళవారం మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ భవేశ్మిశ్రాను కలిసింది. తన ఇద్దరు కుమారులపై ఫిర్యాదు చేసింది. తనకు ఉన్న ఎకరం నర భూమిని ఇద్దరు కొడుకులు శంకరప్ప, శేషప్ప, కూతురు రేఖ అర ఎకరం చొప్పున పంట్టా చేయించానని తెలిపింది. భూమి తీసుకున్న కొడుకులు తనను ఇంట్లో నుంచి గెంటేశారని, అన్నం కూడా పెట్టడం లేదని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన కలెక్టర్ గంగవ్వకు న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. నిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రీ–ప్రైమరీ పాఠశాలలకు జిల్లాలో మంచి ఆదరణ లభిస్తోంది. గత విద్యా సంవత్సరంలో ప్రారంభమైన 14 చిన్న బడులతోపాటు, ఈ ఏడాది మరో 74 బడులు ఏర్పాటు చేశారు. మొత్తం 88 ప్రభుత్వ ప్రీ–ప్రైమరీ బడులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం, ఈ 88 చిన్న బడుల్లో ఇప్పటి వరకు 856 మంది చిన్నారులు చేరారు. కొత్తగా మంజూరైన 74 బడుల్లో 727 మంది, గతేడాది ప్రారంభించిన 13 ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో 108 మంది, ఒక పీఎంశ్రీ పాఠశాల ప్రీ–ప్రైమరీలో 21 మంది చిన్నారులు ప్రవేశాలు పొందారు. ప్రాథమిక విద్యకు బలమైన పునాది.. మూడు నుంచి ఐదేళ్లలోపు వయసు ఉన్న చిన్నారులకు ఆటలు, పాటలు, కథలు, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఈ తరగతులు కల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలు తర్వాత కూడా అదే పాఠశాలలో ప్రాథమిక విద్యను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు. అవగాహన, పర్యవేక్షణ.. అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత విద్య, పుస్తకాలు, యూని ఫాం, మధ్యాహ్న భోజనం వంటి ప్రభుత్వ సౌకర్యాలను వివరించి ప్రవేశాలకు ప్రోత్సహిస్తున్నారు. మండల, జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకంగా ప ర్యవేక్షణ చేపట్టి అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చే స్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆ యాను నియమించి విధుల్లోకి తీసుకున్నారు. చిన్నా రుల వయసు, నేర్చుకునే సామర్థ్యానికి అనుగుణంగా ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రవేశాలు పెరిగే అవకాశం.. ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతమంది చిన్నారులు ప్రభుత్వ చిన్న బడుల్లో చేరే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే 856 మంది చేరడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతున్నట్లు సూచిస్తోంది. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ నష్టం
దస్తురాబాద్: మండలంలోని గోడీసీర్యాల గ్రామంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో భారీ నష్టం సంభవించింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి లోటెన్షన్ లైన్లపై పడటంతో గ్రామంలోని 46 ఇళ్లలో విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని విద్యుత్ మీటర్లతో పాటు టీవీలు, ఫ్రిజ్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. గ్రామంలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉండడం, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపించారు. కేజీబీవీలో నో అడ్మిషన్స్కుంటాల: మండలంలోని కల్లూరు కేజీబీవీలో అడ్మిషన్లు నిండటంతో సిబ్బంది పాఠశాల గేటుకు నో అడ్మిషన్స్ బోర్డు తగిలించారు. పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు గానూ 240 మంది ఉన్నారని.. ఈసారి ప్రారంభించిన జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గ్రూపులో 20 మంది విద్యార్థినులు చేరినట్లు ఎస్ఓ సువర్ణ తెలిపారు. -
అభ్యాసన సామర్థ్యాలు పెంచాలి
లోకేశ్వరం: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెరిగేలా విద్యాబోధన చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని కేజీబీవీ, రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్, లోకేశ్వరం పీహెచ్సీ, కిష్టాపూర్ గ్రామంలోని సుధాకర్రెడ్డి అనే రైతు సాగు చేసిన ఆయిల్పామ్ తోటను మంగళవారం పరిశీలించారు. ముందుగా కేజీబీవీలో తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. గణిత ఉపాధ్యాయుడిగా.. తర్వాత పదో తరగతిలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసాన్ని వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, ఉత్తమ మార్కులు సాధించేలా చదవాలని సూచించారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, వసతి గృహాలు, పారిశుధ్యం, తాగునీటి వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి.. ఇక రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరని, ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి వారితో వ్యక్తిగతంగా సంప్రదించి రిజిస్ట్రీ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొవాలన్నారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రతీరైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు మండలంలో డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మక్కలు విక్రయించి నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని తెలిపారు. వారం రోజుల్లో మక్కల డబ్బులను అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పీహెచ్సీ తనిఖీ.. అనంతరం పీహెచ్సీని తనిఖీ చేశారు. ఓపీ వివరాలు, మందుల లభ్యత, మౌలిక వసతులపై ఆరాతీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత కిష్టాపూర్లో సుధాకర్రెడ్డి ఆయిల్పామ్ తోటను పరిశీలించారు. దిగుబడి, మార్కెట్ అవకాశాలపై చర్చించారు. అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్పామ్ వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీఎంహెచ్వో రాజేందర్, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, లోకేశ్వరం తహసీల్దార్ సూర్యరావ్, ఎంఈవో చంద్రకాంత్, ఏంపీవో సోలమాన్రాజ్, ఏవో గిరిరాజ్, స్థానిక సర్పంచ్ కపిల్, ఆత్మ చెర్మన్ గన్ను నర్సారెడ్డి, పీఏసీఏస్ చెర్మన్ రత్నకర్రావు పాల్గొన్నారు. -
భరోసా రెండెకరాలు దాటేనా?
నిర్మల్చైన్గేట్: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టు బడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. యాసంగి సీజన్లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ని రైతులకు ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థికసాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎ క్కువ భూమి ఉన్న వారు నిరాశకు లోనయ్యారు. 2018లో పథకం ప్రారంభం..రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్లో పెట్టుబడి సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. 2025లో వానాకాలం సీజన్లో 1,88,597 మంది రైతులకు రూ.268.85.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.రూ.7,500 సాయం ఎప్పుడో..రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆందిస్తోంది. రూ.7,500 హామీ మాత్రం అమలు కావడం లేదు. వడ్డీ వ్యాపారులే దిక్కు!గతంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం..రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. – అంజిప్రసాద్, డీఏవో రెండెకరాలకు మాత్రమే..2025–26 యాసంగి సీజన్లో జిల్లాలో 1.88 లక్షల మంది రైతులకు రూ.168 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది. -
250 మందికి ఒకటే బాత్రూమ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఇలా క్యూ కడుతున్నారు. బాలురు కాంపౌండ్ వాల్ దాటి ఆరుబయటకు వెళ్తున్నారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
కొలువు పొందెవరకూ..
‘ఆశిం’చి.. ‘అన్వేషి’ం’చి.. సాధించారు ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన భావునే గంగాధర్–కవిత దంపతుల కుమారులు ఆశిశ్, అన్వేశ్ పోటాపోటీగా చదివి కన్నవారి కలలను నిజం చేశారు. అన్న అన్వేశ్ ఇటీవల విడుదలైన అగ్ని వీర్ జీడీకి ఎంపికయ్యాడు. నేవీ ఫలితాల్లో మెడికల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టి తమ్ముడు ఆశిశ్ సత్తా చాటాడు. రోజంతా పొలం పనుల్లో శ్రమించే అమ్మానాన్నలను స్ఫూర్తిగా తీసుకుని సరిహద్దులో సేవ చేసేందుకు నిరంతరం శ్రమించారు. ప్రణాళికతో పట్టు వదలకుండా సాధన చేస్తే ఏదైనా సాధ్యమని నిరూపించారు. పట్టువదలని ‘వర్ధన్’ ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన నక్కల అడెళ్లు–భీమక్క దంపతుల కుమారుడు వర్ధన్ పట్టు వదలకుండా ప్రయత్నించి ఆర్మీ కొలువు కొట్టాడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వర్ధన్ తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలనుకున్నాడు. డిగ్రీ చదువుతూనే లక్ష్య సాధనకు శ్రమించాడు. కఠినమైన శిక్షణతో రెండో ప్రయత్నంలో అగ్నివీర్ ఉద్యోగాన్ని సాధించి కల సాకారం చేసుకున్నాడు. కష్టపడితే విజయం కచ్చితంగా వరిస్తుందని నిరూపించాడు. వర్ధన్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం. – వర్ధన్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకున్నారు. సరిహద్దులో సైనికులుగా మారి దేశానికి సేవలందించాలని భావించారు. మనస్సు నిండా దేశభక్తిని నింపుకొన్నారు. పట్టుదలతో నిత్యం సాధన చేశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సైనిక ఉద్యోగాలకు ఎంపికై లక్ష్యాన్ని చేరుకున్నారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చారు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. -
వేపచెట్టులో.. అమ్మవారి రూపం
ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ మారెమ్మ తల్లి దేవాలయంలోని వేపచెట్టు కాండంను కళాకారుడు అశోక్ అమ్మవారి రూపం వచ్చేలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. సోమవారం మారెమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేపచెట్టులో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడింది. కళాకారుని నైపుణ్యాన్ని చూసి భక్తులు ప్రశంసల జల్లు కురిపించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
డబ్బుల కోసం యువకుడి హత్య
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం నమోదైన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం వివరాలను వెల్లడించారు. బైంసా పట్టణానికి చెందిన షేక్సోహెబ్(19) గతంలో స్నేహితుడైన సారంగాపూర్ మండలానికి చెందిన అనగందుల సాగర్ వద్ద రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య డబ్బులు, చేతి గడియారం విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సాగర్ మరో స్నేహితుడైన గుండెన విజయ్తో కలిసి ఆదివారం స్థానిక బంగల్పేట్ కుంట వద్ద సోహెబ్ను కలిశారు. డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సోహెబ్పై కర్ర, బీరు సీసాతో దాడి చేశారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడవేశారు. మృతుడి తల్లి సాకేర బేగం ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, భౌతిక సాక్షాలు, విచారణలో లభించిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కర్ర, బీరు సీసా, మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
తొలి ప్రయత్నంలోనే మెరిసిన ‘రవితేజం’
ఆదిలాబాద్: బోథ్ మండలం కౌఠ(బి) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల చిన్న కుమారుడు రవితేజ తొలి ప్రయత్నంలోనే ఐఏఎఫ్లో ఉద్యోగం సాధించాడు. తండ్రి స్వామి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా, తల్లి స్వప్న వ్యవసాయ కూలీగా పని చేస్తోంది. తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలని భావించిన అతను ఇష్టమైన భారత సైనిక దళంలో చేరాలని నిత్యం శ్రమించాడు. ఇటీవల విడుదలైన ఐఏఎఫ్ అగ్నివీర్ ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే కొలువు సాధించాడు. తన తల్లిదండ్రుల శ్రమ, అన్నయ్య నింపిన స్ఫూర్తి తనను సరిహద్దుల వైపు నడిపించాయని రవితేజ చెబుతున్నాడు. – గుండెన రవితేజ గురువు ప్రోత్సాహంతో కొలువు ఆదిలాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జామిని గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం–రెహనా దంపతుల కుమారుడు ఇర్ఫాన్ అగ్నివీర్ జీడీగా ఎంపికయ్యాడు. సైనికుడిగా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో శిక్షణ సంస్థలో చేరి గురువు వీజీఎస్ రాకేశ్ వద్ద శిక్షణ పొందాడు. గురువు నిరంతరం ప్రోత్సహించేవారని, ఆయన పర్యవేక్షణలోనే మరింత ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి ఉద్యోగం సాధించినట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువు మార్గదర్శకత్వలో తాను సైనికుడిగా ఎంపికై నట్లు తెలిపాడు. – ఎస్కే ఇర్ఫాన్ -
3న ఆర్జీయూకేటీలో నాలుగో విడత కౌన్సెలింగ్
బాసర:ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ క్యాంపస్లలో యూజీ ప్రవేశాలకు నాలుగో విడత 69 సీట్ల భర్తీకి జూలై 3న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కౌన్సెలింగ్ జూలై 2న, ఎన్సీసీ కేటగిరీ కౌన్సెలింగ్ జూలై 4న ఉంటుందని వివరించారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీల్లో హాజరు కావాలని సూచించారు. బాసరలో 928 అక్షరాభ్యాసాలుబాసర:జూలై 5 నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు బాలాలయంలో దర్శనమివ్వనున్న నేపథ్యంలో వారం రోజలుగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. జేష్ట పౌర్ణమి సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 928 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. హుండీ, సేవల ద్వారా రూ.9,62,050 ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. బాలికను మోసగించిన యువకుడి అరెస్టుభీమారం: బాలికను మోసగించిన కేసులో మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన సిధార్థను అరెస్టు చేసినట్లు జైపూర్ సీఐ నవీన్ తెలిపారు. గత రెండేళ్లుగా బాలికను ప్రేమించి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం చెన్నూర్ కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. -
మేసీ్త్ర కొడుకు.. సైనికుడయ్యాడు
నార్నూర్: మండల కేంద్రానికి చెందిన చౌహాన్ తిమ్మన్న–నీలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. తిమ్మన్న మేసీ్త్ర పని చేసి ఇద్దరు కుమారులను చదివించాడు. చిన్న కుమారుడు కుశాల్ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం కొనసాగించాడు. అగ్నివీర్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టం, వారి ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలోనే తాను ఉద్యోగం సాధించానని కుశాల్ తెలిపాడు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్ష్మణచాంద:మండల కేంద్రానికి చెంది నీరటి నర్సయ్య సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తన భార్య దివ్యతో కలిసి లక్ష్మణచాంద నుంచి నిర్మల్కు ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో మండలంలోని కనకాపూర్ రహదారిపై పెద్దపల్లి జిల్లా నుంచి కనకాపూర్కు ఏషియన్ పెయింట్స్ మెటీరియల్ తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్ ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో నర్సయ్య బైక్ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్యకు కుడి కాలు విరుగగా, దివ్యకు స్వల్వ గాయాలయ్యాయి. వీరిని 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దివ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. -
ఆహ్లాదం.. కావొద్దు విషాదం
చెన్నూర్: చెన్నూర్ ఆగస్త్య గుండం ఆధ్యాత్మిక, ప ర్యాటక కేంద్రానికి సందర్శకుల తాకిడి పెరిగింది. రోజు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వా రి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి సందర్శించి శివలింగంను అభివృద్ధి చేసి ట్యాంక్బండ్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ చ్చే గోదావరి పుష్కారాల్లో సందర్శకుల సంఖ్య మ రింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద చెరువు మధ్యలో ఉన్న ఆగస్త్యగుండం, శివలింగం దర్శనానికి వచ్చే భక్తులు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో సేదదీరుతున్నారు. ఆగస్త్యగుండం అందాల ఫొ టోలు తీస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. గుండం చు ట్టూ పూర్తిగా ప్రహరీ లేకపోవడంతో ప్రమాదం పొ ంచి ఉంది. పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మించి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
గుడిని కాపాడలేని వారు దేశాన్నెలా కాపాడుతారు..!
పాతమంచిర్యాల: అయోధ్యలోని శ్రీరాముడి గుడికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇచ్చిన విరాళాలు దొంగతనం జరిగితే కాపాడలేని బీజేపీ ప్రభుత్వం దేశాన్నెలా కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. చిత్తం శ్రీరామునిపై భక్తి అదానీ, అంబానీలపై అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం మారిందని ధ్వజమెత్తారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. శ్రీరాముని గుడికి రక్షణ ఇవ్వలేని అసమర్థులు బీజేపీ నాయకులని విమర్శించారు. దేశంలోని సహజ సంపదలు అదానీ, అంబానీలకు అప్పగించడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ఫీజు రీయింబర్స్మెంటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముడుపు ప్రభాకర్రెడ్డి, తాండ్ర సదానందం, మేకల దాసు, బొల్లం పూర్ణిమ, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, కే.వీరభద్రయ్య, ముడుపు నళినిరెడ్డి, లింగం రవి, తదితరులు పాల్గొన్నారు. -
సినిమాలు చూసి.. స్ఫూర్తి పొంది..
ఆదిలాబాద్: సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఉద్యోగం సాధించాడు ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన ఈర్నాల సాయి–కళ దంపతుల కుమారుడు నవదీప్. నవదీప్. మేజర్, షేర్షా సినిమాలను చూసి స్ఫూర్తి పొందాడు. సైనికుల తెగువ, వారి ధైర్యం, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని నిత్యం శ్రమించాడు. ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల నేవీలో ఎంఆర్ ఎస్ఎస్ఆర్ పోస్టులతో ప్రతిభ కనబరిచాడు. సినిమాలు చూసి పెడదారి పట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచాడు. -
● జూలై 1 నుంచి ఎస్సారెస్పీలోకి గోదావరి నీరు ● 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు
రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేతభైంసా: రాష్ట్ర వ్యాప్తంగా ఈయేడు ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లో నీరు అంతగా లేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, గతేడాది జూన్ 30 నాటికి 15.567 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కూడా 15 టీఎంసీల నీరు ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈసారి కూడా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. దిగువన ఎస్సారెస్పీలోకి నీళ్లు విడుదల కానున్నాయి. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద 2.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గేట్లు ఏటేటా జూలై 1న ఎత్తి నీటిని వదలాలని సుప్రీంకోర్టు సూచించింది. త్రిసభ్య కమిటీ.. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాజెక్టుపై కోర్టులకు వెళ్లాయి. అప్పట్లో సుప్రీంకోర్టు ఏటా జూలై 1నుంచి అక్టోబర్ 28 వరకు 14గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశించింది. వర్షాకాలంలో నది నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూడాలని సూచించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ గేట్లు ఎత్తనున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లు తెరుస్తారు. ఇక బాబ్లీనీరు.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే నీరు ఎస్సారెస్పీలోకి చేరనుంది. గేట్లు ఎత్తి ఉంచడం వల్ల ఎగువన కురిసే వర్షాలకు వరద ఎస్సారెస్సీలోకి వస్తుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున ఎస్సారెస్పీ నుంచి నీటిని వదులుతున్నారు. సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంది. గేట్లు ఎత్తగానే బాబ్లీ ప్రా జెక్టు నీరు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తికి చేరుతాయి. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 18 కిలోమీటర్ల దూ రంలో ఉన్న బాసరకు ఈ నీరు చేరుతుంది. బాసర వద్ద గోదావరి నదిగుండా ఎస్సారెస్పీలోకి వెళ్తుంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి వరకు నీరు చేరాలంటే కొంతసమయం పడుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు... ప్రాజెక్టు గేట్లు ఎత్తే విషయమై నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు కురిస్తే సహజ నీటి ప్రవాహం ఎప్పటిలాగే ఎస్సారెస్పీలోకి చేరనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో అటు నిజామాబాద్ ఇటునిర్మల్ జిల్లాల్లో తాగు, సాగునీటి పథకాలు ఉన్నాయి. నీరు విడుదలైతే రెండు జిల్లాలఎత్తిపోతలపథకాలకు నీరు అందనుంది. బాబ్లీ ప్రాజెక్టు(ఫైల్) -
యూరియా బుకింగ్కు అంతరాయం
ఖానాపూర్: ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా బుకింగ్ కోసం రైతులు విని యోగిస్తున్న ఫర్టిలైజర్ యాప్ సోమవారం సాంకేతిక సమస్యల కారణంగా సరిగా పనిచేయలేదు. దీంతో యూరియా బుకింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. యాప్లో లాగిన్ సమస్యలతోపాటు బుకింగ్ పూర్తి కాకపోవడంతో పలువురు రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి యూరియా బుకింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఖానాపూర్ మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్ స్పందిస్తూ, ఫర్టిలైజర్ యాప్కు కొత్త వెర్షన్ (1.0.11) అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రైతులు తమ మొబైల్లో ఉన్న పాత వెర్షన్ను తొలగించి, తాజా వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. -
ఎల్కేజీకే రూ.3,195..
నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎల్కేజీ, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. పుస్తకాలు పాఠశాలలోనే కొనాలని చెప్పారు. ఎల్కేజీకే రూ.3,195 పుస్తకాలు, రూ.500 నోట్బుక్స్కు తీసుకున్నారు. నాలుగో తరగతికి పుస్తకాలకు రూ.4,325, నోట్బుక్స్కు రూ.500 తీసుకున్నారు. వద్దని చెప్పినా బలవంతంగా అంటగడుతున్నారు. – శ్రీకాంత్, భైంసా పుస్తకాల పేరిట దోపిడీ.. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల పేరిట ఇష్టారీతిన దోచుకుంటున్నారు. మార్కెట్లో దొరికే పుస్తకాల కంటే మూడురెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాన్ని విద్యాశాఖ అధికారులు అడ్డుకోవాలి. ఐఐటీ ఒలింపియాడ్ అంటూ పుస్తకాలు అంటగడుతున్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థికంగా భారం మోపుతున్నారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలి. – తోట రాము, భైంసా -
జిల్లా కేంద్రంలో సోమవారం వట పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక కళానగర్ హనుమాన్ ఆలయం ఆవరణలోని మర్రిచెట్టును మహిళలు పసుపు, కుంకుమలతో అలంకరించి పవిత్ర ధారాన్ని చుట్టి, ప్రదక్షిణలు చేశారు. కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిం
7నిర్మల్మర్రి చెట్టుకు హారతి ఇస్తున్న మహిళలు పూజారి గడువులోగా ఎన్యూమరేషన్ ఫాంలు పంపిణీ చేయాలి నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫాంల వివరాలు తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఫాంలు అందివ్వాలన్నారు. బీఎల్వోలు మాత్రమే ఫాంలు పంపిణీ చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ’హెల్ప్ డెస్క్’ లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో దేవీదాస్, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: ‘మేము అధికారంలో ఉన్నామా.. లేక ప్రతిపక్షంలో ఉన్నామా..? జిల్లాలో ఉన్న తమను సంప్రదించకుండా ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి..? ఈ తీరుతో పార్టీ కోసం పనిచేసే క్యాడర్కు ఏం సందేశం ఇస్తున్నట్లు..?’ అంటూ కాంగ్రెస్ పార్టీ బడానేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్త గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. పార్టీ సమావేశాలే వేదికగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తుండటం సంచలనంగా మారుతోంది. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్లో జరిగిన పార్టీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్, మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు అసహనం వ్యక్తం చేయడం జిల్లా కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. అధికారమా.. ప్రతిపక్షమా..!? ‘రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో మన ఎమ్మెల్యే సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ గణనీయంగా స్థానాలను గెలుచుకున్నాం. నిత్యం పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ఉంది. ఇవన్నీ కాదని, మనల్ని లెక్కలోకి తీసుకోకుండా.. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు మన ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి..!?’ అంటూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆదిలాబాద్లో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్, నిర్మల్లో ఆదివారం సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అడిగారు. తమను సంప్రదించకుండా ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలకు పనులు చేయడం, అభివృద్ధి పనులు సమాచారం ఇవ్వడం ఏంటంటూ ఇన్చార్జి మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులువాళ్లకు ప్రాధాన్యత ఎందుకు..? ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నిర్మల్, ఆదిలాబాద్ పర్యటనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం హస్తం క్యాడర్కు నచ్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో, వేదికలపైనా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నేతలు, క్యాడర్ అసహనం వ్యక్తంచేస్తున్నారు. తమ పార్టీకి పనికిరాని ప్రతిపక్షాల పనులు చేయడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. లోకల్గా ఉండే సొంతపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారు పార్టీకి ఎలా పనిచేస్తారని నిలదీస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా అనే అయోమయం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొందని నిర్మల్ సమావేశంలో కూచాడి శ్రీహరిరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనుల విషయంలోనూ ఎలాంటి సమాచారం ఉండటం లేదన్నారు. కార్యకర్తలు ఏదైనా పని చెబితే చేయించలేక, వారికి కారణం చెప్పలేక అవమానాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులను కాదని, ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంతపార్టీ ఎమ్మెల్యే, సీఎంకు దగ్గర అని పేరున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ సైతం మండిపడటం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యంపై సీఎల్పీ మీటింగ్లోనే తేలుస్తారా.. లేక సీఎం సమక్షంలోనే స్పష్టం చేస్తారా.. అని జూపల్లి ఎదుటే బొజ్జుపటేల్ అడగటం రెండు జిల్లాలో హస్తం పార్టీ నేతల అసహనం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. సీఎం దగ్గర తేల్చాల్సిందే..! -
భైంసావాసికి స్మైల్వర్స్ అవార్డు
భైంసాటౌన్: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపెల్లి నాగభూషణ్ కుమారుడు అక్షయ్కుమార్ దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. వెయ్యికిపైగా దంత ఆరోగ్య శిబిరాలు, లక్ష వరకు ఉచిత దంత ఆరోగ్య కన్సల్టేషన్ నిర్వహించాడు. దీంతో దంత వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆయన్ను స్మైల్ వర్స్ అవార్డుతో సత్కరించింది. మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం నిర్వహించిన నేషనల్ వైడ్ స్మైల్ వర్స్ అవార్డు 2026 కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఇంపాక్ట్ విభాగంలో అక్షయ్కుమార్ను అవార్డుతో సత్కరించారు. -
చదవు చారెడు.. పుస్తకాలు బారెడు!
భైంసాటౌన్: ప్రైవేట్ పాఠశాలలు ఐఐటీ, ఒలింపియాడ్, ఎక్సలెన్స్ వంటి పేర్లు తగిలించుకుని విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి చిన్న తరగతుల పిల్లలకు కూడా అనవసరంగా బండెడు పుస్తకాలు, వర్క్బుక్లు, డైరీలు అంటగడుతూ బాల్యం వీపుపై భారం మోపుతున్నాయి. అవసరం లేనప్పటికీ రంగురంగుల పుస్తకాలు అందించి, ప్రతి విద్యా సంవత్సరంలో కొత్త కొత్త పబ్లిషర్ పుస్తకాలను తల్లిదండ్రులతో కొనిపించడం ద్వారా భారీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫీజులతోపాటు యూనిఫారాలు, షూస్, బెల్టులు, నోట్బుక్స్ వంటివన్నీ స్కూల్లోనే కొనాలనే నిబంధనలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం తెచ్చిపెడుతున్నాయి. అమలుకాని నిబంధనలు.. బడిపిల్లల బ్యాగుల బరువు తగ్గించేందుకు ప్రభుత్వం గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమిక తరగతుల పిల్లల బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలకు మించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా ప్రైవేటు పాఠశాలలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా పాఠ్యాంశాలు బోధిస్తుండగా, ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను ఆకర్షించేందుకు అనవసర సబ్జెక్టులు, అదనపు పుస్తకాలు, స్టడీ మెటీరియల్లు అంటగడుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ పాలసీ అమలు చేయాల్సి ఉండగా, చాలా ప్రైవేట్ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ఫలితంగా బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు తమ బరువుకు మించిన బ్యాగులను మోస్తూ ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, ప్రైవేటు స్కూళ్లపై క్షేత్రస్థాయిలో కఠిన తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అనవసరమైన పుస్తకాల భారాన్ని తగ్గించి, పిల్లలకు స్వేచ్ఛాయుతమైన, ఆనందభరితమైన విద్యా వాతావరణాన్ని అందించాలని వారు కోరుతున్నారు. -
వర్షాలు, వరదలతో ఇబ్బందులు రాకుండా చూడాలి
నిర్మల్చైన్గేట్: భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, వైద్యారోగ్య, ఆర్అండ్బీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రజలకు రక్షణ కలుగుతుందన్నారు. వర్షాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలు, చెరువుల కింద ఉన్న ప్రజ లకు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ వాతావరణ వివరాలు, నీటి మట్టపు వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కుంగిన రోడ్లు, గుంతలు, ప్రమాదకర ప్రవాహాలు ఉండే ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలెవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తేముందు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. గర్భిణులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. కోతకు గురైన రోడుల, విద్యుత్ అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పటిష్ట బందోబస్తుతో రక్షణ.. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరద సమయంలో ప్రాజెక్టులు, ప్రమాదకర చెరువుల ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బంది బందోబస్తు ద్వారా రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. లోతట్టు ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసు శాఖ తరఫున కృషి చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా చెరువు మరమ్మతు
తానూరు: మండలంలోని హిప్నెల్లి చెరువు మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించింది. 2003లో వచ్చిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. మూడేళ్లుగా ఆయకట్టు రైతులు సాగు నీటి సమస్యతో తీవ్రంగా నష్టపోయారు. గతేడాది ప్రభుత్వం రూ.60.30 లక్షలు చెరువు మరమ్మతుకు మంజూరు చేసింది. మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఇటీవలే పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు సంతోషపడ్డారు అయితే మొదటి వర్షాలకే నాణ్యత తేలిపోయింది. మొరం పోసిన కట్ట బీటలువారింది. మరమ్మతు చేసిన కాలువ ద్వారా నీరు వృథాగా పోతోంది. కాంట్రాక్టర్ ఇసుక స్థానంలో క్రషర్ డస్ట్ వాడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సరిగా క్యూరింగ్ చేయకుండా, రోలర్తో సరిగ్గా కుదించకుండా పనులు పూర్తి చేసినట్లు పేర్కొంటున్నారు. ఈమేరకు సోమవారం చెరువు కట్టను పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని ఏఈ అదిత్యకు ఫిర్యాదు చేశారు. కట్ట వెడల్పు నాలుగున్నర మీటర్లు ఉండాలని, అంచు జారుడు కారణంగా కొంత మట్టి కొట్టుకుపోయిందని తెలిపారు. రైతులు ఈ సమాధానంపై సంతృప్తి చెందలేదు. రైతులు పనుల నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
మంచి సూచన.. అమలు చేసేనా?
కొయ్యబొమ్మలే ఇవ్వండి..ఇక జిల్లాకు పేరు తీసుకువచ్చిన కొయ్యబొమ్మలనూ కాపాడుకోవాలని సమావేశంలో ఇలంబర్తి సూచించారు. ప్రతీశాఖ వారు ఏ కార్యక్రమం జరిగినా కొయ్యబొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్నే జ్ఞాపికలుగా ఇవ్వడం ద్వారా కళాకారులకు, కళకు అండగా నిలిచినవారవుతారని తెలిపారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు బొమ్మలు, పెయింటింగ్స్ వెళ్లడం వల్ల ప్రమోషన్ చేసిన వాళ్లమవుతామని వివరించారు. తొలి కలెక్టర్ చెప్పిన ఈ మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రస్తుత కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్: ‘టీచర్స్ లేకపోతే మేము లేము. నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదివాను. సర్కారు బడిలో ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వబడులను ప్రోత్సహించాలి. అందులో చదువుచెప్పే ఉపాధ్యాయుల అనుభవం విద్యార్థులకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి. అలాగే ప్రతీ అధికారి ఓ ప్రభుత్వ బడిని బాధ్యతగా తీసుకోవాలి..’ అంటూ చదువు, ప్రభుత్వ బడి ప్రాధాన్యతను ప్రజాపాలన ప్రత్యేకాధికారి ఇలంబర్తి సూచించారు. ఈనెల 24న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన చేసిన ఈ సూచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా తొలి కలెక్టర్ ఇలంబర్తి ఈ సమావేశంలో చేసిన పలు సూచనలు ఆలోచింపజేయడమే కాకుండా ఆచరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు స్కూళ్లలో చదివి.. ‘ఇక్కడ ఉన్నవాళ్లల్లో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివారో చెప్పండి..’అంటూ ప్రత్యేకాధికారి ఇలంబర్తి అడగగానే సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారుల్లో దాదా పు అందరూ చేతులెత్తారు. సర్కారు స్కూళ్లల్లో చది వి ఉన్నత అధికారులుగా ఎదిగిన తీరును ఆయన గర్వంగా చెప్పారు. అలాంటి స్కూళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అధికారికో బడి అప్పగిస్తే.. ‘అందరం ప్రభుత్వ బడుల్లో చదువుకుని వచ్చినవాళ్లమే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లమే. అందు కే ఒక్కో అధికారికి ఒక్కో బడి బాధ్యతను అప్పగిస్తే బాగుంటుంది. సదరు అధికారి నెలలో కనీసం రెండు మూడుసార్లు ఆ స్కూల్కు వెళ్లి, పిల్లలతో మాట్లాడాలి. వారిలో చదువుపై ఆసక్తిని పెంచడం, తాము ఏ శాఖలో, ఏఏ పనులు చేస్తామో చెప్పడం, సాధారణ కుటుంబాల నుంచి వచ్చినా, బాగా చదివితే తమలా ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని మోటివేట్ చేయాలి’ అని ఇలంబర్తి సూచించారు. దీనిపై కలెక్టర్ భవేశ్మిశ్రాతోపాటు జిల్లా అధికారులూ సానుకూలంగా స్పందించారు. -
కాంగ్రెస్ ఓట్లు తొలగించే కుట్ర
నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మైనార్టీ, ఎస్టీ, ఎస్సీల ఓట్లు తొలగించే కుట్ర చేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పట్టణంలోని దివ్య గార్డెన్లో ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఎల్ఎలు, పార్టీ మండల అధ్యక్షులు, సూపర్ వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా ఈ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నెల రోజులపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలపై సమీక్ష.. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సమష్టిగా కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి పని చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజకవర్గంలోని బీఎల్ఎలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారమైనా సంక్షేమం ఆపం -
‘సన్నా’లతో సాగేదెలా?
ప్రభుత్వం సూచించిన 7 రకాలు సాంబా మసూరి (బీపీటీ 5204) తెలంగాణసోనా (ఆర్ఎన్ఆర్ 15048) కూనారం వరి (కేఎన్ఎం 1638) జై శ్రీరామ్ హెచ్ఎంటీ (సోనా) సిద్ధి (డబ్ల్యూజీఎల్ 44 ) కేఎన్ఎం 7715 లక్ష్మణచాంద: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పే పాలకులు ఆచరణలో మాత్రం వెనుకబడుతున్నా రు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు పంటల సా గు విషయంలో నిబంధనలు విధించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. జూన్ మొదటి వారంలోనే జిల్లా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు వరి నార్లు పోసుకున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కువకపోవడంతో మిగతా రైతులు విత్తనాలు వేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ సమయంలో సన్న వ రి సాగు విషయంలో ప్రభుత్వం ఈసారి కఠిన నిబంధనలు విధించింది. తాము సూచించిన 7 రకాల సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని, ఆ రకాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఇతర రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించడంలో విఫలం.. వానాకాలం సీజన్కు సూచించిన ఈ ఎనిమిది రకాలపై రైతులకు సకాలంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి, నారు పోసిన తర్వాత ఇవే రకాలు సాగు చేయాలి అని చెప్పడం సరైనది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సూచించిన రకాల విత్తనాలు కూడా జిల్లాలో అందుబాటులో ఉంచలేదని మరికొందరు పేర్కొంటున్నారు. యూరియా యాప్పైనా..ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్(యూరియా కోసం)పై సగం కంటే ఎక్కువ మంది రైతుల కు అవగాహన లేదు. ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు కావడం, వ్యవసాయాధికారులు అవగా హన కల్పించడంలో అలసత్వంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాదనలు వినిపిస్తున్నాయి. -
ఎస్ఐఆర్ను పరిశీలించిన డీపీవో
భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, ఓటరు వివరాల నమోదు, అర్హుల జాబితా తయారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఓటరును జాబితాలో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్ల తొలగింపులో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీవో ప్రదీప్, బీఎల్వోలు ఉన్నారు. -
మళ్లీ ముంపు ఆందోళన..
భైంసా/భైంసారూరల్: భైంసా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండేగాం వాసుల పునరావాస సమస్య మరోసారి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదివారం బాసరలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కలిసి గ్రామస్తుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుండేగాం ప్రజలు దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని, ముంపు సర్వే పూర్తయినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని వినతిపత్రం సమర్పించారు. స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గుండేగాం పునరావాస అంశంపై సమగ్రంగా చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తుల్లో మరోసారి ఆశలు మొలకెత్తాయి. మూడేళ్లగా తాత్కాలిక జీవనం.. మూడేళ్ల నుంచి గ్రామంలో నివసించడం సాధ్యం కాకపోవడంతో అనేక కుటుంబాలు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నాయి. స్వగ్రామాన్ని వదిలి జీవనం సాగిస్తున్నప్పటికీ తమ భూములు, వ్యవసా యం, పశుసంపద, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. తాత్కాలిక నివాసం సమస్యకు పరిష్కారం కాదని, శాశ్వత పునరావాసం కావాలని బాధితులు కోరుతున్నారు. ప్రాజెక్టు, పునరావాసం రెండూ అసంపూర్తి.. పునరావాసం పూర్తి కాకపోవడంతో ఒకవైపు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామస్తులు తమ గ్రామంలో ప్రశాంతంగా జీవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరకపోగా, ప్రజలు కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక పునరావాస అంశం ప్రతీ ఎన్నికల సమయంలో ప్రధాన చర్చగా మారినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అధికార, ప్రతిపక్ష నాయకులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అనేకసార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందన రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీతో ఈసారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుండేగాం గ్రామం ఏళ్ల నుంచి అదే సమస్య..గ్రామం : గుండేగాం కుటుంబాలు : 162 జనాభా : 694 రేషన్ కార్డులు : 236 సాగు భూములు: 364 ఎకరాలు ప్రధాన సమస్య : పల్లికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం. పరిష్కారం : బైంసా సమీపంలోని కమ లాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం.వర్షాకాలం ప్రారంభమవడంతో గుండేగాం గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే గ్రామంలోకి నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. శాశ్వత పునరావాసం కల్పించకపోతే ప్రతీ వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో గుండేగాం గ్రామం ముంపు జాబితాలో చేరింది. ప్రభుత్వం ముంపు సర్వే పూర్తి చేసినప్పటికీ పునరావాస ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. వర్షాకాలం ప్రారంభమైతే గ్రామంలోకి నీరు చేరడం సాధారణమైంది. గతంలో అనేక సార్లు గ్రామ వీధులు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోని వస్తువులు దెబ్బతినడం, రాకపోకలు నిలిచిపోవడం, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సమస్యలు తరచూ ఎదురయ్యాయి. -
బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
నిర్మల్ రూరల్: మండలంలోని తల్వేద గ్రామంలో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని హైదరాబా ద్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్గా ఆదివారం ప్రారంభించారు. ప్రత్యక్షంగా జిల్లా అధ్యక్షుడు రితీశ్రాథోడ్ ప్రారంభించి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణగౌడ్, నారాయణరెడ్డి, సీనియర్ నాయకు లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, నల్ల రవీందర్రెడ్డి, కరిపే విలాస్, ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా ఇన్చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
సర్లో భాగస్వాములు కావాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతీఓటరు జూలై 24లోగా తమ వివరాలు నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని 29వ వార్డులో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారన్నారు. ప్రజలు ఫారాలను పూర్తిగా పూరించి, 2002 ఓటర్ల జాబితా లో తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నానమ్మ తదితర కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలన్నారు. అనంతరం సంతకం చేసి, ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను జతచేసి సంబంధిత బీఎల్వోకు అందజేయాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతీ ఓటరు ఓటు భద్రంగా ఉంటుందని, సమర్పించని వారి వివరాలు తదుపరి పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్వో సమక్షంలో కలెక్టర్ స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించారు. రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న వివరాలను నమోదు చేసి, పాస్పోర్ట్ సైజు ఫోటోను జతచేసి బీఎల్ఓకు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ రాజు, వార్డు సూపర్వైజర్లు, బీఎల్వోలు, కాలనీ వాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
లక్ష్మణచాంద: రైతులు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ నిర్మల్ డివిజన్ అధికారి మౌనిక తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో మహిళా రైతు కొండ్ర నర్సవ్వ సాగు చేస్తున్న కూరగాయలను శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం రామకృష్ణారెడ్డి బెడ్ పద్ధతిని, మల్చింగ్ విధానంలో పంటలు సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.9,600 రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కూరగాయాల సాగుకు డ్రిప్, మల్చింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఇందిరమ్మ కాలనీలు.. సమస్యల లోగిళ్లు
భైంసా: జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కానరావడం లేదు. దీంతో ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. చిన్న వర్షానికే కాలనీల్లో మట్టిరోడ్లు బురదగా మారుతున్నాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడద కూడా పెరుగుతోంది. అందకూర్లో అధ్వానం.. కుంటాల మండలం అందకూర్లో 57 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడగానే ఇళ్ల ముందు నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో కాలనీవాసులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోజూ ఇబ్బంది పడుతున్నారు. నిర్మల్ పట్టణంలో.. జిల్లా కేంద్రం నిర్మల్లో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో లేవు. దీంతో కుటుంబాలు అనేక సమస్యల మధ్య జీవనం సాగిస్తున్నాయి. ఖానాపూర్లో పంపిణీ ఆలస్యం.. ఖానాపూర్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. అర్హులైన కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ నిరాశకు గురవుతున్నాయి. నిలిచిన నిర్మాణాలు.. కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచింది. భైంసా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీల్లో కూడా పూర్తిస్థాయి వసతులు లేవు. ముధోల్ మండల కేంద్రం నుంచి విట్టోలి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. ప్రజలు కోరుతున్న చర్యలు జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. నిర్మించిన కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు అత్యవసరంగా కల్పించాలి. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నాణ్యమైన నివాస వాతావరణం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలపై సమగ్ర సమీక్ష జరిపి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అడ్మిషన్లు పెంచాలి
● డీఐఈవో పరశురాం సారంగపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేలా అధ్యాపకులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా మధ్యామిక విద్యాధికారి(డీఐఈవో)పరశురాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఇప్పటి వరకు కళాశాలలో చేరిన విద్యార్థుల వివరాలు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల వివరాలను ప్రిన్సిపాల్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. ఈయేడాది ప్రైవేటుకు దీటుగా పిల్లలకు విద్యాబోధన చేసేలా లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గతేడాదికన్నా మెరుగైన ఫలితాల సాధనకు విద్యాబోధన తీరును మరింత మెరుగుపరచాలన్నారు. ప్రైవేటు కళాశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ఇక్కడున్న ప్రభుత్వ కళాశాల సదుపాయాలు, విద్యాభోదన తీరును వివరిస్తూ ప్రభుత్వ కళాశాలకు రప్పించేలా చూడాలని సూచించారు. -
చుక్కల మందుకు వేళాయె
నిర్మల్చైన్గేట్: జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమం కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిపోయిన చిన్నారులకు 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తారు. డీఎంహెచ్వో రాజేందర్ ఈ కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి ముందుగానే మార్గనిర్దేశం చేశారు. జిల్లాలో నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. 625 కేంద్రాలు, 20 మొబైల్ టీమ్స్.. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. పోలియో చుక్కల పంపిణీ కోసం 625 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితోపాటు 20 హైరిస్క్ కేంద్రాలు, 20 మొబైల్ టీమ్స్ కూడా సిద్ధం చేశారు. విధుల్లో 2,500 మంది సిబ్బంది.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొబైల్ టీమ్స్ ద్వారా బస్ స్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం 20 రూట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమ పర్యవేక్షణకు 70 మంది సూపర్వైజర్లను నియమించారు. జిల్లాలో సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. పిల్లలు భయంకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి టీకాలు వేయించడం తప్పనిసరి. పోలియో వ్యాధి రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పిల్లలకు చుక్కలు వేస్తారు. తప్పనిసరిగా వేయించాలి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో బారిన పడకుండా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు చేస్తారు. చిన్నారులు మిస్ కాకుండా చూసుకోవాలి. – డాక్టరరాజేందర్ డీఎంహెచ్వో జిల్లా వివరాలు.. 5 ఏళ్లలోపు చిన్నారులు 92,116 మొత్తం బూత్లు 625 మొబైల్ టీమ్లు 20 ట్రాన్సిట్ పాయింట్లు 20 వ్యాక్సిన్ మేనేజర్లు 20 సూపర్వైజర్లు 70 -
మాదకద్రవ్యాలను నిరోధించాలి
సారంగపూర్: మాదకద్రవ్యాలను నిరోధించే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్రోడ్డు సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గంజాయి, కొకై న్, హెరాయిన్తో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఎన్డీపీఎస్ చట్టం గురించి తెలియజేశారు. మైనర్లకు వాహనాల అప్పగించడంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యులవుతారన్నారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విజ్కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్మల్
నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో ఆటోలు, బైక్లను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. బస్టాండ్ ఇన్, ఔట్ గేట్ల వద్ద అడ్డంగా 15 నుంచి 20 ఆటోలను నిలుపుతున్నారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బస్టాండ్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ఎదుటే ఆటోలు నిలిపి ఉంచడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆర్టీసీ గార్డ్స్ మచ్చుకై నా కనిపించడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్7పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు చేయూతనిస్తున్నారు. ఒకప్పుడు చదువుకున్న బడి అంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. బాల్యం జ్ఞాపకాలు, గురువుల బోధనలు, స్నేహితులతో గడిపిన క్షణాలు అన్నీ ప్రభుత్వ పాఠశాలలతో ముడిపడి ఉంటాయి. కాలం మారినా, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా తమను తీర్చిదిద్దిన బడిని మరిచిపోని వారు ఎంతోమంది ఉన్నారు. పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే పలువురు ఉపాధ్యాయులు తమ బడిని కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. – నిర్మల్ -
విద్యార్థులను చేర్పిస్తే నెలకు రూ.వెయ్యి..
భైంసారూరల్: మండలంలోని లింగా–1 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాలుగేళ్లుగా మూతపడింది. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో 2022 నుంచి 2026 వరకు పాఠశాల తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను ఈఏడాది తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు లేక బడి కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ నియమితులైన ఉపాధ్యాయుడు సాయినాథ్ తీసుకున్న నిర్ణయం గ్రామస్తులను కదిలించింది. పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నాణ్యమైన భోజనం, యూనిఫాం, ఆంగ్ల బోధన అందించడంతోపాటు అదనంగా తనవంతుగా ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో ప్రాధాన్యతను వివరించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడి తపన, మాటతీరుతో నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ముందుకువస్తున్నారు. తనకు వచ్చే వేతనం నుంచి ఒక్క విద్యార్థికి ఇచ్చినమాట ప్రకారం ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు. ఈక్రమంలో ఒక్కొక్కరుగా లింగా బడిలో మళ్లీ పిల్లల సందడి పెరుగుతోంది. -
రూ.16.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రూ.16.64 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, ఎంపీ గొడెం నాగేష్తో కలిసి శనివారం రాత్రి శంకుస్థాపన చేశా రు. రూ.14 కోట్లతో కడెం మండలం నచ్చన్న ఎల్లాపూర్ రహదారి విస్తరణ, మరమ్మత్తు పనులు, ఖానాపూర్ పట్టణంలో రూ.1.21 కోట్లతో బొడ్డోనికుంట చెరువు పునరుద్ధరణ పనులు, రూ.1.43 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం చేయనున్నారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో దేవిదాస్, మున్సిపల్ చైర్పర్సన్ అంక మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగల భూషణ్, వైస్ చైర్మన్ మాజిద్, ఆత్మ చైర్మన్ గాడ్పు సత్యం, కౌన్సిలర్లు చిన్నం సత్యం, పోలంపల్లి రమేశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిల్ శంకర్, పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్ పాల్గొన్నారు. నేడు జిల్లాలో ‘జూపల్లి’ పర్యటన నిర్మల్చైన్గేట్: పర్యాటక, సాంస్కృతిక, పురా వస్తు, ఎకై ్సజ్ శాఖ, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం బాసర నుంచి భైంసా చేరుకుని భైంసాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. రూ.2.14 కోట్లతో చేపట్టే మహదేవ్పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్లో నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. -
బట్టలు ఆరేస్తూ ప్రాణాలు కోల్పోయిన నవవధువు
నాలుగు నెలల క్రితం ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కోటి ఆశలతో మెట్టింట్లో అడుగు పెట్టింది. ఆనందంగా సాగిపోతున్న వైవాహిక జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. విద్యుత్ రూపంలో మరణ శాసనం లిఖించింది. నిర్మల్ : బోరిగాం గ్రామానికి చెందిన నల్ల రేఖ(23)కు నాలుగు నెలల క్రితం మహారాష్ట్రలోని అప్పారావుపేట్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. భర్త సోదరి వివాహం గురువారం లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో జరిగింది. ఈ వివాహానికి రేఖ, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాత్రి వధువును అత్తారింటికి సాగనంపి బోరిగాం గ్రామానికి తిరిగి వచ్చారు.బట్టలు ఆరేస్తుండగా శుక్రవారం ఉదయం ఇంటి దాబాపై బట్టలు ఆరేస్తుండగా చీర అనుకోకుండా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. షాక్కు గురైన రేఖ పెద్దగా అరిచి పడిపోయింది. కుటుంబ సభ్యులు పరుగెత్తుకొచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. నాలుగు నెలల క్రితం కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించిన తల్లి దండ్రులు ఆమె మృతదేహం వద్ద గుండెలు పగిలేలా రోదించారు. భార్యను విగతజీవిగా చూసిన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలకు వేసిన రక్షణ పైపులు పగిలిపోవడం వల్లే చీర నేరుగా తీగలకు తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
నిర్మల్
అక్షర శ్రీకారం● ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్ ● కమ్యూనికేషన్ వ్యవస్థల్లో కదలిక ● రోడ్లతోపాటు వివిధ పనులకు నిధులు7బుల్లెట్ బండెక్కి ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ భవేశ్మిశ్రా సరదాగా షికారుకు వెళ్లలేదు. కనీసం కారు కూడా వెళ్లడానికి ‘దారి’లేని ఊళ్ల దుస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు బయలుదేరారు. ఈనెల 11న వీరిద్దరు బైక్పై పెంబి, కడెం మండలాల్లోని అటవీ గ్రామాల్లో పర్యటించారు. మౌలిక సౌకర్యాలతోపాటు కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థలూ లేవన్న విషయాన్ని గ్రహించారు. వాటి పరిష్కారానికి అక్కడి నుంచే చర్యలు మొదలుపెట్టారు. గుమ్మెన ఎంగ్లాపూర్లో సెల్టవర్, పెంబి మండలంలో రూ.2.43 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, వివిధ పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇలా.. ఎమ్మెల్యే, కలెక్టర్, పెద్దసార్లంతా తమ గూడేలకు రావడం, సమస్యలు తెలుసుకోవడంతోపాటు పరిష్కార చర్యలనూ ప్రారంభించడంతో గిరిజనులు తమ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సత్వరం స్పందించాలి లక్ష్మణచాంద: ఠాణాకు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై చట్టప్రకారం సత్వరం స్పందించాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వహణ, రిసెప్షన్, మాల్ఖానా, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, పోలీస్ స్టేషన్ పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీసులతో సమావేశమై విధి నిర్వహణ, పని తీరుపై మాట్లాడారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, లక్ష్మణచాంద ఎస్సై శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్: ఓవైపు రాష్ట్రం ‘ఫ్యూచర్సిటీ’ల వైపు అభివృద్ధిబాటలో పరుగులు పెడుతుంటే.. అడవుల మధ్య ఉన్న ఆ ఊళ్లు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా అటవీ గ్రామాల ప్రజల జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, చివరకు కమ్యూనికేషన్ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. అడవిబిడ్డల కష్టాలపై దృష్టిపెట్టామని, క్రమంగా అన్నీ పరిష్కరిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. రోడ్లే పెద్ద సమస్య.. ఏ ఊరు అభివృద్ధి చెందాలన్నా కనీసం ఆ ఊరికి మంచి రోడ్డు ఉండాలి. కానీ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేవు. ఏదైన కష్టం వచ్చినప్పుడు రాళ్లురప్పలు, ఎగుడుదిగుడు అటవీమార్గాల్లో రావడం ఇబ్బంది గా మారుతోంది. అలా.. మధ్యలోనే ఎంతోమంది ప్రాణాలూ పోయాయి. ఎంతోమంది తల్లులు నడి అడవిలోనే బిడ్డలకు జన్మనిచ్చిన రోజులున్నాయి. వర్షాకాలం మరింత కష్టమవుతోంది. రోడ్లు లేక వి ద్య, వైద్యం అందనిద్రాక్షగానే మారాయి. అంబు లెన్స్లు రాలేక అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించడం పెద్ద సవాల్గా మారుతోంది. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. రోడ్డు, కరెంటు లేవు.. ఇప్పటికీ మా ఊరికి రోడ్డు, కరెంటు లేవు. ఎటు వెళ్లాలన్నా కాలినడకనే. ఎన్నోసార్లు మా సమస్యను చెప్పినం. ఇప్పటికై నా రోడ్డు, కరెంటు వంటి కనీస సౌకర్యాలను మా అటవీ గ్రామాలకు కల్పించాలి. – ఆత్రం మాణిక్రావు, మిద్దెచింత, మం.కడెం కేజీబీవీలకు యూనిఫాం‘డబుల్’ గృహ ప్రవేశాలు బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 1,376 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కానుకలు, అర్చనలు, ఇతర సేవల ద్వారా ఒక్కరోజే రూ.12,03,260 ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. చిగురిస్తున్న ఆశలు.. కలెక్టర్ అభిలాషఅభినవ్ ఉన్నప్పుడూ పెంబి మండల వాసులు కాలినడకన కలెక్టరేట్కు వచ్చి తమ గోడు వినిపించారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. కలెక్టర్ మారడంతో ప్రస్తుతం వచ్చిన భవేశ్మిశ్రా స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్తో కలిసి ఆయా గ్రా మాలను స్వయంగా పరిశీలించారు. కమ్యూనికేషన్ కోసం ముందుగా టవర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వాగులపై వంతెనలు కట్టిస్తామన్నారు. దీంతో ఆ అటవీగ్రామాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికై నా మా జీవితాల్లో ‘వెలుగులు’ వస్తాయని ఆశిస్తున్నారు.ఫిర్యాదులు పరిష్కరించాలి నిర్మల్టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై శుక్రవారం సమీక్ష చేశారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న పిటిషన్లను ప్రత్యేకంగా సమీక్షించి విచారణ వేగవంతం చేయాలని సూచించారు. ప్రతీ పిటిషన్పై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దశ మారుస్తారా..!నడుసుకుంటపోయి చెప్పినం... ఇప్పటిదాకా కనీసం కరెంటు, రోడ్డు కూడా లేని మాకష్టాలను తీర్చాలంటూ ఇక్కడి నుంచి నిర్మల్ దాకా నడుసుకుంటూ పోయి మా గోస చెప్పినం. పాలకులు, అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి. – కనక నిర్మల, చాక్రేవు, మం.పెంబి -
నో అడ్మిషన్స్
తానూరు మండల కేంద్రంలోని కేజీబీవీలో అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో సిబ్బంది పాఠశాల గేటుకు ‘అడ్మిషన్స్ క్లోజ్’ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి వరకు 262 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ప్రవేశపెట్టారు. ఇందులో 25మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. దీంతో విద్యార్థినుల సంఖ్య 287కు చేరింది. ఇంతకంటే ఎక్కువగా అడ్మిషన్లు తీసుకుంటే సౌకర్యాలు సరిపోవనే కారణంతోనే ప్రవేశాలు లేవని బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ అలేఖ్య తెలిపారు. – తానూరు -
● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు ● సొంతింటి కల నెరవేరుతున్న వేళ.. ● రేపు మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం
మహదేవ్ చెరువు సుందరీకరణ.. పట్టణంలోని సిద్దార్థనగర్లోని మహాదేవ్ చెరువు కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. చెరువు సుందరీకరణకు నోచుకోకవడంతో క్రమేపీ కుచించుకుపోతోంది. అమృత్ 2.0 కింద రూ.2.14 కోట్లతో చెరువు సుందరీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. మంత్రి జూపల్లి చేతులమీదుగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, స్టోన్ పిచింగ్, పిచ్చి మొక్కల తొలగింపు, చిన్నపాటి పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. భైంసాటౌన్: పట్టణంలోని పార్డి(బి) బైపాస్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా లబ్ధిదారులకు కేటా యించలేదు. దీంతో అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నామంటూ లబ్ధిదారులు పలుమార్లు ఆందోళన చే పట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తి రిగారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. మౌలిక వసతు ల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల పంపిణీ చేపట్ట లేదని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ప నులు పూర్తికాగా, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా సోమవారం ఇళ్ల పంపిణీ చేపట్టనున్నారు. మూడేళ్లకుపైగా నిరీక్షణ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలోని పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో 160, రెండో విడతలో 441 ఇళ్లు మంజూరు కాగా, 2023లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదే ఏడాది ఏప్రిల్లో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల కేటాయింపు జరగలేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తమకు కేటాయించకపోవడంతో పలుమార్లు లబ్ధిదారులు నిరసన చేపట్టారు. కొందరైతే తాళాలు పగులగొట్టి తాత్కాలికంగా నివాసముంటున్నారు. రెండు నెలల కిందట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీటిపై సమీక్ష జరిపారు. అసంపూర్తిగా ఉన్న విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేయించి, అర్హులైన వారికి వెంటనే ఇళ్లను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తికాగా, ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. -
జిల్లా కేజీబీవీల సమాచారం...
లక్ష్మణచాంద:రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యలో చదువు మానేసిన పేద, మధ్యతరగతి బాలికలను మళ్లీ చదువుబాట పట్టించి, ఇంటిని మరచిపోయేలా ఆకర్షణీయమైన భోజనం, వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించి ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కేజీబీవీలను ప్రారంభించింది. ఏకరూప దుస్తుల ఆలస్యం.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. సకాలంలో వస్త్రం అందకపోవడంతో విద్యార్థినులు పాత దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది 6వ తరగతిలో చేరిన బాలికలు యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ బాలికలకు ఏకరూప దుస్తులు అందించేందుకు వస్త్రం జిల్లా కేంద్రానికి చేరింది. అధికారులు ఈ వస్త్రాన్ని జిల్లాలోని ఎస్హెచ్జీలకు అందజేసి త్వరగా కుట్టాలని సూచించారు. జిల్లాలో విద్యార్థినుల వివరాలు.. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు 4,883 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే కేజీబీవీ ఇంటర్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరాల్లో 2,315 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 18 కేజీబీవీలకు చెందిన బాలికల యూనిఫాం కోసం టా ప్లకు 15,400 మీటర్లు, బాటమ్కు 24,900 మీటర్లు, సూట్లకు 16,200 మీటర్ల వస్త్రం చేరిందని జీసీడీవో రమాదేవి తెలిపారు. ఇప్పటికే ఎస్హెచ్జీలకు అందజేసి కుట్టడం ప్రారంభమైంది. త్వరలో కుట్టడం పూర్తి చేసి బాలికలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.జిల్లాకు చేరిన మొత్తం వస్త్రం 56,500 మీటర్లుమొత్తం పాఠశాలలు 18 త్వరలో అందిస్తాం.. కేజీబీవీలలోని బాలికలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తుల వస్త్రం ఎస్హెచ్జీలకు అందించాం. వారు కుట్టడం ప్రారంభించారు. వేగవంతంగా స్టిచ్చింగ్ చేయించి బాలికలకు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటాం. – రమాదేవి, జీసీడీవోపాఠశాల విద్యార్థులు 4,883 కళాశాలల విద్యార్థులు 2,315 -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
పార్పల్లిలో అసైదూలా ఆడుతున్న యువకులు మునిపల్లిలో పీరీలను దర్శించుకుంటున్న భక్తులు పంజేషా గల్లీలో పీరీల ఊరేగింపు మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రంను జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణాలు, పల్లెల్లో సవారీలను ఊరేగించారు. రెండో రుయ్యాడిగా ప్రసిద్ధి చెందిన మునిపల్లిలో ఉదయం గోదావరి జలాలను ఊరేగింపుగా తెచ్చి పీరీలకు అభిషేకం చేశారు. అనంతరం మలిదలు సమర్పించారు. అగ్నిగుండాల చుట్టూ భక్తులు అసైదులా ఆడారు. అగ్నిగుండం దాటే కార్యక్రమాల నిర్వహించారు. మునిపల్లిలో వేడుకలు తిలకిచేందుకు జిల్లా నలు మూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. – లక్ష్మణచాంద/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
మేమేం పాపం చేశాం!
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే పనులు పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లయినా.. పనులు మళ్లీ ప్రారంభం కాలేదు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రధాన రహదారి కిలోమీటరుకుపైగా ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖానాపూర్లో ట్రాఫిక్ సమస్య పద్మవ్యూహంలా మారింది. ‘సోషల్’ వార్.. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పట్టణ వాసులు సోషల్ మీడియా ద్వారా పాలకులు, అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ‘‘మేమేం పాపం చేశాం? కట్టే పన్నులకు రోడ్డు సమస్యకు సంబంధం లేదా?’’ అని ముద్రించిన ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో స్కూల్ బస్సులు, అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ దిమ్మెలను కార్లు, డీసీఎంలు, ఇతర వాహనాలు ఢీకొన్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు సన్నద్ధం.. రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఒక రోజు బంద్తోపాటు పట్టణ దిగ్బంధం, ఐదు వేల మంది సంతకాల సేకరణ, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. -
రోడ్లు, కరెంటు లేని గ్రామాలు..
పెంబి మండలం గుమ్మెనఎంగ్లాపూర్, వస్పల్లి, ధొంధరి, రాయదారి, అంకెన, దయ్యాలమద్ది, అర్చన్తండా, కోరకంటి, యాపల్గూడ, రాంనగర్ గ్రామాలకు రోడ్లు లేవు. చాక్రేవు, రాగిదుబ్బ గ్రామాలకు రోడ్లు, కరెంటు కూడా లేదు కడెం మండలం అద్దాల తిమ్మాపూర్, అల్లంపల్లి, బాబానాయక్ తండా, పాలరేగడి, గంగన్నపేట్, మీసాల భూమన్నగూడెం, చింతగూడ, మిద్దెచింత, ఇస్లాంపూర్ గ్రామాలకు రోడ్లు లేవు. ఇక ఖానాపూర్ మండలం కుసుంపూర్, పంగిడి గూడెం, చామన్పల్లి, కొత్తగూడెం, మామడ మండలం రాంపూర్, పోచమ్మగూడ, తోటిగూడ, మల్కాపూర్, సారంగపూర్ మండలం ఇప్పచల్మ, పెండలదరి గ్రామాలకు కూడా రోడ్లు లేవు. -
భైంసా పీజీ హెచ్ఎం సస్పెన్షన్
● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ నిర్మల్: భైంసా పట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(పీజీహెచ్ఎం) ఎంఏ.అబ్దుల్ రషీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) పి.మదన్మోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఈవో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతోపాటు ప్రభుత్వ నిధుల వినియోగంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. దీని ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావించిన సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రైవేట్కు పంపితే పథకాలు కట్నిర్మల్ రూరల్: మండలంలోని న్యూ పోచంపాడు గ్రామస్తులు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపమని గురువారం తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు పంపుతామని ప్రకటించారు. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై చర్చించారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థిని కూడా ప్రైవేటు పాఠశాలకు పంపకూడదని నిర్ణయించారు. ఎవరైనా పంపితే వారికి రేషన్ బియ్యం, పెన్షన్తోపాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని తీర్మానించారు. ఇందులో సర్పంచ్ కొండ పద్మ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూమేశ్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. బొడ్డోనికుంట పరిశీలనఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న బొడ్డోనికుంటను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. అమృత్–2 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. కుంట సుందరీకరణతోపాటు ప్రజలకు ఉపయోగపడేలా వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తర్వాత కుంట సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బొడ్డోనికుంట అభివృద్ధితో శాంతినగర్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. తొలకరికే రోడ్డెక్కిన వరదఖానాపూర్:పట్టణంలో గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికే వరద రోడ్డెక్కింది. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలు బహిర్గతమయ్యాయి. జిప్అడ్డా ప్రాంతంలో ఇరుకు డ్రైనేజీ కారణంగా.. వర్షపునీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి చేరింది. అటవీశాఖ కార్యాలయం ఎదుట డ్రైనేజీ లేకపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. తహసీల్దార్ కార్యాలయంలోకి వరద చేరింది. డ్రెయినేజీ మెరుగుపర్చకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పట్టణవాసులు పేర్కొంటున్నారు. -
ఉపాధ్యాయులను కేటాయించాలి
లక్ష్మణచాంద: తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాలని పార్పల్లి గ్రామస్తులు డీఈవో భోజన్నకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలో గతేడాది 24 మంది విద్యార్థులు ఉండేవారని, ఈ ఏడాది కొత్తగా 28 మంది ప్రవేశం పొందారని తెలిపారు. మరో 70 మంది ప్రవేశాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 100 దాటుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోరని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో త్వరలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఉప సర్పంచ్ విద్యాసాగర్రెడ్డి, వార్డు సభ్యులు పోషగౌడ్, శ్రీనివాస్, గణేశ్, వీడీసీ సభ్యులు గంగాధర్, నారాయణ, భీమేష్, సుంకరి గంగాధర్, చిన్నయ్య ఉన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించారు. వంటగది, భోజనశాల, టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూశారు. విద్యార్థుల ఆరోగ్యం శారీరక అభివృద్ధి దృష్ట్యా ఆహారంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటగది ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. పీవో వెంట డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ, ప్రధానోపాధ్యాయురాలు అనూష, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిర్మల్
‘బాసర’కు భద్రత కావాలి బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుస చోరీలు భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టాయి. నిర్మల్ఖిల్లా: ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో జిల్లా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డైట్ లెక్చరర్ల నియామకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక కేంద్రం బ్యాంకింగ్, రైల్వే, ఎస్సెస్సీ వంటి విభాగాల్లో ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. పోటీ పరీక్షల సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. స్టడీ సర్కిల్స్ లేక.. చదువులతల్లి జ్ఞాన సరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్. మొత్తం జనాభాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ. మెజారిటీ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుదీర్ఘంగా నస్నద్ధం అవుతున్నారు. అయితే కోచింగ్ కోసం హైదరాబాద్, వరంగల్ వెళ్లే స్థోమత లేని వారు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా నిరుద్యోగులు దశాబ్దకాలంగా కోరుతున్నారు. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. ప్రైవేట్ కోచింగ్ భారం ప్రైవేట్ కోచింగ్ సెటర్లు ఒక్కో జాబ్ కోచింగ్కు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. వసతి, భోజనం, ప్రయాణ ఖర్చులతో కలిపి లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతోంది. రైతు, కూలీ, చిరు వ్యాపారుల కుటుంబాల యువతకు ఈ ఖర్చు భారంగా మారుతోంది. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేక పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారు. గ్రంథాలయాల్లో సౌకర్యాల కొరత జిల్లా కేంద్రం, మండలాల్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలు లేవు. స్టడీ మెటీరియల్ కూడా చాలా గ్రంథాలయాల్లో అందుబాటులో లేదు. సీటింగ్ సామర్థ్యం పరిమితంగా ఉంది. తాజా పుస్తకాలు తక్కువ, డిజిటల్ లెర్నింగ్, ఇంటర్నెట్ సౌకర్యం లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు చదవడానికి సమయం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు చొరవ చూపితే.. జిల్లాలో బీసీ,ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోటీ పరీక్షల్లో గ్రామీ ణ యువత సత్తా చాటేందుకు, పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులు 26 వేలు(సుమారు) రెవెన్యూ గ్రామాలు 400 తక్షణమే ఏర్పాటు చేయాలి... విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు తక్షణమే జిల్లాలో ఏర్పాటు చేయాలి. స్థానిక డిమాండ్ మేరకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. పీడీఎస్యూ విద్యార్థి సంఘం తరఫున కూడా ఇదే అంశంపై సాధనదిశగా పోరాటం చేస్తాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని స్టడీ సర్కిల్ ఏర్పాటయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. – సింగరి వెంకటేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి.. జిల్లాలోని నిరుద్యోగులకు స్టడీ సర్కిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి సుదూరప్రాంతాలకు వెళ్తున్నారు. నిరుపేద నిరుద్యోగులకు కోచింగ్ భారంగా మారుతోంది. ఉద్యోగాల సాధనలో వెనుకబడుతున్నారు. జిల్లా జనాభాలో 70 శాతం బీసీ జనాభా ఉంది. బీసీ స్టడీ సర్కిల్ లేకపోవడంతో బీసీ యువత నష్టపోతోంది. ప్రజాప్రతినిధులు బీసీ స్టడీ సర్కిల్తోపాటు, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి. – ఎంబడి చంద్రశేఖర్, బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు ‘వెండింగ్జోన్లు’ అవసరం.. పట్టణాల్లో చిరు వ్యాపారులనూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. వారికంటూ ప్రత్యేకంగా విక్రయ ప్రాంతాలను స్థానిక సంస్థలు చూపాల్సి ఉంటుంది. జిల్లాలో అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఉపాధి కోసం వారంతా రహదారులు, ఫుట్పాత్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి జీవనోపాధి కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు పాదచారులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్థానిక సంస్థలు ప్రత్యేక వెండింగ్జోన్లను ఏర్పాటు చేయాలి. విధులు సమర్థవంతగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్:కలెక్టరేట్లో అన్నివిభాగాల అధి కారులు విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించా రు. కలెక్టరేట్ సమావేశమందిరంలో వివిధ శాఖ ల సూపరింటెండెంట్లు, అధికారులతో గురువా రం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యమైనది గా పరిగణించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజావాణిలో స్వీకరించే ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలన్నారు. భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులు 60 రోజు ల్లో పరిష్కరించాలన్నారు. ప్రతీ విభాగానికి సంబంధించిన రికార్డులను క్రమం తప్పకుండా పరి శీలించి, సక్రమంగా భద్రపరచాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతీ విభాగం పరిధిలో ని ఉద్యోగుల వివరాలు, పెండింగ్ అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలన్నా రు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. మండలాలు 19 ప్రత్యేక శిక్షణ అవసరం.. నేటి పోటీ పరీక్షల్లో పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోదు. సిలబస్పై లోతైన అవగాహన, రోజువారీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ పరీక్షలు, మాక్ టెస్టులు, నెగెటివ్ మార్కింగ్, సమయ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందిస్తే గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా బ్యాచ్ల వారీగా కోచింగ్ ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రి, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ మాక్ టెస్టులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిపుణులతో ఉచిత కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూ శిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా వివరాలు.. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
భైంసాటౌన్:పట్టణ శివారులోని పార్డి(బి) బైపాస్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మున్సి పల్ చైర్మన్ తూముల దత్తాత్రితో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని గురువారం పరిశీలించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన చే తుల మీదుగా ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చే యాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు ఇతర మౌలిక వసతులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కుభీర్ చౌరస్తా వద్ద డివైడర్ను పరిశీలించారు. డివైడర్ తొలగింపు, నూతన రోడ్డు నిర్మాణంపై మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి కలెక్టర్కు వివరించారు. దీంతో ఆయన నివేదిక పంపించాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, మున్సిపల్ కమిషనర్ లింగయ్య, ఆర్అండ్బీ ఈఈ సుభాష్, డీఈఈ సునీల్ ఉన్నారు. -
డీజీపీని కలిసిన శ్రీహరిరావు
నిర్మల్చైన్గేట్:రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీవీ.ఆనంద్ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యేక ట్రాఫిక్ పోలీస్స్టేషన్తోపాటు, అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన డీజీపీ నిర్మల్ పట్టణ అవసరాలను పరిశీలించి త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తోపాటు మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శ్రీహరిరావు తెలిపారు. -
ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే..
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ నుంచి డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) వరకు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ శాఖలో రెండున్నర నెలల క్రితమే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలతోపాటు డిప్యూటీ కమిషనర్ (డీసీ) వరకు ప్రమోషన్ లభించింది. అప్పుడు వారు పోస్టింగ్లో ఉన్న స్థానంలో కొనసాగించారు. తాజాగా బదిలీలు చేపట్టి ప్రమోషన్ పొందిన వారికి పోస్టింగ్ కల్పించా రు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.హరికిరణ్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్గా జి.జనార్దన్రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ప్రమోషన్ పొందిన ఆయన తాజాగా ఆదిలాబాద్ డీసీగా రానున్నా రు. హైదరాబాద్ డీసీ కార్యాలయం రెగ్యులర్ అధికారిగా ఉండి ఆదిలాబాద్ ఇన్చార్జి డీసీగా వ్యవహరించిన రఘురాం స్థానంలో జనార్దన్రెడ్డిని నియమించారు. ఇదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టును భర్తీ చేశారు. హన్మకొండ–1 టీజీబీసీఎల్లో ఏసీగా వ్యవహరిస్తున్న కె. రాజ్యలక్ష్మి ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా ని యమితులయ్యారు. గతంలో ఆమె ఆదిలాబాద్, కు మురంభీం ఆసిఫాబాద్ డీపీఈవోగా పని చేశారు. పర్యవేక్షణ పటిష్టమయ్యేనా? ఎకై ్సజ్ శాఖలో తాజాగా డిప్యూటీ కమిషనర్ను రె గ్యులర్ అధికారిని నియమించారు. కొంత కాలంగా ఇన్చార్జీలతో నెట్టుకొచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పోస్టు ఖాళీగానే ఉండగా, తాజాగా ప్రమోషన్లతో భర్తీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్లోని ఏఈఎస్ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా, త్వరలో భర్తీచేసే అవకాశముంది. సరైన పర్యవేక్షణ లేక జిల్లాలో గంజా యి, గుడుంబా కేసులు పెరిగాయి. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకపోయిందన్న విమర్శలున్నాయి. తాజా గా ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం, ఇప్పటికే కొందరిని నియమించడంతో ఎక్సైజ్ శాఖలో పర్యవేక్షణ పటిష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కొత్త డీపీఈవోలు వీరే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు డీపీఈవో పోస్టులకు కొత్త అధికారులు నియమితులయ్యారు. నల్గొండలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.కిష న్ను ఆదిలాబాద్కు, బి.చాణక్యను మంచిర్యాల కు, భూపాలపల్లి నుంచి వి.శ్రీనివాస్ను నిర్మల్ కు, సూర్యపేట నుంచి కుమురంభీం ఆసిఫా బాద్కు జిల్లాకు లక్ష్మనాయక్కు బదిలీలతో పా టు పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు డీపీఈవోలు గా వ్యవహరించిన హిమశ్రీ ఆదిలాబాద్ నుంచి సిరిసిల్లకు, ఎంఏ రజాక్ నిర్మల్ నుంచి ఎల్బీనగర్కు, కేజీ నందగోపాల్ మంచిర్యాల నుంచి నిజామాబాద్కు, జ్యోతికిరణ్ కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ప్రమోషన్ కల్పిస్తూ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్కు ఏసీగా నియమించారు. -
ప్రీ ప్రైమరీకి స్పందన
● జిల్లాలో 1,052మంది విద్యార్థుల చేరికనాణ్యమైన బోధన అందిస్తాం జిల్లాలో నూతనంగా 74 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాం. 1,052 మంది విద్యార్థులు చేరారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రీ ప్రైమరీ తరగతులు పాఠశాలల్లో ప్రారంభించారు. అనుమతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకుంటాం – భోజన్న, డీఈవో మామడ: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేక విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని విద్యాశాఖ గుర్తించింది. ఈ ఏడా ది నుంచి జిల్లాలో 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించింది. దీంతో పోషకులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,052 మంది పిల్లలు చేరారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా ఏర్పాటు ఈ ఏడాది 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది 14 పాఠశాలలు ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో సొంత డబ్బులతో ప్రీ ప్రైమరీ తరగతిని షురూ చేశారు. మామడ మండలంలోని కమల్కోట్ ప్రాథమికోన్నత పాఠశాల, సారంగపూర్ మండలంలోని వైకుంఠపూర్ పాఠశాల, భైంసా మండలంలోని మంగ్రి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. వీడీసీ, సర్పంచుల ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్టర్, ఆయాలను నియమించి ప్రతినెలా గౌరవవేత నం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ తరగతులను ఆయా గ్రామాల సర్పంచులు, మండల విద్యాధికారులు ప్రారంభించారు. దీంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. -
గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన
నిర్మల్చైన్గేట్: దేశంలో బీజేపీ సర్కార్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఛాత్రోన్ కీ గూంజ్కు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. బొజ్జు పటేల్ మాట్లాడు తూ.. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతం, యువత భవిష్యత్ రక్షణ రాహుల్ గాంధీ బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, అన్ని అనుబంధ సంఘాలు ప్రతీ గ్రామంలో ఛాత్రోన్కీ గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష ప్రత్యేకాధికారి ఇలంబర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా శాఖల వారీగా చేపట్టిన పనులపై ఏర్పా టు చేసిన ఫొటో గ్యాలరీని కలెక్టర్, అధికారులతో కలిసి తిలకించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు 99రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. ముందుగా ఇలంబర్తికి కలెక్టర్ భవేశ్ మిశ్రా అటవీశాఖ వసతిగృహంలో పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమష్టి కృషితోనే విజయవంతం ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం, అధికారుల కృషితోనే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ, వార్డు సభలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, అరైవ్ అలైవ్, రైతు, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్య, సాంస్కృతిక, పర్యావరణ వారోత్సవాల పేరిట విస్తృత కార్యక్రమాలు చేపట్టామన్నా రు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి అధికారులంతా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
బాసరకు పోటెత్తిన భక్తులు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలి నిర్మల్టౌన్: నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలోని పెండింగ్ కేసుల పురోగతిపై జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసి, అవసరమైన ఆధారాలు సేకరించి త్వరగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంగా పరిష్కరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం జరగకుండా ప్రతీ కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలని భా విస్తోంది. ఇదే లక్ష్యంతో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భా గంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబి తాల ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఈనెల 25నుంచి సర్ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరు నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాల్లో ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే అధికారులు ఒకచోట తొలగించనున్నారు. తప్పులతడకగా 1,45,819 ఓట్లు నిర్మల్, ఖానాపూర్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,55,344 మంది ఓటర్లున్నారు. ఇందులో 6,09,525 (80.70 శాతం) మంది ఓట ర్ల మ్యాపింగ్ ప్రక్రి య పూర్తయింది. ఇంకా, నిర్మల్, ముధోల్, ఖానా పూర్ నియోజకవర్గాల్లో 1,45,819 మంది ఓట్లు తప్పులతడకగా ఉన్నాయి. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 25నుంచి ఓటర్ల ఎన్యూమరేషన్ నూతన ఫొటో ఓటరు జాబితాలు తయారు చేస్తారు. ఉద్దేశం ఏమిటంటే? ఇది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులందరి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం. చనిపోయి న వారు, డూప్లికే ట్, శాశ్వతంగా తరలిపోయినవారు, అనర్హుల పేర్లను ఓట రు జాబితా నుంచి తొలగించి, అర్హుల పేర్లు మాత్ర మే చేర్చే ప్రత్యేక కార్యక్రమం. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీ లిస్తారు. ఓటర్లు భర్తీ చేసిన ఎన్యూమరేషన్ (గణన) ఫారాలను పాత ఓటరు డేటాతో పోల్చి చూస్తారు. 1951నుంచి 2004 మధ్య కాలంలో ఎనిమిది సార్లు ఇలాంటి కసరత్తు చేశారు. జిల్లాలో చివరిసారిగా 2001–2004 మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. లింక్ తప్పనిసరి ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందు కు ఓటరు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎపిక్ (ఓటరు గుర్తింపు) ఐడీతో లింకై ఉండాలి. ఓటరు ఐడీ, ఆధార్కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరి పోవాలి. పేరులో స్పెల్లింగ్ తేడాలు ఉంటే డిజిటల్ ఈ–సైన్స్ ప్రక్రియ విఫలమయ్యే అవకాశముంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. షెడ్యూల్ ఇలా.. వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం లాంటి సమస్యలున్నాయి. వాటిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం సర్కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25నుంచి ‘సర్’ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటరు వివరాలు సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అ లాగే, ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మా ర్పులు–చేర్పులు చేయించుకోచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఇలా.. -
కోరిన చోటకు బస్సులు
నిర్మల్టౌన్: ప్రయాణికులు కోరిన చోటకు ఆర్టీ సీ బస్సులు నడుపుతున్నామని నిర్మల్ డిపో మేనేజర్ పండరి పేర్కొన్నారు. బుధవారం ని ర్మల్ బస్టాండ్ నుంచి గోవాకు బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నిర్మల్ నుంచి బయలుదేరిన బస్సు నాందేడ్లోని గురుద్వార్, తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్ మీదుగా గోవాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ టూర్ మొత్తం ఐదురోజులు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తె లిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, జూ లై 5న అరుణాచలం, శ్రీరంగం, పలని, మధు రై, రామేశ్వరం, కంచి, శ్రీకాళహస్తికి సూపర్ లగ్జరీ బస్సు వెళ్తుందని ఆయన తెలిపారు. -
‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం
● పార్టీల ప్రతినిధులతో సమావేశంనిర్మల్చైన్గేట్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశమై మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వివరా లను సమగ్రంగా వివరించారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వా రా ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపా రు. వివరాల పరిశీలన తర్వాత ఎస్ఐఆర్కి సంబంధించి జూలై 31వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫారాలు నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్)తో ఈఆర్వోలను సంప్రదించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ప్రతీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బీఎల్వోలను నియమించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బీఎల్వోలు, బీఎల్ఏలతో సమావేశం నిర్వహించాలని, ఎస్ఐఆర్ నిర్వహణలో బీఎల్ఏలు తమవంతు సహకారం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవోలు దేవీదాస్, మోహన్సింగ్, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోతుల పునరావాస కేంద్రం తనిఖీ సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోగల కోతుల పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటివరకు చేసిన, చేయాల్సిన కు టుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు వై ద్యుడు శ్రీకర్రాజును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్లు పూర్తయ్యాక కోతులను ఎక్కడ వదిలిపెడుతున్నారని ఎఫ్డీవో నాగినిభానును ప్రశ్నించగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదులుతున్నట్లు ఆమె బదులిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబడే, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఆర్వోలు సంతోష్, నజీర్ఖాన్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సబ్ జూనియర్ జిల్లా స్థాయి ఆత్యపాత్య క్రీడా ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించారు. 100మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు జూలై 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి భూమన్న, సంజీవ్ తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు రమణారావు, అన్నపూర్ణగౌడ్, బుచ్చి రామారావు, నచ్చేందర్, కోచ్ సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు అవగాహన కోసమే విత్తన మేళాలు
● ఎమ్మెల్యే, వెడ్మబొజ్జుపటేల్ కడెం: నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా రైతుల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విత్తనమేళాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాకు హాజరై మాట్లాడారు. రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేలురకం విత్తనాలనే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజామొయినుద్దీన్, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఏడీఏ సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సతీశ్రెడ్డి, సర్పంచులు దీకొండ విజయ్, ఈదుల తిరుపతి, రమేశ్, ఆర్టీఏ మెంబర్ మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు వాజీద్ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, యూత్కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మల్లేశ్యాదవ్, ఉద్యానవన క్లస్టర్ అధికారి స్పందన, ఏవో దినేశ్, ఏఈవోలు పాల్గొన్నారు. -
బాసర ఆలయంలో భారీ చోరీ
సాక్షి, నిర్మల్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని పైఅంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు. ఆలయ గేటును పగులగొట్టి మరీ చోరీకి పాల్పడటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ముందుగా గుడ్డలు కప్పిన దుండగులు అనంతరం మహంకాళి ఆలయ తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న వెండి కిరీటం, హుండీని తీసుకెళ్లి నగదును కాజేసిన తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి పరారైనట్లు గుర్తించారు.మంగళవారం తెల్లవారుజామున పూజలు, అభిషేక కార్యక్రమాల కోసం ఆలయ సిబ్బంది వెళ్లగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ తలుపులు పగిలి ఉండటాన్ని గమనించిన అర్చకులు, సిబ్బంది లోపల పరిశీలించగా వెండి కిరీటం, హుండీ కనిపించకపోవడంతో వెంటనే దేవస్థాన అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఆ సమయంలో ఆమె వెంట భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, సమ్మయ్య, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులు ఉన్నారు. చోరీ జరిగిన తీరుతెన్నులు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఘటనపై క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఆలయ భద్రత కోసం రాత్రి వేళల్లో ఆరుగురు హోం గార్డులు విధుల్లో ఉన్నప్పటికీ దుండగులు చాకచక్యంగా చోరీకి పాల్పడటం భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆలయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిఘాను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.కేసు ఛేదన కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసర ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. -
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
లక్ష్మణచాంద:భూముల రీసర్వే, సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే తీరును సోమవారం పరిశీలించారు. ముందుగా మల్లాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలకు రెవెన్యూ మ్యాపులు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, రీసర్వేతో గ్రామాల రెవెన్యూ మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. అధునాతన కొలతల యంత్రాల సామగ్రిని ఉపయోగించి సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం మాచాపూర్, చామన్పెల్లి గ్రామాల్లో సర్వే తీరును పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. సర్వే తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ విఠల్రావు ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మల్చైన్గేట్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో దశలో మంజూరైన ఇళ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇళ్లు, ఎంపీడీవో లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్కు పంపిన ఇళ్లు, ఇతర వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తెలిపారు. అనుమతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆదర్శ పాఠశాలల రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. సోమవారం స్థానిక ఆదర్శ పాఠశాలను సందర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని అన్ని పాఠశాలను టీపీఎస్ స్కూళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్య అందుతుందన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూఐడీసీ పి.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ రవీందర్, నిజామాబాద్ సర్కిల్ డీఈ గంగాధర్గౌడ్, ఏఈ మహేశ్కుమార్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు ఉన్నారు. -
నమ్మకం ఎక్స్పైరీ
నిర్మల్: నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అని ఓ సినీకవి అప్పటి ఆస్పత్రుల పరిస్థితులను చూసి పాట రాశారు. అయితే ప్రస్తుతం ప్రైవేటులో ఖరీదైన వైద్యంతో మధ్య తరగతి వాళ్లు కూడా ప్రైవేటుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా సర్కారు దవాఖానాల్లో సౌకర్యాలు కల్పిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన నుంచి ప్రభుత్వాస్పత్రులు మెరుగవుతూ వస్తున్నాయి. అయితే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా పెద్దాస్పత్రిలోనే వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కలెక్టర్ స్వయంగా కంటి పరీక్షకు వెళ్లినప్పుడు కాలం చెల్లిన ఔషధం ఇవ్వబోయారు. జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు గతంలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన సైలెన్లు, సిరంజీలు బయటపడ్డాయి. దీంతో సాధారణ రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగుల నమ్మకం, అధికారుల బాధ్యత ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు వచ్చేవారిలో ఎక్కు వ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలవారే. వా రు ‘పెద్ద ఆస్పత్రి దిక్కు’ అని నమ్ముకుని వస్తారు. వైద్యులు, సిబ్బంది మందులు పంపిణీ చేసే ముందు వాటి తయారీ తేదీ, గడువు తేదీని తప్పక పరిశీలించాలి. ఉన్నతాధికారులు కూడా నిల్వ, పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలి. ఈ ప్రాథమిక జాగ్రత్తలు పాటించక.. సర్కారు ఆస్పత్రులపై నమ్మకమే ఎక్స్పైరీ అవుతోంది. ఎవరు బాధ్యులు.. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు కాలం చెల్లిన మందులు ఇస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆస్పత్రి లేదా అవుట్పేషెంట్ విభాగంలో ఉన్న మందుల జాబితా, వాటి గడువు వివరాలు క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఔషధాల నిల్వ, పంపిణీలో సరైన పర్యవేక్షణ లోపించ డం, వైద్యులు కూడా వాటిని పరిశీలించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పేషెంట్ల పరేషాన్.. ప్రభుత్వ దవాఖానాలను నమ్ముకుని వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. ‘డాక్టర్ ఇచ్చిన మందు కాబట్టి వాడుతున్నాం. అది కాలం చెల్లినదైతే మా ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. రోగులను ఇలా ఇబ్బంది పెట్టొద్దని, ఇప్పటికై నా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని వేడుకుంటున్నారు. నాణ్యమైన వైద్యం, మందులు అందేలా.. జిల్లా జనరల్ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యసేవలు, మందులను అందిస్తున్నాం. ఇటీవల జరిగిన ఘటనకు కారణాలు తెలుసుకున్నాం. సదరు వైద్యుడిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాం. –డాక్టర్ గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్కలెక్టర్ తనిఖీలు జిల్లా జనరల్ ఆస్పత్రిని శనివారం కలెక్టర్ భవేశ్ మిశ్రా వెళ్లారు. వైద్యుడు కాలం చెల్లిన కంటి మందు వేయబోయాడు. కలెక్టర్ ఒకసారి పరిశీలించి ఎక్స్పైరీ అయినట్లు గుర్తించారు. వెంటనే వివరణ ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆస్పత్రిలోని అన్ని ఔషధాల కాలపరిమితి వివరాలను పూర్తిగా చెక్ చేయించారు. ఆ కాలం చెల్లిన మందు గతంలో పనిచేసిన ఓ వైద్యుడు తీసుకువచ్చినట్లు తేలింది. ప్రస్తుత వైద్యుడు దాని గడువు తేదీ చూసుకోలేదు. ఇది కూడా విధుల్లో నిర్లక్ష్యమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన వైద్యంతోపాటు మందులు అందిస్తేనే రోగుల్లో భరోసా పెరుగుతుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. -
నిర్మల్
7సర్ పకడ్బందీగా చేపట్టాలి భైంసాటౌన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఎల్వోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 25 నుంచి క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి చేపట్టాల్సిన సర్ నిర్వహణ, విధి విధానాలు తదితర అంశాలను వివరించారు. ఎన్యుమరేషన్ ఫారాల అందజేత, వివరాల నమో దు, తిరిగి స్వీకరణ, ముసాయిదా జాబితా, తుదిజాబితా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శశిభూషణ్ పాల్గొన్నారు. బాసరలో నేడు 2కె రన్బాసర: ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు బాసరలో మంగళవారం ఉదయం 6 గంటలకు 2కె రన్ నిర్వహించనున్నారు. గోదావరి పుష్కర ఘాట్ నుంచి శ్రీజ్ఞా న సరస్వతి అమ్మవారి ఆలయం వరకు ఈ రన్ కొనసాగుతుంది. కార్యక్రమానికి కలెక్టర్ భవేశ్మిశ్రా హాజరవుతారు. కలెక్టర్ వెంట బాసర తహసీల్దార్ పవన్చంద్ర కోరారు. భైంసాటౌన్: లాభాలు ఆర్జించడానికి విద్య వ్యాపారం కాదని, అది ప్రజల ప్రాథమిక హక్కు అని విద్యాశాఖ నిబంధనలు చెబుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండాలని, వ్యాపార ధోరణి అవలంభించొద్దని పేర్కొంటున్నాయి. అయితే, ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్య వ్యాపారంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాఠశాలల్లోనే పాఠ్య, నోటు పుస్తకాలు, విద్యార్థులకు యూనిఫాంలు, స్టేషనరీ, షూ, టై, బెల్టులు సైతం విక్రయిస్తున్నాయి. వీటికితోడు బస్ చార్జీలు, స్పెషల్ ఫీజులు సరేసరి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన సందర్భాల్లో అధికారులు నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలపై పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో అధిక ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ సైతం అధిక ధరలకు విక్రయంతో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువు కొనాల్సి వస్తోంది. పాఠశాలల్లోనే దుకాణాలు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దీంతో జిల్లా కేంద్రం నిర్మల్తోపా టు భైంసా, ఖానాపూర్, దాదాపు అన్ని మండలకేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ‘దుకాణాలు’ ప్రారంభించాయి. విద్యార్థులకు అవసరమైన ప్రతీ వస్తువును ‘స్కూల్ స్టాండర్డ్’ పేరుతో విక్రయిస్తున్నాయి. బయట మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులు పాఠశాలల్లో అధిక ధరలకు అంటగడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఎన్ని విమర్శలున్నా యాజమాన్యాలు పెడచెవిన పెడుతూ తమ వ్యాపార ధోరణి వీడడం లేదు. కొందరు తాము చెప్పిన దుకాణం నుంచి మాత్రమే బుక్స్, యూనిఫాంలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ స్థాయిలో విద్యను వ్యాపారం చేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాపారుల ఉపాధికి గండి.. పాఠశాలల్లో దందాతో కొన్నేళ్లుగా పుస్తకాలు, స్టేషనరీ దుకాణాలతోపాటు యూనిఫాంలు కుట్టే దర్జీలు, విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లే ఆటో వాలాలు, షూలు అమ్మే ఫుట్వేర్ షాపుల యజమానులు ఇలా విద్యార్థులకు సంబంధించి ప్రతీ వస్తువు అమ్మే దుకాణదారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. బుక్స్టోర్లు మూతపడినవి ఎన్నో ఉన్నాయి. పాఠశాలలే నేరుగా అమ్మకాలు చేపట్టడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ చర్యలేవి..? జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, స్టేషనరీ, యూనిఫాంల విక్రయం చేస్తున్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల భైంసాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తుండడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేశారు. జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో తనిఖీలు జరిపి పాఠశాలల్లో ‘దందా’పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రైతు వేదికల్లో విత్తన మేళాలు
నిర్మల్చైన్గేట్: వ్యవసాయ సమాచారం, పథకాలు, సేవలను రైతులకు చేరువలో అందించేందుకు రైతు వేదికలు కీలకంగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా నిర్ణయించి, ప్రతీ క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని (ఏఈవో) నియమించారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించి, సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరల వివరాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేటి నుంచి విత్తన మేళాలు.. మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని 22 రైతు వేదికల్లో ఒక్కో వేదికకు ఒక స్టాల్ చొప్పున మొత్తం 22 స్టాళ్లు నెలకొల్పుతారు. ఈ స్టాళ్లు వారం రోజులపాటు కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, విత్తన కంపెనీలు, స్థానిక విత్తన డీలర్ల సహకారంతో ఈ స్టాళ్లను నిర్వహిస్తారు. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, రవాణా భారం తగ్గుతుంది. స్టాళ్లలో అందుబాటులో ఉండే వస్తువులు.. ప్రతీ రైతు వేదికలో ఏర్పాటు చేసే స్టాళ్లలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. వీటిలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44 వంటి వరి విత్తనాలు, తణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెసర, కంది, మినుము, వేరుశెనగ, నువ్వులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు ఉంటాయి. అలాగే నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉంచుతారు. రైతులు నేరుగా స్టాళ్లను సందర్శించి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 79 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో ఏఈవోలు రైతులకు అవసరమైన సేవలు అంది స్తున్నారు. జిల్లాలో సుమారు 1.98 లక్షల మంది రై తులు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రైతు భరోసా, రైతు బీమా, యంత్ర పరికరాలపై సబ్సిడీ పంపిణీ వంటి పథకాల అమలును రైతు వేదికల నుంచే నిర్వహిస్తారు. పంటల సాగులో మెలకువలు, వాతావరణ సూచనలపై సలహాలు కూడా ఇక్కడి సదస్సుల ద్వారా అందిస్తారు. స్టాళ్లను సద్వినియోగం చేసుకోండి జిల్లాలో ఈనెల 23న 22 రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లను వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయనున్నాం. ఆయా స్టాళ్లలో రైతులకు అవసరమైన విత్తనాలతోపాటు ఎరువులు అందుబాటులో ఉంచుతాం. నేరుగా రైతులు సందర్శించి అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 79 రైతు వేదికల్లో కూడా ఈ సేవలు వారంలో అందుబాటులోకి తెస్తాం. – అంజిప్రసాద్, ఏడీఏ, నిర్మల్ నేడు స్టాళ్లు ఏర్పాటు చేయనున్న రైతు వేదికలు ఇవే.. మండలం రైతు వేదిక భైంసా కామోల్ ఖానాపూర్ సత్తెనపల్లి కడెం కడెం పెంబి పెంబి దస్తురాబాద్ దస్తురాబాద్ కుంటాల కుంటాల ముధోల్ కారేగాం నర్సాపూర్(జి) నర్సాపూర్(జి) నిర్మల్ రూరల్ అక్కాపూర్ నిర్మల్ రూరల్ చిట్యాల్ తానూర్ తానూర్ మామడ మామడ కుభీర్ కుభీర్ లోకేశ్వరం లోకేశ్వరం నిర్మల్ అర్బన్ నిర్మల్ అర్బన్ సోన్ సోన్ లక్ష్మణచాంద లక్ష్మణచాంద లక్ష్మణచాంద కనకాపూర్ సారంగాపూర్ సారంగాపూర్ సారంగాపూర్ పొన్కూర్ దిలావర్పూర్ దిలావర్పూర్ బాసర బాసర -
ధాన్యంలో కోతపై నిరసన
ఖానాపూర్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలో నుంచి అక్రమంగా కోతలు విధింయడంతోపాటు ధాన్యం డబ్బులు చెల్లించడంలో జాప్యంపై రైతుల ఆందోళన చేపట్టారు. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దోపిడీని నిరసిస్తూ గ్రామంలోని రైతులు నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి మద్యాహ్నం వరకు రాస్తారోకో చేశారు. కేంద్రం నిర్వాహకులతోపాటు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం, డబ్బుల చెల్లింపులో రైతులు నష్టపోతున్నారన్నారు. హమాలీ, లారీల్లో లోడింగ్, అన్లోడింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా అదనపు వసూల్లు చేశారని తెలిపారు. దీంతో క్వింటాల్కు రూ.45 అదనపు నష్టం జరిగిందన్నారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల 400 గ్రాముల చొప్పున తూకం వేసినప్పటికీ బిల్లులు ఇచ్చే క్రమంలో 38 కిలోల చొప్పున లెక్కిస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు 10 కిలోలు కోత విధిస్తున్నారని తెలిపారు. రైతులకు పూర్తిస్థాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్ సుజాత అక్కడి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా కేంద్రానికి వాహనాల్లో వెళ్లి కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతి పత్రాలు ఇచ్చారు. -
‘బుల్డోజర్’కు బ్రేక్ ఎందుకో!
నిర్మల్: ‘ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు.. ఏళ్లుగా చెరపట్టిన అసైన్డ్ భూములను ఇప్పటికై నా స్వాధీనం చేసుకుంటున్నారు..’ అంటూ జిల్లావాసులు అధికారుల పని తీరుపై అభినందనలు కురిపించారు. కానీ.. రూ.కో ట్ల విలువ చేసే అసైన్డ్భూముల ఆక్రమణల లెక్కను మధ్యలోనే ఆపేశారు. దీంతో అప్పుడు మెచ్చుకున్న జిల్లావాసులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికా రుల తీరుపై ప్రశ్నిస్తున్నారు. ‘అసైన్డ్’ పేరిట భూస్వాహా.. జిల్లాకేంద్రంలోని దివ్యనగర్, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్ భూములను బడాబాబులు చెరబట్టా రు. ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్లో 29.03 ఎకరాల్లో అసైన్డ్ పోనూ మిగతా 2.20ఎకరాల ప్రభుత్వభూమిని ఓ పార్టీకి చెంది న బడా నేత కబ్జా పెట్టాడు. తమ భూమితోపాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగ డలు కట్టేశాడు. అక్కడి కుంటనూ క్రమంగా మాయం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొ న్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చా యి. అప్పట్లో ఆ ‘బడానేత’ అధికారపార్టీలో ఉండటంతో జిల్లా అధికారులూ ఏం చేయలేకపోయారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కదిలి.. గత అక్టోబర్లో ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి 534 సర్వేనంబర్లోనే స్వయంగా అప్పటి కలెక్టర్ అభిలాషఅభినవ్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సమక్షంలోనే ఫిర్యాదు చేయగా రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు అదేరోజు బుల్డోజర్ తెప్పించి మల్ల న్నగుట్ట అయ్యప్ప గుడి ఎదురుగా ప్రభుత్వ భూమి లో చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు. బ్రేక్ ఎందుకు వేసినట్లు..! ప్రభుత్వ భూములను కబ్జా పెడుతూ ప్రజావసరా లకు కనీసం భూమిలేకుండా చేయడంపై ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సీరియస్ కావడం, అప్పటి కలెక్టర్ వెంటనే స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ.. ఆక్రమణల తొలగింపు చేపట్టిన బుల్డోజర్కు కొన్నిరోజులకే బ్రేక్ పడింది. కూల్చేసిన ఆక్రమణల చోట యథావిధిగా మళ్లీ అడ్డుగోడలు కట్టేశారు. ఈ కూల్చివేతలను ఆపిందెవరూ..! బుల్డోజర్ను అడ్డుకున్నదెవరూ..? అన్న ప్రశ్నలు అప్పట్లోనే వచ్చాయి. అప్పుడు మున్సిపల్ ఎన్నికల పనులు ఉండటంతో జిల్లా అధికారులతో పాటు సదరు ప్రజాప్రతినిధులూ అందులో బిజీగా మారారు. ఎన్నికల తర్వాతైనా రెవెన్యూ అధికారులు చర్యలు చేపడతారేమోనని అంతా ఎదురుచూశారు. కానీ.. అప్పటి కలెక్టర్ బదిలీకావడం, ప్రజాప్రతినిధులూ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడంతో కబ్జాల తొలగింపులో కదలిక లేకుండాపోయింది. రూ.కోట్ల భూములు కొల్లగొడుతూ.. జిల్లాకేంద్రమైన తర్వాత నిర్మల్లో భూముల విలు వ ఆకాశాన్నంటుతోంది. ఎకరం రూ.కోట్లలో పలు కుతోంది. ఇక ఏఎన్రెడ్డి కాలనీ, దత్తాత్రేయనగర్, దివ్యనగర్ లాంటి ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్ ధర రూ.60లక్షల వరకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ విలువైన ఏరియాలోని 534 సర్వేనంబర్లోగల ప్రభుత్వ భూములను బడా నేతలు కబ్జాపెడుతున్నారు. అయ్యప్ప టెంపుల్ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వేనంబర్లలో అసైన్డ్ భూ ముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేశారు. ము న్సిపల్ టౌన్ప్లానింగ్లో ఉన్న రోడ్లనూ మాయంచే సి, ప్లాట్లు అమ్మేశారు. ఇక్కడ అసైన్డ్ భూములు బ డాబాబులకు ఎలా కేటాయించారు? వాటిల్లో నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఎలా ఇచ్చారు? అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అన్న వివరా ల కోసం కొందరు ఆర్టీఐలు పెట్టినా అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఇప్పటికై నా అసైన్డ్ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. వేరే శాఖలకు కేటాయించాం జిల్లాకేంద్రంలోని 534 సర్వేనంబర్లో అసైన్డ్ పోనూ మిగతా ప్రభుత్వ భూమిని గుర్తించాం. గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఉన్నతాధికారుల సూచన మేరకు సదరు భూమిని ఇతర శాఖలకు కేటాయించనున్నారు. – రాజు, తహసీల్దార్, నిర్మల్ అర్బన్ -
ఉద్యాన సాగు.. రైతుకు మేలు
లక్ష్మణచాంద: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తోంది. సబ్సిడీలు ఇస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తోంది. ఇదివరకు పామాయిల్ సాగు చేసిన రైతులకు మాత్రమే డ్రిప్ పరికరాలపై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మరిన్ని పంటలకూ సబ్సిడీ ఇస్తోంది. దీంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రాయితీలు పొందుతున్నారు. పండ్ల తోటల సాగుకు ఇలా.. మామిడి సాగు చేసే రైతులకు ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 చొప్పున ఒక్కో రైతుకు 10ఎకరాల వరకు అందిస్తోంది. అరటి సాగు చేసే రైతుల కు మొదటి ఏడాది రూ.16,800, రెండో సంవత్స రం రూ.4వేలు ఇస్తోంది. బొప్పాయి సాగు చేసే రై తులకు మొదటి ఏడాది రూ.7,200, రెండో ఏడాది రూ.3,200 అందజేస్తోంది. జామ సాగు చేసే రైతులకు మొదటి ఏడాది రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 ఇస్తోంది. డ్రాగన్ ఫ్రూ ట్కు మొదటి ఏడాది రూ.64,800, రెండు, మూడో సంవత్సరాలకు రూ.12,800 చొప్పున చెల్లిస్తోంది. కూరగాయలు, పూల సాగు, ఇతరాలకూ.. హైబ్రిడ్ కూరగాయల నారుకు రూ.9,600, ఉల్లికి రూ.8వేలు, విడి పూల (బంతి, చామంతి, కనకాంబరం, మల్లె) సాగుకు ఎకరాకు రూ.8వేలు ఇస్తోంది. దుంప జాతి పూల సాగుకు (ట్యూబ్రోజ్, గ్లాడియోలస్, లిల్లీ) ఎకరాకు రూ.40వేల చొప్పున ఐదెకరాల వరకు అందజేస్తోంది. అల్లం, వెల్లుల్లి, పసుపు పంటలకు ఎకరానికి రూ.16వేల చొప్పున ఐదెకరాల వరకు రాయితీ ఇస్తోంది. వీటితో పాటు సుగంధ ద్రవ్యాలు, మల్చింగ్ సాగు విధానం, నీటి కుంటలకూ సబ్సిడీ అందజేస్తోంది. జిల్లాలో ఉద్యాన పంటల సాగు ఇలా.. సంవత్సరం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) 2021–22 1,283.88 2022–23 3,241.63 2023–24 1,875.88 2024–25 1,888.95 2025–26 3,904.88సద్వినియోగం చేసుకోవాలి గతంలో పామాయిల్ పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం మరిన్ని పంటలను రాయితీ జాబితాలోకి చేర్చి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు రాయితీ ఇస్తోంది. ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయధికారులను లేదా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. – మౌనిక, నిర్మల్ డివిజన్ ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి -
వాహనదారులు నిబంధనలు పాటించాలి
నిర్మల్టౌన్: వాహన యజమానులు, డ్రైవర్లు మో టార్ వాహనాల చట్టంలోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐలు తిరుపతి, దూప్సింగ్ సూచించారు. శనివారం రాత్రి గంజాల్ టోల్ ప్లాజా వద్ద, ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న ఓవర్ లోడ్, గూడ్స్ లారీ, ట్రావెల్ బస్సులను పట్టుకున్నారు. 11 బస్సులు, రెండు గూడ్స్ లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక లోడ్తో వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని వెల్లడించారు. ఏఎంవీఐలు అక్షయ్, రజనీకాంత్, సిబ్బంది తేజరావు, వికాస్, లిఖిత్ తదితరులున్నారు. -
నిర్మల్
గుడిసెవాసులకే ఇందిరమ్మ!సర్కారు బడికే జై.. ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. నాణ్యమైన బోధన అందుబాటులోకి రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు.ప్రొసీడింగ్ అందజేత కుంటాల:మండల కేంద్రంలో సీసీ రోడ్లు, ము రుగు కాలువల నిర్మాణానికి రూ.66లక్షలు మ ంజూరు చేయించిన ఎమ్మెల్యే రామారావు పటే ల్ ఆదివారం తన నివాసంలో సర్పంచ్ జక్కుల గజేందర్కు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్చైన్గేట్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొ లి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 ఇళ్లను గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకే కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామాలు, ప ట్టణాల్లో గుడిసెలు, ప్లాస్టిక్ కవర్ల కింద నివాసముంటున్న నిరుపేదలను అధికారులు గుర్తిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ అధికారులు స్వయంగా వెళ్లి అర్హులను గుర్తించి వారితో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్లై న్లో దరఖాస్తు చేయిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ల చొప్పున వంద నియోజకవర్గాలకు రెండు లక్షల గృహాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మరో 50వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటాగా నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల గృహాలు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం రెండు వేల గృహాలను రెండో విడతలో మంజూరు చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లబ్ధిదా రుల జాబితాలోని అర్హులైన వారిని ఇందిరమ్మ కమి టీల ద్వారా అధికారులు గుర్తిస్తారు. అయితే, ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ హిస్తున్న నియోజకవర్గాల్లో గుడిసె వాసులకు కేటా యించే 500 ఇళ్లు పోగా, మిగతా 1,500 ఇళ్లలో 40శాతం ఇళ్లను కోటాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ లెక్కన 1,500 గృహాల్లో సుమారు 600 గృహాలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల కోటాగా ఉంటుంది. జిల్లాల్లో ఒక కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట వీరికి 600 ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. ఆయా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబితాలోని అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదాన్ని ఈసారి కూడా తప్పనిసరి చేశారు. అర్హుల గుర్తింపు పనిలో అధికారులు రాష్ట్రాన్ని గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే గుడిసె ఇళ్ల వివరాలు సేకరించారు. జిల్లాలో 3,686 గుడిసెలున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటిని మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 2వేల ఇళ్ల వరకు సర్వే పూర్తి కాగా.. మరో వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. గుడిసెల వారితో పాటు మిగతావారి ఎంపిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు అయోమయానికి గురవుతున్నారు. మొదటి విడత నిర్మాణాలు ఇలా.. మంజూరైన ఇళ్లు 8,166 గ్రౌండింగ్ అయినవి 6,768 మార్కౌట్ దశలో.. 1,139 బేస్మెంట్ దశలో.. 1,140 గోడల దశలో.. 805 స్లాబ్ దశలో.. 1,676 పూర్తయిన ఇళ్లు 2,091 లబ్ధిదారులకు ఇప్పటివరకు అందజేసిన సొమ్ము రూ.142కోట్లు రెండో విడతకు ఎదురుచూపులేనా? ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాల్లో అర్హుల జాబితా ఇవ్వగా.. మొదటి విడతలో అందరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దాదాపు ఆరు నెలలుగా రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండో విడతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడతను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, జాబితాలు వస్తాయని భావించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటనలే గాని ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. -
గాలివాన బీభత్సం
ముధోల్: మండలంలోని విఠోలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామానికి చెందిన దండి చిన్నక్క ఇంటి రేకులు లేచిపోయాయి. ఇంట్లోని చిరుధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. వానాకాలం ప్రారంభమైన పక్షం రోజుల్లో భారీ వర్షం కురవడంతో రైతులు సోమవారం నుంచి సాగు పనుల్లో నిమగ్నం కానున్నారు. పిడుగు పాటుకు ఆవు మృతి లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన సర్పంచ్ సంజీవరెడ్డికి చెందిన ఆవు ఆదివారం సాయంత్రం పిడుగు పాటుకు గురై మరణించినట్లు లోకేశ్వరం పశువైద్య సహాయకుడు శేఖర్ తెలిపారు. పంచగుడి గ్రామ శివారు ప్రాంతంలోని గోదావరి న ది ఒడ్డున ఆవులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటి వచ్చే క్రమంలో పిడుగు పాటు గురై సంజీవరెడ్డి ఆవు మరణించింది. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. -
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి
నిర్మల్టౌన్: ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధిక సూచించారు. ఆదివారం అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా శారీరక వ్యా యామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులున్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, అధికారులు, సిబ్బంది వివిధ యోగాసనాలు వేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో.. నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ ఆసనాలు వేయించారు. యోగాతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని తెలిపా రు. రోజూ కొద్దిసేపు యోగాకు కేటాయిస్తే అనారో గ్య సమస్యలు దరిచేరవని సూచించారు. డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, నోడల్ అధికారి సత్యనారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు. బాసర ఆర్జీయూకేటీలో.. బాసర: బాసర ఆర్జీయూకేటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎ డ్యుకేషన్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కా ర్యక్రమాన్ని ఫ్యాకల్టీ ఇన్చార్జి ఎం.రామకృష్ణ, ఫిజి కల్ డైరెక్టర్ శ్యాంబాబు సమర్థవంతంగా పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ కౌన్సిలర్ నాగలక్ష్మి ఆసనాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. -
కొనసాగుతున్న మాధవ్ పాదయాత్ర
కుభీర్: మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ అనే యువకుడు 41రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం ఛత్తీస్గఢ్లోని జగ్దాల్లో ఉన్న ట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆయన తన పాదయాత్ర ను మే 11న కుభీర్లోని విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభించారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగా ల సందర్శనకు పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తె లిపారు. ఇప్పటివరకు 550కిలోమీటర్లు పాదయా త్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈయన గతంలో కుభీర్ నుంచి అయోధ్యకు, కుభీర్ నుంచి మహారాష్ట్రలోని తుల్జాభవానికి, కుభీర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు, పూర్తిచేస్తున్నప్పుడు గ్రామస్తులు, హిందు సంఘాలవారు ఆయన మద్దతు తెలిపి సన్మానించారు. -
టీశాట్లో మస్కాపూర్ విద్యార్థుల కార్యక్రమం
ఖానాపూర్: విద్యారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న పీఎంశ్రీ మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్కు మరో అరుదైన అవకాశం దక్కింది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఈ ఏడాది పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే పాఠశాల ప్రథమస్థానం సాధించింది. దీంతో హైదరాబాద్లో నిర్వహించిన టీసాట్ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. హెచ్ఎం జాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 నుంచి 2026 వరకు మొత్తం 145 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారని తెలిపారు. టీశాట్ లైవ్ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రాముఖ్యతను వివరిస్తూ వివరించారు. విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోనగిరి నరేందర్, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, షేక్ ఇమ్రాన్, రాపర్తి కిషన్ ప్రసాద్, సయ్యద్ ఫరాజ్, బడోల్ల రవి, జోగ్ధండ్ లక్ష్మణ్రావు, చట్ల విజయ్కుమార్ పాల్గొన్నారు. -
అత్యున్నత వైద్యం అందించాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యున్నత వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆన్లైన్ విధానంలో ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతోపాటు, ఏ విభాగాలకు ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని సందర్శించి, రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన వారికి తక్షణమే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. రోగుల సౌకర్యార్థం వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రతీ రికార్డును పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన ఆయన, ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శారద, వైద్య శాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలిప్రజల నుంచి వచ్చే అన్నిరకాల రెవెన్యూ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. మండలాలవారీగా పెండింగ్లో ఉన్న భూభారతి, సాదా బైనామా, ప్రజావాణి అర్జీలు, పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీ పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 60 రోజుల గడువు నిర్దేశించిందని, ఈలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పౌర సేవల కింద జారీ చేసే కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల దరఖాస్తులను సత్వరమే పరిశీలించి అర్హులైన వాటికి ఆమోదం తెలుపాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, ఫిట్నెస్ పోలీసులకు కీలకం
నిర్మల్టౌన్: క్రమ శిక్షణ, ఫిట్నెస్ పోలీసులకు చాలా కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో జిల్లాలోని సివిల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. సిబ్బందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి విధులను నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సమ్మయ్య, గోవర్ధన్, కృష్ణ, ఏఆర్ ఇన్స్పెక్టర్లు రామ్ నిరంజన్, శేఖర్, రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..
నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ. మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక. -
లోక్అదాలత్కు విశేష స్పందన
నిర్మల్టౌన్/భైంసాటౌన్/ఖానాపూర్: నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. నిర్మల్ కోర్టులో సివిల్ కేసులు 14, క్రిమినల్ కేసులు 1,599 పరిష్కారంకాగా, భైంసా కోర్టులో మొత్తం 610 కేసులు పరిష్కరించారు. వీటిలో 29 బ్యాంక్ సంబంధ కేసులకు సంబంధించి రూ.24,64,700 రికవరీకి ఆదేశించారు. ఇక ఖానాపూర్ కోర్టులో 439 కేసులు రాజీ కుదిర్చారు. జిల్లాలో ఒకే రోజు 2,636 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, భైంసా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆర్కె వెంకటరమణ, ఖానాపూర్లో జూనియర్ సివిల్ జడ్జి కమ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ బీసీ నిఖిత ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
నాన్న మాటే.. విజయానికి బాట..
నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు.. -
● దుక్కి నుంచి కోత వరకు ఖర్చులే ● వర్షం, దిగుబడి, ధరలపై అనిశ్చితి ● అప్పులు చేసి సిద్ధమవుతున్న రైతులు
భైంసా: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. జిల్లాలో రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటల సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి సాగు మొదలయ్యే ముందే రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ట్రాక్టర్ చార్జీలు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల వేతనాలు అన్నీ పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమి సిద్ధం చేయడం నుంచే ‘అధ’నం..పొలాలను సిద్ధం చేసే దశ నుంచే రైతులకు భారం మొదలవుతోంది. మొదటి దుక్కి, రెండో దుక్కి, రోటావేటర్, గట్లు సరిచేయడం వంటి పనులన్నీ ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నాయి. గతేడాది ఎకరాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉన్న ట్రాక్టర్ చార్జీలు ఈసారి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. రోటావేటర్ పనులకు కూడా అదనంగా రూ.500 నుంచి రూ.800 వరకు పెరిగింది. దీంతో భూమి సిద్ధం చేయడానికే రైతులు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కూలీల కొరత, వేతనాల పెరుగుదల..వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఉపాధి హామీ పనులు, ఇతర ఉపాధి అవకాశాలు పెరగడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వేతనాలు కూడా పెరిగాయి. గతేడాది మహిళా కూలీలకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఉన్న వేతనం ఇప్పుడు రూ.350 నుంచి రూ.450 వరకు చేరింది. పురుషులకు రూ.400 ఉన్న వేతనం ప్రస్తుతం రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగింది. విత్తనాలు వేయడం నుంచి కోత వరకు అన్ని దశల్లో కూలీల ఖర్చు ఎక్కువైంది. పండిన పంట ఖర్చులకే.. ప్రతీ సంవత్సరం ఖర్చులు పెరుగుతున్నాయి. ట్రాక్టర్ నుంచి కూలీల వరకు అన్నింటికీ ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. కానీ పంటకు ధర వస్తుందనే హామీ లేదు. వర్షం పడకపోతే మొత్తం పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. రైతు జీవితమంతా అప్పులు, ఆశలు, ఆందోళనల మధ్యనే సాగుతోంది. – జంగం గణపతి, రైతుఅన్ని ధరలు పెరిగాయి.. మేము కూడా ఇష్టపడి చార్జీలు పెంచడం లేదు. డీజిల్, ఆయిల్, టైర్లు, విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. పాత రేట్లకు ట్రాక్టర్లు నడపడం గిట్టుబాటు కావడం లేదు. అందుకే ఈ ఖరీఫ్లో కొంత మేర చార్జీలు పెంచాల్సి వచ్చింది. – సాయినాథ్, ట్రాక్టర్ యజమాని 18ఎండీఎల్11,12. ట్రాక్టర్తో విత్తనాలు విత్తుతున్న రైతులుఇక పత్తి, సోయాబీన్ సాగుకు అవసరమైన విత్తనాలు, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మపోషకాల ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఎకరాకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉన్న ఎరువుల ఖర్చు ఈసారి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు చేరింది. దీనితోపాటు పురుగుమందుల ఖర్చు కూడా పెరగడంతో మొత్తం పెట్టుబడి రైతులకు భారంగా మారింది. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు..చాలా మంది రైతులు బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగుకు సిద్ధమవుతున్నారు. గత సీజన్లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో చాలామంది ఇంకా అప్పుల బాధలోనే ఉన్నారు. ఒకప్పుడు రూ.20 వూలలో పూర్తయ్యే ఎకరం పత్తి సాగు ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు చేరిందని రైతులు చెబుతున్నారు. సోయాబీన్ సాగులో కూడా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. -
రాజీతో కేసుల నుంచి విముక్తి
నిర్మల్టౌన్: తెలిసో తెలియకో చేసిన తప్పులకు కేసుల్లో ఇరుక్కుని.. ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాంటి వారికి సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులతోపాటు, వ్యాజ్యం ముందు దశలో ఉన్న సమస్యలను కూడా ఒక్క రోజులోనే పరిష్కరించుకునే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. కోర్టుల్లో నిర్వహణ.. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని తమ కేసులను రాజీ ద్వారా ముగించుకోవచ్చు. రాజీకి అనువైన కేసులులోక్ అదాలత్లో వివిధ రకాల కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. హాజరు కావడం ఎలా?లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకోవాలంటే ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ సంబంధిత కోర్టులో హాజరు కావాలి. గుర్తింపు కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియ పూర్తి చేసి, ఒకే రోజులో కేసును ముగించుకోవచ్చు. సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరి ష్కారం సాధ్యమవుతుంది. న్యాయవాది ఫీజు లు, కోర్టు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో శాంతియుతంగా వివాదా లను ముగించుకునే అవకాశం ఉంటుంది.కేసుల నుంచి విముక్తి.. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అలదాత్ మంచి అవకాశం. వివాదాలు ఒక్కసారి ప్రారంభమైతే... జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి. రాజీపడదగిన కేసులను లోక్అదాలత్ లో పరిష్కరించుకోవా లి, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. –జానకీషర్మిల, ఎస్పీ -
భూధార్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్టౌన్: భూధార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో భూధార్ సర్వే చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సర్వేయర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే భూభారతి దరఖాస్తులను 60 రోజుల గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. భూధార్ సర్వే నిర్వహణకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఏడీ ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలినిర్మల్టౌన్: వర్షాకాలం ఆకస్మిక వరదలు సంభవిస్తే ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించి ప్రజలకు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయం చేస్తుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రమేశ్రాథోడ్, ఆర్డీవో దేవీదాస్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ముఖేశ్కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టాలినిర్మల్టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించా రు. అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టా లన్నారు. బూత్ లెవెల్ అధికారులకు తప్పనిసరి గా అన్ని అంశాల పై అవగాహన ముఖ్యమన్నా రు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశాల వివరాలు కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని తెలిపారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడు తూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వాతి పాల్గొన్నారు. -
ప్రైవేటు వెంచర్కు సీసీరోడ్డు
సారంగపూర్: చించోలి(బి) గ్రామంలోని ఎక్స్రోడ్డు సమీపంలో ఉన్న ఆర్టీవో కార్యాలయం ప్రధాన రహదారి నుంచి సుమారు 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ కార్యాలయానికి రహదారి సౌకర్యం క ల్పించేందుకు ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.25 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేశా రు. అయితే ఆ రోడ్డు పనులను ఆర్టీవో కార్యాల యం వైపు చేయకుండా సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్వైపు మళ్లించి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 15 మీటర్ల రహదారి పనులు పూర్తి చేశారు. ఈ అక్రమ మళ్లింపు విషయం తెలు సుకున్న గ్రామస్తులు వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రాజకీయ అండదండలతోనే..ప్రైవేటు వెంచర్ ఒక రాజకీయ నాయకుడికి చెందిన ది కావడంతో, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వేయాల్సిన రోడ్డును తమ వెంచర్లోకి మళ్లించేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు మంజూరు రావడం వల్ల గ్రామస్తులు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం విడుద ల చేసే నిధులను ఇలా పక్కదారి పట్టించడం సరి కాదని, దీనికి కారకులైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఆర్టీవో కార్యాలయానికి మళ్లించాం వాస్తవానికి సీసీరోడ్డు ఆర్టీవో కార్యాలయానికి మంజూరైంది. అయితే సదరు సీసీరోడ్డును ఆర్టీవో కార్యాలయం దారిలో వేయడానికి బదులు దానికి పక్కనే గల దారిలో వేశారని నా దృష్టికి వచ్చింది. వెంటనే పనులు నిలిపివేసి సదరు రోడ్డును ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే దారిలో నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించాం. మెటీరియల్ మొత్తం ఆర్టీవో కార్యాలయం రహదారి వద్దకు మార్చి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దేవీదాస్, పీఆర్ ఏఈ, సారంగాపూర్ -
ప్రతీరైతు కూరగాయలు సాగు చేయాలి
లోకేశ్వరం: ప్రతీ రైతు తనకున్న వ్యవసాయ భూమి లో కుటుంబానికి సరిపడా కూరగాయలు సాగు చేయాలని భైంసా డివిజన్ హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్లను శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా జావిద్ పాషా మా ట్లాడుతూ రైతులు కూరగాయలు, పంట్ల తోటలు సాగు చేయాలన్నారు. రూ.500 విలువ చేసే టమాటా, మిర్చి, బెండ, పాలకూర, తోట కూరల విత్తనాలు 50 మంది రైతులకు ఉచితంగా అందజేశామన్నారు. ఏవో గిరిరాజ్, ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నకర్రావు, సర్పంచ్ దర్వా డి.కపిల్, మాజీ ఎంపీపీ లింగన్న, ఉద్యానశాఖ విస్తీర్ణ అధికారి మోహిన్, నాయకులు సుదర్శ న్రెడ్డి, కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, భీంరావ్పటేల్, ఏఈ వోలు మౌనిక, సంగీత, రచన పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
తానూరు: వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. తానూరు పీహెచ్సీ, కస్తూరిబా పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీల నిర్వహణను శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిని సందర్శించి వైద్యుల వివరాలతోపాటు అందుబాటులో ఉన్న మందుల వివరాలను తెలుసుకున్నారు. ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్పై ఆరా తీశారు. కేజీబీవీని సందర్శించి వంట గదులతోపాటు విద్యార్థుల తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతిలో 40 మంది విద్యార్థులకు 27 మంది హాజరయ్యారు. పూర్తిస్థాయిలో వచ్చేలా చూడాలని ప్రిన్సిపాల్ అలేఖ్యకు సూచించారు. నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని స్కిల్స్ నేర్పించాలన్నారు. తర్వాత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీధర్, ఎంఈవో నరేందర్, వైద్యులు అజిత్, సిబ్బంది ఉన్నారు. -
పోలీసులకు సాంకేతిక బలం
నిర్మల్టౌన్: జిల్లా పోలీస్ శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు నూతన సాంకేతిక పరికరాలను అందజేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరగడం, కంప్యూటర్లు, ట్యాబ్లలో వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసుల వివరాలను వేగంగా నమోదు చేయడం, కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు సమన్వయ అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా న్యాయ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పరికరాలు సహకరిస్తాయి. ఎస్పీ చేతులమీదుగా పంపిణీజిల్లాలోని పోలీస్ స్టేషన్లకు బార్కోడ్ స్కానర్లు, లే బుల్ ప్రింటర్లు, సింగిల్ డిజిట్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్లను జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కా ర్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం పంపి ణీ చేశారు. పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపే తం చేసి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్రెడ్డి, స మ్మయ్య, ఆర్ఐ(అడ్మిన్) రామ్నిరంజన్రావు, ఎ స్సైలు జి.లింబాద్రి, శ్రీకాంత్, రవీందర్, గణేశ్, గోపి, శ్రావణి, హన్మాండ్లు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్లువ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడం, నేర చరిత్రను గుర్తించడం, అనుమానితుల వివరాలను తక్షణమే సేకరించడం, పెండింగ్ కేసుల ఛేదనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సింగిల్ డిజిట్ స్కానర్లు ఇవి వ్యక్తుల గుర్తింపును క్షణాల్లో ధ్రువీకరించడంతోపాటు, కేంద్రీకృత డేటాబేస్లతో సరిపోల్చి నేర చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. బార్కోడ్ స్కానర్లు..ముద్రించిన బార్కోడ్లను డిజిటల్ సమాచారంగా మార్చి రికార్డుల నిర్వహణ, సాక్ష్యాల ట్రాకింగ్ , ఇ తర పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తాయి. లేబుల్ ప్రింటర్లుకేసు ఫైళ్లు, సాక్ష్యాధారాలు, ఇతర రికార్డులను కచ్చితంగా గుర్తించి నిర్వహించడంలో కీలకంగా ఉపయోగపడతాయి. -
గ్రామం సుభిక్షంగా ఉండాలని..
బాసర: గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని బాసర గ్రామ పెద్దలు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా దేవతలను ఆహ్వానించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేసి గ్రామస్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు నూకం లింగారావు మనోహర్రావు, గౌరవల్ల రాజులు, కొక్కుల గంగాధర్, దావు రాములు దేవేందర్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. -
తెగని పోడు.. ఆగని పోరు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూముల సాగుదారులు, అధికారుల మధ్య పోడు రగడ రగులుతూనే ఉంది. ఏళ్లుగా ఏటా వానాకాలంలో విత్తనాలు వేసే వేళ అటవీ సిబ్బంది, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇక వర్షాలు మొదలైతే గొడవలు మరింతగా జరిగే ఆస్కారం ఉంది. అటవీ ఆక్రమణలపై ఏళ్లుగా శాశ్వత పరిష్కారం లేక సమస్య జఠిలంగా మారుతోంది. ఆక్రమణ భూములు స్వాధీనంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎకరాలకు పై నే అటవీ భూములు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో గత మూడేళ్లుగా పోడు పట్టాలు ఇవ్వని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. మొదట గిరిజనేతరులకు ఐదు ఎకరాల కంటే అధికంగా సాగులో ఉన్నవారి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగుదారులను భూమి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే 50వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. పులుల రాకపోకల కోసం తడోబా నుంచి కవ్వాల్ వచ్చేలా 1492చ.కి.మీ. కారిడార్గా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అయితే అటవీ సమీప ప్రాంత వాసులపై మరింత ఆంక్షలు అమలు కావడంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పత్తి సాగు ఆరంభంతో చెట్లు నరికి సాగు చేయడం పెరిగిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. పోడు రైతులు వెదురు, పండ్ల తోటలు, ఇతర ఆహార ధాన్యాల సాగే చేయాల్సి ఉంది. పూర్తి వాణిజ్య పంట పత్తిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. పట్టాలిచ్చినా.. ఆగని పోరుగత సర్కారు జీవో 140 ప్రకారం పోడు చేస్తున్న గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లోనే పోడు కమిటీలను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరిశీలన తర్వాత పట్టాలు జారీ చేసింది. ఇక గిరిజనుల్లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి 2023 జూన్లో పోడు పట్టాలు మంజూరు చేశారు. ఆ సమయంలో చాలామంది తమకు పట్టాలు రాలేదని మళ్లీ అర్జీలు ఇచ్చారు. ప్రధాన నిబంధనల్లో గిరిజనులను 2005 వరకు, గిరిజనేతరులను 1930కంటే ముందు సాగులో ఉన్నట్లుగా లేదా మూడు తరాల వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్లుగా రుజువులు చూపించాల్సి రావడంతో అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 33వేల మంది గిరిజనుల చేతిలో 1.24లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 32వేల మంది గిరిజనేతరుల చేతిలో 1.02లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు అర్జీలు వచ్చాయి. అయితే గిరిజనేతరులు చట్టం ప్రకారం అనర్హలు కావడంతో వాటిని తిరస్కరించారు. అయినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాజకీయ కారణాలతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నిత్యం ఘర్షణలే..ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, కాగజ్నగర్, పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు, ఆదిలాబాద్, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, సోనాల, కడెం, ఉట్నూరు, జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో అటవీ అక్రమాలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఫారెస్టు సిబ్బంది, సాగుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం దూషణ లు, ఎదురుదాడులు చోటు చేసుకుంటున్నా యి. కొన్ని సార్లు పోలీసు బందోబస్తుతో అటవీ అధికారులు సాగు ఆక్రమణలను తొలగిస్తున్నారు. దండేపల్లి మండలం కోయపోచగూడ, ఇటీవల చింతలమానేపల్లి మండలం దిందా, కడెం మండలం గొండుగూడ, కెరమె రి మండలం సుర్దాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం అల్లికోరి పరిధిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అటవీ అధికారులు సా గుదారులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. -
పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నిశాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బాసర వద్ద పాత పుష్కర ఘాట్లకు అ వసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణకట్ట, పిండప్రదాన వేదికలు, దుస్తులు మార్చుకునే గదులను తక్షణమే నిర్మించా లని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఘాట్ల సమీపంలో తాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని దిశానిర్దే శం చేశారు. ఆయా శాఖల అధికారులు తమకు కే టాయించిన పనులకు సంబంధించిన సమగ్ర ప్రతి పాదనలను వెంటనే సిద్ధం చేయాలని సూచించా రు. ఈ సందర్భంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ పై కూడా చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దుప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్లో బాలికల ఆశ్రమాన్ని గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని సూచించా రు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆయా సబ్జెక్టుల్లో వారి సామర్థ్యాలను పరీక్షించారు. డీఈవో భోజన్న, అధికారులున్నారు. -
మొక్కకు చుక్క చేరేదెలా?
లక్ష్మణచాంద: ఈసారి ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచి స్తుండగా రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు లాంటి ఆరుతడి పంటలు సాగు చే యాలని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు భారీ వర్షాలు కురియలేదు. జూన్ సగం పూర్తైనా సరైన వ ర్షాలు లేక అన్నదాతలు పంటలు ఎలా సాగు చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నా రు. వరుణడి కరుణ కోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో త క్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సా గు చేయడానికి సూక్ష్మ సేద్యమే అనువైన పద్ధతి అని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ప్రతీ నీటిబొట్టు మొక్కకు నేరుగా అందుతుంది. కాగా, బోరు బావులున్న రైతులు పసుపు, పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. వర్షాలు లేక డ్రిప్, రెయిన్ డ్రిప్ తదితర విధానాల్లో పంటలకు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. రాయితీ తగ్గించిన సర్కారుఈ ఏడాది రైతులకు ఇచ్చే సబ్సిడీని సర్కారు తగ్గించింది. గతేడాది వరకు ఎస్సీ, ఎస్టీలకు నూక్ష్మ సే ద్యం పరికరాలను 100శాతం రాయితీతో అందించింది. ప్రస్తుతం 10శాతం రాయితీని తగ్గించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం రాయితీ, బీసీలకు గతంతో 90 శాతం రాయితీ ఇవ్వగా ఈసా రి 80శాతం, జనరల్ రైతులకు గతంలో 80శాతం రాయితీ ఇవ్వగా ఈసారి 70శాతమే ఇస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులపై భారం పడనుంది.ఆయిల్ పామ్ వైపు మొగ్గుప్రస్తుతం సూక్ష్మ సేద్యం పరికాల కోసం వస్తున్న దరఖాస్తుల్లో రైతులు ఆయిల్ పా మ్ సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలుస్తోంది. అయితే, పండ్ల తోటలు, కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నీటి ఎద్దడి సమయంలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సూక్ష్మ సేద్యం పరికరాలను మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు డ్రిప్ పద్ధతిలో 23,498 ఎకరాలు, స్ప్రింక్లర్స్ విధానంలో 4,463 ఎకరాలు, సూక్ష్మ సేద్యం విధానంలో 27,961 ఎకరాలు సాగవుతున్నట్లు జిల్లా హార్టికల్చర్ అధికారులు తెలి పారు. అలాగే, 2026 సంవత్సరానికి డ్రి ప్ ఇరిగేషన్ లక్ష్యం 302 ఎకరాలు, స్ప్రింక్ల ర్స్ ద్వారా 452, ఆయిల్ పామ్ సాగు డ్రిప్ ద్వారా 2,632 ఎకరాలు ఉందని ఉద్యానవన అధికారులు పేర్కొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుచేయాలి
లోకేశ్వరం: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ సూ చించారు. గురువారం మండలంలోని పంచగుడి, వట్టోలి గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్కు ఎలాంటి తెగుళ్లు సోకినా వెంటనే ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. పంట రాగానే జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లో విక్రయించాలని సూచించారు. ఉద్యానశాఖ భైంసా డివిజన్ అధికారి జావిద్ పాషా, ఆయిల్ పామ్ మేనేజర్ ఆశాష్, విస్తరణ అధికారి మోహిన్, క్లస్టర్ అధికారి సంతోష్ ఉన్నారు. -
‘కోనో’ స్థానంలో కొత్తచెట్లు
జిల్లా కేంద్రంలోని రోడ్డు డివైడర్ల మధ్యనున్న కోనో కార్పస్ చెట్లు తొలగిస్తున్నారు. వీటి పుప్పొడితో శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పడమే దీనికి కారణం.అంతా గప్చుప్..! ట్రిపుల్ఐటీలో విద్యార్థిని ఆత్యహత్యాయత్నంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స అందించిన అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది. -
చోటా.. చౌరాస్తా!
నిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. ఆక్రమణల తొలగింపు అంతకన్నా లేదు. ఫ లితంగా ప్రధాన కూడళ్లూ పట్టణవాసులకు నిత్యం పరీక్ష పెడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎడమవైపు వెళ్లడానికి ఎక్కడా.. ‘ఫ్రీలెఫ్ట్’ రూట్ లేదు. ఎమర్జెన్సీలోనూ లెఫ్ట్వైపు వెళ్లాల్సిన వారూ గ్రీన్సిగ్నల్ వచ్చేదాకా వేచి చూస్తున్నారు. ఇక రెడ్సిగ్నల్ పడ్డా.. చాలామంది ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు. ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేకపోవడం, మున్సిపాలిటీలు పట్టణవాసులకు ఆటంకాలు లేని ప్రయాణానికి ఏర్పాట్లు చేయకపోవడం విడ్డూరమే. ఫ్రస్టేషన్లో పట్టణవాసి..!జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌరాస్తాలు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. రహదారులపై వ్యాపారులు, అక్రమ పార్కింగ్, తోపుడు బండ్లు, ఇతర ఆక్రమణల కారణంగా ఇరుకుగా మారాయి. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. నిత్యం ట్రాఫిక్ కష్టాలతో పట్టణవాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆఫీసులు, పాఠశాలలు, ఆస్పత్రులకు సమయానికి చేరుకోలేక పోతున్నారు. ట్రాఫిక్ జామ్లు, ఆక్రమణలు, రోడ్లపై అస్తవ్యస్త పార్కింగ్, సిగ్నల్ ఉల్లంఘనలు వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. సమస్యలు చాలా ఏళ్లుగా ఉన్నా శాశ్వత పరిష్కారం లేక తీవ్ర ఫ్రస్టేషన్కు గురవుతున్నారు. ఇటీవల సోషల్మీడియాలో అసహనా న్ని వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణపై మున్సిపాలిటీ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. -
బాసర ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను గురువారం ఆర్కిటెక్చర్ అధికారులు మోతీలాల్, మాధవి పరిశీ లించారు. జూలై 5న నిర్వహించనున్న బాలాల యం ఏర్పాట్ల దృష్ట్యా రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న రూ.150 అక్షరాభ్యాస మండపంలోనే బాలాలయం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమాలూ ఇదే ప్రాంగణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.150 అక్షరాభ్యాస కార్యక్రమాలు ధ్యాన మందిరం లేదా పాత ఈవో కార్యాలయంలో కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలు, సంప్రదాయ శిల్పకళా వై భవం ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో అంజనాదేవి, నిర్మల్ ఏఈ శ్యామ్, ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి తదితరులున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం విస్తరించేలా..శృంగేరి పీఠాధిపతి శిష్యుల ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు బాలాలయం ఏర్పాటుకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకురానున్నాయి. మరోవైపు ఆల య నిర్మాణ పనులు చేపట్టిన డోనర్ 2027 జూన్ 1 నాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. ఆ లయ నిర్మాణంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక వాతావరణం మరింత విస్తరించేలా పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే బాసర క్షేత్రం దేశవ్యాప్తంగా మరింత ఆధ్యాత్మికంగా ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆర్జీయూకేటీ విద్యార్థినికి గాయాలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో ఓ విద్యార్థిని బుధవారం హాస్టల్–1 భవనం పై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాగ్లీ హష్మతాబేగం పీ1 చదువుతోంది. బాలికల హాస్టల్ భవనంపై నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కాసిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లంబాడితండాకు చెందిన దిలావత్ బూర్యానాయక్ (51) బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఎల్లారం వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్పై వచ్చిన పోడెటి సమ్మయ్య ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమార్తె అజ్మీర సమీర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగిఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్నిర్మల్రూరల్: మండలంలోని ఎల్లాపల్లి ఎక్స్రోడ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూర ల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు మేకల లోడుతో వస్తున్న వ్యాన్ ఎల్లపల్లి ఎక్స్రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో విశ్రాంతి తీసుకుంటున్న మధ్యప్రదేశ్కు చెందిన డ్రైవర్ మున్నాఖాన్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న సతీష్ యాదవ్ గాయాల పాలయ్యాడు. వ్యాన్లో ఉన్న షేక్ అఖిల్, సోహెల్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ‘బస్సు యాత్రను అడ్డుకుంటాం’ఇంద్రవెల్లి: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన బస్సుయాత్రను అడ్డుకుంటామని తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 79 ఏళ్ల స్వాతంత్య్ర పాలనలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకుండా వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన లంబాడీలు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దక్కించుకున్నారన్నారు. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు యాత్రను ఆదివాసీలందరు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ రాష్ట్ర మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ సంఘాల నాయకులు సెడ్మకి రామారావ్, కోరెంగ సీతారాం, మడావి శేకు, దుర్వ హన్ను, సోయం వినోద్, భీంరావ్, ఇంద్రు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్తో జర భద్రం
చెన్నూర్రూరల్: వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్తో చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఇంటివద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో విద్యుత్తో బోరుబావులు, వాగుల వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ వినియోగంపై రైతులు కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కొమ్మెర ట్రాన్స్కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంట పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు


