Nirmal
-
ఉరేసుకుని మహిళ మృతి
ముధోల్: మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన ముష్కు రజిత (26) ఉరేసుకుని మృతి చెందింది. ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త పోశెట్టి ఏడాది క్రితం దుబాయికి వెళ్లాడు. ఆరు నెలల క్రితం ఫోన్లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతడి అన్నదమ్ములు వచ్చి రజితను సముదాయించి వెళ్లారు. ఈ క్రమంలో పోశెట్టి రజితపై అనుమానం పెంచుకుని నువ్వు బతకొద్దని పదేపదే ఫోన్లో తిట్టేవాడు. దీంతో క్షణికావేశంలో రజిత మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి కొడుకు రిషితేజ, కూతుళ్లు తేజస్విని, వయశ్రీక ఉన్నారు. తల్లి చనిపోవడం, తండ్రి దుబాయిలో ఉండడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బెల్లంపల్లి డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. డిగ్రీలో ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా మూడేళ్లపాటు చదివే అద్భుత అవకాశం విద్యార్థులకు దక్కబోతోంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సు విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని మల్టీజోన్–1 పరిధిలో ఈ కోర్సు కలిగిన ఏకై క కళాశాలగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత ఏర్పర్చుకుంది. ఉన్నత విద్యావ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేసి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన బీఏ హానర్స్ కోర్సు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బెల్లంపల్లి విద్యార్థులకు చేరువ కానుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. వీరికే ప్రవేశార్హత బీఏ హానర్స్ కోర్సులో చేరడానికి ఇంటర్ తత్సమా న కోర్సులతోపాటు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వి ద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్లో హెచ్ఈసీ, సీ ఈసీ, బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఒకేషనల్ చదవిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల కోర్సుల విద్యార్థులు చదవగలిగే సబ్జెక్ట్ను బీఏ హానర్స్ డిగ్రీలో ఎంచుకోవచ్చు. ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా తీసుకుని మూడేళ్లపాటు చదవడం ద్వారా ఆ సబ్జెక్ట్లో అత్యుతన్నతమైన పట్టు సాధించే అవకాశం కలగనుంది. అంతటి ప్రత్యేకమైన కో ర్సు కేవలం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద క్కించుకుని అరుదైన ఘనత సాధించడం విశేషం. -
‘పోలీస్ అక్క’కు జాతీయ గుర్తింపు
నిర్మల్టౌన్: సమష్టి కృషితో పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా పోలీస్ సిబ్బంది కృషి, నిబద్ధత వల్లే స్కోచ్ అవార్డు అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డు గౌరవంతోపాటు, బాధ్యతను కూడా పెంచిందన్నారు. ఇకపై మరింత మెరుగైన సేవలు అందిస్తూ.. ప్రతీ బాలికకు భద్రత నమ్మకం కల్పించాలని సూచించారు. అనంతరం మహిళా పోలీసులు మాట్లాడుతూ.. విద్యార్థినులను చైతన్యవంతులను చేస్తూ.. వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గంనిర్దేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్చేసి మహిళా సిబ్బందికి తినిపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీకాంత్ షిండేను కలిసిన ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర ఉప ము ఖ్య మంత్రి ఏకనాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీ కాంత్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహారాష్ట్ర సరిహ ద్దు వడూర్ వద్ద పెన్గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న ఆవశ్యకత గురించి ఆయనతో చ ర్చించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ షిండే త్వరలోనే అధి కా రులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ అంశాన్ని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్రావు ఉన్నారు. -
విహారయాత్రకు గిరిజన క్రీడాకారులు
ఖానాపూర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన క్రీడాకారులకు అరుదైన అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, క్రీడా పాఠశాలల విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు జూపార్క్, లుంబిని పార్క్ను సందర్శించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విహారయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో విద్యార్థులు ఫొటోలు దిగారు. కాగా, 2025–26 సంవత్సరానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఖో–ఖో, ఆర్చరీ, వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
ప్రజాపాలన విజయవంతం చేయాలి
నిర్మల్: జిల్లాల్లో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఈ గ్రామసభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారితో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు వెల్లడించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా లబ్ధిపొందిన వారితో సభల్లో మాట్లాడించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ిసీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, అధికారులకు సన్మానం.. ఇటీవలి ఢిల్లీ వేదికగా రెండు స్కోచ్ అవార్డులు అందుకున్న కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఎంహెచ్వో రాజేందర్ తదితరులను జిల్లా అధికారులు సన్మానించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మరక్షిత కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేశారని కొనియాడారు. పనితీరుతోనే అధికారికి గుర్తింపు.. తమ ఉద్యోగకాలంలో చేసే పనితీరుతోనే ప్రతీ అధికారికి గుర్తింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన హౌసింగ్ పీడీ రాజేశ్వర్, లోకేశ్వరం తహసీల్దార్ భోజన్నను కలెక్టరేట్లో సన్మానించారు. విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలని కాంక్షించారు. -
నిర్మల్ డీఆర్డీవోకు అరుదైన గౌరవం
నిర్మల్ఖిల్లా: ప్రపంచ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ గౌరవ్రత్నశ్రీ సమ్మాన్’ పురస్కారాల కార్యక్రమంలో నిర్మల్ డీఆర్డీవో కె.విజయలక్ష్మి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. తొమ్మిది దేశాలకు చెందిన హైకమిషనర్లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించగా, దేశవ్యాప్తంగా వందమందిని ఎంపికచేసి పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆమెను హ్యూమన్ రైట్స్ కమిషన్ శాశ్వత సభ్యురాలిగా కూడా నియమించారు. శ్రీలంకలో భారత హైకమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప మహిశిని, కాన్సులేట్ జనరల్ కేఎల్ గంజు తదితరులు పాల్గొని డాక్టరేట్తోపాటు, ఽశాశ్వతసభ్యురాలిగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
లక్ష్మణచాంద/నిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. అయినా పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని నిర్ణయించింది. బుధవారం నుంచి జిల్లాలో మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూల్యాంకన ప్రక్రియలో భాగంగా కోడింగ్ శనివారం నుంచి కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు 1,34,600 సమాధాన పత్రాలు... మూల్యాంకాన కేంద్రానికి ఈసారి 1,34,600 సమాధాన పత్రాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో తెలుగు 12,223, హిందీ 8,076, ఇంగ్లిష్ 25,184, గణితం 26,961 సమాధానాల పత్రాలు వచ్చాయి. భౌతిక రసాయన శాస్త్రం 25,917, జీవశాస్త్రం 12,085, సాంఘికశాస్త్రం 24,154 పేపర్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత రానున్నాయి. మూడు ఫేజ్లలో... ఈ సంవత్సరం నుంచి పదో తరగతి మూల్యాంకనం మూడు విడుతలగా జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 9 వరకు జరుగుతుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సమాధాన పత్రాలు మూల్యాంకనం చేస్తారు. రెండో విడత ఏప్రిల్ 10 నుంచి 17 వరకు భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్ర పేపర్లు మూల్యాంకనం చేస్తారు. మూడో విడత ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 23 వరకు సాంఘికశాస్త్రం పేపర్లు మూల్యాంకనం చేస్తారు. అధికారుల నియామకం.. ఈ మూల్యాంక కేంద్ర నిర్వహణకు ఒకరు క్యాంప్ ఆఫీసర్, ఇద్దరు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లను నియమించారు. ఏడుగురు అదునపు క్యాంప్ అధికారులు, 66 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 374 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు ,138 మంది స్పెషల్ అసిస్టెంట్లు, ఇద్దరూ చీఫ్ కోడింగ్ అధికారులు, ఏడుగురు అసిస్టెంట్ కోడింగ్ అధికారులు, 40 మంది కోడింగ్ హెల్పర్లను నియమించారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం నిర్వహిస్తారు. మూల్యాంకన కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు సౌకర్యాలు ఏర్పాటు చేశామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా మూల్యాంకనం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్టౌన్: ప్రభుత్వ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. బస్టాండ్లో మంగళవారం మహిళా ప్రయాణికులను సన్మానించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 290 కోట్ల ప్రయాణికులు ఉచిత ప్రయాణం పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నవీన్కుమార్, ఏఎంవీఐ ఆసిఫ్, మహిళా సమాఖ్య కార్యదర్శి కట్ల లక్ష్మి, ప్రయాణికులు రాధిక, ప్రసన్న, స్రవంతి, ప్రీతి సుందర్, బస్స్టేషన్ మేనేజర్ వీజీ.రెడ్డి, డీసీఎన్ఆర్.శేఖర్, టీవీ.రమణ, ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ నిర్మల్ఖిల్లా: యువతకు ప్రయెగాత్మక అనుభవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద మూడో విడతకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నర్సింహారెడ్డి తెలిపారు. ఇంటర్న్షిప్ కాలవ్యవధి 6 నెలలు నుంచి 9 నెలల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ప్రతీనెల రూ.9 వేల స్టైఫండ్ అందించనున్నారు. ప్రమాదబీమా యోజన, సురక్ష బీమా వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 లక్షలలోపు ఉండాలన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్క్స్ మెమోలుprimeministerintern shipportal ద్వారా అప్లోడ్ చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 1800 11 6090 టోల్ ఫ్రీ నంబర్ను లేదా జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
నిర్మల్ బడ్జెట్ రూ.30.26 కోట్లు
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.30.26 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ సమావేశం వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది. ఆయన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.6.93 కోట్లుగా, పన్నేతర ఆదాయం 14.14 కోట్లుగా చూపించారు. డిపాజిట్ల ద్వారా రూ.70 లక్షలు, లోన్ల ఆదాయం రూ.2.50 కోట్లుగా పేర్కొన్నారు. గ్రాంట్స్, లోన్స్ ప్రాజెక్టు ఫండ్స్ ఆదాయం రూ.6,68 కోట్లుగా తెలిపారు. ఖర్చుల్లో శానిటేషన్ పవర్ చార్జీలు, వేతనాల కోసం రూ.15.78 కోట్లుగా పేర్కొన్నారు. నిర్వహణ వ్యయం రూ.4,13 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.11.06 కోట్లుగా చూపారు. డిపాజిట్ లోన్లు రూ.2.50 కోట్లుగా చూపించారు. తొలి బడ్జెట్లో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, డ్రైనేజీ , శానిటేషన్, రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపాల్ డీఈ హరిభువన్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చెడగొట్టు వాన..
నిర్మల్‘పోలీస్ అక్క’కు జాతీయ గుర్తింపు సమష్టి కృషితో పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎస్పీ జా నకీషర్మిల అన్నారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు.నర్సాపూర్(జి)/లక్ష్మణచాంద/దిలావర్పూర్/సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్: మామిడి పంట విరగ కాసింది.. పసుపు చేతికి వచ్చింది.. మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి. జొన్న వారం పది రోజుల్లో చేతికి రానుంది. వరి, నువ్వు పంటలు ఆశాజనకంగా ఉ న్నాయి. జిల్లా రైతుల యాసంగి దిగుబడులపై సంతోషంగా ఉన్నారు. అర్ధరాత్రి దొంగలా వచ్చిన చెడగొట్టువాన అన్నదాత ఆశలు ఆవిరి చేసింది. జిల్లాలోని కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, సోన్, నర్సాపూర్(జి), నిర్మల్ రూరల్, మామడ, పెంబి, దిలావర్పూర్ తదితర మండలాల్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంటలన్నీ నేలవాలాయి. వి ద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నర్సాపూర్ (జి) మండల కేంద్రంతోపాటు గొల్లమాడ, కుస్లి, రాంపూర్, చాక్ పల్లి , టెంబరేణి , అర్లి(కె), నందన్, బామ్ని(బి), తిమ్మాపూర్(జి) గ్రామాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నా యి. గొల్లమాడలో చేతన్రావు అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల మామిడి తోటలో కాయలు నేలరాలా యి. లక్ష్మణచాంద మండలంలో అకాల వర్షానికి మొక్కజొన్న, నువ్వు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ఉడికించిన పసుపు తడిశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ల కోరుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం ముఠాపూర్లో ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. సోన్ మండలంలో మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిశాయి. దిలావర్పూర్తోపాటు న్యూలోలం, సిర్గాపూర్, బన్సపల్లి, కాల్వ తదితర గ్రామాల్లో సోమవారం అర్థ్రరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జామున వరకు బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. అన్నదాతను నిండా ముంచింది. మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. గాలికి రైస్మిల్ కాంపౌండ్ వాల్ కూలింది. మండలంలో 3 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. ముధోల్ నియోజకవర్గంలో.. కుంటాల/ముధోల్/లోకేశ్వరంతానూరు/కుభీర్: కుంటాల మండలం ఓలా, కుంటాల, కల్లూరు, అంబకంటి, అందకూర్, లింబా(కె), లింబా(బి) గ్రామాల్లో ఈదురు గాలులకు మామిడికాయలు, చింతకాయలు నేలరాలాయి. మెదన్ పూర్, దౌనెల్లి,కుంటాల, అందకూర్, ఓలా గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏఈ మధుకర్ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించారు. లోకేశ్వరం మండలం జోహర్ఫూర్, అబ్దుల్లాపూర్, రాయపూర్కాండ్లీ,ఽ ధర్మోరా, పంచగుడి, పిప్రి, వట్టోలి, సాథ్గాం, సెవాలాల్తండా, రాజూ ర, అర్లిగొడిసెరా, నగర్, గడ్చాంద, పుస్పూర్ గ్రామాల్లో ఈదురు గాలుల వర్షానికి జొన్న, వరి, మొక్కజొన్న, నువ్వు పంటలు నేలవాలాయి. మిర్చి, నూవ్వు, వరి, పొద్దుతిరుగుడు, మామిడి, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. రాజూర–మన్మద్ రోడ్డుపై చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకల కు అంతరాయం కలిగింది. మొహళ గ్రామ సమీ పంలోని విద్యుత్ స్తంభాలు విరిగాయి. కల్లాల్లో అరబెట్టిన మొక్కజొన్నలు తడిశాయి. ముధోల్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మండల కేంద్రంలోని బాబాషఫీ అల్లాఖాన్ మామిడి తోటలో కాయలు రాలాయి. దీంతో రూ.1.50 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు తెలిపాడు. ముధోల్లోని కంటి ఆసుపత్రి సమీపాన భారీ వృక్షం రోడ్డు పడడంతో, రాకపోకలకు అంతరాయం కలిగింది. తానూ రు మండలంలో వర్షానికి కొతకు వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. భోసి, బామ్ని, మహలింగి, తానూరు, ఝరి(బి), బెంబర, హిప్నెల్లి, బోరిగాం, ఉమ్రి(కె), హంగిర్గా, దాగాం, వడ్గాం, బోల్సా, జౌలా(కె), కళ్యాణి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కుభీర్ మండలంలో ఈదురుగాలుల వానకు 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్నపంట నేలవాలి తీవ్రం నష్టం జరిగింది. రాజూర–మన్మద్ రహదారిపై విరిగి పడ్డ చెట్టు ఖానాపూర్ నియోజవర్గంలో.. ముఠాపూర్లో నేలరాలిన మామిడి కాయల వద్ద రైతులురాజాపూర్లో నేలవాలిన జొన్న చేనులో రైతు గజేందర్ చామన్పల్లిలో వాలిన నువ్వు పంటను చూపుతున్న రైతు మందపల్లిలో అకాల వర్షానికి తడిసిన పసుపు పంట పెంబి/కడెం/ఖానాపూర్/దస్తురాబాద్: కడెం మండలం సారంగపూర్, ఎలగడప గ్రామల్లోని వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం అదుకోవాలని రైతు నాయకుడు హపవత్ రాజేందర్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ మండలంలో మొక్కజొన్న, మామి డి రైతులకు అకాల వర్షం తీవ్రంగా నష్టం మిగి ల్చింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు కూడా కొట్టుకుపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు మరమ్మతులు చేశారు. దస్తురాబాద్ మండలంలో అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. దేవునిగూడెం, దస్తురాబాద్, ఆకొడపేట, రేవోజీపేట, మున్యా ల, గోడిసిర్యాల, పెర్కపల్లె గ్రామాల్లో మొక్కజొన్న, మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. పెంబి మండలంలోని గాలివాన బీభత్సానికి నువ్వు, మొక్కజొన్న పంటలు నెలవాలాయి. మామిడి కాయలు రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబెట్టిన పసుపు పంట తడిసిపోయింది. -
భైంసా బడ్జెట్ రూ.21 కోట్లు
భైంసాటౌన్: భైంసా మున్సిపల్ బడ్జెట్ సమావేశం, సర్వసభ్య సమావేశం మంగళవారం వాడీవేడిగా జరిగింది. చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా 20వ వార్డు కౌన్సిలర్ ఎండీ.జాబీర్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమిషనర్ వై.నవీన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పట్టణ ప్రగతి కింద రూ.1.50 కోట్లు నిధులు వస్తాయని పేర్కొ నగా పథకం లేకుండా నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతిపక్ష నేత జాబీర్ అహ్మద్ ప్రశ్నించారు. రాని నిధులను ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ సంతకంతో కూడిన బడ్జెట్ ప్రతి కావాలని డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్, అధికారులు నీళ్లు నమిలారు. గందరగోళం నెలకొనడంతో కమిషనర్ సభను కాసేపు వాయిదా వేశారు. కాసేపటి తర్వాత సమావేశం యథావిధిగా కొనసాగించారు. బడ్జెట్ రూ.21.02 కోట్లు... ఇదిలా ఉండగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21.02 కోట్లతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల రూపంలో రూ.7.20 కోట్ల ఆదాయం చూపారు. అలాగే, రూ.4.90 కోట్లు పన్నేతర ఆదాయం డిపాజిట్లు, లోన్లు రూ.60 లక్షలు, గ్రాంట్ల రూపంలో రూ.8.3 కోట్ల ఆదాయం, మొత్తంగా రూ.21.02 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వీటి నుంచి జీతాల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు, రుణ వాయిదాలు, గ్రీన్ బడ్జెట్ కోసం రూ.7.60 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం, సాధారణ పరిపాలన, టౌన్ప్లానింగ్ ఖర్చులు రూ.3.53 కోట్లు, ఇతర వ్య యం రూ.9.87 కోట్లు కేటాయించారు. వైస్ చైర్పర్సన్ బీబీ కుతిజా సిద్దిఖా, డీఈఈ సంతోష్కుమార్, టీపీవో అనురాధ, మేనేజర్ గౌరీశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
“పోలీస్ అక్క”కు రేవంత్ అభినందనలు
హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాదాపు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.నిర్మల్ లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం యావత్ పోలీసు యంత్రాంగానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మహిళా పోలీసు అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమన్నారు.మహిళల భద్రత కోసం, ముఖ్యంగా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో “పోలీస్ అక్క” పేరిట నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ (SKOCH) అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.బండి సంజయ్ అభినందనలుప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు సాధించినందుకు ఐపీఎస్ జానకి షర్మిల, నిర్మల్ జిల్లా పోలీసులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. నిర్మల్లో పోలీస్ అక్క వంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విజన్ ఎలా ఉండాలో, హార్డ్వర్క్ ఎలా చేయాలో ఈ అవార్డు చాటిచెబుతుంది. పోలీస్ అక్క కార్యక్రమం కరుణతో కూడిన పోలీసింగ్ ఎలా జీవితాలను మార్చగలదో చూపించడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మహిళా అధికారులను మార్గదర్శకులు, రక్షకులుగా నిలబెట్టడం ద్వారా ఈ కార్యక్రమం భద్రతను మాత్రమే కాకుండా యువతుల్లో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తమ భవిష్యత్తును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని అన్నారు.తెలంగాణ డీజీపీ ప్రశంసలుకరుణతో కూడిన పోలీసింగ్ను పోలీస్ అక్క వంటి అద్భుతమైన కార్యక్రమం ప్రతిబింబిస్తుందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రక్షణతో పాటు అంతకుమించి ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం, భద్రత భావాన్ని అందించే స్ఫూర్తిదాయక ప్రయత్నమని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జానకి షర్మిల నాయకత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. భద్రతతో కూడిన సమాజ నిర్మాణంలో ఇది గొప్ప ముందడుగని చెప్పారు. -
స్టెప్పులేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. -
ఓవరాల్ చాంపియన్గా ఆదిలాబాద్
కై లాస్నగర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్–2025 (సెకండ్ ఎడిషన్) పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, కోచ్లు, సిబ్బంది వారు సాఽధించిన కప్తో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిఽశారు. వారిని అభినందించారు. క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల విజయవంతంలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియ, మండల, జిల్లాస్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ విజయానికి క్రీడాకారులతోపాటు కోచ్లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మార్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మా ట్రాక్ స్పీడ్ పెంచండి..
నిర్మల్: నాగ్పూర్–హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గించడంతోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక రైల్వేలైన్గా ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిలుస్తుందని, సంబంధిత రైల్వేలైన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసేలా చూడాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు, జిల్లావాసి సిర్గాపూర్ నిరంజన్రెడ్డి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిశారు. ఆర్మూర్–నిర్మల్ మీదుగా కేవలం 137కి.మీ. రైల్వేలైన్ నిర్మించడంతో కలిగే ప్రయోజనాలు, నిర్మాణం చేపట్టాల్సిన అవశ్యకతపై పూర్తి వివరాలతో, వివరణాత్మకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వేలైన్ ఎందుకంటే.. ఏళ్లుగా ఎదురుచూపులు.. నిర్మల్ మీదుగా రైల్వేలైన్ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అని, ప్రతీసారి కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తూ వస్తోందని ఎంపీ వివరించారు. ప్రతీసారి బడ్జెట్లో సర్వే చేస్తున్నారని, ఏడాదికేడాది ప్రతిపాదిత వ్యయం పెరుగుతోందని చెప్పారు. తక్షణమే ప్రారంభించాలని కోరాం.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి తక్షణమే ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు, మొదటిదశకు రైల్వేబోర్డు నుంచి త్వరగా అనుమతి ఇవ్వడంతోపాటు బడ్జెట్ కేటాంచాలని ప్రజెంటేషన్లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం రైల్వేబోర్డు దగ్గర ఉందని, త్వరగా పూర్తయ్యేలా తాను చూస్తానని ఆయన చెప్పారు. –సిర్గాపూర్ నిరంజన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ -
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్ ఎన్నికయ్యారు. -
అగ్నివీర్పై అవగాహన
నిర్మల్ఖిల్లా: దేశసేవ చేయడానికి అగ్నివీర్ తోడ్పడుతుందని, అవకాశమున్న యువత, విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నించి సేవచేయాలని పలువురు వక్తలు అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నివీర్, వివిధ పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యు.గంగాధర్, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ కె.రమేశ్, అధ్యాపకులు శ్రీనివాస్, సుభాష్, ఉమేశ్ పాల్గొన్నారు. -
మెడికల్ బోర్డు పునరుద్ధరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో సంవత్సరం కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జీఎం ఎం.శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డ వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. మెడికల్ ఫిట్ అయిన 300 మంది డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ నాయకులు అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు గొర్ల సంతోష్, బుస్స రమేశ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, చిల్లగింజలు మొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురుచూడకుండా, వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలని కోరారు. నూతన డీఆర్ డిపోల్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, రమేశ్, మనోహర్, ఇస్తారి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
● షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఖానాపూర్: కోరం లేక రెండు సార్లు వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ నెల 4న నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఖానాపూర్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ సుందర్సింగ్ తెలిపారు. ఏప్రిల్ 2లోపు ప్రత్యేక సమావేశానికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటలకు వార్డు స భ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో 4న ఎన్నికలు జరగకపోతే, మరుసటి రోజు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. 108 సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు ఇచ్చోడ: మండలంలో 108 సిబ్బంది ఈఎంటీ ప్యాట అనిల్కుమార్, పైలట్ సింగారం వినోద్లకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందజేసి సకాలంలో ఆస్పత్రులకు తరలించి పలువురు ప్రాణాలు కాపాడినందుకు హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారా లు అందజేశారు. రాష్ట్రస్థాయిలో ఇచ్చోడ సిబ్బంది పురస్కారాలు అందుకోవడంపై మండల ప్రజలు అభినందించారు. గవర్నర్ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడు పాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్రెడ్డి కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో మధుసూదన్రెడ్డి -
మృత్యువాతలు.. కన్నీటి గాధలు..
ముందస్తు శిక్షణ, వైద్య పరీక్షలు.. విదేశాలకు వెళ్లే కార్మికులకు ముందస్తు శిక్షణ, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయడం.. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్లైన్లు మృతదేహాల సత్వర రవాణాకు ఆర్థిక సహాయం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్కార్మిక సంఘాలనాయకులు అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల భద్రత కోసం ప్రభుత్వంతోపాటు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, అక్కడి కంపెనీలు, సంస్థలు బాధ్యత వహించాలని కోరుతున్నారు. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మరణాలను కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎడారి దేశాల్లో మోగుతున్న ఈ మరణ మృదంగం ఆగాలంటే సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యవసరం. నిర్మల్ఖిల్లా: పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లిన జిల్లా వలస కార్మికుల జీవితం అనిశ్చితితో నిండిపోతోంది. కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చాలని ఎడారి దేశాలకు వెళ్లిన పలువురు కార్మికులు వివిధ కారణాలతో అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పదుల సంఖ్యలో మరణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎడారి నేలపై మోగుతున్న ఈ ‘‘మరణ మృదంగం’’ వలస కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తమ కుటుంబ పోషణ కోసం వెళ్లిన వారు తిరిగి శవపేటికల్లో రావడం లేదా అక్కడే అంత్యక్రియలు జరగడం వంటి ఘటనలు బాధిత కుటుంబాలను కుంగదీస్తున్నాయి. కారణాలు అనేకం... ఎడారి దేశాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు, తగిన విశ్రాంతి లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీనికి తోడు, గుండె సంబంధిత వ్యాధులు, హీట్ స్ట్రోక్, ప్రమాదాలు, పని ఒత్తిడి, సరైన వైద్య సదుపాయాల లేమి వంటి ఇతరత్రా కారణాలతో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నా, భయం లేదా ఉద్యోగ భద్రత కోల్పోతామనే ఆందోళనతో వైద్యం తీసుకోకపోవడం కూడా మరణాలకు దారితీస్తోంది. కుటుంబాల్లో విషాదం.. విదేశాలకు వెళ్లిన కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి. అప్పులు తీసుకుని విదేశాలకు పంపిన కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. చిన్నారుల విద్య, కుటుంబ పోషణ వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ‘‘బంగారు భవిష్యత్తు కోసం వెళ్లిన వారు శవంగా తిరిగి రావడం మా దురదృష్టం’’ అంటూ పలువురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొందరు మృతదేహం తెప్పించుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వలస కార్మికుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మరణాలు.. నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మోహన్రావు(50) ఖతార్ వెళ్లాడు. అప్పుల బాధ, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఫిబ్రవరి 10న అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
ఆదర్శ పాఠశాలలో వసతులు కల్పించాలి
● అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కుంటాల: ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలను సోమవారం సందర్శించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం అందకూర్ నర్సరీని పరిశీలించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు వాడిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, ఏపీవో గట్టుపల్లి నవీన్ ఉన్నారు. -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత కొనసాగుతాయి. రాత్రి చలి ప్రభావం ఉండదు.జిల్లా జడ్జిని కలిసిన బార్ అధ్యక్షుడు ఖానాపూర్: ఖానాపూర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు చాంబర్లో జిల్లా జడ్జి శ్రీవాణిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖానాపూర్లో సొంత కోర్టు భవన నిర్మాణంపై విన్నవించారు. స్పందించిన జడ్జి త్వరలో వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏజీపీ ఆసిఫ్ అలీ, న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, చిన్నం సత్యం, బక్కశెట్టి కిశోర్, ఫారూఖ్ అహ్మద్, బాశెట్టి శివ, షబ్బీర్ పాషా, రాసమల్ల అశోక్ తదితరులు ఉన్నారు. -
హజ్ యాత్రికులు వ్యాక్సిన్ తీసుకోవాలి
నిర్మల్టౌన్/భైంసాటౌన్: హజ్ యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా వాక్సిన్ తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అన్నారు. నిర్మల్లోని ఐఏ ఫంక్షన్ హాల్లో ఖాదిముల్ ముజాజ్ హజ్ సొసైటీ, బైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించారు. నిర్మల్లోని శిబిరాన్ని గణేశ్ చక్రవర్తి ప్రారంభించారు. యాత్రకు వెళ్లినవారు క్షేమంగా వెళ్లి రావాలని కోరారు. భైంసా పట్టణంతోపాటు డివిజన్ పరిధిలోని 48 మంది హజ్ యాత్రికులకు వైద్యులు ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వ్యాక్సి న్ వేశారు. యాత్రలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు రఫీ, మతీన్, డీసీహెచ్ కాశీనాథ్, డాక్టర్లు, మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
‘మా ట్రాక్ స్పీడ్ పెంచండి..’ ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణం వేగంగా పూర్తిచేసేలా చూడాలని వైఎస్సార్ సీపీ ఎంపీ సిర్గాపూర్ నిరంజన్రెడ్డి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరారు. అవార్డులే పనితీరుకు కొలమానంనిర్మల్చైన్గేట్: అవార్డులు పనితీరుకు కొలమానమని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవలే జిల్లాకు మూడు స్కోచ్ అవార్డులు రావడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ డీఎంహెచ్వో రాజేందర్, ఖనాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రిని హైదరాబాద్లో కలిశారు. స్కోచ్ అవార్డులు లభించడం ఎంతో గర్వకారణం అని మంత్రి ప్రశంసించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మ రక్షిత కార్యక్రమం అమలు విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు అధికారులను మెచ్చుకున్నారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాలు అమలుచేసేలా ప్రోత్సాహం అందిస్తూ, మార్గ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో డీఆర్డీవో విజయలక్ష్మి కూడా ఉన్నారు.నిర్మల్: జిల్లాకేంద్రంలోని సోఫీనగర్కు చెందిన ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్ప డిన నిందితులు గంజాయి వాడినట్లు తేలడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా మొత్తం గంజాయి గుప్పిట్లోకి వెళ్లిపోతున్నా.. నేరాలు ఘోరాలు పెరుగుతున్నా.. అరికట్టాల్సిన శాఖలు ఏ‘మత్తు’లో ఉన్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి ‘డ్రగ్స్ ఫ్రీ నిర్మల్’ అంటూ కార్యక్రమాలు చేసే జిల్లా అధికారులు ఆ తర్వాత క్షేత్రస్థాయిలో గంజాయి నిషేధాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నా.. సంబంధిత ఎకై ్సజ్, పోలీసుశాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలూ వస్తున్నాయి.గంజాయి మత్తులో నేరాలు..జిల్లాలో గంజాయి మత్తులో నేరాలు, ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బడి ఈడులోనే కొంతమంది పిల్లలు ఈ మహమ్మారికి బానిసై, తామేం చేస్తున్నామో తెలియని మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరొకరి జీవితాన్నీ నాశనం చేస్తున్నారు.ఇవే కాకుండా.. జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు ఇచ్చే మిడాజోలం అనే మత్తుమందు ఇంజక్షన్లను యువతకు ఇస్తూ పట్టుబడ్డారు. ఇలా గంజాయి మత్తులో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ‘మత్తు’లో ఉన్నాయా..!?ఇటీవల ఘటనల నేపథ్యంలో మత్తుపదార్థాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్, పోలీస్శాఖల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల ‘మత్తు’లో సదరుశాఖలు క్షేత్రస్థాయిలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నో కేసులు ఛేదించే పోలీసులు, ఎకై ్కజ్ అధికారులకు ఎక్కడి నుంచి గంజాయి వస్తోంది, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు తదితర వివరాలు తెలియవా..!? అని జిల్లావాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ నిర్మల్’, ‘నో డ్రగ్స్..’ అని చెప్పే జిల్లా అధికారులు జిల్లాలో ఇంతలా గంజాయి గుప్పుమంటున్నా పట్టించుకోవడం లేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడే స్పందిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికై నా భావితరం నాశనం కాకుండా, మత్తుపదార్థాల ఊబిలో జిల్లా కూరుకుపోకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
‘ప్రజా’సమస్యలు పెండింగ్లో పెట్టొద్దు
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పశువుల రక్షణకు జాగ్రత్తలు తప్పనిసరి
చెన్నూర్రూరల్: ఎండలు దంచి కొడుతున్నాయి. రానురాను ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు బాగా ముదిరే అవకాశాలు ఉన్నాయి. ఎండలకు పశువులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్ పలు సూచనలు చేశారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎండతో అనారోగ్యం ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పశువులు మేత తినకుండా ఉంటాయి. పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. పశువులు పడు కోవడం తక్కువగా కనిపిస్తుంది. నోటి వెంట సొల్లు కారుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాయి. కళ్లు ఎరుపు రంగులోకి మారి వేడిగా ఉంటాయి. ఈ లక్షణాలు ముదిరితే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వేసవిలో పశువుల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించాలి. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
వేమనపల్లి: రాజకీయ విభేదాలతో కొంత మంది తనను వేధిస్తున్నారని బుయ్యారం గ్రామానికి చెందిన ఓండ్ర రమేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముడిమడుగుల శంకర్, లావణ్య, కొరకొప్పుల పోచాగౌడ్, విజయ్కుమార్ గౌడ్, సత్యనారాయణ, దుర్గం జనార్ధన్లు సర్పంచ్ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థి ఓటమికి కారకులయ్యానని, భూవివాదంలో తనపై కక్ష పెంచుకున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పలుమార్లు తనపై దాడికి యత్నించారని, నానా దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీరి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తండ్రి అంకయ్య నీల్వాయి పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. -
షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధం
కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన దేవిదాస్, కాంతారావు పటేల్లు మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టారు. పంట చేనుపై వేలాడుతున్న విద్యుత్ తీగల నుంచి నిప్పు రవ్వలు పంటపై వచ్చి పడడంతో ప్రమాదం జరిగిందని రైతులు పేర్కొన్నారు. రైతు దేవిదాస్ 5ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఎకరంన్నర మక్క దగ్ధం కాగా రూ.90వేలు, కాంతారావు పటేల్ 6 ఎకరాల్లో సాగుచేయగా 2 ఎకరాల్లో మక్క దగ్ధం కాగా రూ.1 లక్ష 35 వేలు నష్టం వచ్చిందని బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు. -
భగ్గుమంటున్న భానుడు
ఆదిలాబాద్టౌన్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండతీవ్రత పెరిగిపోతోంది. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసమైతేనే బయటకు వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండతీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్న సమయంలో ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లా తానూరు, కడెం, భైంసా, ఖానాపూర్, సారంగాపూర్, మంచిర్యాల జిల్లా కాసిపేట, భీమారం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు జైనథ్, బేలలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ఇళ్లకే పరిమితం.. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో ఎండలు అధికంగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు వడగాలులు వీచనున్నాయని పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురవ్వడం, డీహైడ్రేషన్తో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా, చిన్నారులు, వృద్దులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎండవేడిమిని తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. వ్యాపారులు, ఇతర పనులకు వెళ్లేవారు శీతలపానీయాలు, కొబ్బరిబొండా, నిమ్మకాయ సోడా తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వర్షాకాలంలో అధిక వానలు కురిస్తే, చలికాలంలో రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. జిల్లావాసులు మూడు కాలాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుతం వేసవి వేడి భరించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి రాహుల్ కాంత్, ఐపీఎస్ తెలిపారు. ఆదివారం వన్టౌన్లో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్బాజ్(25) అనే యువకుడికి అదే కాలనీలో నివసిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో మహిళ భర్త పవార్ రాకేశ్ అలియాస్ లఖన్, అతని అన్న రవి పవార్, తండ్రి గోపాల్ పవార్ కలిసి ప్రణాళిక ప్రకారం యువకుడిపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాధితుడిపై కర్రతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఆరీఫ్ ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం శాంతినగర్ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పవార్ రాకేశ్ అలియాస్ లఖన్ కాగా, మిగితా ఇద్దరు నిందితులు అతని అన్న రవి పవార్, తండ్రి గోపాల్ పవార్ అని తెలిపారు. ముగ్గురు నిందితులు ఒకే కుటుంబానికి చెందిన వారని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. -
కనిపించిన ‘కాటమయ్య’
ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రామంలోని గోదావరి తీరంలో పురాతన కాటమయ్య విగ్రహాన్ని గుర్తించారు. కాటమయ్య విగ్రహం కుడిచేతిలో ఖడ్గం ధరించి, తలకు శిరస్త్రాణం పెట్టుకుని, బుగ్గ మీసాలతో, పెద్ద చెవులతో గుర్రంపై స్వారీ చేస్తున్న రూపంలో దర్శనమిస్తోంది. ఈ శిల్పం కొంత భాగం భూమిలో దిగబడిన స్థితిలో ఉంది. విగ్రహం పక్కనే ఎల్లమ్మగా పూజించబడుతున్న మరో శిలను కూడా గుర్తించారు. స్థానిక విశ్వాసాల ప్రకారం కాటమయ్య పశువుల మందలను రక్షించే దేవుడిగా భావిస్తారు. ఈ శిల్పం 18 శతాబ్దానికి చెందినదిగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఇక్కడ ప్రాంతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై మరింత పరిశోధన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
శభాష్.. ముదిగుంట
జైపూర్: మండలంలోని ముదిగుంట గ్రామానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని ప్రశంసించడం వెనుక గ్రామస్తుల కృషి ఎంతో ఉంది. జల సంరక్షణకు గ్రామస్తులు చేపట్టిన చర్యలే ఇందుకు కారణం. అధికారుల సూచనలతో గ్రామస్తులంతా ఇంటింటా ఇంకుడుగుంతలు, అటవీప్రాంతాల్లో 10 నీటి కుంటలు నిర్మించుకున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగాయి. మండు వేసవిలోనూ నీటి కుంటల్లో నీరుండడంతో పశువులు, వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుంటున్నాయి. మారుమూల గ్రామమైనప్పటికీ.. మంచిర్యాల–చెన్నూర్ 63వ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ మారుమూల గ్రామంలో జీవనం సాగించేవారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేట్ ఉద్యోగులున్నారు. గ్రామంలో 1,500మంది జనాభా ఉండగా 400ఇళ్లున్నాయి. ఇందులో 380 ఇళ్లల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద కూడా ఇంకుడుగుంతలు నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామంలో రూప్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్తో పాటు కమ్యూనిటీ సోప్పీట్స్ ద్వారా బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ చేస్తూ సఫలీకృతులయ్యారు. దీంతో దక్షణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ముదిగుంట గ్రామాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ తరాలకు జలాన్ని అందించడానికి జలసంరక్షణ చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. ముదిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తంజేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు కేంద్ర జలశక్తి అవార్డు లభించగా రూ.కోటి ప్రోత్సాహం అందుకున్న విషయం తెలిసిందే. -
సింగరేణిలో అవినీతిపై సిట్ వేయాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సిట్ వేసి విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కంపెనీలో రోజుకో స్కామ్ జరుగుతుందన్నారు. విజిలెన్స్ అధికారులు చిన్న చిన్న కేసుల్లో కార్మికులను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పెద్ద అవినీతి వ్యవహారాలను వదిలివేస్తున్నారని ఆరోపించారు. జైపూర్ ఎస్టీపీపీలోని మూడో విద్యుత్ యూనిట్ నిర్మాణ టెండర్లో అంచనాలను పెంచి కోట్ల రూపాయల అవినీతికి ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1150 కోట్ల ఎిస్టీమేషన్ తిరస్కరణకు గురి కాగా కాంగ్రెస్ సర్కార్ మరో రూ. 500 కోట్లు పెంచి రూ.1650 కోట్లకు కోట్ చేయడం అవినీతి వ్యవహారమన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే శ్రీరాంపూర్ ఓసీపీలో 12 శాతం లెస్ టెండర్లు పడ్డాయని తెలిపారు. సీఎం కుటుంబ సభ్యులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో ఓసీల ఓబీ పనులను అప్పగించి అవినీతికి పాల్పడ్డన్నారు. కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో.. పేరుతో కార్మిక వర్గం కదిలి వచ్చి పోరాటాలు చేసి సంస్థను పరిరక్షించుకోవాలన్నారు. ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, అన్వేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో కార్చిచ్చు
నర్సాపూర్(జి): మండలంలోని అంజనీ తాండ అటవీ ప్రాంతం కార్చిచ్చుతో దగ్ధమవుతోంది. పలుచోట్ల వృక్షాలు, కలప దుంగలు కాలి బూడిదవుతున్నాయి. వేసవిలో ఎండలు ముదురుతున్న దృష్ట్యా పలుచోట్ల మంటలు రాజేసుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంటలకు విలువైన టేకు కలప వృక్షాలు దగ్ధం అవడంతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతోంది. జంతువుల మనుగడకు సైతం కార్చిచ్చుతో ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రోడ్డు పక్కనే పరిస్థితి ఇలా ఉంటే లోపల ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడవిలో రాలిన ఆకును శుభ్రపరిచే సిబ్బంది ఉన్నా నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాంగ్రూట్లో బైక్ను ఢీకొట్టిన లారీ
కడెం: లారీ, బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అల్లంపల్లి పంచాయతీ పరిధి గుర్రంమదిర గ్రామానికి చెందిన ఉయిక భీంరావు(23), అదే గ్రామానికి చెందిన కుమురం రాంబాయి(47) రైతుబంధు డబ్బులు కోసం శనివారం బైక్పై మండల కేంద్రంలోని బ్యాంక్కు వెళ్లారు. శనివారం బంద్ ఉండడంతో తిరుగుపయనమయ్యారు. ఉడుంపూర్ అటవీప్రాంతంలో అల్లంపల్లి నుంచి ఆవుపేడ లోడుతో వస్తున్న లారీ, బైక్ను రాంగ్రూట్లో ఎదురుగా ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరిని కొద్దిదూరం మేర ఈడ్చుకెళ్లగా అక్కడిక్కడే మృతిచెందారు. లారీడ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణామని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలు రాంబాయికు ముగ్గురు పిల్లలు కాగా, ఒకరికి వివాహామైంది. భర్త నాగోరావు గతంలో చనిపోయాడు. -
చట్టాలపై అవగాహన లేకే..
నేరం చేసినవారెవ్వరూ చట్టం చేతిలో నుంచి తప్పించుకోలేరు. ఈ విషయంపై అవగాహన లేకే నేరాలకు పాల్పడుతూ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా మద్యం, డ్రగ్స్కు బానిసైన యువత భ్రమల్లో ఉంటూ అసూయతో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివారు సైకాలజిస్ట్ను సంప్రదించాలి. హత్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలున్నాయి. చట్టం చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. – బండవరం జగన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంచిర్యాల -
ఈనామ్ 2.0 సమర్థవంతంగా అమలు చేయాలి
భైంసాటౌన్: వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం నూతనంగా తెచ్చిన ఈనామ్ 2.0ను సమర్థవంతంగా అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఈనామ్ 2.0 అమలు తీరును పరిశీలించారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, ట్రేడర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం భోకర్ చౌరస్తాలో ఏఎంసీ చెక్పోస్టును సందర్శించారు. 161బీబీ హైవే పనుల్లో భాగంగా చెక్పోస్టు గది ఎత్తివేయడంతో, మరోచోట స్థలం చూసి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, సిబ్బంది ఉన్నారు. -
జిల్లాకు సీ్త్రనిధి అవార్డు
నిర్మల్చైన్గేట్/లోకేశ్వరం: సీ్త్రనిధి కార్యకలాపాల్లో జిల్లా కు రాష్ట్రస్థాయిలో రెండోస్థానం దక్కింది. 2024–25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. సీ్త్రనిధి అమలులో ఉత్తమ ప్రదర్శన కనబరచి లోకేశ్వరం మండల సమాఖ్య ప్రత్యేక అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాదులో శనివారం నిర్వహించిన సీ్త్రనిధి 13వ సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్యవేవరాజన్ చేతుల మీదుగా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, ఏపీడీ, లోకేశ్వరం సమాఖ్య అధ్యక్షురాలు దేవకి, అప్పటి ఏపీఎం మల్లేశ్ అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఎండీ తదితరులు పాల్గొన్నారు. -
కామోల్లో కుస్తీపోటీలు
భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలను ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు మల్లయోధులు తలపడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన రాజు పటేల్ విజేతగా నిలిచారు. గ్రామ, ఆలయ కమిటీ, ఎస్సై సుప్రియలు విజేతకు ఐదు తులాల వెండి కడియంతోపాటు రూ.6100 నగదు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
డాక్టర్పై దాడి చేసిన నలుగురి అరెస్ట్
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్న డాక్టర్ సంతోష్రాజ్, ఆస్పత్రి సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్ సల్మాన్ సోదరి కూతురు అనారోగ్యం బారిన పడడంతో ఇటీవల స్థానిక ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకుంది. పది రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. చికిత్సకు అయిన బిల్లుల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు బిల్లల కోసం గత గురువారం సల్మాన్ ఆస్పత్రికి వచ్చాడు. రెట్టింపు బిల్లులు ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. అందకు వారు నిరాకరించారు. తర్వాత డాక్టర్ సంతోష్రాజ్ను అడిగారు. ఆయన కూడా అలా ఇవ్వడం కుదరదని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన మహమ్మద్ సల్మాన్ డాక్టర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం మహమ్మద్ షౌకత్, షాబాద్ అలీ, మహమ్మద్ ఆజాద్ హుస్సేన్ను అక్కడికి పిలిపించి ఆస్పత్రి సిబ్బందితోపాటు డాక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై హాస్పిటల్ యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వివరాలు, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దాడికి పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసు ఛేదనకు శ్రమించి నిందితులను పట్టుకున్న ఏఎస్పీ సాయికిరణ్, భైంసారూరల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ ఇన్స్పెక్టర్ కృష్ణను ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. -
మాయమై పోతున్నడమ్మా..
‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకై నా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అంటూ ఓ కవి స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. సందర్భం ఏదైనా నేటి సమాజంలో కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. అనుమానాలు, వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు.. కారణలేవైనా అంతిమంగా మానవ మృగాలుగా మారి మనుషులను మనుషులే చంపేసుకుంటున్నారు. మానవ విలువలకు తిలోదకాలిస్తున్నారు. మంచిర్యాలక్రైం: క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్యను హత్య చేయడం, ఆస్తులకోసం జన్మనిచ్చిన తండ్రిని కొడుకులు, కూతుళ్లు హతమార్చడం లాంటి ఘటనలెన్నో సమాజంలో చూస్తున్నాం. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొంందరు పథకం ప్రకా రం హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడి చట్టం చేతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ.. పోలీసులు టెక్నాలజీ సాయంతో చిన్న ఆధారంతో నైనా నేరస్తులను పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. ఆ తరువాత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి బె యిల్పై బయటకు వచ్చినా సమాజం వారిని హంతకులుగా చిన్నచూపు చూస్తుంది. కేసు విచారణ తర్వాత శిక్షలు కూడా పడే అవకాశముంది. బాధిత కుటుంబాలవారే కాకుండా హంతకులకుటుంబాలవారు కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇటీవల జరిగిన మూడు హత్యలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేక కౌన్సిలింగ్తోనే సరినేరాల్లో యువత భాగస్వామ్యం ఉండకూడదని పోలీస్శాఖ భావిస్తోంది. ఇదే లక్ష్యంతో వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తోంది. యువత, విద్యార్థులకు సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న ఇబ్బందులు, గంజాయి వినియోగం, విక్రయాలతో తలెత్తే సమస్యలను వివరిస్తోంది. ఇదే సమయంలో మానవ సంబంధాలపైనా సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. మహిళలు, మానవ సంబంధాలు, నేరాలు తదితర అసాంఘిక ఘటనల వైపు దృష్టి మళ్లకుండా చూస్తోంది. ఎంతటి సమస్యనైనా కూర్చుండి పరిష్కరించుకునే అవకాశమున్నా ఒకరిలో ఒకరికి తగ్గింపు స్వభావం లేకనే హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీం కోర్టు రాజీ మార్గమే రాజమార్గమని భావించి లోక్ అదాలత్ల ద్వారా పెండింగ్ కేసుల్లో కక్షిదారులను రాజీ కుదిర్చేలా చూస్తోంది. ఇటీవలి ఘటనల్లో కొన్ని.. -
అంతర్జాతీయ సదస్సులో ఖానాపూర్ వాసి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లె కు చెందిన ఎదులా పురం సత్యనారాయణచారి.. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ప్రతి నిధిగా హాజరయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహా రాల మంత్రిత్వ, యువజన సేవల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రపంచ వేదికపై భారత్: సాఫ్ట్ పవర్, విధానాలు, యువ దౌత్యం’అనే అంశంపై మూడు రోజులపాటు వర్క్షాప్ నిర్వహించారు. విదేశీ వ్యవహారాలశాఖ అదన పు కార్యదర్శి అలోక్ దిమిరి కార్యక్రమాన్ని ప్రారంభించగా, నలంద వీసీ సచిన్ చతుర్వేది సమక్షంలో సదస్సు జరిగింది. భారత్తోపాటు సుమారు పది దేశాల దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్న సదస్సులో సత్యనారాయణ చారి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగా ఇన్ఫ్రా సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. సత్యనారాయ ణచారిని గోసంపల్లె సర్పంచ్ కొక్కుల సుభద్రతోపాటు జిల్లావాసులు అభినందించారు. -
నిర్మల్ బంద్ విజయవంతం
నిర్మల్చైన్గేట్: కొన్ని రోజులుగా నిర్మల్లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, ఇటీవల వైద్యుడు సంతోష్రాజ్పై జరిగిన దాడికి నిరసనగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి శనివారం నిర్మల్ బంద్కు పిలుపునిచ్చారు. ఈమేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపారులు, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచుకోలేదు. బీజేపీ, బజరంగ్దళ్ నాయకులు బంద్ను పర్యవేక్షించారు. స్వల్ప ఉద్రిక్తత.. బంద్ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద గందరగోళం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయిస్తుండగా, మరో వర్గంవారు అడ్డుకుని తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు పక్షాలను చెదరగొట్టారు. బంద్లో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిసమ్మె రాజు, బీజేపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీసుల పేరిట దారి దోపిడీ
తానూరు: తానూర్–బెల్తరోడా రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆపి పోలీసు పేరిట దారి దోపిడీ చేసిన వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన గంగాధర్ కోలూర్ గ్రామంలోని తన కూతురు వద్దకు శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. భైంసా నుంచి మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గంగాధర్ను బోల్సా గ్రామ సమీపంలో అడ్డగించారు. పోలీసులమంటూ బెదిరించి అతడి నుంచి రూ.వెయ్యి దోచుకుని తానూరు వైపు పారిపోయారు. గంగాధర్ అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టించిన స్టిక్కర్ దారి దోపిడీకి పాల్పడిన వారి మోటార్సైకిల్ వెనుక భాగంలో బాడీబిల్డర్ స్టిక్కర్ ఉంది. బాధితుడు చెప్పి వివరాల ఆధారంగా పోలీసులు భైంసాతోపాటు బెల్తరోడా, బోల్సా బస్టాప్ వద్ద సీసీ పుటేజీ పరిశీలించారు. గంగాధర్ వాహనాన్ని వెంబడించిన దృశ్యంతోపాటు వాహనంపై స్టిక్కర్ను గమనించారు. దీని ఆధారంగా తానూరు గ్రామానికి చెందిన పున్నోడ ప్రకాష్గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయట పడింది. తానూరుకు చెందిన ప్రకాష్, మహారాష్ట్రలోని భోకర్ తాలూకా బోరిగాం గ్రామానికి చెందిన పరమేశ్వర్ అతిగా మద్యం సేవించి దారి దోపిడీ చేసినట్లు అంగీకరించారు. ప్రకాష్ను అరెస్టు చేయగా.. పరమేశ్వర్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యులపై దాడులు అమానుషం
నిర్మల్ టౌన్: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే 24గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపైన దాడులు చేయడం హేయనీయమని ఐఎంఏ జిల్లా బాధ్యులు, పలువురు వైద్యులు పేర్కొన్నారు. నిర్మల్ ప్రెస్క్లబ్లో శనివారం సమావేశమయ్యారు. ఐ ఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రామకృష్ణ మాట్లాడు తూ.. సంతోష్రాజ్పై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తోందన్నారు. ఈ దాడిపై రాష్ట్ర, జాతీయ ఐఎంఏ శాఖలు స్పందించాయని తెలిపారు. గంటపాటు ఓపీ సేవలు నిలిపివేసి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపామన్నారు. ఇలాంటి ఘటనలను ఎవరు ప్రోత్సహించరని చెప్పారు. వైద్యులు, ఆస్పత్రులపై దాడికి పా ల్పడినవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని, పదేళ్ల జైలుశిక్షతోపాటు ఆస్తుల జప్తు వంటి శిక్షలు ఉంటాయని వివరించారు. పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తాము ఆందోళన విరమించినట్లు తెలిపారు. వైద్యుడిపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సహా, ఇతర ప్రజాప్రతినిధులు నా యకులు, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రీయింబర్స్మెంట్ బిల్లు అడిగి.. వైద్యురాలు రంజిత సంతోష్రాజ్ మాట్లాడుతూ.. పది రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారు రీయంబర్స్మెంట్ బిల్లు కోసం వచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన బిల్లుల ప్రకారం కాకుండా రెట్టింపు ఇవ్వడం కుదరదని చెప్పడంతో వారు ముందుగా ఆస్పత్రి సిబ్బందిపై, ఆ తర్వాత వైద్యుడు సంతోష్రాజ్పై దాడి చేశారని వివరించారు. ఐఎంఏ నిర్మల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్చంద్రారెడ్డి, ప్రచార కార్యదర్శి డాక్టర్ కృష్ణంరాజు, బాధ్యులు డాక్టర్ దేవేందర్రెడ్డి, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. -
క్రిటికల్ కేర్ సిద్ధం
నిర్మల్చైన్గేట్: అత్యవసర చికిత్సలు అందించేందు కు నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన భవ నం సిద్ధమైంది. గతంలో ఎప్పుడూ అందని వైద్య సేవలు అతిత్వరలో అందుబాటులోకి రానున్నా యి. గతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్రారంచారు. మొదట పనులు నత్తనడకన సాగాయి. కొన్ని నెలలుగా వేగం పుంజుకున్నాయి. మరో 15 రోజుల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక హంగులు..జీ ప్లస్–2తో అత్యాధునిక హంగులతో భవనం నిర్మిస్తున్నారు. భవనం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చిస్తున్నారు. 50 పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తున్నారు. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్..ఆధునిక పరికరాలతో కూడిన క్రిటికల్ కేర్ సెంటర్ను వేగంగా ఆధునికీకరిస్తున్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఊపిరితిత్తులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతుంది. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే ఆస్పత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పేషెంట్ల ప్రాణరక్షణలో ఇది అత్యంత కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇప్పటికే కొత్త సదుపాయం కోసం సన్నద్ధమవుతున్నారు. తుదిదశకు పనులు..ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యింది. విద్యుత్. ఆక్సిజన్ కనెక్షన్లు, అంతర్గత ఫర్నిషింగ్ పనులుశరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసి సెంటర్ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 15 రోజుల్లో పనులు పూర్తి.. క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించారు. మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పనులను తరచూ పర్యవేక్షిస్తున్నాం. 15 రోజులలో సేవలు అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీకాంత్, ఏఈ, టీజీఎంఎస్ఐడీసీ -
ప్రణాళిక లోపం రైతులకు శాపం
భైంసా/నర్సాపూర్(జి): జిల్లాలో రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన మార్కెట్, కొనుగోలు సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది శనగ, మొక్కజొన్న, కంది పంటలు మంచి దిగుబడిని ఇచ్చాయి. కానీ ప్రభుత్వం సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతులను కష్టాల్లోకి నెడుతోంది. రైతులు దిగుబడి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంటల సాగు...జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో శనగ, 64 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 14 వేల ఎకరాల్లో కంది పంటలు సాగుచేశారు. ఎకరాకు శనగ 13 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 నుంచి 50 క్వింటాళ్లు, కంది సుమా రు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. జిల్లాలో నిర్మల్, భైంసా, కుభీర్, సారంగాపూర్, ఖానాపూర్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ యార్డుల్లో నెల రోజులుగా ప్రైవేటు వ్యాపారులే పంటలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యం...జిల్లా వ్యాప్తంగా శనగ పంట కేంద్రాలు తప్ప మిగతా ఏ పంటలు కొనుగోలు చేయడం లేదు. కానీ మొక్కజొన్న, కంది పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు తమ పంటను ఎక్కడ అమ్మాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు. ఇక మరోవైపు, జొన్న, వరి పంటల కోతలు కూడా మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు లేకపోతే, రాబోయే పంటల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముంది. పంటలన్నీ ఒకేసారి మార్కెట్లోకి వస్తే ధర మరింత పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరలు కల్పించాలని కోరుతున్నారు. మద్దతు ధర దక్కక...కేంద్ర ప్రభుత్వం శనగ పంటకు క్వింటాల్కు రూ.5,875 ధర ప్రకటించింది. మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక శనగ పంట క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,200 వరకు ప్రైవేటు వ్యాపారులు ధర ఇస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట ధర మరీ తగ్గించేస్తున్నారు. క్వింటాలుకు రూ.1500 నుంచి రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోళ్లు లేక ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన శనగ పంట ఆదేశాలు రాలేదు.. ప్రస్తుతం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాగానే మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తాం. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం -
అన్ని పంటలు కొనాలి
జిల్లాలో రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనాలి. మొక్కజొన్న పంట చేతికి అందిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాలేదు. మొక్కజొన్న ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ 20 క్వింటాళ్లలోపే కొనాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అలా అయితే మిగిలిన పంట ఎవరికి అమ్ముకోవాలి. నెల రోజులుగా శనగ పంట చేతికి వచ్చిన కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. 70 శాతానికి పైగా అమ్ముకున్నాక ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మొక్కజొన్న, జొన్న, కందుల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి మద్దతు ధరకు పంటలు కొనాలి. – గంగాధర్, రైతు టాక్లి -
వైద్యుడిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ చిటికేశి సంతోష్రాజ్పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత వైద్యుడిని ఎమ్మెల్యే పరామర్శించారు. దాడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్యుడిపై దాడి చేసి 24 గంటలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. న్యాయం చేయాలని వైద్యులందరూ రోడ్డెక్కితే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
● ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు ● ఊరూరా సీతారాముల కల్యాణం.. మార్మోగిన రామనామం ● తిలకించి పులకించిన భక్తజనం ● నిర్మల్, భైంసాలో ఘనంగా శోభాయాత్ర
(నిర్మల్టౌన్/భైంసాటౌన్): జైశ్రీరామ్.. జైజై శ్రీరా మ్.. అంటూ.. జిల్లా వ్యాప్తంగా రామ నామం మా ర్మోగింది. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరూరా.. వాడవాడలా సీతారాముల క ల్యాణం వై భవంగా జరిపించారు. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కల్యాణం తిలకించి పులకించారు. అనంతరం భక్తులకు అన్నదానం చే శారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బ్రహ్మపురి రామమందిర్లో జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి రామాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్లో హిందూవాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో, భైంసా పట్టణంలో హిందూవాహిని–మహీష శాఖ ఆధ్వర్యంలో శ్రీరాముడు, హనుమాన్ శోభాయాత్ర ఘ నంగా నిర్వహించారు. నిర్మల్ దేవరకోట దేవస్థా నం వద్ద ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి శ్రీరాము డు, హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, కాషాయ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. యాత్ర చింతకుంటవాడ, పాత బస్టాండ్, బుధవార్పేట్, గాంధీచౌక్ మీదుగా కొనసాగింది. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. పురాణబజార్లోని గోశాలలో ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మున్సి పల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికుమార్రాముడి విగ్రహానికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. గోశాల నుంచి పురాణబజార్ మీదుగా గుజిరిగల్లి, గణేశ్నగర్, కుభీర్ రోడ్ మీదుగా పద్మావతి కాలనీ నుంచి బస్టాండ్ ప్రధాన రోడ్డు మీదుగా శాసీ్త్రనగర్లోని రాంలీలా మైదానం వరకు శోభాయాత్ర సాగింది. శోభాయాత్రల్లో యువకులతో కలిసి ఎమ్మెల్యేలు, భైంసా మున్సిపల్ చైర్మన్ నృత్యం చేశారు. నిర్మల్లో పోలీసులు చూపిన రూట్ మ్యాప్ కాకుండా.. మరో రూట్లో ఈ శోభాయాత్ర ను కొనసాగించారు. ఈ మార్గంలో మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి ఆధ్వర్యంలో వాటర్, మజ్జిగ పంపిణీ చేశారు. భైంసాలో పద్మావతి కాలనీలో జువెల్లరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బస్టాండ్ మార్గంలో, నర్సింహాయోగా అసోసియేష న్ ఆధ్వర్యంలో, తదితర చోట్ల మజ్జిగ, మంచినీటి పంపిణీ చేశారు. ఎస్పీ జానకీషర్మిల, అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన స్థలాల పోలీసులను మోహరించారు. -
రామ మందిర నిర్మాణానికి భూమి పూజ
బాసర: మండలలోని కిర్గుల్(కె) గ్రామంలో రామ మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ సర్పంచ్ మాలేగం మధుప్రీతితో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. సీజీఎఫ్ నిధుల ద్వారా రూ.22.40 లక్షలు ఆలయ నిర్మాణానికి కేటాయించారు. గ్రామస్తులు రూ.5.60 లక్షలు విరాళంగా సేకరించారు. మొత్తం రూ.28 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ రామ మందిరం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామ పెద్దలు, యువకులు ఈ నిర్మాణా నికి ముందుకు వచ్చి సహకరించడం అభినందనీ యమని అన్నారు. విరాళాలు అందించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో ఓని సర్పంచ్ జాదవ్ జగదీశ్పటేల్, కిర్గుల్(బి)సర్పంచ్ సరోజన మాజీ జెడ్పీటీసీ సౌండ్లి రమేశ్, బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ బలగం శైలేశ్, సీహెచ్.సాయినాథ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. -
ఖానాపూర్లో పెట్రోల్ దొంగలు
● సీసీ ఫుటేజ్లో ఐదుగురు వ్యక్తులు ఖానాపూర్: పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ లో పెట్రోల్ చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలోని ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో ఐదుగురు వ్యక్తులు వాహనాల నుంచి పెట్రోల్ తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ముఠాగా పనిచేస్తున్నట్లు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలనీలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో వాహనాలు భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు. కాలనీల్లో పోలీసు ల గస్తీ పెంచాలని కోరుతున్నారు. -
రేపు ఉల్లాస్ పరీక్ష
నిర్మల్ రూరల్: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులకు ఆదివారం ఎన్ఐవోఎస్ పరీక్ష జరగనుంది. దీనికోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ సమన్వయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గత అక్టోబర్ నుంచి 100 రోజులపాటు అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమంలో భాగంగా అక్షర కేంద్రాలలో చదు వు నేర్చుకున్న అభ్యాసకులకు ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మూడు గంటలపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో పరీక్ష నిర్వహిస్తారు. శుక్రవారం దీనికి సంబంధించిన మెటీరియల్ను డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజన్న, ఉపాధి హామీ ఏపీఎంలకు అందజేశారు. ఇందులో డీఆర్డీవో ఏఈడీ చరణ్, డీపీఎం శోభారాణి, నరసింహమూర్తి, విద్యాశాఖ సీఎంవో ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మోహన్రావు(50) అప్పుల బాధతో ఖతార్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ గల్ఫ్ సమితి(టీజీఎస్) బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్రావు కుమార్తె పాలకుర్తి లహరిక పేరిట రూ.1.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బాండ్ను గురువారం అందజేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సంఘ నాయకులు సుందరగిరి శంకర్ (ఇండియన్ ఎంబసీ ఖతార్ లో లేబర్ అండ్ ఫిషర్ మ్యాన్ విభాగం ఇండియన్ కమ్యూనిటీ బెనవాలెంట్ ఫోరం నాయకులు), ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు, ఎన్నారై రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, దొంతి అరవింద్, కుమార్ పాల్గొన్నారు. -
బుగ్గిపాలైన వలస బతుకులు
లక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమా దం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో....బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్ ముగ్గురూ కలిసి ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహన్కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. -
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
మామడ: ఉపాధిహామి పనులకు సంబందించిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక గురువారం నిర్వహించారు. ఉపాధిహామీ పనుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జూలైలో నిర్వహించే వనమహోత్సవానికి ఇప్పటి నుంచి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం చేయాల్సిన పనులను ప్రారంభించాలన్నారు. మండలంలోని 27 గ్రామపంచాయతీల పరిధిలో గతేడాది రూ.7.43 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సమావేశంలో గుర్తించారు. మండలంలో 6,882 జాబ్ కార్డులుండగా 11,312 మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు. 72 మంది వందరోజుల పనిదినాలు పూర్తి చేశారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీవీవో లక్ష్మ ణ్, హెచ్ఆర్ సురేందర్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, ఏపీవో శివాజీ, ఎస్సార్పీ మహేశ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చేపల వలలో చిక్కుకుని జాలరి మృతి
లోకేశ్వరం: చేపల వలకు చిక్కుకుని జాలరి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన జాలరి పల్లికొండ సతీష్ (31) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని మాల్కాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో వేసిన వలను తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పరిశీలన
తానూరు: ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసి వాటిని తాగడం ఎంతో మేలని మహిళా అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని బోంద్రట్ గ్రామంలో సాయిబాబా మహిళ సంఘం సభ్యురాలు సిందే అర్చన–సాయినాథ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను గురువారం పరిశీలించారు. వర్షపు నీరు భూమిపై పడకముందే సేకరించి వాటిని నిల్వచేసి అదేనీటిని ఏడాదంతా తాగుతున్నట్లు వివరించారు. దీంతో తమకు ఎలాంటి వ్యాధులు రావడం లేదని తెలిపారు. వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండి అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్చన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, సీసీ సవిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు ప్రతిభ, వీవోఏ రాణి తదితరులు పాల్గొన్నారు. -
అంతా రామమయం
నిర్మల్: ‘కోదండ రామయ్యకు, సుగుణాల సీతమ్మకు కల్యాణమంట రారండోయ్.. ఆ శ్రీసీతారాముల కల్యాణం కనులారా చూసొద్దాం..’ అంటూ జిల్లావాసులు రాములోరి గుడి కి వెళ్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా రామాలయాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చే శారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, రాములోరి పెళ్లి ని కనులారా వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. అడుగడుగునా రాముడు..వనవాస సమయంలో జిల్లా మీదుగా రామయ్య వెళ్లినట్లు చెబుతుంటారు. ఆ సమయంలోనే జిల్లాకేంద్రంలోని గండిరామన్న గుహలో లింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు చేసినట్లు చెబుతారు. అయోధ్యరాముడికి జిల్లాలో అడుగడుగునా గుడి అన్నట్లుగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని వాల్మీకినగర్ రామాలయం, బ్రహ్మపురిలో రాంమందిర్, శాంతినగర్ రామాలయాలతోపాటు ప్రధానంగా భైంసా మండలం కామోల్ రామాలయంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా మండలాల్లో రామాలయాలు ఉన్నాయి. వాల్మీకినగర్లో.. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్లోని వాల్మీకినగర్ శ్రీరామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్యాణానికి ముందుగా పందిరి వేయడం మొదలు ప్రతీ కార్యక్రమాన్ని సంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. సీతారాముల కల్యాణ క్రతువులో భాగంగా గురువారం రాములోరిని పెళ్లికొడుకుగా, సీతమ్మను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను, మంగళసూత్రం, జీలకర్ర బెల్లం తయారు చేశారు. శుక్రవారం నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. నేడు శోభాయాత్ర..హైదరాబాద్ తర్వాత జిల్లాలోనే శ్రీరామనవమి శోభాయాత్ర భారీగా జరుగుతుంది. ఏటా నవమి, అలాగే హనుమాన్ జయంతికి వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించేవారు. ఈసారి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ శ్రీరామ వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తున్నారు. నిర్మల్లో స్థానిక దేవరకోట దేవస్థానం నుంచి ఉదయం 10 గంటలకు ఈయాత్రను ప్రారంభించనున్నారు. అలాగే భైంసాలోనూ శ్రీరామనవమి ర్యాలీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిసేలా ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. -
శ్రీరామనవమికి భారీ బందోబస్తు..
భైంసాటౌన్: పట్టణంలో శుక్రవారం జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం డివిజన్ పోలీసు అధికారులతో ఆమె సమీక్ష చేశారు. శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రజలకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐలు ప్రవీణ్కుమార్, సాయికుమార్, రవీందర్, ఎస్సైలు ఉన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలిఅంతకుముందు తన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 9 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్హెచ్వోలకు సూచనలు చేశారు. అలాగే గత గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారస్థితి, పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.కౌన్సెలింగ్తో ఒక్కటైన జంటభైంసాటౌన్: పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కా ర్యాలయంలో కుటుంబ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న భరోసా కేంద్రం స త్ఫలితాలిస్తోంది. వివిధ కారణాలతో, చిన్నపాటి మనస్పర్థలతో విడిపోయిన జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నారు. గురువా రం సైతం ఓ జంట భరోసా కేంద్రంను ఆశ్రయించారు. మనస్పర్థలతో కొన్నినెలలుగా దూరంగా ఉంటున్న దంపతులకు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి చొరవతో ఆ దంపతులు ఒక్కటయ్యా రు. ఈ సందర్భంగా దంపతులు ఎస్పీకి, భరోసా కేంద్రం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
టైగర్జోన్పై గళమెత్తిన ఎమ్మెల్యే బొజ్జు
ఖానాపూర్: నియోజకవర్గంలోని ఆదివాసీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తారు. కవ్వాల్ టైగర్జోన్ కారణంగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలను పరిష్కరించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని కోరారు. మల్యాల, దొంగపల్లి, యాపల్గూడ, వంటి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాలపై డ్రోన్ సర్వే నిర్వహించడం వల్ల ఆదివాసీ మహిళల గోప్యతకు భంగం కలుగుతోందన్నారు. ఇసుక కొరత కూడా తీవ్ర సమస్యగా మారిందన్నారు. అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
నిర్మల్లో వైద్యుడిపై దాడి
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు సంతోష్రాజ్పై ఓ వర్గం వ్యక్తులు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ పట్టణంలోని వైద్యులందరూ ఆందోళనకు దిగారు. బిల్లుల విషయంలో సద రు ఆసుపత్రికి సిబ్బందితో ఓవర్గం వ్యక్తులు గొ డవకు దిగారు. ఇదే క్రమంలో వైద్యుడు సంతోష్ రాజ్పైనా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. వైద్యుల రాస్తారోకో...తోటి వైద్యుడిపై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని డాక్టర్లు అందరూ రోడ్డెక్కారు. ర్యాలీగా స్థానిక జయశంకర్ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీల కౌన్సిలర్లు, పలు సంఘాలు మద్దతు పలికాయి. గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో బస్సులు, ఆటోలు, వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికిరణ్ వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళన కొనసాగించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి సైతం వైద్యులతో మాట్లాడారు. రోడ్డుపై నిరసన తెలుపుతున్న వైద్యులు వైద్యులతో మాట్లాడుతున్న ఎస్పీ జానకీ షర్మిల -
శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. శ్రీరామనవమి రోజు నిర్వహించే శోభాయాత్రల బందోబస్తు ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్మల్: ‘కొమురంభీమ్, రాంజీగోండ్లు పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ.. జల్ జంగిల్ జమీన్ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.. ఉమ్మడి జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం.. పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది.. ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్బస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం.. ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం..’ అంటూ జనవరి 16న నిర్మల్లో జరిగిన ప్రజాపాలన బహిరంగసభలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్న నిర్మల్ జిల్లాకు యూనివర్సిటీ కావాలనే ప్రతిపాదనకు ఓకే చెబుతూ బహిరంగసభలో జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి రెండునెలలు దాటినా.. మరో రెండునెలలు గడిస్తే కొత్త విద్యాసంవత్సరం వస్తున్నా.. ఇప్పటికీ నూతన యూనివర్సిటీ ఏర్పాటు ఊసేదీ జిల్లాలో వినిపించడం లేదు. బాసర ట్రిపుల్ఐటీలో ఈ దిశగా ఏర్పాట్లూ కనిపించడం లేదు. బడ్జెట్లో కేటాయింపుల్లేవ్.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన నిధులపై స్పష్టత ఇవ్వలేదు. జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ కనిపించలేదు. ఓవైపు బాసర ఆలయ అభివృద్ధి విషయంలో మాస్టర్ప్లాన్లు తయారుచేసి పక్కన పెడుతున్నట్లే, యూనివర్సిటీని కూడా ప్రకటించి పక్కన పెట్టినట్లే కనిపిస్తోందన్న వాదన పెరుగుతోంది. ఉన్న ట్రిపుల్ఐటీకే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడం లేదని, విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం లేదని, అలాంటిది కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇప్పట్లో అవుతుందా?.. అన్న ప్రశ్నలూ పెరుగుతున్నాయి. నిర్మల్లో ఏర్పాటు చేసేలా.. బాసరలో కాకుండా జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ ఉండాలన్న డిమాండ్ కూడా ఉంది. బాసరలో ఇప్పటికే ట్రిపుల్ఐటీ ఉందని, తాత్కాలికంగా అందులో తరగతులు ప్రారంభించినా పూర్తిస్థాయి యూనివర్సిటీని మాత్రం జిల్లాకేంద్రం సమీపంలో ఏర్పాటు చేయాలంటున్నారు. జిల్లాతో పాటు చుట్టూ ఉన్న జిల్లాలకు నిర్మల్ దగ్గరలో ఉండటం, ఇక్కడ కూడా ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో పాటు ముందు నుంచీ జిల్లాకేంద్రంలోనే జ్ఞానసరస్వతీ పేరిట యూన్సివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. మరోవైపు బాసర ఆర్జీయూకేటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. అలాంటి చోట మరో అటానమస్ యూనివర్సిటీ పెట్టడం ఇబ్బందికరం. అసలు.. ఇప్పటికే 9వేలకు పైగా విద్యార్థులు ఉండటంతో ట్రిపుల్ఐటీకే ఆ స్థలం సరిపోవడం లేదు. వీటన్నింటి నేపథ్యంలో నిర్మల్లోనే కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న వాదన పెరుగుతోంది.బాసర ట్రిపుల్ఐటీ జిల్లాకు ఇస్తామని ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటు గురించి అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ కొత్త యూనివర్సిటీ ఏర్పాటుపై లేవనెత్తకపోవడంపై విద్యావంతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. ఈ ముగ్గురూ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మాట్లాడాలని, త్వరలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకురావాలని జిల్లావాసులు కోరుతున్నారు. అడిగేదెవరు...!? రెండు నెలలే.. నిర్మల్ బహిరంగసభలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించి రెండునెలలు దాటింది. మరోవైపు కొత్త విద్యాసంవత్సరానికి మరో రెండునెలలే సమయముంది. పూర్తిస్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటయ్యేదాకా, ట్రిపుల్ఐటీలో రెడీగా ఉండే సౌకర్యాలతో తాత్కాలిక విశ్వవిద్యాలయం ప్రారంభించవచ్చన్న ఉద్దేశంతోనే సీఎం బాసరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడ ఇప్పటికీ ఆ దిశగా కూడా ఏర్పాట్లు ఏవీ జరగడం లేదు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
దస్తురాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పీహెచ్సీలో సిబ్బంది హాజరు పరిశీలించారు. వర్షాలకు కూలిన ప్రహరీ, నీటి సమస్యను సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సంబంధిత అధికారులతో రివ్యూ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి.గోపాల్, ఎంపీడీవో బి.అరుణ, ఎంపీవో రమేశ్రెడ్డి, ఎంఈవో గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. ‘ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ నిర్మల్రూరల్: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ర్యాగింగ్కు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ పాఠశాలలో ఏడోతరగతి చదివే ఓ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేయడం అమానుషమన్నారు. దినేష్, ఆకాష్, సాయి, మున్నా, వర్మ, విగ్నేష్, రాజేశ్, సంతోష్, చందు, గణేశ్, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం చేరుకునేనా..!
భైంసాటౌన్: మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తిపన్ను వసూళ్లు జిల్లాలో అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మూడు మున్సిపాలిటీల్లోనూ 45 శాతం మించి వసూలు కాలేదు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుంది. పన్నుల వసూలుకు ఇంకా ఐదురోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో పన్ను వసూలు చేస్తున్నారు. నిధులు లేక నీరసం.. మున్సిపాలిటీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే పాలకవర్గం సూచనల మేరకు అధికారులు వెచ్చిస్తుంటారు. రహదారుల మరమ్మతు, తాగునీటి సరఫరా, మరమ్మతు పనులు, విద్యుత్ దీపాలు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాల కొనుగోలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు, చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ ఖర్చులు, మరమ్మతులు వంటి పనులకు ఖర్చు చేస్తారు. అయితే పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో వసూలు కావడం లేదు. ఫలితంగా ఆయా మున్సిపాలిటీల్లో రోజువారి కార్యకలాపాలకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడు తోంది.పన్నులు సకాలంలో చెల్లించాలి పన్నుల వసూలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. బిల్ కలెక్టర్లకు రోజువారి టార్గెట్ విధించి వసూలు చేస్తున్నాం. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పనుల కోసం నిధులు అవసరం. పట్టణ ప్రజలు సైతం తమ ఇంటి, ఆస్తి, నల్లా బిల్లులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి. – వై.నవీన్, మున్సిపల్ కమిషనర్, భైంసా బల్దియాల్లో పన్ను వసూళ్లు ఇలా.. మున్సిపల్ అసెస్మెంట్లు డిమాండ్ వసూలు శాతం నిర్మల్ 24,872 రూ.112.18 కోట్లు రూ.49.49 కోట్లు 44.12 భైంసా 12,540 రూ.5.60 కోట్లు రూ.1.71 కోట్లు 30.54 ఖానాపూర్ 6,954 రూ.2.55 కోట్లు రూ.1.21 కోట్లు 47.45 -
పత్తాలేని పారితోషికం
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024 నవంబర్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేవలందించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పారితోషికం కోసం 16 నెలలుగా ఎదురుచూస్తున్నారు. అధికారులను కలుస్తూ తమ సమస్య విన్నవిస్తున్నారు. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఏడాది దాటినా నేటికీ వారికి అందాల్సిన గౌరవ వేతనం రాలేదు. దీంతో అసలు వస్తుందా?.. రాదా? అనే సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికీ ఊసెత్తకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. 2024 నవంబర్లో సర్వే... సాధారణ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతో పాటు ఇటు ప్రభుత్వ పరంగా అమలు చేసే సంక్షేమ పథకాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధికారులు, సెర్ఫ్ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లుగా పనిచేశారు. ఒక్కొక్కరు 120 నుంచి 150 వరకు కుటుంబాల చొప్పున ఎంచుకొని వివరాలు సేకరించారు. ఈ సర్వే అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు కుటుంబ వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాత్రింబవళ్లు పనిచేసి ఆన్లైన్లో నమోదు చేశారు. 2,34,864 కుటుంబాల సర్వే... జిల్లాలో చేపట్టిన సర్వేలో 1,698 మంది ఎన్యూమరేటర్లతో పాటు పర్యవేక్షణ కోసం మరో 168 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున సర్వే చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 86 వార్డులు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,34,864 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలను కూడా ఈ సందర్భంగా నమోదు చేశారు. ఒక్కో కుటుంబానికి 8 పేజీలతో కూడిన సర్వే ఫారంలో 75 రకాల ప్రశ్నలుండగా, ఆయా కుటుంబ సభ్యుల నుంచి ఓపిగ్గా వివరాలు రాబట్టారు. కేవలం 20 రోజుల్లో సర్వే పూర్తి చేశారు. ఆన్లైన్ చేసిన డబ్బులు చెల్లించాలి 2024 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేశాం. 16 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. అధికారులు స్పందించి డాటా ఎంట్రీ డబ్బులు త్వరగా ఇప్పించాలి. – జి.వెంకటేష్, ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నోడల్ అధికారులు : 21 ఎన్యూమరేటర్లు : 1698 సూపర్వైజర్లు : 168 డాటా ఎంట్రీ ఆపరేటర్లు : 2164 మాస్టర్ ట్రైనర్లు : 05 స్టిక్కరింగ్ చేసిన కుటుంబాలు : 2,28,859 ఆన్లైన్ చేసిన కుటుంబాలు : 2,34,864 జిల్లాలో బకాయిలు రూ.2.06 కోట్లు.. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పున ఇవ్వాల్సి ఉంది. 2,164 మంది ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరందరికీ కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.06 కోట్ల మేర గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. -
తలాపునే గోదావరి.. పంట తడికి నీరేది?
కుంటాల – ఓలా గ్రామాల మధ్య అర్ధాంతరంగా నిలిచిన కాళేశ్వరం 28 ప్యాకేజీ పనులు భైంసా: మహారాష్ట్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే గోదారమ్మ తలాపునే ఉన్నా.. ముధోల్ నియోజకవర్గ రైతుల పంట తడికి సాగు నీరందడం లేదు. నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువల తవ్వకం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. నీళ్లొస్తాయని ఆశ పడ్డ రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గోదావరినది దాటి అవతలివైపు ఎటుచూసిన పచ్చని పొలాలు కనిపిస్తాయి. కానీ ఇటువైపు ఎండిన భూములు, మట్టికొండలే కనిపిస్తున్నాయి. గోదావరి నీరు పొలాలకు చేరితేనే ఇక్కడి పరిస్థితి మారుతుంది. 2008లో ప్రారంభమైనా.. 2008–09లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం లభించింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్లు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ఇందులో భాగంగా ముధోల్ నియోజకవర్గానికి కాలువలు తవ్వి ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని మళ్లీ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ చేశారు. ఇందుకు అవసరమయ్యే 3,026 ఎకరాల్లో 555 ఎకరాలే సేకరించారు. ముధోల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. పూర్తయితే రెండు పంటలు.. కాళేశ్వరం ప్యాకేజీ 28 పనులు పూర్తయితే ముధోల్ నియోజకవర్గంలో రెండు పంటలు పండుతాయి. బాసర, ముధోల్, తానూరు, భైంసా, కుభీర్, కుంటాల మండలాల్లో ఇప్పటికీ వర్షాధారంపైనే రైతులు ఆధారపడ్డారు. నీరందిస్తే రెండు పంటలు పండిస్తారు. ప్రస్తుతం బోరుబావుల కింద పంటలు పండిస్తున్నారు. నీటి సౌకర్యం లేని రైతులంతా ఒకే పంటతో సరిపెడుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు.. 2008 నుంచి ఇప్పటి వరకు ముధోల్ రైతాంగం ఈ కాళేశ్వరం నీటి కోసం ఎదురుచూస్తునే ఉంది. గోదావరి నది నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్ వద్ద లిఫ్ట్ నిర్మించి కాలువల ద్వారా లోకేశ్వరం, ముధోల్, తానూరు, కుభీర్ మండలాలకు మరోవైపు గుండంపెల్లి వైపు నుంచి కాలువలు తవ్వి కుంటాల, భైంసా మండలాలకు సాగు నీరు అందించేలా డిజైన్ చేశారు. ఈ విషయమై రైతులు పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిశారు. అయినా పనులు పూర్తి కావడం లేదు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి.. ప్యాకేజీ 28 పనులకు బడ్జెట్లో నిధులు ఇవ్వాలని ఇటీవలే అసెంబ్లీలో వేదికగా ప్రభుత్వాన్ని కోరాను. ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా లక్ష్యం. 2008 నుంచి ఈ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాలువలు తవ్విన మధ్యలోనే పనులు నిలిపివేశారు. ప్యాకేజీ 28కి సంబంధించి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించా. ముధోల్ నియోజకవర్గం పక్క నుంచే గోదావరి నది ప్రవహిస్తుంది. కానీ ఇక్కడి రైతులకు నీరు అందడం లేదు. గోదావరి నది నీరు కాలువల ద్వారా ముధోల్ రైతులకు అందించాలన్నది నా కల. ఈ కాలువల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరంది రెండు పంటలు పండితే రైతు కుటుంబాల కష్టాలు దూరమవుతాయి. – పవార్ రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యేకోట్ల రూపాయలు ఖర్చు.. ప్యాకేజీ 28 కింద కాలువలు తవ్వడం, పంపుల సామర్థ్యం, మోటార్లు బిగించడం ఇలా అన్ని పనులకు కలిపి ఇప్పటి వరకు రూ.235.41 కో ట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా రూ.251.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 50 వేల ఎకరాలకు సంబంధించి ఈ ప్యాకేజీ కింద రూ.486.67 కోట్లు నిధులు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల్లో 49 శాతమే పూర్తయ్యాయి. -
పెట్రోల్ కోసం బారులు..!
పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం సాయంత్రం నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. స్థానిక గీతా పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ ఉన్నా.. సిబ్బంది లేరంటూ వాహనదారులకు ఇంధనం పోయకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో వాహనదారులు గంటలతరబడి క్యూలో వేచి ఉన్నారు. రిలయన్స్ బంకు వద్ద సైతం వాహనదారులకు పెట్రోల్ పోయలేదు. బాసర రోడ్డులోని ఓ బంకు వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూలో కనిపించారు. పెట్రోల్, డీజిల్ కొరత విషయమై డీసీఎస్వో రాజేందర్ను ఫోన్లో సంప్రదించగా, కొరత లేదన్నారు. – భైంసాటౌన్ -
ఈదురుగాలుల బీభత్సం
ఇంద్రవెల్లి/బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలోని ఇన్కార్గూడలో షేక్ జాకీర్, రేఖాబాయి, అనిల్రెడ్డితో పాటు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్యార్డులో కంది పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బజార్హత్నూర్లో సల్ల ముత్తన్న, సల్ల సాయికి చెందిన మొక్కజొన్నపంట నేలకొరిగింది. కొలారిలో బుర్కులే నిర్మల, సల్ల రాములు, షెడ్కే మంతబాయి, షెడ్కె గంగా, తొర్కడే శకుంతల, బిస్సే సంగీత, డోలే అంజనాబాయి, దేశముక్ రుక్మబాయి, టార్పే వనిత, రేకేవాడ్ కుష్మాలకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగరిపడ్డాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు
సారంగపూర్: ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు నగదు రూపేణా సమర్పించిన రూ.53, 97,520 నగదు, 125.49 గ్రాముల మిశ్రమ బంగారం, 3 వేల గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కె.భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దండు సాయన్న, ఎస్సై శ్రీకాంత్, పాల్గొన్నారు. గూడెం ఆలయ హుండీ లెక్కింపుదండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి 2025 డిసెంబర్ 20 నుంచి 2026 మార్చి 23 హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 94 రోజులకు రూ.6,67,205 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నవీన్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిరాశే నిర్మల్ఖిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్)జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లుకు మంగళవారం ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కేవలం 26 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని గుర్తుచేశారు. దానికి భిన్నంగా కేవలం 8 శాతం మాత్రమే కేటాయింపులు జరపడం ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్షీణిస్తోందని, విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, సౌకర్యాల కల్పనకు క్షేత్రస్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తుచేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం కేటాయింపులు చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత వైద్య సదుపాయాన్ని ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. -
దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ జట్టుకు చాంపియన్షిప్
ఆదిలాబాద్: సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అన్ని అంశాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జట్టు చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన వేడుకలో జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చాంపియన్ ట్రోఫీ అందజేశారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్రచారం, నిర్వహణ, పతకాల్లో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మంగళవారం డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
తాండూర్: మండలంలోని తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వేట్రాక్పై రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలి పిన వివరాల ప్రకారం... బెల్లంపల్లిలోని సుభాష్నగర్కు చెందిన ఫర్హానా(29) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. మంగళవారం రైల్వేట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు..కుభీర్: మండలంలోని హల్దా గ్రామానికి చెందిన కె.మారుతి(40) మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు..లక్ష్మణచాంద: ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని పాక్పట్లలో మంగళవారం చోటు చేసుకుంది. సోన్ మండలంలోని పాక్పట్లకు చెందిన ఓల్లెపు మహేష్ (36) కట్టెలు కొట్టడానికి వెళ్లి ట్రాక్టర్ పైన ముందుభాగంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఫిట్స్ రావడంతో కిందపడ్డాడు. గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఓల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. -
ఉచిత శిక్షణ.. దేశ రక్షణ
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీ కిష్టాపూర్ తండాకు చెందిన బానోత్ రాజు నాయక్, లత దంపతుల ఇద్దరు కుమారులు వంశీ కృష్ణ, సాయికృష్ణ 2018లో ఒకేసారి ఆర్మీలో చేరా రు. వంశీకృష్ణ జవాన్గా సాయికృష్ణ పూణేలోని ఆర్మీ మెడికల్ డిపార్టుమెంటులో రేడియాలజీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఇంటిని విడిచి వెళ్ల డం ఇష్టంలేని తల్లిదండ్రులు పెద్దకుమారుడిని తిరి గి రావాలని కోరగా వంశీకృష్ణ ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. ఖాళీగా ఉండడం ఇష్టంలేక 2023 లో ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న పరిసర గ్రామాల్లోని పది మంది యువకులకు గ్రామంలోనే శిక్షణ ఇచ్చా డు. అందులో నలుగురు ఆర్మీకి ఎంపికయ్యారు. ఉచితంగా శిక్షణ ఇక్కడితో శిక్షణ ఆపకూడదనే సంకల్పంతో ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా డు. శిక్షణలో చేరిన కొందరు నగదు రూపేనా ఇవ్వడంతో వాటితో నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులకు శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించాడు. సెలవులపై ఇంటికి వచ్చిన సాయికృష్ణ ఖా ళీగా ఉండకుండా ఫిజికల్ ఈవెంట్లో వారికి మెలకువలు నేర్పించాడు. మూడేళ్లలో అతని వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలో ఉద్యోగం సాధించారు. దేశానికి సేవ చేసేందుకు వెళ్లి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి వచ్చిన యువకుడు తనలాంటి ఎందరినో దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ ఇచ్చి దేశ సేవ కోసం పంపిస్తున్నాడు. జన్నారం మండలానికి చెందిన ఈ యువకుడి వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలలో ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 26 నుంచి మరో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కథనం. -
షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
తాంసి: మండలంలోని పొన్నారిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. దేవల్ల ఓమక్క ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో కుటుంబసభ్యులు బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. స్థానికులు బిందెలతో నీళ్లుచల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫ్రిజ్తో పాటు ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఘటనలో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతోంది. -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
సారంగపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభివన్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం పరిశీలించడంతోపాటు వారితో కలిసి అక్కడే భోజ నం చేశారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్నభోజనం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నా రు. తరగతి గదిలో విద్యార్థులను గణిత సమస్యలు బోర్డుపై రాసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల రికార్డులు పరిశీలించి విద్యార్థుల, ఉపాద్యాయుల హాజరు వివరాలు ఆరా తీశారు. తర్వాత మధ్యాహ్నభోజన కార్మికులతో మాట్లాడి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. ఈక్రమంలో విద్యార్థులు తమకు పాఠశాలలో భోజనశాల లేదని కలెక్టర్కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే భోజనశాల ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలి.. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి నాణ్యతతో నిర్మించుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని బిల్లులు సైతం ఎప్పటికప్పుడు చెల్లిసస్తామన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం ఇసుక, మొరం అవసరమైతే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకుని తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, స్థానిక సర్పంచ్ సాయన్న, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు ఉన్నారు. -
మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ
నిర్మల్ రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక అమలులో నిర్లక్ష్యం, అపరిశుభ్రత, మెనూ అమలు లోపాలపై వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా పరిగణించారు. పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశా రు. ఇటీవల హైదరాబాదులో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభు త్వ పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన నా ణ్యతపై ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన భోజనం అందేలా చూడటం తమ మొదటి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుత పర్యవేక్షణ కోసం మంగళవారం నుంచే ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. కడ్తాల్ హెచ్ఎం సస్పెన్షన్ సోన్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శించిన హెచ్ఎం కె.వెంకటేశ్వర్పై సస్పెన్షన్ వేటు పడింది. భోజనంలో పురుగులు, రాళ్లు కనిపించడం, నాణ్యతలేమి, మెనూ ప్రకారం ఆహారం అందకపోవడం వంటి అంశాలపై కొందరు విద్యార్థులు, గ్రామస్తులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 23న డీఈవో దర్శనం భోజన్న, సంబంధిత అధికారులతో కలిసి పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతోపాటు భోజనంచేసి పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల ప్రాంగణం, కిచెన్ షెడ్డు, మధ్యా హ్న భోజన రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించిన అధికారులు అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భోజనంలో పురుగులు కనిపించడం, కిచెన్ షెడ్డు పరిశుభ్రంగా లేకపోవడం, మెనూ పాటించకపోవడం వంటి కారణాలపై హెచ్ఎంను బాధ్యుడిగా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎం కె.వెంకటేశ్వర్ను సస్పెండ్ చేశారు. హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.. కడ్తాల్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ కె.వెంకటేశ్వర్పై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీయుటీఎఫ్) నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్, ప్రధాన కార్యదర్శి వాహిద్ఖాన్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23న జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ పూర్తికాకముందే మరుసటి రోజే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం తగదని వ్యాఖ్యానించారు. జిల్లాలో 733 మంది స్పెషల్ ఆఫీసర్లు జిల్లాలో కొన్నిచోట్ల మధ్యాహ్న భోజన నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ దిద్దుబాటు చర్యగా కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 733 మంది స్పెషల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు ఒక స్పెషల్ అధికా రిని కేటాయించి, వారు ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను నిరంతరం పరిశీలిస్తారు. సీనియర్ ఉపాధ్యాయులను స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపిక చేశారు. మంగళవారం నుంచే విధుల్లో చేరిన స్పెషల్ అధికారులు తమ తమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విచారణ చేస్తున్న డీఈవో భోజన్న -
నిర్మల్
విదేశీ యత్రకు సార్లు తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విదేశాలకు పంపించనుంది.క్షయ నిర్మూలనకు కృషి చేయాలి నిర్మల్చైన్గేట్: జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ కోరారు. ప్రపంచ క్షయ నివారణ దినం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 106 గ్రామాల్లో 100 రోజులు స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. క్షయ నిర్ధారణ అయినవారికి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ పవన్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు, ఎస్టీఎల్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్సభ స్థానాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మొదలైన జనగణన ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో 2011 జనాభా ప్రాతిపదికనే కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికలు సాగుతున్నాయి. నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మరో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో సగం శాతం అంటే 60వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రస్తుతం ఉన్న పది శాసనసభ స్థానాలకు మరో ఐదు స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యుల సంఖ్య పెరగనుంది. రిజర్వు స్థానాల్లో మార్పులుకొత్త స్థానాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోనుంది. 2009 చివరలో నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం సర్దుబాటు చేయగా, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. కానీ సంఖ్యలో మార్పు రాలేదు. తాజాగా 15 స్థా నాలకు చేరితే చట్టసభలకు ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక కొత్తగా ఏర్పాటయ్యే స్థానాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంది. జిల్లా యూనిట్గా ఎస్టీ జనాభా ఆ వర్గాలకు స్థానాల రిజర్వు జరగనుంది. ఎస్సీ స్థానాలకు రాష్ట్ర యూనిట్గా రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ రాష్ట్ర, జిల్లా జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేక లాటరీ ప్రాతిపదికన కేటాయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రం యూనిట్గా లోక్సభ స్థానాలుమరో వైపు రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, మరో తొమ్మిది పెరగనున్నాయి. అయితే రాష్ట్ర స్థాయి జనాభా యూనిట్గా లోక్సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) ఎంపీ స్థానాలతోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటవుతుందా? లేదా? అనేది డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతేనే స్పష్టత రానుంది. ఒకే జిల్లా పరిధిలోనే నియోజకవర్గాలుకొత్త జిల్లాల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిలాల్లో కాకుండా ఒకే జిల్లాలోనే ఉండనున్నాయి. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలు అటు ఇటుగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పూర్తిగా స్థాయి ఆదిలాబాద్, బోథ్లు ఉండగా, ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్ ఉండగా, పాక్షికంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, దస్తూరాబాద్, కడెం మండలాలు ఉన్నాయి. మిగతా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం ఒక్కటి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక మంచిర్యాల జిల్లా పరిఽధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు సైతం పక్క జిల్లాల్లో ఉన్నాయి. దీంతో పాలనలో ఇబ్బందులు రాకుండా ఒకే జిల్లా పురిధిలోనే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యేలా కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది.ఎక్కడెక్కడ కొత్తవి?ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాలైన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక జనాభాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధి మండలాలను కలుపుతూ మళ్లీ కొత్తగా స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్తోపాటు విస్తీర్ణంలో పెద్దదైన బోథ్ స్థానం, ఖానాపూర్ పరిధి ఏజెన్సీ ఉట్నూర్లో మార్పు జరగనుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధి నగర ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలైన లక్సెట్టిపేట, ఇక ఆసిఫాబాద్, సిర్పూర్ రెండు నియోజకవర్గాల పరిధి మండలాల్లోనూ కొత్తగా ఒక స్థానం ఏర్పడనుంది. ఉమ్మడి జిల్లా అసెంబ్లీ స్థానాలు జిల్లా 2011 జనాభా పాతవి కొత్తగా ఆదిలాబాద్ 7,08,972 02 02 కుమురంభీం 5,15,812 02 01 మంచిర్యాల 8,07,037 03 01 నిర్మల్ 7,09,418 03 01 -
రాజీతో సత్వర న్యాయం
నిర్మల్ టౌన్: తెలిసో, తెలియకో చేసిన తప్పులకు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నవారు రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించుకునే అవకాశాన్ని లోక్ అదాలత్ కల్పిస్తోంది. రాజీ మార్గంలో ఇరు వర్గాలకు ఇందులో న్యాయం జరుగుతోంది. వివాదాలను సామరస్యంగా ముగించే గొప్ప వేదిక లోక్ అదాలత్. జిల్లా వ్యాప్త నిర్వహణ నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో ఈనెల 28న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్ కేసులతోపాటు విచారణ దశలో ఉన్న సమస్యలను ఒకే రోజులో పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాజరయ్యే విధానం ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ సంబంధిత కోర్టులో హాజరు కావాలి. ఆధార్ కార్డు తప్పనిసరి. హాజరైన వెంటనే రాజీ ప్రక్రియ పూర్తి చేసి కేసు ముగించుకోవచ్చు. ఒకే రోజు పరిష్కారం లభిస్తుంది. ఏళ్లుగా కోర్టు వాయిదాలకు తెరపడుతుంది. ఫార్మల్ విచారణ లేకుండా సులభంగా పరిష్కారం లభిస్తుంది.న్యాయ ఫీజులు, ఖర్చులు ఆదా అవుతాయి. తక్కువ ఖర్చుతో శాంతియుత ముగింపు లభిస్తుంది. రాజీ చేసుకునే కేసులు.. -
యువ ‘వికాసం’పై ఆశలు?
నిర్మల్చైన్గేట్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం రూపొందించింది. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం గతేడాది దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయి తే ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో నైరాశ్యం నెలకొంది. ఈతరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. దీంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 37 వేల దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకానికి 2025లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు జిల్లాలో 37 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఆయా సామాజికవర్గాల వారికి కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు 2025 జూన్ 2న ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అప్పట్లో కేటాయింపులు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పథకం అమలుకు బ్రేక్ పడింది. తాజాగా నిధులు కేటాయించడంతో ఆశలు చిగురించాయి. చిన్న రుణాలు వంద శాతం రాయితీ.. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల వరకూ రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం రాయితీ ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణం పొందితే 90 శాతం రాయితీ, రూ.2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం రాయితీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందినవారికి 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది రూ.4 లక్షల వరకు రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా రాజీవ్ యువ వికాసం పథకానికి అందిన దరఖాస్తులు మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బాసర 25 196 403 115 భైంసా 82 638 1,228 253 దస్తురాబాద్ 161 302 488 2 దిలావర్పూర్ 130 191 534 163 కడెం 412 690 930 83 ఖానాపూర్ 274 536 957 67 కుభీర్ 469 431 1,234 107 కుంటాల 94 261 799 89 లక్ష్మణచాంద 103 280 717 78 లోకేశ్వరం 110 431 811 74 మామడ 325 238 501 124 ముధోల్ 95 338 586 298 నర్సాపూర్(జి) 88 229 644 164 నిర్మల్ రూరల్ 178 334 869 70 పెంబి 207 97 234 20 సారంగాపూర్ 499 425 1,387 160 సోన్ 101 204 722 75 తానూర్ 143 375 755 95 భైంసా మున్సిపాలిటీ 21 383 952 1,218 ఖానాపూర్ మున్సిపాలిటీ 28 259 784 340 నిర్మల్ మున్సిపాలిటీ 82 514 2,757 2,376 కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ యూనిట్లు నిధులు కోట్లలో ఎస్సీ 7350 2894 39.96 ఎస్టీ 3627 2325 25.35 బీసీ 17286 3876 41.00 ఎంబీసీ/ఈబీసీ 923 842 8.90 మైనార్టీ 5926 1045 17.41 క్రిస్టియన్ 65 27 0.42 -
అందుబాటులోకి మన ఇసుక వాహనం
నిర్మల్చైన్గేట్: మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం యాప్, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, పౌర సేవల గుర్తింపు పత్రాలజారీ తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. యాప్ వివరాలపై తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులంతా ఈ యాప్పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో మాత్రమే ఇసుక అమ్మక కూపన్లు ఇవ్వాలన్నారు. ఈ విధానంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. అన్నిరకాల పౌర సేవల గుర్తింపు పత్రాల జారీలో ఆలస్యం చేయవద్దని సూచించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి, ఓటర్ ప్రోజెని మ్యాపింగ్ త్వరగా పూర్తిచేయాలన్నారు. మండలాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మైనింగ్ ఏడీ హరి ప్రసాద్, భూగర్భ జలాల శాఖ సంచాలకులు శ్రీనివాసబాబు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ సరఫరాపై దృష్టి
నిర్మల్చైన్గేట్: నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ హన్మకొండ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజినీర్ బి.అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. 33, 11 కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న డీటీఆర్లను శాఖకు చెందిన వాహనాల ద్వారా ఉచితంగా తరలించాలని తెలిపారు. ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలన్నారు. వేసవికి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఓవర్లోడ్ నివారణకు కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులకు 1912 ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. భద్రతా అవగాహన కార్యక్రమాలు, పల్లెబాట నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ జె సుభాష్, డీఈలు డి నాగరాజు, ఓ వెంకటేశ్వర్లు, తిలక్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
శాశ్వత వ్యవసాయంపై అవగాహన
ఖానాపూర్: అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థతో పాటు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో శాశ్వత వ్యవసాయ విధానం(పర్మ కల్చర్) ద్వారా ప్రకృతి సాగు, అనుబంధ రంగాల్లో జీవనోపాధి కల్పనపై సత్తన్పల్లి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ విజ యానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు. ప్రాజెక్టు డైరెక్టర్, శాశ్వత వ్యవసాయ నిపుణుడు కొప్పుల నరసన్న మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే శాశ్వత వ్యవసాయ విధానాలు, భూసంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తి, జీవవైవిధ్యం పెంపు, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలను వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రసాయన ఆధారిత వ్యవసాయంతో భూమిలోని పోషకాలు, సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, నేల జీవరాసుల నష్టం, పంటల వైవిధ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అడవులను నరికి సాగు చేయడంతో వన్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతోందన్నారు. సమస్యలను అధిగమించేందుకు మూడు సంవత్సరాల ప్రణాళికతో భూసార సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు చేస్తామని తెలిపారు. అంతకముందు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వందశాతం సబ్సిడీపై మంజూ రైన విత్తన ప్యాకెట్లను పలువురు రైతులకు పంపి ణీ చేశారు. సంస్థ సీఈవో పద్మ, స్టేట్ కోఆర్డినేటర్ స్నేహ, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుమన్, సంస్థ ప్రతినిధులు పవన్, సుప్రియ, రమ్య, ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ వైస్చైర్మన్ బోసు నారా యణ, నాయకులు నేతుల లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వేసవి ఇబ్బందులు లేకుండా చూడాలి
నిర్మల్చైన్గేట్: వేసవికాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. వేసవి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బ బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రజల దాహార్తి తీర్చేలా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు విరివిగా ఓఆర్ఎస్ పొట్లాలు పంపిణీ చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు అధిక ఉష్ణోగ్రత సమయంలో జాగ్రత్తవగా ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, వడదెబ్బ సమస్యలతో వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనచోట బోరు బావులకు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి ఇబ్బందులు ఏర్పడితే, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమస్యలు తీర్చాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ సంభవించేందుకు ఆస్కారం ఉన్నందున అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు కాపాడుకోవాలి
మామడ: భూగర్భ జలాలను కాపాడుకోవాలని భూగర్భశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్బాబు అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్బంగా మండలంలోని బండలఖానాపూర్లో భూగర్భ జలశాఖ, అవల్రూరల్ లైవ్లీహుడ్ ఎంపవర్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలు పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టాలని తెలిపారు. భూగర్భ జలాల వినియోగం, నిర్వహణ, సంరక్షణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, సర్పంచ్ కళ్యాణిసచిన్కుమార్, ఈజీఎస్ ఏపీవో శివాజీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ క్రాంతి, మత్స్యపరిశ్రమశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రేపు పెన్షనర్ల నిరసన
నిర్మల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలుపనున్నట్లు పెన్షన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న తెలిపారు. సంఘ భవనంలో సోమవారం మాట్లాడారు. వాలిడేషన్ యాక్ట్తో పెన్షనర్ల అస్తిత్వానికి ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాక్ట్ను ఉపసంహరించుకోవాలని ఈనెల 25న పెన్షనర్ల భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్తామన్నారు. కలెక్టర్ ద్వారా ప్రధానికి విజ్ఞాపనపత్రం ఇస్తామన్నారు. జిల్లాలోని పెన్షనర్లందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎల్.గంగన్న, జిల్లా కార్యదర్శి మోహన్రెడ్డి, యూనిట్ బాధ్యులు రమేశ్, జనార్దన్, బాలకష్ణ, శేషాద్రి, కమలాకర్, జిల్లా బాధ్యులు పోశెట్టి పాల్గొన్నారు. -
స్పందించిన కలెక్టర్..
పాదయాత్రగా వచ్చి సమస్యలను ఏకరువు పెట్టిన గిరిజనులపై కలెక్టర్ అభిలాషఅభినవ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలతో కమిటీ వేస్తామన్నారు. మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, పూసం సచిన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌతమ్కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు దుర్గం నూతన్కుమార్, బొమ్మెన సురేశ్, వసుంధర, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, షశువుద్దీన్, నర్సయ్య, ముత్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
నిర్మల్ఖిల్లా: గోదావరి పుష్కరా లు విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపా రు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హ నుమంతరావు, ప్రిన్సిపల్ సెక్రట రీ శైలజ రామయ్యర్ బాసరలో పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాష అభినవ్తో సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాసరలో చేపట్టిన పనులకు సంబంధించి వివరా లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాసర ఆలయానికి చేరుకునేలా రోడ్లను తీర్చిదిద్దుతామని అన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి.. నిర్మల్రూరల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. అనుమతులు లభించిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. చివరిదశ పనులు మిగిలి ఉన్న నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి, గృహప్రవేశాలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు గృహ ప్రవేశాలు చేసిన ఇళ్ల వివరాలు, ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం నిర్మల్: ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కారమవుతుందని, అనవసర ఆవేశాలతో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ట్రిపుల్ఐటీ(ఆర్జీ యూకేటీ)లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, సెలవులు ప్రకటించడం, తది తర అంశాలపై సోమవారం హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో ప్రస్తుత స్థితిగతులను, విద్యార్థుల ఆందోళనల వెనుక ఉన్న కారణాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ మంత్రికి వివరించారు. క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేసి, భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. సమస్యలు ఏవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలను కా పాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప ష్టం చేశారు. క్యాంపస్లో మౌలిక వసతులు, విద్యాప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే క్యాంపస్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ట్రిపుల్ఐటీని సందర్శించి, విద్యార్థులతో చర్చిస్తామన్నారు. -
రేవంతన్నా.. ఒక్కసారొచ్చిపో!
నిర్మల్ఆటల్లో మెరికలు..! ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఆటల్లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ‘ప్రజావాణి’ అర్జీలు పరిష్కరించాలి ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ అధికారులను ఆదేశించారు.రాష్ట్రస్థాయిలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ నిర్మల్టౌన్: హైదరాబాద్లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 21 నుంచి 23 తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17, 19 బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ముగ్గురు బాక్సర్లు ఒక రజత, రెండు కాంస్య పతకాలు సాధించారు. 54–47 కేజీల విభాగంలో సుజల రజత పతకం, ఆర్.అనన్య 45–48 కేజీల విభాగంలో, దివ్య 60–63 కేజీల కాంస్య పతకాలు గెలిచారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా బాక్సింగ్ సెక్రెటరీ, కోచ్ చందుల స్వామి క్రీడాకారులను అభినందించారు. నిర్మల్: జ్ఞాన సరస్వతీమాత కొలువైన బాసరలో ఉన్న మరో చదువుల క్షేత్రం ఆర్జీయూకేటీ(ట్రిపుల్ఐటీ). గ్రామీణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అద్భుతవరం. అలాంటి విద్యాలయంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని అనుకుంటున్నంతలోపే ఏదో ఒక సమస్య వస్తోంది. తాజాగా తేజశ్విని అనే విద్యార్థిని మృతిచెందడంతో మరోసారి విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే ట్రిపుల్ఐటీలో పరిస్థితులు, ఏళ్లుగా వారు పడుతున్న ఇబ్బందులు, ప్రాంగణంలో పేరుకుపోయిన సమస్యలపై సీఎం రేవంత్రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. మూడేళ్లక్రితం ట్రిపుల్ఐటీలో విద్యార్థులు రోజులతరబడి చేసిన ఆందోళనల నేపథ్యంలో నాడు పీసీసీ హోదాలో ఉన్న ఆయన పోలీసుల కళ్లుగప్పి, ఏకంగా గోడదూకి క్యాంపస్లోకి వచ్చారు. ఇక్కడి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి బాసరకు వచ్చిపోవాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రిగానూ ఉన్న ఆయన వస్తేనే ఆర్జీయూకేటీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. స్థాయికి తగ్గ పట్టింపేది? ‘విద్యార్థుల సమస్యలపై నిరసన చేస్తుంటే.. ఏసీ రూమ్ల్లో అధికారులు పడుకుంటున్నారు. విద్యార్థుల సౌకర్యాలపై పట్టించుకోవడం లేదు..’ అని అంటున్న బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆక్రోశానికి అర్థం ఉంది. ‘మేం శాయశక్తులా కృషిచేస్తున్నాం. వర్సిటీలోనే ఉంటూ విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాం. సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తున్నాం..’ అని అక్కడి అధికారులు చెబుతున్న మాటలు సమ్మతమే. కానీ.. ఇక్కడ బాసర ట్రిపుల్ఐటీ స్థాయికి తగ్గట్లుగా ప్రభుత్వాలే పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే విద్యాప్రాంగణంలో అసౌకర్యాలపై ఏళ్లుగా అక్కడి విద్యార్థులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అరకొర నిధులను విదిలిస్తూ.. కనీసం ఏడాదిలో ఒక్కసారైనా వర్సిటీలోకి అడుగుపెట్టకుండా పాలకులు కా లం గడిపేస్తున్నారు. ఎండ, వాన లెక్కచేయకుండా 2022లో పెద్దఎత్తున విద్యార్థులు చేసిన ఆందోళనలతో అప్పటి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి తరలివచ్చారు. ఆ తర్వాత ఏదో చేసినట్లు మమ అనిపించారు. ఆ తర్వాత మళ్లీ పాతకథనే పునరావృతం కావడంతో ప్రస్తుత ప్రభుత్వం ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ను నియమించింది. అకడమిక్ బాగున్నా.. విద్యాపరంగా దేశంలోనే చాలా వర్సిటీలతో బాసర ట్రిపుల్ఐటీ పోటీపడుతోంది. ఇక్కడి విద్యార్థులు తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. మంచి కంపెనీల్లో రూ.లక్షల్లో వేతనాలూ అందుకుంటున్నారు. కొత్త ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులైన తర్వాత అకడమిక్ పరంగా చాలావరకు మార్పులు వచ్చినట్లు విద్యార్థులూ ఒప్పుకుంటున్నారు. కానీ.. అరకొర వసతులు, అసౌకర్యాల విషయంలోనే ఎలాంటి మార్పు లేదని, సరైన వైద్యం వంటివి లేక విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. పట్టింపు లేదన్న వాదనను ఆ విద్యార్థులే బలంగా వినిపిస్తున్నారు. ఇక్కడి వైద్యసేవలపైన ముందునుంచీ ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తేజశ్విని మరణానికీ సకాలంలో సరైన వైద్యం, సలహాలు అందించలేదనేది విద్యార్థులు పేర్కొంటున్నారు. వేలమంది ఉండే చోట పూర్తిస్థాయిలో మల్టీస్పెషాలిటీ సౌకర్యాలను ఎందుకు అందించరూ.. అన్న ప్రశ్న బలంగా వస్తోంది. బాసర ట్రిపుల్ఐటీఆందోళన చేసేదాకా ఎందుకు.. రాష్ట్రంలో ఉన్న ఏకై క ట్రిపుల్ఐటీ మెయిన్క్యాంపస్లో ఏం జరుగుతోందన్న విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియదా..!? క్యాంపస్లో ఎవరేం చేస్తున్నారు, విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారు.. అనే విషయాలు పైస్థాయి దాకా వెళ్లకుండా ఉంటాయా..!? వర్సిటీలో ఏం జరుగుతుందో తెలిసినా ప్రభుత్వం సైలెంట్గా ఉంటోందా..!? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో ఉన్న వర్సిటీపై స్థానిక ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ మినహా ఎవరూ స్పందించడం లేదు. ఇది కూడా ప్రభుత్వం సీరియస్గా స్పందించకపోవడానికి కారణమా..!? అన్న సందేహాలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది విద్యార్థులే మిగితావారిని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఏది ఏమైనా.. ఇక్కడ ఆర్జీయూకేటీలో సమస్యలు ఉన్నవి వాస్తవం. ఏ ప్రభుత్వం వాటిపై సీరియస్గా దృష్టిపెట్టి పరిష్కరించడం లేదు. సీఎం సార్ వస్తేనే.. ఓవైపు ప్రపంచంతో పోటీపడే స్థాయిగల విద్యార్థులు ఉన్నా.. వారికి కనీసం సౌకర్యాలు కల్పించే స్థాయిలో నిధులు ఇవ్వడం లేదు. బాసర ట్రిపుల్ఐటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వస్తేనే ఆర్జీయూకేటీలో అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. లేనిపక్షంలో జిల్లాలో ఉన్న ఒక్క విద్యాక్షేత్రం ఎప్పటికీ ఇలా ఏదోఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటుంది. ఈ ఫొటో 2022, జూన్ 17నాటిది. ఇందులో మాస్క్ పెట్టుకుని ఉన్నది అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ఆరోజు బాసర ట్రిపుల్ఐటీ అగ్ని గుండంలా మండుతోంది. తమ సమస్యలపై ఇక్కడి విద్యార్థిలోకం భగ్గుమంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాసరవైపు ఎవరినీ వెళ్లకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు పెట్టింది. అలాంటి నిర్బంధంలో.. వాహనాలు, డ్రెస్సులు మారుస్తూ, మాస్కులు పెట్టుకుంటూ హైదరాబాద్ నుంచి రేవంత్రెడ్డి బాసర మండలానికి చేరుకున్నారు. ఆర్జీయూకేటీ వెనుకవైపు నుంచి ట్రాక్టర్ ఎక్కి, పంటచేల మీదుగా ప్రాంగణానికి చేరుకున్నారు. గోడదూకి, ముళ్లకంపల మధ్యలో నుంచి విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్టుచేసి లోకేశ్వరం పోలీసుస్టేషన్ తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ పంపించారు. -
ఎండలో నడిచి.. ఏకరువుపెట్టి..
నిర్మల్:‘గూడెం దాటిపోవాల్నంటే.. వాగు దాటాలె. పిల్లాజెల్లతోనే పాణాలు చేతుల పట్టుకుని ఆ నీళ్లల దాటుకుంటూ పోతున్నం. ఆనాకాలమైతే మా గోస ఓళ్లకు చెప్పుకోవాల..! ఇట్ల ఎన్నో కష్టాలున్నయ్. ఇంకెన్నేండ్లిట్ల బతకాల..!’ అంటూ పెంబి మండలం యాపాలగూడ గ్రామస్తులు తమ గోస వినిపించారు. పెంబి మండలంలో కష్టాలు పడుతున్న పలు గూడేలు తమ కష్టాలను ఏకరువు పెట్టేందుకు ఏకంగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాకేంద్రానికి నడిచివచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి చేరుకుంది. అంతదూరం నుంచి ఎండలో నడిచి వచ్చిన ఆ గిరిజనుల గోడు వినేందుకు స్వయంగా కలెక్టర్ అభిలాషఅభినవ్ వారివద్దకు వచ్చారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో.. పెంబి మండలంలోని అటవీ, మారుమూల గ్రామాలు, గూడేలా సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 21న యాపాలగూడ నుంచి జిల్లాకేంద్రానికి పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో మండలంలోని యాపాలగూడ, చాక్రేవు, వస్పల్లి, ధోందరి, రాంనగర్, కొలాంగూడ(జంగుగూడ), రాముగూడ, సత్తుగూడ, గుమ్మెనకొలాంగూడ, రావిగూడ(కొసగుట్ట),యాపల్గూడ(నాయక్పోడ్గూడ) తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మూడోరోజైన సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్నారు. అభివృద్ధికి అడ్డంకులు.. పెంబి మండలంలోని గిరి ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, ఇక్కడి ప్రజలు పడుతున్న సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. పాదయాత్రగా నిర్మల్కు చేరుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. పెంబి మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే 75కి.మీ. పాదయాత్ర చేపట్టామని చెప్పారు. దొత్తివాగు, కడెంవాగులపై వంతెనలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు, నిర్మాణాలకు అటవీ అనుమతులు ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వడంతోపాటు పెంబిలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ను నియమించాలని డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామాలవారీగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు విన్నవించారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
కాసిపేట: సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభించకముందు ఇచ్చిన హామీల మేరకు ఓపెన్కాస్ట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత యువకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని కోమటిచేను, పల్లంగూడ, సోమగూడం ప్రాంతాలలో ఇంటికో ఉద్యోగం, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి రైతుల వద్ద భూమిని యాజమాన్యం కాసిపేట –2 ఓపెన్కాస్ట్లకు సేకరించి నేడు నిర్వాసితులకు మొండి చేయి చూపించిందన్నారు. ఓపెన్కాస్ట్లో గత పదేళ్లుగా దుర్గ, ఆర్వీఆర్ కంపెనీలలో డంపర్ ఆపరేటర్లుగా పని చేసిన తమను మరిచి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్ప్రెస్వే కంపెనీ కార్మికులను తీసుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు దుర్గం గోపాల్, బాధిత యువకులు కుమ్మరి శ్రీకాంత్, కుడిమెత చంద్రమౌళి, వెడ్మ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు. -
మానవహక్కుల చైర్మన్కు ఘన స్వాగతం
జన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ‘హైకోర్టు ఆదేశాలు పాటించరా’రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఈ నెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు హాజరై సంతకం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్ను కలుస్తామని తెలిపారు. అసెంబ్లీ, కౌ న్సిల్లో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతామ ని పేర్కొన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. క్యాతనపల్లిలో 14 స్థానాలు బీఆర్ఎస్–సీపీఐ గెలుచుకు న్నా ఏడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అధికార, పోలీ స్ బలాన్ని ఉపయోగించి తమపై లాఠీచార్జీ చేయించి అన్యాయంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్, రామిడి కుమార్, సంపత్ తదితరులున్నారు. -
‘సుందిళ్లకు నీటి తరలింపు మరో విపత్తు’
పాతమంచిర్యాల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు కాళేశ్వరం వంటి మరో విపత్తుగానే పరిగణించాలని వామ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్స్క్ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే క్రమంలో సంభవించే పరిణామాలు, విపత్తులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా సుందిళ్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల హామీలు నెరవేర్చాలి’
శ్రీరాంపూర్: ఎన్నికల్లో ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుందన్నారు. కార్మికులకు సాధారణ ఎన్నికల్లో, గు ర్తింపు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, వంగ తిరుపతి, బాకం నగేశ్, గుంట జగ్గయ్య, జనార్ధన్, కాటం రాజు, పొగాకు రమేశ్, ఆకునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
శనగ కొనుగోళ్లు షురూ..
భైంసాటౌన్/తానూరు/ముధోల్: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని ఏఎంసీ మార్కెట్ యార్డు ఆవరణ లో, తానూరు మండల కేంద్రంలోని డాంగపల్లి వ్యవసాయ మార్కెట్ గోదాంలో, ముధోల్ మండలం విఠోలి గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాల ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు కొనుగో లు చేస్తారని తెలిపారు. రైతులు దళారులకు విక్రయించకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి క్వింటాల్కు రూ.5,875 మద్దతు ధర పొందాలని తెలిపారు. త్వరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. తానూరులో రైతును సన్మానించారు. కార్యక్రమాల్లో భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రా వు పటేల్, మార్క్ఫెడ్ డీఎం శ్రీనివాస్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్, పీఏసీఎస్ ప్రత్యేకాధి కారి రాజమౌళి, పీఎసీఎస్ మాజీ చైర్మన్ నారాయణ్రావ్ పటేల్, బీజేపీ తానూరు మండల అధ్యక్షుడు లక్ష్మ ణ్రెడ్డి, ముధోల్ మండల అధ్యక్షుడు కోరి పోత న్న, బోరిగాం సర్పంచ్ కల్లెడ కిష్టయ్య, ఏవో మని ష, పీఎసీఎస్ సీఈవో సాయిరెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, గోవింద్రావ్పటేల్, శివాజీ పటేల్ పాల్గొన్నారు. -
అడవుల్లో శివంగులు
చెన్నూర్రూరల్: ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమతం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. టీచర్లు, పోలీసులు, అటవీశాఖ, ఎకై ్సజ్శాఖ ఇలా అనేక రంగాలలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారు. అటవీశాఖలో మహిళలు మగవారికి తీసిపోకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ డివిజన్, చెన్నూర్ రేంజ్ పరిధిలో ఏడుగురు మహిళలు వివిధ పోస్టుల్లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీవైఆర్వో (డిప్యూటీ రేంజ్ అధికారులు), ఒక్కరు ఎఫ్ఎస్వో(ఫారెస్టు సెక్షన్ అధికారి), నలుగురు ఎఫ్బీవో (ఫారెస్టు బీట్ అధికారులు)లు ఉన్నారు. విధులు, బాధ్యతలు.. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరేడ్ చేయడంతోపాటు పురుషులతో సమానంగా ప్రతీరోజు అడవుల్లో కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్లను గమనించడంతో పాటు వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు, ఉరులు, ఉచ్చులు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అడవిలో స్మగ్లర్లు కలప దొంగతనం చేయకుండా అప్రమత్తంగా ఉండడం, వన్యప్రాణుల మేత కోసం గడ్డి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తొట్లు, కుంటలు ఏర్పాటు చేయడం, అడవిని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అటవీ సంపద కాపాడేందుకు రాత్రి పెట్రోలింగ్ చేయడం, అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టడం, అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల, అడవుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారు గోదావరి నదిలో మొసళ్ల కేంద్రం సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. జంతుగణన, బర్డ్వాచ్, బటర్ఫ్లై వాచ్లో పాల్గొంటున్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద, ఆకుల కల్లాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. -
మసిపూసి.. ఏమార్చి..!
నిర్మల్గోదావరికి ‘పుష్కర సిరి’ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2027, జూన్ 26 నుంచి జులై 7వరకు జరగనున్నాయి. ఈసారి ‘కుంభమేళా’ తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భైంసాటౌన్: నల్లబంగారం(నేలబొగ్గు) దందా అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నకిలీ, తప్పుడు వేబిల్లులతో ప్ర భుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వని, చంద్రాపూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని ఇటుకబట్టీలకు బొగ్గు అక్రమంగా రవాణా జరుగుతోంది. కొన్నిసార్లు జీరోలో తరలిస్తుండగా, మరికొన్నిసార్లు తప్పుడు వేబిల్లులతో బురిడీ కొట్టిస్తున్నారు. ఆదివారం సైతం ఓ లారీ భైంసా మండలంలోని ఓ ఇటుక బట్టీకి బొగ్గు తీసుకొచ్చింది. దాని వే బిల్లులో సరుకు విలువ తక్కువగా చూపారు. దీంతోపాటు జీఎస్టీ సైతం తక్కువగా రావడంతో వాణిజ్య పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి.. జిల్లాలో దాదాపు వంద వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. ముఖ్యంగా భైంసా డివిజన్లోని ముధోల్, తరోడ, పిప్రి, సరస్వతినగర్, వానల్పాడ్, నిర్మల్ డివిజన్లోని బీరెల్లి, సిద్దులకుంట, తదితర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోబట్టీకి నెలకు 10 నుంచి 20 టన్నుల నేలబొగ్గు అవసరం ఉంటుంది. సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉందన్న కారణంతో జిల్లాలోని ఇటుకబట్టీల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా బొగ్గు తెప్పించుకుంటున్నారు. లారీలో 35.52 టన్నులకు వాస్తవ ధరతో పోలిస్తే జీఎస్టీ రూ.34,525 చెల్లించాలి. కానీ, సరుకు విలువ తక్కువగా చూపడంతో దాదాపు రూ.20 వేల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఇలా ఒక్కలారీకే ఇంతమొత్తంలో గండిపడితే, నిత్యం జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖకు ఎంతమేర గండిపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం అక్రమంగా నేలబొగ్గు రవాణాపై వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఈశ్వర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
వృథాను అరికడదాం
భైంసా: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అండుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు ఇంకుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి ప్రణాళికా కింద ప్రతి గ్రామంలో నీటి సరఫరా జరిగేలా పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతేడాది వేసవి కష్టాలు పునరావృతం కాకుండా రంగంలోకి దిగారు. రంగుమారిన నీరు.. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీరు భైంసా మున్సిపాలిటీలోని వార్డులు, దిలావర్పూర్లో రంగుమారుతోంది. మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు పంప్ హౌస్లకు వెళ్లి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది, కానీ అధికారుల అప్రమత్తత లోపం గమనార్హం. తగ్గుతున్న నీటిమట్టం.. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో నీటి మట్టం తగ్గుతోంది, భూగర్భజలాలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య తీవ్రతరంకాకుండా చూడాలి. చెరువుల్లో నీరు తగ్గితే మూగజీవాలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇక మిషన్భగీరథ పైప్లైన్ లీకేజీలపై అధికారులు దృష్టిసారించాలి. ఈ వేసవిలో ఎక్కడ సమస్య వచ్చినా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా : నిర్మల్ నియోజకవర్గాలు : నిర్మల్, ముధోల్, ఖానాపూర్ మండలాలు : 18గ్రామాలు : 400ఆవాసాలు : 708చేతి పంపులు : 2,167బోరుబావులు, పంపుసెట్లు : 2,742రక్షిత మంచి నీటి పథకాలు : 1,013పైప్లైన్ల విస్తీర్ణం : 1970.2 కిలో మీటర్లు నల్లా కనెక్షన్లు : 1,64,759ఎత్తైన ప్రాంతాల్లో సమస్య.. ఎత్తుగా ఉన్న గ్రామ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీరు చేరడం లేదు, పల్లంలో ఉన్న గ్రామాలకు మాత్రమే పరిమితమవుతోంది. పంచాయతీ నేతలు సమస్యలు పరిష్కరించాలన్నా నిధుల లోపం అడ్డంకిగా నిలుస్తోంది. వేసవి ఊబిలో ఈ అభావం తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అధికారులు లీకేజీల సమీక్షలు, చెరువుల పునరుద్ధరణ, ట్యాంకర్ల సరఫరా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజలు, పంచాయతీల సహకారంతో సమగ్ర పరిశీలనలు చేపట్టి వేసవి కష్టాలను తగ్గించవచ్చు. -
బడ్జెట్ ప్రతులు దహనం
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించలేదని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కే టాయిస్తామని హామీ ఇచ్చి వివక్ష చూపిస్తుందన్నా రు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అశోక్, రాజన్న, చారి, అలేఖ్య, నటేశ్వర్, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ గొడవ.. స్నేహితుడి హత్య
మంచిర్యాలక్రైం: సెల్ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. సంబంధిత వివరాలను సీఐ ప్రమోద్ రావు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో సంజీవ్, సిడం దీపక్లు దీపక్ను రాడుతో తలపై మోదీ హత్య చేశారు. నిందితులు సంజీవ్, సిడం దీపక్లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి 14 రోజుల రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
గజ్జలమ్మకు పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తులు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, నగేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మ దేవికి అభిషేకం,అ లంకరణ అర్చన, హారతి, పల్లకిసేవ తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు భైంసాటౌన్: జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం జేకేఏఐ షోటోకాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించా రు. తెలంగాణ ఉపాధ్యక్షుడు, చీఫ్ ఎగ్జామినర్ తేజందర్సింగ్ భాటియా, జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్ పోటీలు ప్రారంభించారు. ఈ పరీక్షల్లో జూనియర్ విభాగంలో రెడ్–106, యెల్లో–35, ఆరెంజ్–9, గ్రీన్–1, బ్రౌన్–2, బ్లాక్–2 బెల్ట్స్ సాధించినట్లు మాస్టర్ సాయికృష్ణ వివరించారు. కార్యక్రమంలో సీనియర్ ఇన్స్ట్రక్టర్లు శ్రీకాంత్, జ్ఞానతేజ, నితిన్గౌడ్, శివరాజ్గౌడ్, రిషికేష్, అక్షర్తేజ్, గజేందర్, అన న్య, నాగేష్, లింగం, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
గోదావరిలో మృతదేహాల కలకలం
బాసర: గోదావరి నదిలో బాసర వద్ద ఆదివారం రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు బాసర బ్రిడ్జి కింద గోదావరిలో తేలియాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఒక మృతదేహం నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజులపేటకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. లభ్యమైన మహిళ మృతదేహం వివరాలు ఇంకా తెలియరాలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. ఖానాపూర్కు చేరుకున్న పాదయాత్ర ఖానాపూర్: పెంబి మండలం యాపలగూడెం గ్రామం గిరిజ నులు నిర్మల్ వరకు సుమారు 75 కిలోమీటర్లు శనివారం ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం ఖానాపూర్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడత రావేందర్ మాట్లాడుతూ, పెంబి మండల ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దోత్తి, కడెం వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టాలని అన్నారు. పీహెచ్సీలో వైద్యుడిని నియమించాలని, ఆదివాసి గ్రామాలకు శుద్ధమైన తాగునీటి కోసం బోర్లు వేయాలని కోరారు. పస్పుల వాగుపై బ్రిడ్జి పునర్నిర్మాణం, పెంబి నుంచి సిరిచెల్మ వరకు రహదా రి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్లోనే ప్రారంభించాలని కోరారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, పోడు భూములకు పట్టాలు, చి రు వ్యాపారులకు సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కడెం మండలం అల్లంపెల్లి–గంగాపూర్ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణంతోపాటు రహదారి సౌకర్యం కల్పించాలని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, నాగేలి నరస య్య, డాకూర్ తిరుపతి, ఫసియుద్దీన్, నిర్మల, ధర్మరాజు, విజయ్, దిగంబర్, పానగంటి నరేశ్, తొడసం శంభు, చుంచుల నారాయణ పాల్గొన్నారు. -
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోన్ ఎస్సై గోపి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఎలుగు సుధాకర్ జనవరిలో తన బైక్ని కడ్తాల్ గ్రామ శివారులో పార్క్ చేసి పని నిమిత్తం వెళ్లగా కుచంపల్లి లక్ష్మణ్ బైక్ని దొంగతనం చేశాడు. ఎలుగు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లక్ష్మణ్ని ఆదివారం గంజల్ టోల్ప్లాజా వద్ద పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పు కున్నాడు. అతని వద్ద నుంచి మూడు మో టార్ సైకిల్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ఆరు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఎస్సై దేవన్న, పీసీలు రాజు, వినోద్ ఉన్నారు. -
సీ్త్రనిధి.. మహిళల పెన్నిధి
ఖానాపూర్: సీ్త్రనిధి ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో స్వశక్తి టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) మహిళా సాధికారతకు ప్రధాన శక్తిగా మారింది. మున్సిపల్ కమిషనర్, మెప్మా సిబ్బంది సహకారంతో రుణాల పంపిణీ, వసూళ్లలో అగ్రస్థానం సాధించింది. ఇది జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, ఇతర ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. రుణాలు పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, కుటుంబ ఆదాయాలు మెరుగుపడ్డాయి. స్థానిక సమాజంలో ఆర్థిక స్థిరత్వం పెరిగింది. బలమైన పునాది 14 ఏరియా లెవల్ ఫెడరేషన్లు(ఏఎల్ఎఫ్)కు అనుబంధంగా 297 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ ద్వారా చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. సంఘాల క్రమశిక్షణ, సమయానుగుణ వాడకం ఈ విజయానికి మూలం. లక్ష్యానికి మించి రుణాలు.. క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.443 లక్షలకు మించి రూ.539 లక్షలు (121%) అందజేశారు. గత ఐదేళ్లలో 2,243 మంది మహిళలకు రూ.22 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇవి చిన్న రంగాల్లో (కిరాణా, టైలరింగ్, ఆహార వ్యాపారం) పెరుగుదలకు దారితీశాయి. వసూళ్లలో రికార్డు.. ఇక రుణాల వసూళ్లు 92% స్థాయి సాధించడం ద్వారా జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఫీల్డ్ సిబ్బంది కృషి, సంఘాల చురుకుదల ఈ ఫలితానికి కారణం. రుణాల సకాలికత, బ్యాంకుల సహకారం దీన్ని బలపరిచాయి. -
జీతాలొచ్చినయ్
లక్ష్మణచాంద: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికులు కీలకం. నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తూ పల్లెలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులు మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి శుభవార్త చెప్పింది. పంచాయతీలకు కేటా యించిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రామాల్లో శుభ్రత నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల సంరక్షణ వంటి బాధ్యతలు నిర్వహించే కార్మికులు ఒకేసారి మూడు నెలల వేతనాలు అందనున్నాయి. జిల్లాలో 1,520 మంది కార్మికులు.. జిల్లాలో 19 మండలాల పరిధిలోని 400 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వీటిలో సుమారు 1,520 మంది కార్మికులున్నారు. వీరికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. -
ఉచిత వైద్య శిబిరం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రామంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుంజర యాత్ర పేరిట కిమ్స్, సన్షైన్ ఆస్పత్రులకు చెందిన ప్రఽముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డా.విమలాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. 420 మందికి రక్త పరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, షుగర్, బీపీ, గుండెకు సంబంధించి ఈసీజీ, 2డీ ఈకో వంటి 10 రకాల పరీక్షలు ఉచితంగా చేశారు. సొంత గ్రామంలో.... కుంజర యాత్రలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో ఉచిత వైధ్య శిబిరాలు నిర్వహిస్తున్న డా.విమలాకర్రెడ్డి శనివారం తన స్వగ్రామం వడ్యాల్లో నిర్వహించారు. సొంత గ్రామ ప్రజలతోపాటు, మండల ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ను గుర్తించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కుంజర యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేశ్, గ్రామ కోశాధికారి సల్ల రాజేంద్రప్రసాద్, వీడీసీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు నెలలవి వచ్చాయి
మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడ్డాం. జీతాల కోసం ఎదురు చూశాం. ఎట్టకేలకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల జీతాలు చెల్లించడం సంతోషంగా ఉంది. – మారంపల్లి నర్సయ్య, దస్తురాబాద్ ఇబ్బందులు తొలగాయి.. మూడు నెలలుగా వేతనా లు లేక కుటుంబాలు పోషణ కష్టంగా మారింది. అప్పులు చేశాం మా కష్టాలను ప్రభుత్వం గుర్తించింది. మూడు నెలల జీతాలు చెల్లించడంతో సమస్యలు తొలగిపోయాయి. – ఉదయ్, పంచాయతీ కార్మికుడు, పీచర -
నిర్మల్
ఎమ్మెల్యేను కలిసిన ట్రిపుల్ఐటీ విద్యార్థులు భైంసా: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ను బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి సంఘం నాయకులు శనివారం కలిశారు. తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ట్రిపుల్ఐటీ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ఐటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని టీఎస్ఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు ఆకాశ్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఏఎస్ జిల్లా అధ్యక్షుడు కదం కేశవ్పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. -
ఉత్తమ అటవీ అధికారిగా నజీర్ఖాన్
సారంగపూర్: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ అటవీశాఖ అధికారిగా సారంగాపూర్ వెస్ట్ జోన్ డెప్యూటీ రేంజ్ అధికారి ఎండీ.నజీర్ఖాన్ ఎంపికయ్యారు. ఈనెల 23న తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ఐఎఫ్ఎస్ సువర్ణల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు గుర్తింపుగా ఈఅవార్డు తనకు దక్కిందని నజీర్ఖాన్ తెలిపారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
పండుగల పూట కూల్చివేతలు దారుణం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పండగల పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతలు చేపట్టడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పులో భాగంగా చేపడుతున్న కూల్చివేతలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్ష, వ్యాపారులపై కోపంతో కూల్చివేయడం దారుణమని, రాజకీయ ప్రోద్బలంతో మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. మంచిర్యాల నగర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రతి ఏటా పండుగల సమయంలోనే కూల్చివేతలను జరపడం దారుణమని తెలిపారు. -
సంరక్షిస్తేనే మనుగడ
జన్నారం: పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అడవిపై గొడ్డలివేటు ఈప్రక్రియకు ఆటంకం కలిగిస్తోంది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వన్యప్రాణుల కలయికకు నిలయంఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ విభిన్న జీవవైవిధ్యానికి నిలయంగా మారుతుంది. సుమారు 2,015 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కవ్వాల్ అడవి, అ రుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నిలయం. ఇ క్కడి టేకు అడవులు రాష్ట్రంలోనే నాణ్యమైనవిగా పే రుగాంచాయి. 2012లో కవ్వాల్ అభయారణ్యాన్ని కేంద్రప్రభుత్వం ’టైగర్ రిజర్వ్’గా ప్రకటించింది. ఇక్కడ కేవలం పులులే కాకుండా చిరుత, జింకలు, సాంబార్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు అడవి పందులు తదితర వన్యప్రాణులు, సరిసృపాలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో ఇక్కడ వందలాది జాతుల పక్షులు, విదేశీ వలస పక్షులు సందడి చేయడం విశేషం. జీవవైవిధ్యంలో ముఖ్యపాత్రఅడవులు భూమికి ఊపిరితిత్తులు లాంటివి. కార్బన్ డై ఆకై ్సడ్ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంది. మనిషి మనుగడకు దోహదపడే అడవులు జీవవైవిధ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పక్షులు, జంతువులు, వివిధ రకాల కీటకాలను అ వాసాలుగా మారిన అడవులు అంతరించిపోతే అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. పిచుకలు అంతరించిపోవడం వల్ల మిడుతలు వచ్చినట్లు, కరోనా లాంటి కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి. ప్రాణకోటికి అవాసంగా ఉన్న అడవుల రక్షణ అత్యంత అవసరం. పెరిగిన అడవుల శాతంగతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్ ప్రాంతంలో అడవుల శాతం పెరిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు పోడు సాగుకు, స్మగ్లింగ్ కోసం అడవులు నరికివేతకు గురయ్యాయి. దీంతో అడవుల శాతం తగ్గుతూ వచ్చింది. 2020 ముందు 21 శాతానికి పడిపోయింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రస్తుతం 21 నుంచి 33 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న స్మగ్లింగ్!గతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్లోని పలు ప్రాంతాల్లో స్మగ్లింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్లో ఆరు నెలల్లో సుమారు రూ.5లక్షల పైగా కలప స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అధికారులు పలు వాహనాలను పట్టుకున్నారు. -
అంగట్లో అడవి బిడ్డలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పేదరికం, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అడవి బిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా ఉన్నా పెళ్లి కాని యువకుల కోసం ఇక్కడి అమ్మాయిలను తరలిస్తున్నారు. ఈ దందాలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను పని కల్పిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించి పెళ్లి చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇతర రాష్ట్రాలే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలు సామాజిక వర్గాల వారు సైతం గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ల పేరుతో డబ్బులు పోసి కొనుక్కుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులకు ఎంతో కొంత ఎదురిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు జరిగాక ఆ కుటుంబాల్లో పరిస్థితులకు తట్టుకోలేక తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. పేదరికమే శాపంనిరుపేద గిరిజన కుటుంబాల్లో అమ్మాయిలు చాలా వరకు పది, ఇంటర్ వరకు చదివి ఆపేస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉన్న వారు, విడాకులు పొందిన, భర్త చనిపోయిన వారిని పెళ్లిళ్ల కోసం మధ్యవర్తులు అమ్మాయిల తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు. పెళ్లి ఖర్చులతో సహా కుటుంబీకులకు డబ్బులు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా మహిళలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాలకు ఇక్కడి మహిళలతో పెళ్లిళ్లు జరిగాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ఇష్టంతోనే జరుగుతున్నాయి. గోండి భాషతో సహా మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం సులువు కావడంతో గిరిజన మహిళలను ఉత్తరాదికి పంపుతున్నారు. ఇందులో గ్రామంలో ఉన్న మధ్యవర్తులు, పలు రాష్ట్రాల్లోని మధ్యవర్తులు వ్యవహారమంతా నడుపుతున్నారు. ఇవి కొన్నిసార్లు మాత్రమే బయటపడుతున్నాయి. పెళ్లిళ్లు, పని కల్పన పేరుతోగతేడాది మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ, స్థానిక మధ్యవరులు కలిసి ఆసిఫాబాద్కు చెందిన ఓ యువతిని మధ్యప్రదేశ్కు పెళ్లి పేరుతో విక్రయించారు. అక్కడ వారి బారి నుంచి తప్పించుకుని బయటపడి ఫిర్యాదు చేయడంతో 9మందిపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది మహిళల అక్రమ రవాణా కేసుపై విచారణ జరుగుతోంది. బాధిత మహిళలను సురక్షితంగా తీసుకొచ్చాం. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తాం. –నితిక పంత్, జిల్లా ఎస్పీ -
24 గంటల్లో చోరీ కేసు ఛేదన
నర్సాపూర్(జి): చోరీ కేసును 24 గంటల్లో ఛేదించినట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కిరాణా దుకాణంలో గురువారం రాత్రి నిందితుడు రూ.4వేల నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి, 4 సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. యజమాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బరుకుంట శ్రీరామ్(24) అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3500 నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని నిర్మల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో మూడు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు
ఉట్నూర్రూరల్: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉట్నూర్ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని శంకర్తండాకు చెందిన జాదవ్ శ్రీనివాస్ మద్యం తాగి బైక్పై రాగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో ఆవు మృతి మందమర్రిరూరల్: మండలంలోని మామిడిగట్టులో విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతు గుడికందుల భూమయ్యకు చెందిన ఆవు గురువారం ఉదయం మేతకు వెళి్ల్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా చెరువు పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. పశువైద్యాధికారి తిరుపతి శుక్రవారం ఆవును పరిశీలించారు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. రెండురోజుల క్రితం సారంగపల్లిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్తో గేదె మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఆర్జీయూకేటీలో సమస్యలు పరిష్కరించాలి
బాసర: ఆర్జీయూకేటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ విగ్నేష్, దిగంబర్ అన్నారు. విద్యార్థులు పేర్కొన్న 12 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్జీయూకేటీ మెయిన్ గేట్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇప్పటికీ లాప్టాప్ అందించకపోవడం బాధాకరమని అన్నారు. 10 వేల మంది విద్యార్థులు ఉండే యూనివర్సిటీలో ఆరుగురు వైద్యసిబ్బంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర యూనివర్సిటీల కోకన్వీనర్ చక్రి, అక్షయ్, సాంకేత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ మృతి
సారంగపూర్: మండలంలోని ధని గ్రామానికి చెందిన వడ్డి దేవేందర్రెడ్డి(50) అమెరికాలోని జార్జియాలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెదాడు. ఆయన సోదరుడు వడ్డి రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవేందర్రెడ్డి అమెరికాలోని జార్జియాలో సూపర్మార్కెట్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కూతురు, అల్లుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి అతడిని అమెరికాకు తీసుకుని వచ్చారు. ఆయన అమెరికాలోని జార్జియాలో ఉంటూ సూపర్మార్కెట్ నిర్వహిస్తున్నాడు. పనులు ముగించుకుని నివాసానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. -
గేదెలపై మొసళ్ల దాడి
జైపూర్: మండలంలోని శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు సారక్క, లంబు సంపత్రెడ్డిల గేదెలు గురువారం మేత కోసం శివ్వారం అటవీ ప్రాంతం వెపు వెళ్లాయి. వేసవికాలం కావడం చెరువులో నీరు తాగడానికి అక్కడికి వెళ్లిన రెండు గేదెలను మొసళ్లు నోటితో కరిచి లోపలికి లాక్కెళ్లి దాడి చేసి చంపాయి. శుక్రవారం స్థానికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతి చెందిన ఒక్కో గేదె విలువ రూ.60 వేల ఉంటుందని బాధితులు తెలిపారు. అటవీ అధికారులు ఘటన స్థలాని కి చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారులు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎర్ర చెరువులో మొసళ్ల ఉన్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు పశువులు, మనుషులపై మొసళ్లు దాడి చేసిన ఘటన లేదు. ఇదే తొలిసారి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
మైన్క్లోజర్ పనులు పరిశీలన
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 మైన్క్లోజర్ పనులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గనిలో గత కొన్నినెలల క్రితం బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. గని పూర్తిస్థాయి మూసివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం మైన్ క్లోజర్ పనులు కొనసాగుతున్నాయా లేదా అని జీఎం తనిఖీ నిర్వహించారు. మైన్ ప్రారంభానికి ముందు ఎలాంటి సాధారణ పరిస్థితులు ఉన్నాయో మూసివేత అనంతరం అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పాటు చేయాల్సిందని సిబ్బందికి సూచించారు. గని ప్రాంగణంలో విరివిగా మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు. ఆర్కే 5,6 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్ ఉన్నారు. -
మెడికల్ కాలేజీకి వృద్ధురాలి మృతదేహం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలో బట్టు సత్తవ్వ(65) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, మృతదేహాన్ని కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సభ్యులు మాట్లాడుతూ ఆశ్రమంలోనే 12 ఏళ్లుగా ఉంటున్న సత్తవ్వకు అనారోగ్యం బారినపడిందన్నారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందిందన్నారు. కూతురు మాధవి, అల్లుడు ప్రభాకర్గౌడ్, తమ్ముడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఆమె భౌతికకాయాన్ని చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ వి. మధుసూదన్రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, కాసర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రంజాన్ను శాంతియుతంగా జరుపుకోవాలి
నిర్మల్ టౌన్: రంజాన్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వారికి ముందస్తు శు భాకాంక్షలు తెలిపారు. 30రోజులు నమాజ్, ఉపవాస దీక్షలు చేసుకుంటూ విధులు నిర్వహించిన ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అదనపు ఎస్పీ సాయికిరణ్, ఏవో యూనస్ అలీ, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు రంజాన్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాంలో గల ఈద్గా మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రార్థనలు చేయడానికి ఈద్గా వద్దకు ముస్లింలు అధికసంఖ్యలో వచ్చే అవకాశముందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యం, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. భైంసా పట్టణంలో.. భైంసాటౌన్: పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. సుద్దవాగు ప్రాజెక్ట్ సమీపంలోగల ఈద్గాను సందర్శించి ఏర్పాట్లు, బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు ప్రవీణ్, సాయికుమార్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు ఉన్నారు. -
బీమాతో ధీమా
నిర్మల్● బాసర అభివృద్ధిపై రాని స్పష్టత ● రాష్ట్ర బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు హామీలు అమలు చేయాలి నిర్మల్చైన్గేట్: ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి నెరవేర్చని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాంనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించిందని ఆరో పించారు. రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తెలిపారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. భూభారతి రెవె న్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు అందించినా సమస్యలు పరిష్కారం కావడంలేదని పే ర్కొన్నారు. గ్రామాల్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ కారణంగా అర్హులు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు కరిపే విలాస్, యాతలం చిన్నారెడ్డి, నల్ల రవీందర్రెడ్డి, నాయకులు మెడిసమ్మె రాజు, ఆకుల కార్తిక్, సుంకరి సాయి, గిల్లి విజయ్, సోప్పరి గంగాధర్, సర్పంచ్ రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు.నిర్మల్: ‘కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకెత్తయితే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరో ఎత్తు. ఒక్క ఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఉండకూడదన్నదే మా ప్రభు త్వ సంకల్పం. రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున జీవితబీమా అందించేలా జూన్ 2నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెడ్తున్నాం’ అంటూ ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. జిల్లాలో తెల్లరేషన్కార్డున్న లబ్ధిదారులందరికీ ఈ కొత్త పథకం ఊరట కల్పించనుంది. అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజా కర్షకంగా ఉంది. కొత్త పింఛ న్లు, ఎంప్లాయీస్ హెల్త్స్కీమ్, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ వంటివి సానుకూలంగా ఉండటంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మరోవైపు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్వయంగా సీఎం రేవంత్రెడ్డి నిర్మల్కు వచ్చి ప్రకటించినా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. బాసర ఆలయ అభివృద్ధికీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఇది ‘పరిషత్’ ఎన్నికల ఆకర్షణ బడ్జెట్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యార్థులందరికీ బ్రేక్ఫాస్ట్ 2026–27 విద్యాసంవత్సరం నుంచి ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 66వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. ప్రతీ విద్యార్థికి వారానికి మూడ్రోజులు పాలు, మిగతా మూడ్రోజులు రాగిజావ అందిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. హెల్త్ ప్రొఫైల్.. డిజిటల్ హెల్త్కార్డులు దేశంలో ఎక్కడాలేనట్లు ప్రజల హెల్త్ ప్రొఫైల్ తేనున్నట్లు బ డ్జెట్లో ప్రకటించారు. ప్రజారో గ్యంలో భాగంగా ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని, వీటి నిర్వహణలో గోప్యత పాటిస్తామని ప్రకటించారు. జిల్లాలో దాదాపు 10లక్షల మందికి కార్డులు అందనున్నాయి. గోదావరి పుష్కరాలకు రూ.500కోట్లు2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు అ త్యంత పవిత్రంగా భావించే గోదావరి పు ష్కరాలను ‘కుంభమేళా’ తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పుష్కరాల నిర్వహణకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు ప్రతి పాదించారు. జిల్లాలోని బాసర నుంచి దస్తురాబా ద్ వరకు గోదావరి పొడవునా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశాలున్నాయి. ‘ఇంటర్’కు మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజనం అందనుంది. ఇంటర్ విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేయనున్నట్లు భట్టి ప్రకటించారు. జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, ఇందులో చదువుతున్న దాదాపు 4–5వేల మంది విద్యార్థులకు నూతన విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందనున్నాయి. -
ఇది ఎన్నికల బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటీ ఇందులో ప్రకటించలేదు. నిర్మల్లో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన బాసర జ్ఞానసరస్వతి యూనివర్సిటీ ఏర్పాటుపై ఊసెత్తలేదు. బాసర సరస్వతీమాత ఆలయ అభివృద్ధినీ పట్టించుకోలేదు. – రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే అన్ని వర్గాలకు మేలు బడ్జెట్ అన్నివర్గాల మేలుకోరేలా ఉంది. మహిళా సాధికారత, రైతు ల అభ్యున్నతి, ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం, కోటి 50లక్షల కుటుంబాలకు ఉచి తంగా రూ.5లక్షల వరకు బీమా, ఉద్యోగ, ఉపాధ్యా య పెన్షనర్లకు నగదు రహిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లాంటి ప్రయోజనాలున్నాయి. – కొట్టె శేఖర్, డీసీసీ అధికార ప్రతినిధి -
హాస్టళ్లకు గ్యాస్ సరఫరా చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల కు అంతరాయం లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలపై సమీక్షించారు. విద్యార్థు ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ వసతిగృహంలో సరిపడా సిలిండర్ల నిల్వ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు వసతి గృహాల అవసరాలకు అనుగుణంగా సమయానికి సిలిండర్లు సరఫరా చేయాలని సూచించారు. వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సరఫరా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత తహసీల్దార్లకు సమాచారం అందించాలని సూచించారు. తహసీల్దార్లు తరచూ వసతి గృహాల ను తనిఖీ చేసి గ్యాస్ సిలిండర్ల నిల్వను పరిశీలించా లని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, వసతి గృహాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతిని ధులతో సమావేశాలు నిర్వహించి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్సింగ్ పాల్గొన్నారు. అందుబాటులో సరిపడా గ్యాస్ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోపు ఆయా ఏజెన్సీలు డోర్ డెలివరీ చేస్తాయని తెలిపారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కడా గ్యాస్ కొరత లేదని తెలిపారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని సూచించారు. మౌలిక వసతులు కల్పించాలి ప్రభుత్వ ఎస్సీ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాగునీరు, లైటింగ్, డ్రైనేజీ, పైకప్పు లీకేజీ మరమ్మతులు, గ్రిల్స్ ఏర్పాటు, విద్యుత్ సంబంధిత పనులు, లెవెలింగ్ పనులు తదితర మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. పనులు వెంటనే ప్రారంభించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి దయానంద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన కవి సమ్మేళనం
నిర్మల్ఖిల్లా: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగా ది వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రి యదర్శిని నగర్లోని లయన్స్ క్లబ్ ఆవరణలో గురువారం రాత్రి 51 మంది కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని కవితాగానం చేసి అ లరించారు. అనంతరం వారిని ప్రశంసాపత్రాలు, శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, తె లంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నే రెళ్ల హనుమంతు, ప్రధాన కార్యదర్శి వెంకట్, కవులు పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, కృష్ణంరాజు, చట్ల గజ్జారాం, తొడిశెట్టి పరమేశ్వర్, బొందిడి పురుషోత్తమరావు, భిక్షపతి నాయ క్, మునిమడుగుల రాజారావు, కామారపు జగదీశ్వర్, చెనిగారపు నాగరాజు, రాజేశ్వర్, శేఖర్, వేణుగోపాలకృష్ణ, దేవిప్రియ, లావణ్య, మమ త, కిరణ్మయి, శివరాణి, స్వాతి, పోతన్న, శ్రీని వాసాచార్య, నాగారాం, మురళీధర్, రవికాంత్, శ్రీనివాస్, వసంతరావు తదితరులున్నారు. రవీంద్రభారతిలో జిల్లా కవులు.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కవులు దామెర రాములు, తుమ్మల దేవరావు కవితాగా నంతో ఆహూతులను అలరించారు. అనంతరం వీ రిని సభాధ్యక్షుడు, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిఽ దారెడ్డి, ప్రముఖ కవులు రూప్కుమార్, యాక ూబ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు నరసింహారెడ్డి, ప్రజావాగ్గేయకా రుడు గోరటి వెంకన్న సన్మానించారు. -
అడెల్లి పోచమ్మకు వెండి మకర తోరణం
సారంగపూర్:కొత్తగుడిలో కొలువుదీరిన అడెల్లి మహాపోచమ్మకు మరింత కొత్తశోభ వచ్చింది. హైదరాబాద్కు చెందిన విక్ష కన్స్ట్రక్షన్స్ పేరిట ఇళ్లు నిర్మిస్తున్న మండలకేంద్రానికి చెందిన పదిరె వేణుచందర్రెడ్డి, కవిత దంపతులు తమ ఇలవేల్పు పో చమ్మకు గురువారం వెండి మకరతోరణం అందించారు. ఏడు కిలోల వెండితో(రూ.20.94 లక్షల విలువైన) దీనిని చేయించారు. తరాలుగా తమ ఇంటి నుంచే గంగపోచమ్మ నగలు వెళ్తుండటం, ఇలవేల్పుగా కొలుస్తుండటంతో తమవంతుగా అమ్మవా రికి వెండి మకరతోరణం చేయించినట్లు కవిత, వేణుచందర్రెడ్డి దంపతులు తెలిపారు. దంపతులను మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆలయ చైర్మన్ భోజాగౌడ్, ఈవో భూమయ్య తదితరులు సన్మానించారు. ఇందులో అడెల్లి సర్పంచ్ దండు సాయన్న, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ సుచరిత రాజేశ్వర్రావు, మాజీ చైర్మన్ మాధవరావు పాల్గొన్నారు. -
‘నవోదయ’ ప్రవేశాల్లో వెనుకబాటు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఆరో తరగతిలో ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. అయితే చాలా మంది విద్యార్థులు పరీక్ష తీరుపై అవగాహన లేకపోవడంతో పోటీలో వెనుకబడుతున్నా రు. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాల్లో నిర్మల్ జిల్లా నుంచి 37 మంది సీట్లు దక్కించుకుంటే కుమురంభీం జిల్లా నుంచి కేవలం ఏడుగురే సీట్లు సాధించారు. 80 సీట్లకు ప్రవేశపరీక్ష ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్ పట్టణంలో జవహర్ నవోదయ విద్యాల యం ఉంది. మెరుగైన విద్యాబోధనతోపా టు వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా కల్పిస్తారు. విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ సైతం అమలు చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు నిబంధనలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. 2026– 27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో 80 సీట్లకు మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు 6,196 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది పరీక్షకు హాజరయ్యారు. అవగాహన కరువు ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో నవోదయ ప్రవేశ పరీక్షకు సక్రమంగా సన్నద్ధం కావడం లేదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం సిలబస్ గురించి అవగాహన కల్పించడం లేదు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎక్కువ మంది సీటు సాధించలేకపోతున్నారు. నాలుగేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏటా ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తక్కువ మంది ఎంపికవుతున్నారు. ముందస్తు ప్రణాళిక అవసరం నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరం. నాలుగో తరగతి నుంచే విద్యార్థులు ప్రిపరేషన్ ప్రారంభించాలి. వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తే.. ఇందులో మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాఫ్ విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు పది భాగాల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి. గణితానికి సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. పేరాగ్రాఫ్కు 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయిస్తారు. నవోదయ ఫలితాల వివరాలు జిల్లా దరఖాస్తులు రాసిన ఎంపికై ంది ఆదిలాబాద్ 1,290 942 17 నిర్మల్ 1,552 1278 37 మంచిర్యాల 1,722 1267 19 ఆసిఫాబాద్ 1,632 991 7 అవగాహన అవసరం నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు అవగాహన అవసరం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి పోటీ ఎక్కువ ఉన్నా తక్కువ మంది ఎంపికవుతున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆయా పాఠశాలల్లోని ఐదో తరగతి విద్యార్థులకు ఏడాది ముందు నుంచే పరీక్ష విధానం, సిలబస్ గురించి వివరిస్తూ సన్నద్ధం చేయాలి. – రేపాల కృష్ణ, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్, కాగజ్నగర్ -
నిర్మల్
ప్రవాసీల పద్దు ఎంత..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 72 వేలకుపైగా గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారు. వారి సంక్షేమానికి నిధులు ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న శారదా మఠం సచ్చిదానంద స్వామిసాంస్కృతిక కార్యక్రమంలో నృత్యం చేస్తున్న చిన్నారులు ఉగాది వేడుకల్లో కలెక్టర్, ఎస్పీనిర్మల్ టౌన్: ఉగాది పండగను కలెక్టర్ అభిలా ష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల గురువారం ఆనందంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఉగాది పచ్చడి తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా ప్రజలకు శ్రీపరభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో ఆరోగ్యంగా శాంతి సమృద్ధితో ఉండాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం చేస్తున్న చక్రపాణి నర్సింహాచార్యులునవ వసంతోత్సవంభట్టి నిధులిస్తారా..!? -
నూతన చట్టాలను రద్దు చేయాలి
కడెం: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విత్తనచట్టం, విద్యుత్చట్టం, జీరామ్జీని రద్దు చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం మాట్లాడారు. కేంద్రం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. ఇందులో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజు, ఉపాధ్యక్షుడు కేశవ్, జిల్లా కమిటీ సభ్యులు ఉపాలి, ప్రసాద్, స్వామి, దీనాజి, గంగాధర్, శ్రీనివాస్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లింగాల సత్యనారాయణ గౌడ్ (65) బుధవారం రాత్రి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసం సమీపంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఇచ్చోడ నుంచి నిర్మల్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో 108లో క్షతగాత్రుడిని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమారుడు లింగాల సంతోష్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. -
ప్రవాసీల పద్దు ఎంత..?
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సమస్యలు రో జురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, జన్నారం, ఖానాపూర్, భైంసా, ఆదిలాబాద్, ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్, లక్సెట్టిపేట్, మంచిర్యాల, మందమర్రి, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ వంటి ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 72 వేలకుపైగా గల్ఫ్ కార్మికులు ఉన్నట్లు అంచనా. ఉపాధి కోసం విదేశాల బాట పట్టిన యు వకులు అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొంటుండగా, వారి కుటుంబాలు ఇక్కడ ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. జీవితాలు దుర్భరం.. అవగాహన లోపం, ఏజెంట్ల మోసాలకు గురికావడం వల్ల చాలామంది యువకులు విదేశాలకు వెళ్లిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్య రహిత పనులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, భాషా సమస్యలు, తక్కువ వేతనాలు వంటి కారణాలతో వారు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మృతదేహాల రాకలో ఆలస్యం గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం లేదా ప్రమాదాల వల్ల మరణించిన కార్మికుల మృతదేహా లు స్వదేశానికి చేరుకోవడానికి నెలల తరబడి ఆలస్యం కావ డం హృదయ విదా రక పరిస్థితులను సృష్టిస్తోంది. కుటుంబ సభ్యులు కడసారి చూపు కోసం కూడా ఎదురు చూడాల్సి వ స్తోంది. ఈ ప్రక్రియలో గల్ఫ్ కార్మిక సంఘాలు, భా రత రాయబార కార్యాలయాలు సమన్వయం చేస్తు న్నా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం లేదు. సంక్షేమ పథకాలు అవసరం గల్ఫ్ కార్మికులు లేదా అక్కడే మరణించిన వారి కుటుంబాలకు అందుతున్న ఆర్థికసాయం పరిమితంగా ఉందని విమర్శలు ఉన్నాయి. బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, ఆరోగ్య భద్రత, పింఛన్ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. తిరిగి వచ్చిన కార్మికులకు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేక పద్దుకు విజ్ఞప్తి చేశాం.. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, వారి కుటుంబాల దీనస్థితిని వివరిస్తూ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్లతో కూడిన బృందంతో మంత్రిని కలిశాం. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. – స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యుడు, నిర్మల్ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన రాజుల పోతన్న (51). ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియా వెళ్లి ఈ నెల 14న అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అక్కడికి వెళ్లడానికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీరక మరోవైపు కుటుంబ యజమాని విగత జీవిగా మారడం భార్యాపిల్లల్లో తీవ్ర విషాదం నింపింది. కనీసం కడచూపు కోసం తన భర్త మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని భార్య నర్సమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యులు నిర్మల్జిల్లాలోని సారంగాపూర్ మండలంలో పలు గ్రామాలను సందర్శించి గల్ఫ్ బాధిత కుటుంబాల పరిస్థితిని అధ్యయనం చేశారు. బాధితుల సమస్యలు, అవసరాలను గుర్తించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ట్రిపుల్ఐటీలో సబ్ కలెక్టర్ సందర్శన
భైంసా: భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ బాసర ట్రిపుల్ఐటీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీయూసీ–1, పీయూసీ–2 విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత వార్షిక పరీక్షలు, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షల సిద్ధతపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. క్యాంపస్లో జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం క్యాంపస్లోని మెస్లు, వంట గదులను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘కేంద్రీయ’ ప్రవేశాలకు వేళాయె
బజార్హత్నూర్: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి బాల వాటిక 1, 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 2న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలా బాద్, మంచిర్యాలలో విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలతో పాటు విద్యాహక్కు చ ట్టం కింద కూడా ఇతర పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రెండు సెక్షన్లలో 40 మంది విద్యార్థుల చొ ప్పున 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుంది. తరగతి1లో అడ్మిషన్ పొందే విద్యార్థి 2026 మార్చి 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హులైన విద్యార్థులు kvsonline admission.kvs.gov. in లేదా kvssangathan. nic.in వెబ్సైట్ ద్వా రా లాగిన్ కావాలి. బా లవాటిక 2, బాలవాటి క 3, రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. -
బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా?
జన్నారం: ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు ఇంటి ముంగిట, పెరట్లోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేసే పిచ్చుకలు నేడు మచ్చుకై నా కనిపించడం లేదు. ఆధునిక జీవనశైలి, సెల్ టవర్ల రేడియేషన్, ఆహార కొరత కారణంగా ఈ చిన్నిప్రాణులు అంతరించిపోయే జీవాల జాబితాలోకి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన నేషనల్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు మహమ్మద్ దిలావర్ 2010 మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటూ వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయ్ పరిశోధనల ప్రకారం కొన్ని దశాబ్దాలుగా పిచ్చుకల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణాలు అనేకంగా ఉన్నాయి. పాతకాలపు పెంకుటిళ్లు తగ్గిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.ఆధునిక కాంక్రీటు భవనాలలో పిచ్చుకలు గూళ్లు కట్టుకో వడానికి వీలైన సందులు, గూళ్లు ఉండడం లేదు. సెల్ టవర్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పిచ్చుకల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల అవి సంతానోత్పత్తి చేయలేక చనిపోతున్నాయి. కానీ ఈ విషయం సైంటిఫిక్గా నిరూపణ కాలేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పంట పొలాల్లో పురుగుమందుల వాడకం వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన పురుగులు లభించడం లేదు. రక్షణ ఇలా.. కాంక్రీటు భవనాల వల్ల పిచ్చుకలకు నివాసం కరువైంది. దీనిని అధిగమించేందుకు హన్మకొండ వంటి ప్రాంతాల్లో ఓరుగల్లు వైల్డ్ సొసైటీ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కృత్రిమ గూళ్లను, వరి కంకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్లో అప్పటి ఎఫ్డీవో మాధవరావు తన ఇంటి పరిసరాలు, అటవీప్రాంతాల్లో కూడా కృత్రిమగూళ్లను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. -
అలరించిన కుస్తీ పోటీలు
కుభీర్: మండల కేంద్రమైన కుభీర్లో గురువారం ఉగాదిని పురస్కరించుకుని విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మండలంలోని వస్తాదులతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6,100, ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు అందజేశారు. పోటీలను తిలకించడానికి కుభీర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. భళా బాలికలు మహారాష్ట్ర, హరియానాకు చెందిన ముగ్గురు బాలికలు బాలురతో కుస్తీ పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. హరియానాకు చెందిన సాయి సుప్రియ, పుసద్కు చెందిన నేహా, నాందేడ్కు చెందిన రోహిని ఒక్కొక్కరు రెండేసి కుస్తీలను గెలుచుకున్నారు. సదరు బాలికలను గ్రామస్తులు అభినందించి ప్రత్యేక కానుకలు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్చైన్గేట్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంగె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఏ.సతీష్ రెడ్డి, ఎస్.రవి, కార్యదర్శులుగా వొడిసెల కార్తీక్, కుంభారే లక్ష్మణ్, కోశాధికారిగా చౌహాన్ నికేష్, ఈసీ సభ్యుడిగా రమేశ్, సలహాదారులుగా ఎలుకూచి రాజశేఖర్, సాయులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు కళాశాలల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. బకాయిల విడుదల, కళాశాలల స్థిరీకరణ కోసం సంఘం ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. -
అక్రమ తవ్వకాలు పరిశీలించిన అధికారులు
తానూరు: మహారాష్ట్ర సరిహద్దులోని ఎల్వత్ శివారు ప్రాంతంలో 177 సర్వే నంబర్లో 40 ఎకరాల భూమిలో మహారాష్ట్ర అక్రమార్కులు అక్రమంగా చేపడుతున్న మొరం తవ్వకాలను రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. గతంలో ఎల్వత్ గ్రామానికి చెందిన 41 మంది భూమి లేని నిరుపేదలు సాగుచేసుకోవడానికి సర్వే నంబర్ 177లో 63.17 ఎకారల భూమిని పంపిణీ చేశారు. ఈ భూముల్లో కొందరు సాగు చేసుకుంటుండగా కొందరు సాగుకు యేగ్యంగా లేదని వదిలేశారు. ఎర్ర మొరం కావడంతో కొందరు మహారాష్ట్ర అక్రమార్కులు నిర్మాణాలకు బాగుంటుందని తెలుసుకున్నారు. అసైన్డ్దారుల నుంచి లీజుకు తీసుకుని సూమారు 40 ఎకరాల్లో 50 అడుగుల లోతు వరకు మొరం తవ్వకాలు చేస్తూ మట్టిని మహారాష్ట్రకు తరలించుకుపోతున్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై ‘సాక్షి’లో అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. అధికారులు నోటీసులు ఇచ్చినా తీరు మారలేదు. కోట్లలో దందా సాగిస్తున్నారు. మొరం గుంతల పరిశీలన.. కలెక్టర్ మంగళవారం చర్యలకు ఆదేశించడంతో బుధవారం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గుంతలను పరిశీలించారు. సూమారు 40 ఎకరాల్లో 50 అడుగులోతులో తవ్వకాలు జరిపినట్లు రికార్డులు తయారు చేశారు. సంబంధిత లబ్ధిదారులకు నోటీసులను అందించారు. మొరం తవ్వకాలు జరగకుండా అక్కడి సరిహద్దు ప్రాతంలో బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సర్వేయర్ కిషన్, ఆర్ఐ సాయికిరణ్, జీపీవో రవికుమార్, రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో గందరగోళం
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థిని తేజస్విని మృతితో మంగళవారం ప్రారంభమైన విద్యార్థుల నిరసన బుధవారం వరకు కొనసాగింది. ట్రిపుల్ఐటీలో వైద్య సేవలు మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలన్న డిమాండ్తో విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం నుంచి వీసీ కార్యాలయం వద్ద బైటాయించిన విద్యార్థులంతా రాత్రి వీసీ ఇంటి ముందుకు చేరుకున్నారు. గేటు వద్దే నిద్రించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ఐటీకి చేరుకుని భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో నెలకొన్న సమస్యలపై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం ఇచ్చారు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఇందుకు యాజమాన్యం సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి సంఘం నిరసనను విరమించింది. వీసీకి మద్దతుగా.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ఐటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ వీసీకి మద్దతుగా నిలిచారు. జేఏసీ బుధవారం సమావేశమై వీసీ గోవర్ధన్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. క్యాంపస్ అభివృద్ధి కోసం పని చేస్తున్న వీసీ, ఓఎస్డీలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాత్రంతా నిరసనలుపోలీసులు భారీగా మోహరించినా విద్యార్థులు అక్కడే నిరసన కొనసాగించారు. మరోవైపు మంగళవారం రాత్రి ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బయటకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించినట్లు తెలిసింది. నిరసనకు కూర్చున్న విద్యార్థులు రాజీనామా కోరడంలేదని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో తాము పోస్టు చేయలేదని విద్యార్థి సంఘం ప్రకటించింది. -
చిత్తడి నేలల గుర్తింపు వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: చిత్తడి నేలలతో(వెట్ ల్యాండ్స్) పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చిత్తడి నేలలతో భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందన్నారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ
ఖానాపూర్: మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలోని ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యానవన అధికారి స్పందన 72 మంది రైతులకు విత్తనాలు అందజేశారు. అధికారులు మాట్లాడుతూ.. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందిస్తోందని తెలిపారు. సబ్సిడీ విత్తనాలు కావాల్సిన రైతులు సత్తనపల్లి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూరగాయల మార్కెటింగ్ కోసం 50 శాతం సబ్సిడీతో కూరగాయల పెట్టెలు (బాస్కెట్లు) కూడా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయానంద్, రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ సిడాం ఆనంద్రావు, వైస్ చైర్మన్ ఓసు నారాయణ, డైరెక్టర్లు కమల, గంగప్రసాద్, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ కోఆర్డినేటర్ సుమన్ కుమార్, సంస్థ ప్రతినిధులు పవన్, సుప్రియ, రైతులు పాల్గొన్నారు. -
‘ఈ–ఆఫీస్’తో ఫైళ్ల పరిష్కారం వేగవంతం
ఉట్నూర్రూరల్: ప్రజాపాలన–ప్రగతిప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా ఈ–ఆఫీస్ విని యోగించడం ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయా శాఖల అధికా రులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ద్వారా కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాలయ పనితీరు మెరుగుపడుతుందన్నారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులు, సిబ్బంది ఈ–ఆఫీస్ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. -
ఆగిఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి
ముధోల్: ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని విఠోలి గ్రామానికి చెందిన కూరగాయల మారు వ్యాపారి మడకంటి అనిల్ (30) బుధవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై భైంసా మార్కెట్కు వెళ్తుండగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘తుమ్మల’కు ధర్మనిధి పురస్కారం
నిర్మల్ఖిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకుడు తుమ్మల దేవరావు ప్రతిష్టాత్మక తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో బుధవారం బీఎన్ శాస్త్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ.5వేల నగదు, ప్రశంసపత్రం, మెమొంటో అందించి శాలువాతో సత్కరించారు. జిల్లా చరిత్రపై మక్కువతో... జిల్లాకు చెందిన 17 శాసనాలు, వందలాది వినూత్నమైన విగ్రహాలు, బౌద్ధ జైన ప్రతిమలు, బౌద్ధ స్తూపాలు, కోట్ల సంవత్సరాలకు చెందిన జంతు, వృక్ష శిలాజాలను తన పరిశోధనలో వెలుగులోకి తెచ్చారు. సాహితీరంగంతోపాటు చారిత్రక పరిశోధనలోనూ అనేక అవార్డులు అందుకున్నారు. నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథరచనలో కన్వీనర్గా వ్యవహరించి అనేక చారిత్రక వ్యాసాలను పొందుపరిచారు. కచ్చురం, గడ్డిపూలు, మట్టి పాదాలు, జంగిలి, నిర్మల్ జిల్లా కథలు, నిర్మల్ జిల్లా చరిత్ర రచనలు గుర్తింపు పొందాయి. మట్టి పాదాలు సంకలానికి సినారె పురస్కారం, పలుమార్లు ఎక్స్రే, రంజని కుందుర్తి అవార్డు అందుకున్నారు. దేవరావును డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ దామెర రాములు, నేరెళ్ల హనుమంతు, కామరపు జగదీశ్వర్, పత్తి శివప్రసాద్, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, పోలీస్ భీమేష్, తదితరులు అభినందించారు..


