breaking news
	
		
	
  Nirmal
- 
      
                   
                                 కొనుగోళ్లకు వేళాయెనిర్మల్ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు కార్తీకమాసం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీ సీ రీజియన్ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు. పత్తిలో 12 శాతం తేమ ఉండాలి కుంటాల: పత్తిని మిల్లులకు తరలించేటప్పుడు తేమ 12 శాతం మించకుండా రైతులు చూసుకోవాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను ఆదేశించారు. కుంటాల మండలం కల్లూరు రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందిస్తుందని అన్నారు. ప్రతీ రైతు కిసాన్ కపాస్ యాప్ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సలహాలు, సందేహాల కోసం1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్సింగ్, భైంసా ఏడీఏ వీణ, ఏఈవో గణేశ్, రైతులు పాల్గొన్నారు. లక్ష్మణచాంద: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్లో వానాకాలం వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు మండలాల్లో రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం మాయిశ్చర్ వచ్చేలా ఆరబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వరి సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 1.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారు 400 గ్రామాల్లో ఈ వానాకాలం 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా ముధోల్, బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, లక్ష్మణచాంద, దిలావర్పూర్, సోన్ మండలాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు. కోతలు ప్రారంభం అయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 317 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ తెలిపారు. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, డీసీఎంఎస్ కేంద్రాలు 21, పీఏసీఎస్ 129, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి కొనుగోళ్లు.. ముధోల్ మండలంలో బుధవారం నుంచి వరి కొ నుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు వెల్ల డించారు. మిగిలిన మండలాల్లో పంట కోత పూర్తయ్యే కొద్దీ కేంద్రాలు క్రమంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సీజన్లో మొత్తం 1.69 లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడమే లక్ష్యంగా నిర్ణయించారు. గన్నీ సంచులు, వసతులు సిద్ధం ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులు, తూక యంత్రాలు, రవాణా వాహనాలు లాంటి అ న్ని వసతులు కల్పించినట్లు అధికారులు చెప్పారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యం విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు అదనంగా రూ.500 బోనస్ అందజేయనుందని అధికారులు తెలిపారు. రైతులు మధ్యవర్తుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధారణ మార్కుల కేంద్రాల్లోనే విక్రయం చేయాలని పిలుపునిచ్చారు. సర్వం సిద్ధం జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో సాగు అయిన వరి ధాన్యం సేకరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు జిల్లాలో 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.69 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. – సుధాకర్, డీఎం పౌరసరఫరాల శాఖ జిల్లా సమాచారం... ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 159పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు 129డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలు 21జీసీసీ కొనుగోలు కేంద్రాలు 08మొత్తం వరి కొనుగోలు కేంద్రాలు 317మొత్తం వరి ధాన్యం సేకరణ లక్ష్యం 1.69 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకం వరి ధాన్యం ధర క్వింటాల్కు రూ.2,369ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ. 2,389
- 
      
                   
                                 పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలిదస్తురాబాద్: గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలో పలు కాలనీలను పరిశీలించి పారిశుద్ధ్యం నిర్వహణ గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త సేకరిస్తున్నారా అని ఆరా తీశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే పన్నులపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్స్ దారులకు నోటీసులు పంపించాలని ఆదేశించారు. అంతకుమందు పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల సామగ్రిని, గ్రామపంచాతీ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. డీపీవో వెంట మండల ఎంపీడీవోవోలు సునీత, రమేశ్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీవో రమేశ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
- 
      
                   
                                 మక్కలు తూకం వేయడం లేదని ఆందోళనఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొ నుగోలు కేంద్రంలో మక్కలు తూకం వేయడం లేదని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. కడెం మండలం అల్లంపెల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రెండురోజుల క్రితం 600 క్వింటాళ్ల మక్కలను 15 ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చారు. అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిర్వాహకులు తూకం వేయకుండా తేమ శాతం, నాణ్యత పేరిట పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఆందోళనలో రైతులు పరశురాం, సృజన్లాల్, పెరమన్న, రిజేశ్, మల్లేశ్, పోశన్న, రాజారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతలక్ష్మణచాంద: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి రాధిక పేర్కొన్నారు. మండలంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పొట్టపల్లి(కె) గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామస్తులకు బాల్య వివాహాల నిరోధక చట్టం, వివిధ రకాల రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించారు. రైతులు రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అలాగే భూసమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజలింగం, లింగాగౌడ్, సిరాజ్, ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్, ఎస్వో నవిత, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ● ఆర్ఎస్యూ నుంచి సికాస కార్యదర్శిగా ● కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ● అనారోగ్యంతో లొంగుబాటుఅజ్ఞాతం వీడిన బండి దాదా మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మొదటిజోన్కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాశ్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్శితుడైన ప్రకాశ్ ఆర్ఎస్యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు. అనారోగ్యం.. ప్రకాశ్కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రితమే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25 లక్షలు అందజేశారు. కుటుంబ సభ్యుల ఆనందం బండి ప్రకాశ్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. అనేకసార్లు ఎన్కౌంటర్లలో మృతిచెందా డని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగి పోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
- 
      
                   
                                 దుబాయిలో తప్పిపోయిన జిల్లావాసిసారంగపూర్: మండలంలోని గోపాల్పేట్ గ్రామానికి చెందిన పూర్ణ సాయేందర్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ తప్పిపోయాడు. ఈమేరకు ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిషయమై ఆయన కుటుంబీకులను సంప్రదించగా సాయేందర్ పదేళ్లుగా దుబాయికి వెళ్లొస్తున్నాడని తెలిపారు. రెండు నెలల క్రితం తన కూతురు వివాహం జరిపించి దుబాయికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో దుబాయిలోని వెస్ట్జోన్ కంపెనీలో వీసా రావడంతో 20 రోజుల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయనకు కంపెనీ అడ్రస్ దొరకకపోవడంతో అక్కడే తిరుగుతూ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లావాసుల కంటపడ్డాడు. వారు ఆయనను విచారించగా తనది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, గోపాల్పేట్ గ్రామం అని తెలిపాడు. ఆయన అనారోగ్యంతో ఉండడం గమనించి ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వివరాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అనంతరం అల్కోస్ ఏరియాలో ఉన్న స్థానికులకు సమాచారం ఇచ్చి సాయేందర్ వద్దకు వెళ్లాలని కోరారు.
- 
      
                   
                                 మద్యం షాపుల కేటాయింపునకు లక్కీడ్రానిర్మల్టౌన్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని 47 మద్యం షాపులను కేటాయించారు. మొత్తం 991 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ఒక్కో దుకాణానికి సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపి పూర్తి పారదర్శకతతో ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా డ్రా కొనసాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. లక్కీ డ్రాలో ఎంపికై న వారికి నిర్ణీత లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేదికపైనే కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్, ఎకై ్సజ్ సిబ్బంది, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 బల్దియాలకు మహర్దశ..నిర్మల్మనమూ చేద్దాం... మారథాన్ ఉరుకులు, పరుగుల జీవితంలో రోజూ క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.ఓటరు జాబితా పరిశీలన వేగవంతం చేయాలి భైంసాటౌన్: ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం బీఎల్ఓలతో మాట్లాడారు. ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బీఎల్వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాల పరిశీలన పక్కాగా చేయాలని సూచించారు.భైంసాటౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతకాలంగా మున్సిపాలిటీలకు నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నచందంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనులు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు అధ్వానంగా మారాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వరద నీరు పారేలా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు, వర్షపునీరు రహదారులపై నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోనూ మురుగు నీరు ఇళ్లలోకి చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులకు మోక్షం కలుగనుంది. ముఖ్యంగా డ్రెయినేజీలు, సీసీరోడ్లు, వరద కాలువలతో పాటు పార్కులు, సుందరీకరణ పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. పట్టణాభివృద్ధికి తోడ్పాటు.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గుర్తించాం. ఈ నిధులతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, వరద కాలువల నిర్మాణం చేపడతాం. పార్కులు, జంక్షన్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తాం. – బి.రాజేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్, భైంసా
- 
      
                   
                                 యూడైస్లో వివరాలు నమోదు చేయాలినిర్మల్రూరల్: పాఠశాలల వివరాలను యూడైస్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యూడైస్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మూడు రకాల మాడ్యూల్స్లలో పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పర్యాటకానికీ.. పట్టదా..!నిర్మల్: ఉత్తరాన ఎత్తయిన సహ్యాద్రి శ్రేణులు, దక్షిణాన ఎగిసిపడే గోదారి అలలు, పచ్చని అడవులు, ఎత్తయిన గుట్టలు, జాలువారే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులు.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల కలబోత నిర్మల్ జిల్లా. పచ్చదనంతో పాటు ఆధ్యాత్మిక ఆలయాలు, చారిత్రక కట్టడాలు జిల్లా పర్యాటకానికి మరింత శోభనిచ్చేవే. ఎన్ని ఉన్నా.. పాలకుల కన్ను మాత్రం ఇటువైపు పడటం లేదు. ఇక్కడి నుంచి అధికారులు ఎన్ని ప్రతిపాదనలు పంపినా.. అవి బుట్టదాఖలే అవుతున్నాయి. ఏళ్లుగా టూరిజం అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది. తాజాగా ప్రభుత్వం నేచర్ టు అడ్వెంచర్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎకోటూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికై నా జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. పచ్చని అడవి అందాలు... అడవులు అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గుర్తొస్తుంది. అలాంటి అడవుల ఖిల్లాకు స్వాగతం పలికినట్లుగా నిర్మల్జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి తూర్పుదిశగా వెళ్తుంటే పచ్చని అటవీ అందాలు స్వాగతం పలుకుతాయి. మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో విస్తృతంగా ఉన్నాయి. గోదావరి అలలు.. ఖానాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్తే గోదావరి నదిపై అడ్డంగా రాళ్లతో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట ఉంటుంది. ఎలాంటి యంత్రాలు, గేట్ల సాయం లేకుండా సహజసిద్ధంగా గోదావరి నీటిని కాలువలకు మళ్లించడం ఇక్కడి ప్రత్యేకత. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గోదావరి అందాలను ఆస్వాదించవచ్చు. దారి పొడవునా.. జిల్లాకేంద్రం నుంచి కడెం వైపు, అలాగే ఆదిలాబాద్వైపు సాగే ఎన్హెచ్ 44 బైపాస్రోడ్డు మొత్తం పచ్చని అడవుల మధ్యలో సాగుతాయి. జిల్లాలో ఎక్కడైనా సరే.. ఎకోటూరిజానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ.. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వమూ జిల్లాపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. తాజాగా చేపట్టనున్న ఎకోటూరిజం అభివృద్ధిలోనైనా జిల్లాను భాగస్వామ్యం చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
- 
      
                   
                                 జిల్లాస్థాయి జట్లకు ప్రత్యేక శిక్షణదిలావర్పూర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న జట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బాలబాలికలకు వేర్వేరుగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. బాలుర జట్లకు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, బాలికల జట్టుకు ఆసిఫాబాద్లోని క్రీడా పాఠశాలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6 నుంచి 8 వరకు పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- 
      
                   
                                 హెల్మెట్తో ప్రాణాలు భద్రంనిర్మల్టౌన్: ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చని రవాణావాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో 85 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదంలో 60 నుంచి 70 శాతం వరకు హెల్మెట్ లేకనే మృతి చెందినట్లు అంచనా. నామ మాత్రపు తనిఖీలు పోలీసులు, రవాణా శాఖ హెల్మెట్ ధరించని వారిపై చర్యలు అంతగా తీసుకోవడం లేదని, తనిఖీలు కూడా నామమాత్రంగా చేపడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రవాణా అధికారులు తమ బాధ్యతగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నాణ్యమైన వి ఉపయోగించాలి నాసిరకం హెల్మెట్ ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ స్ట్రాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐఎస్ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లు ధరించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. వాడకంపై చట్టం.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా కడుతుంటే డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దుచేసే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన ఘటనలు
- 
      
                   
                                 ● లేఖ విడుదల చేసిన మార్క్ఫెడ్కొనుగోళ్లకు పర్మిషన్ రావాలి భైంసా: జిల్లాలో సోయా రైతుల తిప్పలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన జిల్లా మార్క్ఫెడ్ అధికారులు సోమవారం లేఖ విడుదల చేశారు. ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆదేశాలు అందిన వెంటనే మార్క్ఫెడ్ ద్వారా సోయా కొనుగోళ్లు ప్రారంభిస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా అదనపు కలెక్టర్ కూడా మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు.
- 
      
                   
                                 కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలినిర్మల్టౌన్: వరి, పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తుఫాను తీవ్రత దష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీవ్రత తగ్గేవరకు హార్వెస్టింగ్ నిలిపివేయాలన్నారు. కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం తహసీల్దార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, అధికారులు విజయలక్ష్మి, రాజేందర్, సుధాకర్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 తలకుగాయం.. ప్రాణాంతకంచాలావరకు రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. బైక్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదం జరిగితే 80 శాతం వరకు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మిగితా గాయాల కన్నా తలకు తలగిన గాయాలు ప్రాణాంతకం. – డాక్టర్ మనోజ్ భరత్, న్యూరో ఫిజీషియన్హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ యాక్టివ్ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తాం. – దుర్గాప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి
- 
      
                   
                                 ప్రతీ రక్తపు బొట్టు ప్రాణాన్ని కాపాడుతుందినిర్మల్టౌన్: ప్రతీ రక్తపుబొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనాతో పాటు 350 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదాతలు నిజమైన దేవుళ్లు అని అన్నారు. ప్రాణప్రాయస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయడం అంటే.. కొత్త జీవితం ఇవ్వడమే అన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలినిర్మల్టౌన్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి కలెక్టరేట్లో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 నిర్మల్భైంసా/భైంసారూరల్ : జిల్లాలో నెల రోజుల క్రితం నుంచి సోయా కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించి పంటను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్తో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర నుంచి పాదయాత్ర ప్రారంభించారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అక్టోబర్ 14న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సోయా దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇప్పటికీ కొనుగోళ్లు లేవు... సోయా సాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పంట కోసి కల్లాల్లో ఆరబోసినా వర్షం ఇబ్బందులు తప్పడంలేదు. ఇటీవల వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల్లో స్పష్టత కరువైంది. కోసిన పంట ఇళ్లలో నిల్వ చేసుకోలేక, కల్లాల్లో ఆరబెట్టలేక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 31 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇటువైపు మహారాష్ట్రలోనూ ఈ నెల 30 నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. కానీ మన నిర్మల్ జిల్లాలో మాత్రం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు. ప్రైవేటు వ్యాపారులకే కలిసివస్తోంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం ప్రైవేటు వ్యాపారులకే కలిసి వస్తోంది. సోయా క్వింటాకు ప్రభుత్వం రూ.5,328 మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రైవేటు వ్యాపారులు రూ.3,900 నుంచి రూ.4,300 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అదనంగా కమీషన్ చార్జీలు, చాట వాల చార్జీలతో రైతులను దోచుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులే రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే రైతుల పేరిట వ్యాపారులు కొనుగోలు చేసిన సోయాలే విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.వెయ్యి వరకు ధర కలిసివస్తుందని ఆలోచిస్తున్న వ్యాపారులు రైతుల పట్టాపాసు పుస్తకాలు తీసుకుని పంట విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించడం మధ్య దళారులు ప్రైవేటు వ్యాపారులకే ఏటా కలిసి వస్తోంది. భైంసా మార్కెట్కు విక్రయానికి తీసుకువచ్చిన సోయాలుజిల్లా సమాచారం ప్రభుత్వ పాఠశాలలు : 830 విద్యార్థులు : 67,790 ఏఐ విద్యా భోధన అమలవుతున్న పాఠశాలలు: 11 అన్నదాత అరిగోసజిల్లా వివరాలు నియోజకవర్గాలు : ఖానాపూర్, నిర్మల్, ముధోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు : ఖానాపూర్, నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్ జిల్లాలో సోయా సాగు : 1.05 లక్షల ఎకరాలు రైతులు : 72,300 ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు : రూ.5,328 ప్రైవేటులో : రూ.3,900 నుంచి రూ.4,300 ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, దిగుబడి వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, నిర్మల్ సమయం లేక అమ్ముకుంటున్నారు... వేసవి సాగు కోసం భూములను సిద్ధం చేసేందుకు రైతులు పంట చేలలోనే ఉంటున్నారు. వర్షాకాలంలో పండించిన సోయా నిల్వలు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బులతో పంట భూములను సిద్ధం చేస్తున్నారు. రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేసే ఆలోచనలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక వేసవి పంటల సాగు కోసం కాలాన్ని వృధా చేసుకోలేక వచ్చిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్న అధికారులు ప్రభుత్వానికి వివరించి కొనుగోలు కేంద్రాలు తెరవడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ జిల్లాలోని సోయా రైతులు నష్టపోతున్నారు.
- 
      
                   
                                 కిక్కు.. ఎవరికో లక్కు..నిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం సోమవారం లక్కీ నిర్వహించనున్నారు. డ్రా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి లక్కు ఎవరిని వరించనుందని టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకుంటున్నారు. వ్యాపారుల్లో ఆందోళన.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనే వ్యాపారులు ప్రతీ దరఖాస్తుకు రూ.3లక్షల నాన్ రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. లక్కు తగలకపోతే ఆ మొత్తం తి రిగి రాదు. ఈ కారణంగా చాలామంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు వెనుకడుగు వేశారు. గతంలో 50 నుంచి 90 దరఖాస్తులు వేసి లక్కు తగలకపోయినా అనుభవం ఉన్న వ్యాపారులు ఈసారి దూరంగా ఉన్నారు. కొంతమంది నాన్ రీఫెండబుల్ ఫండ్లలో కనీసం 50 శా తం రీఫండ్ ఇచ్చే విధానం అవలంబిస్తే, దరఖా స్తుల సంఖ్య రెట్టింపు అయ్యేదని అంటున్నారు. నేడు లక్కీ డ్రా.. వైన్షాపుల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి నేడు కలెక్టరేట్ భవనంలోని మీటింగ్ హాల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు దారులకు ఇప్పటికే పాస్లు సైతం జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారులు జారీ చేసిన పాస్ తీసుకుని వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. డిసెంబర్ 1 నుంచి నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా కొత్త వ్యాపారులు రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ ప్రారంభించనున్నారు. 47 దుకాణాలకు 991 దరఖాస్తులు నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 47 వైన్స్ దుకాణాలకు గతనెల 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23న ముగిసింది. 991 దరఖాస్తులు రాగా ఒక్కో అప్లికేషన్కు రూ.3 లక్షల చొప్పున ఎకై ్సజ్శాఖకు రూ.29.73 కోట్ల ఆదాయం సమకూరింది. అర్బన్లో 448, రూరల్లో 543.. మూడు మున్సిపాలిటీల పరిధిలో 19 వైను్ుస్ల ఉండగా 448 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాప్ నెంబర్ 1లో 34, 10లో 44, 11లో 35 దరఖాస్తులు అందాయి. రూరల్ ప్రాంతాల్లో 28 షాపులు ఉండగా 543 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా సారంగాపూర్ మండలంలోని షాప్ నెంబర్ 22, 23లో 35 చొప్పున దరఖాస్తులు అందాయి. రిస్క్ తక్కువ.. ఇన్కాం ఎక్కువ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో రిస్క్ తక్కువే. దీంతో ఎక్కువ మంది రూరల్ ప్రాంతాల్లోని షాపులపైనే దృష్టి పెట్టారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో రూ.60 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. వాటి పరిధిలోని 16 షాపులకుగానూ 8 షాపులకు 20లోపు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు ఒక్కరికే అనుమతి వైన్స్షాపుల కేటాయింపు కోసం నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నాం. ఇందుకోసం ఏ ర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దరఖాస్తుదారులకు పాస్లు జారీ చేశాం. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలలోపు చేరుకోవాలి. ఎంట్రీపాస్ వెంట తెచ్చుకోవాలి. హాల్లోకి మొబైల్ఫోన్లకు అనుమతిలేదు. ఒక్క దరఖాస్తు నుంచి ఒక్కరినే అనుమతిస్తాం. – అబ్దుల్ రజాక్, జిల్లా ఎకై ్సజ్ అధికారి
- 
      
                   
                                 గజ్జలమ్మ ఆలయంలో భక్తుల రద్దీకుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గజ్జలమ్మ ప ల్లకి సేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బోనా లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అడెల్లిలో భక్తుల సందడిసారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజమాబాద్, వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. మన్ కీ బాత్ వీక్షించిన ‘ఏలేటి’నిర్మల్చైన్గేట్/ఖానాపూర్: ప్రధాని నరేంద్రమోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఖానాపూర్లో బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పిట్టల భూమన్న, జెట్టి చిన్న రాజన్న, పన్నెల సురేశ్, పంజాల శివ, భీమన్న, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు. స్వదేశానికి జోర్డాన్ బాధితులు కుంటాల/సోన్: జోర్డాన్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 12 మంది కార్మికులు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. అక్కడ తాము పడుతున్న కష్టాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వారిలో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముఖిమ్, సోన్ మండలంలోని కూచన్పెల్లికి చెందిన మెట్టు ముత్యం ఉన్నారు. మాజీ మంత్రి హరీష్రావు కూలీలకు వేసిన జరిమానా చెల్లించి, విమాన ప్రయాణ చార్జీలు భరించి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. 15 నెలల పాటు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం ముఖిమ్, ముత్యం ఇంటికి రాగానే సంతోషపడ్డారు.
- 
      
                   
                                 ఏఐ బోధనకు అడ్డంకులు!లక్ష్మణచాంద: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 15న జిల్లాలోని ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను ప్రారంభించింది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కంప్యూటర్ ద్వారా విద్యను అందించాలని సంకల్పించింది. ఈ విద్యా సంవత్సరం మరో 14 పాఠశాలల్లో ప్రారంభించారు. 8 పాఠశాలలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో కేవలం 6 పాఠశాలల్లోనే అమలవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 11 పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్యాబోధన జరుగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. లక్ష్యం ఇదే.... ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు, పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఏఐ విద్య దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 1, 2 తరగతుల వి ద్యార్థులకు గణితం, 3, 4, 5 తరగతుల విద్యార్థుల కు గణితంతో పాటు, తెలుగు,ఆంగ్లం సులువుగా నే ర్పవచ్చని ఉపాధ్యాయులుపేర్కొంటున్నారు. వీటి నికంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసిబోధన చేస్తున్నారు. అన్ని పాఠశాలలో అమలు చేస్తామని తెలిపిన... గతేడాది పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించగా ఈ విద్యా సంవత్సరం మొత్తం అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సగం పని దినాలు పూర్తయినా ఇప్పటి వరకు అన్ని పాఠశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత విద్యాబోధన ప్రారంభం కాలేదు. కారణాలు ఇవే... ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా విద్యాబోధన చేయాలని నిర్ధారించిన పాఠశాలల్లో అనేక అవరో దాలు ఎదురవుతున్నాయి. ప్రతీ పాఠశాలకు 5 కంప్యూటర్లు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్ప టి వరకు పంపిణీ చేయలేదు. వేసవి సెలవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇప్పటి వర కు ఏ ఒక్క పాఠశాలలో అమలుకాలేదు. దీంతో ఏఐ ఆధారిత విద్యాబోధన ప్రారంభమైన పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్యాబ్తో పాటు సమీపంలోని ఎంఈవో కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల నుంచి కంప్యూటర్లు తెచ్చుకుని ఉపాధ్యాయుల ఫోన్ల నుండి ఇంటర్నెట్ అనుసంధానం చేసుకుంటూ బోధన కొనసాగిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలి పారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏఐ విద్యాబోధన అమలుకు సరిపడా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- 
      
                   
                                 ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గంఖానాపూర్: ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గం సాధ్యమవుతుందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ గోదా శ్రీకృష్ణ నూతన మందిర ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో హవనాలు, శాంతిపాఠం, వేద పారాయణాలు, శాంతిహోమం, మహా పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం శ్రీగోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికర్త దేవుడు లేనిదే జీవుడు లేడని, మాధవ సేవగా సర్వప్రాణి సేవచేసి తరించాలని అన్నారు. మనిషి ఎంత సంపాదించినా ఎంత చేసినా చివరికి మిగిలేది మంచి జ్ఞాపకాలేనన్నారు. ఆలయాలు నిర్మించడం సంతోషకరమని, అర్చకులు వద్దిపర్తి వెంకటరమణ సంకల్పాన్ని రూపా సురేశ్రెడ్డి, అనితారెడ్డి సఫలం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు పైడిపెల్లి రవీందర్ రావు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డా.సునీత విజయ్కుమార్, నాయకులు భూక్య జాన్సన్ నాయక్, చిన్నం సత్యం, కల్వకుంట్ల నారాయణరావు, కొత్తపెల్లి సురేశ్, అల్లాడి వెంకటేశ్వర్లు, మంత్రరాజ్యం సురేశ్, కొండాడి గంగారావు, కొందుకూరు శ్రీనివాస్, బీసీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 కళాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంనిర్మల్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అనిత శ్రీనివాస్ ఫోటో ఎంబ్రాయిడరీ స్టోర్ను ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు తీసుకురానునట్లు తెలిపారు. కొయ్య బొమ్మల తయారీపై ఆధారపడిన కుటుంబాలకు 90 శాతం సబ్సిడీతో రూ.5కోట్ల రుణం త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కళ అంతరించిపోకుండా స్కిల్ యూనివర్సిటీ సిలబస్ లో నిర్మల్ కోయబొమ్మల అంశాన్ని చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చిత్రాలు వేసే శ్రీనివాస్ కళాకారుడికి జిల్లా కేంద్రంలో ఎంబ్రాయిడరీ షాప్ ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ నాయకులు నాందేడపు చిన్ను, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యంభైంసాటౌన్: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా భైంసా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డ్లో పథ సంచలన్–సార్వజనికోత్సవం నిర్వహించారు. ముందుగా ఆయా కాలనీల నుంచి స్వయం సేవకులు పురవీధుల మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ మా ట్లాడుతూ.. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో పనిచేస్తుందని, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ విస్తరించిందన్నారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మ తాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్త నాగ్నాథ్ పటేల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, సహ సంఘచాలక్ సాదుల కృష్ణదాస్, స్వయం సేవకులు, మహిళలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఎస్ఐఆర్ ఓటరు జాబితా సిద్ధం చేయాలినిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారుల ను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 2002లో రూపొందించిన ఎస్ఐఆర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏ ఈఆర్వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్వో సూ పర్వైజర్లతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీరోజు లక్ష్యాలను నిర్ణయించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పద్ధతిగా అమలు చేయాలన్నారు. కేటగిరీ–‘ఏ’లోని వివరాలను నిర్ధారించి, ‘సి’, ‘డి’ కేటగిరీ వివరాలతో అనుసంధానం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 లైసెన్స్డ్ సర్వేయర్లొస్తున్నారు..నిర్మల్చైన్గేట్: భూమి కొలతలలో పారదర్శకత, కచ్చితత్వం సాధించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు ప్రారంభించింది. ఆధునిక పరికరాలతో భూసర్వే చేపట్టేందుకు జిల్లాలో లైసెన్స్ పొందిన సర్వేయర్లు అధికారికంగా రంగంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 23న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన 49 మందికి లైసెన్సులు అందజేశారు. మండలాల వారీగా సర్వేయర్ల కేటాయింపు జిల్లాలో మొత్తం 18 మండలాల్లో సర్వేయర్ల డిమాండ్ అధికంగా ఉంది. ప్రతీ మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 12 మంది రెగ్యులర్ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల రాకతో భూ కొలతల వేగం పెరగనుంది. మొదటి విడతలో 73 మందికి శిక్షణ.. భూసర్వేయర్గా మారేందుకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ప్రభుత్వం మొదటి విడతలో 73 మందిని ఎంపిక చేసింది. 50 రోజుల సాంకేతిక శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో 49 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి సీనియర్ సర్వేయర్ల ఆధ్వర్యంలో అదనంగా 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. అర్హత సాధించిన వారికి ఇటీవల ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. రెండో బ్యాచ్కు శిక్షణ షురూ.. ఆగస్టు 18న ప్రారంభమైన రెండో బ్యాచ్లో మొత్తం 81 మంది పాల్గొంటున్నారు. గత పరీక్షలో ఉత్తీర్ణత పొందలేని 24 మందికి అక్టోబర్ 26న మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. తదుపరి దశలో ఉత్తీర్ణులైన వారికి కూడా లైసెన్సులు జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అధునాతన పరికరాలతో కొలతలు లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ప్రభుత్వం డీజీపీఎస్ మిషన్లు అందించనుంది. వీటి సహాయంతో భూ సరిహద్దులు నాణ్యమైన డిజిటల్ డేటాలో నమోదు కానున్నాయి. ఇది రికార్డు స్పష్టతను తెచ్చి, భూవివాదాలను తగ్గిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది సర్వేయర్లు తమ పారితోషికాల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ ప్రోత్సాహక వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలో మండలాల కేటాయింపు.. ఈనెల 23న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా మొదటి విడత ఉత్తీర్ణులైన 49 మందికి లైసెన్సులు అందించారు. అధికారుల ఆదేశాల ప్రకారం త్వరలోనే వీరికి మండలాలు కేటాయిస్తాం. మొదటి విడతలో ఫెయిల్ అయిన వారితోపాటు రెండవ బ్యాచ్కు ఈ నెల 26న రాత పరీక్ష ఉంటుంది. – రాథోడ్ సుదర్శన్, ఏడీ సర్వేయర్జిల్లా వివరాలు మొత్తం మండలాలు 18 రెగ్యులర్ సర్వేయర్లు 12ఐకేపీ సర్వేయర్లు 5జిల్లాలోని మొత్తం సర్వే నంబర్లు 1,67,046 జిల్లాలోని భూ విస్తీర్ణం 8,96,523.11 ఎకరాలు మొదటి విడత ట్రైనింగ్ పొందిన సర్వేయర్లు 73అనుత్తీర్ణులైన వారు 24లైసెన్స్ పొందిన సర్వేయర్లు 49రెండవ విడత పరీక్ష రాసేవారు 81
- 
      
                   
                                 సంతోష్నగర్ పాఠశాలకు రాష్ట్రస్థాయి అవార్డుమామడ: ఎఫ్ఆర్ఎస్ అమలులో భాగంగా మండలంలోని సంతోష్నగర్ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో అవార్డు లభించింది. వందశాతం హాజరు నమోదుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఏఎస్పీడీ రాధారెడ్డి, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, నిర్మల్ డీఈవో భోజన్న చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ద్యాగ రాజేంద్ర లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఉదయం 8గంటలకే పాఠశాలకు... పాఠశాలలో 61 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఉదయం 8 గంటలకే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాలకు రప్పించే విధంగా ప్రణాళిక వేసుకుని అమలు చేస్తున్నారు. పాఠశాలలో కృత్యాదార బోధనతో విద్యార్థులు ఆకర్షితులై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మెరుగైన హాజరుతో పాఠశాలను అవార్డు వరించింది.
- 
      
                   
                                 అటవీ సంపద భవిష్యత్ తరాలకు అందించాలిమామడ: అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని, అడవుల సంరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్లో అటవీ వన్యప్రాణుల చట్టాలపై జిల్లా లీగల్ సెల్ అథారిటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నల్దుర్తి తుర్కం చెరువు, వెంగన్న చెరువు ఎకోటూరిజం సర్క్యూట్ను పరిశీలించి, సఫారీ నిర్వహించారు. చెరువు వద్ద ఉన్న బైనాక్యూలర్స్ ద్వారా పక్షులను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో నాగిని భాను, దిమ్మదుర్తి, నిర్మల్ ఎఫ్ఆర్వోలు శ్రీనివాస్రావు, రామకృష్ణారావు, డీఆర్వో నజీర్ఖాన్, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజలింగం, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ లింగాగౌడ్, న్యాయవాదులు రమణారావు, రంజిత్, టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది అన్నపూర్ణ, వెంకట్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించాలినిర్మల్చైన్గేట్: అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు జిల్లా వారీగా రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. అర్హులకు ధ్రువీకరణ పత్రం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి సులభంగా అందుతాయన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో నెలకు సుమారు 12 శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 960 యూడీఐడీ కార్డులు అందించినట్లు తెలిపారు. దివ్యాంగులు శిబిరాలకు హాజరయ్యేలా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు.
- 
      
                   
                                 సోయా రైతు చిత్తు..!భైంసాటౌన్: భైంసా మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరువాత అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ భైంసా కావడంతో భైంసా డివిజన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుంటున్న ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు. క్యాష్ కటింగ్ పేరిట కోతలు.. మార్కెట్లో కమీషన్ ఏజెంట్ వ్యవస్థ రైతులను పీడిస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించాలంటే కమీషన్ ఏజెంట్ తప్పనిసరి. ముందుగా వ్యవసాయ మార్కెట్కు తెచ్చింది మొదలు పంట అమ్ముకునే వరకు దోపిడీ తప్పడం లేదు. రైతు తెచ్చిన పంట కుప్పను ముందుగా ట్రేడర్లు పరిశీలించి తేమ శాతం ఆధారంగా ఈ–నామ్లో ధర నిర్ణయిస్తారు. ఇందులో హమాలీ, దడ్వాయి, చాటావాల చార్జీలతో పాటు కమీషన్ ఏజెంట్ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 కోత విధిస్తున్నారు. ఇదంతా తక్పట్టీపై అధికారికంగా కోత విధిస్తుండగా, అనధికారికంగా తక్పట్టీ వెనుక కమీషన్ ఏజెంట్లు క్యాష్ కటింగ్ పేరిట రూ.వందకు మరో రూ.1.50 అదనంగా కోత విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట విక్రయించేదే డబ్బుల కోసమని.. అలాంటిది క్యాష్ (నగదు చెల్లింపు) కటింగ్ పేరిట అదనంగా కోత విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తూకాల్లోనూ 50 కిలోల సంచికి 1200 గ్రాములు అదనంగా తీసుకుంటున్నారని వాపోతున్నారు. పట్టించుకోని ఏఎంసీ అధికారులు.. మార్కెట్ యార్డులో ఇష్టారీతిన డబ్బుల చెల్లింపులో కోతలు విధిస్తున్నా.. సంబంధిత మార్కెట్ కమిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. కమీషన్ చార్జీల పేరిట అనధికారికంగా వసూలు చేస్తున్నా.. వారిని ప్రశ్నించిన పాపాన పోవడం లేదు. మరోవైపు దీపావళి ఇనామ్ పేరిట చాటావాలాలు ఇబ్బందికి గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే, పంట విక్రయానికీ ఇబ్బందులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్లో ఇష్టారీతి దోపిడీని అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. రైతులు ఫిర్యాదు చేయాలి.. మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులు విక్రయించే రైతుల వద్ద నగదు చెల్లింపు పేరిట కమీషన్ ఏజెంట్లు అదనంగా వసూలు చేయవద్దు. నిబంధనల ప్రకారం రూ.వందకు రూ.1.50 మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా అదనంగా వసూలు చేస్తే రైతులు ఫిర్యాదు చేయాలి. – పూర్యానాయక్, ఏఎంసీ సెక్రెటరీ, భైంసా అదనంగా కోత పెట్టొద్దు.. కమీషన్ ఏజెంట్ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 మాత్రమే రైతు వద్ద తీసుకోవాలి. అదనంగా నగదు చెల్లింపు పేరిట ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి, నిర్మల్
- 
      
                   
                                 మొలకలతో ఆరోగ్యంపెసర్లు, శనగలు, పల్లీలు, తదితర తృణధాన్యాలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.ఆత్మవిశ్వాసానికి మూలం గ్రంథాలయాలు చదువుకే కాదు, ఆత్మవిశ్వాసానికి మూలం. గ్రంథాలయంలో ఉన్న ప్రశాంత వాతావరణం, ఒకే లక్ష్యంతో కష్టపడుతున్న ఇతర అభ్యర్థుల స్ఫూర్తి మాకు ఉత్సాహాన్నిచ్చింది. రోజువారీ సమయపాలన, పరీక్షల ప్రాక్టీస్, పుస్తకాల లభ్యత ఇవన్నీ మా విజయానికి కారణమయ్యాయి. – ప్రకాశ్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్–4 విజేత, గోపాల్పేట్, సారంగపూర్ చక్కని మార్గనిర్దేశనం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మాలాంటి నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు చక్కని మార్గదర్శనం చేస్తున్నాయి. ఉచిత పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు కూర్చుని చదివేందుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే చదివి వార్డ్ ఆఫీసర్, గ్రూప్–2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించా. – కే.రమేశ్, గ్రూప్–2 విజేత, ఖానాపూర్ ఇక్కడే చదివి.. ఇక్కడే కొలువులు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాలు చక్కని అవకాశం కల్పించాయి. జిల్లా వాసులైన మేము ఇక్కడే చదివి ఇక్కడే కొలువులు సాధించడం మరిచిపోలేని అనుభూతి. ఇందులో గ్రంథాలయాల పాత్ర అత్యంత కీలకం. – లిఖిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సౌజన్య, ఎన్పీడీసీఎల్ ఏఈ
- 
      
                   
                                 పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాంనిర్మల్టౌన్: పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నిర్మల్కు చెందిన దాత సౌజన్యంతో ప్రతిభ కలిగి, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్న హోంగార్డ్ కుటుంబాలకు చెందిన 20 మంది విద్యార్థులకు, గతంలో చనిపోయిన హోంగార్డు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పేద కుటుంబాలకు చెందిన సిబ్బంది ఉన్నారన్నారు. వారిలో చాలామంది పిల్లలు ప్రతిభావంతులు ఉన్నారని, అలాంటి పిల్లల ప్రతిభను గుర్తించి, ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు ఈ ప్రోత్సాహాన్ని అందించామని తెలిపారు. ప్రోత్సాహం పొందినవారు.. పి.శ్రీనివాస్, శృతిలయ, శివకుమార్, మాసం సాత్విక్, ఆర్.లావణ్య, జాదవ్దివ్య, ఎన్.శిల్ప, జె.స్మిత, చరణ్, వర్ష, సాయి సృజన్, దినేష్, గంగమణి, డి.రాకేశ్, ఎండీ.అయాన్ఖాన్, ప్రణీత్కుమార్, జి.అశ్విని, కె.ఆనంద్, ఐశ్వర్య.
- 
      
                   
                                 ఆదర్శ విద్యార్థుల ప్రతిభకుంటాల: ఇటీవల నిర్మల్లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్లో కుంటాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు దివ్య, నాగజ్యోతి, విశాల్, జస్వంత్, అవంతిక, విద్య, స్వప్న, కార్తికేయ, మోక్షశ్రీ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్లోనూ ప్రతిభ కనబరిచి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. వీరికి ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులను డీఈవో భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, గైడ్ టీచర్ గంగప్రసాద్ అభినందించారు. హంగిర్గా శివారులో చిరుత సంచారం తానూరు:మండలంలోని హంగిర్గా శివారు ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా గ్రామ శివారు ప్రాంతంలో కూలీలు, ద్విచక్రవాహన దారులు చిరుత సంచారాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళేందుకు జంకుతున్నారు. బుధవారం సాయంత్రం చిరుత సంచారాన్ని సెల్ఫోన్లో చిత్రికరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అధికారులకు సమాచారం అందించడంతో బీట్ అధికారి కృష్ణ బుధవారం గ్రామానికి సందర్శించి రైతులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని, పనులకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రివేళ పశువులను ఇంటి సమీపంలో కట్టేసుకోవాలని తెలిపారు.
- 
      
                   
                                 పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలినిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి పీఆర్సీపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయని, హామీకి కట్టుబడి తెలంగాణలోనూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెట్ నుంచి మినహాయింపు విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్లో ఆర్థిక శాఖ అలసత్వం సరికాదన్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ప్రభుత్వం అదే రీతిలో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలు ఇంకా అందక పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్షేక్, నాయకులు శ్రీనివాస్, పరమేశ్వర్, అశోక్కుమార్, లక్ష్మీనారాయణ, ఖాలిద్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 బాసరలో సత్యనారాయణస్వామి పూజలుబాసర: కార్తీకమాసం సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తామని ఈవో అంజనాదేవి తెలిపారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీసూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు గోదావరి నదికి సాయంత్రం 6:30 గంటలకు కార్తీక దీపారాధన పూజలు చేస్తామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలు హాజరు కావాలని కోరారు. ఆలయానికి మంగళవాయిద్యాలు.. బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన భక్తులు శనగశెట్టి జగదీశ్ – బొబ్బిలి ప్రసాద్ కుటుంబ సభ్యులు మంగళవాయిద్యాలను అందించారు. అమ్మవారికి అభిషేకం సమయంలో వినియోగించేలా ఒక డోలు, రెండు సన్నాయిలను విరాళంగా అందజేశారు. వీటి విలువ రూ.44,200 ఉంటుందని ఆలయ అనువంశిక ట్రస్ట్ సభ్యుడు శరత్ పాఠక్ తెలిపారు. వీరివెంట ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, సన్నాయి డోలు సిబ్బంది ఉన్నారు.
- 
      
                   
                                 అనుబంధానికి ప్రతీకఅక్కాతమ్ముడు, అన్నాచెలె ్లళ్ల అనుబంధానికి ప్రతిక భావుబీజ్ ఉత్సవాలు. మహారాష్ట్రకు అనుకుని ఉన్న మండలాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. నిర్మల్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలిమామడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మంజూరైన నిఽ దులు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, డీఈ గంగాధర్, మండల ప్రత్యేక అధికారి రాజనర్సయ్య, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో ఉపేందర్, ఏఈ హరీశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కడెం:ఈ ఏడాది జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కానీ జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరి వృథాగా పోయింది. జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ఉండగా.. ఈ వర్షాకాలం మూడు ప్రాజెక్టులకు కలిపి 78.073 టీఎంసీల వరద నీరు వచ్చింది. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుల అధికారులు 66.28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. కడెంకు సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న కడెం ప్రాజెక్టు కింద 68 వేల ఎకరాలకు ఆయకట్టు ఉంది. అయితే ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది 57.388 టీఎంసీల ఇన్ఫ్లో రాగా, 47.179 టీఎంసీలు గోదావరిపాలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, 2.904 టీఎంసీల మేర పూడిక ఉంది. దీంతో ఈ సారి కేవలం 4.699 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అధికారులు ప్రాజెక్టులో పూడిక తొలగించడంతోపాటు గేట్లు, కాలువలకు సాంకేతికంగా మరమ్మతులు అవసరమని పేర్కొంటున్నారు. ‘గడ్డెన్నవాగు’కు ప్రవాహం ఎక్కువ.. భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సంవత్సరం ప్రాజెక్టుకు 14.225 టీఎంసీల వరద వచ్చింది. అందులో 12.971 టీఎంసీలను అధికారులు వరద గేట్ల ద్వారా వృథాగా వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుతం 1.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ‘స్వర్ణ’ సామర్థ్యమూ తక్కువే.. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు కింద సుమారు 9 వేల ఎకరాలు సాగవుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి 6.130 టీఎంసీల వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం తక్కువగా ఉండడంతో 6 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.037 టీఎంసీలు. ప్రస్తుతం అదే స్థాయిలో నీరు ఉంది. ప్రాజెక్టు నిండినా వారాలకే నీరు తగ్గిపోతుందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. పూడికతో తగ్గిన సామర్థ్యం.. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో ఏళ్లుగా పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 30–35 శాతం మేర తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీళ్లు(ఫైల్)పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. ఖరీఫ్సాగు పూర్తయింది. రెండో పంటకు సాగు నీరందించేందుకు లీకేజీలను ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగికి కూడా పూర్తిగా నీరు అందిస్తాం. – ప్రవీణ్, ఈఈ కడెం ప్రాజెక్టు ఇదీ జిల్లా ప్రాజెక్టుల వరద నీటి లెక్క టీఎంసీలలో..
- 
      
                   
                                 ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలినిర్మల్చైన్గేట్:వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకుల సమాచారం, టెంట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలుకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 9182958858 ను ప్రదర్శించేలా ప్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. సరిపడా సిబ్బంది, కూలీలు, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలుకు సంబంధించిన వివరాలను రోజువారీగా అందజేయాలని పేర్కొన్నారు. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లాలో వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, పూర్తి చేయడానికి ఉన్న గడువు ఆరా తీశారు. అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో సీపీవో జీవరత్నం, వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారులు సందీప్, వేణుగోపాల్, సునీల్ కుమార్, గంగాధర్గౌడ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ గురువారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డు అవుతున్న విధానాన్ని పరిశీలించారు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాం తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులకు సూచించారు.
- 
      
                   
                                 అట్టహాసంగా జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలుఖానాపూర్: పట్టణంలోని ఏసీఈ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గురువారం నిర్వహించారు. ఎంపీడీవో రమాకాంత్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రవీందర్గౌడ్ పోటీలను ప్రారంభించారు. యూత్ విభాగం, జూనియర్ విభాగం, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కుత్బుద్దీన్, కరస్పాండెంట్ షేక్ అజార్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షోయబ్, ఇమ్రాన్, ఆర్చరీ కోచ్ అంబేడ్కర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ కిశోర్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారిలో అభిషేక్, సిద్ధార్థ, రిషిత్, విష్ణు, నవీన్, అయాన్, శ్రీనిధి, సంహిత, వర్షిణి, విజ్ఞత ఉన్నారు. నవంబర్ 7న వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
- 
      
                   
                                 రహదారులే కల్లాలులక్ష్మణచాంద:వ్యవసాయ జిల్లాగా పేరుగాంచిన నిర్మల్ జిల్లా ప్రస్తుతం వానాకాలం పంటల కోతలు మొదలయ్యాయి. మొక్కజొన్న, సోయాబీన్ కోతలు దాదాపు ముగింపు దశలో ఉండగా, మరో వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. పంటలు కోసిన రైతులు కల్లాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో స్థలం కొరత కారణంగా రోడ్లనే కల్లాలుగా మారుస్తున్నారు. గ్రామాల్లో రోడ్లపై పంటలు ఆరబెడుతున్నారు.జిల్లాలోని పలు మండలాల రైతులు ఖాళీ ప్రదేశాలు లభించక ఇలా చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అవగాహన లోపంతో.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నాయి. అయితే రైతులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపైనే పంటలు ఆరబోస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు రాత్రిళ్లు ధాన్యంపై టార్పాలిన్ కవర్లు వేస్తున్నారు. ఆ కవర్లు కొట్టుకుపోకుండా పెద్ద బండరాళ్లు పెడుతున్నారు. వాహనదారులు చీకట్లో అవి కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం సమీపంలో బైక్ వెళ్తున్న ఓ కుటుంబ రోడుపై ఆరబెట్టిన మొక్కజొన్నపై జారిపడి ప్రమాదానికి గురైంది. రైతులకు అవగాహన లేకపోవడంతో ఇలా చేస్తున్నారు. చర్యలకు ముందుకు రాని అధికారులు రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు చిన్న పంట కలాలు, ఆరబెట్టే స్థలాలు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి అమలు కావడం లేదు. అధికారులు, పోలీసులు, సామాజిక సంస్థలు రైతులు పంటలు రోడ్లపై ఆరబెట్టకుండా అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.
- 
      
                   
                                 పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్నిర్మల్రూరల్: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి ఏఎస్పీ రాజేశ్మీనా విద్యార్థులకు వివరించారు. సిబ్బంది విధులు, బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసే విధానం, విచారణ, సైబర్ వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 భూములపై కదలికనిర్మల్: సర్కారు భూముల కబ్జాలపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుండటం, వరుసగా మీడియాలో కథనాలు వస్తుండటంతో కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్గా తీసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్తో పాటు అవసరమున్నచోట పోలీసులతో పాటు సంబంధిత శాఖల సహకారంతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఆక్రమణలను అధికారులు పరిశీలించారు. సర్కారు స్థలాల రక్షణకు ట్రెంచ్లను కొట్టిస్తున్నారు. పరిశీలించిన అధికారులు... జిల్లా కేంద్రంలో ఎప్పటి నుంచో భూకబ్జాలపై వస్తున్న పలు ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ఆర్డీవో రత్నకల్యాణి సహా అర్బన్ తహసీల్దార్, టౌన్ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఇంజినీర్, సర్వేయర్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. స్థానిక నిర్మల్–నిజామాబాద్ రోడ్డులో కంచెరోని చెరువు వద్ద ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలన చేపట్టారు. అలాగే నిర్మల్–మంచిర్యాల రోడ్డులో కలెక్టర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హద్దుల ప్రకారం ఇక్కడ మూడువైపులా ట్రెంచ్(కందకం) కొట్టాలని నిర్ణయించారు. ఇటీవల అయ్యప్పటెంపుల్ ఎదురుగా, దివ్యగార్డెన్ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన చోట సర్కారు భూముల బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.కోట్లు పలుకుతుండటంతోనే.. నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరం భూమి రూ.కోట్లు పలుకుతోంది. మంచిర్యాలరోడ్డులో గల ఏఎన్రెడ్డి కాలనీ, దివ్యనగర్, దత్తాత్రేయనగర్ తదితర కాలనీల్లో ఒక్కో ప్లాటు ధర రూ.50 నుంచి రూ.60లక్షల వరకు ఉందంటే ఇక్కడి భూముల విలువ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే ఇక్కడి సర్కారు భూములపై కొందరు బడానేతలు కన్నేశారు. అసైన్డ్ భూముల్లో వెంచర్లువేసి, ప్లాట్లు విక్రయించడమే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూములనూ కలిపేసుకోవడం, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలను చేపట్టడం గమనార్హం. గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పెద్దగా సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇందుకు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటమూ కారణమే. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి స్వయంగా వెళ్లి అసైన్డ్, ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో జిల్లా అధికారులు సీరియస్గానే స్పందిస్తున్నారు. ఎక్కడా.. జాగా లేదంటూ... ‘సార్.. మా సంఘానికి రెండుగుంటల జాగా చూపియండి కదా..’ అని ఏదైన సంఘంవాళ్లు అడిగినా, ‘సార్.. రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి..’ అని విన్నవించినా.. ‘నిర్మల్లో ఎక్కడా.. సర్కారు భూమి లేదు. ఏదైనా చెరువు దగ్గరో, ఊరవతలో చూసుకుపోండి..చేద్దాం..’ అంటూ పాలకులు, అధికారులు సమాధానం చెబుతుండేవారు. డిజిటల్ లైబ్రరీ పెట్టాలన్నా, ఇండోర్ స్టేడియం కట్టాలన్నా, అంబేద్కర్, బీసీ స్టడీసర్కిళ్లను నిర్మించాలన్నా.. సెంటు భూమి లేదన్న సమాధానమే వచ్చేది. కానీ.. ఇటీవల అధికారుల పరిశీలనల్లో ఎకరాలకు ఎకరాలను కబ్జాపెట్టిన తీరు బయట పడుతోంది. అయ్యప్పటెంపుల్ వద్ద గుర్తించిన ప్రభుత్వ భూమిలో డిజిటల్ లైబ్రరీ, ఇండోర్స్టేడియం, ఇంకా ప్రజాపయోగ నిర్మాణాలను చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే.. జిల్లావ్యాప్తంగా కబ్జాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.
- 
      
                   
                                 పేదల గూడు.. ‘ఉపాధి’ తోడునిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. నిర్మాణంలో ఎదురవుతున్న కూలీల కొరతను నివారించి పనులు నిరంతరంగా సాగేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. గ్రామీణస్థాయిలో అమలు కూడా ప్రారంభమైందని సమాచారం. లబ్ధిదారులకు ‘ఉపాధి’.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టే వారిలో జాబ్కార్డు కలిగిన లబ్ధిదారులకు నేరుగా 90 రోజుల పనిదినాలు కల్పించనుంది. ఈ విధానంతో ఇంటి నిర్మాణానికి కూలీలు అందుబాటులో ఉండడం మాత్రమే కాకుండా, లబ్ధిదారుడే తన ఇంటి నిర్మాణంలో భాగస్వామిగా మారి డబ్బులు సంపాదించుకునే అవకాశం పొందుతాడు. ఇంటి నిర్మాణ పనిని దశలవారీగా విభజించి, మొత్తం 90 రోజుల ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేస్మెంట్ స్థాయిలో 40 రోజుల పనిదినాలు, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పనిదినాలు కల్పిస్తారు. మొత్తం 90 పనిదినాలకు రూ.27,630 చెల్లిస్తారు. జిల్లాస్థాయిలో పురోగతి ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో 131 ఇళ్లను ఉపాధిహామీ పథకం కింద గుర్తించారు. ఇందులో గోడలస్థాయి వరకు 92 ఇళ్లు, స్లాబ్ దశకు చేరుకున్న 39 ఇళ్లు నిర్మాణ పనులను పూర్తి చేశాయి. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా, స్వగృహ నిర్మాణ ప్రాంతంలోనే రోజువారీ మస్టర్ వేసి కూలీ పొందవచ్చు. ఈ విధానంతో నిర్మాణ వేగం పెరగడంతోపాటు, కార్మిక శక్తి సమర్థంగా వినియోగించబడుతోంది. రెండు విధాలా ప్రయోజనం.. ఈ కొత్త సమీకరణ ప్రజల జీవితాల్లో రెండు విధాలుగా మార్పు తీసుకురానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగ కార్మికులకు స్థిరమైన పని లభిస్తుంది. ఇదే సమయంలో ఇళ్ల నిర్మాణ వేగవంతం అవుతుంది. పథకాల అమలులో ఆలస్యం తగ్గి వేగంగా పూర్తవుతాయి. మండలాలవారీగా ఉపాధి హామీ పథకానికి అర్హులు మండలం స్లాబ్లెవెల్ గోడలవరకు మొత్తం బాసర 0 5 5 భైంసా 13 11 24 దిలావర్పూర్ 0 4 4 కడెం 4 6 10 ఖానాపూర్ 0 6 6 కుభీర్ 3 7 10 కుంటాల 4 5 9 లోకేశ్వరం 6 6 12 మామడ 0 3 3 ముధోల్ 0 8 8 నర్సాపూర్(జి) 3 8 11 నిర్మల్ రూరల్ 2 5 7 సారంగాపూర్ 0 1 1 సోన్ 2 4 6 తానూర్ 2 13 15జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మంజూరైనవి 9,165 ముగ్గు పోసినవి 5,950 బేస్మెంట్ పూర్తయినవి 3,040 గోడలు పూర్తయినవి 500 స్లాబ్ పూర్తయినవి 50 పనుల వేగవంతానికి దోహదం ఇందిరమ్మ లబ్ధిదారుల గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించింది. అవరోధాలు అధిగమించి పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు పథకం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు ఉపాధి కూడా లభిస్తుంది. – విజయలక్ష్మి, డీఆర్డీవో
- 
      
                   
                                 భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలినిర్మల్చైన్గేట్: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి భవనాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను పెంపొందించేందుకు చేపట్టిన ప్రాధాన్యమైన కార్యక్రమం అన్నారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలని, భవనం చుట్టూ హద్దుల గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పట్టణంలోని బంగాల్పేట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ చందు జాదవ్, డీఈ తుకారాం రాథోడ్, ఏఈఈ చందన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు ప్రభాకర్, రాజు, ఎంపీడీవో గజానన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులు పరిశీలన కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాలో, అత్యంత నాణ్యంగా విగ్రహ రూపకల్పన జరగాలన్నారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆర్టీఏ అవినీతికి చెక్ !నిర్మల్దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తా కుభీర్: ప్రజా సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 101 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకోసం జీఎస్టీ 28 నుంచి 5శాతానికి తగ్గించి దీపావళి కానుక ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేక్, మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్, నాయకులు రమేశ్, నాగేష్, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్ మండలం భోరజ్, తానూర్ మండలం బెల్తరోడ, వాంకిడిలోని చెక్పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖ లో తనిఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్లైన్ ఆ ధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చె ల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏ సీబీ అధి కారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తని ఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్పోస్టు వద్ద, బెల్తరోడ చెక్పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది. కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. ఫైళ్లు తరలింపు.. ఆదిలాబాద్టౌన్: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై బోరజ్ చెక్పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు. సమస్యల పరిష్కారమెప్పుడో..! క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వేతన పెంపు, క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఆన్లైన్లో సేవలు.. వాంకిడి: చెక్పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ద్వారా టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్పోస్ట్ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బెల్తరోడాలో.. తానూరు: బెల్తరోడా చెక్పోస్టులోని ఫర్నిచర్ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్పోస్ట్ను ఎత్తివేసినట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు.
- 
      
                   
                                 భీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలినిర్మల్టౌన్: కుమురంభీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. బుధవారం భీం జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కుమురంభీం మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఆదివాసీ హక్కులకోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మామడ మండలంలోని పోతారంలో భీమన్న ఆలయంపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు షాకీ లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, రాజ్గోండు సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావు, జేఏసీ కన్వీనర్ మంద మల్లేశ్, వెంకురి శ్రీనివాస్, బోర్ర భీమేశ్, అత్రం రాజు, రామకృష్ణ, శ్రీనివాస్, ఉయిక భీంరావ్, పేనుక వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ‘ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి’నిర్మల్టౌన్: ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. బుధవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ పరిచయం చేసుకున్నారు. బస్సులో కూర్చున్న తర్వాత ఇలా వివరించారు. ‘అందరికీ నమస్కారం.. నా పేరు తాళ్ల అశ్విని.. నేను ఈ బస్ కండక్టర్ను.. నా పేరు భూమన్న.. ఈ బస్సు డ్రైవర్ను అంటూ.. ఈ బస్సు నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లేందుకు దాదాపు 4:30 నిమిషాలు పడుతుంది.. మిమ్మల్ని మీ గమ్య స్థానాలకు చేర్చాల్సిన బాధ్యత మాది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం అన్నారు. ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.
- 
      
                   
                                 ‘విద్యారంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం’ఖానాపూర్: విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న లక్సెట్టిపేట సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ రాజ్గోపాల్ను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలలుగా రూ.8 లక్షల బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య, తల్లిపై ఉన్న బంగారం సైతం అమ్మినప్పటికీ సమస్య తీరకపోవడంతో మూడు రోజుల క్రితం నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం కార్మికులు, ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, రవీందర్ రెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలినిర్మల్చైన్గేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కోసం వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించాలని తెలిపారు. ప్రతీ వేయింగ్ మిషన్కి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. లారీలు, కూలీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలి పారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించాలని సూచించారు. కొనుగోలు ఏజెన్సీ ల సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హార్వెస్టర్ల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. రోజువారీగా వరి ధాన్యం కొనుగోలు వివరాలు తనకు అందజేయాలని అధికారులను సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 యాచకుల లెక్కింపు!నిర్మల్చైన్గేట్:దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో యాచకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, రద్దీ వీధుల్లో నివసించే వారి జీవన స్థితి, ఆహార పద్ధతి, ఆరోగ్య పరిస్థితి, యాచనకు దారితీసిన కారణాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో మెప్మా అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, యాచకులు గుర్తింపు ఆధారాలు లేకపోవడం వల్ల వాటి ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు స్థలాలు మార్చుకుంటూ జీవనం సాగించడం వల్ల ప్రభుత్వ పథకాలు చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు సరైన డేటా సేకరణ ద్వారా పునరావాస విధానం రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం లెక్కింపు చేపట్టింది. ’మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ’ సర్వే మున్సిపాలిటీ ఏరియాల్లో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ పేరుతో సర్వే దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో చేపట్టింది. జిల్లాలో ఈ నెల 15 వరకు సర్వే చేశారు. మెప్మా ప్రాజెక్ట్ అధికారులు, రిసోర్స్ పర్సన్లు పట్టణాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతీ వ్యక్తి గురించి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక వివరాలు నమోదు చేశారు. లింగం, వయసు, కుటుంబ స్థితి, వివాహ స్థితిగతులు, మతం, కులం, మాతృభాష వంటి వివరాలతో పాటు యాచనకు గల కారణాలపై ఆరా తీశారు. వైకల్యం, వృద్ధాప్యం, వ్యసనాలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్రం రూ పొందించిన కొత్త నమూనాలో ఆరు విభాగాలుగా ప్రశ్నలు రూపొందించింది. వ్యక్తిగత సమాచారం, కుటుంబ మానవ వనరుల వివరాలు, భిక్షాటన స్వచ్ఛందమా, లేక బలవంతమా, రోజువారీ ఆదాయం, ఖర్చు పద్ధతులు, ప్రభుత్వం చేయూతనిస్తే యాచన మానుతారా, నైపుణ్య శిక్షణపై ఆసక్తి ఉందా, ఆహారం, ఆరోగ్యస్థితి, వైద్య సహాయం అవసరమా, భవిష్యత్ ఆశలు, ప్రభుత్వ సహకారంపై అభిప్రాయాలు, వివరాలు సేకరించారు. పునరావాసం కల్పించేలా.. ఈ సర్వే ద్వారా యాచకుల పూర్తి వివరాలు నమోదు చేసి, వారికి తగిన పునరావాస ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కేంద్ర ఉద్దేశం. సమగ్ర గణాంకాల ఆధారంగా సర్కారు కొత్త పథకాలు రూపొందించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సర్వేతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొత్త దిశగా అడుగుపెడుతోంది. జిల్లాలో గుర్తించిన యాచకులు.. మున్సిపాలిటీ యాచకుల సంఖ్య నిర్మల్ 32 భైంసా 03 ఖానాపూర్ 03
- 
      
                   
                                 ఘనంగా వెలుగుల పండుగలక్ష్మీ పూజలో ఎమ్యెల్యే రామారావు పటేల్, దీపావళి వేడుకల్లో కుటుంబంయూరప్లో లక్ష్మీపూజలో తెలంగాణవాసులు జిల్లా వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్ష్మీ పూజలు చేశారు. భైంసా పట్టణంలో వ్యాపారులు ఖాతా బుక్కులకు పూజలు చేశారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నివాసంతోపాటు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్రావు పటేల్, బీజేపీ నాయకుడు బి.మోహన్రావు పటేల్ నివాసాల్లో లక్ష్మీ పూజలు చేశారు. సాయంత్రం ముంగిళ్లలో దీపాలు వెలిగించారు. చిన్న, పెద్ద అందరూ కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కడెం మండలం లింగాపూర్కు చెందిన మనోజ్, ఇతర జిల్లాలకు చెందిన తెలంగాణ వాసులు యూరప్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నార్త్మెసిడోనియాలో ధనలక్ష్మీ పూజలు నిర్వహించారు. – నిర్మల్ టౌన్/భైంసాటౌన్/కడెం
- 
      
                   
                                 కోట ముందా.. పట్టా ముందా..!చుట్టూ ఎత్తయిన రాతికట్టడంతో, లోపల విశాలమైన స్థలంతో అద్భుతంగా నిర్మించిన ఈ కోట.. శ్యాంగఢ్. నిర్మల్ జిల్లా కేంద్రానికి స్వాగతం పలుకుతున్నట్లుగా, ఘనమైన గతచరిత్రకు రాచరికపు ఆనవాలు అన్నట్లుగా ఉంటుంది. ఇది ఎప్పుడో 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్లక్రితం అప్పటి కలెక్టర్ దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామనుకున్నారు. తీరా.. ఈ కోటలోపల భూమికీ పట్టా ఉన్నట్లు తేలడంతో విస్మయం వ్యక్తంచేశారు. ఈ కోట లోపలే కాదు.. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న పోరంబోకు భూములకూ ఎసరు పెడుతున్నారు. నిర్మల్–హైదరాబాద్ రోడ్డుకు పక్కనే ఉండటం, రెవెన్యూ వ్యవస్థలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇక్కడి సర్కారు జాగాలకు పట్టాలు పుట్టుకొస్తున్నాయి.
- 
      
                   
                                 సబ్ స్టేషన్ను సందర్శించిన ఆర్జీయూకేటీ విద్యార్థులుబాసర: బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు క్యాంపస్ ఆవరణలోని విద్యుత్ సబ్స్టేషన్ను మంగళవారం సందర్శించారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్ మార్గదర్శకత్వంలో అసోసియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ కె.మహేశ్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం పర్యవేక్షణలో ఈ క్షేత్రపర్యటన చేశారు. విద్యుత్ వ్యవస్థలు, సబ్స్టేషన్ కార్యకలాపాల పై విద్యార్థులు అవగాహన పెంచుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు. 180 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న భావనలను క్షేత్రపర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ భూక్య భావ్సింగ్, అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
- 
      
                   
                                 ● ఎస్పీ జానకీషర్మిల ● పోలీస్ అమరులకు ఘన నివాళినిర్మల్టౌన్: అందరూ నిద్రపోయినా.. పోలీసులు మాత్రం 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద కాగడా వెలిగించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో, అంతర్గత భద్రతలో పోలీసులు అంతే కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతీ సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని వివరించారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే అని వివరించారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబాలతో మాట్లాడారు. వారి పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 చెదరని నెత్తుటి జ్ఞాపకాలుఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఖానాపూర్లో అమరుల స్తూపంఖానాపూర్ పోలీస్ష్టేషన్లో పోలీసు అమవీ రుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్స్టేష న్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008 లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
- 
      
                   
                                 పత్రికాస్వేచ్ఛను హరించొద్దులక్ష్మణచాంద: పత్రికాస్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. నిజాలను నిగ్గు తేలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తప్పు పట్టారు. ఎడిటర్ ధనంజయరెడ్డి, పాత్రికేయులను అక్రమ కేసులతో వేధించడంపై మండిపడ్డారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పునరావృతం కానివ్వొద్దు నిజాలు వెలికితీస్తున్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించడం శోచనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – గోలి గంగాధర్, లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తప్పుడు కేసులు సరికాదు పత్రికాస్వేచ్ఛను హరించడం సరికాదని సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టడం సరికాదు. ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు వెంటనే ఎత్తి వేయాలి. – కోరుకొప్పుల రాజాగౌడ్, లక్ష్మణచాంద ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి
- 
      
                   
                                 అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో టీచర్జైనథ్: ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన అన్వేషిక ప్రయోగదర్శిని రూపకల్పనలో జిల్లా ఉపాధ్యాయుడికి చోటు లభించింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గోసుల సత్యనారాయణ 6వ తరగతి పాఠ్యాంశంలోని ప్రయోగ కృత్యాలను పుస్తకంలో పొందుపర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పాల్గొనగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ జ్ఞానం, విలువలు పెంపొందించడంతోపాటు ప్రయోగకృత్యాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ అంశాలు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.
- 
      
                   
                                 నిర్మల్మార్కెట్కు దీపావళి శోభజిల్లా ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు నిర్మల్టౌన్: జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ జానకీ షర్మిల శనివారం ఓ ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ప్రతీ ఇంట్లో వెలుగులు, సంతోషం, శాంతి నిండాలని ఆకాంక్షించారు. బంతిపూలు కొనుగోలు చేస్తూ.. వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం పండుగ కాగా, ఇప్పటికే ఇంటింటా దీపాల వెలుగులతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల పూలు, అరటి చెట్లు, అందమైన ఆకృతుల్లో మట్టి ప్రమిదలు, పూజ సామగ్రి, పటాకులు, వస్త్ర దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. – నిర్మల్టౌన్
- 
      
                   
                                 పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యలక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీచర గ్రామానికి చెందిన నైనం శేఖర్ (28) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం ఉదయం గ్రామసమీపంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్కు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
- 
      
                   
                                 ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శనకుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనూషకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం(జానపద) డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఎంఏ ఇంగ్లిష్ విద్యనభ్యసించగా, ఆమె భరతనాట్యంలో డిప్లొమా పూర్తిచేసింది. 2008లో మా టీవీలో వచ్చిన రేలారేలా కార్యక్రమంలో పాల్గొని జానపద పాటలు పాడారు. గురువు సముద్రాల మాధవీ రామానుజం వద్ద భరతనాట్యంలో మెలకవలు నేర్చుకుంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, భద్రాచలం, తిరుమల తదితర నగరాల్లో 400లకు పైగా, అమెరికా, యూకే, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తండ్రి ఆదిలాబాద్లో పనిచేయడంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. దేశ,విదేశాల్లో భరతనాట్య ప్రదర్శన చేసిన ఆమె ఎక్కడికెళ్లిన కుభీర్ వాసిగా చెబుతోంది.
- 
      
                   
                                 ‘పీవీటీజీల అభివృద్ధిపై నిర్లక్ష్యం’బేల: గిరిజన గ్రామాల పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. మండలంలోని సదల్పూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంరం సూరు, కుమురం భీం వర్ధంతికి ఆయన హాజరయ్యారు. పోరాటయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గతేడాది దేశంలోని పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 24వేల కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అందులో భాగంగా తెలంగాణలో రూ. 24 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏకు నిధులు కేటాయించారని తెలిపారు. పీవీటీజీలకు రూ. 60 లక్షలతో మల్టీహాల్ నిర్మించాల్సి ఉండగా కేవలం రూ.45 లక్షలతో నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. అంచనా వ్యయం తగ్గించడంలో అంతరాయం ఏముందని ప్రశ్నించారు. అనంతరం ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై నా కొడప సొనేరావ్ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్రావ్, డివిజన్ అధ్యక్షుడు టేకం గణేష్, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుమ్ర జలపత్రావ్, బేల మండల అధ్యక్షుడు కొడప జైవంత్, గ్రామ మాజీ సర్పంచ్ రాందాస్, ఆదివాసీ సీనియర్ నాయకుడు మడావి జంగు తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 వేదవతి శిలకు దారేది..?బాసర: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకు ని.. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ని త్యం వేల సంఖ్యలో భక్తులు బాసరకు వస్తుంటారు. దర్శనం అనంతరం బస్టాండ్ ఎదుట ఉన్న పురాత న వేదవతి శిల సందర్శనకూ వెళ్తుంటారు. ఈ వే దవతి శిలను మరో రాయితో కొడితే అమ్మవారి సప్తస్వరాలు చెవిలో వినిపిస్తాయని భక్తులు పే ర్కొంటున్నారు. కానీ, వేదవతి శిల దగ్గరకు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. ప్రస్తుతం శిల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలే ఉన్నాయి. ఆలయ అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రం చేసి సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
- 
      
                   
                                 పక్కాగా పంటల లెక్కలక్ష్మణచాంద: కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబ డులు విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని 19మండలాల్లోని 400 గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు. 3,66,430 ఎకరాల వివరాలు నమోదు జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏఈవోలు ప్రతీ పంట ఫొటో తీసి మొబైల్ యాప్లో పూర్తి స మాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో మహిళా ఏఈవోలు 1,800 ఎకరాలు, పురుష ఏఈవోలు 2వేల ఎకరాల్లోని పంటల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా వరి 1,14,638 ఎకరాలు, పత్తి 1,26,075, సోయాబీన్ 1,07,052, మొక్కజొన్న 12,835, కంది 5,719, పెసర 52, మినుము 59 ఎకరాలకు సంబంధించి పంటల నమోదు పూర్తి చేశారు. రైతులకు కలిగే ప్రయోజనాలు ఇప్పటికే 95శాతం పూర్తి వ్యవసాయశాఖ ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన పంటల వివరాల నమోదు 95శాతం పూర్తయింది. మిగతా ఐదు శాతం త్వరగా పూర్తి చేస్తాం. – అంజిప్రసాద్, డీఏవో
- 
      
                   
                                 గూడేల్లో సంబురంగా దండారీఖానాపూర్: దీపావళికి ముందు సంప్రదాయ ఉత్సవాల్లో ఒక్కటైన దండారీ ఉత్సవాలను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎత్మసార్, చాచో యి, సబాయి, పేన్ తదితర ఆదివాసీ దేవుళ్లకు పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. మహిళలు రేలారేలా నృత్యాలు చేస్తూ, పురుషులు కోలాటం ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడవి సారంగాపూర్, జిల్లెడుకుంట గ్రామాల్లో శనివారం రాత్రి, ఆదివా రం రోజంతా ప్రత్యేక పూజలు చేశారు. పెంబి మండలం వస్పల్లి కొత్తగూడేనికి చెందిన ఆదివాసీలు అడవి సారంగాపూర్లో నిర్వహించిన ఉత్సవాలకు హాజరయ్యారు. సింగాపూర్ గోండుగూడకు చెందిన ఆదివాసీలు జిల్లెడుకుంట గ్రామానికి చేరుకుని ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం దేవుళ్ల వద్ద భేటీలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా గుస్సాడీ వేషధారణలో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో భీంరావు పటేల్, అంకుశ్రావు పటేల్, ఆడె గంగారాం, ఆత్రం రాజేశ్వర్, శంభు, బీర్సావ్, దేవరావు, బారిక్రావు, అర్జున్ పటేల్, పెందూర్ బొజ్జు, శ్యాంరావు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కడెం: మండలంలోని మైసంపేట్, చిట్యాల్, ఇస్లాంపూర్, దోస్త్నగర్ తదితర ఆదివాసీ గూడేల్లో దండా రీ సంబురాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మై సంపేట్ ఆదివాసీలు మండలకేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
- 
      
                   
                                 సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్యసాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ఆది వారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై గౌతమ్పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన, పవార్ బాలాజీ(37) ఆరు నెలల క్రితం, ఉపాధి కో సం సాత్నాల మండలం రామయికి వలస వచ్చాడు. సీస కమ్మరిగా, చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ శని వారం రాత్రి భార్య, అత్తతో గొడవ పడ్డాడు. బామ్మర్దులు వారించారు. ఆదివారం ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ తమ్ముడు సంజయ్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గౌతమ్పవార్ తెలిపారు.
- 
      
                   
                                 చూసొద్దాం..జన్నారం అందాలు జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో అందాలు అస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి పచ్చని అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. 15 రోజుల్లో 600 పైగా మంది జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగా ణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చార ని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరా బాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. తెల్లవారు జామున, సూర్యకిరణాలు, చెట్ల మధ్యన పడటం ఆహ్లాదం పంచుతుంది. చెడిపోయిన దారులు.. గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగింది సఫారీ మొదలై 15 రోజు ల్లోనే పర్యాటకుల సంఖ్య పెరిగింది. వీకెండ్లో గదులు నిండిపోతున్నాయి. ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. – వీరేందర్, హరిత మేనేజర్
- 
      
                   
                                 బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా సురేశ్ఖానాపూర్: తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంత్రరాజం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపెల్లిలోగల మెట్రోపొలిటన్ క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్లో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సు రేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాగా, స్థానిక న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
- 
      
                   
                                 ప్రయత్నం ఫలిస్తోందిజిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను స్వయంగా కలిసి విన్నవించాను. వారు స్పందించి అవసరమైన మాస్టర్ప్లాన్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవడంతో నా ప్రయత్నం ఫలించినట్లవుతుంది. త్వరలో నే పనులు వేగవంతమయ్యే అవకాశముంది. – గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ ‘సాక్షి’ చొరవ అభినందనీయం ‘సాక్షి’ దినపత్రిక మార్చి 5న అన్ని వర్గాలతో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆయా వర్గాలవారు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ సాధనకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. అదే వేదికపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. దీంతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. వారు అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడంతో లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. – సోగాల సుదర్శన్, ఎయిర్పోర్టు సాధన అడహక్ కమిటీ సభ్యుడు
- 
      
                   
                                 మద్యం టెండర్లకు బారులునిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం రాత్రితో ముగిసింది. చివరి రోజు దరఖాస్తుకు చాలా మంది వచ్చారు. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విష యం తెలిసిందే. మొదటి నుంచి కొంత స్లోగా కొనసాగిన దరఖాస్తులు శుక్రవారం వరకు 413 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు శనివారం సాయంత్రం 6 గంటల వరకు మరో 342 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగనుంది. ఫీజు పెంపు దరఖాస్తులపై ప్రభావం చూపిందని భావించగా చివరి వరకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు అందినట్లు సమాచారం.
- 
      
                   
                                 నష్టపోయినా పట్టించుకోరా..?భైంసా/భైంసారూరల్: భైంసా – బాసర జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దేగాం వద్ద అసంపూర్తి కల్వర్టు నిర్మాణంతో నష్టపోయిన రైతులు పరిహారం ఇవ్వాలని శనివారం నిరసనకు దిగారు. గ్రామానికి చెందిన మహిళా రైతులు ఉమ, శీల మాట్లాడుతూ ఇటీవల ఇంటి ముందు సోయా పంట ఆరబెట్టగా భారీ వర్షంతో డ్రైనేజీ నుంచి వచ్చిన నీళ్లకు పంట కొట్టుకుపోయింది. కల్వర్టు నీటిని సంబంధిత కాంట్రాక్టరు వాగులోకి మళ్లించకపోవడంతో నష్టపోయామని పేర్కొన్నారు. అదే రోజు అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో నిరసనకు దిగారు. అయినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ఓ దశలో ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలను పట్టుకున్నారు. గమనించిన గ్రామస్తులు డబ్బాలను లాక్కున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు మేమేం చేస్తాం అంటూ దురుసుగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే పంట కొట్టుకుపోయిందని పరిహారం ఇవ్వాల్సిందే అని బాధిత రైతులు కోరుతున్నారు.
- 
      
                   
                                 కాలయాపనకరెంటు సమస్యలపై మంచిర్యాలఅగ్రికల్చర్: సాంకేతిక లోపమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ కొందరి ఇళ్లలో కరెంటు మీటరు గిర్రున తిరుగుతోంది. రూ.వేలల్లో వస్తున్న బిల్లులతో వినియోగదారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నెలలు గడిచినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, హై ఓల్టేజ్, ప్రమాదకరంగా ఉన్నత స్తంభాలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ప్రతీ సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులతోపాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలతో పశువులు, మూగజీవాలు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దండేపల్లి మండలం విద్యుత్ స్తంభానికి షాక్ వస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే స్తంభానికి తగిలి పశువు, లేగదూడ చనిపోవడంతో తేరుకుని సవరించారు. వినియోగదారులు నేరుగా, ఆన్లైన్, మొబైల్ ద్వారా ఏ ఫిర్యాదు అందించినా వెంటనే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచిస్తున్నారు. అయినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండు నెలలు గడిచింది.. ఆర్ఆర్నగర్లోని తన ఇంటికి గత కొన్ని నెలల నుంచి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు వస్తోందని విద్యుత్ అధికారులకు, ఆగస్టు 4న ప్రజావాణిలో ఎస్ఈకి ఫిర్యాదు చేశాను. రూ.150 చెల్లిస్తే సిబ్బంది మీటర్ను పరిశీలిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్ డీఈ ఆపరేషన్ పేరిట నగదు చెల్లించి రెండు నెలలైంది. వందల్లో రావాల్సిన బిల్లు వేలల్లో వస్తోంది. ఈ నెల రూ.3,882 బిల్లు చెల్లించాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. – జోగుల విజయ, మంచిర్యాల
- 
      
                   
                                 జాతీయస్థాయిలో గుర్తింపు హర్షణీయంఉట్నూర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 17న నిర్వహించిన జాతీయ సదస్సులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్తో పాటు జిల్లా మాస్టర్ ట్రైనర్లు అర్క వసంత్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లు రాజేశ్బాబు, నందకిషోర్ పాల్గొన్నట్లు తెలిపారు. పథకాల అమలులో వారు చేసిన కృషికి పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు.
- 
      
                   
                                 మొక్కలను నిర్లక్ష్యం చేస్తే చర్యలునర్సాపూర్ (జి): గ్రామాల్లో మొక్కలు నాటి నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో 4వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను శనివారం నిర్వహించారు. 13 గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.57 కోట్లతో చేపట్టిన పనులను డీఆర్పీలు, వీఆర్పీలు చదివి వినిపించారు. పనులపై తనిఖీ నిర్వహించగా 13 గ్రామ పంచాయతీల పరిధిలో 74,932 మొక్కలు నాటగా 40,703 మొక్కలు చనిపోయినట్లు రికార్డుల్లో తేలడంతో ఫీల్డ్ అసిస్టెంట్లపై డీఆర్డీవో విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, మస్టర్లలో కూలీల సంతకాలు, పనుల్లో తేడా, హాజరు లేకుండా వేతనాల చెల్లింపు వంటి తప్పిదాలకు రూ.31,766 రికవరీకి ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయం, నాడెపు కంపోస్టు ఎరువు తయారీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మిద్దె తోటలు, ఆగ్రో ఫారెస్ట్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. నర్సరీలలో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలన్నారు. ప్రజా వేదికకు హాజరుకాని వారిపై కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లక్ష్మయ్య, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్ఆర్పీ రాజు, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పీఆర్ ఏఈ క్రాంతి, ఏపీవో జగన్నాథ్, టీఏలు రవీందర్, సతీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేతసాత్నాల: భోరజ్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్సైకి సమాచారం సమాచారం అందించడంతో ఆవులను ఇచ్చోడలోని గోశాలకు తరలించారు. డ్రైవర్ గురురవాల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోహన్గౌడ్, పైమా సుల్తానా, జాదవ్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 కన్నతండ్రినే కడతేర్చాడు..జన్నారం: మద్యానికి బాని సైన కుమారుడు తన కన్నతండ్రినే కర్రతో కొట్టిచంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్నగర్కు చెందిన జాదవ్ శంకర్నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు సంతానం. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్యాన్సర్తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్నాయక్ తప్పించుకున్నాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్సింగ్ను బెదిరించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. కాలనీవాసులు నిలదీయడంతో పరారయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
- 
      
                   
                                 బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలుబాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. విజయయాత్రలో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్ల గర్భాలయాలలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేక, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం పూజల అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ హిందువు కర్తవ్యమని, ధార్మిక విలువలతో జీవించడం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం..బాసరలో నూతనంగా నిర్మించిన లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. వేలేటి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంజనాదేవి, బాసర గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదాలు అందజేస్తున్న శృంగేరీ పీఠాధిపతి మహాకాళి అమ్మవారి ఆలయంలో హారతి ఇస్తున్న విధుశేఖర భారతీస్వామి
- 
      
                   
                                 స్వర్ణ వాగులో పడి ఒకరు మృతిసారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. బోరిగాంలో ఉంటున్న అతని అక్క పోశవ్వ మూడు రోజుల క్రితం తన ఇంటికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భోజన్న తిరిగిరాలేదు. శనివారం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
- 
      
                   
                                 అధికారి చెప్పినా ఆగని దందాదీపావళికి స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో అనుమతి లేకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష ఈ నెల 14న తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత వదిలేయడంతో నిర్వాహకులు మళ్లీ స్వీట్ దందా మొదలుపెట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
- 
      
                   
                                 పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్పూల్ గెస్ట్హౌస్లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, 8 సెల్ఫోన్లు, ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదుపుతప్పి కారు బోల్తా నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వరంగల్కు చెందిన ఐదుగురు స్నేహితులు కారులో షిరిడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ వెళ్లే క్రమంలో స్థానిక కంచరోని చెరువు కట్ట రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ అదుపుతప్పి వైద్యుడు మృతి తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్ గ్రామానికి చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలయ్యారు.
- 
      
                   
                                 బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–14 బాస్కెల్ బాల్ పోటీలు శనివారం నిర్వహించా రు. ఎంపీడీవో రాధ, ఎంఈవో అశోక్వర్మ పో టీలను ప్రారంభించారు. ఇందులో ప్రతిభ కనభరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేశారు. బాలుర జిల్లా జట్టు.. వై.ముత్యం, ఎస్.శరత్, ఎస్.సంజుపాల్, రిషి, సాత్విక్, హర్షిత్, వెంకటరమణ, శ్రియాన్, రాకేశ్, లోకేష్, సుశీల్జాన్సన్, బన్నీ, స్టాండ్ బైలుగా లేవినోస్, నిఖిలేష్, శివకుమార్. బాలికల జిల్లా జట్టు.. సహస్రరెడ్డి, కీర్తన, జగశ్రీ,సమికేశ్రెడ్డి, వెన్నెల, రినూత్న, నిహారిక, హర్షిత, దీక్షిత, అమూల్య, నందిని, ప్రణవి, స్టాండ్బైగా నైనిక .17 మందిపై కేసు లోకేశ్వరం: మండలంలోని బామ్ని(కే) గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిపి 17 మందిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన రైతు నడిషారం మైసన్న గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు ప్రాంతంలో రెండు ఎకరాల శిఖం కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని పశువులను మేపేందుకు ఖాళీగా వదిలేయాలని వీడీసీ సభ్యులు మైసన్నను అదేశించారు. అయినా ఈ ఏడాది వరి సాగు చేశాడు. దీంతో వీడీసీ సభ్యులు మైసన్నతో ఎవరూ మాట్లాడొద్దని తీర్మానం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                 సౌత్జోన్ పోటీలకు ఎంపికమంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది. నవంబర్ 21 నుంచి 23 వరకు బెంగళూర్లో జరిగే సౌత్జోన్ టోర్నమెంట్లో యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్గా వ్య వహరించనుంది. శనివారం కళా శాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, శ్రీధర్రావు అభినందించారు.
- 
      
                   
                                 పత్రికా స్వేచ్ఛపై దాడి ఆక్షేపణీయంనిర్మల్టౌన్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై సాగిస్తున్న నిర్బంధకాండను నిర్మల్ జిల్లాకేంద్రంలో అన్ని పాత్రికేయ సంఘాలు, నిర్మల్ ప్రెస్ క్లబ్ ముక్తకంఠంతో ఖండించాయి. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలే కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. వార్తలు రాస్తే పోలీసులతో విచారణ చేయించే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి విచారణ పేరిట నిర్బంధం చేయడం ఖండిస్తున్నామన్నారు. నిరసనలో సీనియర్ జర్నలిస్టులు అల్లం అశోక్, శ్రీనివాస్, రాసం శ్రీధర్, జల్ద మనోజ్, గుమ్ముల అశోక్, శ్రీనివాస్, పూసల పోశెట్టి, రాంపల్లి నరేందర్, వసి ఉల్లాఖాన్, దాసరి వేణుగోపాల్, రామేశ్వర్, సురేశ్, ప్రశాంత్, అక్తర్, శశికాంత్, హరీశ్, రాహుల్గౌడ్, భోజన్న, ప్రేమ్, శేషగిరి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే(143), టీఎస్జేయూ, టీజేడబ్ల్యూఎఫ్, జాట్, మున్నూరుకాపు జర్నలిస్టు అసోసియేషన్ తదితర పాత్రికేయ సంఘాలతోపాటు నిర్మల్ ప్రెస్క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.ప్రభుత్వం తీరు సరికాదు.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికావ్యవస్థను ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాజకీయ ధోరణిలో సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఎంతమాత్రం సరికాదు. దీన్ని ఖండిస్తున్నాం. –వసీఉల్లాఖాన్, నిర్మల్ ప్రెస్క్లబ్ కార్యదర్శిస్వేచ్ఛను అడ్డుకోవడమే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిని విచారణ పేరిట గంటలపాటు నిర్భంధంలో ఉంచడం పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది. ప్రభుత్వాలు ఈ కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. – ఎంఏ.వసీమ్, నిర్మల్ ప్రెస్క్లబ్ గౌరవ సలహాదారుపత్రికాస్వేచ్ఛకు విఘాతం.. ఏ ప్రభుత్వమైనా పత్రికాస్వేచ్ఛను కాపాడేందుకు కృషిచేయాలే కానీ.. ఇలా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సమంజసం కాదు. సాక్షిపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్బంధకాండను వ్యతిరేకిస్తున్నాం. –పొన్నం రాహుల్గౌడ్, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్) జిల్లాబాధ్యుడు నిర్బంధకాండను సహించేది లేదు.. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేస్తున్న నిర్బంధకాండను సహించేది లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పోలీసులు కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తాం. – అల్లం అశోక్, టీయూడబ్ల్యూజే(143) నేషనల్ కౌన్సిల్మెంబర్
- 
      
                   
                                 రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా లింగన్ననిర్మల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం సాయంత్రం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శి శంకర్రెడ్డి వ్యవహరించారు. 17 పదవులకు నామినేషన్లు స్వీకరించారు. పోటీ లేకపోవడంతో అధ్యక్షుడితోసహా మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎంసీ.లింగన్న, ప్రధాన కార్యదర్శిగా కె.పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా ఎల్.గంగన్న, అసోసియేట్ ప్రెసిడెంట్గా బి.రమేశ్కొండు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎ.పోశెట్టి, డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు, డాక్టర్ ఎ.రజిని, కార్యదర్శులుగా పి.విలాస్, ఎంఏ.కరీం, సంయుక్త కార్యదర్శులుగా రామాగౌడ్, జనార్దన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.రాజేశ్వర్, సుజాతదేవి, ప్రచార కార్యదర్శిగా కె.రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.సత్తయ్య, సీహెచ్.వెంకటేశ్వర్రావు, కె.పోశెట్టి ఎన్నికయ్యారు. తాను అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎంసీ.లింగన్న ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇలాగే విశ్రాంత ఉద్యోగులకు సేవలతోపాటు సామాజిక, లీగల్ వాలంటరీ సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
- 
      
                    నిర్మల్బాసరలో శృంగేరీ పీఠాధిపతి.. బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఉదయం 7 గంటల నుంచే బీసీ కుల సంఘాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు బీసీ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బంద్లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిర్మానుష్యంగా నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్
- 
      
                   
                                 దరఖాస్తు గడువు పొడిగింపుకాగజ్నగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కొరిపెల్లి రేణుకాదేవి శుక్రవారం తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే ఉండిపోయింది. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అడవిలో అరుదైన ‘హైగ్రోసైబ్ పెల్లిసిడా’ జన్నారం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నార్త్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎనగందుల వెంకటేశ్ శనివారం కవ్వాల్ టైగర్జోన్లో శిలీంద్ర జాతికి చెందిన అరుదైన హైగ్రోసైబ్ పెల్లిసిడాను కనుగొన్నారు. 2024లో కేరళ రాష్ట్రంలోని హైగ్రోఫోరేసి కుటుంబంలో ఒక కొత్త జాతిగా మొదటిసారి కనుగొన్నారు. చిన్న, సున్నితమైన అగారిక్ ఫంగస్ అని తెలిపారు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు, చిత్తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని, దీనిని వాక్స్కప్ అని పిలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్జోన్లో మొదటిసారి నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు.
- 
      
                   
                                 ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్టుభీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో ఈనెల 15న చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజీ ఽఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సిరికొండ లక్ష్మణ్, మహా రాష్ట్రలోని రాజూరా తాలూకా చున్నాల గ్రామానికి చెందిన కాకట్ల కేశవరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈఇద్దరు నిందితులపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన భీమారం ఎస్సై శ్వేత, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, సిబ్బంది మల్లయ్య, కిరణ్ను సీఐ అభినందించారు.
- 
      
                   
                                 ప్రజల గొంతుక అయిన ‘సాక్షి’జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ అవశ్యకత.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ‘సాక్షి’ గుర్తించింది. దశాబ్దాల కల సాకారం చేయాలని సంకల్పిస్తూ వారి తరఫున గొంతెత్తింది. తొలుత చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ ఆయా వర్గాల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ‘మామా.. ఎయిర్పోర్ట్ వస్తే మనకేమొస్తది’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. తద్వారా ఈ ప్రాంత పాలకులపై ఒత్తిడి పెరిగింది. వారు చట్టసభల్లో గళమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా, పార్లమెంట్లో ఎంపీ నగేశ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం అసెంబ్లీ సాక్షిగా స్పందిస్తూ ‘ఆదిలా బాద్కు ఎయిర్పోర్ట్ తెస్తా.. అది నా బాధ్యత’ అంటూ జిల్లా వాసులకు భరోసా కల్పించారు. ఆ వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ ఽశాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ‘ రెక్కలొస్తున్నాయి..’ అంటూ ‘సాక్షి’ జిల్లావాసులకు తీపికబురు అందించింది. తాజాగా ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. ఎయిర్పోర్టుతో పాటు ఎయిర్ఫోర్సు స్టేషన్ నిర్మాణానికి ఏఏఐ మాస్టర్ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానుండడంపై జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ‘సాక్షి’ చొరవను సర్వత్రా కొనియాడుతున్నారు.
- 
      
                   
                                 జీవాలకు టీకా భరోసాలక్ష్మణచాంద:పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 15న జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. 19 మండలాల్లో టీకా కార్యక్రమం జిల్లాలోని 19 మండలాల పరిధిలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో ఈ టీకా కార్యక్రమం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ సమాచారం ప్రకారం జిల్లాలో 48,496 ఆవులు, 55,027 గేదెలు ఉన్నాయి. మూడు నెలల వయసు దాటిన పశువులకు జాతీయ పశు వ్యాధుల నివారణ పథకం కింద టీకాలు వేస్తున్నారు. 39 బృందాలు రంగంలోకి ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు అవ్వడానికి జిల్లాలో 39 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 15న ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. అధికారులు రెండు లక్షల జీవాలకు టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన టీకాల మొత్తం నిల్వ ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు రోజు ప్రతీ గ్రామంలో టాంటాం ద్వారా సమాచారం అందిస్తున్నారు. రైతులు తమ పశువులకు టీకా చేయించేందుకు సిద్ధంగా ఉండాలని శాఖ సూచిస్తోంది. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకే బృంద సభ్యులు గ్రామాల్లోకి చేరి పశువులకు టీకాలు వేస్తున్నారు. టీకా వేసిన పశువుల చెవికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేయడం ద్వారా వివరాలు ‘‘భారత్ పశుధన్’’ యాప్లో నమోదు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పాడి పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులు ఉన్న ప్రతీరైతు తన పశువులకు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నవంబర్ 14 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. – ఎండీ.బాలిగ్ అహ్మద్, జిల్లా పశు వైద్యాధికారివైరస్ కారణం, లక్షణాలు
- 
      
                   
                                 ‘మద్యం’.. దూరం పెట్టండి● టెండర్ల దశలోనే ఫిర్యాదులునిర్మల్: మద్యం దుకాణాల టెండర్ల వేళ పలు గ్రా మాల ప్రజలు వైన్షాపులపై ఫిర్యాదులు చేస్తున్నా రు. తమకు ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను తొ లగించాలని గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డి మాండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలంతా కలెక్టరేట్కు వచ్చి నేరుగా ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తెస్తున్నారు. మద్యం దుకాణాలను ఇప్పుడు మార్చకపోతే మరో రెండేళ్లు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆయా ఫిర్యాదులపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. బడికి.. గుడికి దగ్గరలో.. ఎకై ్సజ్ శాఖ నిబంధనల ప్రకారం బడి, ప్రార్థన మందిరాలకు కనీసం 100మీటర్ల దూరంలో మ ద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులకు 50మీటర్ల దూరంలో ఉండాలి. చాలా చోట్ల నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఏ ర్పాటు చేయడంలేదు. కొన్నిచోట్ల పాఠశాలలు, ఆలయాలు, నివాస సముదాయాలకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో దాదాపు ఐదారు దుకాణాలు హైవేపైనే ఉన్నాయి. మండల కేంద్రాలు, మేజర్ గ్రామాల్లో చాలాచోట్ల పాఠశాలలకు వెళ్లేదారుల్లోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. రోడ్డుపైనే తాగుతూ.. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రో డ్డుపైనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఇక్కడ తరచూ మందుబాబులు రోడ్డుపైనే బైక్లు నిలిపి మద్యం సేవిస్తున్నారు. గ్రామస్తులు పలుసార్లు చె ప్పినా తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం సేవించిన తర్వాత ఇష్టారీతిన వాహనాలు నడపడంతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. చీకటి పడుతోందంటే మహిళలు ఆ దారి లో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒంటరి మ హిళలైతే జంకుతున్నారు. భైంసాలోనూ ఓ ప్రైవేట్ పాఠశాలకు సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. ఇక్కడ కూడా పలుసార్లు అభ్యంతరాలు వచ్చాయి. కుంటాల మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా మద్యం దుకాణం ఉందని స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పుడు మారిస్తేనే.. సమాజాన్ని మత్తులో ముంచే మద్యానికంటే ముందు గ్రామాన్ని ఉన్నతంగా నిలిపే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. పాఠశా లలు, ఆలయాలు, బీడీ కంపెనీలు, రోడ్లకు దగ్గరలో మద్యం దుకాణాలు పెట్టి ఇబ్బందుల పాలుచేయొద్దని కోరుతున్నారురు. సిర్గాపూర్లో ఏకంగా మద్యం దుకాణం వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశా రు. గ్రామ పెద్దలంతా కలిసి కలెక్టరేట్లో పలుసార్లు కలెక్టర్ను కలిసి విన్నవించారు. కలెక్టర్, అధికారులు సానుకూలంగా స్పందించగా.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త దుకాణాల కు మళ్లీ పాతచోట అనుమతివ్వొద్దని, తమను మ రో రెండేళ్లు ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు.
- 
      
                   
                                 నిర్మల్చూసొద్దాం తుర్కం చెరువు నల్దుర్తి తుర్కం, వెంగన్న చెరువులు ఎకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటి అందాలను తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పించింది.IIలోu రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక సోన్: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి గోవిజ్ఞాన ప్రతిభ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సోన్ జెడ్పీఎస్ఎస్కు చెందిన విద్యార్థినులు జోష్ణవి, శివరాత్రి గీతిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఆరాధన శుక్రవారం తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. నిర్మల్: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, భూకబ్జాలకు నిర్మల్ జిల్లా కేరాఫ్గా మారింది. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే రూ.కోట్ల విలువ చేసే భూముల ను కొల్లగొడుతున్నారు. వరుస ఫిర్యాదులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో జిల్లా అధికారుల్లో కొంత కదలిక కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే భూఆక్రమణ లు, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడుతున్నారు. తాజాగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట (అయ్యప్ప ఆలయం) ఎదురుగా ప్రభుత్వ భూ మిలో చేపట్టిన నిర్మాణాలను కలెక్టర్ ఆదేశాల మేర కు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ‘గొలుసుకట్టు’కూ భంగం కలిగించేలా.. దివ్యనగర్లోని 534 సర్వేనంబర్లో స్థానికులు బతుకమ్మకుంటగా పిలుచుకునే కుంటనూ సగానికి పైగా ఆక్రమించారు. నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో భాగమైన గొల్లపేట చెరువు, డిగ్రీ కళాశాల ఎదురుగా గల ఇబ్రహీం చెరువులను కలి పేలా మధ్యలో ఈ కుంట ఉంటుంది. గొల్లపేట చె రువు అలుగు నుంచి ఈ కుంట ద్వారా ఇబ్రహీం చె రువులోకి నీరు చేరుతుంది. కానీ.. ఇక్కడ అలుగునీరు పారే కాలువను వెంచర్లో ఓ డ్రైనేజీగా మార్చి నిర్మించడం గమనార్హం. ఇక పెద్దగా ఉన్న కుంటను క్రమక్రమంగా చిన్నగా మార్చేశారు. రూ.కోట్లు కొల్లగొడుతూ.. నిర్మల్ జిల్లాకేంద్రమైన తర్వాత భూముల విలువ ఆకాశాన్నంటాయి. ఎకరం రూ.కోట్లలో పలుకుతోంది. అలాంటి విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయ్యప్ప టెంపుల్ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వే నంబర్లలో అసైన్డ్ భూముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు చేశారు. కొన్నిచోట్ల ము న్సిపల్ టౌన్ప్లానింగ్లో ఉన్న రోడ్లనూ మాయంచేసి ప్లాట్లుగా మలిచి అమ్మేశారు. ఇక్కడ కేవలం ఒక్క ప్లాట్ ధరనే రూ.40–50 లక్షల వరకు ఉందంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడాబాబులు ఎకరాల్లో కబ్జా చేసిన సర్కారు జాగా ఎన్ని కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అసైన్డ్ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు ‘బుల్డోజర్’లు ప్రయోగించాల్సిందేనని నిర్మల్వాసులు కోరుతున్నారు.అసైన్డ్ పేరిట భూస్వాహా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్ భూముల పేరిట ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్లో మొత్తం 29.03 ఎకరాల్లో అసైన్డ్ పోనూ మిగతా 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. తమ భూమితో పాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగోడలు కట్టేశారు. అసలు.. అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చినా జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అయ్యప్ప టెంపుల్ ఎదురుగా దివ్యగార్డెన్ పక్కన ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్తో తొలగింపజేశారు.
- 
      
                   
                                 నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?నిర్మల్/భైంసాటౌన్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎడిటర్ ధనంజయరెడ్డిని వి చారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ పట్ట ణంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువు రు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్ర భుత్వం కక్ష సాధింపు చర్య లకు పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. మీడి యా స్వేచ్ఛ హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడడం ప్ర జాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెలిపారు. ‘సాక్షి’ యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో జర్నలిస్టులు కృష్ణ, లింగారా వు, రామకృష్ణ, రామకృష్ణ, మార్కండేయ, సతీ శ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఆంధ్రపదేశ్ పోలీసులు విచారణ పేరిట ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై గత కొద్దిరోజులుగా నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛను హరించడమే. దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. – వెంకగారి భూమయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దాడులు సమంజసం కాదు ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం పత్రికాస్వేచ్ఛపై దాడే. రాజకీయ కక్షను పత్రికపై తీర్చుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే ఏపీ ప్రభుత్వం దాడులు ఆపాలి. – శ్రీనివాస్చారి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛను కాపాడాలి ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యహరిస్తు న్న తీరును పాత్రికేయులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ప్రభుత్వాలు పత్రికాస్వేచ్ఛను కాపాడేలా ఉండాలి. – ధర్మపురి శ్రీనివాస్స్వామి, టీఎస్జేయూ రాష్ట్రకార్యదర్శి రాజకీయ కక్ష సాధింపే.. ఏ మీడియా సంస్థౖపైనెనా ప్రభుత్వాలు, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీ య కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – బాస లక్ష్మీనారాయణ, నిర్మల్ ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి
- 
      
                   
                                 ‘ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసేదాకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని సమితి కన్వీనర్ నంది రామయ్య హెచ్చరించారు. శుక్రవారం ఖానాపూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టణంలోని 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కో రారు. ఈ స్థలంలో మిగులు భూమిపై సర్వే వివరా లు వెల్లడించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఖానాపూర్లో ఏర్పాటు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూర్కు తరలించుకుపోవాలని చూడడం సరికాదన్నారు. సమి తి గౌరవాధ్యక్షుడు సాగి లక్ష్మణ్రావు, కో కన్వీనర్లు ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, బీసీ రాజ న్న, ప్రధాన కార్యదర్శి కాశవేణి ప్రణయ్, కోశాధికా రి ఎనగందుల నారాయణ తదితరులున్నారు.
- 
      
                   
                                 ‘బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు’నర్సాపూర్ (జీ): బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని డీసీసీ అధ్యక్షు డు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చే పట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతూ కాంగ్రెస్పైనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీసీ బిల్లుపై ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, నిర్మల్, భైంసా ఏఎంసీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, ఆనంద్రావుపటేల్, మాజీ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, నాయకుడు గడ్డం ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 బంద్ను విజయవంతం చేయాలినిర్మల్ టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల 18న తలపె ట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. అగ్ర కులాల వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం ఉన్న బీసీలను రాజకీయంగా వెనుకకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ ని హెచ్చరించారు. బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణగౌడ్, నాయకులు అనుముల భాస్కర్, డాక్టర్ కత్తి కిరణ్, అశోక్నాయక్, ప్రశాంత్, శివాజీ గౌడ్, నవీన్ తదితరులున్నారు.
- 
      
                   
                                 ఇంటిగ్రేటెడ్ ఫామ్స్పై దృష్టి సారించాలిదస్తురాబాద్: ఇంటిగ్రేటెడ్ ఫామ్స్పై ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు దృష్టి సారించాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నాలుగో విడత ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించగా హా జరై మాట్లాడారు. భవిష్యత్లో ఉపాధిహామీ పథకంలో ఇంటిగ్రేటెడ్ పనులకే ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో పాశువుల పాకలు, గోట్ షెడ్లు, వర్మీ కంపోస్టు తదితర నిర్మాణాలు చేపట్టే అవకాశముందన్నారు. అంతకుముందు 13 గ్రామపంచాయతీల పరిధిలో 2024–2025లో చేపట్టిన పనులపై ప్రజావేదికలో సమీక్ష నిర్వహించా రు. ప్రజావేదికలో ఫీల్ అసిస్టెంట్లు, టీఏలు, పంచా యతీ కార్యదర్శులు చేసిన అవకతవకల గురించి సోషల్ ఆడిటర్లు వివరించారు. సామాజిక తనిఖీలో 13గ్రామపంచాయతీల పరిధిలో రూ.96,888 నిధు లు దుర్వినియోగమైనట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని, కార్యదర్శుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరా జ్ శాఖ అధికారులు సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు అందజేయకపోవటంతో వారు చేసిన ప నులపై ఆడిట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. హె చ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఏవీవో లక్ష్మయ్య, ఆడిట్ మేనేజర్ అశోక్కుమార్, ఎస్పీఎం దత్తు, ఎస్ఆర్పీ మహేశ్, ఎంపీడీవోలు సునీత, రమేశ్, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నికనిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి రామ్మోహన్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా కడార్ల రవీంద్ర, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా భూమన్నయాదవ్, జాయింట్ సెక్రెటరీగా లక్ష్మీపతి, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్రావు, ట్రెజరర్గా రతన్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా మంత్రి ప్రకాశ్, ఉపాధ్యక్షులుగా గంగామోహన్, సునీల్రెడ్డి, గంగా కిషన్, రాజేశ్వర్రెడ్డి, గణపతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నవీన్గౌడ్, గంగాధర్, తిరుమల్రెడ్డి, ముత్తన్న, రాహుల్, ఎర్రన్న, చంద్రశేఖర్రెడ్డి, చిన్నారెడ్డి, రాజేశ్వర్, మహిళా కార్యదర్శులుగా సంధ్యారాణి, లక్ష్మి, గీతారామచందర్, స్వాతి, విక్రాంతి, శైలజ ఎన్నికయ్యారు.
- 
      
                   
                                 పెన్షనరీ బెనిఫిట్స్ కోసం కలెక్టర్కు వినతినిర్మల్చైన్గేట్:రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేలా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి, పెన్షన్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, లోలం గంగన్న , పోతారెడ్డి, కే రమేశ్, పి.జనార్దన్, బి.కిషన్రావు, పోతన్న, పోశెట్టి, వేణుగోపాల్, కే.రాములు, జాప రాములు, లక్ష్మణ్, రాజేశ్వర్, గంగాధర్, కరీం, హుస్సేన్, యూసుఫ్ అహ్మద్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..నిర్మల్చైన్గేట్:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్, విలాస్, ఒడిసెల అర్జున్, సాగర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పంటల కొనుగోళ్లకు సిద్ధం కావాలిభైంసాటౌన్:ఖరీఫ్ పంటల కోతలు మొదలైన నేపథ్యంలో ఉత్పత్తుల కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ కార్యాలయంలో గురువారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోయా, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయని తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు కిసాన్ కపాస్ యాప్ అమలు చేస్తోందని, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు రాకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, రైతు నాయకుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, వైస్చైర్మన్ ఫారూక్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, ఆర్టీఏ, అగ్నిమాపక, పోలీస్, పీఏసీఎస్ అధికారులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 చేయి తడిపితేనే అనుమతినిర్మల్చైన్గేట్:వెలుగుల పండుగ అయిన దీపావళికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో టాపాసుల దుకాణాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. అయితే జిల్లాలో టపాసుల వ్యాపారానికి దళారుల బెడద ఇబ్బందిగా మారింది. దుకాణాల ఏర్పాటు, అనుమతుల పేరుతో కొందరు వ్యక్తులు వ్యాపారుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణం కోసం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘‘అన్ని శాఖల ఫార్మాలిటీలు మనమే చూసుకుంటాం’’ అంటూ, ఇప్పటికే దళారులు వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఖరీదైన వెలుగుల పండుగ టపాసుల దుకాణాల ఏర్పాటుకు తోడు పోలీసులు, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అగ్నిమాపక శాఖలకు ఎప్పటిలాగే ఖర్చులు తప్పడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు రోజుల అమ్మకానికి ఒక్క దుకాణం కోసం రూ.40 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చులు తుదకు వినియోగదారులపై పడే అవకాశముందని, టపాసుల ధరలు కూడా ఈసారి భారీగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు సూచిస్తున్నారు. నిర్మల్లో ఏటా దీపావళికి సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన టపాసులు అమ్ముడవుతాయి. ఈసారి మాత్రం వ్యాపార ఖర్చులు పెరగడంతో ధరల భారమంతా ప్రజలపై పడే అవకాశం ఉంది. అనుమతుల పేరిట.. జిల్లాలో ప్రతీ దీపావళికి తాత్కాలిక టపాసుల మార్కెట్ ఏర్పాటు నియమిత ప్రక్రియగా మారింది. అయితే కొన్నేళ్లుగా కొందరు దళారులు గ్రూపులుగా ఏర్పడి ఈ ప్రక్రియను అదుపులోకి తీసుకున్నారు. ఒక దుకాణం సెటప్కి రూ.10 నుంచి రూ.12 వేల వ్యయం ఉంటే, అదనంగా అంతే మొత్తాన్ని ‘సాయం’ పేరుతో తీసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 60 దుకాణాల వరకు ఏర్పాటైనా, వాటిలో సగానికి మాత్రమే అధికారిక లైసెన్సులు ఫీజు చెల్లించి పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరికీ చెల్లింపులు.. ఈ ఏడాది నిర్మల్ కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 65కి పైగా టపాసుల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతీ దుకాణం పేరుతో రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక విభాగాలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతేకాక, ఇప్పటికే లైసెన్సు పొందిన వ్యాపారులు తమ అనుమతులు తాత్కాలికంగా ఇతరులకు అమ్మి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోకపోతే దళారుల ఈ దోపిడీ కొనసాగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
- 
      
                   
                                 పోషకాహారంపై అవగాహన కల్పించాలినిర్మల్చైన్గేట్:పోషణ మాసం ముగింపు వేడుకలు పట్టణంలోని దివ్య గార్డెన్స్లో గురువారం నిర్వహించారు. మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం ఎంతో ఉపయోగకరమన్నారు. నెల కార్యక్రమంగా కాకుండా, ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందుతోందని భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 17న ప్రారంభమై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణపై అవగాహన కల్పించామన్నారు. బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే భవిష్యత్తులో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి, దేశ నిర్మాణానికి తోడ్పడతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ శాఖకు సంబంధించిన సూచికల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. అంతకుముందు అంగన్వాడీ టీచర్లు పోషకాహారంపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. గర్భిణులకు సా మూహిక సీమంతం చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పోషకాహార స్టాళ్లను పరిశీలించి, టీచర్ల సృజనాత్మకతను ప్రశంసించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, సీడీపీవోలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
- 
      
                   
                                 కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేతకడెం: కడెం ప్రాజెక్ట్కు గురువారం రాత్రి 1000 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాయతీ చాటుకున్న సాయితేజలోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గొడిసెల సాయితేజగౌడ్ దొరికిన బ్యాగును లోకేశ్వరం పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. బుధవారం నిజా మాబాద్ నుంచి పుస్పూర్కు బైక్పై వస్తున్న సాయితేజకు నందిపేట్ మండలం పలుగుగుట్ట సమీపంలో ఓ హ్యాండ్బ్యాగు దొరికింది. అందులో సెల్ఫోన్, రెండు గ్రాముల బంగా రం, ఆధార్ కార్డు ఉంది. ఆధార్ ఆధారంగా నందిపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రవళికగా గుర్తించి లోకేశ్వరం పోలీసులకు బ్యాగ్ను అప్పగించాడు. సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు. గురువారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బ్యాగును అప్పగించారు. డబ్బులు దండుకున్న మధ్యవర్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని, పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేస్తానని డబ్బులు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. హైకోర్టులో జడ్జీలు, న్యాయవాదులు పరిచయం ఉన్నారని నమ్మబలికి బాధితుల నుంచి రూ.3 లక్షల 50వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఫిర్యాదుదారు కుమారుడు, కోడలు మధ్య గొడవలు ఉన్నాయి. మధ్యవర్తిగా పరిచయం ఉన్న జైనూర్ మండలంలోని బూసిమెట్టకు చెందిన జాడే రవీందర్ బాధితులను నమ్మబలికి అందినకాడికి దండుకున్నా డు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. మొదట రూ.3లక్షలు ఇవ్వగా ఆ త ర్వాత కేసు నమోదు చేయిస్తానని బెదిరించి మ రో రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో బాధితురా లు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 42 కిలోల గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: జిల్లాలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడిన 42 కిలోల గంజాయిని గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో గురువారం గంజాయి డిస్పోజల్ చేశారు. ఇందులో 22 కిలోల గంజాయి మొక్కలు, 20 కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు. అడిషనల్ ఎస్పీ సు రేందర్ రావు, డీసీఆర్బీ సీఐ హకీమ్ ఈ ప్రక్రియను పరిశీలించారు.
- 
      
                   
                                 భార్యను కడతేర్చిన భర్తగుడిహత్నూర్: మద్యం తాగొద్దని మందలించిన భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగోంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్, లక్ష్మీబాయి (35) దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంతోష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. గురువారం ఉదయం సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగి మోటార్ సైకిల్ నడుపొద్దని లక్ష్మీబాయి మందలించింది. మద్యం మత్తులో ఉన్న సంతోష్ కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె చెంప భాగంలో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు.
- 
      
                   
                                 గెలిచిన సంఘాలు విఫలంశ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని సీఐటీయూ కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గురువారం ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, ఇన్వాలిడేషన్ అయిన వారి స్థానంలో డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై కొట్లాడటానికి వేదికలైన స్ట్రక్చర్ సమావేశాలు బహిష్కరించి ఇక్కడ గనులపై మెమోరాండాలు ఇస్తూ కార్మికులను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూని యన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ కుమారస్వామి, వెంకట్రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 లక్ష్మీదేవర ఆలయంలో చోరీభీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ముది రాజ్ సంఘం పెద్దలు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి.. సమీపంలోని పత్తి చేను మీదుగావచ్చిన దుండగులు మొదట ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీలో ఉన్న 4 కిలో ల 500గ్రాములు వెండి, రూ. 36 వేల నగదు, అ మ్మవారిపై ఉన్న రెండు తులాల బంగారు అభరణా లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇంత పెద్దఎ త్తున వెండి ఉందన్న సమాచారం దొంగలకు ఎలా చేరిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందు పార్టీ చేసుకుని దోపిడీ చోరీకి పాల్పడిన దొంగలు మొదట సమీపంలోని పత్తి చేనులో మందు పార్టీ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పథకం ప్రకారం మొదట ఆలయ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయం ఎదుటే నివాస గృహాలు ఉన్నప్పటికీ దుండగులు దోచుకుని యథేచ్ఛగా వెళ్లి పోవడం వెనుక స్థానికులు ఎవరైనా వారికి సహకరించారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 500 మీటర్ల దూరంలోనే పోలీస్స్టేషన్ పోలీస్స్టేషన్కు కేవలం 500 మీటర్ల దూరంలోనే చోరీ, జాతీయ రహదారికి సమీపంలోనే చోరీ జరగడం మండలంలో సంచలనంగా మారింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ గురువారం సందర్శించి స్థానికులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. డాగ్స్వ్వాడ్తో పరిసరాలు గా లించగా అది పత్తిచేనులోకి వెళ్లి ఆగిపోయింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
- 
      
                   
                                 స్వగ్రామం చేరిన మృతదేహంనర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబా య్ వెళ్లిన మండలంలోని తిమ్మాపూర్ (జి) గ్రా మానికి చెందిన గోపు భూ మయ్య (42) నెల రోజు ల క్రితం గుండెపోటుతో మృతి చెందగా గురువా రం మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామానికి చెందిన గోపు భూమయ్య దుబాయ్లోని సోనా పూర్ ప్రాంతంలో గల సీఆర్సీ కంపెనీలో ఏడాదిన్నరగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రి తం గుండెపోటుతో మృతి చెందగా యూఏఈ హె ల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో బొమ్మ ప్రవీ ణ్, బొడ్డుపల్లి రాము, గన్నారపు హన్మాండ్లు, శ్రీనివాస్ కంపెనీ యాజమాన్యం, పీఆర్వోలతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ఏర్పా ట్లు చేశారు. గురువారం స్వగ్రామానికి మృతదేహం చేరడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేతఇచ్చోడ: మండలంలోని అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ట్రా క్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించి మండల కేంద్రంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అధికారి పుండలిక్ రెండు రోజుల క్రితం ట్రాక్టర్ను పట్టుకోగా గురువారం టైగర్జోన్ అధికారులు మరో మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకే కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. బాలిక అదృశ్యంఆదిలాబాద్టౌన్: తలమడుగు మండలంలోని దహెగాంలో అత్తాగారి ఊర్లో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కూతురు అదృశ్యమైనట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న భార్యభర్తలు కూలీ పనులకు వెళ్లగా కూతురు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తలమడుగు పోలీసు స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు వివరించారు. కాసిపేట గని ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకాసిపేట: నీటిసమస్య పరిష్కరించాలని డిమా ండ్ చేస్తూ మండల బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరి యా కాసిపేట గని ఎదుట గురువారం మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలి పారు. మండలంలోని ముత్యంపల్లి, చిన్నధర్మారం, కాసిపేట గ్రామాల్లో నీటి సమస్య తీవ్ర ంగా ఉందన్నారు. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, నిధుల కొరత అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు మేనేజర్ నిఖిల్ అయ్యర్ మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాకీ కిరణ్, ప్రనన్న, మహిళలు పోసు, లచ్చక్క, కవిత, పద్మ, మహేశ్వరి, లక్ష్మి, యువకులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పశువులను తరలిస్తున్న లారీ పట్టివేతబోథ్: మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు పశువులను తరలిస్తున్న లారీని గురువారం సోనాల మండలంలోని ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘన్పూర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న లారీని ఆపి పరిశీలించగా అందులో పశువులు కనిపించాయి. లారీలో 26 పశువులు ఉండగా రెండు మృతి చెంది ఉన్నాయి. వాహనాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న పశువులను బజార్హత్నూర్లోని గోశాలకు తరలించినట్లు ఎస్సై శ్రీసాయి పేర్కొన్నారు. లారీ ఓనర్తో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
- 
      
                   
                                 ఉరేసుకుని వివాహిత..బాసర: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ సాయికుమార్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని హజిని గ్రామానికి చెందిన మాధవి (23)కి బాసర మండలంలోని దౌడాపూర్ గ్రామానికి చెందిన కర్మానే మనోజ్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలంగా మనోజ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలని మా ధవిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసేవా డు. దీంతో మనస్తాపానికి గు రైన మహిళ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులతో నే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురా లి తండ్రి రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
- 
      
                   
                                 రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిరామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరి ధిలోని గద్దెరాగిడిలో బుధవారం రాత్రి జరిగిన రో డ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీ మా సుధాకర్ (65) మృతి చెందాడు. గద్దెరాగిడిలో ని ఓ కిరాణ దుకాణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో వేగంగా ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంటనే మంచి ర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. మృతుని కి భార్య, ఇద్దరు కుమారులు న్నారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
- 
      
                   
                                 పురుగుల మందు తాగి వ్యక్తి..లక్ష్మణచాంద: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు బుచ్చన్న (52) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 13న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
- 
      
                   
                                 ఉద్యోగ వేట ఇక సులభతరంబోథ్: డిజిటల్ యుగంలో నిరుద్యోగులకు ఉ ద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డీట్’ (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎకేస్ఛ్ంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, ప్రైవేటు రంగ సంస్థల మధ్య ప్రత్యక్ష వారధిగా ఈ యాప్ పనిచేయనుంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. విద్యా సంస్థలు, ప్ర భుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల సమన్వయంతో ఇది పర్యవేక్షించబడుతుంది. తద్వారా, అ భ్యర్థులు తమ అర్హతలకు తగిన ప్రైవేటు రంగ ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందేందు కు మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమలు, నిరుద్యోగులు ఈ యాప్లో నమోదు చేసుకుంటే కంపెనీలు తమకు అవసరమైన, స్కిల్ ఉన్న వారికి సందేశాన్ని పంపిస్తారు. వందల కంపె నీలన్నీ ఒకే చోట ఉండటంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉటుంది. అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు డీట్ యాప్ ద్వారా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఆపై చదివిన అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చు. వారి విద్యార్హత, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. డిగ్రీ చదువుతున్న అభ్యర్థులకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం అదనపు విశేషం. ఫార్మా, ఇండస్ట్రియల్, బీపీవో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్తో పాటు అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ● నిరుద్యోగులు, ఉద్యోగాలు కల్పించే ఔత్సాహిక కంపెనీలు ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు. ● కంపెనీ నిర్వాహకులు, యాప్లో నమోదైన అభ్యర్థుల విద్య, నైపుణ్య వివరాలను పరిశీలించి, నేరుగా వారిని సంప్రదిస్తారు. ● కంపెనీల నియమావళిని బట్టి రాత లేదా మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయానికి ఇందులో అవకాశం ఉండదు. నమోదు విధానం ● నిరుద్యోగులు తమ పూర్తి వివరాలను డీట్ యాప్లో లేదా అధికారిక వెబ్సైట్ www. deet.telangana.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ● ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా యాప్ను తెరవాలి. ● విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం, ఇంటర్న్షిప్ల వివరాలు నమోదు చేయాలి. ● పార్ట్టైమ్, ఫుల్టైమ్, అప్రెంటిస్షిప్లలో దేని కోసం అన్వేషిస్తున్నారో, ఏ రంగంలో ఉద్యోగం కావాలో స్పష్టం చేయాలి. ● విద్యార్హత పత్రాలను యాప్లో అప్లోడ్ చేయడంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
- 
      
                   
                                 హోరాహోరీగా బ్మాడ్మింటన్ పోటీలుమంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల క్లబ్లో గురువారం నిర్వహించిన అండర్–14, 17, 19 బాలబాలికల జోనల్స్థాయి ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో గ్రూపు నుంచి ఐదుగురు చొప్పున 30 మంది ఎంపికయ్యారు. అండర్–14 హైదరాబాద్, అండర్–17 మేడ్చల్, అండర్–19 మహబూబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పులూరి సుధాకర్, జెడ్పీబాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రేణి రాజయ్య, కుమురంభీం జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 వేర్వేరు చోట్ల ఇద్దరికి పాము కాటుబేల: మండలంలోని సిర్సన్న, జూనోని రెవెన్యూ గ్రామ శివారుల్లోని పొలాల్లో గురువారం ఇద్దరు రైతులు పాముకాటుకు గురయ్యారు. సిర్సన్న గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న బబన్కు, జూనోని గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తున్న వైశాలిని వేర్వేరుగా పాములు కాటేశాయి. గమినించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ అనిల్, పైలెట్ అర్షద్ఖాన్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. వైశాలికి చికిత్స చేస్తున్న ఈఎంటీ అనిల్
- 
      
                   
                                 విద్యుత్ షాక్తో గుర్తు తెలియని వ్యక్తి..నేరడిగొండ: మండలంలోని బుద్దికొండ గ్రామ స మీపంలో స్థానిక రైతు నవీన్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (45) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తెల్ల టి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరి ంచి ఉన్నట్లు తెలిపాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వివరాలు తెలిసిన వారు 8712659947 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
- 
      
                   
                                 హంటర్డాగ్పై అవగాహనమామడ: అటవీ ప్రాంతంలో జంతువులను వే టాడడం, అక్రమంగా కలప తరలించడం లాంటి నేరాలకు పాల్పడిన నిందితులను తక్కువ సమయంలో గుర్తించే హంటర్డాగ్పై బుధవా రం దిమ్మదుర్తి గ్రామంలో అవగాహన కల్పించారు. హంటర్ డాగ్తో రిహార్సల్స్ నిర్వహించి వివరించారు. ఎవరైనా వన్యప్రాణులను వేటా డితే ఆ ప్రాంతానికి హంటర్డాగ్ను తీసుకువెళ్తె నేరస్తుల అడుగుజాడల ఆధారంగా వారిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆ ర్వో శ్రీనివాస్రావు, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, అన్నపూర్ణ, జాఫర్, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 బీమాతో కుటుంబానికి ధీమాభైంసారూరల్: బ్యాంక్ రుణాలు తీసుకున్నవారంతా కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాల్లో చేరాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం నవీన్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని ఇలేగాంలో బాధిత కుటుంబానికి ప్రమాదబీమా చెక్కు అందించే కార్యక్రమానికి హాజరైన ఆయన బీమా పథకాలపై అవగాహన కల్పించారు. పీఎంజేవై, ఏంఎస్వై పథకాల్లో ఏడాదికి రూ.20నుంచి రూ.450 ప్రీమియంతో చేరినవారికి ప్రమాద మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో రూ.500 నుంచి రూ.2వేల వరకు ప్రీమియం చెల్లించిన వారికి రూ.10లక్షల నుంచి రూ.40లక్షల వరకు బాధిత కుటుంబానికి బీమా సొమ్ము అందుతుందని తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన నీలం సాయినాథ్ కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందించారు. ఎస్ఎంవో అభినయ్, ఎస్ఎంబీ విలాస్, దేగాం బ్యాంక్ మేనేజర్ కే సోని, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 డిపాజిట్ పెంచినా అదే పోటీనిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా ఈసారి వ్యాపారులు అధికసంఖ్యలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–2027 సంవత్సరానికి మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూ.3లక్షల చలాన్తో సెప్టెంబర్ 26 నుంచి ఎకై ్సజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులున్నాయి. అయితే, గతంలో పలు వైన్షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం కూడా వాటికే అధిక డిమాండ్ ఉంటుందని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో రూ.కోట్లలో వ్యాపారం జరగడంతో వ్యాపారులు అధిక ఆదాయం వచ్చే మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అధిక ఆదాయ మున్న షాపులు దక్కించుకునేందు కు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చే సుకునేందుకు సిద్ధమవుతున్నారు. అత్యధిక దరఖాస్తులు ఇక్కడే.. జిల్లాలో దాదాపు 20 వైన్షాపులకు 2023–2024లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. శాంతినగర్లో గల మద్యం షాపునకు 76 దరఖాస్తులు రాగా, సెప్టెంబర్ వరకు లిక్కర్ విక్రయం ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి మరో వైన్షాప్నకు అదే ఏ రియాలో అవకాశం కల్పించారు. కా గా, గతంలో మాదిరిగా ఈ వైన్షా ప్నకు దరఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18వరకు గడువు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18న సాయంత్రం 5గంటల వరకు అవకాశముంది. గతంలో చివరి దశలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అదే మాదిరిగా దరఖాస్తులు అత్యధిక సంఖ్యలో వస్తాయని భావించిన ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ప్రధాన ఎక్సైజ్శాఖ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం వరకు 47 దుకాణాలకు 65 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వైన్షాప్లకు దరఖాస్తుల వెల్లువ గతంలో అధిక దరఖాస్తులు, ఆదాయం వచ్చిన షాపులు గెజిట్ దరఖాస్తులు మొదటి ఏడాది ఈ ఏడాది సెప్టెంబర్ నెంబర్ ఆదాయం 25వరకు ఆదాయం (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2 38 12.85 11.49 3 24 15.75 13.33 5 37 10.37 6.88 6 33 10.30 7.42 7 21 11.08 8.49 8 20 10.22 6.98 10 74 18.22 14.70 19 45 12.37 13.49 20 33 15.63 13.41 22 16 10.46 11.45 23 28 10.53 9.62 27 21 7.10 11.75 28 20 10.84 9.79 37 15 10.18 8.91 45 12 13.00 9.92 47 31 10.61 10.08 ఒక్కరోజే 42 దరఖాస్తులు నిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 18న సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించి 23న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఎకై ్సజ్ సీఐలు రంగస్వామి, నజీర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఇంటర్కూ ప్రత్యేకంనిర్మల్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కుంటాల: నిర్మల్ జేఎన్ఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీల్లో కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు గనుశ్రీ, స్వప్న, దివ్య, నాగజ్యోతి, విద్య, విశాల్, జెస్వంత్, కార్తికేయ ప్రతిభ కనబరిచారు. వీరు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ నాటికను ఉపాధ్యాయులు గంగాప్రసాద్, ఉమేశ్రావు, నవీన్కుమార్, దత్తు ప్రోత్సాహంతో ప్రదర్శించారు. జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని బుధవారం జిల్లా విద్యాధాకారి భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కబడ్డీ పోటీలకు.. లక్ష్మణచాంద: రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి కే సంజీవ్ ఎంపికై నట్లు పీడీ శ్రీనివాస్ తెలిపా రు. ఇటీవల నిర్వహించిన మండల, జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. సంజీవ్ ఈ నెల 16నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్లోని పటాన్చెరులో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. సంజీవ్కు ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవలే నిధులు కేటాయించి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. అధ్యాపకులు, వి ద్యార్థుల హాజరులో మరింత పారదర్శకతకు ఫేషి యల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్ర స్తుతం వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించేందుకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టి ప్రారంభించింది. ఇప్పటికే తరగతులు షురూ.. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు జిల్లా నోడల్ అధికారి పరశురాంనాయక్ తెలిపారు. సాయంత్రం 3.30 నుంచి 5వరకు రోజుకు గంటన్నరపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. విద్యార్థుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం ప్రత్యేక తరగతుల సమయంలో మా సందేహాల ను అధ్యాపకులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు వెళ్లి ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. – హరిత, ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డు సూచనల మేరకే.. ఇంటర్ బోర్డు అధికారుల సూచనల మేరకే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే వారిని సన్నద్ధం చేస్తున్నాం. – పరశురాంనాయక్, జిల్లా నోడల్ అధికారి ప్రయోజనం ఉంది ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నా యి. నేను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. ఇంటి వద్ద చదువుకునే పాఠ్యాంశాలను కాలేజీలోనే చదువుకుంటున్నాం. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. – మౌనిక, ఇంటర్ ద్వితీయ సంవత్సరం జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 13 ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య 2,592 సెకండియర్ విద్యార్థుల సంఖ్య 2,252 మొత్తం విద్యార్థుల సంఖ్య 4,844ఫిబ్రవరి చివరలో పరీక్షలు ఈసారి మార్చి రెండో వారంలో కాకుండా ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం రేవంత్రెడ్డికి నివేదించినట్లు తెలిసింది. ఒక వేళ సీఎం బోర్డు ప్రతిపాదనలు ఆమోదిస్తే ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని అధ్యాపకులు కోరుతున్నారు.గత ఫలితాలు ఇలా.. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,332 విద్యార్థులకు 3,149 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 73.13 శాతం, సెకండియర్లో 71.71 శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాను 11వ స్థానంలో నిలిపారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- 
      
                   
                                 హక్కుల కోసం రాజీలేని పోరుభైంసారూరల్: ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు తెలిపా రు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రా మంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యమించక తప్పదని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. 2012 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతకు సబ్ కమిటీ వేసి పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ అథారిటీ కమిటీలో ఉపాధ్యాయుల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వా రికి వెంటనే పింఛన్ మంజూరు చేసి పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకుడు ధర్మాజీ చందనే, జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, గంగన్న, రామునాయక్, మారుతి, సునీల్ తదితరులున్నారు.
- 
      
                   
                                 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలినిర్మల్చైన్గేట్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టా ర్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం త రలింపునకు సరిపడా లారీలు సమకూర్చుకోవా లని, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ముగించాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ.. కలెక్టర్లు స్వయంగా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ, ప్రక్రియ సరిగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల ని తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. త్వరలోనే కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి రాజేందర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 దేశ అభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకంనిర్మల్ రూరల్: దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా ఉందని, దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో సైన్స్ పాత్ర చాలా కీలకమని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జేవీఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించిన ‘సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్’లో మాట్లాడారు. విద్యార్థులు ఆవిష్కరణ లు చేసే దిశగా చిన్నప్పటినుంచే ప్రయత్నించాలన్నారు. వ్యవసాయ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర పెరగడంతో పంటల దిగుబడి పెరుగుతోందన్నారు. ‘మానవ అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ’అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ డ్రామా ఫెస్టివల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 20 డ్రామాలతో 180 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, ఆరోగ్యం– పరిశుభ్రత, గ్రీన్ టెక్నాలజీ అనే అంశాలతో విద్యార్థులు చేసిన డ్రామాలు మెప్పించాయి. జ్యూరీ మెంబర్లుగా సంపత్కుమార్, నాగరాజు, రఫీ వ్యవహరించా రు. ఇందులో తెలంగాణ మోడల్ స్కూల్ కుంటాల కు చెందిన కార్తికేయ, దివ్య, నాగజ్యోతి, గనుశ్రీ, స్వప్న, విశాల్ జస్వంత్ విద్యార్థులు విజయం సాధించారు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, సైన్స్టీం సభ్యులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 పత్తి కొనుగోళ్లు ఆలస్యంభైంసా/భైంసారూరల్: దసరా పండుగ దాటినా జిల్లాలో పత్తి కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. కేంద్రాల ఏర్పాటు ప్రణాళికే ఖరారు కానట్లు తెలుస్తోంది. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణంగా పత్తి పంట దసరా సమయానికి రైతుల చేతికి వస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారు. ఏటా కొనుగోళ్లు జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఈసారైనా సమయానికి కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, కుభీర్, భైంసా ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. సీసీఐలోనే మద్దతు పత్తి పంటకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర దక్కుతుంది. ప్రైవేటుగా అమ్మితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దగక ముందే సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి రైతులు పత్తి విక్రయానికి ముందుగా ఆన్లైన్ ఆధార్ ధ్రువీకరణతో సంబంధిత కేంద్రాల్లో రిజిస్టర్ కావాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు. పత్తి విక్రయించి వచ్చే మొత్తాన్ని రైతుల ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు. యాప్లో స్లాట్ బుకింగ్ సీసీఐ తాజా సంవిధానంగా ’కపాస్ కిసాన్’ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. ఏఈవోలు సేకరించిన వ్యవసాయ వివరాలు వ్యవసాయ పోర్టల్కు అనుసంధానించబడ్డాయి. రైతులు తమ సెల్ ఫోన్ నంబర్తో యాప్లో నమోదు చేసుకుంటే, జిన్నింగ్ మిల్, పత్తి అమ్మే తేదీ కేటాయించబడుతుంది. అవగాహన లేని వారు తమ క్లస్టరు ఏఈవో ద్వారా కూడా నమోదు చేయవచ్చు. త్వరలోనే కొనుగోళ్లు భైంసా మార్కెట్లో త్వరలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. జిల్లాలో భైంసాలోనే అత్యధిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకే పంట తీసుకురావాలి. ఈయేడు క్వింటాల్ పత్తికి ప్రభుత్వం రూ.8110గా మద్దతు ధర నిర్ణయించింది. – ఆనంద్రావుపటేల్, ఏఎంసీ చైర్మన్మద్దతు ధర ఇలా.. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించింది. పత్తి తేమ శాతం ఆధారంగా ధరలు ఉంటాయి. 12% తేమ శాతానికి మించి ఉన్న, నాణ్యత లేదా వర్షానికి తడిసిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు.
- 
      
                   
                                 క్రీడల్లోనూ రాణించాలి● డీఈవో భోజన్న నిర్మల్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ అండర్–14, 17 బాల బాలికలకు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. డీఈవో పోటీలను ప్రా రంభించారు. 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు టీష ర్టులు అందజేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జోనల్స్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, పీఈటీలు అంబాజీ, రాముగౌడ్ పాల్గొన్నారు. జోనల్స్థాయికి ఎంపికై న క్రీడాకారులు.. అండర్ 14 బాలికలు.. ఆరాధ్య, అద్విత, అన్వితశ్రీ(వాసవి పాఠశా ల), హర్షిత(శ్రీచైతన్య), లాస్య(నారాయణ భైంసా) అండర్ 14 బాలురు.. అర్జున్, శివదీప్, అద్విత్(విజయ హైస్కూల్), జషిత్(శ్రీచైతన్య), లవ్కుమార్(నారాయణ భైంసా) అండర్ 17 బాలికలు.. ప్రతిభ (విజయ హైస్కూల్), అక్షర, అవని పటేల్, సహస్ర(వాసవి), భక్తి(అల్ఫోర్స్) అండర్ 17 బాలురు.. సోహాన్, ఇమాద్, సాయి సంస్కార్, సంపత్రెడ్డి (విన్నర్స్ హైస్కూల్), విగ్నేష్ (నారాయణ హైస్కూల్)
- 
      
                   
                                 17 నుంచి ప్రతిష్టాపనోత్సవాలుబాసర: బాసరలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఈనెల 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం బాసరలో ఆవిష్కరించారు. కుంభాభిషేక మహోత్సవాలకు జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వేద పాఠశాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి కార్యక్రమాలు భవిష్యత్ ఆలయ అభివృద్ధిలో భాగంగా 108 లింగాలు, 12 జ్యోతిర్ లింగాలు, 8 ఫీట్ల ఎత్తైన నంది విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు పెద్దకొండ్రు సుధాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ సతీశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ముత్యం సంతోష్, హరిప్రసాద్, చింత రాజు, కొమ్ము సుధాక్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 రైతుల పాదయాత్ర షురూ..భైంసా: జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభించాలని కోరుతూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి రైతులతో కలిసి బాసర సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కదులుతూ రోడ్డు పక్కనే కుప్పలుగా వేసిన సోయా కల్లాలపై వెళ్లి రైతులతో మాట్లాడారు. పంట కోసి నెలరోజులైనా కేంద్రాలు తెరవలేదని కురుస్తున్న వర్షాలతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోయా రైతులను ఓదారుస్తూ పాదయాత్ర లో ముందుకు వెళ్లారు. బిద్రెల్లి టాక్లి ముధోల్ పంట శివారులో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వ్యవసాయ అధికారులు పంట క్షేత్రాలు పరిశీలించిన ఇప్పటివరకు పరిహారం ఇప్పించలేకపోయారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు కరువు.. కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోరుతూ, భారీ వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించినట్లు భారతీయ కిసాన్ సంఘ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పంటలు కోయడానికి కూలీల కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే రేటు లేక రైతులు ఇబ్బంది పడుతుండగా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం మరింత భారమైందని పాదయాత్రలో రైతులు చెబుతున్నారు. నేడు సబ్ కలెక్టర్కు వినతి బాసర నుంచి ప్రారంభమైన యాత్ర ముధోల్కు చేరుకుంది. రెండోరోజు బుధవారం భైంసా వరకు కొనసాగనుంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నారు. సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నాయకులు కోరనున్నారు.
- 
      
                   
                                 ‘బెస్ట్’ విద్యార్థులు నష్టపోవద్దునిర్మల్చైన్గేట్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థుల విద్యా బోధనలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా, అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీనవర్గాల పిల్లలకు మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన విద్యా బోధనకు చర్యలు.. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్సింగ్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిఖానాపూర్: ఆశ వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జయలక్ష్మి అన్నారు. మండలంలోని మస్కాపూర్లో యూనియన్ మూడో జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్రం ఆశ వర్కర్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలతోపాటు అర్హతను బట్టి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు.
- 
      
                   
                                 ప్రజాక్షేత్రంలో ఉన్నవారికే పదవులుభైంసాటౌన్: నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కోసం పనిచేసేవారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్యే అజ య్సింగ్ అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్తోనే సాధ్యమయ్యాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రస్తావిస్తూ.. ప్రజలకు సేవ చేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని, పార్టీ పదవులు కట్టబెడుతుందన్నారు. మచ్చ లేనివారినే ఎన్నుకోండి... ఎలాంటి అవినీతి మచ్చ లేనివారినే డీసీసీ నూతన అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్రావు పటేల్ అజయ్సింగ్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు రాజకీయాన్ని దందాగా మార్చుకుంటున్నారని వేదికపై ఉన్న మాజీ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతికి పాల్పడి తే జైలు పాలవుతారంటూ హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకో వాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కోఆర్డినేటర్ జితేందర్, టీపీసీసీ పరిశీలకులు రాంభూపాల్, ధనపతి, వేణుగోపాలచారి, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
- 
      
                   
                                 ప్రజల్లో నమ్మకం పెంచాలినిర్మల్టౌన్: పోలీస్ లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకం కలిగించడం, వారిని రక్షించడం, గౌరవించబడం అని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారుల, సిబ్బందితో సోమవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ సూచనలు తెలియజేశారు. ఆధునిక పోలీసింగ్ విజయవంతం కావడానికి ప్రజలతో భాగ్యస్వామ్యం కీలకమని సూచించారు. అందరితో మరింత సమన్వయం కలిగి ఉండాలని తెలిపారు. పేదలు, బలహీనవర్గాల వారు తమ సమస్యలతో సహాయం కోసం వస్తారని, వారి బాధలను సహనంతో విని న్యాయంగా పరిష్కరించే బాధ్యత పోలీసులదే అని తెలిపారు. ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. అవినీతికి పాల్పడడం వలన పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజలు విశ్వాసం కోల్పోతారని ఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడేవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీ, పారదర్శకత, వృత్తిపరమైన విలువలు పాటించాలని స్పష్టం చేశారు. మీరు నమోదు చేసే ప్రతీ ఎఫ్ఐఆర్, స్పందించే అత్యవసర కాల్, దర్యాప్తు చేసే ప్రతీ కేసు, ఇవన్నీ ప్రజల్లో నిబద్ధత పెంచుతాయని తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 నిర్మల్పీఎంశ్రీలో కరాటే, కుంగ్ఫూయాసంగిలోనైనా నీరందేనా.. గడ్డెన్నవాగు నీరు యాసంగి పంటలకు అందుతుందనేది అనుమానంగానే ఉంది. భారీ వర్షాలతో ఉపకాలువలు కోతకు గురయ్యాయి. ప్రధాన కాలువలు దెబ్బతిన్నాయి.రాష్ట్రస్థాయిలో ప్రతిభ లక్ష్మణచాంద: మహబూబ్గర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర జూనియర్ నెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అరుణ్ కుమార్, రాజు ప్రతిభ కనబర్చారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు ఎంఈవో అశోక్వర్మ సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయస్థాయిలోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్గౌడ్, పీఈటీ రమణారావు, పీడీ నచ్చేందర్, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు సరితూగేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘పీఎంశ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా)’’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రగతిశీలమైన వాతావరణం అందిస్తోంది. ఇప్పటికే ల్యాబ్, లైబ్రరీ, సంగీతం కోసం నిధులు కేటాయించింది. తాజాగా బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. బాలికల ఆత్మరక్షణ కోసం.. పీఎంశ్రీ పథకంలో భాగంగా బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 17 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధులు ఇప్పటికే విడుదల అయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు. కరాటే, కుంగ్ఫూ, జూడో శిక్షణ... ప్రతీరోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో బాలికలు తమను తాము రక్షించుకునే ధైర్యం పొందడం అవసరమని కేంద్రం అభిప్రాయపడింది. అందుకే పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే, కుంగ్ఫూ, జూడో వంటి ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు ఈ నిధులు వినియోగించాలని సూచించింది. నేరుగా ఇన్స్ట్రక్టర్ల ఖాతాల్లోకి.. ఇంతకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో నిధులు జమ చేసి, వాటిని శిక్షకులకు చెల్లించే విధానం ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్రం విధానాన్ని మార్చింది. ఇప్పుడు నేరుగా ఇన్స్ట్రక్టర్ల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తోంది. నెలకు రూ.10 వేల చొప్పున, మూడు నెలల శిక్షణకు రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మణచాందలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు శిక్షణ తరగతులు ఇలా.. ప్రతీ పాఠశాలలో కనీసం 72 శిక్షణ తరగతులు నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వారంలో కనీసం రెండు లేదా మూడు రోజులు పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించింది. కరాటే, కుంగ్ఫూ, జూడో శిక్షణలతో బాలికలలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
- 
      
                   
                                 నేడు రైతుల పాదయాత్రభైంసా: రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర చేపట్టనున్నారు. లక్ష్మణచాందలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి సమక్షంలో రైతులంతా సమావేశం ఏర్పాటు చేశారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదన్నారు. అధిక వర్షాలతో సోయా, పత్తి, వరి పంటలు నీట మునిగాయని, బాధితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. చేతికి వచ్చిన సోయా, పత్తి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈమేరకు బాసరలో సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఉదయం పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు. బాసర నుంచి భైంసా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పార్టీలకతీతంగా ఈ సమావేశాలకు హాజరు కావాలని అంతా కోరుతున్నారు.
- 
      
                   
                                 పరిశీలించి.. పరిష్కరించండినిర్మల్చైన్గేట్: తమ అర్జీని పరిశీలించి.. సమస్య పరిష్కరించాలని పలువురు బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలాలవారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వేగంగా పూర్తి చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీరోజు విద్యాసంస్థల్లో వంద శాతం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న వరద నష్ట నివారణ బకా యిలు చెల్లించేలా తహసీల్దార్లు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.పట్టా పాస్బుక్ ఇప్పించండి.. 2018లో అనారోగ్యం కారణంగా మా అమ్మ అల్లెపు యాదమ్మా(50)మరణించింది. మా కుటుంబ సభ్యుల ఒప్పందంతో తర్లపాడు శివారులోని సర్వే నం137/3 లో ఉన్న ఎకరం భూమిని పట్టా చేసుకున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు పాసుబుక్ రాలేదు. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆర్డీవో వద్ద డీఎస్ పెండింగ్ అని తెలుపుతున్నారు. నాకు పాసుబుక్ ఇప్పించండి. – అల్లెపు నర్సయ్య, పాత తర్లపాడు
- 
      
                   
                                 కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్న బీజేపీనిర్మల్చైన్గేట్: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ పరిశీలకులను నియమించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల గడువు ఉందని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, సారంగాపూర్, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అబ్దుల్ హాది, సోమా భీమ్రెడ్డి, ఆనంద్రావు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు ఖానాపూర్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో కార్యకర్తల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే అజయ్సింగ్ అన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అధ్యక్షతన ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన సంఘటన్ సీజన్ అభియాన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ పదవుల కోసం ముఖ్య నాయకులు సైతం ఢిల్లీకి వచ్చేవారని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచే పార్టీ దూతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్చోరీ ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు ధన్వంత్ తరి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్, వెంపటి రాజేశ్వర్, కృష్ణవేణి, మల్లారెడ్డి, దయానంద్, పడిగెల భూషణ్, ఎంఏ.మాజిద్, చిన్నం సత్యం, తోట సత్యం, నిమ్మల రమేశ్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 క్రీడలతో మానసికోల్లాసంలక్ష్మణచాంద: క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని డీఈవో భోజన్న అన్నారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ఆటలపై ఆసక్తి, అభిరుచి కలిగి ఉండాలన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు. తనకు కబడ్డీ చాలా ఇష్టమని, తాను పాఠశాలస్థాయిలో ఆడిన ఆటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్వర్మ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ రవీందర్గౌడ్, పీఈటీ వై.రమణారావు, మాజీ సర్పంచ్ లింగాగౌడ్, ఉప సర్పంచ్ మోహన్, వీడీసీ సభ్యులు పోలాస గోవర్ధన్, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్లు ఇవే.. అండర్ 14 బాలికల జట్టు అమ్రిన్ బేగం, హర్షవర్ధని, సమంత, అక్షర, అదితి, సాక్షి, రసజ్ఞ, నవనీత, చందన, హర్షిణి, గంగోత్రి, శరణ్య. స్టాండ్ బైగా మనస్విని, అమీలియా, దీక్ష,శ్రీ, నిత్యను ఎంపిక చేశారు. అండర్ 14 బాలుర జట్టు అజయ్, ఎ.అజయ్, సిద్దు, సాయి, రోమన్పాషా, వరుణ్ సందేశ్, పైజాన్, సంజీవ్, నాగ చరణ్, అర్జున్, కవి కుమార్, శేషారావు. స్టాండ్ బైలుగా సుశాంత్, అఖిల్, నాగరాజు, శివసాయి, జశ్వంత్ ఎంపికయ్యారు.
- 
      
                   
                                 రోడ్డెక్కిన సోయా రైతులుభెంసాటౌన్: భైంసాలో సోయా రైతులు రోడ్డెక్కారు. చేతికొచ్చిన సోయా పంటను రైతులు మార్కెట్కు తెస్తున్నారు. సోమవారం రైతులు వివిధ ప్రాంతాల నుంచి 495 లాట్లు వచ్చాయి. అయితే కొనుగోళ్ల ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర కోట్ చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన ఏఎంసీ అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయి తే మాటామాటా పెరగడంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడకు చేరుకున్న సీఐ గోపీనాథ్ రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డుకు ఉదయమే సోయా తెచ్చామని, వ్యాపారులు సాయంత్రం 4:30 వరకు ధర నిర్ణయించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనామ్ సర్వర్ సమస్య ఉందని జాప్యం చేశారని ఆరోపించారు. తీరా వ్యాపారులు ఆలస్యంగా తక్కువ ధర నిర్ణయించారని పేర్కొన్నారు. చాలామంది రైతులకు క్వింటాల్కు కేవలం రూ.3,900 ధర మాత్రమే వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండురోజుల క్రితం రూ.4వేలకుపైగా ధర ఉండగా, రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గించారని వాపోయారు. ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, సీఐ గోపీనాథ్ రైతులను సముదాయించారు. మంగళవారం కొత్త లాట్లు కొనుగోలు చేయకుండా తాత్కాలికంగా బీట్ నిలిపివేస్తామని, ధర తక్కువ కోట్ అయిన రైతులు మంగళవారం మరోమారు బీట్లో విక్రయించుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
- 
      
                   
                                 వ్యాపారుల సిండికేట్‘జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత సీజన్ మద్యం షాపుల కోసం ఆయనతోపాటు కుటుంబ సభ్యుల పేర్లతో రూ.16 లక్షలతో ఎనిమిది డీడీలు తీశాడు. జిల్లాలోని కొన్ని దుకాణాలకు దరఖాస్తులు చేశాడు. దురదష్టవశాత్తు ఒక్క షాపు కూడా లాటరీలో తగలలేదు. ఇప్పుడు అదే వ్యాపారి మరో నలుగురు మిత్రులతో సిండికేటుగా ఏర్పడి పలు షాపులకు దరఖాస్తు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో ఒకటి, రెండు వచ్చినా.. లాభం మాట ఏమో కానీ నష్టం మాత్రం రాదనే నమ్మకంతో ఉన్నాడు’ ఇలా జిల్లాలో మద్యం వ్యాపారులు ఎలాగైనా షాపులు దక్కించుకోవడమో.. లేదా షాపుల్లో భాగస్వామ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘పోతే రూ. 3 లక్షలు, వస్తే రూ.కోటి’ అన్నట్లు ఒంటరిగా దరఖాస్తులు చేస్తున్నారు.నిర్మల్చైన్గేట్: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపులు మళ్లీ ప్రారంభం కానుండటంతో వ్యాపారులు ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్లో అపజయం పొందిన వారు ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం లాటరీ ద్వారా షాపులు కేటాయించబడతాయి. ప్రతీ దరఖాస్తుతో రూ.3 లక్షల డీడీ సమర్పించాలి. లాటరీలో షాపు రాకపోయినా డీడీ తిరిగి రాదు. దీంతో వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. ఆర్థిక నష్టం ముప్పును పంచుకుంటున్నారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వాటాగా చెల్లిస్తున్నారు. ఎవరికి షాపు దక్కినా బాండ్ పేపర్ ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ వాటా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 13 తర్వాత దరఖాస్తుల జోరు.. ఎకై ్సజ్ అధికారులు ఈ నెల 13 తర్వాత దరఖాస్తుల సమర్పణ వేగం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ టెండర్ కాలంలో దరఖాస్తు ఫీజును పెంచుతూ వస్తోంది. 2019–21లో రూ.లక్షగా ఉన్న ఫీజు 2021–23లో రూ.2 లక్షలకు పెరిగింది. తాజాగా 2025–27 టెండర్లకు రూ.3 లక్షలుగా నిర్ణయించింది. అయినా వ్యాపారులలో ఉత్సాహం తగ్గలేదు. లాటరీ గెలవకపోయినా నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు అనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఖజానాకు కోట్ల రూపాయలు.. రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, రాజకీయ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఈ పోటీలో దిగుతున్నారు. గతంలో 47 షాపుల కోసం 1,067 దరఖాస్తులు వచ్చి ప్రభుత్వానికి రూ.21.34 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని, ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని ఎకై ్సజ్ శాఖ చెబుతోంది. జిల్లాలో మద్యం షాపులు, బార్ల వివరాలు.. అర్బన్ ఏరియాలో వైన్సులు బార్లు నిర్మల్ 11 4 ఖానాపూర్ 3 1 భైంసా 5 3 18 మండలాల పరిధిలో వైన్సులు 28
- 
      
                   
                                 ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉ పాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జ పాన్ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నిర్మల్ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల విదేశీ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశారు. నవంబర్లో ఒక్కో బృందానికి 40 మంది చొప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజులపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది... ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలు ఉండగా దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్ చైర్మన్గా అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధనా పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు. ఒరిగేదేం ఉండదు జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి విదేశాలకు పంపడం వల్ల ఇక్కడి విద్యావిధానంలో పెద్దగా ప్రయోజనాలేం ఉండకపోవచ్చు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యాబోధన ప్రక్రియలు అధ్యయనం చేయడం మేలు. ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక కోణాలు మన దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడం సమంజసంగా ఉంటుంది. – దాసరి శంకర్, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, నిర్మల్ మార్పులకు అవకాశం.. ఎంపికై న ఉపాధ్యాయులు విదేశాల్లోని విద్యావిధానాలను, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రహించిన అంశాలను అమలుపరచడం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
- 
      
                   
                                 సోయా.. మద్దతు ఏదయా?నిర్మల్చదువులు చెప్పలేం.. ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో పాఠశాలలకు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నాయి. పునరావాసంలో ఇక్కట్లు గడ్డెన్నవాగు ప్రాజెక్టు పునరావాస గ్రామాల్లో ప్రభుత్వం రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.గజ్జలమ్మ దేవికి పూజలు కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకాంత్ రామానుజ దాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, తదిత ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గజ్జల మ్మ పల్లకిసేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. భైంసా/భైంసారూరల్: జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా సోయా కోతలు జోరుగా సాగుతున్నాయి. అయితే అకాల వర్షాల ప్రభావంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న రైతులంతా ఎకరానికి కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 72,300 మంది రైతులు 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. ప్రస్తుతం కోసిన పంట తడిసిపోతుందనే భయంతో వెంటనే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,328 ఉన్నా.. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొనుగోళ్లు ప్రారంభించని మార్క్ఫెడ్.. జిల్లాలో నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, భైంసా, కుభీర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మార్కెట్ అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి తేమ, నాణ్యత పేరిట రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతీ సీజన్లో వ్యవసాయ మార్కెట్ల జాప్యం కారణంగా రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారు. ప్రైవేటులో ధర లేదు క్వింటాలు సోయాకు ప్రైవేటుగా రూ.4 వేలు చెల్లిస్తున్నారు. మద్దతు ధర రూ.5,328 ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సి వస్తుంది. పంట అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏం లాభం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. – సబ్బని మహేందర్, రైతు ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, వచ్చే దిగుబడి అన్ని వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రభుత్వం అనుమతులు ఇస్తే జిల్లా ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, నిర్మల్ తాత్కాలిక ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం కుభీర్: మండల కేంద్రమైన కుభీర్లోని కస్తూరి బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆంగ్లం బోధించడానికి తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయురాలిని నియమించనున్నట్లు ప్రిన్సిపాల్ వాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, బీఎడ్ చదివిన మహిళలు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వివరాలు.. సోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు సాగుచేసిన రైతులు : 72,300ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర : రూ.5,328ప్రైవేటులో ప్రస్తుతం చెల్లిస్తున్న ధర : రూ.4 వేల నుంచి రూ.4,358 వ్యవసాయ మార్కెట్ కమిటీలు : ఖానాపూర్, నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్సోయా పెట్టుబడి ఎకరాకు ఇలా.. విత్తనాలు : రూ.3,000 దున్నడం : రూ.2,000 విత్తనాలు వేసేందుకు : రూ.1,000 రసాయన మందులకు : రూ.1,000 కోత, నూర్పిడి ఖర్చు : రూ.6,000 14న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక నిర్మల్రూరల్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 14న అండర్–14, 17 బ్యాడ్మింటన్ బాలబాలికల జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ బైపాస్ వద్ద గల ‘నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ’లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతో ఉదయం 8:30 లోపు రిపోర్టు చేయాలన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే పాల్గొనాలని, మిగతా వివరాలకు 9490002133 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులే దిక్కు..కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో భైంసా, ఖానాపూర్ వంటి ప్రాంతాల్లో రైతులు పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గాంధీగంజ్ మార్కెట్లో క్వింటాలుకు రూ.3,800 నుంచి రూ.4,350 వరకు మాత్రమే ధర లభిస్తోంది. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. మద్దతు ధరతో పోలిస్తే రూ.వెయ్యి తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో నష్టపోయామని, వ్యాపారులు మరింత ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పంట పాడైపోతుందనే భయంతో తక్కువ ధరకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. ఈ ఫొటోలోని రైతుపేరు మేక పండరి. భైంసా రూరల్ మండలానికి చెందిన ఇతను ఈ ఏడాది తనకున్న నాలుగెకరాల్లో సోయా సాగు చేశాడు. ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లు మాత్రమే ది గుబడి వచ్చింది. పంట చేతికి వచ్చి 15 రోజులైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నిరీక్షిస్తున్నాడు. ప్రైవేటుగా క్వింటాల్కు కేవలం రూ.4 వేలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేస్తే మద్దతు ధర రూ.5,238 వస్తుందని చెప్తున్నాడు. జిల్లాలో సోయా పంట చేతికి వచ్చిన రైతులందరి పరిస్థితి ఇదే. బాసర, భైంసా, ఖానాపూర్ మండలాల్లో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతిపత్రాలు ఇచ్చారు. భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పలు మండలాల్లో నిరసనలు తెలిపారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు రైతు నాయకులు సమస్య వివరించి వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు.
- 
      
                   
                                 పాతాళగంగ ౖపైపెకి..లక్ష్మణచాంద: ఈ ఏడాది జూలై చివరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వాగులు, చెరువులు, రిజర్వాయర్లు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 45,142 వ్యవసాయ బోరుబావులు వినియోగంలో ఉన్నాయి. 1.35 మీటర్లు పెరిగిన నీటిమట్టం.. జిల్లాలో గతేడాది సెప్టెంబర్లో సగటు నీటిమట్టం 3.80 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 2.45 మీటర్లుగా నమోదైంది. అంటే గత సంవత్సరం కంటే 1.35 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్బాబు వెల్లడించారు. ప్రతీనెల భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 42 ఎంపికై న బోరుబావుల్లో నీటి మట్టాలను కొలుస్తారు. సెప్టెంబర్లో గణాంకాలు ఇలా.. సాధారణం కన్నా 27.11% అధికం జిల్లాలో సాధారణ వర్షపాతం 910.1 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1,156.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. సాధారణం కంటే 27.11% అధికంగా వర్షపాతం వచ్చిందని అధికారులు తెలిపారు. తానూర్, ముధోల్, భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్పూర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, పెంబి, మామడ, నిర్మల్ అర్బన్ మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరిగాయి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ మాసంలో 3.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈసారి 2.45 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అయినా నీటిని పొదుపుగానే వాడుకోవాలి. భావితరాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. – శ్రీనివాస్బాబు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలాల శాఖ
- 
      
                   
                                 ‘స్థానికం’పై ఉత్కంఠనిర్మల్చైన్గేట్: ఏడాదిగా ‘‘ఎప్పుడో ఎన్నికలు వస్తాయి’’ అని ఎదురు చూసిన ఆశావహులకు, ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రకటనతో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఈ నెల 8న హైకోర్టు 42% రిజర్వేషన్లపై స్టే ఇవ్వకుండా నిరాకరించడంతో, ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు భావించారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై మండల కేంద్రాలు చురుకుగా మారాయి. దసరా వేడుకలను ఎన్నికల ప్రచారంగా మలచుకుని నేతలు గెలుపు లక్ష్యాలతో ముందుకు సాగారు. అయితే అదేరోజు మధ్యాహ్నం హైకోర్టు 42% రిజర్వేషన్లపై మధ్యంతర స్టే ఇవ్వడం ఆశావహులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎన్నికల ప్రక్రియకు బ్రేక్.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తూ ఎ న్నికల సంఘం నామినేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఇప్పటివరకు సాగిన ఎన్నికల సమర కథ మళ్లీ మొదటికి చేరింది. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో కాలయాపన జరుగుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు నామినేషన్లు.. ఇదిలా ఉంటే జిల్లాలో నోటిపికేషన్ వచ్చిన తొలి రోజే 5 చోట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కొ న్ని ప్రధాన పార్టీల నాయకులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. టికెట్ అవకాశం లేకపోవడంతో పార్టీ మార్చుకున్న వారూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేతలకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడం తీవ్ర నిరాశను కలిగించింది. గ్రామాల్లో అనిశ్చితి.. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేయడంతో గ్రామాల్లో చర్చలు ముదిరాయి. పాత రిజ ర్వేషన్ల ప్రకారం ఎన్నికలు కొనసాగుతాయా? లేక పూర్తిగా నిలిపివేయబడుతాయా? ప్రభుత్వం తుది నిర్ణయం ఏమిటి? అని చర్చించుకుంటున్నారు.
- 
      
                   
                                 క్రీడలతో మానసిక ప్రశాంతతనిర్మల్టౌన్: క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని బాసర సర్కిల్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్జంప్, షార్ట్పుట్, క్యార మ్, జావెలిన్త్రో, తదితర క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం అడవుల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, ఆదిలాబాద్ డీఎఫ్వో రేవంత్ చంద్ర, నిర్మల్ డీఎఫ్వో నాగినిభాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీ క్షేత్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు. బావిలో దూకి ఒకరు.. లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. ఆదిలాబాద్టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి..నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                 మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపుభైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
- 
      
                   
                                 క్రీడలతో ఒత్తిడి దూరంనిర్మల్టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్రకై లాస్నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్పూర్కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు. పోకిరీలకు కౌన్సెలింగ్మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.
- 
      
                   
                                 బహుదూరపు బాటసారులులోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు. తరచూ ప్రమాదాలు సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి. – రాజేశ్వర్, నిర్మల్ పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్ఇదే వృత్తిని నమ్ముకున్నాం ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర మేత దొరకక దూరప్రాంతాలకు ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం. – గీజాగంగాధర్, ధర్మోరపొలాల్లోనే నిద్రమండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.జీవాలు సంఖ్య గొర్రెలు 3.50 లక్షలు మేకలు 1.25 లక్షలు నిర్మల్ జిల్లాలో.. వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం.
- 
      
                    ఈ ఆట భిన్నమైనదిసెపక్తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్కు సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్మీట్లో ఆడితే ఒకసారి గోల్డ్మెడల్ సాధించాను. – నిఖిల్, వరంగల్ బంగారు పతకం సాధిస్తా మూడేళ్లుగా సెపక్తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – ఆర్.విష్ణువర్థన్, మహబూబ్నగర్ గతేడాది నుంచే ఆడుతున్నా గతేడాది నుంచే సెపక్తక్రా మొదలుపెట్టాను. కోచ్, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్
- 
      
                   
                                 క్రీడా సంబురంరెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. సెపక్తక్రా అంటే ఇష్టం నాకు సెపక్తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను. – పి.అభినవ్ రాణా, రంగారెడ్డి ఫస్ట్ప్లేస్ సాధిస్తాం సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా. – అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్ ఆత్మవిశ్వాసంతో ఆడుతాం జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – కె.రాంచరణ్, ఆదిలాబాద్
- 
      
                   
                                 గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
- 
      
                   
                                 4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించిఆదిలాబాద్రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్సీకి, రిమ్స్కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు.
- 
      
                   
                                 ఇంట్లో చోరీజైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజ లింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


