breaking news
Nirmal
-
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు
నిర్మల్చైన్గేట్: సమాచారం దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టవిరుద్ధమని రాష్ట్ర చీఫ్ ఇ న్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పీఐవో అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు పర్వీన్, భూపాల్, కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించా లని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువగా వచ్చిన జిల్లాల్లో నిర్మల్ ఒకటని చెప్పా రు. పీఐవో అధికారులు దరఖాస్తుదారులకు నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి సమాచారం అందించారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై అధికారులంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్లో పరిష్కరించేందుకు కమిషన్ ప్ర త్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్ మాట్లాడుతూ.. ఆర్టీఐని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత పీఐవో, ఏపీఐవోలదేనని చెప్పారు. కమిష న్ ఏర్పాటు తర్వాత 18వేల కేసుల్లో 2,300కుపైగా పరిష్కరించామని పేర్కొన్నారు. అనంతరం చట్టంపై సందేహాలను నివృత్తి చేశారు. పీఐవో అధికారులకు సమాచార హక్కు చట్టం నిబంధనలు, దరఖాస్తుల పరిష్కార విధానం, అప్పీల్ ప్రక్రియపై పవర్ పెయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, వివిధ శాఖల అధికారులు, పీఐవోలు, ఏపీఐవోలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి కలెక్టరేట్లో అవగాహన సదస్సు -
పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకే గ్రీవెన్స్
భైంసాటౌన్: పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రతీ బుధవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి, సంబంధిత ఎస్హెచ్వోలతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే, కుటుంబ వివాదాల పరి ష్కా రం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సత్ఫలితాలిస్తోందని ఎస్పీ తెలిపారు. కుటుంబ తగాదాలతో కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు రాలేనివారికి భైంసాలోనే భరోసా కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వి స్తారంగా వర్షాలు కురవడంతో స్వర్ణ ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,182.9 అడుగులకు చేరింది. 222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అధికా రులు మూడో గేటు ఫీటు పైకెత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం 1,182.9 అడుగుల వద్ద స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు. రానున్న రెండు, మూడ్రోజులు వర్షాలు అధికంగా కురవనున్న నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతానికి పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు వెళ్లవద్దని సూచించారు. ‘కడెం’కు భారీ వరద కడెం: పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. బుధవారం ప్రాజెక్ట్కు 40,066 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు మూడు వరద గేట్లు ఎత్తి 18,322 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696.275 అ డుగులు ఉంది. కాగా, బుధవారం ప్రాజెక్ట్ అందా లు తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. యువకులు, చిన్నారులు ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. -
వ్యాపారుల సిండికేట్!
● రెండుసార్లు వేలం వాయిదా ● మూడోసారి సజావుగా సాగేనా? ● ‘అడెల్లి’ ఆదాయం తగ్గించే కుట్ర!సారంగపూర్: అడెల్లి ఆలయం వద్ద వివిధ హక్కుల కోసం నిర్వహించిన వేలం పాటలు వ్యాపారుల సిండికేట్ కారణంగానే రెండుసార్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ నిబంధనల ప్ర కారం గతేడాది ఆదాయానికి కొంత అదనంగా వస్తే నే వ్యాపారికి సదరు హక్కు కట్టబెడతారు. తక్కువ పాడితే వేలం వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇలా వరుసగా మూడుసార్లు వ్యాపారులు వేలం పాడేందుకు ముందుకు రాకపోయినా.. గతేడాది కంటే తక్కువ పాడినా.. వేలం రద్దు చేసే అధికారం దేవా దాయశాఖ అధికారులకు ఉంటుంది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇదివరకు వచ్చి న ఆదాయ పరిమితిని తగ్గించి వేలం నిర్వహిస్తారు. గతేడాది వేలం ద్వారా ఆదాయం గతేడాది కొబ్బరి కాయల విక్రయ హక్కునకు రూ. 17.71లక్షలు, ప్యాలాలు, పుట్నాలు విక్రయానికి రూ.1.61లక్షలు, బొమ్మలు, సీడీలు, కంకణాలు వి క్రయానికి రూ.6.01లక్షలు, టోల్ ట్యాక్స్ వసూలు హక్కుకు రూ.15.51లక్షలు, తైబజారు వసూలుకు రూ.4.13లక్షలు, ఇడుపుడు పిల్ల మేకలు సేకరించే వ్యాపారానికి రూ.60వేలు, లడ్డూ, పులిహోర విక్ర య హక్కునకు రూ.1.60లక్షలు, పూలదండల విక్రయానికి రూ.1.60లక్షలు, టెంట్లు, వంటపాత్రలు అద్దెకు ఇచ్చే హక్కునకు రూ.1.65లక్షలు, ఒడిబి య్యం పోగు చేసుకునేందుకు రూ.2.25లక్షలు, చీరెలు, కనుములు పోగు చేసుకునే హక్కునకు రూ. 49వేలు, ఇతరములు–2 హక్కునకు రూ.80వేలు వచ్చింది. మొత్తంగా అమ్మవారి ఆలయానికి వేలం ద్వారా రూ.58.37లక్షల ఆదాయం సమకూరింది. 12 ఏళ్లుగా పెరుగుతూ వచ్చి.. కొబ్బరికాయల విక్రయం, తైబజారు వసూలు, టో ల్ట్యాక్స్ వసూలు, సీడీలు, బొమ్మలు, కంకణాల విక్రయం, పూలదండలు విక్రయ హక్కులకు 12 ఏ ళ్లుగా వ్యాపారులు గతం కంటే అధికంగా పాడుతూ హక్కులు దక్కించుకుంటున్నారు. ఈసారి తక్కువ కు పాడి హక్కులు దక్కించుకునేందుకు వ్యాపారులు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసమే వారు సిండికేట్గా మారినట్లు తెలుస్తోంది. వీరి పాచిక పారితు ఆలయానికి గణ నీయంగా ఆ దాయం తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 18న మూడోసారి నిర్వహించే వేలం రద్దవుతుందో? సజావుగా సాగుతుందో చూడాలి మరి.18న వేలం నిర్వహిస్తాంవ్యాపార హక్కుల కోసం నిర్వహించే బహిరంగ వేలానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతోనే రెండుసార్లు వేలం పాటలు వాయిదా పడ్డాయి. ఈనెల 18న మళ్లీ వేలం నిర్వహించనున్నాం. మూడోసారి వాయిదా పడితే ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – రమేశ్, ఆలయ ఈవో -
నిర్మల్
మళ్లీ పొడిగింపేనా? సహకార సంఘాల పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆర్నెళ్లు పొడిగించిన ప్రభుత్వం ఈసారి తీసుకునే నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.9లోuగురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 20258లోuపంద్రాగస్టుకు అతిథులు వీరే.. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అతిథులను ఖరారు చేసింది. వీరు శుక్రవారం ఉద యం 9.30గంటలకు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరి స్తారు. అనంతరం నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. నిర్మల్ సిరిసిల్ల రాజయ్య చైర్మన్, రాష్ట్ర ఆర్థిక సంఘంఆదిలాబాద్ మహ్మద్ అలీషబ్బీర్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫాబాద్ బండప్రకాశ్ డిప్యూటీ చైర్మన్, శాసన మండలి మంచిర్యాల హర్కర వేణుగోపాల్రావు ప్రభుత్వ సలహాదారు ● ఎస్హెచ్జీల్లోకి కిశోర బాలికలు ● తొలగించిన వృద్ధులకూ చాన్స్ ● దివ్యాంగుల గ్రూపులు ఏర్పాటు ● వీటిలో పురుషులకూ అవకాశం ● లింకేజీ రుణాలిచ్చేలా నిర్ణయంజిల్లాలో పెన్షన్ల వివరాలుమొత్తం పింఛన్లు 1,47,103వద్ధాప్య.. 35,150వితంతు.. 36,326వికలాంగుల.. 10,055గీత కార్మికుల.. 274పైలేరియా.. 223 డయాలసిస్.. 122ఒంటరి మహిళ.. 2,110బీడీ.. 62,062గ్రామైక్య సంఘాలు 505ఎస్హెచ్జీలు 12,215ఎస్హెచ్జీల సభ్యులు 1,34,002నిర్మల్చైన్గేట్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భద్ర త, సామాజిక గుర్తింపునిచ్చిన మహిళా సంఘాలు మరింత విస్తృతమవుతున్నాయి. 60 ఏళ్లు దాటిన కారణంగా గతంలో సంఘాల నుంచి తొలగించిన మహిళలకు తిరిగి సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా జిల్లాలో అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. దీంతో మళ్లీ సంఘంలో చేరి తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని తోటి స భ్యులతో పంచుకునే అవకాశం వృద్ధ మహిళలకు లభించనుంది. కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులకు సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇందిరా మహిళా శక్తి మిషన్లో భాగంగా ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. 1,797 మంది కిశోర బాలికలకు చాన్స్ జిల్లాలో 15 నుంచి 18 ఏండ్లలోపు 1,797 మంది బాలికలున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ బాలికలతో కిశోర బాలికల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారికి డబ్బులు పొదుపు చే యడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగా హన కల్పిస్తారు. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, బాలికలు, మహిళలపై జరిగే లైంగికదాడులతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా రు. ఈ సంఘాల్లో బాలికలను చేర్పించడం కోసం సెర్ప్ అధికారులు, సిబ్బంది పాఠశాలలు, కళాశాల ల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. దివ్యాంగ సంఘాల్లో పురుషులూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,47,103 లక్షల మంది దివ్యాంగులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. సీ్త్ర, పురుషులు అనే తేడా లేకుండా దివ్యాంగులందరినీ స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వీరితో కూడా బ్యాంక్ ఖాతాలు తెరిపించడం, పొదుపు అలవాటు చేయడంతో పాటు వారికి సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చూడనున్నారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలనూ ఈ సంఘాల ద్వారా పంపిణీ చేసే అవకాశముంది. ఈ సంఘాల్లోని దివ్యాంగులకు మహిళా సంఘాలకు ఇచ్చినట్లే వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘంలో ఏడు నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. 60 ఏండ్లు దాటిన వారికి మళ్లీ అవకాశం ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన మహిళలను స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 60 ఏండ్లు దాటిన మహిళలతో మళ్లీ కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏ ఆసరా లేని వృద్ధ మహిళలుంటే వారు చిరువ్యాపారాలు చేసుకునేందుకు సాయం చేయడం, కొడుకులు సరిగా చూ సుకోకపోతే ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంలో సా యం చేయడం, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామని ఫీల్ కాకుండా నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.న్యూస్రీల్కార్యాచరణ ఇలా.. 12నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో ఏ సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, కౌమార బాలికలను డీపీఎంలు, సీసీలు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గుర్తిస్తారు. గ్రామాలవారీగా జాబితా రూపొందిస్తారు. 14నుంచి 15వ తేదీ వరకు కొత్త సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత సంఘాలు సాధించిన ఆర్థిక విజయాలు చెప్పడమే కాకుండా, ఆయా సభ్యుల అనుభవాలు, నిబంధనలు పరిచయం చేస్తారు. 15నుంచి 30వ తేదీ వరకు ముందుకువచ్చే సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసి, వారితో బ్యాంక్ల్లో పొదుపు ఖాతాలు తెరిపిస్తారు. వివరాలు ‘సెర్ప్’ వెబ్ సైట్లో నమోదు చేయిస్తారు. అవగాహన కల్పిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులకు కొత్తగా నూతన మహిళా సంఘాల్లో సభ్యత్వం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అరుణ, ఏపీఎం, నిర్మల్ రూరల్ -
బాసర మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్!
గతంలో వెనక్కి వెళ్లిన నిధులుబాసర ఆలయానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వం మాస్టర్ప్లాన్పై ప్రకటన చేసింది. ఇందుకోసం ఓ కమిటీ వేసింది. రూ.50 కోట్లు అప్పటికప్పు డు విడుదల చేసినప్పటికీ సక్రమంగా ఖర్చు చేయలేక సంబంధిత అధికారులు చేతులెత్తేశారు. అప్పట్లో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో విడుదలైన నిధుల్లో రూ.42 కోట్లు వెనక్కి వె ళ్లాయి. వాటిని తిరిగి తెప్పించాలని ఇప్పటివరకు ప్రయత్నం జరిగింది. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరా వు పటేల్, వేణుగోపాలాచారి అధికార కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామారావు పటేల్ బాసర ఆలయాభివృద్ధి విషయంలో ఇప్పటికే అసెంబ్లీలో పలుసార్లు చర్చించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిని కూడా కలిశారు. అధికారులు, పార్టీలకు అతీ తంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతి నిధులు సమష్టి కృషి చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.● ప్రకటించిన దేవాదాయశాఖ మంత్రి ● ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు -
‘వస్తాపూర్’ దశ మారేనా?
● జలపాతం వద్ద అధికారుల సర్వే ● సెలయేటి అభివృద్ధిపై ఆశలుమామడ: చుట్టూ సహ్యాద్రి గుట్టలు.. దట్టమైన అట వీ ప్రాంతంలో ఉండే వస్తాపూర్ గ్రామ సమీపంలోగల జలపాతం పర్యాటకులను కనువిందు చే స్తోంది. జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఈ జలపాతం కొండలు, కోనల మధ్య నుంచి వచ్చే సహజ నీటి ప్రవాహంతో పర్యాటకుల కు ఆహ్లాదం అందిస్తోంది. ఈ వాటర్ఫాల్ను వీక్షించేందుకు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంది. సెలయేటికి వెళ్లడం ఇలా.. జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారి వెంట 18 కిలోమీటర్ల దూరంలోని తాండ్ర గ్రామానికి చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి ఐదుకిలోమీటర్ల దూ రం వెళ్తే వస్తాపూర్ గ్రామ సమీపంలోని జలపాతాని కి చేరుకోవచ్చు. తాండ్ర నుంచి వస్తాపూర్ గ్రామం వరకు ఉన్నది ఘాట్ రోడ్డు కావడంతో వా హనాల్లో నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా గుట్టల్లో ఉన్న వస్తాపూర్ గోండు గిరిజన గ్రామానికి సమీపంలో నుంచి జాతీయ రహదారి రావడం, గ్రామానికి రోడ్డు నిర్మించడంతో పాటు జలపాతం వెలుగులోకి వచ్చింది. దీంతో ని త్యం గ్రామానికి సందర్శకులు వస్తారు. వానాకా లంలో జూలై నుంచి జనవరి వరకు ఈ జలపాతం తన అందాలతో సందర్శకులను మైమరిపిస్తోంది. అభివృద్ధిపై ఆశలు వస్తాపూర్ జలపాతానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఇటీవల కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. దీంతో తహసీల్దా ర్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో సుశీల్రెడ్డి, అటవీ, పోలీస్శాఖల అధికారులు మంగళవారం జలపాతా న్ని సందర్శించి సర్వే చేశారు. పూర్తి వివరాలు సేకరించారు. దీంతో వస్తాపూర్ జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చెందనుందనే ఆశలు కలుగుతున్నా యి. జలపాతం వద్ద కనీస వసతులు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పర్యాటకులు సందర్శించే స్థాయిలో జలపాతాలు ఏవీ లేవు. కొన్నేళ్ల క్రితమే వస్తాపూర్ జలపాతం వెలుగులోకి రాగా ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. జ లపాతం వరకు రోడ్డు సౌకర్యం కల్పించి, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తే దీనికి మంచి గుర్తింపు వస్తుందని పర్యాటకులు భావిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు భైంసా పట్టణంలోని శ్రీగౌతమి పాఠశాల విద్యార్థి జీ కేశవ్ ఎన్నికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. తెలంగాణ యోగాసన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పట్టణంలోని గౌతమి హైస్కూల్లో నిర్వహించిన ఆరో జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపి రా ష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సెప్టెంబర్లో నిర్మల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కేశ వ్ పాల్గొనున్నట్లు యోగా టీచర్ మల్లేశ్ తెలి పారు. ఈమేరకు విద్యార్థిని అభినందించారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
నిర్మల్చైన్గేట్: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత మన అందరిపై ఉందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఓటు చోరీకి వ్యతిరేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా వెబ్ పేజీని పార్టీ ప్రారంభించిందని, అందులో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు చోరీపై కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, పీసీసీ సభ్యులు సాధ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
తొడసం కై లాస్కు సన్మానం
ఉట్నూర్రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన 'జూనియర్లు'
లక్ష్మణచాంద: కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ప్రభావం, ప్రభుత్వ గురుకులాల ఏర్పాటు తో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఆదరణ తగ్గుతోంది. దీంతో ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. దీంతో మళ్లీ పూర్వవైభవం వస్తుందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. గతంలో సరైన మౌలిక వసతులు, తగినంత అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకాడేవారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలతో విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.పెరిగిన ప్రవేశాలు..జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు. జిల్లా నోడల్ అధికారి పరశురామ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, గత విద్యా సంవత్సరం (2024–25)లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,252 మంది విద్యార్థులు చేరగా, ఈ విద్యా సంవత్సరం (2025–26)లో ఇప్పటివరకు 2,592 మంది ప్రవేశం పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే 340 మంది విద్యార్థులు అధికంగా చేరినట్లు అధికారులు తెలిపారు.కారణాలు ఇవీ...ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గతంలో సొంత భవనాలు లేకపోవడం, ఉన్నవి పురాతన భవనాల్లో తరగతులు నిర్వహించడం సమస్యగా ఉండేది. ఇప్పుడు జిల్లాలోని అన్ని కళాశాలలకు సొంత భవనాలు సమకూరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మౌ లిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కళాశాల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంకితభావం, అనుభవం ఉన్న అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రతిరోజూ కళాశాలల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందిన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. ఇవే కాకుండా, పదో తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే కళాశాల అధ్యాపకులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించడం కూడా ప్రవేశాల పెరుగుదలకు దోహదపడింది.ప్రవేశాల గడువు పెంపు..ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు జూలై 31ని చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వెలువడడంతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం ప్రవేశాల గడువును పొడిగించారు. ఈ నెల 20 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.మరింత పెరిగే అవకాశంప్రభుత్వ జూనియర్ కళాశాలు 13ఫస్టియర్ విద్యార్థులు 2,592సెకండియర్ విద్యార్థులు 2,252జనరల్లో చేరిన విద్యార్థులు 2198ఒకేషనల్లో చేరిన విద్యార్థులు 394జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్నాయి. ఇప్పటికే 2,592 మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరారు. మరింత ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే 340 అడ్మిషన్లు పెరిగాయి. గడువు పెంచిన నేపథ్యంలో మరిన్ని ప్రవేశాలు ఉంటాయి. – పరశురామ్నాయక్ జిల్లా నోడల్ ఆఫీసర్ -
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బలిరాం, ఎస్సీఆర్పీ రాజబాబు, విజయ్కుమార్, సీఆర్టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్రెడ్డి, నాయకులు జీవన్జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు. -
ఫుల్ గి‘రాఖీ’
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ‘మహాలక్ష్మి’లే అధికం.. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకోవడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆదిలాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. ముందస్తు ప్రణాళికతో.. వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బస్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వరకు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఉద్యోగుల ఇబ్బందులను సైతం పరిగణలోనికి తీసుకొని ఈ సారి వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. ప్రయాణికులను సురక్షితంగా చేర్చాం.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఆపరేట్ చేశాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. ఆదాయం సైతం గతంతో పోలిస్తే ఘననీయంగా పెరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – ఎస్. భవానీప్రసాద్, ఆర్ఎం, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఇలా.. (ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు) డిపో బస్సులు ఆదాయం ప్రయాణించిన (రూ.కోట్లలో) కి.మీ(లక్షల్లో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26 -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన గన్నా శ్రవణ్కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే. – అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్ -
ఎన్ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్గూడకు చెందిన ఎన్ఆర్ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్కుమార్కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్లో ఏఎన్ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. వినాయక మండపం కూల్చివేతబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్టౌన్ ఎస్హెచ్వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు. కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేతకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. యూరియా కోసం రైతుల వెతలుతాండూర్: ఖరీఫ్ సీజన్లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్లోని రిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై దాడి!ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అదుపుతప్పి వ్యాన్ బోల్తాబెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
పెరిగిన ‘జూనియర్లు’
జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలు.. కళాశాల జనరల్ ఒకేషనల్ మొత్తం పేరు విద్యార్థులు ముధోల్ 203 155 358 తానూర్ 106 0 106 భైంసా 199 24 223 లోకేశ్వరం 104 0 104 కుభీర్ 147 0 147 నిర్మల్ (బాలుర) 288 0 288 నిర్మల్ (బాలికలు) 279 85 364 దిలావర్పూర్ 157 57 214 సారంగాపూర్ 183 0 183 మామడ 200 0 200 ఖానాపూర్ 147 73 220 కడెం 100 0 100 కుంటాల 85 0 85 -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఒకరు..కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్నగర్కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జఠాశంకర ఆలయంలో..ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు. -
‘డబుల్’ పనులకు ఎమ్మెల్యేనే అడ్డు
● మహేశ్వర్రెడ్డిపై మాజీ మంత్రి తీవ్ర ఆరోపణ ● సిద్దాపూర్ వద్ద పనులు పూర్తి చేయాలని డిమాండ్ ● లేదంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరిక నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సదుపాయాలు కల్పించాలని సిద్ధాపూర్లో మంగళవారం ధర్నా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మల్ నియోజకవర్గంలో 2 వేలకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. సిద్దాపూర్ వద్ద నిర్మించిన ఇళ్లలో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.8 కోట్లు మంజూర చేసిందన్నారు. కానీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి పనులు చేయించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం వారిని వేధిస్తున్నాడని విమర్శించారు. ఈనెల 25లోపు పనులు ప్రారంభించాలని, 4 నెలల్లో పనులను పూర్తి చేయకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 25లోపు పనులు ప్రారంభించకుంటే కలెక్టరేట్ వద్ద 600 మంది లబ్ధిదారులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు. మంత్లీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మహేశ్వర్ రెడ్డి నిర్మల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ కౌన్సిలర్ రవూఫ్, నాయకులు నర్సాగౌడ్, ముడుసు సత్యనారాయణ, అనుముల భాస్కర్, నాలం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, రమేశ్, గజేందర్, అన్వర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
మెక్కేది మిల్లర్లే!
నిర్మల్కుడి.. ఎడమైతే! కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఆగస్టు 13 వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్ టౌన్: రాబోయే 72 గంటల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ల కూడదని, రైతులు విద్యుత్ తీగలు, స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపా రు. జిల్లాలో విపత్తు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పొంగుతున్న వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వరద ప్రభా విత ప్రాంతాలైన కడెం, స్వర్ణ ప్రాజెక్టు చుట్టూ పక్కన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాన్నారు. చెరువులు, కుంటలు సందర్శనకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అత్య వసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీసు హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్ టీంలు అప్రమత్తంగా ఉంటాయని వెల్లడించారు. నిర్మల్: జిల్లాలో రైస్ మిల్లుల మాయాజాలం కొనసాగుతూనే ఉంది. అధికారులు ఎన్నికేసులు పెడుతున్నా.. మిల్లర్లు పేదలకు అందాల్సిన బియ్యాన్ని మెక్కుతూ.. కోట్లు కొల్లగొడుతున్నారు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఇవ్వాల్సిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్నే మింగేస్తున్నాయి. అధికారులకు ఖాళీ మిల్లులు చూపిస్తున్నాయి. ‘కేసులే కదా పెట్టుకోండి’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో మిల్లర్ల తీరు ఏమాత్రం మారడం లేదు. గడువుదాటినా బియ్యం ఇవ్వని ఏ రైస్ మిల్లును పరిశీలించినా.. ఖాళీ సంచులే దర్శనమిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోరెండు రైస్మిల్లుల్లో బియ్యం లేకపోవడంతో అధికారులు కేసులు నమోదు చేశారు. మరో రెండుమిల్లులపై.. ముధోల్ మండలం ముద్గల్లోని ఏషియన్ రైస్మిల్లో 2024–25సంవత్సరం ఖరీఫ్, రబీలో సేకరించిన 4,411.917 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. ఇదే గ్రామంలోని గణపతి రైస్మిల్లోనూ 2024–25 ఖరీఫ్, రబీలో 2699.531 మెట్రిక్ టన్నుల బియ్యం లేకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈనెల 8న ముధోల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఏషియన్ రైసుమిల్ 12 శాతం వడ్డీతో రూ.18.03 కోట్లు, గణపతి రైస్మిల్ రూ.11.02 కోట్ల విలువైన బియ్యం దారిమళ్లించినట్లు తేల్చారు. ఈరెండు మిల్లుల్లోనే దాదాపు రూ.30 కోట్ల బియ్యం మాయం చేశారు. ఈమధ్యకాలంలో నిర్మల్లోని సరస్వతీ రైసుమిల్, కడెంలోని రాఘవేంద్ర, బాసరలోని వరలక్ష్మి, మాటేగాంలోని వెంకటేశ్వర రైసుమిల్లుల్లోనూ సీఎంఆర్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో అధికారులు కేసులు నమోదు చేశారు. చర్యలు తీసుకుంటున్నాం.. సీఎంఆర్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. జిల్లాలో గడువు దాటినా బియ్యం ఇవ్వని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా రెండు మిల్లులపైనా కేసులు నమోదయ్యాయి. తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. గడువులోపు బియ్యం అప్పగించాలి. – కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్న్యూస్రీల్కొల్లగొట్టేందుకే మిల్లులు.. హమాలీ చార్జీలు పెంచాలి నిర్మల్చైన్గేట్: హమాలీ, చాట, దడ్వాయి చార్జీలు పెంచాలని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ మాట్లాడుతూ 50 కేజీల బస్తాకు రూ.20, చాట చార్జీ రూ.6 పెంచాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారానికి కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఎస్యన్.రెడ్డి, భూక్య రమేశ్, ఎస్కే.హాజీ, సందేశ్, విఠల్, రాజుబాయి, గంగబాయి, సావిత్రిబాయి పాల్గొన్నారు. గింజ లేకుండా మాయం... తీసుకున్న ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా బియ్యం గింజ కూడా లేకుండా మిల్లులు అమ్ముకుంటున్నాయి. సర్కారుకు ఇవ్వాల్సిన మెట్రిక్టన్నుల కొద్దీ ధాన్యాన్ని ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటించేశాయి. జిల్లాలో ఓవైపు అధికారులు కేసులు నమోదు చేస్తున్నా.. మిల్లర్ల మాయాజాలం మాత్రం ఆగడం లేదు. క్రిమినల్ కేసులను నమోదుచేస్తున్నా.. ధాన్యం డబ్బుల రికవరీకి ఆర్ఆర్ యాక్ట్లను పెడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో ఆగని మిల్లర్ల మాయాజాలం కేసులు పెడుతూనే ఉన్నా అదే దోపిడీ తాజాగా మరో రెండింటిపై కేసులురైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు గడువులోపు మిల్లింగ్ చేసి బియ్యం రూపంలో తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత మిల్లర్లు కమీషన్ రూపంలో తీసుకుంటారు. ఈక్రమంలో మిల్లుల్లో ధాన్యాన్ని అమ్ముకుంటూ.. అధికారుల తనిఖీలప్పుడు ఏదో మేనేజ్ చేస్తున్నారు. లేదంటే.. మొత్తం అమ్ముకుని చేతులు ఎత్తేస్తున్నారు. ఏళ్లుగా చాలామంది మిల్లర్లు ఇలా చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. స్వల్పకాలంలోనే కోట్లు సంపాదించే రాజమార్గంలా మిల్లులు కనిపిస్తుండటంతో ఇటీవల కాలంలో జిల్లాలో చాలామంది రైసుమిల్లుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. సర్కారు ఇచ్చిన గడువును పట్టించుకోకుండా.. ధాన్యాన్ని అమ్మేసుకుంటూ.. రేషన్ దుకాణాల నుంచి వచ్చిన బియ్యాన్ని తిరిగి సర్కారుకు అప్పగిస్తూ.. అక్రమదందా చేస్తున్నారు. -
వేలం మళ్లీ వాయిదా
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ వద్ద నిర్వహించే వివిధ వ్యాపారాల నిర్వహణకు దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించాల్సిన వేలం మళ్లీ వాయిదా పడింది. వేలంలో పాల్గొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఆలయం వద్ద కొబ్బరికాయ ల విక్రయం, ప్యాలాలు పుట్నాల విక్రయం, బొమ్మలు, సీడీలు, కంకణాలు విక్రయించుకునే దుకాణం, టోల్ట్యాక్స్ వసూలు, పూలదండల విక్రయం దుకాణాలకు గతనెలలో వేలం నిర్వహించారు. వ్యాపారులు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ఈసారి కూడా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో ఐదు రకాల వ్యాపారాలకు వేలం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సారంగాపూర్కు చెందిన రవిచంద్ర అనే వ్యాపారి రూ.1,62,000లకు హెచ్చు పాటపాడి పలు దుకాణాలు దక్కించుకున్నారు. మిగతా వ్యాపారాలకు ఈనెల 18న మళ్లీ వేల నిర్వహిస్తామని ఈవో రమేశ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ తెలిపారు. -
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.నిర్మల్ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం. ప్రోత్సహిస్తేనే మంచిది.. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్ఎం సులోచన, అరవింద్, గంగాధర్లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్రావు తదితరులు ఉన్నారు. -
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర గోదావరిలో భక్తుల మొక్కులుబాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్ప్రసాద్లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో ఉత్తమ విద్య
బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. మెటా గేట్ అకాడమీతో ఒప్పందం ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జైపూర్: అనారోగ్య సమస్యలతో, హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ వెల్లడించారు. ‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’ పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్కు చెందిన సయ్యద్ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
గోడు వినండి.. గోస తీర్చండి..
నిర్మల్చైన్గేట్: ఏ ఆధారమూ లేదు.. పింఛన్ ఇ ప్పించి ఆదుకోవాలి.. పట్టా అయిన భూమి రికార్డులో తక్కువగా ఉంది.. భూమి ఆక్రమించాలని చూ స్తున్నారు.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు..’ ఇలా పలు సమస్యలపై ప్రజావాణిలో పలువురు తమ గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 110 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఇతర ఆధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధి కారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేయాలి.. ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు సంబంధించిన వివరాలను వెంట వెంటనే అప్డేట్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వేగవంతంగా చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలులోకి వచ్చిన ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ హాజరు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలని సూ చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్లాట్లకు పట్టాలు ఇప్పించాలి.. మాది లోకేశ్వరం మండలం ఎడ్దూర్. ఎస్సారెస్పీ ముంపు బాధితులం. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్ప టి ప్రభుత్వం మాకు కోమల్కోట్ పునరావాస గ్రా మంలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే ప్లా ట్లకు పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికై నా ఇప్పించాలి. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పింఛన్ రూ.6016కు పెంచి ఇవ్వాలి. అర్హులైన దివ్యాంగులకు బ్యాక్లాక్ పోస్టుల్లో ఉద్యోగాలు ఇప్పించాలి. ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిల్ అందజేయాలి.– దివ్యాంగుల హక్కుల పోరాట సమితి పాత పద్ధతిలోనే టెండర్.. గురుకులాల్లో పాత టెండర్ విధానం కొనసాగించాలి. మహిళా సంఘాలు యువజన సమాఖ్యలకు టెండర్ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని విరమించుకోవాలి. ఈఎండీ సెక్యూరిటీ విధానంలో వెసులుబాటు కల్పించాలి. లేదంటే ఈనెల 14 నుంచి విద్యాలయాలకు ఆహార పదార్థాల సరఫరా, పండ్లు, గుడ్లు, మాంసం సప్లై నిలిపివేస్తాం. – తెలంగాణ గురుకుల కాంట్రాక్ అసోసియేషన్ సభ్యులు ప్రజావాణిలో అర్జీ స్వీకరించి బాధితుల గోడు వింటున్న కలెక్టర్ అభిలాష అభినవ్ -
అర్హుల జాబితా నుంచి తొలగించారు
నిర్మల్ రాంరావ్బాగ్లో నివాసం ఉంటున్నాం. మా అమ్మ సామోజి అంజలి పేరు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపడదామనుకుంటే.. అధికారులు అర్హుల జాబితాలో మా పేరు లేదంటున్నారు. – సాయి కృష్ణ, రాంరావ్ బాగ్ విద్యుత్ తీగలు సరిచేయాలి.. నేను జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీవాసిని. మా కాలనీలోని పాత ఎస్ఆర్కే స్కూల్ భవనం ముందు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. వినాయక చవితి దృష్టిలో ఉంచుకుని విద్యుత్ తీగలు సరిచేయాలి. – అంబేకర్ వరప్రసాద్, గాంధీనగర్ నా భర్త మృతదేహం తెప్పించండి.. నాది దస్తురాబాద్ మండలం మున్యాల్. ఉపాధి నిమిత్తం నా భర్త సంగ సురేశ్(33) ఏజెంట్కు 2.50 లక్షల రూపాయలు చెల్లించి ఉజ్బెకిస్తాన్ వెళ్లాడు. అనారోగ్య కారణంగా జూలై 21న మరణించాడు. 22 రోజులు అవుతున్న మృతదేహం రాలేదు. మీరైనా తెప్పించండి. – సంగ మమత, మున్యాల్ -
బేస్ బాల్ ఎంపిక పోటీలు
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి సీనియర్ బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ప్రతిభ కనబర్చినవారు ఆదిలాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా సెక్రెటరీ రవీందర్గౌడ్ తెలిపారు. ఇందులో స్కూల్ గేమ్స్ మాజీ సెక్రటరీ రమణారావు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ సంజీవ్, సంజు రాథోడ్, సుష్మిత, సాయిరాజ్, హన్మాండ్లు, సునీత తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు..జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి అండర్– 13 బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ రవీందర్గౌడ్ పోటీలను పర్యవేక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ సెక్రెటరీ అన్నపూర్ణ, వ్యాయా మ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ సంజీవ్, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి..
మాది మామడ మండలం కొరటికల్ గ్రామం. సర్వే నంబర్ 1096లో 22 గుంటల భూ మి మా అమ్మగారి పేరు మీద ఉంది. ఈ భూమిని నా పేరు మీద మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలి. – జంగం గంగవ్వ, కొరిటికల్ ఉద్యోగం ఇప్పించాలి.. మాది పెంబి మండలం పెంబి తండా. జీఎన్ఎమ్ కోర్సు చేసి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నాను.పెంబి ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్న ర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. నేను ఈ పోస్టుకు అర్హుడను. దయతలచి ఈ పోస్టు ఇ ప్పించగలరు. – అంగోత్ దయాకర్, పెంబి తండా బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి.. నేను నర్సాపూర్(జి) మండలం రాంపూర్కు చెందిన దివ్యాంగుడిని. 15 ఏళ్ల క్రితం ఇన్ఫెక్షన్తో నా కాలు తొలగించారు. గతంలో అలింకో కంపెనీ ద్వారా నేను వీల్చైర్ను పొందాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. బ్యాటరీ సైకిల్ ఇప్పించగలరు. – కొండ రాజన్న, రాంపూర్ -
నిర్మల్
విజిట్ వీసా.. ఎడారి గోస! ఉపాధి కోసం జిల్లావాసులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతం. సామాన్యులకు అండగా పోలీసులు నిర్మల్టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహభావంతో మెలగాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీ సుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా సమాచారం ఇవ్వాలని సూచించారు. సాక్షి : రైతులు భూసమస్యలతో ఇబ్బంది పడుతున్నారు..? సబ్ కలెక్టర్ : భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోంది. రైతులు ఎవరైనా తమ సమస్యలను తహసీల్దార్కు అప్పీల్ చేయవచ్చు. అక్కడ పరిష్కారం కాని పక్షంలో సబ్కలెక్టర్ దృష్టికి తేవచ్చు. ఇక్కడా పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారి వద్దకు వెళ్లవచ్చు. సాక్షి : చెరువులు, కుంటలు ఆక్రమణలపై ఎలా స్పందిస్తారు..? సబ్ కలెక్టర్ : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. భైంసాటౌన్: సమస్యలను సవాల్గా స్వీకరించి, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా చేరువ చేసేలా కృషి చేస్తానని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్ అన్నారు. భైంసా సబ్ కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు రెవెన్యూ డివిజనల్ అధికారి హోదా ఉండగా, ప్రభుత్వం సబ్ కలెక్టర్ హోదా అధికా రిని కేటా యించడంతో డివిజన్ ప్రజల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురించా యి. తమ సమస్యలను నేరుగా సబ్ కలెక్టర్ దృష్టికి తేవడం ద్వారా త్వరగా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం గురించి..! సబ్ కలెక్టర్ : మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. అమ్మ సవిత ఇస్రోలో ప్రాజెక్ట్ మేనేజర్. నాన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్. అమ్మానాన్నలకు ఒక్కడినే సంతానం. హైదరాబాద్లో పదో తరగతి పూర్తి చేశాను. సైఫాబాద్ బ్రాంచ్లో ఫిట్(ఎఫ్ఐఐటీ)జేఈఈ 2013లో పూర్తయిన తరువాత, ఢిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ పట్టా తీసుకున్నా. రీసెర్చ్ వైపు ఆసక్తి ఉండడంతో, జపాన్లో రీసెర్చింగ్లో ఉద్యోగం చేశాను. అది సంతృప్తినివ్వలేదు. అందుకే సివిల్స్ సాధించాలనుకున్నాను. రెండో ప్రయత్నంలోనే ఆలిండియా 35వ ర్యాంకు సాధించాను. సాక్షి : భైంసాపై అవగాహన ఉందా..? ఇక్కడి సమస్యలను ఎలా తీసుకుంటారు..? సబ్ కలెక్టర్ : భైంసాలో తరచూ మత ఘర్షణలు జరుగుతాయని విన్నాను. అయితే, నేను వీటి ని సమస్యగా భావించను. వాటిని సవాల్గా స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తాను. అందరూ ఐక్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటా. సాక్షి : సబ్ కలెక్టర్గా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు? సబ్ కలెక్టర్ : అధికారి హోదా ఏదయినా.. చట్టరీత్యా, నిబంధనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం ఉంటుంది. అయితే, ఐఏఎస్ అధికారి కావడంతో, సమస్యల పరిష్కారంలో కచ్చితత్వం, వేగవంతమైన నిర్ణయాధికారం ఉంటుంది. సాక్షి : యువతకు మీరిచ్చే సూచనలు.. సబ్ కలెక్టర్ : యువత ఉన్నత చదువుల కోసం, కోచింగ్ కోసం స్థానికంగా వసతులు లేవని నిరుత్సాహ పడొద్దు. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి. ప్రస్తుతం ఆన్లైన్లో అన్ని విషయాలకు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ, జీవితంలో ఉన్నత లక్ష్యంవైపు అడుగులు వేయాలి. -
సూపర్ బ్రెయిన్ యోగా
బాసర : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుంజీళ్ల జాతీయ ప్రచారకులు అందె జీవన్రావు ఆధ్వర్యంలో ‘సూపర్ బ్రెయిన్ యోగా’పై కార్యశాల సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 14 రౌండ్లు ఈ యోగాను ఆచరించారు. అందె జీవన్రావు మాట్లాడుతూ, గుంజీళ్లను శిక్షగా భావించడం దురదృష్టకరమన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఈ యోగా మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత, మానసిక సమతుల్యతను పెంపొందిస్తుందని, రోజూ ఆచరిస్తే విద్యార్థులు అధిక మార్కులు సాధించవచ్చని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. పర్యావరణ కాలుష్యం, ఎలక్ట్రానిక్ రేడియేషన్, మానసిక ఒత్తిడి వల్ల పీనియల్ గ్రంథి పనితీరు దెబ్బతింటుందని, దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి జీవ గడియారం గాడితప్పుతుందని ఆయన హెచ్చరించారు. సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలల్లో ప్రార్థన సమయంలో చేర్చడం ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాధ్యాయులు సురేష్, నరేందర్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్కు డబుల్ బెడ్రూం ఇళ్ల బాధితులు
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలోని డబుల్ బెడ్రూం ఇళ్లను అనర్హులకు కేటాయించి అర్హులకు అన్యాయం చేశారని సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సునారికారి రాజేశ్, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పీటర్, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకన్న అన్నారు. బాధిత నిరుపేదలతో కలిసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు పలు వాహనాల్లో తరలివెళ్లారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిన నాటి నుంచి విచారణ చేస్తామని అధికారులు అనర్హులను తొలగించకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన వారిని తొలగించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, బాధితులు తోట రాధ, గౌస్, పద్మ, సునీత, జావిద్, గీత, సురేశ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న క్షేత్ర పరిశీలన
సోన్: మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రా మాల్లో నానో డీఏపీ, నానో యూరియా వినియోగించి సాగు చేస్తున్న మొక్కజొన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ ఆదివారం పరిశీ లించారు. రసాయనిక ఎరువులకు బదులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని సూ చించారు. రైతు బీమా కోసం అర్హులైన రైతులు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామి ని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. ఏవో వినోద్కుమార్, రై తులు నర్సారెడ్డి, భీమేశ్, వేణు, మోహన్ ఉన్నారు. -
కోర్టూ.. దూరం కావొద్దు..!
నిర్మల్బాసరలో భక్తుల రద్దీ బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 20258లోu జాతీయస్థాయి పోటీలకు ఎంపిక లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్ గ్రామానికి చెందిన దెబ్బడి సురేందర్ జా తీయస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యా డు. ఇటీవల ఆదిలాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో కామారెడ్డి జిల్లా తరఫున రెండు విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. బ్యాక్ టెండింగ్లో జాతీ యస్థాయికి ఎంపికై సీనియర్ ట్రెడిషనల్ విభా గంలో రజత పతకం సాధించాడు. సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్లో నిర్వహించనున్న జాతీయస్థా యి పోటీల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సురేందర్ తెలిపాడు. నిర్మల్: ఇప్పటికే దూరంగా ఉన్న కలెక్టరేట్కు వెళ్లాలటే ఇబ్బందులు పడుతుంటే.. రానున్న రోజుల్లో కోర్టులనూ ఊరికి దూరంగా తీసుకెళ్తారన్న విషయంపై జిల్లావాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టరేట్ ఒకవైపు ఉంటే.. ఇక కోర్టు ఇంకోవైపు దూ రభారంగా మారుతుండటంపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కూడా వ్యతిరేకత వ్య క్తంచేస్తున్నారు. అందరికీ అందుబాటులో ప్రస్తుతం నిర్మల్లో ఉన్న కోర్టుప్రాంగణం పరిధి లోనే నూతన కోర్టులు నిర్మించాలని కోరుతున్నారు. ఏళ్లుగా సమీపంలోనే.. జిల్లాకేంద్రంలో ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక కట్ట డంలో మొదట్లో జూనియర్ సివిల్ జడ్జి (డిస్ట్రిక్ట్ ము న్సిఫ్) న్యాయస్థానం ఉండేది. 1984లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అదనంగా కొత్త భవనాన్ని నిర్మించా రు. జిల్లా ఏర్పాటుతో కొత్తకోర్టుల రాకతో సమీపంలోని వివిధ శాఖల భవనాల్లో ఆయా కోర్టులు ఏ ర్పాటు చేశారు. ఇవన్నీ ప్రధాన రహదారి నుంచి న డిచి వెళ్లేంత దూరంలోనే ఉన్నాయి. బస్టాండ్, శివాజీచౌక్, ఈద్గాం చౌరస్తా తదితర ప్రధాన ప్రాంతాల నుంచీ దగ్గరలోనే ఉన్నాయి. అందుబాటులో నిర్మించాలని.. ఇప్పటికే ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్తో ఇబ్బందులు పడుతున్నామని, ఇక కోర్టుల ప్రాంగణాన్నీ దూరభారం చేయొద్దని జిల్లావాసులు విన్నవిస్తున్నారు. దీనిపై నిర్మల్ బార్ అసోసియేషన్ కూడా వ్యతిరేకత వ్యక్తంచేస్తోంది. సామాన్యులతో పాటు న్యాయవ్యవస్థలో ఉన్నవారూ మహిళా ప్రాంగణ స్థలం దూరభారంగా మారుతుందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి ఆ ధ్వర్యంలో న్యాయవాదులు ప్రజాప్రతినిధులు, మా జీ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులను కలిసి విషయాన్ని వివరిస్తున్నారు. కోర్టుల్లో సకాలంలో హాజరు కావాల్సి ఉంటుందని, అలాగే సాయంత్రం కేసులు ఆలస్యమైతే అక్కడి నుంచి నిర్మల్ రావడమూ ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా కోర్టుల ప్రాంగణం నిర్మించేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కోర్టు ఉన్నచోట దాదాపు మూడున్నర ఎకరాలతో పాటు పక్కనే ఉన్న పాత ఎమ్మా ర్వో, ఆర్అండ్బీ కార్యాలయాల స్థలాన్ని కలుపుకొ ని నిర్మాణం చేపట్టవచ్చని సూచిస్తున్నారు. లేనిపక్షంలో మంచిర్యాల రోడ్డులో ఇరిగేషన్శాఖకు సంబంధించి గతంలో సీడీ–4ఆఫీస్ ఉన్న స్థలంలోనూ నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. న్యాయమూర్తుల నివాసాలను గతంలో సోఫీనగర్లో కోర్టుభవనం కోసం కేటాయించిన స్థలంలో నిర్మించవచ్చని జిల్లావాసులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండాలి జిల్లాకేంద్రంలో నిర్మించనున్న 10 కోర్టుల కాంప్లెక్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నాం. ఇప్పటికే జిల్లావాసులకు కలెక్టరేట్ దూరభారంగా మారింది. ఇప్పుడు కోర్టులు కూడా అలా కావొద్దన్నదే మా ఉద్దేశం. ప్రజలకు దూరభారం కాకుండా అందుబాటులోనే న్యాయస్థానాలు ఉండేలా నిర్మించాలని మావంతు ప్రయత్నం చేస్తున్నాం. – అల్లూరి మల్లారెడ్డి, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు 13, 14లో ఆధార్ క్యాంపులు నిర్మల్ రూరల్: ఈనెల 13, 14 తేదీల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విద్యార్థుల ఆధార్ నమోదుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్కార్డులో తప్పులుంటే సవరణకు కూడా అవకాశముందని పే ర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సి పాలిటీ పరిధిలోనూ ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యూస్రీల్అయ్యప్ప సేవకునికి గుర్తింపు బాసర: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అఖిలభారత అయ్యప్ప ధర్మ ప్రచార రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని స్థానిక హోటల్ నార్త్ ఇన్లో ఆది వారం నిర్వహించారు. సమావేశంలో బాసర గ్రామానికి చెందిన జంగం రమేశ్ను రాష్ట్ర ఉ పాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. రమేశ్ ఇప్పటికే స్టేట్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, శబరి మలైలోని నారాయణతోడులో గల అన్నదాన మందిరానికి శాశ్వత ట్రస్ట్ సభ్యునిగా సేవలందిస్తున్నారు. జ్ఞాన సరస్వతీ, అయ్యప్పస్వామి ఆశీస్సులతో తనకీ గౌరవం దక్కిందని ఈ సందర్భంగా రమేశ్ పేర్కొన్నారు. అయ్యప్పస్వామి ఆశీస్సులతో బాసర ఖ్యాతిని పెంచడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. కొత్త భవనం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట నూతన న్యాయస్థానాల ప్రాంగణాలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోనూ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తం 10 కోర్టుల ప్రాంగణ నిర్మాణానికి గాను కనీసం ఐదెకరాలు ఉండాలని హైకోర్టు సూచించింది. జిల్లాకేంద్రంలో ప్రస్తుతం ఉన్న కోర్టు పరిధిలో సుమారు 3ఎకరాల 20గుంటల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సరిపడా స్థలం లేక పలు స్థలాల పరిశీలన చేశారు. పాత ఎమ్మార్వో, ఆర్అండ్బీ కార్యాలయాల వద్ద సమీకృత మార్కెట్ కోసమంటూ కేటాయించిన స్థలాన్ని, చించోలి(బి) సమీపంలోని మహిళా ప్రాంగణం వద్ద గల స్థలాన్ని పరిశీలించారు. ఇందులో మహిళా ప్రాంగణం వద్ద గల స్థలమొక్కటే సరిపడా ఉన్నట్లు గుర్తించారు. ఇది దూరభారంగా ఉండటంతో జిల్లా ప్రజలు, న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ముత్తవ్వకు 68ఏళ్లు. తనది కుంటాల మండలం. భూసంబంధిత సమస్య ఉండటంతో తన మనుమడితో కలిసి బస్సులో నిర్మల్కు వచ్చింది. బస్టాండ్లో ఆటో మాట్లాడుకుని ఎల్ల పెల్లి శివారులోని కలెక్టరేట్కు చేరుకుంది. పనిపూర్తయ్యే సరికి సాయంత్రమైంది. మధ్యాహ్నం అక్కడే క్యాంటిన్లో రెండు సమోసలు తిన్నారు. సాయంత్రం తిరిగి వెళ్లడానికి కలెక్టరేట్ బయటకు రాగా, ఆటో దొరకడానికి అరగంటపైనే పట్టింది. అక్కడి నుంచి బస్టాండ్ చేరుకున్నారు. తన మనుమడు ఆటోడ్రైవర్కు డబ్బులిస్తుంటే..‘ఇదేం బిడ్డా..! మనం కుంటాలకెళ్లి అచ్చిపోయినదానికంటే, ఈడ ఊళ్లె ఉన్న ఆఫీసుకు పోయచ్చినందుకే ఎక్కువ పైసలైనై గదా..’ అని వాపోయింది. ఈ పరిస్థితి ఒక ముత్తవ్వదే కాదు. చాలామంది జిల్లావాసులు ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికే కలెక్టరేట్ దూరభారం ఇబ్బంది పడుతున్న జిల్లాప్రజలు న్యాయస్థానం అందుబాటులోనే ఉండాలంటున్న బార్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులు, నాయకులకు విజ్ఞప్తి -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనం దండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మా రుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చి న పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర పెరగడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం మినహా వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నాయి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) తన నానోఫ్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్ర మాద బీమా పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతినిధులు, వ్యవసాయాధికారులు నానో యూరియా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంతోపాటు సంకటహరణ బీ మా పథకం గురించి అవగాహన కల్పిస్తున్నారు. బీమా అర్హతలు.. సహకార సంఘాల ద్వారా రైతులు ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరి మితి లేకుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్ కొనుగోలుపై రూ.10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100% పరి హారం, రెండు అవయవాలు కోల్పోతే 50%, ఒ క అవయవం కోల్పోతే 25% పరిహారం అందుతుంది. ఈ బీమా ఎరువులు కొనుగోలు చేసిననాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీ దుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలుదారుని సంతకం లేదా వేలిముద్ర త ప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా పరిహారం పొందడానికి అసలు రశీదు తప్పనిసరి. దీంతోపాటు, విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ క్లెయిం పత్రాలు ప్రమాదం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోపు సికింద్రాబాద్లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలని అధికారులు తెలిపారు. రైతులకు ప్రయోజనకరం సహకార సంఘాల ద్వారా ఇఫ్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తోంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఆ సంస్థ ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసుకోవాలి. – అంజిత్కుమార్, ఏవో, దండేపల్లి ఉమ్మడి జిల్లాలో రైతులు, సాగు విస్తీర్ణం, వినియోగించే ఎరువుల వివరాలు జిల్లా రైతుల సంఖ్య సాగు విస్తీర్ణం యూరియా డీఏపీ (ఎకరాల్లో..) (మెట్రిక్ టన్నుల్లో) (మెట్రిక్ టన్నుల్లో) మంచిర్యాల 1.64 లక్షలు 3.31 లక్షలు 43 వేలు 13 వేలు నిర్మల్ 1.90 లక్షలు 4.40 లక్షలు 35 వేలు 10 వేలు కు.ఆసిఫాబాద్ 1.32 లక్షలు 4.45 లక్షలు 60 వేలు 12 వేలు ఆదిలాబాద్ 1.65 లక్షలు 5.85 లక్షలు 35 వేలు 13 వేలు -
‘రైతు’కు బీమా భరోసా
● కొత్త దరఖాస్తులకు ఆహ్వానం ● ఈ నెల 13వరకు అవకాశంనిర్మల్చైన్గేట్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చే స్తోంది. బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తోంది. రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ పథకానికి జిల్లాలో ఇప్పటివరకు 1.15 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఏడేళ్ల వ్యవధిలో సుమారు 4వేలకు పైగా రైతులు ప్రమాదవశాత్తు మరణించగా, ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు అందించింది. జిల్లాలో ఇప్పటివరకు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించనుండగా వ్యవసాయాధికారులు రెన్యూవల్ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రైతు భ రోసా పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి మరో రెండువేల మంది..! ప్రతీ సంవత్సరం రైతు బీమా కోసం అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది దరఖాస్తుల స్వీకరణకు శని వారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి 2వేల నుంచి 3వేల మంది రైతులు కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారి నుంచి కూడా దరఖా స్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతు నామిని పేరు మార్పు చేసుకునే అవకాశ మూ కల్పించినట్లు చెబుతున్నారు. 13వరకు దరఖాస్తుల స్వీకరణ రైతువేదికల్లో ఈ నెల 13వరకు రైతుల నుంచి రైతు బీమా పథకం దరఖాస్తులు స్వీకరించనున్నారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో వ్యవసాయాధికారులు బీమా దరఖాస్తుల సేకరణలో బిజీబిజీగా ఉండనున్నారు. దరఖాస్తు చే సుకోవాలని ఇప్పటికే ఏఈవోలు వివిధ మాధ్యమా ల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినియోగించుకోవాలి రైతు బీమా పథకాన్ని అర్హులైన ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ప్రతీ రైతు నేరుగా ఏ ఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవా లి. ఈ అవకాశం వినియోగించుకోవాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి 2025–26 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతు బీమా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. రైతుల పాత డేటాను ఈ నెల 12లోపు అధికారులు పునరుద్ధరిస్తారు. కొత్త నమోదు గడువు 13తో ముగుస్తుంది. ఈ విషయాన్ని రైతులు గమనించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. – అభిలాష అభినవ్, కలెక్టర్ జిల్లాలో పథకం అమలు వివరాలు సంవత్సరం బీమా నమోదు క్లెయిమ్ సెటిల్ 2018 84,454 547 2019 85,384 517 2020 90,300 702 2021 96,397 642 2022 1,02,526 634 2023 1,12,793 699 2024 1,15,906 627 -
డీఈవోపై చర్య తీసుకోవాలి
కడెం: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్నాయక్పై డీఈవో రామారావు, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి దాడికి యత్నించారని మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేశ్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం జనరల్ సె క్రటరీ పసుల రాజలింగం ఆరోపించారు. ఆది వారం స్థానిక ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. రాజేశ్నాయక్ ఇటీవలే ఎస్సీ, ఎ స్టీ ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ, సర్దుబాటు అంశంలో రిజర్వేషన్ గురించి డీఈవో కార్యాలయంలో ప్రశ్నించినందుకు డీఈవోతో పాటు ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి భౌతిక దాడికి యత్నించి, కులం పేరుతో తిట్టా రని ఆరోపించారు. సమగ్ర విచారణ చేపట్టి శా ఖాపరమైన చర్యలు తీసుకోకుంటే దళిత, గిరి జన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి గంగయ్య జోసెఫ్, రాజేశ్నాయక్ తదితరులున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ పవర్
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి, ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రభుత్వ భవనాల వివరాలు, నెలవారీ విద్యుత్ వినియోగం, బిల్లులను వారంలోగా సమర్పించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర శాఖ భవనాలపై కూడా సౌర ఫలకాలు అమర్చనున్నట్టు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీపీవో శ్రీనివాస్, టీజీ రెడ్కో ఎండీ ఎల్.శ్రీనివాస్, ఏపీడీ నాగవర్ధన్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రభాకర్ పాల్గొన్నారు. -
కూలీలకు ‘భరోసా’ ఏది?
● అమలుకాని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ● లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా అందని ఆర్థికసాయం ● వ్యవసాయ కూలీలకు తప్పని ఎదురుచూపునిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం తన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ సాయం రెండు విడతల్లో అందించేలా నిర్ణయించింది. జిల్లాలో ఈ పథకం అమలు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని ఎంపిక చేసి, జనవరి 26న మంజూరు పత్రాలు అందజేశారు. ఈ 18 గ్రామాల్లో 688 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అయితే, రెండో విడత సాయం అందాల్సిన సమయం దాటినా, ఇప్పటి వరకు అందలేదు. మిగిలిన గ్రామాల లబ్ధిదారులకు ఈ సాయం ఎప్పుడు అందుతుందనే దానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు. లబ్ధిదారుల ఎంపిక.. ఈ పథకం కింద భూమిలేని, ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలోని 396 గ్రామాల నుంచి 27,446 మంది లబ్ధిదారులను ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశారు. అయినా కేవలం 688 మందికి మాత్రమే మొదటి విడత సాయం అందడంతో మిగిలిన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామాలకే సాయం పరిమితమైన నేపథ్యంలో, మిగిలిన లబ్ధిదారులకు ఎప్పుడు ఆర్థిక సాయం అందుతుందనే సమాచారం అధికారులు తెలుపడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లా వివరాలు: మొత్తం మండలాలు 18గ్రామపంచాయతీలు 396పైలెట్ ప్రాజెక్టులో లబ్ధి పొందినవారు 688గ్రామసభకు పంపిన అర్హుల జాబితా 29,306గ్రామసభలో అర్హత పొందిన వారు 27,446గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు 6,871అర్హత పొందిన వారు 1,242 -
ఉద్యమ దిశగా..
జిల్లాకేంద్రంలో 2009–10 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన మహిళా డిగ్రీ కళాశాలను 2016–17లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తరలించారు. ఈవిషయం చాలామంది పాలకులు, నాయకులు, విద్యావంతులకూ తెలియకపోవడం గమనార్హం. ఇదేవిషయాన్ని ఇటీవల జిల్లాలో ఉన్నతవిద్య తీరుపై వరుస కథనాల్లో భాగంగా ఈనెల 6న ‘ఉన్నతవిద్య..ఉత్తదే’ శీర్షికన ‘సాక్షి దినపత్రిక’ ప్రచురించింది. దీనిపై కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. మహిళా డిగ్రీ కళాశాల తరలింపుపై స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరారు. ఈమేరకు ఆయన నిర్మల్ జిల్లాలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీకళాశాల ఏర్పాటు కావడం, అలాగే జిల్లాకో డిగ్రీకాలేజీ ఉండాలన్న నిబంధనలో భాగంగానే కాకతీయ యూనివర్సిటీ తరలింపు చేపట్టినట్లు వివరించారు. నిర్మల్: జిల్లాలో యూనివర్సిటీ సాధన కోసం ఉద్యమదిశగా అడుగులు పడుతున్నాయి. ఉన్నతవిద్య జిల్లావాసులకు అందుబాటులో ఉండాలన్న అంశంపై ‘సాక్షి’ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం విద్యావంతులు, జిల్లావాసుల్లో కదలిక తీసుకువచ్చింది. విశ్వవిద్యాలయం కోసం సాధన సమితి పేరిట ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నిసంఘాలు, వర్గాలు సమష్టిగా సాధనోద్యమం సాగాలని నిర్ణయించారు. ‘వర్సిటీ’పై కదలిక.. ‘ఇంకెన్నేళ్లు ఈ దుస్థితి.. మన ప్రాంతానికి విద్యావైభవం ఎప్పుడూ..!?’ అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇదేక్రమంలో ఇటీవల ‘సాక్షి’ జిల్లాలో ఉన్నతవిద్యపై నిర్లక్ష్యం, ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు అవశ్యకత అంశాలపై వరుస కథనాలను ప్రచురించింది. విద్యావంతులతో ‘రౌండ్టేబుల్ సమావేశం’ నిర్వహించింది. ఈ సమావేశం జిల్లాలో ఉన్నతవిద్య ఉన్నతీకరణ జరగాలన్న అంశాన్ని లేవనెత్తడంతో అన్నివర్గాల్లో కదలిక వచ్చింది. సాధన సమితిగా.. చదువులతల్లి కొలువైన జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి’ పేరిట విశ్వవిద్యాలయం సాధించేదాకా ఉద్యమించేందుకు జిల్లా సిద్ధమవుతోంది. ‘ఫైట్ ఫర్ రైట్..’ అంటూ విద్యావంతులు, విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కలిసి ‘యూనివర్సిటీ సా ధన సమితి’ని రూపకల్పన చేశాయి. త్వరలో కార్యాచరణ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నాయి. కీలకంగా.. పీజీసెంటర్ జిల్లాలో యూనివర్సిటీ డిమాండ్లో ఇక్కడి కాకతీయ పీజీసెంటర్ కీలకంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ ఏర్పాటు చేసిన కొత్త వర్సిటీలలో గతంలో పీజీసెంటర్లుగా ఉన్నవే. తాజాగా జిల్లాలోనూ పురుడుపోసుకున్న విశ్వవిద్యాలయ సాధనోద్యమంలోనూ ఇదే కీలకం కానుంది. జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి వ్యవస్థాపకుడు నంగె శ్రీనివాస్ సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లడంతో అప్పట్లోనే సానుకూల స్పందన వచ్చింది. తర్వాత మూలనపడినా.. ఇప్పుడు మళ్లీ యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ ఊపందుకుంది. ‘మహిళా డిగ్రీ’పై స్పందించిన కలెక్టర్ విశ్వవిద్యాలయం కోసం పోరాటం.. అన్నివర్గాలతో యూనివర్సిటీ సాధన సమితి.. జిల్లాలో చర్చనీయాంశంగా ‘సాక్షి’ డిబేట్ మహిళా డిగ్రీ కాలేజీపై స్పందించిన కలెక్టర్ -
ఫీజు కట్టినా.. రెగ్యులరైజ్ కాలే!
● లబ్ధిదారులకు అందని ప్రొసీడింగ్స్ ● యాజమాన్య హక్కుల కోసం తప్పని నిరీక్షణ ● 6,841 మంది ఫీజు చెల్లిస్తే 2,460 మందికే ప్రొసీడింగ్స్నిర్మల్చైన్గేట్: జిల్లాలో లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు యాజమాన్య హక్కుల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి, నిర్దేశిత ఫీజులు చెల్లించినా ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం కారణంగా దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎల్ఆర్ఎస్ పథకం ఇలా.. గతంలో అనుమతి లేకుండా లే–అవుట్లు ఏర్పాటు చేసి వెంచర్లు నిర్మించినవారు చాలామంది ఉన్నారు. ఈ విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసిన యజమానులకు ఊరట కల్పించేందుకు, గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2020లో మున్సిపల్ శాఖ జీవో 131 జారీ చేస్తూ, ఆగస్టు 26, 2020కి ముందు స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో స్థల క్రమబద్ధీకరణ కోసం రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. మూడు దశల్లో పరిశీలన.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించేలా అధికారులు నిర్ణయించారు. ● స్టేజ్–1: అర్బన్ ఏరియాల్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలిస్తారు. రెవెన్యూ అధికారులు స్థల వివరాలను, నీటిపారుదల శాఖ అధికారులు శిఖం భూముల్లో ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేశారు. ● స్టేజ్–2: టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కంటే ఉన్నతస్థాయి అధికారి దరఖాస్తుతో జతచేసిన పత్రాలను పరిశీలిస్తారు. ప్లాట్లలో ఇల్లు నిర్మించినట్లయితే, సంబంధిత పట్టా అందజేయాల్సి ఉంటే దాని గురించి సమాచారం ఇస్తారు. ● స్టేజ్–3: మున్సిపల్ కమిషనర్ దరఖాస్తులు, పత్రాలను మరోసారి సమీక్షించి, నిర్దేశిత ఫీజును చలానా రూపంలో చెల్లించాలని దరఖాస్తుదారులకు సూచిస్తారు. రూ.15.20 కోట్ల ఆదాయం.. అన్నీ సక్రమంగా ఉన్నవారికి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ప్రభుత్వం ఫీజులోనూ రాయితీ కల్పించింది. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలు, 18 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 44,602 దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో 37,939 దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించినట్లు నిర్ధారించారు. ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో, 6,841 మంది ఫీజులు చెల్లించారు. దీంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి జిల్లా నుంచి సుమారు రూ.15.20 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రొసీడింగ్స్ కోసం నిరీక్షణ.. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఐదేళ్లుగా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినప్పటికీ, నెలలు గడుస్తున్నా 6,841 మంది ఫీజు చెల్లించినవారిలో కేవలం 2,460 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. సిబ్బంది కొరత, దరఖాస్తులను మరోసారి పరిశీలించాల్సిన అవసరం వంటి కారణాలతో ఈ ఆలస్యం జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని మొత్తం దరఖాస్తులు 44,602 సమకూరిన ఆదాయం రూ.15.20కోట్లు మూడు మున్సిపాలిటీలలో 26,537 ఫీజుకు అర్హత పొందిన వారు 21,850 ఫీజు చెల్లించినవారు 3,611 ఫీజు చెల్లించాల్సిన వారు 18,239 ప్రొసీడింగ్ అందినవారు 2,460 ప్రొసీడింగ్ అందాల్సినవారు 1,15118 మండలాల పరిధిలో 18,065 ఫీజుకు అర్హత పొందిన వారు 16,089 ఫీజు చెల్లించినవారు 3,230 ఫీజు చెల్లించాల్సిన వారు 12,859 -
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
నిర్మల్చైన్గేట్: ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆదివాసీ నాయకపోడ్ ఉద్యోగ సంఘం, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముచ్చిండ్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి అనుగొండ సతీశ్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ వీరులు కుమురంభీం, రాంజీగోండు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల ఆత్మగౌరవం, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం సంఘం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలోనాయక పోడ్ ఉద్యోగ సంఘ సభ్యులు కస్తూరి భీమేశ్వర్, సొండి శివశంకర్, బాపయ్య, గుండంపల్లి సాయన్న, గురుడు సునీల్, పోశెట్టి ముత్తన్న, బాలాజీ, గంపల భూమేష్, రాజేశ్వర్, కాల శంకర్, పిరాజి పాల్గొన్నారు. ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ..నిర్మల్ టౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకయ్యగారి భూమయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆది వాసీల హక్కులను కాపాడాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక టీఎన్జీవో భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా, కుమురంభీం, రాంజీగోండు విగ్రహాల వరకు సాగింది. విగ్రహాలకు పాలాభిషేకం చేసి, జెండాలు ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని కోరారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన పట్టాలపై సాగు చేసుకులా ఆదివాసీలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల గూడేలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆదివాసీ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు శంభు, నైత భీమ్రావు, తోడుసం గోవర్ధన్, సుంచు శ్రీనివాస్, సాకి లక్ష్మణ్, సూరపు సాయన్న, నాయకపోడు సంఘం అధ్యక్షుడు శంకర్, ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవి, కార్యదర్శి సతీశ్, ఎల్లయ్య, పోతురాజ్ శ్రీనివాస్, భీమేశ్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వృక్షాబంధన్ జరుపుకోవాలి
● డెప్యూటీ రేంజ్ అధికారి నజీర్ఖాన్సారంగపూర్: నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్ష అంటూ రక్షాబంధన్ పండుగను జరుపుకోవడంతోపాటు వృక్షాలను, అడవులను రక్షించుకునేందుకు వృక్షాబంధన్ పండుగను సైతం జరుపుకోవాలని డీఆర్వో నజీర్ఖాన్ అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ నందనవనంలో స్థానిక ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ ఆధ్వర్యంలో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు శనివారం వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు, అటవీఖ సిబ్బంది నందనవనంలో ఉన్న పెద్దపెద్ద మొక్కలకు, విద్యార్థులు, సిబ్బంది కలిసి నాటిన మొక్కలకు రాఖీలు కట్టారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నజీర్ఖాన్ మాట్లాడుతూ వృక్షాలను మనం రక్షిస్తే అవి మనకు ప్రాణవాయువును ఇచ్చి రక్షిస్తాయని అన్నారు. అందుకే ప్రతీవిద్యార్థి తమ తల్లిదండ్రులు, బంధువులకు సైతం ఈ సూక్తి అమలు చేసేలా చూడాలని తెలిపారు. అనంతరం వాల్టా, ఇతర అటవీశాఖ చట్టాలను వివరించారు. అలాగే నందనవనంలో పెరిగిన ప్రతీ మొక్క శాసీ్త్రయ నామంతోపాటు వాటి వాడుక పేర్లు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ మొక్కల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో సారంగాపూర్ మండల అటవీశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలి
● ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ దిగంబర్కుభీర్: దేశం, ధర్మ రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ నాలుగు జిల్లాల కార్యవాహ రాజుల దిగంబర్ అన్నారు. కుభీర్ శ్రీవిఠలేశ్వర మందిరంలో శనివారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో మాట్లాడారు. హిందువులలో ఐక్యత లేని కారణంగా మన దేశాన్ని 800 సంవత్సరాలు మొఘలులు, 200 ఏళ్లు బ్రిటిషర్లు పాలించారన్నా రు. హిందువులలో ఐక్యత కోసం 1925లో డాక్టర్ కేశవ్రావ్ బలిరాంపంత్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపించారన్నారు. పర్యావరణ రక్షణకు అందరూ మొక్కలు నాటాలన్నారు. కులతత్వం విడనాడి అందరూ సమానమేననే భావనతో మెలగాలన్నారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేస్తూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. అనంతరం స్వయంసేవకులు రాఖీలు కట్టుకున్నారు. అర్గుల సాయినాథ్, డాక్టర్ పెంటాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు పోషెట్టి, శ్రీనివాస్, శివలింగు, హన్మాండ్లు, రాజు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. -
కుంటాలలో భారీ వర్షం
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వేకువ జామున భారీ వర్షం కురిసింది. వా గులు ఉప్పొంగాయి. చేలల్లో నీరు నిలిచింది. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. సూర్యాపూర్ నుంచి కల్లూరు వాగు పక్కనున్న పంటల్లో వరద నిలిచి పంటలు దెబ్బ తిన్నట్లు రైతులు తెలిపారు. మండలంలో 51.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో సాయి కృష్ణ తెలిపారు. నిలిచిన రాకపోకలు మండలంలో కురిసిన వర్షంతోపాటు మహారాష్ట్రలో కూడా వర్షం కురవడంతో సూర్యాపూర్ చెరువు నిండిపోవడంతో పాత వెంకూర్ లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో పాత వెంకూర్–కొత్త వెంకూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాత వెంకూర్ గ్రామస్తులు కుంటాలకు ఓలా మీదుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తహసీల్దార్ కమల్సింగ్, ఎస్సై అశోక్ పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు మృతి
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనంతో ఢీకొని యశ్వంత్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేండ్పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్ శుక్రవారం భైంసాకు వచ్చారు. పనులు ముగించుకుని భైంసా నుంచి ద్విచక్రవాహనంపై పేండ్పెల్లికి వెళ్తున్నారు. మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ ఫంక్షర్ కావడంతో అక్కడే నిలిపి ఉంచారు. రోడ్డుపై ఉన్న ట్రాలీని వీరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పేండ్పెల్లికి చెందిన యశ్వంత్ మృతి చెందాడు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంకనాన తగ్గుతాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. నిర్మల్లోనే ఏర్పాటు చేయాలి.. కాకతీయ యూనివర్సిటీ దూరభారమవుతోంది. ఏ చిన్న అవసరమైనా అంతదూరం వెళ్లడం ఇబ్బందవుతోంది. నిర్మల్లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. –సుభాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీడీసీ, నిర్మల్ కలిసి ముందుకెళ్దాం.. రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతోనే విశ్వవిద్యాలయాలు ప్రశ్నార్థకంగా మారాయి. యూనివర్సిటీ ఏర్పాటు కోసం కలిసికట్టుగా సాగుదాం. – స్వదేశ్పరికిపండ్ల, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్ జయశంకర్సార్ స్ఫూర్తితో... ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో ఐక్యంగా వర్సిటీ కోసం ఉద్యమిద్దాం. పక్కా ప్రణాళికతో సాధించుకుందాం. ‘సాక్షి’ సామాజిక బాధ్యత అభినందనీయం. –కిశోర్, సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఉద్యమంతోనే విశ్వవిద్యాలయం..తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాను సాధించుకున్నట్లే ఉద్యమంతోనే విశ్వవిద్యాలయాన్ని సాధించుకుందాం. చదువులమ్మ జిల్లాలో విద్యాభివృద్ధి చేసుకుందాం. –షేర్ నరేందర్, నిర్మల్ బార్అసోసియేషన్ సెక్రెటరీ జిల్లాకో వర్సిటీ ఉంటే తప్పేంటి..? పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసినట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం జిల్లాకో యూనివర్సిటీ పెడితే తప్పేంటి..!? నిర్మల్ జిల్లాలోనూ వర్సిటీ పెట్టాలి. – కొమ్మోజి రమణ, న్యాయవాది వర్సిటీతో ఎన్నోలాభాలు.. విశ్వంలోని సమస్త విషయాలపై పరిశోధనలు చేసి, పరిష్కారాలు చూపేదే విశ్వవిద్యాలయం. అలాంటి వర్సిటీ జిల్లాలో ఉంటే ఎన్నోరకాల లాభాలు ఉంటాయి. స్థానిక విద్యార్థులకు ఉపయోగకరం. – డా.మధు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
కని పారేయకండి..
● ‘ఊయల’లో వేయండి..! ● అనాథ శిశువుల కోసం కలెక్టర్ వినూత్న ఆలోచన ● భైంసా ఏరియాస్పత్రిలో ప్రారంభం భైంసాటౌన్: నవ మాసాలు తన గర్భంలో మోసిన తల్లి కర్కశంగా వ్యవహరిస్తోంది. తన ఒడిలో వెచ్చగా సేదదీరాల్సిన శిశువును చెత్త కుప్పల్లో, మురికికాలువలో పారవేస్తోంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డలు లోకం చూడకుండానే ఊపిరి వదులుతున్నారు. భైంసా పట్టణం నడిబొడ్డున.. నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో ఓ మృత శిశువును రెండు రోజుల క్రితం డ్రెయినేజీలో పడేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ మేరకు ఊయల పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్రమ సంబంధాలు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, వారసుడి కోసం వరుసగా గర్భం దాల్చడం, ఆడపిల్ల పుడితే వదిలించుకోవడం చేస్తున్నారు. కొందరు గర్భంలోనే చిదిమేస్తుండగా, మరికొందరు పుట్టిన తరువాత తుప్పల్లో పడేస్తూ వదిలించుకుంటున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం కలవరపాటుకు గురి చేస్తోంది. ‘ఊయల’కు శ్రీకారం.. భైంసా పట్టణంలో జరిగిన అమానవీయ ఘటనలు పునరావృతం కాకూదన్న ఉద్దేశంతో ‘ఊయల’ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ రూపకల్పన చేశారు. వెంటనే అమలు చేయాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించారు. దీంతో శుక్రవారం డీఎంహెచ్వో రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేశ్ భైంసాకు చేరుకుని, మృత శిశువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏరియాస్పత్రిలో ఊయల కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలను వద్దనుకునేవారు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వేయవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంటాయ ని, ఎలాంటి కేసులు ఉండవని భరోసా ఇస్తున్నారు. వారి అనుమతి మేరకు శిశువులను బాలల సంరక్షణ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఊయలలో వేయాలి.. కనిపారేసే శిశువుల సంరక్షణ కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ఊయల కార్యక్రమం ప్రారంభించాం. భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ఊయల ఏర్పాటు చేశాం. అప్పుడే పుట్టిన తమ శిశువులను వద్దనుకునే తల్లిదండ్రులు ఏరియాస్పత్రిలోని ఊయలలో వేయవచ్చు. – రాజేందర్, డీఎంహెచ్వో, నిర్మల్ -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్కీబాత్లో పీఎం మోదీ కై లాస్ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్ను అభినందించారు. -
పార్డి(బి) గ్రామంలో..
కుభీర్: మండలంలోని పార్డి (బీ) గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగశివుని తండాకు చెందిన పవార్ సచిన్ అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ తన బైక్పై సాయంత్రం కుభీర్ సంతకు వస్తుండగా పార్డి(బీ) సమీపంలో పంది తగిలి క్రిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని భైంసాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి భార్య సిమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, తల్లితండ్రులు ఉన్నారు. పాము కాటుకు యువకుడి మృతి దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్ చేసి బాత్రూమ్లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్ డోర్ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మహేశ్ కుటుంబీకులకు విషయం తెలుపగా దహెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. చికిత్స పొందుతూ మృతి జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘వృక్ష’ రక్షా బంధన్
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ఈద్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘వృక్ష రక్షాబంధన్’ నిర్వహించారు. నేషనల్ గ్రీన్కోర్ జిల్లా సమన్వయకర్త మోహన్రావు, ఉపాధ్యాయుల సహకారంతో తాము తయారుచేసిన సహజసిద్ధమైన రాఖీలను విద్యార్థులు చెట్లకు కట్టారు. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’, ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ ఆ రాఖీలపై రాసి చెట్లను కాపాడుకోవాలని సందేశాన్నిచ్చారు. ఇందులో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం, ఎన్జీసీ కోఆర్డినేటర్ మోహన్రావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, రాజు, కృష్ణకుమార్, వివేక్, ఉజ్వల, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్గా నృత్యాలు చేస్తుంటారు. -
యూనివర్సిటీ.. సాధిద్దాం!
నిర్మల్శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025మరో ఉద్యమానికి సిద్ధం.. అలుపెరగని ఉద్యమంతోనే తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు అదేతరహాలో జిల్లాలో యూనివర్సి టీ సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావా ల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సమష్టిగా కృషిచేద్దాం. – ఎంసీ లింగన్న, నిర్మల్ సిటీజన్స్ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరాడి సాధించుకుందాం.. జిల్లాలో జ్ఞానసరస్వతీమాత పేరిట యూనివర్సిటీ సాధన కోసం అన్నివర్గాలు స్పందించాలి. పోరాడితేనే విశ్వవిద్యాలయం సాధించుకోగలుగుతాం. – శశిరాజ్, టీపీయూఎస్ రాష్ట్రబాధ్యులు తేడా స్పష్టంగా తెలుస్తోంది.. కాకతీయ యూనివర్సిటీ ఉన్న వరంగల్లో ఎస్జీటీ టీచర్లలోనూ 70 శాతం మంది పీహెచ్డీలు ఉన్నారు. అదే మనజిల్లాలో కేవలం 7 శాతమే ఉన్నారు. విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంటే సమీప జిల్లాల్లో విద్యాఫలాలు ఎలా ఉంటాయో తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. – రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీడీసీ, భైంసా మహిళలకు దూరం.. మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మన ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉమెన్స్ కాలేజీ వెన క్కి వెళ్లిపోవడం శోచనీయం. యూనివర్సిటీ లేక చాలామంది మహిళలు ఇంటర్, డిగ్రీ వరకే చదివి ఆపేస్తున్నారు. – అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీడీసీ, నిర్మల్ చదువులేక చిన్నచూపు.. మనప్రాంతంలో ఉన్నతవిద్య లేక దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. నేను డాక్టర్ చదివేటప్పుడూ మనప్రాంతంపై వివక్ష, చిన్నచూపును గమనించా. అందుకే మనకూ యూనివర్సిటీ కావాల్సిందే. –డా.కృష్ణంరాజు, సామాజికవేత్త రాంజీ, భీమ్ స్ఫూర్తితో.. రాంజీగోండ్, కుమురంభీమ్ స్ఫూర్తితో యూనివర్సిటీ సాధన కోసం పోరాడుదాం. ఇందులో అన్నివర్గాలు కలిసి రావాలి. – ప్రవీణ్, టీజీవీపీ ఉమ్మడిజిల్లా ప్రధానకార్యదర్శితెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి స్థానిక విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ‘సాక్షి మీడియా’ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెప్పింది. ‘అక్షరం సాక్షిగా అందరం ఒక్కటిగా’ అనే నినాదంతో, నిర్మల్లో ‘జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ’ స్థాపన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘సాధించుకుందాం.. విశ్వవిద్యాలయం..’ అంటూ విద్యావంతులు, విద్యార్థి సంఘాల నేతలు ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఇప్పటికీ కాకతీయ యూనివర్సిటీ దూరభారంతో ఎదురవుతున్న సమస్యలను, మన ప్రాంతం కోల్పోతున్న విద్యాఫలాలను కళ్లకు కట్టించేలా వివరించారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వర్సిటీని సాధించుకుంటామని ప్రశ్నించారు. ముందుతరాలు బాగుపడాలన్నా, మన ప్రాంతం ముందడుగు వేయాలన్నా ఇక్కడ యూనివర్సిటీ తప్పనిసరి అని స్పష్టంచేశారు. గతంలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్లే.. ఇప్పటికే నిర్మల్లో ఉన్న కాకతీయ పీజీసెంటర్ కేంద్రంగా ‘జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ‘ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఇందుకు సంబంధించిన కమిటీని ప్రకటిస్తామన్నారు. నిర్మల్ ప్రాంత విద్యాభివృద్ధి విషయంలో ‘సాక్షి‘ తీసుకుంటున్న ప్రత్యేక చొరవను వారంతా ప్రశంసించారు. – నిర్మల్/నిర్మల్చైన్గేట్/నిర్మల్టౌన్పూర్వవిద్యార్థిగా బాధపడుతున్న.. పీజీసెంటర్లో ఉన్న సోషియాలజీ రెగ్యులర్ కోర్సును తరలించడంపై పూర్వవిద్యార్థిగా బాధపడుతున్నా. వర్సిటీ సాధన కోసం విద్యార్థినేతగా అందరితో కలిసి పోరాడుతా. – వెంకటేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు న్యాయపరంగా మనజిల్లాకే.. నిర్మల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ముందడుగు పడింది. ప్రభుత్వాల మార్పు, బడ్జెట్లో నిధులలోటుతో వెనుకబడింది. పీజీసెంటర్ ఉన్న నిర్మల్లోనే జ్ఞానసరస్వతీ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. –నంగె శ్రీనివాస్, జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి వ్యవస్థాపకుడు దూరభారంతో చదవలేకపోయా.. చదువులమ్మ కొలువైనా ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం దారుణం. 1990లోనే ఖమ్మంలో పీజీ సీటు వచ్చినా దూరభారంతో వెళ్లలేకపోయాను. – జుట్టు చంద్రశేఖర్, న్యాయవాది ఎన్నో వనరులున్నా.. మన జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్నో వనరులు, సౌకర్యాలు, ఆవశ్యకత ఉన్నా.. పట్టింపులేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా విశ్వవిద్యాలయం కోసం ఉద్యమిద్దాం. – భూమన్నయాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు విద్యతోనే అభివృద్ధి.. ఉన్నతవిద్యతోనే మనప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై వర్సిటీని సాధించుకుందాం. – వెల్మల ప్రభాకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడుఉద్యమాల గడ్డ నిర్మల్.. వరంగల్, కరీంనగర్ తర్వాత నిర్మల్కు ఉద్యమాల గడ్డగా పేరు ఉంది. వర్సిటీ సాధనకు ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి. ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయం. –రవికాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వివక్షతోనే కోర్సులు దూరం.. విద్యాభివృద్ధి చేయాల్సింది పోయి, వివక్షతో పీజీసెంటర్లో ఉన్న కోర్సులు ఎత్తివేయడం దౌర్భాగ్యం. ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో వర్సిటీ ఎజెండాగా ఉండాలి. – సురేందర్, గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉద్యమాలతోనే సాధ్యం.. తెలంగాణ తరహాలో ఉద్యమాన్ని చేస్తేనే వర్సిటీ ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇందులో అన్నివర్గాలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. – విజయ్కుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శిఉన్నతవిద్యలో వెనుకంజ.. జిల్లాలో పదోతరగతి వరకు 99 శాతం, ఇంటర్ 75 శాతం, డిగ్రీ 60 శాతం చదువుతుంటే.. పీజీకి వచ్చేసరికి 25 శాతం కూడా ఉండటం లేదు. అందుకే జిల్లాకు వర్సిటీ అవసరం. – రాకేశ్, కామర్స్ లెక్చరర్ సమష్టి పోరాడుదాం.. విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాకు విశ్వవిద్యాలయం తప్పనిసరి. అన్నివర్గాలు, రంగాలు సమష్టిగా ఉద్యమించి వర్సిటీని సాధించుకుందాం. – దర్శనం దేవేందర్, పీడీ జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లా.. మనది జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లా. ఇలాంటి చోట వర్సిటీ లేకపోవడం శోచనీయం. యూనివర్సిటీ సాధనను చాలెంజింగ్గా తీసుకుని సమష్టిగా సాధిద్దాం. – జవాద్ హుస్సేన్, టీఎంఈఏ జిల్లా అధ్యక్షుడునిరుద్యోగం తగ్గుతుంది.. విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఉన్నతవిద్య అందుబాటులోకి రావడంతోపాటు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. మన ప్రాంత పరిశోధనలు వెలుగులోకి వస్తాయి. – డాక్టర్ వెల్మల రంజిత్, తెలుగు అధ్యాపకుడు, జీడీసీ ఇప్పటికే ఆలస్యమైంది.. జిల్లాలో వర్సిటీ ఏర్పాటు కోసం పోరాటం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది. ఇక అందరినీ కలుపుకొని పోరాడుదాం. యూనివర్సిటీ సాధించుకుందాం. – నూతన్కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పాలకులు కదిలేలా.. చదువులతల్లి కొలువైన జిల్లాలో ఇప్పటికీ ఉన్నతవిద్య అందకపోవడం దారుణం. ఇప్పటికై నా పాలకులు, అధికారులు వర్సిటీ కోసం కదిలేలా ఉద్యమిద్దాం. – వెంకటేశ్, ఏబీవీపీపంపించాల్సిన నంబరు 97054 44372 -
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: మహారాష్ట్రలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు మూడో గేటు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ఉదయం 6గంటల వరకు ఏకంగా 80వేల క్యూసెక్కులు రావడంతో 1,182.5 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ మూడో గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం 1,182.5 అడుగుల వద్ద నీటిమట్టం స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు. -
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ఖానాపూర్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ గురువారం సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశామని పేర్కొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రులను సందర్శించగా పట్టణంలోని గీతా క్లీనిక్ పేరుతో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్ఎంపీ ఇంజక్షన్లు ఇస్తున్నారని గుర్తించి సీజ్ చేశామన్నారు. సూర్య ఈఎన్టీ ఆస్పత్రిని తనిఖీ చేయగా ఆస్పత్రిలో అన్ని హంగులు ఏర్పాటుచేసి ప్రత్యేక యంత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. వైద్యుడి పేరు లేకుండా ఆస్పత్రి నిర్వహించడంతోపాటు ఆస్పత్రి ఏర్పాటు విషయం జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సౌమ్య, సిబ్బంది ఉన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలిమామడ: రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ అధికారి రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. వ్యాధులు ప్రబ లిన ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ఆదేశించారు. చికి త్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిర్వహణ అధికారి సౌమ్య, విస్తరణ డిప్యూటీ అధికారి బారె రవీందర్, వైద్యాధికారి మౌనిక పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ అధ్యాపకులకు శిక్షణ
● బోధనా నైపుణ్యాల అభివృద్ధికి కొత్త దిశ బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) బాసరలో అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ‘‘బ్రెయిన్ అండ్ మైండ్ మెమరీ ప్రాసెస్’’ అనే అంశంపై విశ్లేషణాత్మక చర్చలతో జరిగింది. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యాపకుల ఆధునిక బోధన పాత్రపై కీలక విషయాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు అధ్యాపకులను సాంకేతికంగా, ఆలోచనాపరంగా అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ‘‘అధ్యాపకులు తమ బోధనా విధానాలను ఆధునికీకరించినప్పుడే విద్యార్థులకు ప్రభావవంతమైన అభ్యాసం సాధ్యమవుతుంది. అధ్యాపకుల ప్రవర్తన, ఉపన్యాస శైలి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు విద్యార్థుల అభ్యాస లక్ష్యాలను నేరుగా ప్రభావితం చేస్తాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. అధ్యాపకుల బోధనా శైలి, కమ్యూనికేషన్ స్పష్టత విద్యార్థుల అర్థగ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని ఈ కార్యక్రమంలో వివరించారు. స్పష్టమైన భాష, సమర్థవంతమైన కమ్యూనికేషన్ విద్యార్థులలో జ్ఞాన గ్రహణాన్ని, ఆసక్తిని పెంచుతాయని నొక్కి చెప్పారు. శిక్షణలో చర్చించిన కీలక అంశాలుకౌన్సెలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో శ్రద్ధ, అవగాహన, జ్ఞాపకశక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులలో జ్ఞాపకశక్తిని, అభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు మైండ్ మ్యాపింగ్, స్వీయ విశ్లేషణ, పరిశీలన, ఫలితాల మౌలిక అంచనా, గుర్తుచేసుకోవడం వంటి టెక్నిక్లను ఉపయోగించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ టెక్నిక్లు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చగలవని వివరించారు. అధ్యాపకులు విద్యార్థులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, వారి అభ్యాస పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా విద్యా ఫలితాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. స్కీమా ఫార్మేషన్ ద్వారా విద్యార్థులలో జ్ఞాన నిర్మాణాన్ని సులభతరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, అసోసియేట్ డీన్స్ విఠల్, చంద్రశేఖర్, అన్ని విభాగాల విభాగాధిపతులు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
పశువులకు వ్యాధులు సోకకుండా చూడాలి
లక్ష్మణచాంద: పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన టీకాలు వేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. పశు వైద్యులతో మాట్లాడి నీలి నాలుక వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ, ఎంపీడీవో రాధ రాథోడ్, పశువైద్య అధికారి శ్రీనివాస్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు సాంకేతికతను వినియోగించుకోవాలి
నిర్మల్ రూరల్: రోజురోజుకూ సాంకేతిక విప్లవం మెరుగవుతున్నందున, ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలు బోధించాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని జుమ్మెరత్పేట్ హైస్కూల్లో ఉల్లాస్ (నవభారత్ సాక్షరతా కార్యక్రమం)పై ఉపాధ్యాయులకు గురువారం ఒకరోజు శిక్షణ అందించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో మా ట్లాడారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆయా గ్రామాలలో స్వయం సహా య బృందాలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. శిక్షణలో వయోజన విద్య అధికారి తిరుపతిరావు, నరసయ్య, ప్రవీణ్కుమార్, ప్రధానోపాధ్యాయులు రవిబాబు, రిసోర్స్పర్సన్లు నాగుల రవి, శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గల్ఫ్ జైలులో జిల్లా వాసి
● దుబాయ్ పోలీసులకు చిక్కిన వలస కార్మికుడు ● క్షేమసమాచారం తెలియక కుటుంబం ఆందోళన ● స్వదేశానికి రప్పించాలని వినతి...నిర్మల్ఖిల్లా: ఉపాధికోసం ఎడారి దేశం వెళ్లిన జిల్లావాసి కటకటాలపాలైన సంఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సారంగాపూర్ మండలం దేవితండా గ్రామానికి చెందిన జాదవ్ మధుకర్ కొన్నేల్లుగా విదేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. రెండేళ్లకుపైగా ఖతార్లో ఉండి స్వగ్రామాని కి వచ్చాడు. స్థానికంగా కొన్నినెలలపాటు ఉండి సరైన ఉపాధి లేకపోవడంతో దుబాయ్ వెళ్లడం కోసం ముంబైకి చెందిన ఏజెంటును సంప్రదించాడు. రూ.80 వేలు చెల్లించి విజిట్ వీసాపై గతేడాది అబు దాబి వెళ్లాడు. అక్కడ మోర్గంటి మెయింటెనెన్స్ అండ్ ఫెసిలిటీస్ కంపెనీలో క్లీనర్గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే గతనెల 21 తేదీన లేబర్ క్యాంపు బయట మద్యంసీసాలతో పోలీసులకు పట్టుపడ్డాడు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి మధుకర్ సమాచారం ఇటు కంపెనీ వైపు నుంచిగానీ, అటు పోలీసుల నుంచి గానీ అందకపోవడంఓత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మఽ దుకర్ తండ్రి జాదవ్ గణేశ్ గురువారం కలెక్టర్ కా ర్యాలయంలో వినతిపత్రం అందించారు. తర్వాత రాష్ట్ర ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యుడు, ప్రవాసీమి త్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పర్కిపండ్లను కలిసి వివరాలు అందజేశారు. ఎలాగైనా తమ కుమారుడిని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. స్పందించిన స్వదేశ్ అబుదాబీలోని భారత కాన్సులేట్ కార్యాలయానికి బాధితుని వివరాలను మెయిల్ ద్వారా పంపారు. ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు... అక్రమ మార్గంలో గల్ఫ్ వెళ్లొద్దు..విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు అక్రమ మార్గంలో వెళ్లవద్దని, వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులను వీసా రుసుము చెల్లించిన తర్వాతనే ఉపాధి పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని స్వదేశ్ పర్కిపండ్ల సూచించారు. ప్రవాసీ భారత బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. -
హ్యాట్సాఫ్.. మేడం
కడెం: తాను విధులు నిర్వహించిన పాఠశాలపై మమకారంతో.. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు ఓ ఉపాధ్యాయురాలు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో 2012 నుంచి 2024 వరకు హిందీ టీచర్గా విధులు నిర్వహించిన విజయలక్ష్మి గతేడాది మామడ మండలం పొన్కల్ పాఠశాలకు పదోన్నతిపై వెళ్లారు. 12 ఏళ్లు విధులు నిర్వహించిన కడెం పాఠశాల, ఇక్కడి విద్యార్థుల ను మరువని ఉపాధ్యాయురాలు తన తల్లిదండ్రులు కళావతి–విఠల్రావు జ్ఞాపకార్ధం రూ.1.20 లక్షలతో పాఠశాలలో ఆర్వోవాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి గురువారం ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని సత్కారించారు. -
బాధ్యతలు స్వీకరించిన భైంసా సబ్ కలెక్టర్
భైంసాటౌన్/బాసర/నిర్మల్చైన్గేట్: భైంసా సబ్ కలెక్టర్గా అజ్మీరా సంకేత్కుమార్ గురువారం బా ధ్యతలు స్వీకరించారు. ఉదయం ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. పదోన్నతిపై బదిలీ అయిన ఆర్డీవో కోమల్రెడ్డితోపాటు కార్యాలయ ఉద్యోగులు, తహసీల్దార్లు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నా యకులు ఆయనకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలి కారు. సంకేత్కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ ఉద్యోగులను పరిచ యం చేసుకున్నారు. అనంతరం ట్రెసా నాయకులు సబ్కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తర్వాత సబ్ కలెక్టర్ బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అర్చకులు ఆయనకు స్వాగ తం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. తర్వా త హారతి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్మల్ చేరుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భైంసా డివిజన్ స్థితిగతులపై చర్చించారు. -
రాకున్నా.. వచ్చినట్టు..
● పంచాయతీ కార్యదర్శుల తప్పుడు హాజరు నమోదు ● విధులకు రాకుండానే ఫొటోలు అప్లోడ్ ● జిల్లాలో ఐదుగురు సస్పెన్షన్, 82 మందికి నోటీసులు కార్యదర్శుల కనికట్టునిర్మల్చైన్గేట్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పరిపాలన గాడి తప్పుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా, రోజువారీ శానిటేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్) యాప్లో తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తూ పారిశుద్ధ్య నివేదికలను నకిలీ చేస్తున్నారు. జిల్లాలో జరిపిన తనిఖీల్లో 87 మంది కార్యదర్శులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించడంతో, ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఫోన్ల దుర్వినియోగం..కొందరు కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికుల సెల్ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి ద్వారా తమ హాజరును నమోదు చేయిస్తున్నారు. ఈ విధానం ద్వారా విధులకు హాజరు కాకుండానే నివేదికలను నకిలీ చేస్తున్నారు. ఈ అవకతవకలు యాప్లోని సాంకేతిక లోపాలు, అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం వల్ల సాధ్యమవుతున్నాయి. పర్యవేక్షణలో లోపం...పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత మండల పంచాయతీ అధికారుల(ఎంపీవో లు), డీఎల్పీవోలు, డీపీవోలది. కార్యదర్శుల హాజ రు నమోదు ఎంపీవో లాగిన్లో ఉంటుంది. దీనిని ఉన్నతాధికారులు తనిఖీ చేయవచ్చు. అయినా అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్యదర్శులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ, తప్పుడు నివేదికలను సమర్పిస్తున్నారు. ఈ లోపం గ్రామీణ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడానికి ని దర్శ నం. మరోవైపు డీఎస్ఆర్ యాప్లో సెల్ఫీతో పాటు ఏ ఫొటో అప్లోడ్ చేసినా ఆమోదం పొందే సాంకేతిక లోపం కార్యదర్శులకు అనుకూలంగా మారింది. ఈ లోపాన్ని సవరించకపోవడం, అధికా రులు కఠినంగా పర్యవేక్షించకపోవడం వల్ల గ్రామ పంచా యతీల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, నివేది కల సమర్పణలో అవకతవకలు కొనసాగుతున్నా యి. నోటీసులు జారీ చేశాం.. డీఎస్ఆర్ యాప్లో తప్పుడు ఫొటోలు నమోదు చేసిన 82 మంది కార్యదర్శులను గుర్తించి నోటీసులు, ఐదుగురు కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరయ్యే కార్యదర్శులపై చర్యలు తప్పవు. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సస్పెన్షన్, నోటీసులు.. జిల్లాలో 400 గ్రామ పంచాయతీల్లో 384 మంది కార్యదర్శులు (గ్రేడ్–1 నుంచి గ్రేడ్–4, జూనియర్, ఔట్సోర్సింగ్) విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో కార్యదర్శులు ఉదయం 9 గంటలకే గ్రామాలకు చేరుకొని హాజరు నమోదు చేసేవారు. అయితే, కొందరు కార్యదర్శులకు ఒకటి కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు ఉండటంతో సమయం సరిపోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఉదయం 11 గంటల వరకు సమయ సడలింపు ఇచ్చారు. అయినా కొందరు ఈ సడలింపును దుర్వినియోగం చేస్తూ, విధులకు హాజరు కాకుండా తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. జూలైలో రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో 87 మంది కార్యదర్శులు తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు 82 మంది గ్రేడ్–3, 4 కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్ఆర్ యాప్లో తప్పుడు నివేదికలుపంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 11 గంటలలోపు గ్రామ పంచాయతీలో హాజరై, డీఎస్ఆర్ యాప్లో సెల్ఫీ ఫొటో అప్లోడ్ చేసి, పారిశుద్ధ్య పనుల ఫొటోలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీ ఫొటో వారి ముఖ గుర్తింపు హాజరుగా పరిగణించబడుతుంది. అయితే, కొందరు కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా, యాప్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. పంచాయతీ భవనాలు, కుర్చీలు, ఇతర వస్తువుల ఫొటోలను లేదా కార్యదర్శుల సెల్ఫీలను మరో ఫోన్ ద్వారా తీసి నమోదు చేస్తున్నారు. -
● సరస్వతీ కొలువైనా జిల్లాపై చిన్నచూపా? ● విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేదెప్పుడు? ● ఉద్యమదిశగా విద్యావంతులు, సంఘాలు ● నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అన్ని వర్గాలతో రౌండ్టేబుల్ సమావేశం
నిర్మల్: చదువుల తల్లే కొలువుదీరిన జిల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతలున్న ఖిల్లా. ఉమ్మడి జిల్లాకే రాజకీయకేంద్రంగా పేరున్న నిమ్మల. ఇలా.. అన్నీ ఉన్నా.. చదువుల్లో మాత్రం సున్నా చుడుతోంది. దశాబ్దాలు గడిచిపోతున్నా.. ఉన్నతవిద్య అందని ద్రాక్షే అవుతోంది. విశ్వవిద్యాలయం పెడతామ ని పాలకులు హామీలిచ్చినా.. హైదరాబాద్–ఢిల్లీ మధ్య సంబంధిత ఫైళ్లు తిరుగుతున్నా.. అడుగు ముందుకుపడటం లేదు. అడిగేవారు లేకనే.. జిల్లాపై పాలకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే వాదనా జిల్లావాసుల్లో పెరుగుతోంది. హామీలిచ్చి ఏళ్లు గడుస్తున్నా.. అక్షరక్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విద్యారంగంలోనూ ముందంజలో ఉంచుతామంటూ.. ప్రతీ పాలకుడూ చెబుతూనే వస్తున్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ యూనివర్సిటీ ఏర్పాటు హామీ ఇస్తూ పోయారు. అప్పటికప్పుడు ప్రతిపాదనలు తీసుకుంటూ ఫైళ్లకు ఫైళ్లు తయారు చేయిస్తూ నే ఉన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మానవ వనరులశాఖ (ఎంహెచ్ఆర్డీ)కి పంపుతున్నామని చెబుతూ నే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ యూనివర్సిటీ ఏర్పా టు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలే దు. కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ఉన్నా.. చదువు సున్నా.. దేశంలోనే ప్రసిద్ధ చదువులక్షేత్రం బాసర జ్ఞానసరస్వతీమాత కొలువైన చోటనే సరైన విద్య లేకపోవడం దారుణం. చదువులమ్మ చెంతనే ఆర్జీయూకేటీ ఉన్నా.. జిల్లా విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదు. పదోతరగతిలో వ చ్చే మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉండటంతో స్థానిక విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ఉన్న ఒక్క పీజీ సెంటర్నూ నామ్కే వాస్తేగా మార్చేశారు. డిగ్రీ కాలేజీల్లోనూ ఇప్పటికీ సంప్రదా య కోర్సులే గాని.. ఒక్కటంటే ఒక్క ప్రత్యేక కోర్సు పెట్టడం లేదు. ఇక ఇంజినీరింగ్ కాలేజీ కావాలి ప్రభో.. అని ఏళ్లుగా వేడుకుంటున్నా.. కనికరించ డం లేదు. అందరికీ అక్షరాభ్యాసం చేయించే చదువులమ్మ ఉన్న చోటనే.. సరైన చదువుల వ్యవస్థలు లేకపోవడం అత్యంత దారుణం. అన్ని వసతులున్నా.. ప్రభుత్వం యూనివర్సిటీ పెట్టడంలో జాప్యం చే యడానికి కారణాలు తెలియడం లేదు. నిర్మల్లో ప్రస్తుతం ఉన్న డిగ్రీ కాలేజీ, పీజీసెంటర్, రెండు ఇంటర్ కాలేజీలకు కలిపి 40ఎకరాల భూమి ఉంది. డిగ్రీ కాలేజీకే భవనంతో పాటు 16ఎకరాల వరకు ఉంది. యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు సరిపడా భవనా లున్నాయి. స్థానికంగా సరైన విద్యావ్యవస్థలు లేక వేలాదిమంది విద్యార్థులు ఇప్పటికీ హైదరాబాద్ వరకూ వెళ్తున్నారు. నిర్మల్ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకూ అందుబాటులో ఉంటుంది. 44, 61 నేషనల్ హైవేలున్నాయి. తాజాగా హైదరాబాద్–ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వేలైన్కు సంబంధించి కూడా రైల్వేశాఖ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
తల్లిపాలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
నిర్మల్చైన్గేట్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణా నికి తల్లిపాలు దోహదపడతాయని మెడికల్ కళాశా ల ప్రిన్సిపల్ సీవీ శారద పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో తల్లిపా ల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది సామాన్యులకు అర్థమయ్యేలా తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. నర్సింగ్ కాలేజ్ మొదటి సంవత్సరం విద్యార్థినులు తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ప్లకార్డుల ద్వారా అవగాహన క ల్పించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పుట్టిన వెంటనే బిడ్డలకు ముర్రుపాలు పట్టించాలని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రసూతి ఆస్పత్రి హెచ్వోడీ సరోజ, ఆర్ఎంవో సమత, నర్సింగ్ పర్యవేక్షకురాలు ధనలక్ష్మి, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మంజుల, పిల్లల వైద్యనిపుణులు వసు, ప్రదీప్ పాల్గొన్నారు. -
‘ఆధార్’ అప్డేట్ లేదని.. మహాలక్ష్మి పథకం వర్తించదని..
● మహిళలను బస్సు దించిన కండక్టర్ భైంసారూరల్: ఆధార్కార్డులు అప్డేట్ చేసుకో నందున మహాలక్ష్మి పథకం వర్తించదని ఆర్టీసీ కండక్టర్ మహిళలను మధ్యలోనే బస్సు దించేశారు. వివరాలు.. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సులో బుధవారం భైంసాలో కొందరు మహిళలు ఎక్కారు. వారి ఆధార్కార్డుల్లో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ అని ఉండగా అవి చెల్లవంటూ కండక్టర్ వారిని దేగాం వద్దే దింపేశారు. దీంతో మహిళలు కండక్టర్తో గొడవకు దిగారు. ప్రతీ సారి ఇదే కార్డుపై ప్రయాణిస్తున్నామని తెలిపా రు. ఆధార్ అప్డేట్ ఉంటే తీసుకువెళ్తానని కండక్టర్ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అరగంట సేపు బస్సు అక్కడే ఆగిపోయింది. తర్వాత భైంసా డిపో బస్సు రాగా వారు అందులో ఎక్కి వెళ్లిపోయారు. దీనిపై డిపో మేనేజర్ను వివరణ కోరగా సంస్థ ఎండీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. -
విషజ్వరాల విజృంభణ
నిర్మల్చైన్గేట్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంటా చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. ఎక్కడికెళ్లినా వైరల్ ఫీవర్ల గురించే చర్చ నడుస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ సీ జనల్ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. జ్వరంతో పా టు ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు వచ్చి ఎంతకూ తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ఆరంభమైన తర్వాత అపరిశు భ్ర వాతావరణం, వర్షపునీరు నిలిచి దోమలు విజృంభించి వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్లో చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటా యి. అయితే ఈసారి మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. వైద్యులు కూడా జ్వరపీడితులు చెప్పే లక్షణాలు చూసి విస్తుపోతున్నారు. సాధారణంగా ఇచ్చే యాంటీ బయోటిక్స్కు జ్వరాలు తగ్గడంలేదు. దీంతో ఎక్కువ డోస్ ఉన్న మందులు రాస్తున్నారు. బాధితుల్లో చాలామంది బ్లడ్ ఇన్ఫెక్షన్, ఒంటి నొప్పులు, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి అన్నిరకాల సమస్యలు చుట్టుముట్టడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. వారంరోజుల్లోనే పెరిగిన బాధితులు జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విరోచనాలు, మలేరియా, డెంగీ లాంటి సీజనల్ వ్యాధులతో జనం బాధ పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి వా రం క్రితం వరకు వెయ్యిలోపు ఓపీ ఉండగా ప్రస్తు తం సంఖ్య ఎక్కువైంది. మంగళవారం ఒక్కరోజే 1,400 మంది జ్వరపీడితులు ఆస్పత్రికి వచ్చారు. ఆరోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. సంబంధిత శాఖ అధికారు లు, సిబ్బంది జిల్లాలో విషజ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్ర, మంగళవారాల్లో డ్రైడే పాటించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఇంటింటా బాధితులే దగ్గు, జలుబుతో ఇబ్బందులు ఒంటి నొప్పులతో ఉక్కిరిబిక్కిరి చాలామందిలో బ్లడ్ ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో వైద్యశాఖఈ ఫొటోలోని బాలుడు అనాజ్ఖాన్ది నేరడిగొండ మండలం వాంకిడి. ఇతను వారంరోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితం వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం, ఒళ్లు నొప్పులు త గ్గలేదు. దీనికి తోడు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గు తూ వచ్చింది. రెండురోజుల క్రితం జిల్లా జనర ల్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స కొనసాగుతోంది.పెరిగిన ‘ప్రైవేట్’ దోపిడీ పీహెచ్సీల్లో డెంగీ కిట్లు అందుబాటులో లేక పోవడం ప్రైవేట్ ఆస్పత్రులకు వరంగా మారింది. జ్వరాల బారిన పడిన పలువురు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు ఒక్కో టెస్ట్కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన జ్వర పీడితుల నుంచి టెస్ట్లు, మందులు, చికిత్స పేరిట అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నైపుణ్యాలు పెంపొందేలా బోధించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా బోధన కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం మండలంలోని ర త్నాపూర్కాండ్లి జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. తరగతులు పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పా ఠ్యపుస్తకాలు, యూనిఫాంల సరఫరాపై ఆరా తీశా రు. విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. ఉత్తమ ఫలితాల సాధనకు సన్నద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు రూపొందించిన భారతదేశ భౌగోళిక పటాన్ని చూసి అభినందించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరి శీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించా రు. ఆరోతరగతి విద్యార్థిని అక్షయ స్వయంగా గీసి అందించిన తన ఫొటోను చూసి కలెక్టర్ ఆమెను అ భినందించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నా టారు. కిచెన్ గార్డెన్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి కూరగాయల విత్తనాలు నాటారు. డీఈవో రామారావు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజా నన్, ఎంఈవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి నిర్మల్చైన్గేట్: భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే కారణాలు తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సీఎంఆర్ డెలివరీని సకాలంలో పూర్తి చేయని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని, సదరు మిల్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025‘ఇందిరమ్మ’ నిర్మాణాల పరిశీలన నిర్మల్ రూరల్: మండలంలోని రత్నాపూర్ కాండ్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బు ధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించా రు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ప నులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్ పాల్గొన్నారు. నిర్మల్లోని కాకతీయ యూనివర్సిటీ పీజీసెంటర్ వసతులున్నా.. వర్సిటీ ఇవ్వరా?న్యూస్రీల్ -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లుఆదిలాబాద్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మీ వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరుల కు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు అధికసంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉ ద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వె ళ్తుంటారు. ఈ కారణంగా రద్దీ ఉండడంతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది. 118 ప్రత్యేక బస్సులు ఈనెల 8న వరలక్ష్మీవ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఈ క్ర మంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలా బాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బ స్సులు వేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరాబాద్కు 72 బస్సులు నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రద్దీకి అనుగుణంగా బస్సులు వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతాం. – ఎస్.భవానీప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు కూడా పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో ఏవైన సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోల పరిధిలో సెల్ నంబర్ 9154298531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 9154298547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 9154298541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553లో సంప్రదించాలని కరీంనగర్ జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ సూచించారు. అందుబాటులో రాఖీ బుకింగ్ కౌంటర్లుముందస్తు రిజర్వేషన్ ఇలా.. పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆమె తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చేసిన కృషిని కొనియాడారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఏవో సూర్యారావు, డీఐఈవో పరశురాం, మెప్మా పీడీ సుభాష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. బాసర: బాసర ఆర్జీయూకేటీలో జయశంకర్ చిత్రపటానికి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానా న్ని వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, కల్చరల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ రాములు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరం
కుంటాల: తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. తల్లిపాల వారో త్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం కుంటాల, ఓలా ఉన్నత పా ఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో వన జ, ఎంఈవో ముత్యం, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. -
అత్తపై అల్లుడి అత్యాచారం..!
తానూరు(ముధోల్): అత్త చేతిలో అల్లుడు హతమైన సంఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్నగర్కు చెందిన షేక్నజీమ్(45) కుటుంబం పదేళ్ల క్రితం ముధోల్ మండలంలోని తరోడలో నివాసం ఉంటోంది. ఇటుకబట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమ్ అత్తగారైన రహీమున్నీసా వారితో కలిసి ఉంటోంది. వర్షాకాలం కావడంతో ఇటుకల తయారీ పనిలేక పోవడంతో మృతుని భార్య షేక్ సాహెబి ఈనెల 2న శనివారం మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లింది. ఈ నెల 4న తెల్లవారు జామున నజీమ్ మద్యం సేవించి వచ్చి అత్తను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం మత్తులో ఉన్న నజీమ్ మళ్లీ ఆమెతో గొడవపడడంతో కర్రతో తలపై దాడిచేసి గొంతునులిమి హత్య చేసింది. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం సీఐ మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహెబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు రహీమున్నీసాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
‘ఆదివాసీ మ్యూజియం’ మాయం..
సోషియాలజీ డిపార్ట్మెంట్కు అనుసంధానంగా నిర్మల్ పీజీ సెంటర్లోనే ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేశారు. అప్పటి అధ్యాపకులు, విద్యార్థులు తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీల గూడేలకు వెళ్లి.. వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడమే కాకుండా వారి పనిముట్లు, ఆభరణాలు, ఫొటోలను, వస్తువులను సేకరించారు. అప్పట్లో ఉన్న కేయూ వీసీ వచ్చి ఈ మ్యూజియం ప్రారంభించారు. దీని నిర్వహణకు ఏడాదికి రూ.50 వేల చొప్పున ఫండ్ ఇచ్చేవారు. అలాంటి అరుదైన ఆదివాసీ మ్యూజియాన్ని ఇప్పుడు కనుమరుగు చేశారు. అప్పటి వస్తుసంపద కూడా మాయమైంది. ఇచ్చిన నిధులకూ లెక్కలేదు. మ్యూజియంలోనే కాదు.. పీజీ సెంటర్లోని లైబ్రరీ పేరిట కూడా నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఆర్టీసీ బస్టాండ్లో రాఖీ కౌంటర్
నిర్మల్టౌన్: నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో రాఖీ కౌంటర్ను డిపో మేనేజర్ పండరి మంగళవారం ప్రారంభించారు. దూర ప్రాంతాలలో ఉన్న సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లలేని సోదరీమణుల కోసం ఈ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటర్ వద్ద వచ్చి బుక్ చేసుకుంటే.. రాఖీలు వేగంగా, భద్రంగా కార్గోలో చేరవేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్, స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కంట్రోలర్లు పీఆర్.గోపాల్, గజపతి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్య.. ఉత్తదే!
● పేరుకే పీజీ కాలేజీ.. ● కోర్సులు, చదువులు గాలికి.. ● ఆదివాసీ మ్యూజియం మూసివేత.. ● పాతకథలు చెబుతున్న ‘కాకతీయ’..! ● డిగ్రీ కాలేజీనీ పంపించేశారు ● ఇప్పటికీ ‘పాఠం’నేర్వని నిర్మల్ జిల్లా..నిర్మల్: యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సినచోట కనీసం డిగ్రీ కాలేజీలనూ ఉంచడం లేదు. కొత్త కోర్సులు పెట్టడం అటుంచి, ఉన్న వాటినీ తరలించేస్తున్నారు. పేదవిద్యార్థులకు పైచదువులు అందకుండా రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులుగా మార్చేశారు. పీజీ సెంటర్లో ఉమ్మడిజిల్లా ఆదివాసీ సంస్కృతిని కళ్లకు కట్టించిన మ్యూజియాన్నీ మాయం చేశారు. చదువులతల్లి కొలువైన జిల్లాలో ఉన్నతవిద్య ఉత్తమిథ్యగా మారింది. ఇదేం ‘పరీక్ష’..!? ఈ మధ్యనే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీకి సంబంధించిన ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించారు. నిర్మల్ పీజీ సెంటర్లోనూ పరీక్షలు పెట్టారు. కానీ.. ఈ విషయం అసలు ఎవరికీ తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా హన్మకొండ యూనివర్సిటీ నుంచి ఒకరు వచ్చి, ఐదురోజులు నిర్వహించాల్సిన పరీక్షలన్నీ ఒకేరోజు పూర్తిచేసి వెళ్లిపోయారు. అంతే.. అలా ఇంటర్నల్స్ పూర్తిచేసేశారు. అసలు అధ్యాపకులే లేని, క్లాసులే నిర్వహించని కాలేజీలో పరీక్షలు ఇంకెలా ఉంటాయి మరి. ఇదొక్క ఉదాహరణ చాలు జిల్లాలో ఉన్నతవిద్య తీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి. దశాబ్దకాలంగా విద్యావంతులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఎంత గొంతెత్తుతున్నా.. అటు కేయూ పట్టించుకోవడం లేదు. ఇటు జిల్లా పాలకులూ నిర్లక్ష్యం వీడటం లేదు. ఎన్నాళ్లీ నిర్లక్ష్యం..!? ప్రజల అమాయకత్వమా..!? నాయకుల అవగాహన లోపమా..!? పాలకుల నిర్లక్ష్యమా..!? అధికారుల పట్టింపులేనితనమా..!? ఏది ఏమైతేనేం ఎడ్యుకేషన్ హబ్గా మారాల్సిన జిల్లా, ఉన్న కాలేజీలు, కోర్సులు పోయి ఖాళీ అవుతోంది. రేపటితరానికి ‘ఇక్కడ కాలేజీ ఉండేది..’ అని ఉత్త భవనాలను చూపెట్టాల్సిన దుస్థితి వచ్చింది. ప్రతీ పీజీ సెంటర్ వైఎస్సార్ హయాంలో యూనివర్సిటీగా ఎదిగితే.. నిర్మల్ పీజీ సెంటర్ మాత్రం ఉల్టా అయ్యింది. స్థానికంగా ప్రజలు, పాలకులు, అధికారులు, అన్నివర్గాల నుంచి సరైన స్పందన లేనికారణంగానే ఈ దుస్థితి దాపురించినట్లు విద్యావంతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా ‘జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ’ కోసం జిల్లావాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్నారు. -
విద్యుత్ లేని గ్రామాల సర్వే
పెంబి: మండలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలను అటవీ, విద్యుత్శాఖ అధికారులు మంగళవారం సర్వే చేశారు. సింగిల్ విద్యుత్ సౌకర్యం లేని చాకిరేవు, సోముగూడ, త్రీఫేజ్ సౌకర్యం లేని కోసగుట్ట, కొత్తగూడ, గుమ్మెన ఎంగ్లాపూర్, ఒడ్డెగుడెం, గోధుమ గ్రామాలను సర్వే చేసినట్లు డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. నివేదికలు తయారు చేసి సంబంధిత అధికారులను పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీవో శివకుమార్, పెంబి ఎఫ్ఆర్వో రమేశ్రావు, విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
బాల కార్మికుల జీవితాల్లో వెలుగు
● ఆపరేషన్ ముస్కాన్తో 57 మందికి విముక్తి ● 42 మందిపై కేసులు నమోదు నిర్మల్ టౌన్/లక్ష్మణచాంద: బాలలు బడిలో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బాలకార్మికుల విముక్తి కోసం ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికుల జీవితాలకు వెలుగునిస్తున్నారు. తాజాగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 57 మంది బాల కార్మికులను గుర్తించి, వారికి పని నుంచి విముక్తి కల్పించారు. కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మరికొందరిని పాఠశాలల్లో చేర్పించారు. పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక, విద్య, ఆరోగ్య, బాలల సంరక్షణ విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. నిబంధనలకు విరుద్ధంగా బాలలతో పని చేయించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యాలు.. ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యం తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడం, బాల కార్మిక వ్యవస్థ నుంచి రక్షించడం, పునరావాసం కల్పించడం. బాలలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, కిడ్నాప్లను అరికట్టడం, సురక్షిత వాతావరణం కల్పించడం. జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, వెల్డింగ్ షాపులు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని విద్య వైపు నడిపించేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. 57 మందికి కొత్త జీవితం.. నెల రోజుల ఆపరేషన్ ముస్కాన్లో జిల్లా వ్యాప్తంగా 57 మంది బాలలను గుర్తించారు, వీరిలో 50 మంది బాలురు, ఏడుగురు బాలికలు. నిర్మల్ డివిజన్లో 25 మంది, భైంసా సబ్ డివిజన్లో 17 మందిపై కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి జరిమానా విధించారు. గుర్తించిన బాలలను తల్లిదండ్రులకు అప్పగించి, కౌన్సెలింగ్ చేశారు. పాఠశాలల్లో చేర్పించారు. ఈ చర్యలు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ప్రత్యేక పర్యవేక్షణ.. జిల్లా ఎస్పీ ఆపరేషన్ ముస్కాన్పై ప్రత్యేక దృష్టి సారించి, కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించారు. అధికారులు సమన్వయంతో బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు. నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి నాయకత్వం వహించగా, డీసీపీవో మురళి, ఎస్సైలు నరేష్, సందీప్, కానిస్టేబుల్ ప్రశాంత్, ఆరోగ్య, విద్య, కార్మిక శాఖలు, ఎన్జీవో సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఆపరేషన్ ముస్కాన్లో పరిష్కరించిన కొన్ని ఘటనలు.. 1. తాండ్ర గ్రామంలో 13 ఏళ్ల బాలుడు ఓ షాప్లో పనిచేస్తూ కనిపించాడు. ముస్కాన్ బృందం కౌన్సెలింగ్ నిర్వహించి, అతన్ని తిరిగి పాఠశాలలో చేర్పించింది. 2. నవీపేట మండలం, సిర్నాపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు 6వ తరగతి మధ్యలో చదువు మానేసి, నిర్మల్లో సోఫా తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని గుర్తించి యజమానిపై కేసు నమోదు చేసి, బాలుడిని సోదరునికి అప్పగించారు. 3. భైంసా పట్టణంలో 13 ఏళ్ల బాలుడు 8వ తరగతి మధ్యలో మానేసి వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా గుర్తించి అతడికి విముక్తి కల్పించారు. బాలుడిని పనిలో పెట్టుకున్న యజమానిపై కేసు నమోదు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. 4. లోకేశ్వరం గ్రామంలో 11 ఏళ్ల బాలుడు 5వ తరగతి మధ్యలో ఆపి గొర్రెలు కాస్తుండగా, ముస్కాన్ బృందం అతడిని పాఠశాలలో చేర్పించింది. 5. నిర్మల్ పట్టణంలో ఇద్దరు బాలలు వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ కనిపించగా, వారిని స్కూల్లో చేర్పించి, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 6. భైంసా పట్టణంలో 15 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల క్రితం చదువు మానేసి, లైటింగ్ బల్బులు మోస్తుండగా, కౌన్సెలింగ్ ద్వారా తిరిగి పాఠశాలకు పంపారు. పిల్లలను పనిలో పెట్టుకోవద్దు బాల కార్మిక వ్యవస్థ ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఎవరైనా దుకాణాల యజమానులు పిల్లలను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. పిల్లలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. వారికి మంచి భవిష్యత్ కల్పించాలి. ఆపరేషన్ ముస్కాన్తో జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం. – జానకీ షర్మిల, ఎస్పీ ఐదేళ్లలో గుర్తించిన బాల కార్మికులు.... సంవత్సరం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ 2021 243 85 2022 138 52 2023 67 55 2024 80 69 2025 66 57 -
నిర్మల్
పర్యాటకం.. అభివృద్ధికి దూరం సహజ అందాలకు నిలయమైన కడెం ప్రాజెక్టు, ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. పర్యాటకుల సంఖ్యకు తగ్గ సౌకర్యాలు మాత్రం లేవు. బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 202510లోu కాకతీయ.. ఇదేం కథ..!? ఇది.. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్. ఇందులో.. నిర్మల్లో కాకతీయ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల(పీజీ సెంటర్) అక్టోబర్ 1991లో స్థాపించబడిందని, ఈ కళాశాల సోషియాలజీలో ఎం.ఫిల్తో పాటు ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, పీజీ డీసీఏ సబ్జెక్టులలో పీజీ కోర్సులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ మ్యూజియంను బలోపేతం చేయడానికి ఐటీడీఏ, డీఆర్డీఏ, జిల్లా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో తరగతి గదులు, రెండు సెమినార్ హాళ్లు, లైబ్రరీ, ఒక కంప్యూటర్ ప్రయోగశాల ఉన్న విశాలమైన భవనంగా పేర్కొన్నారు. ప్రత్యేక భవనంలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కేవలం భవనం తప్పా.. పైవేవీ నిర్మల్ పీజీ సెంటర్లో లేవు. కాకతీయ అధికారిక వెబ్సైట్లో పాతముచ్చట్లనే కొనసాగిస్తూ.. అందరినీ మభ్యపెడుతోంది. నిర్మల్ కాలేజీ.. ఆసిఫాబాద్కు.. ఇది.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలపై అంతస్తులో మహి ళా డిగ్రీ కళాశాల కోసం కేటాయించిన తరగతి గది. ఇప్పుడు ఈ క్లాసులు ఖాళీగానే ఉంటున్నాయి. ఎందుకంటే.. ఇక్కడ ఉన్న మహిళా డిగ్రీ కళాశాలను ఆసిఫాబాద్ తరలించేశారు. జిల్లాకేంద్రంలో కాకుంటే.. డిగ్రీ కాలేజీ డిమాండ్ ఉన్న ఖానాపూర్లోనైనా ఈ కాలేజీని పెట్టాల్సింది. అలా చేయకుండా.. ఎక్కడో ఉన్న ఆసిఫాబాద్కు తరలించేశారు. ఇప్పటికీ అక్కడ నిర్మల్ కాలేజీ పేరిటనే కొనసాగుతోంది. ఉన్నతవిద్యను అందించే ఓ కాలేజీ తరలిపోయినా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. న్యూస్రీల్ -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించాలన్నారు. సీటింగ్ ఏర్పాట్లు క్రమబద్ధంగా ఉండాలని, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తి ప్రతిబింబించాలని సూచించారు. వేదిక వద్ద తాగునీరు, పండ్లు, ఫలహారాలు విద్యార్థులకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భూములు భద్రం.. హక్కులు పదిలం
● రైతులకు భూభారతి శ్రీరామ రక్ష ● ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారం ● కోర్టు కేసులు, సాదా బైనామాల అమలు కోర్టు అనుమతి వస్తేనే.. ● ‘సాక్షి’తో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. అలాగే రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. భూములు, హక్కులు భద్రంగా ఉంటాయి’ అని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్కుమార్ అన్నారు. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్ల డించారు. భూ భారతి చట్టం అమలు, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం తదితర వివరాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రశ్న: అసైన్డ్ భూమిని వ్యక్తిగత అవసరాలకు విక్రయిస్తే కొన్నవారికి హక్కులు వర్తిస్తా యా? రికార్డులో పేరు మార్చే అవకాశం ఉందా? అదనపు కలెక్టర్: అసైన్డ్ భూమి పొందిన వ్యక్తి తన భూమిని అమ్ముకోవడానికి ఎటువంటి హక్కులు ఉండవు. ఒకవేళ అసైన్డ్ భూమిని అమ్మితే.. అమ్మిన వ్యక్తికి కొన్న వ్యక్తికి ఇద్దరికీ నోటీసులు అందజేసి హెచ్చరించి మొదటి వ్యక్తికే భూమి చెందుతుంది. ఒకవేళ అదే వ్యక్తి మరోసారి భూమిని అమ్మకానికి పెడితే కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిలో కాస్తులో ఉంటూ.. పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు ఆసైన్డ్ కమిటీ సిఫారస్ మేరకు రికార్డులో కొత్తవారి పేరు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రశ్న: రెవెన్యూ సదస్సుల్లో ఎన్నిరకాల భూసమస్యలపై దరఖాస్తులు అందాయి? అదనపు కలెక్టర్: సక్సెషన్, మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, మిస్సింగ్ సర్వే నంబర్లు, మిస్సింగ్ ల్యాండ్, సాదాబైనామా అమలు, ఆసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్కు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వాటిని పెండింగ్లో ఉంచి మిగతా దరఖాస్తులు పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించాం. ప్రశ్న: భూ భారతి చట్టంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? అదనపు కలెక్టర్:ధరణిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు. నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో రైతులు ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగడం, డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. భూభారతి చట్టంతో ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో మునుపటిలా కోర్టులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రశ్న: భూభారతి చట్టంపై అమలుపై తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అదనపు కలెక్టర్: భూ భారతి చట్టంపై ఇప్పటికే పలు మార్లు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఏదైనా సమస్యలు ఎదురైతే ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలిస్తూ దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రశ్న: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం పురోగతి ఎలా ఉంది? అదనపు కలెక్టర్: జూన్ మొదటి వారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా 16,855 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 9,538 పైచిలుకు దరఖాస్తుల పరిష్కారానికి నోటీసులు జారీ, అభ్యంతరాలు స్వీకరించాం. సుమారు 2,600 దరఖాస్తుల పరిష్కారానికి అధికారిక ఆమోదం ఇచ్చాం. ఇప్పటి వరకు 3,888 దరఖాస్తులు తిరస్కరించాం. ప్రశ్న: ఆక్రమణకు గురైన ప్రభుత్వ, శిఖం భూములను చట్టంతో కాపాడే వీలు ఉందా? అదనపు కలెక్టర్: ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు కబ్జా చేసినట్లు అధికారుల దృష్టికి వస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి. ప్రశ్న: ప్రభుత్వ భూమిని ఏళ్లుగా సాగు చేస్తూ రికార్డులేని వారికి హక్కులు కల్పిస్తారా? అదనపు కలెక్టర్: ఈ అంశంపై జిల్లాలో కొన్ని దరఖాస్తులు వచ్చాయి. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న పేదలకు హక్కు కల్పిస్తాం. అసైన్డ్ కమిటీల నియామకం తర్వాత వారికి కమిటీ సిఫారస్ మేరకు రికార్డు ప్రకారం హక్కు కల్పిస్తాం. ప్రశ్న: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా? అదనపు కలెక్టర్: జిల్లావ్యాప్తంగా మ్యూటేషన్ కోసం 587 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. ఈ చట్టం ద్వారా నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్ మ్యుటేషన్ అయిపోతుంది. ఈ చట్టంలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి, -
పరిహారం అందించాలి
నా భర్త అడెళ్లు 2023, మే 10న మరణించాడు. నాకు 15 ఏళ్ల బాబు ఉన్నాడు. నా జీవితానికి ఏ ఆధారం లేదు. జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం ద్వారా సహాయం అందించాలి. – రాచర్ల సరిత, భాగ్యనగర్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.. పట్టణంలోని గాజులపేట్–వెంగ్వాపేట రోడ్డులో ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు వేయించాలి. – షరీఫ్ బిన్ ఆది, జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్మశాన వాటిక ఆక్రమణ ఆపాలి.. మేము ముధోల్ గ్రామస్తులం. మా ఊరిలో సర్వే నంబర్ 6లో ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక ఉంది. అక్కడ కొందరు దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారుల నుంచి శ్మశానవాటిక స్థలాన్ని కాపాడాలి. – ముధోల్ గ్రామ ప్రజలు -
భూమి కొలిచి హద్దులు చూపించాలి..
నాకు సారంగాపూర్ మండలం చించోలి(బి)లో 169/24 లో ఎకరం 24 గుంటల భూమి ఉంది. నా భూమి నాకు కొలిచి హద్దులు చూపించాలని చలాన్ కట్టాను. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. – ముక్కెర లక్ష్మి, చించోలి(బి) డబుల్ ఇళ్లు అప్పగించాలి.. మేము రాంనగర్ ఆసరా కాలనీవాసులం. సిద్దాపూర్ సమీపంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లలో రాంనగర్ వార్డు నంబర్ 16కు 107, ఆసరా కాలనీకి 109 మంజూరు చేశారు. కానీ నేటికీ నిర్మాణం పూర్తికాక పంపిణీ చేయలేదు. అధికారులు స్పందించి ఇళ్లు అప్పగించాలి. – రాంనగర్, ఆసరా కాలనీవాసులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అందించాలి.. నేను లంబా డా తెగకు చెందిన వాడను. జీవనోపాధి కి భూమి లేదు. లక్ష్మీసాగర్ శివారులో సర్వే నంబర్ 92లో కంపార్ట్మెంట్ 848 లో 8 ఎకరాల భూమి చదును చేసుకుని 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నా. 2022లో అధికారులు సర్వే చేశారు. ఆర్ఓఎఫ్ఆర్ సర్వేలో నా పేరు నమోదు చేశారు. కానీ పట్టా ఇవ్వలేదు. – భూక్య రాజేశ్, లక్ష్మీసాగర్ -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందొద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https://www.ceir.gov.in వెబ్పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 70 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని సెకండ్హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలని సూచించారు. దొంగతనానికి లేదా ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని తెలిపారు. అ యితే టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీరిజిస్టర్ (సీఈఐఆర్) అనే అప్లికేషన్ పోయిన ఫోన్ను వెతికి పెట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ను సద్వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు పోయిన 1566 ఫోన్లు రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఐటీ కోర్, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
వాళ్లకు గ్యారంటీ లేదా?
నిర్మల్ఆర్జీయూకేటీలో యక్షగానం బాసరలోని ఆర్జీయూకేటీ క్యాంపస్లో సోమవారం స్పీక్ మాకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో యక్షగాన కళా ప్రదర్శన నిర్వహించారు. సీతాపహరణ ఘట్టం ఆకట్టుకుంది. మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 20258లోu జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం భైంసాటౌన్: పట్టణంలోని గౌతమి హైస్కూల్లో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచానికి యోగాను పరిచయం చే సింది భారతదేశమే అన్నారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. జిల్లాలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి మల్లేశ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.నిర్మల్చైన్గేట్: ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాలు కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి అందడం లేదు. ప్రభుత్వం పథకాలకు తెల్లరేషన్కార్డు తప్పనిసరి చేసింది. దీంతో పదేళ్లుగా కార్డులు జారీ కాక, అర్హత ఉన్న పేదలు పథకాలు పొందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు జారీ చేస్తోంది. అయితే సబ్సిడీ పథకాలకు మాత్రం దరఖాస్తులు స్వీకరించడం లేదు. కొత్తగా 29,387 కుటుంబాల అర్హత.. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో 33,982 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 29,387 కుటుంబాలకు కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో ఈ కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలకు అర్హత సాధించాయి. ఉచిత విద్యుత్, సబ్సిడీ వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందాయి. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వీరు దరఖాస్తు చేసుకున్నా రేషన్కార్డు లేదన్న కారణంగా తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు రేషన్కార్డులు ఉన్నా.. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం లేదు. ప్రజాపాలన సేవా కేంద్రాలకు పరుగు.. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొత్తగా రేషన్కార్డులు జారీ అయినవారు సబ్సిడీ విద్యుత్, గ్యాస్ సిలిండర్ కోసం ఈ కేంద్రాలకు వెళ్తున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. న్యూస్రీల్ఉచిత విద్యుత్.. జిల్లాలో 29,387 కొత్తగా రేషన్ కార్డులు జారీ దీంతో ప్రభుత్వ పథకాలకు అర్హత.. కానీ, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ అందని వైనం.. దరఖాస్తుల కోసం అర్హుల ఎదురుచూపు జిల్లాలోని మొత్తం రేషన్ కార్డులు 2,33,471 లబ్ధిదారులు 7,33,913నెలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం దాదాపు 4,253 మెట్రిక్ టన్నులునూతన రేషన్ కార్డుల వివరాలు.. వచ్చిన దరఖాస్తులు 33,982మంజూరైన కొత్త రేషన్ కార్డులు 29,386 లబ్ధిదారులు 89,308మెంబర్ యాడింగ్ వివరాలు.. మొత్తం వచ్చిన దరఖాస్తులు 48,063 ఆమోదించిన దరఖాస్తులు 44,388 లబ్ధిదారులు 63,595 జిల్లాలో 2,03,269 గృహ విద్యుత్ కనెక్షన్లలో జూలై నెలలో 1,27,601 కనెక్షన్లు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు అర్హత సాధించాయి. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు దారులకు గణనీయమైన ఆర్థిక ఊరటను కల్పిస్తోంది. జిల్లాలో 2,51,785 వంట గ్యాస్ కనెక్షన్లలో కేవలం 1,15,532 కనెక్షన్లకు మాత్రమే రూ.500 సబ్సిడీ వర్తిస్తోంది. ప్రస్తుతం 29,387 కొత్త రేషన్కార్డులు జారీ అయిన నేపథ్యంలో తమకూ అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం కేటగిరీ 1 సర్వీసులు 2,03,269జూలైలో అర్హత పొందిన సర్వీసులు1,27,601గృహజ్యోతి బిల్లు పంపిణీ చేసిన సర్వీసులు1,21,646 జూలైలో గృహజ్యోతి సొమ్ము రూ.476.30 లక్షలు -
గాయపడ్డ గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి రప్పించాలి
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రెంకల రాజేందర్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. జూన్ 24న అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన భర్తను స్వగ్రామానికి రప్పించాలని రాజేందర్ భార్య మల్లీశ్వరి గ్రామస్తులు, కుటుంబీకులతో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్కు సోమవారం విన్నవించారు. ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమయ్యాడని తెలిపారు. స్పందించిన జాన్సన్ నాయక్ ఎంబ సీ అధికారులతో మాట్లాడి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వెట్టిచాకిరీ!
● ఆదర్శ పాఠశాలల్లో పనికి తగ్గ వేతనం అందని వైనం.. ● ఆ వేతనాలు కూడా సకాలంలో అందని ప్రభుత్వం ● ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ● విధులు బహిష్కరించి నిరసన కుంటాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఏళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 ఆదర్శ పాఠశాలల్లో 56 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2014లో నియమితులైన ఈ ఉద్యోగులలో ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, నైట్ వాచ్మెన్లు ఉన్నారు. వీరు పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారి వేతనాలు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పోలిస్తే చాలా తక్కువ. అయినా ప్రభుత్వం నెలనెలా చెల్లించడం లేదు. ప్రస్తుతం మార్చి నుంచి జూలై వరకు ఐదు నెలల వేతనాలు చెల్లించలేదు. దీంతో సోమవారం విధులు బహిష్కరించి ప్రిన్సిపాళ్లకు వినతిపత్రాలు సమర్పించారు. అప్పులతో జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అప్పు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా.. ఆదర్శ పాఠశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానమైన విధులను నిర్వర్తిస్తారు. వీరు బోధన, బోధనేతర పనులు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల విద్యాభివృద్ధి, రికార్డుల నిర్వహణ, హాజరు పర్యవేక్షణ, ఆఫీస్ సహాయక, ల్యాబ్ ఆపరేటర్, లైబ్రేరియన్ వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పాఠశాలల సమగ్ర నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. మాకు వేతనాలు సక్రమంగా రావడం లేదు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మా రుతోంది. పిల్లల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. అందుకే విధులు బహిష్కరించాం. – ఎ.గజేందర్, కుంటాల ఐదు నెలలుగా జీతాలు లేవు.. పనికి తగిన వేతనం లేదు. ఆపై ఐదు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. కుటుంబ పోషణ భారంగా మారింది. – శృతి, ఫిజికల్ డైరెక్టర్, బోథ్డిమాండ్లు ఇవీ.. సమాన పనికి సమాన వేతనం : రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం అందించాలి. కోతల రహిత వేతనం: పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ వంటి కోతలు లేకుండా పూర్తి వేతనం చెల్లించాలి. ఉద్యోగ భద్రత: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దీర్ఘకాల ఉద్యోగ భద్రత కల్పించాలి. హెల్త్ కార్డులు: అర్హులైన ప్రతి ఉద్యోగికి ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించాలి. నెలవారీ వేతనం: ప్రతి నెలా వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
భైంసారూరల్: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. మండలంలోని దేగాం గ్రామంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నా రు. ఉజ్వల భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దవని సూచించారు. మత్తు పదార్థాలతో ఆరోగ్యంపైపడే దుష్ప్రభావాలను వివరించా రు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యంతో చదువుకుని మంచి గుర్తింపు పొందాలన్నారు. మత్తుకు బానిసలై గతేడాది 12 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. సీఐ నైలు, ఎస్సై శంకర్, హెచ్ఎం అజీమ్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల సమస్యలపై వినతి
ఖానాపూర్: తెలంగాణ ఉద్యమ సమయంలో పోరా టాలు చేసిన వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లతోపాటు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకా రుల ఫోరం రాష్ట్ర వైస్చైర్మన్ పాకాల రాంచందర్ కో రారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనహిత పాదయాత్రకు వచ్చిన ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్కు ఆదివారం రాత్రి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఐకే.రెడ్డి ఉన్నారు. -
సమస్యలు విని.. భరోసా ఇచ్చి..
● ప్రజావాణికి అర్జీల వెల్లువ ● స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్ ● సమస్యలపై సత్వరం స్పందించాలని ఆదేశం నిర్మల్చైన్గేట్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్య తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ సమస్యపై అధికారులు సత్వరం స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు నియంత్రించేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మూడుసార్లు జ్వర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. పెంబి మండలానికి జాతీయస్థాయిలోనే ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో కాంస్య పతకం రావడం సంతోషకరమైన విషయమన్నారు. అధికారుల సమష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందన్నారు. గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకం స్వీకరించినందుకు కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ను జిల్లా అధికారుల సంఘం తరఫున సన్మానించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అవయవ దానానికి ముందుకు రావాలి.. ప్రజలు పెద్ద ఎత్తున అవయవదానానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ రిటైర్డ్ ఉద్యోగి జొన్న వినోద్ కుమార్ దంపతులు మరణానంతరం వారి దేహాలను నిర్మల్ వైద్య కళాశాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వారిని అభినందించారు. దేహదానం వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ, శాసీ్త్రయ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అవయవ దానానికి ముందుకు రావాలన్నారు.విద్యుత్ స్తంభం తొలగించాలి ఆదర్శనగర్ కాలనీలో నివాస గృహాలకు మీటరు దూరంలో విద్యుత్ శాఖ అధికారులు 33 కేవీ ఎలకి్ట్రక్ స్తంభం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం మూడు మీటర్ల దూరం ఉండాలి. అలాగే కాలనీలో సెల్ టవర్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. వెంటనే అధికారులు అడ్డుకోవాలి. – ఆదర్శనగర్ కాలనీవాసులు -
మాకొద్దు.. జీపీవో కొలువు
● పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల అనాసక్తి ● నోటిఫికేషన్లు ఇచ్చినా స్పందనేది? ● పరీక్ష రాసింది 133 మంది మాత్రమే ● సర్వీస్ కోల్పోతామనే భయంతోనే.. నిర్మల్చైన్గేట్: గ్రామపాలన అధికారి (జీపీవో)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకడుగు వేశారు. జీపీవోలుగా చేరితే పాత సర్వీస్ను పరిగణనలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రమోషన్లలో వెనుకబడిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది. జిల్లాలో 430 రెవెన్యూ గ్రామాలు జిల్లాలో 18 మండలాలు, 400 పంచాయతీలుండగా 430 రెవెన్యూ గ్రామాలున్నాయి. గతంలో 96 మంది వీఆర్వోలు, 748 వీఆర్ఏలు జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి 2020లో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామాల్లో పని చేస్తున్న ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రెవెన్యూశాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీవోను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా వీఆర్వోల స్థానంలో జీపీవోలను నియమించాలని నిర్ణయించింది. గతంలో వీఆర్వోలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్ష నిర్వహించగా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 155 మంది దరఖాస్తు చేయగా ఇందులో 105 మందిని అర్హులుగా గుర్తించారు. పరీక్షకు 96 మంది హాజరు కాగా, 61 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసేందుకు 75 మంది దరఖాస్తు చేయగా ఇందులో 55 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 37మంది మాత్రమే పరీక్ష రాయగా, ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. ఒక్కరికి మూడు గ్రామాలు తప్పవా? ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాలో 430 రెవెన్యూ గ్రామాలుండగా 430 మంది జీపీవోలను నియమించాల్సి ఉంది. కానీ.. పూర్వ వీఆర్వోలు 96 మంది, వీఆర్ఏలు 748 మందిలో 133 మంది మాత్రమే పరీక్ష రాశారు. దీంతో ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. జిల్లాలో మొత్తం వీఆర్వోలు 96 వివిధ శాఖల్లో భర్తీ అయినవారు 93 రిపోర్టు చేయకుండా ఉన్నవారు 3మొత్తం వీఆర్ఏలు 748 మరణించిన వీఆర్ఏలు 12 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు 60 జీపీవోకు మొదటివిడతలో దరఖాస్తు చేసుకున్నవారు 151 అర్హులు 105 పరీక్ష రాసిన వారు 96 ఉత్తీర్ణులైనవారు 61 రెండోవిడత దరఖాస్తు చేసుకున్నవారు 75 అర్హులు 55 పరీక్ష రాసినవారు 37 -
పాత పెన్షన్ అమలు చేయాలి
నిర్మల్ రూరల్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పా త పెన్షన్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ప్రమోషన్కు అర్హత గల ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు పరిశీలించాకే సీనియారిటీ జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. ఉ పాధ్యాయ, విద్యారంగ సమస్యలపై అవగాహన క లిగి, బీఈడీ కలిగిన వారినే డీఈవోలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల బ లోపేతానికి 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి, ఇదే కౌన్సిలింగ్లో భర్తీ చేయాలని కోరా రు. మ్యూచువల్ బదిలీ పొందిన ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జా బితాలో చేర్చాలన్నారు. ప్రమోషన్ల ప్రక్రియ ముగి సేదాకా ఉపాధ్యాయుల సర్దుబాటును తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. వెంటనే ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయు ల జీపీఎఫ్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిపడ్డ ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చే యాలన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చే యడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్థానికత ప్రాతిపదికగా జీవో 317 బాధిత టీచర్లకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ము రళీమనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘునందన్రెడ్డి, సహాధ్యక్షులు సుజాత, లక్ష్మీప్రసాద్రెడ్డి, సంయుక్త కార్యదర్శి శరత్చందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవికాంత్, వివిధ జిల్లాల బాధ్యులు శ్రీకాంత్, జలంధర్రెడ్డి, సత్తయ్య, రవీందర్, శ్రీనివాస్, భీమ్రావు, రాజేశ్వర్, తిరుపతి తదితరులున్నారు. -
బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
ఖానాపూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చా ర్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పా ల్గొనే జనహిత పాదయాత్ర బందోబస్తు విషయమై ఆదివారం పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ జానకీ షర్మిల సమీక్షించారు. ఏఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలపై సూచనలు చేశారు. రెండురోజులు నిర్వహించే కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వైభవంగా సుదర్శన యాగం
నిర్మల్టౌన్: శ్రావణమాసాన్ని పురస్కరించుకు ని జిల్లా కేంద్రంలోని బాలాజీవాడలోగల అలి వేలుమంగ ఆలయంలో ఆదివారం సుదర్శన యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించా రు. లోక కల్యాణం, భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తూ టీకే రామ కన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించి న ఈ యాగం భక్తి పారవశ్యాన్ని కలిగించింది. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ క్రతువు నిర్వహించారు. యాగం అనంతరం, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్ర మంలో లక్కడి జగన్మోహన్రెడ్డి, ఆమెడ శ్రీధర్, డాక్టర్ ప్రవీణ్, గంధం సుధాకర్, పూసల శ్రీకాంత్, అనిల్ ధనానివల, గోనె రాజు, పాతికే రమేశ్, రాజశేఖర్, శ్రీహరి, శేఖర్, పద్మ, ఏ విజయలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రా మంలోని వివిధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగా గ్రామస్తులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్రెడ్డి, నారాగౌడ్, కిరణ్ ఠాకూర్, పోతారెడ్డి, అజార్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ లక్ష్మణచాంద: మండలంలోని మునిపెల్లి గ్రా మ పంచాయతీ కార్యదర్శి భాగ్య సస్పెండ్ అయ్యారు. 10 రోజుల నుంచి ఒకే ఫొటోను ఫేస్ రికగ్నిషన్ యాప్లో అప్లోడ్ చేయడంతో ఆమెను కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెండ్ చేశారు. కాగా, మల్లాపూర్ పంచాయతీ కార్యదర్శి చైతన్యకు మునిపల్లి ఇన్చార్జి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీవో రాధ తెలిపారు. -
ఫేస్ రికగ్నిషన్ హాజరు సగమే..
● రెండోరోజు 50శాతం నమోదు ● అడ్డంకిగా సర్వర్, నెట్వర్క్ సమస్య ● డుమ్మా టీచర్లకు చెక్ పడేనా? లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు అన్ని రకాల వసతులు సమకూర్చుతోంది. ఉపాధ్యాయులు తరచూ డుమ్మా కొ డుతున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ము ఖ గుర్తింపు హాజరును అమలులోకి తెచ్చింది. ఈ నెల 1నుంచి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తోంది. జిల్లాలో హాజరు తీరు ఇలా.. జిల్లాలో 710 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 3,018 మంది ఉపాధ్యాయులుండగా శనివారం వరకు 2,062 మంది ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇంకా 956 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. రెండోరోజైన శనివారం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 2,062 మంది ఉపాధ్యాయుల్లో 1,031 మంది మాత్రమే ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కొందరు ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేసుకున్నా ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిపారు. ఆదిలోనే ఆటంకాలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు ప్రక్రియకు ఆదిలోనే పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా సర్వర్, నె ట్వర్క్ సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలి పారు. ఈ కారణంగా చాలామంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయుల్లోనూ సర్వర్, నెట్వర్క్ సమస్యతో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అప్లోడ్ కావడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో కొందరు టీచర్లు సర్దుబాటు పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఎక్కడ తమ హాజరు నమోదు చేసుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఫేస్ రికగ్నిషన్ యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరించి గ్రామీణ ప్రాంతాల్లోనూ నెట్వర్క్ సమస్య లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. యాప్ను ఫ్రెండ్లీగా మార్చాలి యాప్ను టీఎస్ యూటీఎఫ్ తరఫున స్వాగతిస్తున్నాం. యాప్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య లేకుండా చూడాలి. – శంకర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
యాత్రీకులకు ప్రత్యేక బస్సులు
కుంటాల: యాత్రికులు దైవదర్శనానికి వెళ్లేందు కు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు భైంసా డీఎం హరిప్రసాద్ తెలిపా రు. కుంటాల నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్, మహదేవ్, తుల్జాభవాని ఆలయాలకు వెళ్లే ప్రత్యేక సర్వీస్ను ఆదివారం కుంటాలలో ప్రారంభించారు. ఒక్కొక్కరికి రూ. 2,600 చా ర్జీ ఉంటుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భగవంత్రావు, వీబీవో శ్రీనివాస్, సిబ్బంది భూమ న్న, విశ్వనాథ్, వెంకట్రావు పాల్గొన్నారు. -
ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే లక్ష్యం
తానూరు: రైతుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే లక్ష్యమని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అంబిర్ ఆనంద్రావ్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతు కమిటీల ఏర్పాటు అనంతరం జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. సమస్యలపై పోరాడేందుకు రైతులంతా సంఘటితం కావాల్సిన అవసరముందని పేర్కొన్నా రు. తానూరు మండలంలో విద్యుత్ సమస్యలు పరి ష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, గోదావరి నది మనవద్ద ఉంటే మన వ్యవసాయ పొలాలకు చుక్క నీరు అందడం లేదని తెలిపారు. అనంతరం మండల సంఘ్ కమి టీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా బాయి జగన్, ఉపాధ్యక్షుడిగా కంచర్ల రవీందర్రెడ్డి, కార్యదర్శిగా పున్నోడు సాయినాథ్, సహ కార్యదర్శిగా బయ్యవాడ్ కిరణ్, కార్యవర్గ సభ్యులుగా శివరాత్రి ఆనంద్, మారుగొండ రాములు, దార్మూడ్ రాములు, కదాం దేవరావు, కంచెర్ల సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. -
వంద సీట్లు గెలుస్తాం
‘సరస్వతి’ నీళ్లు వచ్చేదెప్పుడు?సరస్వతి కాలువ నుంచి సాగునీటి విడుదలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలే దు. దీంతో రైతులు వరి నాట్లు వేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.ఇక ఇంటర్లో ముఖగుర్తింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల హాజరుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదుకు కసరత్తు చేస్తోంది.9లోu8లోuనిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర ని ర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్ర ప్రజల ను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చోకుండా తమ నేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాల ని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి తాను మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పా రు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివా సీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్గాంధీ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జి ల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హా మీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇ చ్చి, తెలంగాణకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చె ప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలు పుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నూతన రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలి పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జీవోలు మినమా పైసలు ఇవ్వలేదని, జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మండిపడ్డారు. నేటి కార్యక్రమాలు రద్దు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జనహిత పాదయాత్ర కార్యక్రమం పూర్తయ్యాక ఆదివారం రాత్రి జేకే ఫంక్షన్ హాల్లో నైట్హాల్ట్, సోమవారం నిర్వహించనున్న శ్రమదానం తదితర కార్యక్రమాలు రద్దయినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి పార్టీ నాయకులు వెళ్లాల్సి ఉండగా కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యక ర్తలు, అధికారులు ఖానాపూర్ నుంచి వారివారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. -
యువకుడి మృతికి కారకుడి అరెస్ట్
నిర్మల్టౌన్: యువకుడి మృతికి కారకుడిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. స్థానిక వెంకటాద్రిపేట్ కాలనీకి చెందిన సల్ల అభిలాష్ తన స్నేహితుడితో కలిసి గతనెలలో స్కూటీపై వెళ్తున్నాడు. బంగల్పేట్ కాలనీకి చెందిన బైండ్ల స్వామి మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అభిషేక్ తీవ్రంగా గాయపడి, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి బైండ్ల స్వామిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
కాసిపేట: పీహెచ్సీలో ౖవైద్యులు, వెద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే సెలవులు తీసుకోవాలని డీఎంహెచ్వో హరీష్రాజ్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, మందులు, వార్డులను పరిశీలించారు. మామిడిగూడలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించారు. ర్యాపిడ్ ఫీవర్ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్లు, గ్రామంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది సూచన మేరకు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వై ద్యాధికారి దివ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలుఆసిఫాబాద్: జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడలో శనివారం సాయంత్రం పిచ్చికుక్కల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. పట్టణంలోని బెస్తవాడకు చెందిన ముగ్గురు.. కాలనీ మీదుగా వెళ్తుండగా, కుక్క కరిచింది. వెంటనే స్థానిక ప్ర భుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. పిచ్చికుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మెడికో.. స్నేహ వారధి..
● వైద్య విద్యార్థుల ఫౌండేషన్ ● ప్రతీనెల సేవా కార్యక్రమాలు ● స్నేహాన్ని పెంపొందించుకునేలా కార్యక్రమాలు ఏడో తరగతి నుంచి భైంసా: 7వ తరగతి గదిలో ప్రారంభమైన స్నేహబంధాన్ని పట్టణానికి చెందిన లాగేట్వార్ శ్రీనివాస్, పల్సి గజ్జారాంలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాయిబాబానగర్కు చెందిన శ్రీనివాస్ డిజిటల్ సౌండ్ సిస్టం షాప్ ఉండగా, పల్సి గజ్జారాం ఆటో నడుపుతున్నాడు. కుటుంబ సభ్యులకు కష్టాలు వచ్చినా ఇద్దరు కలిసి చర్చించుకుంటారు. 27 ఏళ్లుగా స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. రెండేళ్లకోసారి గెట్ టు గెదర్ చెన్నూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తిలో దేవేందర్రావు (ప్రస్తుత చెన్నూ ర్ సీఐ) ఐదో తరగతి చదువుతున్నప్పడు మిల్కూరి రవీందర్రెడ్డి, మొర్రె ఓదెలు స్నేహితులు. ఓదెలు ప్రజాప్రతినిధి కాగా, రవీందర్రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. వీరి స్నేహం 30 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఎక్కడ ఉన్నా శుభకార్యాల్లో ముగ్గురు కలిసి వెళ్తా రు. రెండేళ్లకోసారి గెట్ టూ గెద ర్ ఏర్పాటు చేసి చిన్ననాటి మి త్రులందరినీ కలుసుకుంటారు. 30 ఏళ్లుగా.. భైంసా మండలం తిమ్మాపూర్కు చెందిన అ నంతుల నిఖిల్ ముద్దోళ్ల గణేశ్ చిన్నతనం నుంచే స్నేహితులు. గణేశ్ భైంసాలో సీడ్స్, ఫర్టిలైజర్ షాప్ ఉండగా, నిఖిల్ భైంసాలోని నిఖిల్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. 30 ఏళ్లుగా స్నేహ ం కొనసాగుతూనే ఉంది. రోజు ఇంటి నుంచి కలిసి వచ్చి తిరిగి కలిసే ఇంటికి వెళ్తారు. ఈ బంధం విడదీయలేనిది భైంసా: పట్టణానికి చెందిన పిప్పెర కృష్ణ, తోట రాము 40 ఏళ్లుగా స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన పిప్పెర గజ్జారాం భైంసాకు వచ్చి స్థిరపడ్డాడు. భట్టిగల్లిలో పెరిగిన పిప్పెర కృష్ణ, తోట రాముతో కలిసి చదువుకున్నాడు. క్రికెట్ ఆడుతూ యువజన సంఘం ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు కొనసాగించాడు. భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన పిప్పెర కృష్ణ తన చిన్ననాటి స్నేహితుడు తోట రామును మరిచిపోలేదు. పట్టణంతోపాటు చుట్టూపక్కల ఏ పని ఉన్న ఇద్దరు మిత్రులు కలిసే వెళ్తారు. ఈ స్నేహబంధం ఇప్పటికి ఎవరు విడదీయలేనిది. ఆపదలో అండగా ‘సోపతిమిత్ర’ నెన్నెల: నెన్నెల మండలం చిన్నవెంకటాపూర్కు చెందిన ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్ తన ఆలోచనతో సోపతి వెల్ఫేర్ సొసైటీకి పునాది వేశారు. జైపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1998–99 బ్యాచ్ పదో తరగతి వరకు చదువుకున్న మిత్రులు రాజబాబు, సాంబశివ, రాచర్ల శ్రీనివాస్, నీలాల శ్రీనివాస్, కృష్ణ, రవికిషన్, నారాయణ, తిరుపతితో కలిసి మొత్తం 110 మంది స్నేహితులతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. మిత్రులకు ఏ ఆపద వచ్చిన అందరూ కలిసి వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుని వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు రూ.6 లక్షలకుపైగా ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రక్తదానం, రక్తహీనతతో బాధపడుతున్న తలసేమియా బాధితులకు రక్తం కావాలన్నా మేమున్నామంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికసాయం అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. కష్టసుఖాల్లో తోడునీడగా.. సాత్నాల: భోరజ్ మండలం మాండగడలో ఆత్రం వామన్ (జూనియర్ అసిస్టెంట్), షేక్ సలీం (ఆర్ఎంపీ) మూడో తరగతిలో స్నేహం మొదలైంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆత్రం వామన్ పలు సందర్భాల్లో షేక్ సలీం ఇంట్లో అన్నం తిని పాఠశాలకు వెళ్లేవాడు. తన స్నేహానికి కులం అడ్డు రాదని ఆ గ్రామంలో కృష్ణాలయం నిర్మాణ సమయంలో షేక్ సలీం రూ.25 వేలు విరాళంగా అందించారు. హిందువుల పండుగల వేళ షేక్ సలీం కుటుంబ సభ్యులతో కలిసి వామన్ ఇంటికి వస్తారు. ముస్లిం పండుగలు ఉన్నప్పుడు వామన్ కుటుంబ సభ్యులతో సలీం ఇంటికి వెళ్తారు. 43 ఏళ్లుగా ఒకరికొకరు కష్టాల్లో పాలుపంచుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.సేవల్లో టాప్ ముధోల్ మండలం ముద్గల్ గ్రామానికి చెందిన యువకులంతా సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటున్నారు. గ్రామానికి చెందిన స్నేహితులంతా ఒకే చోట కలిసి అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారికి 3 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో స్నేహితులంతా కలిసి శ్రమదానంతో రోడ్లు వేశారు. యువ భారత్ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించే ఈ స్నేహితుల బృందం ముద్గల్ గ్రామ అభివృద్ధికి పాటుపడుతోంది. మతాలు వేరైనా.. తాంసి: తాంసికి చెందిన జానకొండ శ్రీకాంత్, వడ్డాడి గ్రామానికి చెందిన అబ్దుల్ అశ్వక్ 6వ తరగతి చదువుతున్నప్పుడు స్నేహితులయ్యారు. 30 ఏళ్లుగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. మతాలు వేరైన ఇళ్లలో జరిగే శుభకార్యాలు, కష్టసుఖాల్లో రెండు కుటుంబాలు పరస్పరం కలుసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల్లో ఒకరికొకరు పనులు చేసుకుంటారు. స్నేహం వారి బలం కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరికి చెందిన తిరుపతి గిత్తే, రమేశ్ పురి, రాజు పాతాడే, సుదగొనేవార్ మాధవ్, రా థోడ్ సుదర్శన్, తిరుపతి కాగ్నే, విష్ణు కేంద్రె, రాజు చోళే, బాలు తిడ్కే స్నేహితులు. వేర్వేరు కుటుంబాల నుంచి వ చ్చినా, మనస్సులు ఒక్కటయ్యాయి. ప్రతీ పనిలో చో దోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతీ పండుగలో ఒక్కటై అన్ని తామే నిర్వహిస్తారు. కొందరు వ్యాపారులు, మరికొందరు విద్యావంతులుగా ఉన్నారు. ఏళ్లుగా ఒకే మాట.. ఒకే బాటపై నడుస్తున్న తొమ్మిదిమంది మిత్రులు స్నేహమేరా జీవితమంటూ తెలియజేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్నారు. 19 ఏళ్లుగా స్నేహబంధం ఆదిలాబాద్టౌన్: నేను 2006లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా చేరాను. ఆ సమయంలో నా స్నేహితురాలు మంజూల కెమిస్ట్రీ లెక్చరర్గా పరిచయమైంది. అప్పటి నుంచి మా స్నేహం ముడిపడింది. కళాశాలలో నాలుగేళ్లు పనిచేశాం. 2013లో నేను మహిళా డిగ్రీ కళాశాలకు పదోన్నతిపై వెళ్లగా, నా స్నేహితురాలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లారు. ఆ తర్వాత నేను ఉట్నూర్కు బదిలీపై వెళ్లగా, ఆమె లక్సెట్టిపేట్ డిగ్రీ కళాశాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ మా స్నేహబంధం కొనసాగుతోంది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె డిగ్రీ కళాశాలలో ఉండడంతో నేను అదే కళాశాలను ఎంచుకున్నాను. ప్రస్తుతం ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇరు కుటుంబ సభ్యులు కష్టసుఖాల్లోనూ పాలు పంచుకుంటాం. 19 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతుంది. – సంగీత, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దోస్తులంతా ఉద్యోగులే తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రులు ఒకే చోట విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి 1999లో 10వ తరగతి పూర్తిచేశారు. ఉన్నత చదవులు చదవి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. బి.సుధాకర్ (ప్రభుత్వ టీచర్), పి.గంగాధర్ (సాఫ్ట్వేర్), ఎల్.దత్తాత్రి (పీజీటీ టీచర్), ఎ.రాజేశ్వర్ (ఆరోగ్యమిత్ర)గా కొనసాగుతున్నారు. మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల సేవాగుణం పలువురికి చేయూతనందిస్తోంది. విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుతోంది. కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.సులేమాన్ ఆధ్వర్యంలో గవర్నమెంటు మెడికల్ కాలేజీ ఫౌండేషన్, మంచిర్యాల పేరిట ఏర్పాటైంది. 2002లో మొదలైన మెడిసిన్ మొదటి బ్యాచ్ ఆరంభ్, 2023లో ఆరోహణ, 2024 బ్యాచ్ అద్వితీయగా నామకరణం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థి నెలకు రూ.100 చొప్పున జమ చేసి ఐదు లక్ష్యాలు ఆర్థిక సహాయం, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, సోషల్ ఆవేర్నెస్లను ఎంచుకుని సహాయం అందిస్తున్నారు. మార్చి నుంచి జూలై వరకు లక్ష్యాలను పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో పేద మెడిసిన్ విద్యార్థికి మూడో సంవత్సరానికి హాస్టల్, కాలేజీ ఫీజు చెల్లించారు. మంచిర్యాలలోని బాలికల పాఠశాల విద్యార్థినులకు న్యాప్కిన్స్ అందించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కల్వరి వృద్ధాశ్రమం, ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యాంగులు ఇద్దరికి రెండు ట్రైసైకిళ్లు అందించారు. లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, క్రీడాసామగ్రి అందజేశారు. ఆత్మీయ బంధాల సౌరభం స్నేహం కష్టసుఖాల్లో తోడుండేవాడు మిత్రుడు నిజమైన మిత్రులే గొప్ప ఆస్తి నేడు స్నేహితుల దినోత్సవం ఆస్తులు సంపాదించినవాడు కాదు, ఆప్తులను సంపాదించినవాడే నిజమైన అదృష్టవంతుడు. స్నేహితుడు.. ఎవరి సమక్షంలో బాధలు సగానికి సగమై, ఆనందం రెట్టింపవుతుందో, ప్రపంచంలో ఎవరూ విడిచిపెట్టినా నీవు ఒంటరి కాకుండా తోడుంటారో, వారే నిజమైన మిత్రులు. స్వచ్ఛమైన స్నేహం ఒక అపురూప దివ్యమణి, హృదయాలను అనుసంధానం చేసే ఆత్మీయ వారధి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం, ఆర్థిక సంబంధాల మధ్య స్వార్థం లేని స్నేహం కోసం తపించే హృదయాలెన్నో.. అయినా, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం, గత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం ఆ హృదయాలకు ఊరటనిస్తుంది. సాంకేతికత స్నేహబంధాలకు కొత్త ఊపిరి పోసింది. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు దూరమైన మిత్రులను దగ్గర చేశాయి. ట్రెండ్ మారినా.. నిజమైన ఫ్రెండ్ మారలేదు. నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆప్తమిత్రులపై ప్రత్యేక కథనం. -
బాలింతకు దారి కష్టాలు
● 2 కి.మీ కాలినడకతో ఇంటికి.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని చిట్యాల్బోరి గ్రామస్తులకు వర్షాకాలంలో దారి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో రెండుచోట్ల వాగులు ప్రవహిస్తాయి. వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆడ లక్ష్మి ఆదిలాబాద్ ఆస్పత్రిలో ప్రసవమై డిశ్చార్జి ఇంటికి పయనమయ్యారు. గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక బాలింత 2 కి.మీ పసికందుతో కాలినడకన వెళ్లారు. రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పే ర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. -
మానవత్వం చాటుకున్న కార్మికులు
● గాయపడ్డ ఎద్దుకు చికిత్స శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని కార్మికులు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్క న గాయాలతో మూలుగుతున్న ఎద్దును చూసి దా నికి సపర్యాలు చేసి సంరక్షణ కేంద్రానికి తరలించా రు. వర్క్షాప్ నుంచి ఆర్కే 7 గనికి వెళ్లేదారిలో మూడురోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఓ ఎద్దును ఢీకొట్టి గాయపర్చింది. కాళ్లకు తీవ్ర గా యమై రక్తస్రావం జరగడంతో కదలకుండా అక్కడే పడి ఉంది. శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే కార్మి కులు గమనించి రామకృష్ణపూర్కు చెందిన పశుసంరక్షణ కేంద్ర నిర్వాహకులు శ్రీధర్, రాజసమ్మయ్య సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకో గా దాన్ని తరలించడం ఇబ్బందిగా మారింది. కా ర్మికులు.. ఏజెంట్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్కు చెప్పడంతో ఆయన ఆదేశాలతో ఏరియా వర్క్షాప్ డీజీఎం రవీందర్ క్రేన్, వాహనాన్ని సమకూర్చారు. ఎద్దును లారీలో ఎక్కించి సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గని కార్మికులు మారుపల్లి సారయ్య, నాగరాజ్, రాజ్కుమార్, చిలుక రమేశ్ పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
● రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదిలాబాద్రూరల్: ఉమ్మడి జిల్లాలో ఈనెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కుమురం భీం జిల్లాలో నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభకు జాతీయ, రాష్ట్ర, అన్ని ఆదివాసీ తెగలు, ఆదివాసీ సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఆదివాసీలు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పంద్రం శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, కుమ్ర శ్యామ్రావు, జంగు పటేల్, శేష్రావు, సునీల్, రాజు, ఉపేందర్, హన్ను పటేల్, విజయ్, మనోహర్, మారుతి, మాణిక్ రావు, సూర్యబాన్, చిత్రు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యం
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఉష్కెల దశరథ్(30) అదృశ్యమయ్యారు. ఎస్సై శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం.. దశరథ్ కొన్నినెలలుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాసీ్త్రనగర్లో కూరగాయాలు అమ్ముతూ కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతని భార్య శైలజకు ఆర్యోగం బాగా లేకపోవడంతో గతనెల 13న స్వంత గ్రామమైన బోథ్కు వచ్చాడు. ఐదురోజుల క్రితం భార్యను నేరడిగొండలోని తన పుట్టింటికి వెళ్లింది. దశరథ్ గతనెల 31న నిర్మల్ వెళ్లి వస్తానని తల్లి లక్ష్మితో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికిన దొరకలేదు. భార్య శైలజ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సొంతింటి పథకం అమలుకు కృషి
శ్రీరాంపూర్: కార్మికుల చిరకాల కోరిక అయిన సంతింటి పథకం అమలుకు కృషి చేస్తున్నామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య తెలిపారు. శ్రీరాంపూర్ సీహెచ్పీలో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఇటీవల జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో సొంతింటి పథకం, అలవెన్స్లపై ఆదాయ పన్ను చెల్లింపులు వంటి ప్రధాన డిమాండ్లకు యాజమాన్యం ఒప్పుకుందన్నారు. సొంతిల్లు నిర్మించుకొన్న వారికి కంపెనీ క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందన్నారు. డిస్మిస్ అయిన జేఎంఈటీలకు తిరిగి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, బద్రి బుచ్చయ్య, నాయకులు తిరుపతి, సాయిరాజ్, రాజకుమార్ పాల్గొన్నారు. రైలు కిందపడి ఒకరి ఆత్మహత్యఆదిలాబాద్టౌన్: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ ఇన్చార్జి టి.ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్రలోని భోకర్కు చెందిన సాయినాథ్ సుంగుర్వాడ్ (40) గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శనివారం తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో ప్లాట్ఫాం–1 రైలు పట్టాలపై తలపెట్టాడు. ఆదిలాబాద్ నుంచి పర్ణి వెళ్లే ప్యాసింజర్ రైలు వెళ్లడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
పాదయాత్ర రూట్మ్యాప్ పరిశీలన
ఖానాపూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో రూట్మ్యాప్ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు శనివారం పరిశీలించారు. ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సుర్జాపూర్, మస్కాపూర్ గ్రామాల మీదుగా ఖానాపూర్ పట్టణం వరకు సాగుతుంది. రాత్రి 9 గంటలకు పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో నైట్హాల్ట్ ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం ఖానాపూర్లోని బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో శ్రమదానం ఉంటుందన్నారు. అనంతరం జేకే ఫంక్షన్హాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి జనహిత పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. సుజ్జాపూర్లో విద్యార్థులతో వెడ్మబొజ్జు, శ్రీహరిరావు -
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
కడెం: కడెం ప్రాజెక్టు కుడి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని మండలంలోని చిట్యాల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులకు శనివారం వినతిపత్రం అందజేశారు. కొండుకూర్ నుంచి చిట్యాల్ వరకు కుడి కాలువ పిచ్చిమొక్కలు, చెత్తచెదారంతో నిండిపోవడంతో సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. చిట్యాల్ శివారులో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉందని, నాట్లు వేసేందుకు సాగు నీటి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు, చెత్తచెదారం తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్, రైతులు ధర్మాజి కిష్టయ్య, రమేశ్, జలపతి, ఇస్రూ, తిరుపతిరెడ్డి, ఇందన్న, శంకరయ్య, గంగారెడ్డి, రాజలింగు, నరేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆర్జీయూకేటీ సంకల్పం
● ర్యాగింగ్, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో జిల్లా న్యాయసేవా సమన్వయంతో ‘ర్యాగింగ్ నివారణ, మాదకద్రవ్యాల విపత్తు నివారణ’పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, భైంసా మేజిస్ట్రేట్ దేవేంద్రబాబు, ఏఎస్పీ అవినాష్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్, డ్రగ్స్పై కఠిన చర్యలు.. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, క్యాంపస్ను ర్యాగింగ్, మాదకద్రవ్య రహితంగా ఉంచడం తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా జడ్జి వాణి ర్యాగింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలను వివరిస్తూ, ఫిర్యాదులపై కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. 1832–44లో చైనా–బ్రిటన్ డ్రగ్ యుద్ధాలను ఉదాహరణగా చెప్పారు. సీనియర్ జడ్జి రాధిక, న్యాయ సేవాసంస్థ పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు సేవలందిస్తోందని, విద్యార్థులను లీగల్ పారా వాలంటీర్లుగా చేరాలని కోరారు. వసతి గృహాల పరిశీలన.. 1997లో తమిళనాడు ర్యాగింగ్ నిరోధక చట్టం తీసుకొచ్చిన నేపథ్యాన్ని రాధిక వివరించారు. ర్యాగింగ్ ఫిర్యాదులను కమిటీకి తెలపాలని సూచించారు. అనంతరం బాలికల వసతి గృహం, భోజనశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కోర్టు సూపరింటెండెంట్ పురుషోత్తంరావు, ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్సై శ్రీనివాస్, డీన్లు నాగరాజు, డాక్టర్ విఠల్, చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘నిర్మల’మైన మైత్రిబంధం..
కల్మషం.. అసూయ.. ద్వేషం లేనిది స్నేహం. ఒకరికిఒకరు అన్నట్టుగా ఉంటూ, కష్టసుఖాల్లో కలిమిలేములలో భుజం తట్టి తోడుగా నిలిచే స్నేహం ఏ బంధానికి సాటిరాదు. ఇందుకు నిదర్శనం నిర్మల్కు చెందిన ఈ 11 మంది మిత్ర బృందం. పుష్కరకాలానికి పైగా కలిసిమెలిసి ఉంటూ ‘నిర్మలమిత్ర’ పేరుతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు. అంతా కలిసి కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య గడుపుతున్నారు. ఏదైనా అనుకోని కష్టం వచ్చినా రక్తసంబంధీకులు బంధువులు వస్తారో రారో తెలియదు కానీ వీరు మాత్రం క్షణాల్లో అక్కడికిచేరి భరోసా అందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీరంతా కష్టపడి చదివి వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వీరందరూ ఉద్యోగరీత్యా నిర్మల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ వారానికోసారి కలుసుకుంటారు. సాధక బాధకాలను పంచుకోవడం వీరి మైత్రిబంధాన్ని బలోపేతంచేస్తోంది. -
పేరు తెచ్చిన పెంబి..
● ఉత్తమ ఫలితాలు సాధించిన పెంబి బ్లాక్ ● సంపూర్ణత అభియాన్తో పలుమార్పులు ● ఏబీపీలో జాతీయర్యాంకు ● గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్జాతీయస్థాయిలో నాల్గోస్థానం.. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం(ఏబీపీ) ప్రధాన ఉద్దేశమైన వెనుకబడిన ప్రాంతాల్లో వివిధ అంశాల్లో మార్పు తీసుకురావడం అనేది పెంబి మండలం కనిపించడంపై నీతిఆయోగ్ సంతృప్తి వ్యక్తంచేసింది. ఏబీపీ కార్యక్రమ అమలు తీరుపై నీతిఆయోగ్ నెలవారీగా డెల్టా ర్యాంకింగ్ ప్రకటించింది. ఇందులో దేశంలోని మొత్తం 500 బ్లాకులలో మెరుగైన ఫలితాలతో పెంబి బ్లాక్ జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించింది. నిర్మల్/పెంబి: పెంబి.. చుట్టూ దట్టమైన అడవుల మధ్య కనీసం సరైన తోవ కూడా లేని ఊళ్లతో, ఇప్పటికీ కరెంటును చూడని పల్లెలతో, అ భివృద్ధి అనే పదానికి అర్థం కూడా తెలియని గూడేలతో ఉన్న మండలం. అలాంటి మండల మే ఇప్పుడు జిల్లాకు పేరు తీసుకొచ్చింది. నిర్మ ల్ కీర్తిని జాతీయస్థాయిలో నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా చేపట్టిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్(ఆకాంక్షత జిల్లాల కార్యక్రమం)ద్వారా చేపట్టిన కార్యక్రమాల్లో పెంబి మండలం ఉత్తమ ప్రగతిని సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రకటించిన ర్యాంకుల్లో జా తీయస్థాయి నాల్గోస్థానంలో నిలిచింది. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అభిలాషఅభినవ్ శనివారం పురస్కారం అందుకున్నారు. ఆకాంక్షత బ్లాక్గా ఎంపికై .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 2018 జనవరిలో నీతిఆయోగ్ ద్వారా ఆస్పిరేషనల్(ఆకాంక్షత) డిస్ట్రిక్ట్స్(బ్లాక్) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 112 అత్యంత వెనుకబడిన జిల్లాలను త్వరగా, సమర్థవంతంగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఆయా జిల్లాల్లోనే వెనుకబడిన బ్లాక్(మండలాల)ల్లో ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, జల వనరులు, ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర సామాజిక, ఆర్థిక అంశాలలో పురోగతి సాధించాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వెనుకబడిన మండలంగా పేరున్న పెంబి ఎంపికై ంది. పలు అంశాల్లో మార్పు... ప్రోగ్రాంలో భాగంగా ఆరు అంశాలపై సంపూర్ణత అభియాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జూలై 6, 2024న పెంబి బ్లాక్లో ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 31, 2024 వరకు కొనసాగింది. ఈ త్రైమాసిక కార్యక్రమాలతో పలు అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రధానంగా ఆరు సూచికల్లో పరిశీలన చేపట్టగా, నాలుగింటిలో సంతృప్తకరమైన ఫలితాలు వచ్చాయి. ఆరోగ్యపరంగా మధుమేహం, రక్తపోటు, సప్లిమెంటరీ న్యూట్రిషన్లతోపాటు, భూసార పరీక్షలు, గర్భిణులకు సంబంధించిన పరీక్షలు, ఎస్హెచ్జీ రివాల్వింగ్ ఫండ్ కవరేజీ అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. చేయాల్సినవెన్నో.. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా కేంద్రమే గుర్తించిన పెంబి మండలంలో ఏబీపీ ద్వారా ఆరోగ్యం, పోషకాహారం తదితర అంశాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడి ఆదివాసీ మహిళల్లో రక్తహీనత, పోషకాహారలోపం ఎక్కువ. ఈకారణంగానే గర్భస్థ శిశుమరణాల సంఖ్య ఉంటోంది. ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమం వీటిలో మార్పు కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆ మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చాకిరేవు వంటి చాలా గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు, కరెంటు లేదు. చాలా ఊళ్లు సరైన తాగునీటికి నోచుకోవడం లేదు. వర్షాకాలం వాగులు పొంగితే రాకపోకలకూ ఇబ్బందే. తాజాగా జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన పెంబి మండలంపై ఇప్పటికై నా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంపూర్ణ అభియాన్తో మార్పులు.. అంశం అభియాన్కు అభియాన్ ముందు(శాతం) తర్వాత(శాతం) గర్భిణులకు పరీక్షలు 90 100 మధుమేహ పరీక్షలు 35 100 రక్తపోటు పరీక్షలు 35 100 పోషకాహారం 68 100 భూసారపరీక్షలు 00 69.39 రివాల్వింగ్ ఫండ్ కవరేజీ 54 94.6 -
ఖానాపూర్లో బంద్ సంపూర్ణం
ఖానాపూర్: ఖానాపూర్కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూర్కు తరలించడాన్ని నిరసిస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి శనివారం తలపెట్టిన పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలతోపాటు, ఇతర పాఠశాలలను మూసివేయించేందుకు వెళ్లిన జేఏసీ నాయకులను సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్ ష్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మద్య వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో నాయకులు సాగి లక్ష్మణ్రావు, ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, పుప్పాల గజేందర్, ఎనగందుల నారాయణ, కాశవేని ప్రణయ్, గౌరికార్ రాజు, ఇర్ఫాన్, నశీర్, ప్రణీత్, రాపెల్లి రవీందర్, బి.మురళికృష్ణ, మాదాసు మురళి, దివాకర్, మేస సతీశ్, జెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక కెమెరా వందమంది పోలీసులకు సమానం
నిర్మల్టౌన్: ఒక సీసీ కెమెరా.. వంద మంది పోలీ సులతో సమానమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించారు. అంతకుముందు కాలనీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ప్రధాన ఆయుధమన్నారు. జిల్లా ప్రజల సహకారంతో ఇప్పటి వరకు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ జియో ట్యాగింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామని చెప్పారు. ఈ మధ్యకాలంలో జరిగిన జ్యువెలరీ దొంగతనం, షట్టర్ లిఫ్టింగ్ కేసు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో శ్రీనగర్ కాలనీ పట్టణంలోని అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. అనంతరం కాలనీవాసులు ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సంజీవ్, శ్రీనగర్కాలనీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి రాకేశ్, కోశాధికారి సాయినాథ్, భూమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు గురుకుల విద్యార్థులు
తానూరు(ముథోల్): ముధోల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్లోని జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో 3వ తేదీ నుంచి జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వి.సిద్ధార్థ 200 మీటర్లు, కె.సాయిరాం 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవ్, దేవోజి శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
స్నేహమే జీవితానికి వెన్నెల
● దోస్తానా మాధుర్యం అనిర్వచనీయం ● మైత్రీబంధానికున్న ప్రాధాన్యత ప్రత్యేకంఈ ఫొటోలోని ముగ్గురు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఇంటర్ చదువుకునే రోజుల్లో వీరిమధ్య ఏర్పడిన స్నేహం బలపడింది. ప్రస్తుతం ముగ్గురూ బోధనా వృత్తిలో ఉన్నారు. ఇద్దరు డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉండగా, మరొకరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్. వీరి 16వ ప్రాయంలో ఏర్పడిన స్నేహబంధం దృఢపడుతూ వస్తోంది. తమ స్నేహ బంధంతో యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కటకం మురళి, యూ.రవికుమార్, కందూరి శంకర్. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వీరు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకున్నారు. ఒకరి తడి కంటిని మరొకరు తుడిచి ధైర్యం పంచుకున్నారు. చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. అక్కడితో ఆగకుండా జూనియర్ అధ్యాపకులుగా, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నిర్మల్లో స్థిరపడినవీరు.. ఇప్పటికీ ప్రతి సందర్భంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సలహాలు సూచనలు ఒకరికొకరు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరి మైత్రిబంధం నిజమైన స్నేహానికి స్ఫూర్తి. నిర్మల్ఖిల్లా: కష్టసుఖాల్లో కలిమీలేమీల్లో.. నీ కోసం నేనున్నాను.. అని భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఈ మైత్రీబంధం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. విషాదాన్ని తగ్గిస్తుంది. ఆత్మీయమైన స్నేహా లు, ఉన్నతమైన మానవతా విలువలు నిశీధి లో ఉషోదయంలా దారి చూపుతూనే ఉన్నా యి. చిన్నప్పుడు...బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే.. పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని.. ఈ బంధం నిజంగానే జీవితానికి వెలుగునిస్తుంది. స్ఫూర్తి కెరటాలు.. -
నాటిన ప్రతీమొక్కను రక్షించాలి
● డీఎఫ్వో నాగిని భానుసారంగపూర్: అధికారులు, ప్రజలు తాము నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని, అప్పుడే వనమహోత్సవానికి నిజమైన అర్థం ఉంటుందని జిల్లా అటవీ అధికారి నాగిని భాను అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయ సమీపంలోని అడెల్లి నందనవనంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అటవీ అధికారితోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంర్జుమంద్ అలీ నందనవనంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులందరితోపాటు అటవీశాఖ, ఇతర శాఖల అధికారులతో మొక్కలు నాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎఫ్వో మాట్లాడారు. మొక్కలు నాటడంతోనే తమ బాధ్యత తీరిపోదని వాటిని పెంచి పెద్దవిగా చేస్తేనే చేసిన పనికి నిజమైన అర్థం పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అడవుల పరిరక్షణ సైతం ప్రతీ పౌరుడి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు తమ ఇళ్ల ఆవరణలతోపాటు పొలం గట్ల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ అందమైన పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, అటవీ క్షేత్రాధికారి జీవీ.రామకృష్ణారావు, టాస్క్ఫోర్స్ అటవీ క్షేత్రాధికారి వేణుగోపాల్, భైంసా ఎఫ్ఆర్వో రమేశ్రాథోడ్, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీఆర్వోలు నజీర్ఖాన్, సంతోష్, నిర్మల్, సారంగాపూర్ మండలాల అటవీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యాబోధనలో సాంకేతిక విప్లవం!
● ప్రభుత్వ పాఠశాలలో ఏఐ పాఠాలు ● రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు ● మరింత పటిష్టం కానున్న సర్కారువిద్య... నిర్మల్ఖిల్లా: విద్యాబోధన కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా కృత్యాధార బోధనతోపాటు డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా కృత్రిమ మేధ(ఏఐ) విద్యారంగంలోకి ప్రవేశించింది. పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో, జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణిత బోధనలో ఏఐని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతోపాటు సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ బోధనకు చర్యలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టే దిశగా చురుకై న చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని పాఠ్యాంశాలను ఏఐ ద్వారా బోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గణిత సబ్జెక్టులో ఏఐ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఉంది. ఈమేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో తరగతుల వారీగా ఏఐ ఆధారిత డిజిటల్ కంటెంట్ను రూపొందించారు. ఇది విద్యార్థులకు ఆసక్తికరంగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది. ఉపాధ్యాయుల శిక్షణ.. ఏఐ బోధనను ప్రభావవంతంగా అమలు చేయడానికి, ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించడం కీలకం. ఈ దిశగా, జిల్లా నుంచి ఎంపిక చేసిన ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న హైదరాబాద్లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి విడత శిక్షణలో ఐదుగురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘‘ఏఐ డిజిటల్ లిటరసీ’’ అంశంపై రెండో విడత శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో డిజిటల్ సాధనాలు, ఏఐ ఆధారిత అప్లికేషన్ల వినియోగం గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు జిల్లా స్థాయిలో మండలాల వారీగా ఇతర ఉపాధ్యాయులకు ఏఐ బోధనపై శిక్షణ ఇస్తారు. విడతల వారీగా డిజిటల్ కంటెంట్.. ఏఐ బోధన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించబడుతోంది. జిల్లాలోని 535 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం దశలవారీగా అమలు కానుంది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కంప్యూటర్లను అందించి, డిజిటల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. జి–కంప్రైస్, ఎడ్యుఆక్టివ్ 8, తెలంగాణ కోడ్ మిత్ర, చాట్బోట్ వంటి అప్లికేషన్ల ద్వారా గణిత పాఠ్యాంశాలను ఆసక్తికరంగా బోధించేందుకు ఎస్సీఈఆర్టీ డిజిటల్ కంటెంట్ను రూపొందించింది. ప్రస్తుతం గణితంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇతర సబ్జెక్టులకు కూడా విస్తరించనున్నారు. విద్యార్థులకు ప్రయోజనం.. కృత్రిమ మేధ ద్వారా డిజిటల్ కంటెంటును అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఉత్సాహంగా స్వీయ అభ్యసనం చేయగలుగుతారు. జిల్లా నుంచి నాతోపాటు ఐదుగురు రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణలో ఇటీవల పాల్గొన్నాం. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – రాచర్ల గంగన్న, జిల్లా రిసోర్స్ పర్సన్, సారంగాపూర్ అభ్యసన మరింత ప్రభావవంతం... ఇప్పటికే విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండగా ఇప్పుడు మరింత దూర దృష్టితో ఏఐ ఆధారిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో విద్యార్థుల అభ్యసన ప్రక్రియ మరింత ప్రభావవంతంగా సాగేందుకు అవకాశం ఉంటుంది. – పి.రామారావు, డీఈవో, నిర్మల్ ఏఐ బోధన ప్రభావం ఇలా.. ఏఐ ఆధారిత బోధన విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని, లాజికల్ థింకింగ్ను పెంపొందించడంతోపాటు ఉపాధ్యాయులకు కూడా సౌకర్యవంతమైన బోధనా విధానాన్ని అందిస్తోంది. చిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ అప్లికేషన్ల ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఈ విధానం వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. డిజిటల్ తెరలు (ఐఎఫ్పీ ప్యానెల్ బోర్డులు) ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా, ప్రభావవంతంగా బోధించగలుగుతున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తెరలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బోధన ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చాయి. -
క్యాంపస్.. కావాలె..
నిర్మల్భవనం.. భయం భయం జిల్లాలో ఏళ్లనాటి ప్రభుత్వ కార్యాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ఫోకస్.అడెల్లి ఆలయానికి రూ.36.93 లక్షల ఆదాయంశనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 20259లోu రిటైర్మెంట్ ఉద్యోగానికే.. ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ రిటైర్మెంట్ కేవలం ఉద్యోగానికే కానీ, వ్యక్తిత్వానికి కాదని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన డీసీ ఆర్బీ ఎస్సై భాస్కరరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోపాలకృష్ణను జిల్లా కేంద్రంలోని ప్రధా న పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. వారు ఉద్యోగ నిర్వహణలో అంకితభా వంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. పోలీస్ శాఖ తరపున వారి కు టుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. శాఖ నుంచి రావాల్సి న అన్నిరకాల బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఆర్ఐలు రామ్నిరంజన్, ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్: చదువుల తల్లి కొలువైందన్న పేరే కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఉన్నతవిద్య అందని ద్రాక్షగానే ఉంది. నిర్మల్ కేంద్రంగా ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. పైగా.. జిల్లాలో ఉన్న పీజీ సెంటర్నూ నామ్కేవాస్తేగా మార్చేశారు. జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగితే.. ఇవ్వలేదు. మెడిసిన్ ఇచ్చినా అసౌకర్యాల మధ్యన చదువు సాగుతోంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలూ ఇంకెప్పుడొస్తాయన్న ప్రశ్న అలాగే ఉంది. ఇప్పటి ప్రభుత్వమూ దృష్టిపెట్టడం లేదు. ఇతర జిల్లాలో మాత్రం అదనంగా ఇంజినీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు పెడుతున్నారు. కానీ.. నిర్మల్ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఈక్రమంలో నిర్మల్ కేంద్రంగా బాసర జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. జిల్లాకు ప్రత్యేక క్యాంపస్ ఉండాలని, ఉద్యోగ, ఉపాధినిచ్చే కోర్సులు కావాలన్న వాదన బలపడుతోంది. ఈ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి వస్తోంది. విద్యాఫలాలెక్కడ..!? రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక యూనివర్సిటీ లేదంటే పేరున్న కళాశాలలు ఉన్నాయి. కానీ.. నిర్మల్ ప్రాంతంవైపు అలాంటి ఒక్క వర్సిటీ లేదు. బాసరలో ఆర్జీయూకేటీ ఉన్నట్లే కానీ.. అందులో జిల్లా విద్యార్థులకు దక్కే సీట్లు నామమాత్రమే. ప్రత్యేక రాష్ట్రం, జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఈ ప్రాంతానికి విద్యాఫలాలు దక్కడం లేదన్న ఆవేదన నెలకొంది. పక్కనున్న నిజామాబాద్ జిల్లాకు తాజాగా ఇంజినీరింగ్ కాలేజీ, ఇటీవల నవోదయ కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్లోనూ ఇప్పటికే రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, అదనంగా హుస్నాబాద్లో మరో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేశారు. కానీ.. కనీసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క కాలేజీని కేటాయించకపోవడం శోచనీయం. నిర్మల్ కోసం అడిగిన జేఎన్టీయూను ఆదిలాబాద్కు కేటాయించినా.. అదీ కాగితాలకే పరిమితమైంది. నిర్మల్లోని పీజీ కాలేజీ సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయ 3 నెలల హుండీ ఆదాయాన్ని శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా భక్తుల సమక్షంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు ఆభరణాలు, కానుకలు, నగదు రూపంలో నమర్పించిన వాటిలో నగదు రూ.36,93,630 రూపాయలు, మిశ్రమ బంగారం 19 గ్రాములు, మిశ్రమ వెండి 3.8 కిలోలు సమకూరినట్లు ఇన్చార్జి ఈవో రమేశ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పరిశీలకులు భూమయ్య, ఆలయ చైర్మన్ భోజాగౌడ్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్రీల్ ఉన్నతవిద్య.. ఇప్పటికీ అందని ద్రాక్షే పైచదువులకు పట్నం పోవాల్సిందే చదువుల దూరం.. తగ్గించాలని విన్నపం మళ్లీ తెరపైకి జ్ఞానసరస్వతీ వర్సిటీ డిమాండ్పైచదువులకు పట్నంకే.. ‘ఏం నర్సయ్య.. ఏం సంగతి..! ఎక్కడుంది నీ బిడ్డ, ఏం చదువుతోంది..?’ అని అడిగితే.. ‘సార్.. ఇంటర్దాకా నిర్మల్ల సదివింది. ఇప్పుడు పట్నంల ఇంజినీరింగ్ సీటచ్చిందట. ఉన్న ఒక్క ఆడపిల్లను అంతదూరం పంపాలంటే ఇబ్బందిగనే ఉంది కానీ.. మన దగ్గర కాలేజీలు లేవు కదా సార్.. తప్పడం లేదు.’ అని నర్సయ్య నీరసంగా జవాబిస్తున్నాడు. ఒక్క నర్సయ్యకే కాదు.. ఎంతోమంది తల్లిదండ్రులు, వారి పిల్లలకూ పైచదువులంటే ఇప్పటికీ పరేషానే. ఇంజినీరింగ్ ఒక్కటే కాదు. కనీసం ఎంబీఏ, ఎంసీఏ, ఇతర పీజీ కోర్సులు చదువాలన్నా.. పుస్తకాలు, దుస్తులు సర్దుకుని, పట్నం బాట పట్టాల్సిందే. జ్ఞానసరస్వతీ వర్సిటీ కావాలె.. ‘నిర్మల్ ప్రాంతాన్ని ఉస్మానియా నుంచి కాకతీయకు, ఇప్పుడు కేయూ నుంచి తెలంగాణ వర్సిటీకి జిల్లాను మార్చడం కాదు.. నిర్మల్ జిల్లాకు ప్రత్యేక క్యాంపస్ కేటాయించాలి..’ అన్న డిమాండ్ పెరుగుతోంది. చదువులమ్మ బాసర జ్ఞానసరస్వతీ పేరిట ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయాలంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ, శాతవాహన, పాలమూరు తదితర యూనివర్సిటీలన్నీ ఒకప్పుడు పీజీ సెంటర్లే. పీజీ సెంటర్ల కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. నిర్మల్లో ఉన్న పీజీ సెంటర్నూ జ్ఞానసరస్వతీ యూనివర్సిటీగా మార్చాలని అప్పట్లో డిమాండ్ చేశారు. కొత్త యూనివర్సిటీ చేయడం అటుంచి, ఉన్న పీజీ సెంటర్నూ నాశనం చేశారు. ఒకవేళ కాకతీయ నుంచి తెలంగాణ వర్సిటీలోకి జిల్లాను(అఫ్లియేషన్) మార్చినా.. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉన్న సౌత్క్యాంపస్ తరహాలో నిర్మల్లో అన్నికోర్సులతో ‘జ్ఞానసరస్వతీ క్యాంపస్’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. -
పట్టణాభివృద్ధిపై ఫోకస్
● ప్రత్యేక అధికారి సమీక్ష ● అభివృద్ధికి సమష్టి కృషికి ఆదేశం నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణ సుందరీకరణ తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార, ప్రకటనల అద్దె, పన్నులు అన్నింటినీ సకాలంలో వసూలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పట్టణంలో కీలకమైన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
72 గంటల దీక్షను జయప్రదం చేయాలి
నిర్మల్టౌన్: బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న కోరారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాట్లాడారు. పార్టీలకతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కవిత 72 గంటల దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలిరావాలని కోరారు. అనంతరం నిరాహార దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణచారి, వడ్డెర సంఘం అధ్యక్షుడు భూపతి, నాయీబ్రాహ్మణ నాయకులు గంగాధర్, తెలంగాణ జాగతి నాయకులు పాల్గొన్నారు. -
పురుగుమందులు విక్రయించొద్దు
నకిలీ, కాలం చెల్లినసారంగపూర్: ఎరువులు, పురుగుమందుల దుకాణ యజమానులు రైతులకు కాలం చెల్లిన, నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్రోడ్డు వద్దగల డీసీఎంఎస్ ఎరువుల దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సారంగాపూర్లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, పరుగు మందుల దుకాణ యజమానులు నిత్యం స్టాక్బోర్డు నిర్వహించాలని సూచించారు. అందుబాటులో ఉన్న, యూరియా , ఇతర ఎరువుల వివరాలు బోర్గుపై ప్రదర్శించాలని తెలిపారు. ఎరువుల అమ్మకానికి సంబంధించిన రశీదులను తనిఖీ చేశారు. అన్ని రశీదులు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి అవసరమైన ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధిక మోతాదులో యూరియా వినియోగంతో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, మండల వ్యవసాయాధికారి వికార్ అహ్మద్, ఏఈవోలు, రైతులు ఉన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కడెం: యువత ఉపాధి ఆవకాశలను అందిపుచ్చుకోవాలని డీఆర్వో ప్రకాశ్, హైటీకాస్ ప్రతినిధి వెంకట్ అన్నారు. మండలంలోని కల్లెడ గ్రామంలో హైటీకాస్, ప్రథమ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో నర్సింగ్, టైలరింగ్, కార్, బైక్ మెకానిక్, బ్యుటీషియన్ తదితర కోర్సుల్లో రెండు నెలలు ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తారని వివరించారు. శిక్షణ ఆనంతరం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి ఆవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీయువకులు 7288966422, 94410752,49 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్బీవో సరిత, ప్రథమ్ ఫౌండేషన్ సిబ్బంది నరేశ్, హైటీకాస్ సిబ్బంది రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రద్దు చేయాలని ధర్నా
కుంటాల: సర్దుబాటులో భాగంగా మండలంలోని కల్లూరు ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు నవీర్, రవీందర్ను వేరే పాఠశాలకు పంపించారు. నవీన్ను లింబా(కె), రవీందర్ను అంబుగామ పాఠశాలలకు పంపించారు. దీనిని రద్దు చేయాలని పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిర్మల్– బైంసా గురువారం ధర్నా చేశారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండగా కల్లూరు పాఠశాల నుంచి నవీన్, రవీందర్ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని చూసే తమ పిల్లలును ప్రభుత్వ పాఠశాలకు పంపామన్నారు. వారి డిప్యూటేషన్ రద్దు చేయకుంటే తమ పిల్లలను బడి మాన్పిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల్సింగ్, ఎస్సై అశోక్ ధర్నా చేస్తున్న పోషకులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అనంతరం పాఠశాల గేటుకు వేసిన తాళం తీయించి తరగతులు కొనసాగేలా చర్యలు చేపట్టారు. -
కేయూలోనే..
నిర్మల్: ఎక్కడో వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీకి వెళ్లిరావాలంటేనే చాలా ఇబ్బంది. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆరోజు పనవుతుందా.. లేదా..! అన్న గ్యారంటీ ఉండదు. అసలు ఈ కథంతా ఎందుకు..!? ఇంతటి వ్యథ అనుభవించాల్సిన ఖర్మ మాకెందుకు..!? అన్న వాదనలు వస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు అత్యంత సమీపంలోనే నిజామాబాద్జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ(తెయూ)కి ఇక్కడి కాలేజీలను అఫ్లియేషన్(అనుబంధం) ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న దాదాపు రెండు దశాబ్ధాలుగా వస్తూనే ఉంది. కానీ.. కనీసం పట్టించుకునే నాథుడే లేకపోవడం ఇక్కడి దౌర్భాగ్యం. రెండు వర్సిటీలూ కాదని.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిజామాబాద్లో తెలంగాణ, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలు సమీపంలో ఉన్నాయి. అయినా అధికారులు, పాలకులు ఈ రెండింటినీ కాదని, ఇప్పటికీ ఉమ్మడి జిల్లా కళాశాలలను కేయూ అనుబంధంగానే కొనసాగించడం దారుణం. అసలు.. ఉమ్మడి జిల్లాలోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రధానంగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్సిటీ కోసం చాలా ఏళ్లుగా గొంతెత్తుతున్నారు. కానీ.. ఇప్పటికీ ఆ దిశగా కదలిక కనిపించడం లేదు. కనీసం.. దూరభారంగా ఉన్న కాకతీయ నుంచి సమీపంలో ఉన్న యూనివర్సిటీల పరిధిలోకీ అఫ్లియేషన్ తీసుకురావడం లేదు. ఇప్పటికీ చిన్నచూపే..దూరంగా ఉందనో.. అడిగేదెవరనో.. తెలియదు కానీ.. ఇప్పటికీ కాకతీయ యూనివర్సిటీకి నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలపై చిన్నచూపు ఉందని చా లామంది విద్యావంతులు, విద్యార్థులు అభిప్రా యం వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మల్లో ఉన్న యూనివర్సిటీ పీజీ సెంటర్ను నిర్లక్ష్యం చేశార ని వాదిస్తున్నారు. ఒకప్పుడు కేయూ పరిధిలోనే ఎంతో పేరున్న ఎంఏ సోషియాలజీ, మంచి డిమాండ్ ఉన్న ఎంఏ ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్లను ఇక్కడి స్థానికులకు దూరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ పీజీ సెంటర్కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కనీసం కృషిచేయడం లేదంటున్నారు. అందుకే.. ‘కేయూ వద్దు.. తెయూ ముద్దు’ అంటున్నారు. దూరమూ.. భారమే..ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల విద్యార్థులు, కాలేజీలకు కాకతీయ యూనివర్సిటీ దూరభారంగా మారింది. ఈ రెండు జిల్లాల నుంచి వరంగల్ దాదాపు 270–300కిలోమీటర్ల దూరం ఉంది. ఎంత తక్కువన్నా.. కనీసం 6గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రానుపోనూ అంటే 12 గంటల జర్నీ అవుతుంది. అదే.. తెలంగాణ యూనివర్సిటీ నిర్మల్ నుంచి కేవలం 65 కి.మీ.దూరం, గంట ప్రయాణం. ఆదిలాబాద్ నుంచి 145కి.మీ. మాత్రమే. ఇంత దగ్గరలో తెలంగాణ వర్సిటీ ఏర్పడి 20 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అఫ్లియేషన్ చేపట్టకపోవడంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకెన్నాళ్లు.. ఈ ‘వరంగల్ వెతలు’ పడాలని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాల పునర్భిజన చేశారు. దీంతో పాలనాధికారులు ప్రజలకు చేరువయ్యారు. కానీ, వర్సిటీలు మాత్రం విద్యార్థులకు చేరువ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా డిగ్రీ కళాశాలలకు తప్పని పాట్లు ఈ ‘దూరభారం’.. ఇంకెన్నేళ్లు? ‘వరంగల్ వెతలు’ తప్పేదెప్పుడూ..!? పాలకులూ.. పట్టించుకోరా..!?తెలంగాణ వర్సిటీ ఏర్పడినా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2006లో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ(తెయూ)ను ప్రారంభించారు. మొదట్లో అక్కడి గిరిరాజ్ కాలేజీలోనే తరగతులు కొనసాగించారు. అనంతరం డిచ్పల్లి సమీపంలోని ఎన్హెచ్.44 పక్కనే విశాలమైన యూనివర్సిటీ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. తెయూ ఏర్పడి దాదాపు రెండు దశాబ్ధాలు కావస్తున్నా.. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ, పీజీ కాలేజీలను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే కొనసాగిస్తున్నారు. ఇక్కడి కాలేజీలను తెయూ అనుబంధం(అఫ్లియేషన్) చేయడం లేదు. -
ఒక సిమ్తో ఒకేసారి కాల్ !
● ఆ తర్వాత సిమ్ లేకుండా ధ్వంసం ● ‘జన్నారం సైబర్’ కేసులో నిందితుల తీరిదీ ● మాస్టర్ మైండ్ జాక్ ఖాతాలో భారీగా నగదు ● ముమ్మరంగా కేసు దర్యాప్తు, నిందితులకు 14రోజుల రిమాండ్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒక ఫోన్కాల్కు ఒకేసారి సిమ్ వాడుతూ ఆ తర్వాత వాటిని ధ్వంసం చేస్తూ నిత్యం వందలాది కాల్స్ చేస్తూ రూ.లక్షల సొమ్ము కాజేసే యత్నం జరిగింది. జన్నారం కేంద్రంగా సాగిన సైబర్ నేరాన్ని రామగుండం సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏడుగురు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14రోజుల రిమాండ్ విధించారు. సైబర్ నేరాలు చేసేందుకు ఆధునిక సాంకేతికతను వాడుతూ అమాయక జనాలను కేవలం ఫోన్లో మాట్లాడి మభ్యపెడుతూ సొమ్మును తస్కరించే పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెలన్నరలోనే వేలాది మందికి ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ చేస్తూ ఇక్కడి లొకేషన్ చూపించేలా ఏర్పాట్లు చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాగా పిలిచే కంబోడియా, మయన్మార్ నుంచి ఈ వ్యవస్థను నియంత్రిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాలో రోడ్లపై విక్రయించే వారి నుంచి సిమ్లు వందలకొద్దీ కొనుగోలు చేసి, యాక్టివ్ చేసి మాట్లాడగానే పని పూర్తయిన వెంటనే ఆ సిమ్ను పాడేసినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు యాక్టివ్ అయిన సిమ్ వివరాలను ఓ బుక్లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బుక్లోని వివరాల ప్రకారం ఎవరెవరికి కాల్స్ చేశారు..? ఇందులో ఎంతమొత్తం డబ్బు దోచుకున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. జాక్ ఖాతాల్లో రూ.కోట్లలో డబ్బుప్రస్తుతం పరారీలో ఉన్న వైజాక్ చెందిన జాక్ అలి యాస్ రాజు జన్నారానికి చెందిన వారితోపాటు ఆంధ్రా వారినీ ఈ నేరంలో భాగస్వామ్యం చేస్తూ పథకం రచించాడు. గత మే నుంచే ఈ తంతంగం మొదలు కాగా, గత నెలన్నరగా మోసాలు చేసే ప్రయత్నాలు చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్ బ్యాంకు ఖాతాలో రూ.కోటికిపైగా లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక అతడు చెప్పినట్లు చేసినందుకు రూ.లక్షల్లో డబ్బు స్థానికులకు పంపాడు. మోసం చేస్తున్నామని తెలిసినా జన్నారం వాసులు ఇందులో ఇరుక్కుపోయారు. ఐఎంఈఐ కనిపించకుండాసైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తే వాళ్లు చేసే ప్రాంతం, చూపించే లొకేషన్ భిన్నంగా ఉండేందుకే జన్నారంను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక సిమ్ బాక్స్లో ఒకేసారి 256సిమ్లు వాడుతూ, ఐఎంఈఐ కూడా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంతేకాక లొకేషన్ ట్రేస్ చేస్తే అడవులు, కొండల మధ్య టవర్ సిగ్నల్స్ను ఎక్కడి నుంచి చే స్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ముందుగా జన్నారం పోలీసులు ఆ చూకీ వెతికినా నేరగాళ్లు బయటపడలేదు. ఇదంతా కంబోడియా నుంచే పూర్తిగా ఈ వ్యవహారం నడిచిందా? వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు. వీరిలో చేతిలో ఎంతమంది మోసపోయారు? దోచి న డబ్బు ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరంలో ప్రధానంగా వ్యవహారించిన జాక్ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. -
హస్తకళలను ప్రోత్సహిద్దాం
నిర్మల్చైన్గేట్: టెక్నాలజీ పెరిగిన తర్వాత చేతి వృత్తులకు ఆదరణ కరువవుతోందని, కానీ, హస్త కళలకు ఉన్న ప్రాధాన్యతను అందరూ గుర్తించి ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళల ఆలోచనలు వెలుగులోకి తెచ్చేందుకు మహిళా సంఘాలు తోడ్పాటునిస్తాయని పేన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఆకాంక్ష హాత్ పేరుతో ఏర్పాటు చేసిన హస్త కళల ప్రదర్శనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో కలిసి గురువారం ప్రారంభించారు. పలు స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో పెంబి మండలం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందని తెలిపారు. మొత్తం 500 మండలాల్లో పెంబికి 4వ ర్యాంకు రావడం గర్వకారణమన్నారు. త్వరలోనే పలువురు జిల్లా అధికారులు రాష్ట్రస్థాయిలో జరగబోవు కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకం అందుకోనున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంతో పెంబి ఆస్పిరేషన్ నుంచి ఇన్స్పిరేషన్గా మారిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోషణ, సామాజిక అంశాల్లో మెరుగైన అభివృద్ధి సాధించిందని వివరించారు. గర్భిణుల నమోదు, డయాబెటిస్ స్కీన్రింగ్, సప్లిమెంటరీ న్యూట్రీషియన్లో వందశాతం పరిపూర్ణత సాధించడంతోపాటుగా హెల్త్ కార్డుల జారీలో 70 శాతం, మహిళా సంఘాల రుణాల విషయంలో 94 శాతం పరిపూర్ణత సాధించినట్లు వెల్లడించారు. నీతి అయోగ్ ఆకాంక్ష హాత్ కార్యక్రమం ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులపాటు మహిళా సంఘాల హస్తకళలు ప్రదర్శనలతోపాటు, అమ్మకాలు ఉంటాయన్నారు. జాతీయ పురస్కారం సంతోషకరం..ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ నీతి అయోగ్ పెంబి ఆస్పిరేషన్ బ్లాక్కు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడం సంతోషకరమన్నారు. పెంబిని ఉత్తమ స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారు, పెంబి మండల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు అంకితభావంతో పనిచేయడంతోనే ఉత్తమ ర్యాంకు సాధ్యమైందన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలను ప్రదర్శించారు. పెంబి మండల అధికారులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు.. ఏఎన్ఎంలు, ఇతర ఫ్రంట్లైన్ ఉద్యోగులను కలెక్టర్ ఎమ్మెల్యేలు శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు అంబేడ్కర్ భవన్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, జిల్లా అధికారులు, పెంబి మండల అధికారులు, సిబ్బంది, మహిళా స్వయం సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పెంబి ఆస్పిరేషన్ బ్లాక్కు జాతీయస్థాయి గుర్తింపుపై హర్షం ఆకాంక్ష హాత్ పేరుతో ఐదు రోజుల ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభం -
అర్హులందరికీ రేషన్ కార్డులు
● కలెక్టర్ అభిలాష అభినవ్ తానూరు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ముధోల్ ఎమ్మెల్యే రామారావ్పటేల్తో కలిసి గురువారం రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తానూ రు మండలానికి 1,853 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. 2,575 రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చామని వెల్లడించారు. కార్డులు పొందినవారు క్రమం తప్పకుండా రేషన్ బియ్యం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రామారావ్ పటేల్ మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ పేదల ఆకలి తీర్చడంతోపాటు అనేక పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో కోమల్రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, శ్రీనివాస్, తహసీల్దార్ మహేందర్, నాయకులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..ప్రభుత్వ ప్రథమిక ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ విభాగాలను, స్టోర్లో మందుల నిల్వలను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలింతలు, గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందించాలన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట
దిలావర్పూర్: ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పే ర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రేషన్కార్డులు పంపిణీ చేశారు. సిర్గాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద సిర్గాపూర్ నుంచి వయా కాల్వ తండా మీదుగా కాల్వ అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రూ.కోటి 91లక్షలతో చేపట్టిన రో డ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దిలావర్పూర్ పీహెచ్సీ పరిసరాల్లో రూ.16 లక్షలతో చేపట్టిన ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. దిలావర్పూర్ తండా నుంచి బన్సపల్లి వరకు రూ.2.56 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభు త్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్, నాయకులు రమణారెడ్డి, సుజాత మేర్వాన్, గంగవ్వ ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల దిలావర్పూర్లో అనారోగ్యంతో మరణించిన ఎనుగంటి ముత్తవ్వ, కుంట చిన్నయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. -
ఉపాధ్యాయులకు తీపి కబురు
● జిల్లాలో 79 మందికి ప్రమోషన్లు ● నేడో.. రేపో షెడ్యూల్ విడుదల!నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరోసారి ప్రమోషన్ల జాతరకు రంగం సిద్ధమవుతోంది. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలు గా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. నేడో, రేపో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను జిల్లా అధికారులు ప్రకటించి, వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలు స్వీకరించా రు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గజిటెడ్ హెచ్ఎంల పోస్టులు భర్తీ కానున్నాయి. ఆగస్టు 1 నాటికి జిల్లాలో ఖాళీ అయ్యే పోస్టుల ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో జిల్లాలో 23పీజీ హెచ్ఎం, 56స్కూల్ అసిస్టెంట్ పో స్టులు భర్తీ కానున్నట్లు అధికారులు తెలిపారు. పండిత, పీఈటీ పోస్టులనూ అప్గ్రేడ్ చేయనున్నారు. జిల్లాలో 79 ఖాళీలు జిల్లాలో 2,975 ఉపాధ్యాయ పోస్టులుండగా 2,323 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1వరకు 79 ఖాళీలు ఉండనున్నట్లు అధికారులు లెక్కలు తే ల్చారు. పీజీ హెచ్ఎం, పీఎస్ హెచ్ఎం పోస్టులను 100శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్ల కోసం, మరో 30శాతం కొత్త నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన 23మంది పీజీ హెచ్ఎంలు, 56మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ లభించవచ్చని విద్యాశాఖ వర్గాల అంచనా. జిల్లాలో పీజీ హెచ్ఎం ప్రమోషన్ 23 మందికి దక్కనుండగా.. ఆ మేరకు అదనంగా మరి కొందరికి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు రానున్నాయి. ఒక్కో పోస్టుకు సీనియార్టీ ఆధారంగా ముగ్గురి పేర్లు సిద్ధం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడికి రెండు, మూ డు సబ్జెక్టుల్లో ప్రమోషన్ పొందేందుకు అర్హత ఉంటే.. ఒకదాన్ని మాత్రమే ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ప్రమోషన్లు ఇచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కొందరు ఆసక్తి చూపలేదు. మరి కొందరు ప్రమోషన్ పొందినా గడువులోపు చేరలేదు. ఇప్పుడు వారంతా సీనియార్టీ జాబితాలో ముందుంటారు. కోర్టుకెళ్లే యోచనలో పీజీ హెచ్ఎంలు ప్రమోషన్ల నిర్ణయం తీపి కబురే అయినా.. బదిలీలు లేని ప్రమోషన్లు ఏమాత్రం ఒప్పుకోబోమని పీజీ హెచ్ఎంలు స్పష్టం చేస్తున్నారు. గతేడాది పీజీ హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొంది దూరప్రాంతాల్లో పని చేస్తుండగా, మొదట బదిలీలు నిర్వహించి ఆ తర్వా తే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా రు. లేదంటే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వారు పే ర్కొంటున్నారు. కాగా, ప్రమోషన్లు కోరుకునే ఉపాధ్యాయులు ప్రభుత్వం విడుదల చేసే షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. -
కాకతీయ.. ఇదేందయా?
నిర్మల్సమస్యల్లో కుభీర్ పీహెచ్సీ కుభీర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. కనీస వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ● యూనివర్సిటీకి పట్టని జిల్లా ● కాలేజీ ఇక్కడ.. సార్లు అక్కడ ● కోర్సులనూ మార్చేసిన వైనం ● త్రిశంకుస్వర్గంలో పీజీ కళాశాల ● పట్టింపులేని పాలకులు, సార్లు ● విద్యార్థులకు అందని ఉన్నతవిద్యఅందరికీ ‘ఆధార్’ ఉండేలా చూడాలిగురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 20259లోu సత్వర న్యాయం అందించాలి భైంసాటౌన్: ఫిర్యాదుదారులకు సత్వర న్యా యం అందేలా చూడాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్లో ఆదేశించారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రతీ బుధవారం షీ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ తీరు పరిశీలించారు. చిన్నచి న్న తగాదాలతో విడిపోతున్న కుటుంబాల ను కౌన్సెలింగ్తో కలపడంలో షీటీం పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఏఎస్పీ అవినా ష్ కుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. నిర్మల్: ఎక్కడో వరంగల్లో ఉన్న కాకతీయ యూ నివర్సిటీ జిల్లాకు దూరభారమే. అయినా.. ఆ వర్సి టీకి జిల్లాపై కాసింత దయ కూడా లేదు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం.. అది కూడా చదువు ల తల్లి కొలువైన జిల్లాపై చిన్నచూపు చూస్తోంది. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువుల ఆశలు చిదిమేస్తోంది. ‘నీ జీవితానికి డిగ్రీ సరిపోతుందిలే. పీజీ సెంటర్ అవసరమా..!’ అన్నట్లుగా వెక్కిరిస్తోంది. పీజీ సెంటర్ను పెంచాల్సింది పోయి, ఇక్కడున్న కోర్సులనే మాయం చేసింది. కాలేజీని ఉత్తభవనంగా మార్చేసి పీజీ సెంటర్ను త్రిశంకుస్వర్గంలో పెట్టింది. ఇక్కడి ప్రజల అమాయకత్వమా? నా యకుల అవగాహన లోపమా? లేక పాలకుల నిర్లక్ష్యమా? ఏదైతేనేం.. మొత్తానికి జిల్లాలోని విద్యార్థు లను ఉన్నతవిద్యకు దూరం చేసింది. 1991లోనే పీజీ సెంటర్ చదువుల తల్లి కొలువుదీరి ఉన్నా.. విద్యాపరంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడి ఉండేది. పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్, నిర్మల్లోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండేవి. ఆ తర్వాత పైచదువులంటే నిజామాబాద్కో లేదా హైదరాబాద్కో వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్లే స్థోమత లేని ఎంతోమంది ఉత్తమ విద్యార్థులూ డిగ్రీతోనే చదువులు ఆపేసిన దాఖలాలున్నాయి. ఈక్రమంలో అప్పటి పాలకుల విన్నపం మేరకు ప్రభుత్వం నిర్మల్లో కాకతీయ యూనివర్సిటీ అనుబంధంగా నిర్మల్లో 1991లో పీజీ సెంటర్ను ప్రారంభించింది. ఎంఏ సోషియాలజీ, ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రాంత విద్యావ్యవస్థలో కొత్తదశ ప్రారంభమైంది. కానీ.. అది కొంతకాలమే అని అప్పట్లో స్థానికులు ఊహించలేకపోయారు. కాలేజీ ఇక్కడ.. జీతాలక్కడ.. ప్రస్తుతం నిర్మల్ పీజీ కాలేజీలో సోషియాలజీ కో ర్సు ఉన్నా.. అది సెల్ఫ్ఫైనాన్స్ కోర్సు కావడం, ఇక్కడ అధ్యాపకులూ లేకపోవడం, క్లాసులు జరగకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. తెలిసీతెలియక చేరే 10–15మందికి ఆన్లైన్ క్లాసులంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికీ నిర్మల్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకుల పేరుమీదుగానే వర్సిటీలో ఉంటూ వేతనాలు తీసుకుంటున్నారు. అమాయకత్వమా.. అవగాహన లోపమా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకై క వర్సిటీ పీజీ సెంటర్ నాశనం కావడానికి స్థానిక ప్రజల అమాయకత్వంతోపాటు నాయకులు, పాలకుల అవగా హన లోపం, నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు విద్యావంతులు ఆరోపిస్తున్నారు. కళ్ల ముందే కోర్సులన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతూ చివరకు కాలేజీ భవనం మా త్రమే మిగలడాన్ని చూస్తూ ఉండిపోయారన్న వాదనలున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు పట్టించుకుంటే జిల్లాకు ఉన్నతవిద్య అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.న్యూస్రీల్తిరిగి వర్సిటీ గూటికే.. నిర్మల్ పీజీసెంటర్లో రెగ్యులర్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను అప్పటి ప్రభుత్వం నియమించింది. వీరంతా స్థానికంగా ఉంటూ బాగానే పాఠాలు చెప్పారు. వర్సిటీ పరిధిలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు ఉండటంతో నల్గొండ, మహబూబ్నగర్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి నిర్మల్ పీజీ సెంటర్లో విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇక్కడి అధ్యాపకులంతా వరంగల్, సమీప ప్రాంతాల కు చెందినవారే ఉండేవారు. కేయూ క్యాంపస్లో పనిచేసే ప్రొఫెసర్లు రిటైర్డ్ అవుతున్న కొద్దీ నిర్మల్లో ఉన్న ఎంఏ ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ వరంగల్కు బదిలీ అ య్యారు. ఇక సోషియాలజీ కోర్సు క్యాంపస్లో లేకపోవడంతో ఇక్కడ పనిచేసే సదరు అధ్యాపకులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఈక్రమంలోనే సోషియాలజీ ప్రొఫెసర్లంతా ఒక్కటై ఇక్కడున్న కోర్సును వరంగల్కు తరలించే కుట్ర చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ముందుగా హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సోషియాలజీ పీజీ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఆ సెల్ఫ్ఫైనాన్స్ కోర్సును రెగ్యులర్గా మార్చి, నిర్మల్ పీజీ సెంటర్లో ఉన్న రెగ్యులర్ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చేశారు. నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో రెగ్యులర్ ఫ్యాకల్టీ బోధించడానికి వీల్లేదంటూ వారంతా హన్మకొండ దారిపట్టారు. సోషియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ వీసీగా ఉన్నప్పుడు సోషియాలజీ కోర్సును ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కు షిఫ్ట్ చేశారు. ఇలా మొత్తం మీద.. నిర్మల్కు ఎంతో పేరు తీసుకువచ్చిన సోషియాలజీ కోర్సును తరలించడమే కాకుండా.. పీజీసెంటర్ భవిష్యత్నే నాశనం చేశారు. -
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్షా సమావేశం ● దస్తూరాబాద్లో రేషన్కార్డుల పంపిణీ
నిర్మల్చైన్గేట్: ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరి అని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఆధార్ నమోదు ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ లేని పిల్లల వివరాలు సేకరించి వారికి కార్డులు జారీ చేయాలని సూచించారు. శిశువులు పుట్టిన వెంటనే ఆస్పత్రుల యాజమాన్యాలు తల్లిదండ్రులు ఆధార్ నమోదు చే సుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అధిక జ నాభా కలిగిన పంచాయతీలను గుర్తించి ఆధార్ కేంద్రాల సంఖ్య పెంచాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో మెగా ఆధార్ సహాయక శి బిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపా రు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, యూఐడీఏఐ ఆర్వో ఆఫీస్ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ శోభన్, ఎల్డీఎం రామ్గోపాల్, ఈడీఎం న దీం, పోస్టల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంత అభివృద్ధికి మంజూరైన పనులు, లభించిన అటవీ అనుమతులు, చేపట్టిన పనుల పు రోగతి గురించి అధికారుల ద్వారా తెలుసుకుని ప లు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఎఫ్వో నాగినిభా ను, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్అండ్బీ, అటవీ, రెవెన్యూశాఖల అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్కార్డుల పంపిణీ దస్తురాబాద్: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండలానికి 1,352 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. అర్హులు రేషన్కా ర్డు కోసం ఎప్పడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, ఏఎంసీ చైర్మన్ భూషణ్, మండల ప్రత్యేకాధికారి నాగవర్ధన్, డీఎస్వో రా జేందర్, తహసీల్దార్ విశ్వంభర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం పెట్టాలి
కుంటాల: విద్యార్థినులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా పంచాయ తీ అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవా రం మండలంలోని కల్లూరు కేజీబీవీని సందర్శించారు. విద్యార్థినులకు అందించే భోజనా న్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. డీఎల్పీవో సుదర్శన్, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, సిబ్బంది ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీపీవో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఎంపీడీవో వనజ, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, ఏపీవో నవీన్, ఏపీఎం అశోక్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగు.. ఆదాయం బాగు
● జిల్లాలో రైతులకు అవగాహన ● రాయితీపై మొక్కలు పంపిణీ ● నిర్వహణకు ఏటా రూ.4,200 ● ఆసక్తి చూపుతున్న అన్నదాతలుభైంసాటౌన్: ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రో త్సహిస్తోంది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాగు వి ధానం, లాభాలు, నిర్వహణ, రాయితీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరిస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేసుకోవచ్చని ఉ ద్యానశాఖ అధికారులు తెలిపారు. వరి, సోయా, ప త్తి తదితర పంటలతో పోలిస్తే రెట్టింపు ఆదాయం ఖాయమని చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. జిల్లాలో 8,200 ఎకరాల్లో సాగు జిల్లాలో 8,200 ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ సాగు చేశారు. 2022–2023 నుంచి సాగు ప్రారంభం కాగా, ప్రస్తుతం పలుచోట్ల పంట చేతికి వస్తోంది. ఇప్పటికే జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో పంట కోతకు వచ్చింది. 34 మంది రైతులు దిగుబడులు కూడా జిల్లాలో ఎనిమిది చోట్ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పంట విక్రయించిన ఐదురోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.7.35లక్షలు జ మ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈసారి జిల్లాలో మరో 4,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు లక్ష్యం విధించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్పామ్ పరిశ్రమ ఉంటే.. ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నా.. ఆశించిన స్థాయిలో రైతులు ఆసక్తి చూపడం లేదు. నాలుగేళ్ల తరువాత పంట కోతకు రావడం, స్థానికంగా ఆయిల్పామ్ పరిశ్రమ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వం జిల్లాకో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జిల్లాలోనూ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ కూడా చేశారు. కానీ, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఎక్కువ మంది రైతులు సాగుపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో సాగు వివరాలు సాగు విస్తీర్ణం 8,200 రైతుల సంఖ్య 3,336 కొనుగోలు కేంద్రాలు 8 టన్ను గెలల ధర రూ.21వేలు రైతులకు రాయితీలు ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఒక ఆయిల్పామ్ మొక్క రూ.20 చొప్పున ఎకరాకు 50 మొక్కలు అందిస్తోంది. ఎకరాకు ఒక్కసారి రూ.వెయ్యి పెట్టుబడి పెడితే నాలుగేళ్ల త ర్వాత పంట కోతకు వస్తుంది. అంతర పంటల సాగు, ఎరువుల కోసం ఎకరాకు ఏటా రూ.4,200 చొప్పున నాలుగేళ్ల దాకా ప్రభుత్వం ఇస్తోంది. ఇక బిందుసేద్యం పథకం కింద 80–100 శాతం రాయితీపై పరికరాలు అందజేస్తోంది. నర్సరీ వద్ద మొక్కల లోడింగ్ చార్జీలు కూడా కంపెనీ భరిస్తోంది. అక్క డి నుంచి మొక్కలు తెచ్చుకునే బాధ్యత రై తులదే. మొక్క నాటిన నుంచి తోటల పరి శీలన, అధిక దిగుబడి కోసం కంపెనీ ప్రతి నిధులు రైతులకు సలహాలు, సూచనలు ఇ స్తారు. ఎకరంలో వరి సాగయ్యే నీటితో 2.5 ఎకరాల ఆయిల్పామ్ సాగు చేయవచ్చు. సాగుపై అనుమానాలు వద్దు ఆయిల్పామ్ సాగు చేసే రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇతర పంటలతో పోలిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఎకరాకు అవసరమైన 50 మొక్కలను రూ.వెయ్యికే అందిస్తున్నాం. నిర్వహణ కోసం ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల దాకా ప్రభుత్వ అందించనుంది. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దిగుబడులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో వెంటవెంటనే డబ్బులు జమ చేస్తోంది. సాగుపై ఆసక్తి కలిగిన రైతులు ఏఈవోలు, ఏవోలు, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి -
రిజర్వేషన్లు కల్పించాలి
నిర్మల్టౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు క ల్పించాలని నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అప్క గజేందర్ యాదవ్ డిమాండ్ చేశా రు. బుధవారం నిర్మల్ ప్రెస్క్లబ్లో నిర్వహించి న సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల కో సం బీసీలంతా ఏకం కావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అనంతరం సమితి జిల్లా అధికార ప్రతినిధిగా జుట్టు వెంకటరమణ, ప్ర ధాన కార్యదర్శిగా నర్సయ్య, సెక్రటరీగా ముండాల పోశెట్టి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్ను ఏ కగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, సయ్యద్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు. -
పులుల రక్షణతో జీవ వైవిధ్యం
నిర్మల్టౌన్: పులుల రక్షణతోనే పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం సాధ్యమని నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణారావు అన్నారు. అంతర్జాతీ య పులుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సేవ్ టైగర్, సేవ్ వైల్డ్ లైఫ్ అనే ప్లకార్డులతో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణలో పులు లు కీలకమన్నారు. అనంతరం పులుల సంరక్షణ, అడవుల రక్షణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో, ఏవో, డిప్యూటీ రేంజర్ పాల్గొన్నారు. అవగాహన ర్యాలీలో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బంది -
రవాణా ‘షాక్’
● సర్వీస్ చార్జీలు భారీగా పెంపు ● వాహన యాజమాన్య బదిలీ చార్జి రెట్టింపు ● సోమవారం నుంచే పెంచిన చార్జీలు అమలు ● జిల్లా వాహనదారులపై అదనపు భారం నిర్మల్చైన్గేట్: తెలంగాణ రవాణా శాఖ చడీ చప్పుడు లేకుండా వాహనదారులకు షాక్ ఇచ్చింది. భారీగా సర్వీస్ చార్జీలు పెంచింది. పెంచిన చార్జీలను సోమవారం నుంచే వసూలు చేస్తోంది. దీంతో వాహనదారులు ఖంగుతిన్నారు. 2017 తర్వాత మొదటిసారిగా సర్వీస్ చార్జీలు పెంచింది. ముందస్తు ప్రకటన లేకుండానే పెంచిన చార్జీలు వెబ్సైట్లో అప్డేట్ అయ్యాయి. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ వంటి సేవల ఫీజులు గణనీయంగా పెరిగాయి. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆదాయాన్ని రె ట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఫీజు సవరణ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని చించోలి(బి) సమీపంలోని ఆర్టీఏ కార్యాలయంలో రోజువారీ 70 డ్రైవింగ్ లైసెన్స్లు, 60 వరకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్ల జారీ జరుగుతాయి. సుమారు 150 వాహనాలకు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి. కొత్త చార్జీలతో ఈ లావాదేవీల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అమల్లోకి పెరిగిన చార్జీలు.. పెంచిన సర్వీస్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 2017 తర్వాత ఇప్పుడు పెంచడం జరిగింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్స్తోపాటు లైసెన్స్, పర్మిట్, ఫిట్నెస్ అన్నింటిపై చార్జీలు పెరిగాయి. వాహనదారులు పెరిగిన సర్వీస్ చార్జీల ప్రకారం రవాణా సేవలు పొందాల్సి ఉంటుంది. – పి.దుర్గాప్రసాద్, ఆర్టీవో, నిర్మల్ సవరించిన చార్జీలు ఇవీ.. ● ద్విచక్ర వాహనం లెర్నింగ్ లైసెన్స్: రూ.335 నుంచి రూ.440కి పెరిగింది. ● ఫోర్ వీల్ లెర్నింగ్ లైసెన్స్: రూ.450 నుంచి రూ.585కి.. ● పర్మనెంట్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్: రూ.1,035 నుంచి రూ.1,135కి.. ● వాహన యాజమాన్య బదిలీ: రూ.935 నుంచి రూ.1,805కి.. ● హైపోథికేషన్ ఫీజు : రూ.2,135 నుంచి రూ.3,135కి... ● రుణ బదిలీ ఫీజు: రూ.2,445 నుంచి రూ.2,985కి.. ● ఆటోరిక్షా డ్రైవింగ్ టెస్ట్: రూ.800 నుంచి రూ.900కి పెరిగాయి. ఈ ఛార్జీలు వాహన ధర ఆధారంగా కూడా మారుతాయి. ఖరీదైన వాహనాలకు సేవా రుసుము మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఫీజు పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నప్పటికీ, సాధారణ వాహనదారులపై చార్జీలు గణనీయంగా పెంచింది. ఆర్టీఏ కార్యాలయాల్లో సౌకర్యాల కొరత ఆందోళన కలిగిస్తోంది. -
పాలుపోసి.. పూజచేసి..
చిట్యాల వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో మహిళల పూజలు.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో నాగదేవతకు పూజలు చేస్తున్న మహిళలు శ్రావణ పంచమిని నాగుల పంచమిగా జరుపుకోవడం ఆనవాయితీ. మంగళవారం నాగ పంచమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు పుట్టల్లో పాలుపోసి.. నాగమ్మకు పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయాల ఆవరణలోని పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పాముకు పాలు పోసి.. నాగ దేవతలకు నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, బ్రహ్మంగారి ఆలయం, ట్యాంక్ బండ్ సమీపంలోని పుట్ట, ప్రియదర్శినగర్లోని పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. – నిర్మల్టౌన్ -
ఎరువుల వివరాలు ప్రదర్శించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ మామడ: ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు రైతులకు తెలి సేలా స్టాక్ బోర్డులో ప్రదర్శించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మామడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల వివరాలను కంప్యూటర్లో పరిశీలించారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రశీదు పుస్తకాలను తనిఖీ చేశారు. దుకా ణంలో ఉన్న యూరియా, పురుగు మందుల ధరల వివరాలు నిర్వాహకులను అడిగి తెలు సుకున్నారు. గుర్తింపు పొందిన సంస్థలు తయా రు చేసిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు మాత్రమే రైతులకు విక్రయించాలన్నా రు. రైతులు వేసిన పంటలు, భూసారం ఆధారంగా ఎరువులను ఇవ్వాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని తెలిపారు. -
ప్రజల భద్రతే ధ్యేయం
● ఎస్పీ జానకీషర్మిల కడెం: ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం పని చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. కడెం ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. నీటి మట్టం లోతట్టు ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. విపత్తు వేళలో తక్షణమే స్పందించి సహా యక చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించా రు. భారీ వర్షాలు, వరదలు ఉంటే ప్రజలు పోలీ సుల సాయం తీసుకోవాలన్నారు. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా, జిల్లా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712659555కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంతకుముందు కడెం ఠాణాను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని, నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై పి.సాయికిరణ్, సిబ్బందిని అభినందించారు. నేడు భైంసాలో పోలీస్ ప్రజావాణిభైంసాటౌన్: పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్పీ జానకీషర్మిల కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. భైంసా డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. -
మీనాక్షి నటరాజన్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
నిర్మల్చైన్గేట్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజ యం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూ హాలను చర్చించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈనెల 31 నుంచి మీనా క్షి నటరాజన్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 4న ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నారని పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. -
ప్రచార లోపమే శాపం!
నిర్మల్● ఎన్ఎఫ్బీఎస్పై అవగాహన కరువు .. ● అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోని వైనం.. ● పేదలకు దక్కని ఆర్థిక భరోసా ● స్కీంను పట్టించుకోని అధికారగణం.. 7‘గిరి’ సంప్రదాయం కడెం: గిరిజన సంప్రదాయాలు విభిన్నం ఉంటా యి. అడవి బిడ్డలు నేటికీ వాటిని ఆచరిస్తారు. మంగళవారం నాగుల పంచమి పురస్కరించుకుని మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావా స గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యాలలో మానుక పెట్టి అందులో దీపం వెలిగించి నాగదేవతకు ఆరాధన చేశారు. తర్వాత సంప్రదాయ పాటలు పాడుతూ ఉయ్యాల ఊగారు. పాడి, పంటలు, పిల్లాపా పలను చల్లగా చూడాలని నాగుల పంచమి నుంచి ఐదు రోజులు నిత్యం ఇలా పూజలు నిర్వహించి, ఉయ్యాల ఊగుతారు. బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025వైద్య సేవలు ఎలా ఉన్నాయి ● జిల్లా ఆస్పత్రిని సందర్శించిన టీవీవీపీ కమిషనర్ ● రోగుల అభిప్రాయం తెలుసుకున్న అజయ్కుమార్ నిర్మల్చైన్గేట్: జిల్లా జనరల్ ఆస్పత్రిని తెలంగాణ వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మంగళవారం సందర్శించా రు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కు వచ్చారు. డెంగీతో బాధపడుతున్న రోగులతో మాట్లాడారు. చికిత్స, ఆహారం, మందుల గురించి ఆరా తీశారు. తర్వాత సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 9 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారికి మెరుగైనచికిత్స అందిస్తున్నామని వెల్ల డించారు. సమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, కమిషనర్ సీసీ జితేందర్, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్సింగ్, భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, నర్సాపూర్ సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమోద్చంద్రారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ఖిల్లా: ప్రభుత్వాలు పథకాలు ప్రారంభించేది ప్రజల కోసమే. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకా ల అమలులో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండేది అధికారులే. సంక్షేమం ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. వాటి గు రించి ప్రజలకు తెలియజేయాలి.. అవగాహన క ల్పించాలి. కానీ, ఓ కేంద్ర పథకాన్ని ప్రజలకు తెలి యజేయడంలో అధికారుల వైఫల్యం.. జిల్లాలోని పేదలకు శాపంగా మారింది. అర్హత ఉన్నా ఆపథ కం ద్వారా ఆర్థిక భరోసా పొందలేకపోతున్నా రు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ పథకం ఉందన్న విషయ మే 90 శాతం మందికి తెలియదు. ఆ పథకమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బె నిఫిట్ స్కీమ్(ఎన్ఎఫ్బీఎస్). తెల్ల రేషన్ కార్డు కలి గిన నిరుపేద కుటుంబ పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం ఈ పథకం కింద కేంద్రం అందిస్తుంది. అయితే, ఈ పథకానికి జిల్లాతోపాటు రాష్ట్రంలో కూడా సరైన ప్రచారం లేదు. దీంతో అర్హులు దీనిని వినియోగించుకోవడం లేదు. నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం(జూలై 28న) నిర్వహించిన ప్రజావాణిలో ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ నాయకులు ఈ సమస్యను అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల అలసత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎఫ్బీఎస్ పథకం గురించి ప్రజల్లో, అధికారుల్లో కూడా తగిన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. జిల్లాలో ఏటా వందలాది నిరుపేద కుటుంబ పెద్దలు మరణిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తులు మాత్రం పదుల సంఖ్యలోనే వస్తున్నాయి. ఈ పథకం గురించి తెలియక, కర్మకాండలకు కూడా ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలు సాయం పొందలేకపోతున్నాయని కార్మిక సంఘం ప్రతినిధులు తెలిపారు. పరిష్కారానికి చర్యలు.. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ చర్యలు మొదలు పెట్టారు. జిల్లా అధికారులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ఎఫ్బీఎస్పై ప్రచారం పెంచాలని సూచించారు. 2017 తర్వాత యజమాని మరణించిన కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేయవచ్చు. అదనంగా, కుటుంబ పెద్దగా మహిళ ఉండి ఆమె మరణిస్తే, పిల్లలకు కూడా సాయం అందించేలా పథకం నిబంధనలను సవరించింది కేంద్రం. ప్రచారం కల్పించాలి... రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కూలీలు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. ఎన్ఎఫ్బీఎస్ పథకం నిధులు ఉన్నా ప్రజల్లో అవగాహన లేక దరఖాస్తు చేసుకోవడం లేదు. ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే బాధిత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. – స్వదేశ్ పరికిపండ్ల, ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దరఖాస్తు ప్రక్రియ ఇలా.. న్యూస్రీల్ఖజానాలోనే నిధులు.. కేంద్రం ఏటా 7,794 కుటుంబాలకు సాయం అందించేందుకు రూ.15.58 కోట్లు కేటాయింది. రాష్ట్రంలో కేవలం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలో అయితే పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో నిధులు ఖజానాలోనే మిగిలిపోతున్నాయి. కొన్నేళ్లలో సుమారు 30 వేల కుటుంబాలకు అందాల్సిన నిధులు మిగిలిపోయాయని ప్రవాసీమిత్ర కార్మిక సంఘం అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం కింద సాయం పొందేందుకు, కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్, భార్య/తల్లి పాస్బుక్, మీసేవ కేంద్రం నుంచి అప్లికేషన్ ఫారమ్తో దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, మరణం సాధారణమా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే వివరాలతో అఫిడవిట్ అందించాలి. తహసీల్దార్, ఆర్డీవో, డీఆర్వో, కలెక్టర్ ధ్రువీకరణ తర్వాత రూ.20 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. -
కొత్త రేషన్ కార్డులతో పేదలకు సంక్షేమం
● కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మామడ/సోన్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ కార్డులతో పేదలకు సంక్షేమ పథకాలు చేరువవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మామడ, సోస్ మండల కేంద్రాల్లో ఆయా మండలాల లబ్ధిదారులకు మంగళవారం రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలాకాలం తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. వచ్చేనెల నుంచి నూతన రేషన్కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలన్నారు. మామడ మండలానికి 660, సోన్ మండలానికి 863 రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ సేవలను నూతన రేషన్ కార్డుదారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. పేద ప్రజలకు రేషన్ బియ్యం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. సోన్కు చెందిన గనాయి నర్సింహులు ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరాఫరాల అధికారి రాజేందర్, ఆర్డీవో రత్న కళ్యాణి, జెడ్పీ సీవో గోవింద్, డీఈ తుకారం, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో సురేశ్, నిర్మల్ మార్కెట్ చైర్మన్ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్నం’ వంటకు ఎల్పీజీ
● సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ● తొలగిపోనున్న కట్టెల పొయ్యి కష్టం ● జిల్లాలో 830 ఏజెన్సీలు లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, రెండు జతల యూనిఫామ్లు అందించింది. మధ్యాహ్న భోజన చార్జీలు పెంచింది. వంట తయారీకి కొత్త పాత్రలు అందించింది. ఇదే సమయంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఇబ్బంది పడుతున్న ఏజెన్సీల కష్టాలు తొలగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం తయారు చేసే ఏజెన్సీలకు ఎల్పీజీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. దీంతో కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్లు లేని పాఠశాలలను గుర్తించారు. త్వరలో అన్ని పాఠశాలలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఇలా.. నిర్మల్ జిల్లాలో 577 ప్రాథమిక, 89 ప్రాథమి కోన్నత, 164 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొ త్తం 830 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటిలో 365 పాఠశాలల్లో ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, మిగిలిన 465 పాఠశాలల కు సిలిండర్లు అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి సిలిండర్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొగ, ఇబ్బందుల నుంచి ఉపశమనం కట్టెల పొయ్యిలపై వంట చేయడానికి వర్షాకాలంలో వంట కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగతో విద్యార్థులకు కూడా అసౌకర్యం కలుగుతోంది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీతో ఈ సమస్యలు తొలగనున్నాయి. వంట ప్రక్రియ సులభతరం కానుంది. కార్మికులు, విద్యార్థుల ఆరోగ్యానికి దోహదపడుతుంది. జిల్లా సమాచారం.... ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 మొత్తం పాఠశాలలు 830 మొత్తం ఏజెన్సీలు 830 ఎల్పీజీ కనెక్షన్ ఉన్న పాఠశాలలు 365 ఎల్పీజీ కనెక్షన్ లేని పాఠశాలలు 465