breaking news
Nirmal
-
దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపైన 11శాతం దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మో ర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు బుధవారం ప ట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి రైతులకు న ష్టం చేకూర్చేలా వివిధ దేశాల్లో వచ్చే పత్తికి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ మన దేశ రైతులకు నష్టమయ్యే పరిస్థితిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆరోపించారు. ఓ వైపు పెట్టుబ డులు రాక, గిట్టుబాటు లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అ మలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు భూక్య రమేశ్, నాగెల్లి నర్సయ్య, గోరెబాయ్, బీ నర్సయ్య, నారాయణ, భీమేశ్, రాజేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
నిర్మల్చైన్గేట్: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరి కరాలు అందజేసే యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు రూ.3.35 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స బ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానిది 60 శాతం వాటా కాగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తుంది. గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినా మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాలతో నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎంపిక బాధ్యత కమిటీలదే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చే యనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమి టీ ఆమోదం తప్పనిసరి. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, డీఏవో, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. 2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ట్రాక్టర్లు అందించగా, ఈ ఏడాది యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు. సబ్సిడీ.. పనిముట్ల వివరాలు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పనిముట్లలో మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 50 శా తం సబ్సిడీపై పరికరాలు అందించనున్నారు. మిగతా రైతులకు 40శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఐదెకరా ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు, ట్రాక్టర్తో వినియోగించే రొటోవేటర్లు, నాగళ్లు, కలుపుతీసే యంత్రాలు, పవర్ టిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రాలు తదితర పరికరాలు అందజేసేందుకు చర్యలు చేపడతారు.జిల్లాకు కేటాయించిన సబ్సిడీ పరికరాలు యంత్రాల పేర్లు యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో) బ్యాటరీ, చేతి, మ్యానువల్స్ స్పేయ్రర్లు 3,238 32.38 పవర్ నాప్ సాక్ స్పేయ్రర్లు 525 52.50 రొటోవేటర్లు 239 119.50 విత్తన ఫర్టిలైజర్ వేసే యంత్రాలు (గొర్రు) 50 15.00 ట్రాక్టర్ పరికరాలు 290 58.00 బండ్ ఫార్మర్లు 6 0.90 పవర్ వీడర్స్ 50 17.50 బ్రష్ కట్టర్లు 41 14.35 పవర్ టిల్లర్స్ 25 25.00 -
ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన
బాసర: భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని రేణుకాపూర్ శివారు, బిద్రెల్లి, ఓని, మైలా పూర్ తదితర గ్రామాల్లో దెబ్బతిన్న సోయా, ప త్తి పంటలు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు. వ్యవసాయాధికారి అజ య్, తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో దేవేందర్రెడ్డితో మాట్లాడి పంటనష్టం వివరాలు తె లుసుకున్నారు. తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని బాధిత రైతులకు భరోసా కల్పించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు సతీశ్రావు, సాయినాథ్, రమేశ్, ప్రతా ప్రావు, నర్సింగరావు, శీనుయాదవ్, నారాయణరెడ్డి, సాయిబాబా, ఓని శివాజీ, దావా రాజు, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ (జీ) మండలంలో ‘ఏలేటి’ నర్సాపూర్ (జీ): మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. వర్షంలో తడుస్తూనే.. దేవుని చెరువు కట్ట కు ఏర్పడిన గండిని పరిశీలించి మరమ్మతు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దిగువన దెబ్బతిన్న పంటలను పరిశీ లించి బాధిత రైతులకు పరిహారం అందేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు కట్ట తెగి చేపలు, వలలు కొట్టుకుపోయి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలుపగా.. పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మ త్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేపట్టాలని పీఆర్, ఆర్అండ్ బీ అధికారులు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈకి సూచించారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, పీఆర్ ఏఈ క్రాంతి కుమార్, విద్యుత్ ఏఈ శంకర్, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏఈవో భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు నరేందర్, చిన్న య్య, ముత్యంరెడ్డి, దత్తురాం, సుధాకర్, గంగా రాం, శ్రీకాంత్రెడ్డి, ప్రవీణ్ పటేల్, మహిపాల్, సాయన్న, భోజన్న తదితరులు పాల్గొన్నారు. పెంబి మండలంలో బొజ్జు పెంబి: మండలంలోని తాటిగూడ గ్రామ శివారులో కడెం వాగు ప్రవాహ ప్రాంతంలో కొట్టుకుపోయిన పత్తి పంటను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు న్యా యం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్, ఏవో నవీన్, నాయకులు శంకర్, రమేశ్, రాజన్న, మహేందర్, రమేశ్, భీంరావు, భూమేశ్ తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రం పరిశీలన
లోకేశ్వరం: మండలంలోని బామ్నికే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సుపోషిత్ జీపీ అ భియాన్ కేంద్ర బృందం సభ్యుడు అలోక్శర్మ బుధవారం పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారుల పోషణ స్థితి, అంగన్వాడీ కేంద్రాలకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, పిల్లల బరు వు పరిశీలించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు అధికసంఖ్యలో వచ్చేలా చూ డాలని సూచించారు. సీడీపీవో స్టేట్ కన్సల్టెంట్ విజయ తాపక్, స్టేట్ కన్సల్టెంట్ అశోక్, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నిరంజన్రెడ్డి, ముథోల్, ఖానాపూర్, నిర్మల్ సీడీపీవోలు సరో జిని, నాగలక్ష్మి, సరిత, సెక్టార్ సూపర్వైజర్ మీ నా, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. -
నిర్మల్
‘కడెం’కు కొనసాగుతున్న వరద ఎగువ నుంచి వస్తున్న వరదతో జిల్లాలోని క డెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వంట ఏజెన్సీలIIలోu రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక భైంసాటౌన్: పట్టణంలోని సుభద్రవాటిక శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు సై న్స్ఫేర్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఇటీవల ఆ దిలాబాద్లో నిర్వహించిన విభాగ్స్థాయి విజ్ఞా న మేళా పోటీల్లో సైన్స్, మ్యాథ్స్ మోడల్స్, నూతన ఆవిష్కరణ, సైన్స్, వేద గణితం, క్వి జ్, పద ప్రయోగాలు అంశాల్లో ప్రతిభ కనబరి చినట్లు ప్రధానాచార్యులు దేవేందర్ తెలిపారు. వీరు ఈనెల 12,13,14 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. లక్ష్మణచాంద: సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికో న్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం త యారు చేస్తున్న ఏజెన్సీల కష్టాలు తీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల నెలా 10వ తేదీలోపు గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండురోజుల కిందట విద్యాశాఖపై ఉ న్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. 1–5 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.78 చొప్పు న, 6–8 తరగతుల వారికి రూ.10.17 చొప్పున, 9,10 తరగతుల వారికి రూ.10.67 చొప్పున చెల్లి స్తారు. ఒక్కో కోడి గుడ్డుకు రూ.6 చెల్లిస్తున్నారు. మ ధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి ఇలా నెలకు రూ.3వేల గౌరవ వేతనం ఇస్తున్నాయి. ఇప్పటివరకు చెల్లింపులు ఇలా.. నెలనెలా మధ్యాహ్నం భోజన బిల్లులను ముందుగా ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో కార్యాలయానికి పంపుతారు. ఆ బిల్లులను మండల విద్యాధి కారి జాగ్రత్తగా పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపుతారు. అక్కడి అధికారులు పరిశీ లించి డీఈవో ఆమోదంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపితే అక్కడ నుంచి బిల్లుల ని ధులు విడుదలవుతాయి. ఈ విధానంతో బిల్లుల చె ల్లింపులు ఆలస్యం కావడంతో వంట ఏజెన్సీలు అ ప్పులపాలవుతున్నారు. దీంతో వారి ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా నెల నెలా బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న కార్మికులు (ఫైల్) ఇక బిల్లుల చెల్లింపులు ఇలా.. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వంట కార్మికులకు నెలనెలా బిల్లులు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు బిల్లులు పరిశీలించి ఆమోదించి వెంటనే ఎంఈవోకు ఆన్లైన్లో పంపిస్తారు. ఎంఈవో పరిశీలించి బిల్లులు సక్రమంగా ఉంటే వెంటనే ట్రెజరీ ద్వారా బిల్లు మొత్తం ప్రతినెలా 10లోపు వంట కార్మికుల ఖాతాల్లో జమయ్యేలా చూస్తారు.జిల్లా సమాచారం మొత్తం పాఠశాలలు 830 విద్యార్థుల సంఖ్య 67,790 వంట ఏజెన్సీలు 830 వంట కార్మికులు 1,145 -
పారిశుధ్య సమస్య పరిష్కరించాలి
సారంగపూర్: పారిశుధ్య సమస్య పరిష్కరించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో బుధవారం ఆయన పారిశుధ్య పనులు, తాగునీరు, మురుగు కా లువలు, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. ఆశ్ర మ పాఠశాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ ట్యాంక్ను ఎ ప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వే గవంతం చేసేందుకు లబ్ధిదారులు, మేసీ్త్రలతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చే యాలని ఎంపీవో అజీజ్ఖాన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావుకు సూచించారు. సెగ్రిగేషన్ షెడ్డు లో తయారైన ఎరువును పరిశీలించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్ట్ను పరిశీలించి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. -
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వే గం పెంచి త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వనమహోత్సవం, గ్రామాల్లో పారిశుధ్య పనులు త దితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. డబ్బులు లేని లబ్ధిదారులకు మహిళా స్వయం సంఘాల ద్వా రా రుణాలు ఇప్పించాలని తెలిపారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని, మొక్కలు నాటిన వెంటనే సంబంధిత సైట్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొక్కలు నాటే ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మిగతా లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినందున గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించా రు. గ్రామాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫాగింగ్ చే యించాలని, నీరు అధికంగా నిల్వ ఉండే చోట దో మలు వ్యాప్తి చెందకుండా ఆయిల్బాల్స్ వేయాలని తెలిపారు. ఇటీవల వర్షాలు కురిసి వరదలు సంభవించిన నేపథ్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టిన అధి కారులందరినీ అభినందించారు. స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, జె డ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బురదలో దిగి.. పంటలను పరిశీలించి..
లక్ష్మణచాంద: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మంగళ వారం పరిశీలించారు. తిర్పెల్లి గ్రామంలోని వాగు బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి పైభాగం కొట్టుకుపోవడంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చామన్పల్లి, చింతల్చాంద, మునిపల్లి, పీచర, ధర్మారం, పార్పల్లి గ్రామాల్లో పర్యటించారు. వర్షాలతోపాటు ఉప్పొంగి న గోదావరి ప్రవాహానికి దెబ్బతిన్న పంటలను బురదలో దిగి పరిశీలించారు. నష్టం వివరాలు నమోదు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయన వెంట రావుల రాంనాథ్, భూపాల్రెడ్డి, చిన్నయ్య, ముత్యంరెడ్డి, శ్రీధర్రెడ్డి, సురేశ్, లక్ష్మణ్, వెంకట్రెడ్డి, రాజేశ్వర్, రాజారెడ్డి, చంద్రమోహన్రెడ్డి ఉన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్దే
సారంగపూర్: ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఇన్చార్జి రాంభూపాల్వర్మ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, నాయకులు రాంశంకర్రెడ్డి, ఎంబడి రాకేశ్ పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై దుష్ప్రచారం మానుకోవాలి
నిర్మల్టౌన్: కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్కిషన్రెడ్డి అన్నారు. అధిష్టానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామ్కిషన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగించడం ప్రాజెక్టును మూసేయడమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ సర్కార్ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, భూషణ్రెడ్డి, డాక్టర్ సుభాష్రావు, గండ్రత్ రమేశ్, అక్రమ్ అలీ, నజీరుద్దీన్, మొహమ్మద్ నయీమ్, మహబూబ్, మాసూద్ అలీఖాన్, జుబేర్ఖాన్, మొహమ్మద్బిన్ అలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పంటలను పరిశీలించిన సబ్ కలెక్టర్
బాసర: భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన భవనంలో సాధారణ భక్తుడిగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం, తహసీల్దార్ పవన్ చంద్రతో కలిసి గోదావరి ఉధృతికి మునిగిన ప్రాంతాలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గోదావరి బ్రిడ్జి పైనుంచి ప్రవాహాన్ని పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గణపతి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఫోకస్ లైట్లు, విద్యుత్ అలంకరణ, గజ ఈతగాళ్లు, బోటింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంట నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని తహసీల్దార్ పవన్చంద్రకు వినతిపత్రం ఇచ్చారు. దెబ్బతిన్న స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్ టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 65 ఫోన్ల ను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మంగళవారం అందజేసి మాట్లాడారు. సెకండ్ హాండ్ ఫోన్లు కొనేముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు పోయిన 1,631 ఫోన్లను రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఐటీ కోర్, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
నిర్మల్చైన్గేట్: గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇటీవలి వరకు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామీణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సెప్టెంబర్ 10న పరిషత్(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించనున్నారు. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, ఆశావహులు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. సాంకేతిక సమస్యల కారణంగా ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. గవర్నర్ ఆమోదం లేనప్పటికీ, అసెంబ్లీలో పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆమోదం లభించింది. ఓటర్ల జాబితా విడుదల.. మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 4,49,302 ఓటర్లు నమోదయ్యారు, వీరిలో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలు, 12 మంది ఇతరులు ఉన్నారు. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం, సెప్టెంబర్ 10న తుది జాబితా ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల్లో కదలిక.. ఎన్నికల ఆలస్యం కారణంగా రాజకీయ నాయకులు ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించలేదు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. బీజేపీ సైతం అడపాదడపా సమావేశాలు నిర్వహించగా, బీఆర్ఎస్ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్నికల ప్రకటన తెరపైకి రావడంతో పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైంది. నోటిఫికేషనే తరువాయి.. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 19 నెలలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచాయి. పరిపాలనా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్కు కలెక్టర్, మండల పరిషత్లకు ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయడంతో ఈ ఎన్నికల్లో బీసీ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. జిల్లాలో 18 మండలాల్లో 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ, 190 ఎంపీటీసీ స్థానాల్లో 66 బీసీలకు దక్కే అవకాశం ఉంది, జెడ్పీ చైర్మన్తోసహా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ల వివరాలు.. మండలం జీపీలు వార్డులు ఓటర్లు దస్తురాబాద్ 13 102 12,894 కడెం 29 242 29,159 ఖానాపూర్ 25 192 23,657 పెంబి 24 152 10,886 మామడ 27 222 26,072 లక్ష్మణచాంద 18 162 24,577 నిర్మల్ రూరల్ 20 170 22,751 సారంగాపూర్ 32 282 39,516 సోన్ 14 132 21,801 దిలావర్పూర్ 12 108 18,744 నర్సాపూర్(జి) 13 120 20,238 లోకేశ్వరం 25 224 29359 కుంటాల 15 134 19,055 భైంసా 30 258 33,970 ముధోల్ 19 166 28,754 తానూర్ 32 268 31,516 బాసర్ 10 90 15,728 కుభీర్ 42 344 40,625పంచాయతీ డివిజన్లు 02 మొత్తం మండలాలు 18 గ్రామపంచాయతీలు 400 వార్డులు 33,68 మొత్తం ఓటర్లు 4,49,302 పురుషులు 2,13,805 మహిళలు 2,35,485 ఇతరులు 12 -
ప్రజల గుండెల్లో వైఎస్సార్
ఖానాపూర్/భైంసాటౌన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్రావు పటేల్ అన్నారు. ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, భైంసాలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ఆద్యుడు వైఎస్సార్ అని తెలిపారు. జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, తదితర పథకాలతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వివరించారు. బాసరలో ట్రిపుల్ ఐటీ వైఎస్సార్ హయాంలోనే ఏర్పాటైందని తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టును సైతం నిర్మించినట్లు గుర్తు చేశారు. బాసరలో గోదావరిపై 12 లిఫ్ట్లు నిర్మించారని తెలిపారు. కార్యక్రమాల్లో దయానంద్, భూషణ్, మాజిద్, నిమ్మల రమేశ్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, మడిగెల గంగాధర్, గంగనర్సయ్య, మదిరె సత్యనారాయణ, రమేశ్, శేషాద్రి, సంతోష్, రాజునాయక్, శంకర్, గంగాధర్, శ్రీహరి, జహీర్, శంకర్ చంద్రే, ఆత్మ చైర్మన్ వివేకానంద, భోజరాం పాటిల్, బషీర్, బంక బాబు, సందీప్, నరేందర్రెడ్డి, ఆత్మరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మంగళవారం నిమజ్జన పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహదాత, వేలంలో లడ్డూ గెలుచుకున్న వారిని కలెక్టర్ సత్కరించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వినాయకుని శోభాయాత్రను నిర్వహించారు. భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి, వినాయకసాగర్ (బంగల్ పేట్) చెరువులో గణనాథుని నిమజ్జనం చేశారు. -
విద్య, వసతులకు ప్రాధాన్యం
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(ఎఫ్ ఏసీ)గా భోజన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్కు చెందిన ఆయన సొంతజిల్లాకు డీఈవోగా రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా ‘సాక్షి’తో మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. సాక్షి : సొంత జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? డీఈవో : చాలా ఆనందంగా ఉంది. పుట్టి పెరిగి, చదువుకున్న జిల్లాలోనే డీఈవోగా పనిచేయడం బాధ్యతను మరింత పెంచింది. సమష్టి కృషితో జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తాను. సాక్షి : పదో తరగతి ఫలితాల మెరుగునకు ఏం చర్యలు తీసుకుంటారు? డీఈవో : పదో తరగతి ఫలితాల్లో గతంలో రెండుసార్లు జిల్లా రాష్ట్రంలో నంబర్ వన్గా నిలిచింది. గతేడాది 15వ స్థానానికి పడిపోయింది. ఈసారి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల సహకారంతో జిల్లాను మరోసారి ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. దాని ప్రకారం ముందుకెళ్తాం. సాక్షి : ఎఫ్ఆర్ఎస్ 100 శాతం అమలు కావడం లేదు? డీఈవో : పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)తప్పనిసరి. నిర్ణీత సమయానికి ఉపాధ్యాయులు హాజరై ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలి. జిల్లాలో 55 శాతమే అమలవుతోంది. త్వరలోనే వంద శాతం అమలయ్యేలా చర్యలు తీసుకుంటా. సాక్షి : విద్యాశాఖలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తారు? డీఈవో : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు, వ్యాయామ విద్య, కోకరికులం యాక్టివిటీలు సజావుగా జరిగేలా చూస్తాను. కలెక్టర్ ప్రవేశపెట్టిన ’బాలశక్తి’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సాక్షి : ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఆరోపణలు వచ్చాయి. మీరెలా అధిగమిస్తారు? డీఈవో : పూర్తి నివేదిక తీసుకుని పొరపాటుకు కారణమైన బాధ్యులపై చర్య తీసుకుంటాం. ఈనెల 4లోపు ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి. సాక్షి : గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఈవో : జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. గుర్తింపు లేని పాఠశాలలను త్వరలోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు జారీ చేస్తాం. -
ఆదుకున్న ఆగస్టు..!
భైంసాటౌన్: ఈసారి వర్షాలు ఆలస్యమైనా అన్నదాతను ఆదుకున్నాయి. భారీ వర్షాలతో కొంతమేర పంటలకు నష్టం వాటిల్లినా.. యాసంగి పంటలకు భరోసా ఏర్పడింది. ఆగస్టులో వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బాసరలో గోదావరి ఉగ్రరూపం చూపింది. ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్నాయి. తద్వారా ఆయా చెరువులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే యాసంగి పంటలకు భరోసా ఇచ్చినట్లయింది. లోటు నుంచి సాధారణానికి.. జిల్లాలో ఏటా జూలైలోనే భారీ వర్షాలు కురిసేవి. రైతులు సైతం ఈనెలలోనే పంటలు సాగు చేసేవారు. కానీ ఈసారి ఆగస్టు వరకు వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్లో వర్షాకాలం మొదలు ఆగస్టు రెండోవారం వరకు లోటు వర్షపాతం నెలకొంది. అడపాదడపా కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరినా.. భారీ వర్షాలు లేకపోవడంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన కనిపించింది. జూన్ మొదటివారంలో 99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రెండోవారంలో 102 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆపై రెండువారాలూ లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలంతా సాధారణ, లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు మొదటివారంలో వానలే పడలేదు. రెండోవారంలో 43 శాతం సాధారణ వర్షం కురవగా, మూడోవారంలో 145 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఎట్టకేలకు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులు నిండుగా.. జూన్, జూలైలో సరైన వర్షాలు లేక జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు, సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, కడెంలోని కడెం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. యాసంగి పంటలకు ఈ ప్రాజెక్టులపైనే రైతులు ఎక్కువగా ఆధారపడతారు. అలాగే చెరువుల కింద సైతం అధికసంఖ్యలో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ఆగస్టులో భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు సైతం జలకళ సంతరించుకున్నాయి. ఫలితంగా యాసంగిలో పంటల సాగుకు భరోసా దక్కింది. -
పఠనాసక్తి పెంచేలా..
లక్ష్మణచాంద: రాష్ట్ర సమగ్ర శిక్ష, రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్టు సహకారంతో విద్యార్థుల్లో పుస్తక పఠనా ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, చదవడంపై ఆసక్తిని పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాల స్థాయిలో ఈ చొరవ విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రోజుకో అరగంట.. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతీ పాఠశాలలో రోజుకు అరగంట పఠనానికి సమయం కేటాయించాలి. విద్యార్థులు వార్తాపత్రికలు, సాహిత్య పత్రికలు, కథల పుస్తకాలు వంటివి చదవడం ద్వారా వారి జ్ఞాన పరిధిని విస్తరించుకోవాలి. ఈ లక్ష్యంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయగా, అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు ఉపాధ్యాయులకు వాటి నిర్వహణపై శిక్షణ కూడా అందించారు. ఆసక్తి పెంచేలా.. రూమ్ టు రీడ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్దిష్ట కార్యకలాపాలు చేపట్టనున్నారు. 1. పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులు చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తిని రేకెత్తించాలి. 2. పాఠశాల, గ్రామ స్థాయిలో కథల రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులను పఠనంపై ఉత్సాహపరచాలి. 3. ‘ప్రతీ విద్యార్థి ఒక గ్రంథకర్త’ అనే భావనతో సమావేశాలు నిర్వహించాలి. 4. విద్యార్థుల పఠన కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. 5. ‘నా పుస్తకం–నా కథ’ ఇతివృత్తంతో విద్యార్థులతో పోస్టర్లు రూపొందించాలి. 6. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి చదివే కార్యక్రమాలు నిర్వహించాలి. జిల్లా సమాచారం... జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 577 విద్యార్థుల సంఖ్య 23,398 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 విద్యార్థులు 6,373 ఉన్నత పాఠశాలలు 164 విద్యార్థులు 37,019 మొత్తం విద్యార్థుల సంఖ్య 67,790మంచి కార్యక్రమం విద్యార్థుల్లో పఠానాసక్తిని పెంపొందించడం కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్వేత, ఉపాధ్యాయురాలు, పీచర పాఠశాల ఆసక్తి పెరుగుతుంది పాఠశాల్లో సోమవారం నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పుస్తక పఠనం, పఠనాసక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. – వాణి, ఉపాధ్యాయురాలు, కనకాపూర్ పాఠశాల -
బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం
డ్రైవింగ్లో నో సెల్ ప్రమాదాలను నివారించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లకు నో ఫోన్ నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. నిర్మల్సామాన్యులకు అండగా పోలీసులు నిర్మల్టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికా రులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని సూచించారు. పోలీసులసాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్లు తెలిసినా సమాచారం ఇవ్వాలని కోరారు. నిర్మల్చైన్గేట్: సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వేలాది రైతులకు హైకోర్టు శుభవార్త అందించింది. 2020, అక్టోబరు 12న ప్రభుత్వం జారీ చేసిన జీవో 112పై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఆగస్టు 26న తీర్పు వెలువడింది. ఈ తీర్పు సన్న, చిన్నకారు రైతులకు భూమి హక్కుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసింది. 2014, జూన్ 2కు ముందు లిఖిత ఒప్పందాలతో భూములు కొనుగోలు చేసిన రైతులు, 2020, అక్టోబర్ నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసినవారి భూములు క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సాదాబైనామా భూముల సమస్య.. గ్రామీణ ప్రాంతాల్లో సాదాకాగితంపై భూములు కొనుగోలు చేసిన అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ లేకుండా హక్కులు కోల్పోయారు. ధరణి పోర్టల్ ప్రవేశానికి ముందు ఆర్వోఆర్ చట్టం కింద సాదాబైనామా ఒప్పందాలతో పట్టాలు జారీ అయ్యేవి. అయితే, ధరణి అమలులోకి వచ్చాక ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ప్రభుత్వం 2014 జూన్ 2కు ముందు సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొన్నవారికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. 2020, అక్టోబర్ నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 9,621 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామా పత్రాలు చట్టపరంగా ధ్రువీకరించబడకపోవడంతో రైతులు భూమి హక్కులను రుజువు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్వ యజమానులు లేదా వారి వారసులు భూమిపై హక్కు కోసం కేసులు వేయడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. భూమి క్రయవిక్రయాల్లో సమస్యలు, పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, రాయితీలు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ధరణిలో సాదాబైనామా రిజిస్ట్రేషన్కు సంబంధించిన కాలమ్ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో లైన్క్లియర్ హైకోర్టు తీర్పుతో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించబడింది. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, రెవెన్యూ ఆధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో సమీప రైతుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేస్తారు. భూమి క్రయవిక్రయం యథార్థమని నిర్ధారణ అయితే, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ చెల్లింపుతో క్రమబద్ధీకరిస్తారు. హైకోర్టు స్టే ఎత్తివేతతో జిల్లాలో పెండింగ్లో ఉన్న 9,621 దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది. నిర్మల్చైన్గేట్: అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనంలో సోమవారం మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టసవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చామని, నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20% టికెట్లు కేటాయించాలని జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుకు వినతిపత్రం అందించారు. మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులు బాసర 66 భైంసా 214 దస్తురాబాద్ 849 దిలావర్పూర్ 667 కడెం(పెద్దూర్) 1,012 ఖానాపూర్ 386 కుభీర్ 648 కుంటాల 341 లక్ష్మణచాంద 664 లోకేశ్వరం 824 మామడ 1,113 ముధోల్ 755 నర్సాపూర్(జి) 332 నిర్మల్అర్బన్ 48 నిర్మల్రూరల్ 576 పెంబి 73 సారంగాపూర్ 647 సోన్ 338 తానూర్ 67రైతులకు ప్రయోజనాలు..క్రమబద్ధీకరణతో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలకు అర్హత సాధిస్తారు. భూమి హక్కుల వివాదాలు తగ్గి, చట్టపరమైన గుర్తింపు లభించనుంది. ఈ తీర్పు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది, ముఖ్యంగా గతంలో నిరాశపడిన వారికి ఊరటనిచ్చే అవకాశం కల్పించింది. -
రాష్ట్రస్థాయి విజ్ఞానమేళాకు ఎంపిక
నిర్మల్చైన్గేట్/నిర్మల్ రూరల్ : పట్టణంలోని బుధవార్పేట్ శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల శిశువర్గ, కిషోరవర్గ విద్యార్థులు రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికయ్యారు. శిశువర్గలో క్విజ్లో ప్రథమ స్థానంలో విశ్వక్, నరసింహ, వరుణ్ తేజ మట్టితో విగ్రహల తయారీలో మధు ప్రియ ప్రథమ స్థానం, జానపద కథనంలో మగ్గిడి రితీశ్ ద్వితీయ స్థానం సాధించారని ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలిపారు. ప్రథమ స్థానం పొందిన వారు ఈనెల 3, 4, 5 తేదీల్లో కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్యులు అభినందించారు. -
దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..
నిర్మల్చైన్గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో వరద నష్ట నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు లబ్ధిదారుల ఎంపిక సర్వే, వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి నేను ఖానాపూర్ పట్టణం రాజీవ్నగర్కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు వారసత్వంగా వచ్చిన ఇల్లు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి నన్ను ఆదుకోవాలి. – చుక్కల శ్రీనివాస్, ఖానాపూర్ ఒర్రె పొలాన్ని ముంచుతోంది.. నాకు రాణాపూర్లో కెనాల్ వద్ద ఒర్రెను అనుకొని 1.25 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్లుగా కెనాల్ పనుల కారణంగా ఒర్రె నుంచి నీరు వచ్చి పొలంలోకి చేరుతుంది. దీంతో పంట మునిగి ఏటా లక్ష రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఒర్రె నీరు పొలంలోకి రాకుండా చూడాలి. – కరిపే భోజన్న, రాణాపూర్ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఖానాపూర్ పట్టణంలో గతంలో పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సెంటర్ ఉండేది. ప్రస్తుతం దానిని తొలగించారు. ఇప్పుడు పట్టణంలో ఒకే ఒక ఆధార్ సెంటర్ ఉంది. దానిని కూడా నిత్యం తెరవడం లేదు. మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. – అఖిల్, ఎంఐఎం అధ్యక్షుడు అక్రమ కట్టడాలు ఆపాలి గుల్జార్ మార్కెట్ నివాసి అయిన రఫీ అహ్మద్ ఖురేషి తన పాత ఇంటిని కూల్చివేసి మునిసిపల్ లో జి ప్లస్ వన్ నూతన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. ఈ విషయం పలుమార్లు మున్సిపల్ అధికారులకు, పట్ట ణ ప్రణాళిక అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణం పూర్తికావస్తుంది. – సోఫియాన్ సలీం, నిర్మల్ -
ఏఈవో సంతకం ఫోర్జరీ
నిర్మల్: రైతుబీమా పత్రాలపై ఏఈవో సంతకం ఫోర్జరీ అయిన సంఘటన నర్సాపూర్(జి)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాక్పల్లి క్లస్టర్లో ఏఈవోగా కాల్వ రమ్య విధులు నిర్వహిస్తున్నారు. 2020, జూలై 14 నుంచి 45 రోజులు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో ఓ రైతుకు చెందిన రైతుబీమా పత్రాలపై ఏఈవో రమ్య సంతకం ఫోర్జరీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఫోర్జనీ సంతకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఏఈవో రమ్యను సంప్రదించగా... తాను ఆ సమయంలో ప్రసూతి సెలవులో ఉన్నానని.. ఆ సంతకం తనది కాదని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేపడితే ఎవరు చేశారనేది తెలుతుందన్నారు. -
ఆస్తి, ప్రాణ నష్టంపై నివేదికలు పంపండి
నిర్మల్చైన్గేట్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి సమగ్ర అంచనాలతో నివేదికలు పంపాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరా బాద్ సచివాలయం నుంచి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టంపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయ చర్యలు చేపట్టా లని సూచించారు. పంట నష్టం, ఇళ్లు దెబ్బతినడం, రహదారులు, చెరువులు, వంతెనలకు జరిగిన నష్టాలను విభాగాలవారీగా కచ్చితంగా లెక్కించి సమర్పించాలన్నారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. నివేదికలు సిద్ధం చేయండి.. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలను నివేదికలను సిద్ధం చేయాల ని ఆదేశించారు. రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసా య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులందరూ నిబంధన మేరకు నివేదికలు మంగళవారం సమర్పించాలని సూచించారు. ఇందులో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అల్లోలపై ఆరోపణలు సరికాదు’
నిర్మల్ టౌన్: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ పలువు రు యువకులు సోషల్ మీడియాలో ఆరోపణ లు చేయడం సరికాదని డీసీసీబీ వైస్ చైర్మన్ ర ఘునందన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ని ర్మల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా హైదరాబాద్లో ఉంటున్నారని, ప్రజలు సమస్యలు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కూలిన ఇండ్లను అల్లోల పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించారని పేర్కొన్నారు. అల్లోలపై ఆరోపణలు చేస్తున్నవారు వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ యన వెంట నాయకులు రమణారెడ్డి, రాంచందర్, సత్యనారాయణ, శ్రీనివాస్, రాందాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్ తదితరులున్నారు. -
విద్యా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: పాఠశాల విద్యాశాఖ అమలు చేసే విద్యా కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్ సమావేశంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీ వీల ఎస్ఓలు, ఉపాధ్యాయులతో శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ నివేదికలను కచ్చితంగా రూపొందించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ, యూడైస్, ఇన్ఫ్రా వసతులు తదితర కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలన్నారు. వాటి రిపోర్టులు ఆన్లైన్లో నమోదు చేసి, జిల్లాను ముందంజలో ఉంచాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించి జిల్లా తరఫున రాష్ట్రానికి ప్రాతిని ధ్యం చేయాలని పేర్కొన్నారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఈవిషయంలో శ్రద్ధ వహించాల ని సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ ఎఫ్ఏ వో జ్ఞానేశ్వర్, ఎస్వోలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్కుమార్, లింబాద్రి, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలి’
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన పురాణాలపై ఆధారపడి నూతన జాతీయ విద్యావిధానాన్ని రాసినట్లు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వర్ణ వ్యవస్థ ఆధారిత విద్యను అమలు పరిచేందుకు ఉవ్విళ్లూరుతోందని ఆరోపించారు. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశ జీడీపీలో 2.5 శాతం మాత్రమే విద్యకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి మాటమార్చిందన్నారు. అంతకుముందు పీడీఎస్యూ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగరాజు, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్కుమార్, పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు, రాజేశ్వర్, కిరణ్, సహాయ కార్యదర్శులు గౌతమ్కుమార్, మస్తాన్, నవీన్, అజయ్, తిరుపతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి చరణ్, డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టం 13 వేల ఎకరాలు
ప్రభుత్వం ఆదుకోవాలి గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మా గ్రామంలో పంటలు మూడు రోజులుగా నీటమునిగే ఉన్నాయి. సుమారు 600 ఎకరాల్లో నష్టపోయాం. అధికారులు సర్వే చేసి నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. – అశోక్, రైతు చింతల్చాంద నివేదిక పంపించాం.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి రైతులు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సర్వే నిర్వహించాం. ఇప్పటి వరకు 13 వేలకుపైగా వివిధ పంటలు నష్టపోయినట్లుగా గుర్తించాం. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆదివారం వరకు నష్టం ఎంత జరిగిందనే స్పష్టత వస్తుంది. – అంజిప్రసాద్, డీఏవో నిర్మల్లక్ష్మణచాంద: జిల్లాలో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఎ గువ మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నా యి. దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మూడు రో జులుగా 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. దీంతో 39 గేట్ల ద్వారా ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి విడుదల చేశా రు. దీంతో జిల్లాలోని గోదావరి పరీవాహక గ్రామాల్లో రెండో రోజూ కొనసాగింది. ఇక లక్ష్మణచాంద మండలం పీచర, ధర్మారం, మల్లాపూర్, మాచాపూర్, మునిపెల్లి, చింతల్చాంద, చామన్పెల్లి గ్రామాల్లో గోదావరి తీరప్రాంత పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా పంటలు నీటిలో మునిగి ఉండటంతో నిండా మునిగామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 13 వేల ఎకరాలకుపైగా నష్టం.. భారీ వర్షాలతోపాటు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోకి భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో భైంసా, ముధోల్, నిర్మల్, ఖానాపూర్ డివిజన్లలో సాగు చేసిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారుల ప్రకారం, వరి 24,191 ఎకరాలు, మొక్కజొన్న 1,100 ఎకరాలు, సోయాబీన్ 2,152 ఎకరాలు, పత్తి 2,788 ఎకరాల్లో నష్టం జరిగింది. భైంసా డివిజన్లో.. భైంసా డివిజన్లో 348 రైతులకు చెందిన 558 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 98 ఎకరాలు(49 రైతులు), పత్తి 210 ఎకరాలు(175 రైతులు), సోయాబీన్ 230 ఎకరాలు(114 రైతులు), మొక్కజొన్న 20 ఎకరాలు(10 రైతులు) ఉన్నాయి. ముధోల్ డివిజన్లో.. ముధోల్ డివిజన్లో 890 రైతులకు చెందిన 1,785 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి 116 ఎకరాలు(87 రైతులు), పత్తి 275 ఎకరాలు(190 రైతులు), సోయాబీన్ 1,287 ఎకరాలు(613 రైతులు) ఉన్నాయి. ఖానాపూర్ డివిజన్లో.. ఖానాపూర్ డివిజన్లో 849 రైతులకు చెందిన 1,510 ఎకరాల్లో పంట నష్టం నమోదైంది. ఇందులో వరి 517 ఎకరాలు(350 రైతులు), పత్తి 875 ఎకరాలు(487 రైతులు), మొక్కజొన్న 35 ఎకరాలు(12 రైతులు) ఉన్నాయి. నిర్మల్ డివిజన్లో.. నిర్మల్ డివిజన్లో 2,675 రైతులకు చెందిన 5,296 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 1,760 ఎకరాలు(1,127 రైతులు), పత్తి 1,463 ఎకరాలు(668 రైతులు), సోయాబీన్ 635 ఎకరాలు(412 రైతులు), మొక్కజొన్న 1,045 ఎకరాలు(470 రైతులు) ఉన్నాయి. -
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్చైన్గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న ఐడీవోసీ కా ర్యాలయంలో ని ర్వహించే సభను విజయవంతం చేయాలని కో రారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఉ ద్యోగులు కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, గెజిటెడ్ ఉ ద్యోగుల సంఘం కార్యదర్శి రమేశ్, ఉ పాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు మురళీమనోహర్రెడ్డి, జుట్టు గజేందర్, రవికాంత్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, అశోక్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రవి, గణేశ్ పాల్గొన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్
సోన్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సోన్ మండలంలో పర్యటించారు. వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు, రైతులతో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నివేదికలను ప్రభుత్వానికి పంపించి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశుసంరక్షకులు, చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132ను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్మార్, తహసీల్దార్ మల్లేశ్రెడ్డి, ఏఎంవో వినోద్కుమార్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు ఉన్నారు. -
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజ లను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బో యవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూ పి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21, 000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చే శాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమో దు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు. -
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు శనివారం ముగిసాయి. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ సైతం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి 513 అభ్యంతరాలు వచ్చాయి. ఓటరు పోలింగ్ కేంద్రాలు, వార్డు మార్పు, తప్పిపోయిన ఓటరుకు సంబంధించి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. జన్నారం మండలంలో 23, దండేపల్లిలో 104, లక్సెట్టిపేటలో 30, హాజీపూర్లో 12, జైపూర్లో 88, భీమారంలో 58, చెన్నూర్లో 2, కోటపల్లిలో 3, వేమనపల్లిలో 1, మందమర్రిలో 18, కాసిపేటలో 93, బెల్లంపల్లిలో 27, తాండూర్లో 42, భీమినిలో 5, నెన్నెలలో 7, కన్నెపల్లిలో 2 అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారం హాజీపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే సమావేశం అయ్యారు. -
నిమజ్జనానికి పటిష్ట భద్రత
నిర్మల్ టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతీ పోలీసు పనిచేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పోలీసులతో శనివారం ఆన్లైన్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లపై సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్ ప్రణాళికను అమలు చేయాలని ఎస్పీ సూచించారు. శోభాయాత్ర మార్గాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపాలని ఎస్పీ తెలిపారు. వరద బాధితులకు సాయం చేయాలి.. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలు, పట్టణాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నందున, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్నవారికి తక్షణ సహాయం అందించేందుకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరద ఎక్కువగా ఉన్న చెరువులు, వాగులు, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రెడ్ ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి, వాటిని డేంజర్ జోన్గా గుర్తించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఈ కాన్ఫరెన్స్లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. నిమజ్జన ఘాట్ను పరిశీలించిన ఎస్పీ నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్ను ఎస్పీ జానకీషర్మిల శనివారం పరిశీలించారు. శోభాయాత్ర దారిలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల హ్యాండ్బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. బాలికల జట్టులో గంగుబాయి, మౌనిక, వైష్ణవి, పార్వతి, జయశ్రీ, సహస్ర మోక్షిత, బాలుర జట్టులో సాత్విక్, రుత్విక్వర్మ, జాషువా, ప్రణయ్, వంశీ, పార్థు ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి, సీనియర్ క్రీడాకారులు ప్రణయ్, సంజయ్, రఘు, వర్మ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు. నీటమునిగిన శ్మశానవాటికఖానాపూర్: పట్టణంలోని గోదావరితీరంలో మున్సిపల్ నూతన కార్యవర్గం ఏర్పటయ్యాక రూ.50 లక్షలతో నిర్మించిన శ్మశనవాటిక ఏటా వర్షాకాలంలో నీట మునుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఏటా వరదలు తగ్గాక మరమ్మతు చేయడం పరిపాటిగా మారింది. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ద్యావతి గంగాధర్(55) అనారో గ్యంతో మృతి చెందాడు. గోదావరి తీరంలో గల శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి ఉండగా ఉండగా కుటుంబ సభ్యులు అత్యంత దూరభారమైనప్పటికీ గాంధీనగర్ శివారులోని తర్లపాడ్ వెళ్లే రహదారి వరకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు–తల్మాడ సెక్షన్, అక్కన్నపేట–మెదక్ సెక్షన్లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ను శనివారం చర్లపల్లి–ఆదిలాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పర్లి–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 రైల్ సర్వీసులు సెప్టెంబర్ 1న రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని సూచించారు. -
ఆలోచన.. ఆవిష్కరణ
కాగజ్నగర్టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జ్ఞాన విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీ సరస్వతి శిశుమందిర్ మంచిర్యాల జిల్లా విభాగ్ కార్యదర్శి దహెగాం గోవింద్రావు అన్నారు. శనివారం కాగజ్నగర్లోని ఆదర్శనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త ప్ర యోగాలు, ఆవిష్కరణలకు ఊతమిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడంలో గణిత జ్ఞాన విజ్ఞాన మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం, విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించి పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయని ప్రశంసించారు. మేళాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గల నుంచి విద్యార్థులు 236 మంది హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వ తీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్రావు తెలిపా రు. శనివారం కాగజ్నగర్లో నిర్వహించిన జి ల్లా స్థాయి విజ్ఞాన మేళాలో శార్వాణి, వెంకట రత్న, చరణ్, సాకేత్, హరిచరణ్, దివ్య, జ శ్వంత్, నిహారిక, విక్రమ్, శ్రీనిధి ఉత్తమ ప్రతి భ కనబరిచి బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యా ర్థులు సెప్టెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొంటారని వివరించారు. -
డీఈవో రామారావుకు వీడ్కోలు సన్మానం
నిర్మల్ రూరల్: డీఈవో రామారావు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీటీడీవోఅంబాజీ, జిల్లా ఉన్నతాధికారులు, ఎంఈవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీఈవోగా భోజన్న
నిర్మల్ రూరల్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా(ఎఫ్ఏసీ) డి.భోజన్న నియమితులయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన రామారావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతించలేదు. తాజాగా జనగామ డీఈవో కార్యాలయంలో ఫైనాన్స్, అకౌంట్ ఆఫీసరుగా పనిచేస్తున్న భోజన్నను డీఈవోగా నియమిస్తూ శనివారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ మంజులాపూర్ ప్రాంతానికి చెందిన భోజన్న గతంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేశారు. తాజాగా జిల్లాకు డీఈవోగా పదోన్నతిపై వస్తున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు
జైనూర్: సద్గురు పూలాజీబాబా తన హితబోధనలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం మండలంలోని పట్నాపూర్లోని సిద్ధేశ్వర సంస్థాన్లో పూలాజీబాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్మాత్మిక మార్గం వైపు నడిపించిన ఘనత బాబాకే దక్కుతుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాయన్నారు. అనంతరం మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రచించిన బాబా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిన్వట్ ఎమ్మెల్యే భీంరావ్ కేరామ్, మహారాష్ట్ర మాజీమంత్రి శివాజీరావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావు ఇంగ్లే, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, రెవెన్యూ జిల్లా అధికారి లోకేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆడే శేషేరావు పాల్గొన్నారు. -
జ్వరంతో బాలుడు మృతి
తిర్యాణి: జ్వరంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ రాము కుమారుడు సీతారాం(15) పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చికిత్స అందించినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే మండలంలోని ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. -
కళాకారులకు సహకారం అందిస్తాం
నిర్మల్ టౌన్: నిర్మల్ కొయ్య బొమ్మలతో జీవనోపాధి పొందుతున్న కళాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంఘం కోరిక మేరకు రూ.7 లక్షల విలువైన టాటా మ్యాజిక్ వాహనాన్ని, రూ.5 లక్షలను వారి వనరుల కొనుగోలుకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వాహనంతో వారి సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసుకుంటూ.. లాభాలు సంపాదించాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో వారి అభ్యున్నతికి అటవీశాఖ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నాగినిభాను, నిర్మల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి రామకృష్ణారావు, సంతోష్కుమార్, నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
గోదావర్రీ
బాసర: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు మూడు రోజలు జిల్లాలో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా నాలుగ దశాబ్దాల క్రితం వరదను గుర్తుకుతెచ్చేలా మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో బాసర వద్ద వరద పోటెత్తుతోంది. ప్రసిద్ధ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, వ్యాస భగవానుడి పాదాల వరకు వరద నీరు చేరింది. ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. కాటేజీలు, దుకాణాలు, ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. గోదావరి ఉప్పొంగడంతో బాసర మండలంలోని కిర్గుల్(బి) గ్రామంలో పత్తి, సోయా, వరి, కూరగాయలతో సహా వివిధ పంటలు వరద నీటిలో మునిగాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ దెబ్బతిన్న పంటలను శనివారం పరిశీలించారు. పరిహారం ఇస్తామని హామీ.. కలెక్టర్ అభిలాష అభినవ్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. బిద్రెల్లి గ్రామంలో దెబ్బతిన్న సోయా, పత్తి, వరి పంటలను పరిశీలించి, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. నష్ట వివరాలను నమోదు చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆలయం సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని సూచించారు. రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సతీశ్వరరావు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. గోదావరి ఉధృతి తగ్గకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానికంగా అందుబాటులో ఉంటున్నాయి. ఎమ్మెల్యే సందర్శన.. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, ఇతర నాయకులు ఉన్నారు. -
కజ్జర్ల శివారులో చిరుత సంచారం
తలమడుగు: మండలంలోని కజ్జర్ల, దేవాపూ ర్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పంట పొలాలకు వెళ్లే రైతులకు చిరుత పాదముద్రలు కనిపించడంతో వారు పెద్దపులివిగా భావించి భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ కృష్ణను సంప్రదించగా అవి చిరుతపులి అడుగులుగా గుర్తించారు. కజ్జర్ల, దేవాపూర్ శివారులో అట వీ ప్రాంతం నుంచి చిరుతపులులు వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు. రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవి ఒకే చోట ఉండవని పేర్కొన్నారు. చిరుతపులి ఎవరికై నా కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
రామకృష్ణాపూర్: పట్టణంలోని ‘ఏ’ జోన్ రాంనగర్ ప్రాంతానికి చెందిన చీపురుశెట్టి సతీశ్ (40) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఏఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగా సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పెంబిలో మరొకరు..పెంబి: మానసిక స్థితి బాగా లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అందె రమేశ్ (40)కు కొంతకాలంగా మానసిక స్థితి బాగా లేదు. కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం బెల్లంపల్లిలో చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేయించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని అటవీప్రాంతలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య భాగ్య, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆల్ రౌండర్గా వసంత
నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిక్కుడు చిన్నక్క–చిన్నయ్య దంపతుల కుమార్తె వసంత రాష్ట్రస్థాయి వేదికల్లో అథ్లెటిక్స్లో సత్తా చాటుతూ రాష్ట్రస్థాయి రిఫరీగా ఎంపికై ంది. ట్రిపుల్ జంప్లో ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో మెరిసింది. ఒక స్వర్ణం, మరో కాంస్యంతో సత్తా చాటింది. షాట్ పుట్లో గోల్డ్ మెడల్ సాధించింది. హైజంప్లో రెండు కాంస్యాలతో ప్రతిభ కనబరిచింది. దాదాపు అన్ని ఈవెంట్లలో ఆల్ రౌండర్గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్నగర్ వేదికగా ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికై ంది. -
డిస్కస్ త్రోలో జ్యోతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలానికి చెందిన బిస్సే సుధామ–అనసూయ దంపతుల కుమార్తె జ్యోతి ప్రస్తు తం జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. జ్యోతి డిస్కస్త్రోలో సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయి వేదికల్లో ఇప్పటివరకు రెండు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో సత్తా చాటింది. ఓవైపు ఓ అథ్లెట్గా రాణిస్తూనే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ వేదికగా మే 16నుంచి 30వరకు నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. కొద్దిరోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా స్థాయి టెక్నికల్ అఫీషియల్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు మహబూబ్నగర్ వేదికగా ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికై ంది. కాల్ రూమ్ కో ఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించనుంది. -
గోదారమ్మ మహోగ్రరూపం
బాసర: మూడు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి ఎస్సారెస్పీలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరినది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాసరలోని హరిహర కాటేజ్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న రెండు కుటుంబాలకు చెందిన 11 మందిని రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు తీసుకువచ్చారు. బ్రిడ్జికి 10 ఫీట్ల కింది నుంచి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి బ్యాక్ వాటర్తో పంట పొలా లు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. గోదా వరి ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. బాసర రైల్వేస్టేషన్, శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయ సమీపం వరకు నదీ జలాలు వచ్చాయి. సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. నదీ ప్రవాహంతో పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయా యి. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా సోయా, పత్తి, వరి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కాలనీల్లో వైద్యసేవలుభారీ వర్షాల నేపథ్యంలో బాసరలోని పలు కాలనీ లు అపరిశుభ్రంగా మారాయి. వరదనీటితో ఆయా కాలనీలవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో సూపర్వైజర్ ఆ శాలత, ఏఎన్ఎం, సిబ్బందితో ఇంటింటా తిరిగా రు. విష జ్వరాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి సేవలందిస్తున్నారు. అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలువరద ముంపునకు గురైన బాసర మండంలోని ఓనీ, కౌటా, సావర్గం, సాలాపూర్, బిద్రెల్లి, లాబ్ది, టాక్లి గ్రామాలను ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. వరద ప్రవా హం ఉన్నచోట చెరువులు, కుంటలు, వాగులు వద్దకు వెళ్లొద్దని అప్రమత్తం చేశారు. స్థానిక తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో దేవేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్గౌడ్ ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారు. బాధితులను తీసుకువస్తున్న పోలీసులుతెప్పెలపై బాధితులతో వస్తున్న గజ ఈతగాళ్లు -
‘గడ్డెన్నవాగు’కు తగ్గని వరద
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రా జెక్ట్లోకి శుక్రవారం భారీగా వరదనీరు చేరింది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు రెండు రోజులుగా ఇన్ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఉదయం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, రెండు, మూడు గేట్ల ద్వారా సుమారు 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో మరింత పెరగడంతో మరో రెండు గేట్లు ఎత్తి 37వేల క్యూ సెక్కులు దిగువకు వదిలారు. వరద గేట్లకు దిగువ ప్రాంతంలోగల గణేశ్నగర్ కోతి హనుమాన్ ప్రాంతంలో కుభీర్కు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అటువైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆటోనగర్తోపాటు రాహుల్నగర్లోని డ బ్బా కాలనీ, భాగ్యనగర్లోకి వరదనీరు చొ చ్చుకువచ్చింది. దీంతో అధికారులు ముందస్తుగా ఆయా కాలనీవాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. సాయంత్రానికి ఇన్ ఫ్లో తగ్గడంతో ఒక గేటు మూసివేశారు. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.20 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నాలుగు గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
సద్గురు బోధనలు అనుసరణీయం
జైనూర్: తన హితబోధతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీ బాబా. మహారాష్ట్రలోని పర్భని జిల్లా, నాగ్నాథ్ ఔండా తాలుకాలోని బయాన్రావు గ్రామంలో 30 ఆగస్టు 1925లో ఆంద్ తెగలోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ధోండిజి ఇంగ్లే–పుంజాబాయి పుణ్య దంపతులకు బాబా జన్మించారు. తల్లి పుంజాబాయి గొప్ప శివభక్తురాలు, భజన, సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చిన్న వయస్సులోనే పూలాజీబాబా తండ్రి కరువు కాటకాల నుంచి తప్పించుకుని బతుకుదెరువు కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ ఆంద్గూడ గ్రామానికి 1947లో శాశ్వతంగా వలస వచ్చారు. వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. తల్లి పుంజాబాయి, గురువు గణపతి వాడ్గురే బోధనలతో ప్రభావితమైన పంచాగ్ని యోగా సాధనతో పాటు వేదాలు, ఉపనిషత్తులు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి పూలాజీ బాబా పరమయోగిగా మారారు. బాబా తత్వమిదే..‘అనంత విశ్వంలో మనమున్నాం. మనలో విశ్వం దాగి ఉంది. పంచభూతాల నిలయం మానవ దేహం. ఈ దేహమే దేవాలయం. శరీరంలోని కుండలి, శక్తిని ఉత్తేజితం చేయడంతో భక్త సాక్షాత్కారం లభించి ప్రశాంత జీవితం పొందగలరు’ అని ఆయన బోధించారు. జీవుడే దేవుడు అంటూ భక్తుల మానసిక వికాసానికి జీవితాంతం కృషి చేసి గురుపీఠం గౌరవాన్ని పెంచిన పరమ యోగి శ్రీసిద్ది యోగా పీఠం, సిద్దేశ్వర సంస్థాన్ను నెలకొల్పారు. ఆత్మ విశ్వాసాన్ని నింపిన బోధనలుబాబా బోధనలు ఎందరిలోనో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. అనేక మంది జీవితాలు ఇతరులకు ఆదర్శమయ్యాయి. బాబాను విమర్శించే వారు అతడి పాదక్రాంతులయ్యారు. బాబా భక్తులు నేటికీ అతడు చూపిన మార్గంలో జీవిస్తూ ఆయా గ్రామాల్లో ధ్యాన కేంద్రాలు నెలకొల్పారు. మూఢ నమ్మకాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనను అలవర్చుకున్నారు. పూలాజీ బాబా హితబోధతో ఎంతోమంది జీవితాలు మారాయి. నేటికీ బాబా చూపిన మార్గంలో భక్తులు మాంసాహారం, మద్యానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి..జైనూర్ మండలంలోని పట్నాపూర్ శనివా రం నిర్వహించనున్న పూలాజీ బాబా జ యంతి వేడుకలకు తెలంగాణతోపాటు మ హారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు సిద్దేశ్వర సంస్థాన్ కు తరలిరానున్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కిన్వట్ ఎమ్మెల్యే భీంరావు కేరామ్ తదితరులు హాజరుకానున్నారు.12 ఏళ్లు తపస్సు చేసి..మల్లంగి తపోభూమిలో 12 ఏళ్లు బాబా తప స్సు చేశారు. మల్లంగి అరణ్య ప్రదేశం దట్ట మైన వృక్షాల నడుమ ఓ నది తీర ప్రాంతంలో అల్లనేరేడు వృక్షం కింద తపస్సు చేసేవా రు. ఈ క్షేత్రం నేడు సిద్దేశ్వర సంస్థాన్ మల్లంగిగా పిలువబడుతోంది. బాబా ఇక్కడే ధ్యానధారణ చేసేవారు. పూలాజీ బాబాకు 1965–66లో ఆత్మసాక్షాత్కారం అయింది. -
క్రీడాకారులే నిర్ణేతలుగా..
ఆదిలాబాద్: 19 ఏళ్ల వయస్సులో క్రీడల్లో రాష్ట్రస్థాయి వేదికల్లో పతకాలు సాధిస్తే వారి గురించి గొప్పగా చెబుతుంటాం. డిగ్రీ స్థాయిలో క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకుని సత్తా చాటితే వారికి గొప్ప భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తాం. అయితే ఈ క్రీడాకారులు మాత్రం నైపుణ్యాలను అలవర్చుకోవడమే కాకుండా ఆ క్రీడపై పట్టు సాధించి అతి చిన్న వయస్సులోనే న్యాయ నిర్ణేతలుగా ఎంపిక కావడం విశేషం. మహబూబ్నగర్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వారు రిఫరీలుగా వ్యవహరించనున్నారు. టీనేజీలోనే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ రెఫరీలుగా ఎంపికై న ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులపై కథనం. జంప్స్ రెఫరీగా అనిల్ ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం మంజరామ్ తండాకు చెందిన అజాడే శారదాబాయి–గురుదయాల్ సింగ్ దంపతుల కుమారుడు అనిల్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, హ్యామర్ త్రోలో కాంస్య పతకాలతో మెరిశాడు. ట్రిపుల్ జంప్లో రజత పతకంతో సత్తా చాటాడు. మేలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో అర్హత సాధించాడు. తాజాగా మహబూబ్నగర్ వేదికగా నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంపు ఈవెంట్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నాడు. -
నిలిచిన రైళ్ల రాకపోకలు
బాసరలో గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. గోదావరినదిపై ఉన్న రైల్వే బ్రిడ్జికి రెండు ఫీట్ల కింది నుంచే నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యా రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బాసర స్టేషన్ మేనేజర్ రవీందర్ తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. బాసర ఎస్బీఐలోకి చేరిన నీరుగోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ బాసర మండల కేంద్రంలోని ఎస్బీఐలోకి చేరింది. మేనేజర్ అశోక్కుమార్, అధికారులు అప్రమత్తమై వరద నీ టిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేశా రు. రెండు, మూడు రోజులు సేవలకు అంతరాయం కలగవచ్చని వారు తెలిపారు. సహకరించాలని ఖాతాదారులను కోరారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఖానాపూర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, మండల పరిషత్, ఇతర శాఖల అధికారులు వర్షాల సమయంలో స్థానికంగా ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న చోట తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతోపాటు శాశ్వత మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎస్సారెస్పీతోపాటు సదర్మాట్, గోదావరి, చెరువులు, కుంటలు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. అంతకుముందు పట్టణంలోని మైనార్టీ స్కూల్కు వెళ్లే మార్గంలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు. -
భైంసా డివిజన్లో దంచికొట్టిన వాన
భైంసా/భైంసారూరల్/తానూరు: భైంసా డివిజన్లో గురువారం రాత్రి వర్షం దంచికొట్టింది. దీనికితోడు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరి ఉప్పొంగింది. మరోవైపు మంజీరా వరద పోటెత్తింది. దీంతో బాసరలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత పంటలను ముంచింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదతో సిరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అలుగు నుంచి వచ్చే నీటి ఉధృతికి గుట్ట సమీపంలోని దోని వద్ద కాలువ మరోసారి తెగింది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇలేగాం, సిరాల, దేగాం, వాలేగాం గ్రామాల్లోని పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిలిచిన రాకపోకలు.. దేగాం–ఇలేగాం గ్రామాల మధ్య లోలెవల్ వంతెన నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముధోల్ మండలం ముద్గల్, తానూరు మండలంబోల్సా, ఝరి గ్రామాల్లో వాగులు పొంగి రవాణా స్తంభించింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ మునిగిన వంతెన.. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్వాటర్తో గుండేగాం వంతెన మరోసారి నీటమునిగింది. శ్మశానవాటిక పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు నీరు గ్రామంలోకి చేరుతోంది. పోలీసు అధికారులు రాకపోకలను నిలిపివేసి, అప్రమత్తమయ్యారు. నీటమునిగిన పంటలు.. తానూరు మండలంలో కురిసిన వర్షంతో వాగు పరీ వాహక ప్రాంతాల్లోని సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. ఝరి(బి) లోలెవల్ వంతెన, మసల్గాతండా–మొగ్లి, దౌలతాబాద్, కోలూరు, వాడవన బోల్సా డబుల్ రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంట ల తరబడి నిరీక్షించి గ్రామాలకు చేరుకున్నారు. బోల్సా గ్రామ సమీపంలో వరదకు రోడ్డు కొట్టుకుపోగా, ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. బోల్సా, తొండల, మొగ్లి, మసల్గా, జౌలా(బి), మహాలింగి, బామ్ని గ్రామాల్లో పంటలు దెబ్బతి న్నాయి. ఎంపీడీవో నసీరొద్దీన్, ఎస్సై షేక్జుబేర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. -
నష్టమే మిగిలింది
నిర్మల్: ‘అవసరమున్నప్పుడు రాని వాన.. వద్దంటే పగబట్టినట్టే కురిసింది. చేతికి వస్తుందనుకున్న పొలం ఇసుకపాలాయే. తెల్లబంగారమనుకున్న పత్తిపంట నేలవాలిపాయే. సాయమవుతదనుకున్న సోయా మునిగిపాయే.. మాకష్టం ఎవరికి చెప్పుకోవాలె..’ అంటూ భారీవర్షానికి పంటలు నష్టపోయిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లాలో బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన వాన ఎన్నో అనర్థాలను మిగిల్చింది. దాదాపు 16 మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు వేసిన అంచనాల ప్రకారం 9,200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 600 ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేసి, ఎందుకూ పనిరాకుండా చేసింది. ఆయా మండలాల్లో వరి, పత్తి, సోయాబీన్ పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. వాగులు, కాలువలు ఉప్పొంగడంతో జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. భారీవాన జిల్లావ్యాప్తంగా ఐదు ఇళ్లను దెబ్బతీసింది. తానూరు మండలం మొగ్లి, ఝరి(బి), దౌలతాబాద్, ఎల్వత్, కోలూరు తదితర గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 23 చెరువులు పూర్తిగా నిండి ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో శుక్రవారం భైంసా డివిజన్ ను వర్షం ఇబ్బందిపెట్టింది. పట్టణంతోపాటు పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు జిల్లా సరిహద్దుగా సాగుతున్న గోదావరి ఉగ్రరూపంలోనే ఉరకలెత్తుతోంది. పరివాహకంలోని పంటలను ముంచెత్తుతోంది. పంటలపైనే ప్రతాపం.. ఈసారి వానప్రతాపం పంటలపైనే కొనసాగింది. సీజన్ ప్రారంభం నుంచి ప్రశాంతంగా వర్షాలు కురి సాయని రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్న సమయంలో వరుణుడు విరుచుకుపడ్డాడు. గోదావరితోపాటు, వాగులు, వంకలు, అలుగుల కింద దా దాపు 9,200 ఎకరాల పంట నష్టపోయినట్లు శుక్రవారం మధ్యాహ్నం వరకు అధికారులు అంచనా వే శారు. ఇందులో ప్రధానంగా పత్తి 2,823 ఎకరాల్లో, వరి 2,491ఎకరాల్లో, సోయాబీన్ 2,152 ఎకరాల్లో, మొక్కజొన్న 1,100 ఎకరాల్లో దెబ్బతింది.మొత్తం 4,762మంది రైతులు నష్టపోయినట్లు ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు లెక్కతేల్చారు. కొట్టుకుపోయిన పల్లె రోడ్లు.. జిల్లాలో 2021 నుంచి ఏటా వర్షబీభత్సం కొనసాగుతోంది. ప్రతిసారీ రోడ్లు దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రధానంగా పల్లెరోడ్లు కాస్త గట్టివానకే కొట్టుకుపోతున్నాయి. ఈసారీ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 50కిపైగా రోడ్లు 122కి.మీ. మేర దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. వీటిలో తాత్కాలిక మరమ్మతులకు రూ.1.07 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.6.80 కోట్లు అవసరమున్నట్లుగా అంచనా వేశారు. ఇక ఆర్అండ్బీ పరిధిలో 35–40 రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి నష్టం అధికారులు అంచనావేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనా వేసేపనిలో సిబ్బంది ఉన్నారు. ఈ చిత్రంలో నేలవాలిన పత్తి చేనును దీనంగా చూస్తున్న రైతుపేరు గంగారావు. కుంటాల మండలం అంబకంటి గ్రామం. ఆరెకరాల్లో పత్తిపంట సాగుచేశాడు. ఈసారి కాలం కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఇంతలో భారీవర్షం ముంచేసింది. వరద ఉధృతికి పత్తిపంట నేలవాలింది. దీంతో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
గోదావరి ముంచింది
లక్ష్మణచాంద: మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతోపాటు, ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 39 గేట్లను ఎత్తి, గోదావరి నదిలోకి 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ వరద లక్ష్మణచాంద మండలంలోని పీచర, ధర్మారం, పార్పెల్లి, మునిపల్లి, మాచాపూర్, చింతల్చాంద, చామన్పెల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలను ముంచింది. గోదావరి పరీవాహక గ్రామాల్లో రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, సోయా, వరి, పసుపు పంటలు పూర్తిగా నీటమునిగాయి. 285 రైతులకు చెందిన 315 ఎకరాల సోయా, 110 మంది రైతులకు చెందిన 125 ఎకరాల వరి, 55 మంది రైతుల 48 ఎకరాల పత్తి, 45 మంది రైతుల 85 ఎకరాల మొక్కజొన్న, మొత్తం 573 ఎకరాల్లో పంటలు నీటమునిగాయని మండల వ్యవసాయ అధికారి వసంత్రావు తెలిపారు. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయని, నీటి కింద ఏ పంట ఉందో గుర్తించ డం కష్టంగా ఉందని పేర్కొన్నారు. వరద తగ్గాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడించారు. ఏటా ఇదే పరిస్థితి.. గత రెండేళ్లుగా భారీ వర్షాల కారణంగా పీచర, ధర్మారం, మునిపల్లి, మాచాపూర్, పార్పెల్లి, చింతల్చాంద గ్రామాల్లో వివిధ పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా వర్షాలు మళ్లీ ఉధృతంగా కురవడంతో నష్టం మరింత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో భారీ వర్షాల కారణంగా పంటలకు ఇంత తీవ్రమైన నష్టం జరిగిందని, 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇటువంటి విపత్తు తలెత్తిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పరిహారంపై ఆశలు.. సోయాబీన్, మొక్కజొన్న పంటలు ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. -
వస్తారు.. చూస్తారు.. వెళ్తారు..!
భైంసాటౌన్: ‘భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతో ఏటా తమ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.. మునిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు.. చూసి వెళ్లిపోతున్నారని సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు’ అని ముంపు బాధితులు కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రత్యేకాధికారి హరికిరణ్ పట్టణంలోని రాహుల్నగర్, ఆటోనగర్ ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్నగర్లోని డబ్బాకాలనీవాసులు పలువురు కలెక్టర్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. కాలనీని ఆనుకుని ఉన్న డ్రెయినేజీ కుచించుకుపోయి, వర్షపు నీరు, మురుగునీరు వెళ్లేదారి లేక ఇళ్లలోకి వస్తోందని తెలిపారు. ఎగువన సాత్పూల్ వంతెన వద్ద ఒకరు తన భూమికి ఆనుకుని బండరాళ్లు వేశారని, దీంతో సుద్దవాగులోని వరదనీరు కాలనీని ముంచుతోందని పేర్కొన్నారు. ఆటోనగర్లోనూ ఎంఐఎం నాయకులు పలువురు కలెక్టర్కు సమస్యలు విన్నవించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటితో ఏటా ఆటోనగర్లోని చాలావరకు ముంపునకు గురవుతోందన్నారు. ప్రాజెక్టు దిగువన సుద్దవాగు వెంబడి నీరు పారేందుకు సరైన మార్గం లేక కాలనీలోకి నీరు చొచ్చుకొస్తోందని తెలిపారు. వాగు వెంట ఇష్టారీతిన ఆక్రమణలతో ఈ పరిస్థితి ఎదురవుతోందన్నారు. స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్కుమార్ ఉన్నారు. త్వరలో మరమ్మతులు చేపడతాం కుంటాల: భారీ వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రోడ్లకు త్వరలో శాశ్వత మరమ్మతులు చేపడతామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని అందకూర్ అలుగు వద్ద బుంగను ప్రత్యేక అధికారి హరికిరణ్, అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి పరిశీలించారు. వరదల కారణంగా నీటి ప్రవాహంలోకి వెళ్లొద్దని సూచించారు. వారివెంట తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో రహీంఖాన్ ఉన్నారు. -
క్రీడా దిగ్గజం ధ్యాన్చంద్
నిర్మల్టౌన్: భారత హాకీ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన క్రీడాదిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ అని హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాకాల రాంచందర్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం(మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధ్యాన్చంద్బంతిపై నియంత్రణ, అద్భుతం, నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్చంద్ను హాకీ మాంత్రికుడిని చేశాయని వివరించారు. అనంతరం సీఎం కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభగౌడ్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ అన్నపూర్ణగౌడ్, ట్రస్మా అధ్యక్షుడు చంద్రగౌడ్, పేటా అధ్యక్షుడు భూక్యా రమేశ్, సెక్రెటరీ భోజన్న, దీక్ష జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్గౌడ్, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ కసరత్తు ముమ్మరం
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పా ట్లు చేస్తోంది. తాజాగా, ఓటర్ల తుది జాబితా ప్రకటన షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో త్వరలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లాలోని 400 గ్రామపంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాలను వార్డుల వారీగా మండల పరిషత్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డులపై గురువారం ప్రదర్శించారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరిస్తారు. శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి 31న పరిష్కరిస్తారు. సెప్టెంబరు 2న జాబితా ప్రకటిస్తారు. అధికార యంత్రాంగం సిద్ధం.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. బ్యాలెట్ బాక్స్లతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి 1,730 బాక్స్లు సమకూర్చారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల నివేదికలు సిద్ధం చేశారు. 3,368 వార్డులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు.. గ్రామపంచాయతీ ఎన్నికల ఆలస్యంతో ఆశావహులు నిరీక్షిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత లేకపోవడం ఆలస్యానికి కారణమని భావించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అ మలుపై ప్రకటన చేయడం, ఓటరు జాబితా షె డ్యూల్ విడుదలతో ఆశావహుల్లో ఉత్సాహం చిగురించింది. సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితాకు సహకరించాలి గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే ప్రదర్శించామన్నారు. ఈ జాబితాలపై అభ్యంతరాలను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రాజకీయ పక్షాలు సహకరించాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకుడు కోరిపెల్లి శ్రవణ్రెడ్డి, ఎంఐఎం నాయకుడు మజార్, బీఆర్ఎస్ నేత కోరిపెల్లి రాంకిషన్రెడ్డి, టీడీపీ నేత రమేశ్, వైఎస్సార్సీపీ నేత నరేశ్, ఆప్ నేత హైదర్ పాల్గొన్నారు. జిల్లాలో ఓటర్ల వివరాలు.. మొత్తం 4,49,302 పురుషులు 2,13,805 సీ్త్రలు 2,35,485 ట్రాన్స్జెండర్లు 12 పంచాయతీ డివిజన్లు 02 మొత్తం మండలాలు 18 గ్రామపంచాయతీలు 400 వార్డులు 3,368ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి నిర్మల్చైన్గేట్: స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరందు మంద ఆదేశించారు. అదనపు కలెక్టర్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ మాట్లాడుతూ అధికారులంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. వీడి యో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వెంటాడుతున్న వరద కష్టాలు
సాక్షి, నెట్వర్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరద బాసర కాటేజీల్లోకి ప్రవేశించింది. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా అక్కడికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. విపత్తు నియంత్రణ సహాయక బృందాలతో కాటేజీల నిర్వాహకులు, సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా బాసర ఆలయ అర్చకులు గోదావరి శాంతించాలంటూ స్నానఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇలావుండగా..భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తారు. సుద్ధవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ పట్టణంలో షాపుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడుతున్నారు.హైదరాబాద్ నుంచి మెదక్ –ఎల్లారెడ్డి–బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా కోటగిరి వరకు వెళ్లే 765డీ జాతీయ రహదారి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్–నాగ్పూర్ హైవే (44) కోతకు గురైన చోట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.హవేళీఘనపురం మండలం గంగమ్మవా గులో గల్లంతైన యాదగౌడ్ అనే మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం లభించింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గల్లంతై మూడు రోజులైనా జాడ దొరకలేదు. రైలు పట్టాల ధ్వంసానికి కబ్జాలే కారణంభారీ వర్షాలతో రామేశ్వర్పల్లి–తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య 528 మైలురాయి వద్ద 50 మీటర్ల పొడవున ట్రాక్ కింద మట్టి కొట్టుకపోయి పట్టాలు గాల్లో తేలడానికి చెరువు అలుగు కాలువ ఆక్రమణలే కారణమని తెలుస్తోంది.గణపతి విగ్రహం కోసం వచ్చి చిక్కుకుపోయిన చిన్నారులుకామారెడ్డి జిల్లా లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన సుమారు పది మంది చిన్నారులు బుధవారం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్కు వచ్చారు. అయితే రెండు జిల్లాల మధ్య ప్రవహిస్తోన్న మంజీరా నది పోచారం డ్యామ్పై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో వారంతా రెండు రోజులుగా మెదక్లోనే ఉండిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్తో వారిని ఎల్లారెడ్డి వైపు తరలించేందుకు యత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిన్నారులను మెదక్లోని పునరావాస శిబిరాలకు తరలించారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
భైంసారూరల్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరా లు దోహదపడతాయని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. మండలంలోని తిమ్మాపూర్, వానల్పాడ్ వీడీసీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. భైంసా–నిర్మల్ జాతీయ రహదా రిపై తిమ్మాపూర్ వద్ద ప్రమాదహెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. తిమ్మాపూర్లోని నరసింహాస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంత రం మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఏమైన సమస్యలు ఉంటే డయల్ 100 ఫోన్ చేసి తెలుపాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అవినాశ్కుమార్, సీఐ నైలు, ఎస్సై శంకర్, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు. -
పోలీసుల అప్రమత్తం
● పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఎస్పీ నిర్మల్ టౌన్: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎస్పీ జానకీషర్మిల క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. పోలీసులను సమన్వం చేస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షంతో మంచిర్యాల్ చౌరస్తా జలమయమై, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎస్పీ స్వయంగా పరిశీలించి, ట్రాఫిక్ను నియంత్రించి, వాహనాలను డైవర్ట్ చేశారు. సొన్ మండలం మాదాపూర్లో వాగు ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులు, 15 పశువులను డయల్ 100 సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు కాపాడారు. ఎస్పీ బంగల్పేట్ చెరువు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, మత్స్యకారులు చెరువులోకి దిగవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు కొండాపూర్ బ్రిడ్జి వద్ద డైవర్ట్ అయి, మామడ, ఖానాపూర్, జగిత్యాల ద్వారా ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. -
శంకర్ సేఫ్
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి తండా కు చెందిన గుగ్లావత్ శంకర్ గోదావరి నది వరదలో చిక్కుకున్నాడు. 36 గంటల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాహసోపేతంగా అతడిని కాపాడాయి. బుధవారం ఉదయం శంకర్, మునిపల్లికి చెందిన శ్రీనివాస్, లింగన్నలు గోదావరి వద్ద పశువులను మేపడానికి వెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీనివాస్, లింగన్నలు తెప్పలతో ఒడ్డుకు చేరగా శంకర్ మాత్రం కుర్రులో చిక్కుకున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ సాహసం.. ఎస్పీ జానకీషర్మిలగజ ఈతగాళ్లు, జాలర్లతో బుధవారం సాయంత్రమే రక్షణ చర్యలు ప్రారంభించారు. పొద్దుపోవడం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్లతో శంకర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. అంతకు ముందు అధికారులో డ్రోన్ ద్వారా శంకర్కు ఫోన్, ఆహారం, నీరు పంపించారు. దీంతో రక్షణకు మార్గం సుగమం చేసింది. ఎస్పీ జానకీషర్మిల ట్రాక్టర్పై ఒడ్డుకు చేరి, శంకర్కు వేడి టీ అందించి ధైర్యం చెప్పారు. కలెక్టర్ అభిలాష అభినవ్ నీటి విడుదల తగ్గించేలా సమన్వయం చేశారు. బయటకు వచ్చిన శంకర్ను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాత్రంతా భయం భయంగా గడిపినట్లు పేర్కొన్నారు. జీవితంపై ఆశలు వదులుకున్నట్లు చెప్పాడు. ఎన్డీఆర్ఎఫ్, అధికారుల కృషికి కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
భైంసాటౌన్: జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతోపాటు కడెం ప్రాజెక్టు, సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరదను గమనిస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెంకు లక్ష క్యూసెక్కులు.. కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వచ్చి చేరింది. ఉదయం 20 వేలకుపైగా క్యూసెక్కుల వరదనీరు చేరగా, ప్రాజెక్టు అధికారులు ఆరు గేట్లు ఎత్తి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎడతెరిపి లేని వానతో ప్రాజెక్టుకు అంతకంతకు ఇన్ఫ్లో పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 99 వేల క్యూసెక్కుల వరద చేరడంతో మరో నాలుగు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, 696.200 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన్నవాగు మూడు గేట్లు ఎత్తివేత.. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉండడంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కాగా, గంటగంటకు ఇన్ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, 358.40 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నీటి విడుదల చేశారు. మధ్యాహ్నం 6,800 క్యూసుక్కులు రాగా రెండు గేట్లు ఎత్తారు. సాయంత్రం సమయానికి 17,500 క్యూసెక్కులకు పెరగడంతో మరోగేటు ఎత్తి 18,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్వర్ణ రెండు గేట్లు ఎత్తివేత.. సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,181.7 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, రెండు గేట్ల ద్వారా 1,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 5,700లకు పెరిగింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. -
రికార్డుస్థాయిలో వర్షం..
నిర్మల్: ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేశాయా.. పానీలాయా..’ అంటూ జిల్లా బుధవారం ఉదయం ఘనంగా వినాయకచవితి ఉత్సవంలో మునిగి ఉండగా.. ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములు, మెరుపులతో జడివాన ముంచెత్తింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందేమో.. అని ఎంతసేపు చూసినా.. తగ్గలేదు సరికదా.. గంటగంటకూ పెరుగుతూ చివరకు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. నిర్మల్అర్బన్, నిర్మల్రూరల్ మండలాల్లో కనుచూపు మేరలో ఏముందోకూడా కనిపించనంత దట్టంగా కురిసింది. మళ్లీ మూడేళ్లక్రితం సీన్ను రిపీట్ చేసింది. ఈ రెండు మండలాల్లో గతంలో ఎన్నడూ కురవని రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రంతోపాటు పలుమండలాల్లో భారీ వర్షం కురిసింది. వరదకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పిల్లాజెల్లాతో ఎన్నో కుటుంబాలు పండుగపూట బిక్కుబిక్కుమంటూ మోకాలులోతు బురదనీళ్లల్లో నిద్రలేకుండా గడపాల్సి వచ్చింది. వరద ముంచెత్తడంతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రం.. జలసంద్రం.. పేరుకు జిల్లాకేంద్రం కానీ.. అడుగడుగునా కబ్జాలతో ఎక్కడా నాళాలు, కందకాలు సరిగా లేని దుస్థితి. ఇప్పటికీ కనీసం డ్రైనేజీ వ్యవస్థంటూ లేదు. అధికారులు, పాలకుల ఈ నిర్లక్ష్యమే మరోసారి నిర్మల్ను మళ్లీ నీటముంచింది. తాజాగా కురిసిన అతిభారీ వర్షం జిల్లాకేంద్రాన్ని జలసంద్రంలా మార్చేసింది. మూడేళ్లక్రితం జడివాన ఘటనను గుర్తుచేసింది. భయపెట్టిన ‘బంగల్చెరువు’.. భారీవర్షాలకు కట్ట కోసుకుపోతుండటంతో జిల్లాకేంద్రంలోని బంగల్చెరువు స్థానికులను భయపెట్టింది. జిల్లాకేంద్రంలోని వినాయకులను నిమజ్జనం చేసేది ఈ వినాయక్సాగర్లోనే. ఇటీవలే ఈ చెరువు తూమును కొత్తగా నిర్మించారు. తూముకు ఇరువైపులా కేవలం మొరం వేసి వదిలేయడంతో భారీ వర్షానికి కోతకు గురైంది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. హుటాహుటిన ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు చేపట్టారు. సేవలందించిన చేతులు.. ఓవైపు భారీవర్షం, మరోవైపు సగం మునిగేలా వరదనీరు.. అందులోనూ తమవంతుగా సేవలందించారు పలువురు యువకులు. జిల్లాకేంద్రంలోని నటరాజ్నగర్లో బుధవారం రాత్రి భారీవర్షం, వరదలో చిక్కుకుపోయిన వృద్ధురాలు, ఓ క్షతగాత్రుడిని స్థానిక యువకులు క్షేమంగా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయ్యప్ప సేవాసమితి, కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆహార పదార్థాలు అందించారు.క్షేత్రస్థాయిలో ఉంటూ..భారీ నుంచి అతిభారీ వర్షం ఉన్నట్లు అందిన సమాచారంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు రోజంతా క్షేత్రస్థాయిలో ఉంటూ స్వయంగా చర్యల్లో పాలుపంచుకున్నారు. బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. మూడేళ్లక్రితం 2021, జూలై 22న జిల్లామొత్తం కలిపి దాదాపు 150 మి.మీ కాగా, నర్సాపూర్(జి)245మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదే చాలా ఎక్కువగా భావిస్తున్న క్రమంలో తాజాగా మరింత రికార్డుస్థాయిలో అత్యధికంగా నిర్మల్(332.8మి.మీ.), నిర్మల్రూరల్(332.4మి.మీ.), లక్ష్మణచాంద(218.6మి.మీ), సోన్(208.4మి.మీ.), నర్సాపూర్(జి)(202.6మి.మీ.) మండలాల్లో వర్షపాతం నమోదైంది. దాదాపు 20గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. -
అండగా ఉంటాం
● జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ నిర్మల్చైన్గేట్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తెలిపా రు. కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పట్టణంలోని బోయవాడలో పర్యటించి, వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటు న్న ప్రజలతో మాట్లాడారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామన్నారు. కాలనీలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల చౌరస్తా, విశ్వనాథ్పేట్, శాంతినగర్ సమీపంలో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో వర్షపాతం వివరాలు, వరద పరిస్థితులు, నష్ట నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ప్రత్యేక అధికారికి వివరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ తదితరులు ఉన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్మల్చైన్గేట్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోనివారిని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 91005 77132 ను సంప్రదించాలని సూచించారు. మత్స్యకారులు, పశు కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష్మణచాంద మండలం మునిపల్లి గ్రామంలో వాగు అవతలి వైపు చిక్కుకున్న శంకర్ అనే పశువుల కాపరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో రక్షించగలిగామన్నారు. సమావేశంలో డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు. -
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ
నిర్మల్చైన్గేట్: మహిళలు విభిన్నరంగాల్లో స్వయం ఉపాధి పొందేలా శిక్షణ అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం చించో లి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతు న్న శిక్షణ కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కుట్టుమిషన్, అల్లికలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, పేపర్ బ్యాగ్ తయారీ, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి, అధిక సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు విజయలక్ష్మి, మోహన్సింగ్, నరసింహారెడ్డి, శంకర్ పాల్గొన్నారు. -
గురువుల సాయం..
సమస్య పరిష్కారం.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఆరుబయట భోజనం చేస్తారు. జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు నేలపైనే కూర్చుని భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులంతా కలిసి విద్యార్థుల ఇబ్బంది తొలగించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత నగదు పోగుచేసి విద్యార్థులు సామూహికంగా భోజనం చేసేందుకు అనువుగా ఉండే సీటింగ్ కవర్లను కొనుగోలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో దాదాపు 250 మంది విద్యార్థులు వీటిపై కూర్చుని భోజనం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
కదిలి, కాల్వ ఆలయాల హుండీ లెక్కింపు
దిలావర్పూర్: మండలంలోని అత్యంత ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న శ్రీమాతాన్నపూర్ణ కదలి పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం అధికారులు లెక్కించారు. శ్రావణ మాసప్రత్యేక పూజల అనంతరం ఈ హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. కాల్వ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.4.25 లక్షల ఆదాయం సమకూరింది. శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయానికి హుండీ ద్వారా రూ.6.61 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కాల్వ ఆలయ కమిటీ చైర్మన్ అంగూరి మహేందర్, కదిలి ఆలయ కమిటీ చైర్మన్ నార్వాడి వెంకట్రావుపాటిల్, ఆలయాల ఈవో భూమయ్య, ఎండో మెంట్ సీనియర్ అసిస్టెంట్లు జాదవ్ మాధవరావుపాటిల్, మనోహర్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎస్జీటీలకు మంగళవారం రాత్రి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం రాత్రంతా ఉపాధ్యాయులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. పీఎస్ హెచ్ఎంలుగా 34 మందికి, స్కూల్ అసిస్టెంట్ గణితం 6, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 9, సోషల్ స్టడీస్ 17, తెలుగు 5, హిందీ 1, ఇంగ్లిష్ 5 మొత్తం 78 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ లభించాయి. బుధవారం సెలవు ఉన్నప్పటికీ వీరంతా ఆయా పాఠశాలలో జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తీజ్ సంబురం కుంటాల: మండలంలోని ఓలా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో మంగళవారం మహిళలు తీజ్ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ వేషధారణతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం గోధుమనారును నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో తండా పెద్దలు శంకర్ నాయక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన ఫలితాలు సాధించాలి
సోన్: విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా బోధించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణరెడ్డి అన్నారు. మండలం కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలతోపాటు వివిధ పాఠశాలలను డీఈవో రామారావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రాథమిక తరగతులలో జరుగుతున్న తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులను అభ్యసన ఫలితాలకు సంబంధిత ప్రశ్నలు అడిగి ప్రగతిని తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల వివరాలు యూడైస్లో నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ హాజరు, ఎఫ్ఏ పరీక్ష ఫలితాలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు యూనిఫాంల వివరాలు ఆన్లైన్లో నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించారు. విద్యా సేవలను సీఆర్పీ సంధ్యారాణిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సహాయ కార్యదర్శి భానుమూర్తి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గణపతి బప్పా మోరియా
వినాయక పండగ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు. చిన్నారులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై సామాజిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలో శ్రీసరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు గణపతి రూపంలో విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. – భైంసాటౌన్ రావయ్యా.. గణపయ్యా..నిర్మల్: ‘రావయ్యా.. బొజ్జగణపయ్యా.. నీరాక మాకెంతో సంతోషమయ్యా..’ అంటూ చిన్న నుంచి పెద్దదాకా జిల్లా అంతా గణనాథుడికి స్వాగతం పలుకుతోంది. వినాయకచవితికి పర్వదినంతోపాటు నవరాత్రుల వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇంట్లో చిన్ని గణపయ్య మొదలు గల్లీకా గణేశ్ దాకా ఘనంగా స్వాగతం పలికేందుకు మండపాలు, డెకరేషన్లు, లైటింగ్, సౌండ్సిస్టం.. ఇలా అన్నింటినీ సిద్ధం చేవారు. బుధవారం ఉదయం నుంచే ఏకదంతుడు కొలువుదీరి భక్తుల పూజలందుకోనున్నాడు. కొన్నేళ్లుగా ప్రకృతి పరిరక్షణలో భాగమవుతున్న జిల్లావాసులు ఈసారీ.. ‘ఎకోదంతుడి’కే జైకొడుతున్నారు. మట్టిప్రతిమలు, విగ్రహాలకు గతంతో పోలిస్తే డిమాండ్ పెరిగింది. ఒక్క నిర్మల్ పట్టణంలోనే 20కిపైగా పెద్ద మట్టిగణనాథులను ప్రతిష్టించారు. ఇక ఇళ్లల్లో దాదాపు మట్టి ప్రతిమలనే పెట్టి పూజిస్తున్నారు. పలు సంఘాలు, సామాజిక కార్యకర్తలూ మట్టి ప్రతిమలను ప్రత్యేకంగా తయారు చేయించి, పండుగ రోజు ఉచితంగా పంచుతున్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో వినాయక ఉత్సవాలను వంద ఏళ్లకు పైబడి నిర్వహిస్తూ వస్తున్నారు. బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపును జిల్లా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికీ జిల్లాలో చాలా మండపాల వద్ద తిలక్ ఫొటోనూ పెడుతుండటం గమనార్హం. సరిహద్దు మండలాలైన తానూరు, కుభీర్, భైంసాల్లో ఇప్పటికీ పలు గ్రామాలు ఆనవాయితీ ప్రకారం కర్ర గణేశులనే పూజిస్తున్నాయి. నగదు బదిలీ డిమాండ్.. ఉచిత చేప పిల్లల నాణ్యత సరిగా లేక నష్టపోతున్నామని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నగదు బదిలీ ద్వారా నిధులను నేరుగా సంఘాల ఖాతాలకు జమ చేస్తే, తామే నాణ్యమైన సీడ్ కొనుగోలు చేసి చెరువుల్లో విడుదల చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఈ విధానం నిధుల దుర్వినియోగాన్ని నిరోధిస్తుందని వాదిస్తున్నారు. ప్రభుత్వం సంప్రదాయ టెండర్ పద్ధతినే కొనసాగిస్తోంది. దీంతో కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా అయ్యే సీడ్ నాణ్యతపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
915 ఎకరాల్లో పంటనష్టం
నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఇటీవల వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా 915 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడు మండలాల్లో 472 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించగా, క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు సేకరించారు. నిర్మల్, ఖానాపూర్, కడెం నియోజకవర్గాల్లోని సారంగాపూర్, పెంబి, కడెం మండలాల్లో నష్టం ఎక్కువగా నమోదైంది. పత్తి పంటకు అధిక నష్టం పంటల్లో పత్తికి అత్యధిక నష్టం వాటిల్లినట్లు తేలింది. మొత్తం 810 ఎకరాల్లో పత్తి పంట నీటమునిగి దెబ్బతింది. ప్రస్తుతం కాయ దశలో ఉన్న ఈ పంటలో అడుగు భాగంలోని కాయలు మునిగి కుళ్లిపోయాయి. మొక్కల ఆకులు ఎరుపు రంగులోకి మారడంతో దిగుబడి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో 700 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు నిర్ధారణ అయింది. 107 ఎకరాల్లో వరి పంట కూడా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక.. పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. పూర్తిస్థాయి సర్వే ద్వారా వివరణాత్మక నష్ట అంచనా చేయనున్నారు. నిబంధనల ప్రకారం, 33 శాతానికి మించి నష్టం జరిగిన పంటలను మాత్రమే నష్టపోయినవిగా గుర్తిస్తారు. నష్టం అంచనాలు సిద్ధం చేయండి నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు, రహదారులు, భవనాలకు అధిక నష్టం వాటిల్లిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాఖల వారీగా అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, విద్యుత్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన నష్టం, సర్వే తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు. నష్టంపై ప్రతీశాఖ క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 29 లోపు సర్వే పూర్తి చేసి సంబంధిత శాఖల హెచ్వోడీలకు నివేదికలు పంపాలన్నారు. సమావేశంలో డీఈవో పి.రామారావు, డీఏవో అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, విద్యుత్, ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మండలం వరి పంట పత్తి పంట కడెం 75 40 పెంబి 0 700 సారంగాపూర్ 30 70 మొత్తం పంట నష్టం 915వరి పంట నష్టం 105 ఎకరాలు పత్తి పంట నష్టం 810 ఎకరాలు మొత్తం రైతులు 472 మంది -
చట్టాలపై అవగాహన ఉండాలి
మామడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాసంస్థ చైర్పర్సన్, సీని యర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలి యజేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చని తెలిపారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తునే సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ చట్టా ల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరవింద్కుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, ప్రధాన కార్యదర్శి రావుల హన్మంత్రెడ్డి, ఖానాపూర్ సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీడీవో సుశీల్రెడ్డి, వైద్యాదికారి స్వాతి, పారా లీగల్ వాలంటీర్స్ జనార్దన్, పోతన్న, రాజేశ్వర్, కిషన్రావ్, రాజేశ్వర్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూం, కౌంటింగ్ హాల్ పరిశీలన
ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లు లెక్కించేందుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆయా భవనాలను జెడ్పీ సీఈవో గోవింద్ మంగళవారం పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో రత్నాకర్రావుతో కలిసి పాఠశాల, కళాశాల గదులను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. పట్టణంలోని ఎంపీపీ కార్యాలయ సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులతో సమవేశం నిర్వహించారు. ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక, మొరం ఇక్కట్లు లేకుండా చూడాలన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వారికి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా లోపాలు ఉండొద్దు
నిర్మల్ టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కడా భద్రతాలోపం కనిపించొద్దని ఎస్పీ జానకీషర్మిల్ ఆదేశించారు. వేడుకల ప్రారంభం నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష మంగళవారం నిర్వహించారు. జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైం అవగాహన, రోడ్డు ప్రమాద నివారణలపై కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి.. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రోడ్లపై వాహనాల రద్దీ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను అమలు చేయాలని ఆదేశించారు. సైబర్ క్రైంపై అవగాహన.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ ద్వారా మోసాలకు గురవుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా https://www.cybercrime.gov.in/ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు.. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ముందస్తుగా గమనించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అత్యాచారం, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు..రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. దొంగతనం, ఆస్తి సంబంధిత నేరాలపై నేరస్తుల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. అంబీస్ టెక్నాలజీ, చాన్స్ ప్రింట్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కేసులను ఛేదించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీణ్కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. -
అటవీ అధికారి దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్: మండలంలోని తర్లపాడు గ్రామంలో పోడు రైతు బోసు భూమన్నకు చెందిన పంటను అటవీ అధికారులు పదేపదే ధ్వంసం చేస్తుండడంతో సీపీఎం ఆధ్వర్యంలో అటవీ అధికారి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. పట్టణంలోని జీపు అడ్డాలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నూతన్కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు నాగలి నర్సయ్య, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. అధి కారులు పోడు రైతుపై కక్షసాధింపు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్బీఎస్కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
‘సరిహద్దు’లో కర్ర గణేశులే..
భైంసా/తానూరు: గణేశ్ నవరాత్రోవాలను నిర్మల్ జిల్లాలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామా ల ప్రజలు వినూత్న రీతిలో జరుపుకొంటారు. పీవో పీ, మట్టి విగ్రహాలు ఇక్కడ మచ్చుకై నా కనిపించవు. రంగులు, రసాయనాల వినియోగం అస్సలే ఉండదు. హంగులు, ఆర్భాటాలు లేకుండా సమాజహితమే తమ అభిమతమని ఇక్కడి ప్రజలు పూర్వీకులు చూపిన బాటనే నేటికీ అనుసరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా దోహదం చేస్తున్నారు. కర్రతో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పాలజ్ గణేశ్ ఫేమస్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్. కుభీర్కు పక్కనే మహా రాష్ట్రలోని బోకర్ తాలూకాలో ఈ ఊరు ఉంది. స్వా తంత్య్రానికి పూర్వం ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి జనమంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఓ వైపు కలరా, ప్లేగు వ్యాధులు, మరోవైపు కరువు పరిస్థితులతో జనం సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను కలిశారు. నిష్టతో గుండాజీ వర్మ చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊ రంతా మొక్కితేనే వ్యాధులు దూరమయ్యాయని, కరువు కాటకాలు తొలగిపోయాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా 1948 నుంచి కర్ర గణేశుడిని వినా యక ఉత్సవాల్లో కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఊరి ఆడబిడ్డల ద్వారానే కర్రగణేశుడి గురించి ఇతర గ్రామాలకు తెలిసింది. పూజల అనంతరం నిమజ్జనం రోజున స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి కర్ర గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీనినే నిమజ్జ నోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహా న్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కలిసికట్టుగా.. లక్షలాదిగా.. తిరుపతి, షిర్డీలో ఉన్నట్లు పాలజ్లోనూ భక్తులకు క్యూలైన్లు ఉన్నాయంటే.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయొచ్చు. ప్రతీ ఏడాది వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. లక్షల్లో తరలివచ్చే భక్తులకు గ్రామస్తులే సేవలందిస్తున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా కర్రగణేశుషుడి సేవలో పాల్గొంటుండడం ఇక్కడి విశేషం. మరికొన్ని గ్రామాల్లోనూ.. తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్ మండలం కుభీర్, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఇలా ఈ ప్రాంతంలో ఊరంతా కలిసి కర్ర గణపతులను ప్రతిష్ఠించడం మొదలైంది. పాలజ్కు ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్ వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు. ఉదయం లేవగానే నీటితో కడిగి పూజించి వెళ్తారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలోనూ ప్రధాన ద్వారంలో ఉన్న గణపతికి నమస్కరిస్తారు. తిరిగి వస్తూ మళ్లీ గణపతికి నమస్కరించాకే ఇంటిలోకి వెళ్తారు. ఏ ఆలయం నిర్మించినా ముందుగా గణపతి పూజలు చేస్తారు. గణపతి హోమాలు నిర్వహిస్తారు. ఇలా అందరికీ గణాధిపతి అయిన స్వామివారికి ముద్గల పురాణంలో 32 స్వరూపాలను వర్ణించారు. ఈ 32 స్వరూపాల్లో 16 రూపాలు అత్యంత ప్రాశస్థ్యమైనవి. పురాణాల్లో పేర్కొన్న రూపాలు పురాణాల్లో వినాయకుడికి 32 స్వరూపాలుగా పేర్కొన్నారు. ఇందులో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనమని తెలిపారు. నేటి రోజుల్లో కళాకారులు గణపయ్యను అనేక రూపాల్లో మలుస్తున్నారు. ఈ 16 రూపాల్లో ఉన్న గణనాథులకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో పేర్కొన్నట్లు బాలగణపతి, తరుణగణపతి, ఉచ్చిష్టగణపతి, విఘ్నగణపతి, మహాగణపతి, క్షిప్రగణపతి, హేరంబగణప తి, లక్ష్మీగణపతి, భక్తిగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, ద్విజగణపతి, సిద్ధగణపతి, నృత్యగణపతి, ఊర్ధ్వగణపతి, విజయగణపతి.. ఇలా 16 ప్రధానమైన రూపాలున్నాయి. -
నిందితుడి రిమాండ్
ఆదిలాబాద్రూరల్: మండలంలోని బంగారుగూడ కాలనీలో ఓ వ్యక్తిని బెదిరించి నగదు దొంగిలించిన డీసీ సీటర్ ఖద్ధర్ను గురువారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ముత్యాలు ఆ ప్రాంతంలో చేపలు విక్రయిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన డీసీ సీటర్ ఖద్ధర్ ముత్యాలును బె దిరించి రూ.1,500 దొంగిలించి పరారయ్యా డు. అంతేకాకుండా ముత్యాల పక్కనున్న శ్రీని వాస్పై దాడి చేశాడు. దీంతో బాధితుల ఫిర్యా దు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఖద్ధర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కలప పట్టివేతదండేపల్లి: మండలంలోని నంబాల గోదావరి తీరం వద్ద అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన 15 టేకు దుంగలను మంగళవారం తమ సిబ్బంది పట్టుకున్నట్లు తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. పట్టుకున్న కలప విలువ రూ.42,329 ఉంటుందని పేర్కొన్నారు. కలపను రేంజ్కి తరలించినట్లు తెలిపారు. అటవీ సిబ్బంది ఎఫ్ఎస్వో నరేశ్, ఎఫ్బీవో నాగరాజుచారి, టైగర్ ట్రాకర్ ప్రశాంత్, బేస్ క్యాంప్ వాచర్ పాల్గొన్నారు. చోరీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్ఆదిలాబాద్టౌన్: చోరీలకు పాల్పడిన ముగ్గు రు నిందితులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న తిర్పెల్లిలోని శ్రీనివాస వైన్స్లో ఐదుగురు దొంగతనానికి పాల్పడగా అందులో షేక్ బిలాల్, మహ్మద్ షారుఖ్ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీ సుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 6న సంజయ్నగర్ కాలనీకి చెందిన శానం నవీన్కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన మా ర్కులే అనిల్ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మూడు తులాల బంగారం చోరీ కి పాల్పడగా, నిందితుడి నుంచి అర తులం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. -
నవోదయకు 6,091 దరఖాస్తులు
కాగజ్నగర్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయం అన్ని వసతులతో పాటు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమై న విద్యకు మారుపేరుగా నిలుస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు www. navodaya. gov. in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 6,091 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,003 మంది బాలికలు, 3,088 మంది బాలుర దరఖాస్తులున్నాయి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుల వివరాలు చెన్నూరు నుంచి 274 దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి 287, మంచి ర్యాల నుంచి 510, కాగజ్నగర్ నుంచి 631, సిర్పూ ర్ నుంచి 378, ఆదిలాబాద్ నుంచి 571, బెల్లంపల్లి నుంచి 270, బోథ్ నుంచి 319, నిర్మల్ నుంచి 590, భైంసా నుంచి 664, లక్సెట్టిపేట్ నుంచి 350,మందమర్రి నుంచి 279, ఉట్నూర్ నుంచి 377, ఆసిఫాబాద్ నుంచి 591 వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిభాషా విధానం అమలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థులు ఐదో తరగతి చదివి ఉండాలి. వరుసగా 3, 4, 5 తరగతులు ఒకే పాఠశాలలో చదివినవారే అర్హులు. విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్యలో జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో త్రిభాషా విధానం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్కు క్వార్టర్లు వంటి వసతులున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపకులు, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్బాల్ తదితర మైదానా లు జిమ్, హెల్త్సెంటర్లతో నవోదయ ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. 6, 7 తరగతులకు మాతృబాషలో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు. -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్లోని ఎస్ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.27వేల కోట్ల బకాయిలుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వే ల కోట్లకు పెరిగిందని తెలిపారు. సమయానికి బకా యిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీ య జోక్యంతో సంస్థ పాలన గాడి తప్పుతోందని తె లిపారు. గుర్తింపు సంఘంగా తాము గెలిచిన తర్వా త కార్మికుల ప్రధాన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరగని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మి కుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ వార్షిక లాభాలను ప్రకటించి అందులో నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డి మాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కా ర్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల కమిటీ ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, సంపత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజి యన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, పిట్ సెక్రటరీ మురళీచౌదరి, ఆకుల లచ్చన్న, జాడి రాజకుమార్, కారుకూరి నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ లావాదేవీలు అ న్ని సీకేర్స్ పోర్టర్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, సేవలన్నీ పారదర్శకంగా ఉంటాయని పే ర్కొన్నారు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీ ఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని సూచించారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్కు అర్హులు, పె న్షన్, రివైస్డ్ పెన్షన్పై ఎలాంటి పెండింగ్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చా రు. పెన్షన్, సీఎంపీఎఫ్ దరఖాస్తులు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందకు ప్రతీ ఉద్యోగి కృషి చే యాలని సూచించారు. ఎస్వోటూ జీఎం రాజమ ల్లు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, అన్ని విభాగాల సంక్షేమ శాఖ క్లరికల్ సిబ్బంది ఉన్నారు. -
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్, స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్, అసోసియేట్ డీన్లు చంద్రశేఖర్, మహేశ్, విఠల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులు ఉపేందర్, భావ్సింగ్ వినయ్, కోఆర్డినేటర్ తేజస్వి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ సీఈవోల బదిలీకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలకు స్థానచలనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66మంది సీఈవోలు ఉండగా, 49 మందిని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 17 సొసైటీల్లో రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో వారికి ఎలాంటి బదిలీ జరగలేదు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేసినట్లు జిల్లా సహకారశాఖ అధికారి మోహన్ తెలిపారు. -
సింగరేణి కార్మికుడి బలవన్మరణం
శ్రీరాంపూర్: కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడు గోర్కె శ్రీనివాస్(40) సీతారాంపల్లి వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్ ఏరియా హిమ్మత్నగర్కు చెందిన గోర్కె శ్రీనివాస్కు అదే ప్రాంతానికి చెందిన కొండపాక స్వరూపతో 2014లో వివాహామైంది. వీరికి కూతురు ఉంది. కాసిపేట 2 గనిలో ఉద్యోగరీత్యా రామకృష్ణాపూర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీనివాస్ భార్య కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ సీతారాంపల్లి గోదావరి నది వద్దకు వెళ్లి తన తల్లి రాజమ్మకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపాడు. రాజమ్మ అల్లుడు రమేశ్, చుట్టుపక్కల వారు గోదావరి నది పుష్కర్ ఘాట్ వద్దకు వెళ్లారు. అప్పటికే శ్రీనివాస్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
నిర్మల్చైన్గేట్: క్రీడలు ఒత్తిడి నుంచి ఉపశమనానికి, శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్ప డతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నా రు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన కోర్టును కలెక్టర్ సోమవారం ప్రారంభించా రు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడా రు. తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ కార్యాల య పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఉద్యోగులు, సిబ్బంది విధులు ముగిసి న తర్వాత కోర్టును వినియోగించుకోవాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం పట్టణంలో మరిన్ని టేబుల్ టెన్నిస్ కోర్టులను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, సీపీవో జీవరత్నం, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజావాణి.. పరిష్కారం కాదేమి?
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి వందకుపైగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిలో పది, ఇరవై మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. మిగతావి పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో బాధితులు సమస్యపై పదేపదే కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూమి ఆక్రమణలు, దివ్యాంగుల పెన్షన్ ఆలస్యం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పట్టా పాస్బుక్లో లోపాలు వంటి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 105 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పరిష్కారం కాని దరఖాస్తుల విషయంలో బాధితులకు స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, ఏవో సూర్యారావు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. వనమహోత్సవం త్వరగా పూర్తి చేయాలి..ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నాటిన మొక్కల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. మట్టి గణపతులను పూజిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులతో కలిసి మట్టి గణపతుల పూజను ప్రోత్సహించే పోస్టర్ విడుదల చేశారు. -
జాగ్రత్తలతో విద్యుత్ ప్రమాదాల నివారణ
భైంసా: వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరనున్నారు. దీంతో మండపాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలంకరణలో, నిమజ్జన ఊరేగింపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏడీఈ ఆదిత్య తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు వేలాడడం, షార్ట్ సర్క్యూట్లు, ఎర్తింగ్ వైర్లలో విద్యుత్ సరఫరా వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. విగ్రహాలను తరలించే సమయంలో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద వేలాడే విద్యుత్ తీగలు తాకితే షాక్ కొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. మండపాల వద్ద జాగ్రత్తలు..నిమజ్జన శోభాయాత్రలో జాగ్రత్తలు.. -
న్యూ బొప్పారం వాసికి అవార్డు
సోన్: మండలంలోని న్యూబొప్పారం గ్రామానికి చెందిన చొక్కాల రాజేందర్ రాష్ట్ర ఉత్త మ అధ్యాపక అవార్డును ఆదివారం స్వీకరించా రు. శ్రీవేదాస్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్సార్ 91వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘ భవనంలో విశిష్ట అతిథులు జస్టిస్ చంద్రకుమార్, బ్రహ్మశ్రీ మోత్కూరి వీరబ్రహ్మయ్య ఐఏఎస్, శ్రీ వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగోజి సంతోష్ కుమార్ అవార్డులు ప్రదానం చేశా రు. రాజేందర్ ప్రస్తుతం గుడిహత్నూర్ కళా శాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. -
విషజ్వరాల విజృంభణ
నిర్మల్చైన్గేట్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలు.. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులు, జలాశయాల్లో కొత్తనీరు రాక, దోమల నియంత్రణ లేకపోవడం తదితర కారణా లవో జ్వరబాధితులు పెరుగుతున్నారు. ఇంటికి ఒకరిద్దరు జ్వరంలో బాధపడుతున్నారు. నిర్మల్ ప్రభు త్వ జనరల్ ఆస్పత్రికి వస్తున్నవారిలో జ్వరపీడితులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపా టు ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. పది రోజులుగా జిల్లా ఆస్పత్రిలో నిత్యం ఓపీ 1200 నుంచి 1400 నమోదవుతుంది. ఇన్పేషెంట్లుగా 400 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు డెంగీ బాధితులు ఉన్నారు. చిన్నారులు, వృద్ధులు జ్వరాలతో ఇన్పేషెంట్గా చేరుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట..ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జ్వర కేసుల వివరాలు అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రోజువారీ కేసుల వివరాలు అందితే, జ్వర కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సమాచారలోపం కారణంగా వ్యాధుల నియంత్రణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వైద్యాధికారుల సూచనలు.. జ్వరాల విజృంభణ నేపథ్యంలో వైద్యాధికా రులు ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను సూచిస్తున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు..ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా డెంగీ కేసులు పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వైరల్ జ్వరాలు, డయేరియా, మలేరియా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. -
ఆశ వర్కర్ల పోరుబాట
నిర్మల్చైన్గేట్: ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేశ్ మాట్లాడారు. ఆశ వర్కర్లు పారి తోషికాలు తగ్గించాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో చెల్లించినట్లు మొత్తం డబ్బులు ప్రతినెలా చివరి నాటికి ఖాతాల్లో జమ చేయాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వర కు పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు ప్రమోషన్ కల్పించాలని లేదంటే వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.గంగమణి, ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.సుజాత, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, విజయ, అనసూర్య, సరిత, ఇంద్రమాల, నంద, జిల్లా సహా య కార్యదర్శులు సులోచన, మౌనిక, విజయ, శ్యామల, పద్మ, కమల, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషణ్ ట్రాకర్ యాప్లో ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలన్నారు. పీఎంశ్రీ, ప్రీస్కూల్ విద్యను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థులు పోషకాహారానికి, ఆరోగ్య పరీక్షలకు దూరమవుతారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, ఉపాధ్యక్షులు గంగమణి, రాజమణి ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ముధోల్: మండల కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని రుమ్మెల్ల యోగిత రాష్ట్రస్థాయి పరుగు పందేనికి ఎంపికైనట్లు ప్రధానాచార్యులు సారథి రాజు తెలి పారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించి న జిల్లాస్థాయి పరుగు పందెంలో 60 మీట ర్లు, 600 మీటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రోత్సహించిన పీఈటీలు కై లాస్, శ్రీనివాస్లను పాఠశాల యాజ మాన్యం అభినందించింది. ఈ నెల 30, 31వ తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. -
భూములు లాక్కోవాలని చూస్తున్నారు..
మేము కడెం మండలం నవాబ్పేట్ గ్రామస్తులం. మాకు సర్వే నంబర్ 22లో వ్యవసాయ భూములు ఉన్నాయి. 28 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. దీనిని ఆనుకుని దస్తురాబాద్ శివారు 470 సర్వే నంబర్ ఉంది. ఫారెస్ట్ అధికారులు 470 సర్వే నంబర్లో ఈ 22 సర్వే నంబర్ ఉందని మా వ్యవసాయ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు సర్వే నంబర్ల హద్దులో అటవీ శాఖ నిర్మించిన పిల్లర్లు ఉన్నాయి. అయినా వాటిని దాటి వచ్చి మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మమ్మల్ని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. – నవాబ్ పేట్ గ్రామస్తులు -
ఎలుగుబంటి దాడిలో కూలీకి గాయాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఎలుగుబంటి దాడిలో ఓ వ్యవసాయ దినసరి కూలీకి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన ఆవుల భూమయ్య వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పశువుల కాపరి వేరే ఊరికి వెళ్లడంతో భూమయ్య సోమవారం పశువుల మేపేందుకు ఎదులపహాడ్ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల్లో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా భూమయ్యపై దాడి చేసింది. దీంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు విన్న సమీపంలోని పాటగూడ గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్ టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు మతపరమైన విభేదాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. గణేశ్ పండుగ మొదలుకుని, విగ్రహాల నిమజ్జనం వరకు చాలా క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రజల సహకారంతోనే పోలీస్ విభాగం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపడుతుందని తెలిపా రు. సమావేశంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సామాన్యులకు అండగా పోలీసులుసామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. పోలీస్ కా ర్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నా ణ్యమై న పోలీసింగ్ను ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
అక్రమ పట్టా రద్దు చేయాలి
నిర్మల్చైన్గేట్: భైంసా మండలం హంపోలి గ్రా మంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మళ్లీ అక్రమంగా చేసిన పట్టా రద్దు చేయాలని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. ఆ స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అదనపు కలెక్టర్కి వినతి పత్రం అందించారు. 1983లో వరదల కారణంగా 16/ఆ, 16/ఈ సర్వే నంబర్ లోని ఐదు ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ఇళ్లను కూల్చి.. స్థలాన్ని ఇతరులకు అక్రమంగా పట్టా చేశారన్నారు. దీనిని రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో పై అధికారులకు నివేదికలు పంపినా రద్దు కాలేదన్నారు. అక్రమ పట్టా చేసిన అప్పటి తహసీల్దార్పై చర్య తీసుకోవాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, గ్రామస్తులు విఠల్, గంగారం, సాయినాథ్, బాబు, ఎల్లన్న, భోజన్న, నరసన్న పాల్గొన్నారు. -
గోదావరి పరిరక్షణకు పాదయాత్ర
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గోదావరి పరిరక్షణ కోసం మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమ భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. మహారాష్ట్రలోని పర్బని జిల్లా గంగాఖేడ్లోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన పది మంది భక్తులు చేపట్టిన పాదయాత్ర సోమవారం హాజీపూర్ మండలానికి చేరింది. ఆగస్టు 3న గోదావరి పుట్టిన పవిత్ర ప్రదేశమైన త్రయంబకేశ్వర్ నుంచి పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని మొత్తంగా ప్రదక్షిణ చేస్తున్నట్లు తెలిపారు. మరో 25 రోజుల్లో గోదావరి నది సముద్రంలో కలిసే అంతర్వేదికి చేరుకుంటామని అన్నారు. 10 మంది సభ్యులు, ముగ్గురు సహాయకులతో కలిసి రోజుకు 50 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. నవంబర్ 3న గోదావరి ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి తమ ఆశ్రమానికి చేరుకుంటామని తెలిపారు. -
బోధనోపకరణాలతో విద్యార్థుల్లో ఆసక్తి
కాసిపేట: బోధనోపకరణాలు విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తిని పెంపొందిస్తాయని, విద్యాప్రమాణాల మెరుగుదలకు దోహద పడతాయని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనోపకరణాల మేళా(టీఎల్ఏం)ను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్లు చౌదరి సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, మండల విధ్యాధికారి ముక్తవరం వెంకటేశ్వరస్వామి, కాంప్లెక్స్ హెచ్ఎంలు మామిడిపల్లి సాంబమూర్తి, రమేష్ రాథోడ్, సుధాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులను హతమార్చిన ఇద్దరి అరెస్ట్
సాత్నాల: వన్యప్రాణులను వేటాడిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ తెలిపారు. మహారాష్ట్రలోని పాండ్రకోడా అటవీ పరిసర ప్రాంతాల్లో నాలుగు నెమళ్లు, ఓ నిలుగాయిని పలువురు వేటాడి హతమార్చారు. మహారాష్ట్ర పార్వ గ్రామానికి చెందిన నిలేష్ చౌహాన్, రాథోడ్ రోహన్ పట్టుపడగా, భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన సందీప్ రాథోడ్, సంజీవ్ పరారీలో ఉన్నారు. హతమార్చిన వన్యప్రాణుల మాంసాన్ని గిమ్మ గ్రామంలో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఆర్వో తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గంజాయి విక్రయించే యువకుడు అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని జాఫర్నగర్లో గంజాయి విక్రయించేందుకు యత్నించిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు స్థానిక సీఐ ప్రమోద్రావు తెలిపారు. మంచిర్యాలకు చెందిన గూడెల్లి సాయికుమార్ అనుమానాస్పందగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. అతడి వద్ద 205 గ్రాముల గంజాయి లభించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బల్లార్షకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశాడని, కొందరికి విక్రయించేందుకు వచ్చాడని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తులకు జైలు శిక్షచెన్నూర్: సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య సోమవారం తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తామని చెన్నూర్ పోలీసుస్టేషన్ పరిధి ఆదర్శనగర్కు చెందిన వంగల తిరుపతి వద్ద రూ.17లక్షలు, వంగల మధూకర్ వద్ద రూ.8లక్షలను గోదావరిఖనికి చెందిన వొజ్జ కొమురయ్య, రామకృష్ణాపూర్కు చెందిన ఎడ్ల భీమయ్య, ఎడ్ల రాజిరెడ్డి, అబ్దుల్ సలీమ్, కొత్తగూడెంకు చెందిన ఉండేటి ప్రశాంత్కుమార్, కొత్త వెంకటయ్య, మూరల హర్షవర్ధన్రావు, ఎల్లూరి వెంకటనిర్మలకుమార్లు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇవ్వాలని వారు ఒత్తిడి తెచ్చారు. 2016 ఆగస్టు 27న ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి ఎస్సై బీ.చంద్రయ్య కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. విచారణలో కొందరిపై నేరం రుజువు కాకపోగా, నేరం రుజువైన ఎడ్ల రాజిరెడ్డి, ఉండేటి ప్రశాంత్, ఎల్లూరి వెంకటనిర్మలకుమార్లకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. బాలింతకు దారి కష్టాలుబోథ్: సొనాల మండలంలోని పెద్దగూడ గ్రామానికి చెందిన రేణుక బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తల్లీబిడ్డను పెద్దగూడకు 102 వాహనంలో తరలిస్తుండగా గ్రామానికి చేరువలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పైలట్ భగత్ నవీన్ కుమార్ పసికందుతో పాటు తల్లిని తీసుకుని జాగ్రత్తగా వాగు దాటించాడు. వారిని క్షేమంగా ఇంటికి చేర్చాడు. కాగా, వంతెన లేక ఆదివాసీల ఇక్కట్లకు ఈ ఘటన ఓ నిదర్శనం. -
రైలు కిందపడి వృద్ధుడి మృతి
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి మృతిచెందాడని పేర్కొన్నారు. మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉందని, సంబంధీకులు 9490871784, 9948481902 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో రిటైర్డు కార్మికుడు మృతిశ్రీరాంపూర్: నస్పూర్లోని తీగల్ పహాడ్ రాంనగర్కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు దొరిశెట్టి నారాయణ(62) సోమవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. నస్పూర్ ఎస్సై ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ రామ్నగర్లో నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పట్టేందుకు బోర్ మోటార్ స్టార్టర్ స్విచ్ఛాన్ చేయబోయాడు. ఈ క్రమంలో కరెంటు వైరు షాక్ తగలడంతో కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య మల్లక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లక్ష్యసాధనకు కృషి చేయాలిశ్రీరాంపూర్: కంపెనీ నిర్ధేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అధికారులతో కలిసి క్వారీలో దిగి పని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన ఓవర్ బర్డెన్ మట్టిని తొలగించాలన్నారు. ఓబీ సంస్థలు తమ లక్ష్యాన్ని అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఓపెన్ కాస్ట్ గనికి నిర్ధేశించిన 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నూరు శాతం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్సార్పీ ఓసీపీ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ అధికారి కే.వెంకటేశ్వర్రెడ్డి, ఎస్సార్పీ ఓసీపీ గని మేనేజర్ ఐ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుంగాపూర్ శివారులో 95 గంజాయి మొక్కలు స్వాధీనంనార్నూర్: ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో ని సుంగాపూర్ శివారులో గంజాయి సాగు చే స్తున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్, నా ర్నూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన కొడప దేవ్రావు సా గు చేస్తున్న 95 గంజాయి మొక్కలను స్వాధీన పరుచుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 12.4 కిలోల బరువు గల వీటి వి లువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.9.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సై అఖిల్, సీసీఎస్, పోలీసులు పాల్గొన్నారు. -
బీపీఎంలకు కొత్త ఫోన్లు
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత (చేయూత) కింద లబ్ధిదారులకు ప్రతీ నెలా పింఛన్ పంపిణీ చేస్తోంది. బ్రాంచ్ పోస్ట్మాస్టర్ల (బీపీఎం) ద్వారా వీటిని అందజేస్తారు. ఈ మేరకు బీపీఎంలకు కొత్త సెల్ఫోన్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 579 ఆండ్రాయిడ్ మొబైల్స్ సరఫరా చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వాటిని మంగళవారం ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో అందజేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన ఈ ఫోన్లు పింఛన్ పంపిణీకి మాత్రమే ఉపయోగపడతాయి. అక్రమాలు అరికట్టేలా ... వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు, హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా చేయూత కింద పింఛన్లు అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.3,016 అందిస్తుండగా, మిగతా వారికి రూ.2,016లను అందజేస్తోంది. పంపిణీలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గత నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా లబ్ధిదారుల కళ్లను స్కాన్ చేసి పింఛన్ అందజేస్తున్నారు. సిబ్బందికి గత నెలలోనే ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన సెల్ఫోన్లు అందించాల్సి ఉండగా ఆలస్యమైంది. ప్రస్తు తం కొత్త మొబైల్స్ జిల్లాలకు చేరగా వాటిని అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 579 మంది బీపీఎంలు చేయూత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీరికి 5జీతో కూడిన సెల్ఫోన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఆర్డీఏ కార్యాలయాలకు ఈ ఫోన్లు చేరాయి. బీపీఎం పేరు, వారికి అందిస్తున్న ఫోన్ ఈఎంఐ నంబర్ వంటి వివరాలను ఆ శాఖ సిబ్బంది ఆన్లైన్లో నమో దు చేస్తున్నారు. మంగళవారం ఆయా కలెక్టర్ల ద్వా రా బీపీఎంలకు అందించనున్నారు. సెల్ఫోన్తో పాటు చార్జర్, బ్యాక్ కవర్, ఫింగర్ ప్రింట్స్ న మోదు చేసే యంత్రాన్ని సైతం అందజేస్తున్నట్లు డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తెలిపారు. సెల్ ద్వారా పింఛన్దారు ముఖ చిత్రాన్ని స్కాన్ చేసి వారికి నగదు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లా కేటాయించినసెల్ఫోన్లు ఆదిలాబాద్ 158 నిర్మల్ 147 మంచిర్యాల 144 కుమురంభీం ఆసిఫాబాద్ 130 -
ఆర్జీయూకేటీలో ముగిసిన వర్క్షాప్
బాసర:బాసర ఆర్జీయూకేటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై మూడు రోజులు నిర్వహించిన హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ సోమవారం ముగిసింది. నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సహకారం అందించిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ప్రపంచం వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పయనిస్తున్న ఈ సమయంలో ఆర్జీయూకేటీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, ప్రయోజనాత్మక అనుభవం అందించడం అత్యంత అవసరమన్నారు. ఇలాంటి వర్క్షాప్లు కేవలం శిక్షణ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు సహా మొత్తం 75 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. దేశ స్వచ్ఛ శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలకు తోడ్పడే విధంగా నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్షాప్ దోహదపడిందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మణ్ ముత్యం, హెచ్వోడీ డాక్టర్.బావుసింగ్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రో ఖోఖో లీగ్కు మడావి ప్రశాంత్
ఉట్నూర్రూరల్: ఇంద్రవెల్లి మండలం చిన్నగూడకు చెందిన మడావి ప్రశాంత్ అల్టిమేట్ ప్రో ఖోఖోలీగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడిని ఉట్నూర్లో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి సోమవారం సన్మానించారు. స్థానిక కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రశాంత్ను పలువురు అభినందించారు. ఇందులో సీనియర్ పీడీ హేమంత్, కోచ్లు కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులపై కేసుగుడిహత్నూర్: అనుమతి లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోలో పాల్గొన్న 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించడంతో ప్రజా రవాణాతో పాటు భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. జాతీయ రహదారి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలుగుబంటి వేటగాళ్ల రిమాండ్పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటిని వేటాడిన నలుగురిని రిమాండ్కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు సో మవారం తెలిపారు. పదిరోజుల క్రితం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ను రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. సోమవారం పెంచికల్పేట్కు చెందిన వెంకటి, సామెర సత్తన్న, ఎల్లూర్కు చెందిన మధునయ్యను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎఫ్ఎస్వో జగన్, ఎఫ్బీవో సతీష్ వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడితే చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి సోమగూడెం భరత్కాలనీకి చెందిన మల్లెపల్లి శోభన్(42) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలానికి చెందిన శోభన్ సోమగూడెంలో నివాసం ఉంటూ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తలు గొడవ పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శోభన్ ఆదివారం ఉదయం 9.30గంటలకు పురుగుల మందు తాగాడు. మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు మల్లెపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి..మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధి ముల్కల్ల వాగొడ్డుపల్లెకు చెందిన కొట్టె బాపన్న(51) ఆత్మహత్య చేసుకున్నా డు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపిన వివరా ల ప్రకారం.. బాపన్న వ్యవసాయ కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల నడుం నొప్పి తీవ్రంగా ఉండడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వ్యవసాయం, కూలీ పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. పదేళ్ల క్రితం బాపన్న కుమారుడు చనిపోవడం, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై 24న సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముల్కల్ల శివారులో గడ్డి మందు తాగాడు. మృతుడికి భార్య పద్మ, కుమార్తె లలిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బీసీ రిజర్వేషన్ల సాధనకు రిలే నిరాహార దీక్ష
జన్నారం: బీసీ రిజర్వేషన్ల సాధనకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కడార్ల నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. విద్య, ఉద్యోగ పదోన్నతులు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కేయూపీఎస్ కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్గౌడ్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పొడేటి సతీష్, డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒల్లాల నర్సాగౌడ్, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు -
తండాల్లో తీజ్ సంబురం
లోకేశ్వరం: మండలంలోని సేవాలాల్ తండావాసులు ఆదివారం తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. తండాలోని పెళ్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు నియమనిష్టలతో ఉపవాసాలుండి స్థానిక జగదాంబ మందిరంలో ప్రత్యేకపూజలు చే శారు. చివరిరోజు నిర్వహించిన తీజ్ ఉత్సవాల సందర్భంగా చిన్నాపెద్దా తేడా లేకుండా లంబాడా మ హిళలు ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేశారు. నిర్మల్: మండలంలోని అంజనీతండా, రాంపూర్ పంచాయతీ పరిధిలోని దర్యాపూర్ గ్రామంలో బంజారాలు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువతులు తొమ్మిదిరోజులపాటు మట్టి నింపిన బుట్టల్లో గోధుమ గింజలు చల్లి నీటిని అందించారు. ఆదివారం మొలకెత్తిన గోధుమ నారు బుట్టలను నెత్తినెత్తుకుని ఆడిపాడారు. కుల దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక చెరువులో గోధుమనారు బుట్టలను నిమజ్జనం చేశారు. -
6న గణేశ్ నిమజ్జనం
నిర్మల్చైన్గేట్: గణపతి నవరాత్రోత్సవాల్లో భా గంగా ఈ నెల 27న విగ్రహాలను నెలకొల్పాలని పండితులు బురుగంటి గుణవంతురావు జోషి, గుడి రాజేశ్వర్శర్మ సిద్ధాంతి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక దేవరకోట దేవస్థానంలో ఆదివారం వేదపండితుల సమావేశం నిర్వహించగా వారు మాట్లాడారు. వచ్చేనెల 7న చంద్రగ్రహణం ఉన్నందున 6న పద్మనాభ అనంత చతుర్దశి రోజే నిమజ్జనం చేయాలని సూచించారు. సమావేశంలో గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మూర్తి ప్రభాకర్, వీ హెచ్పీ నాయకులు పతికి రాజేందర్, ముప్పిడి రవి, దొనగిరి మురళి, గజవాడ కపాల్, సాధం ఆనంద్, పాతర్ల నరేశ్, జట్టి నరేందర్, కూన సతీశ్, న్యామతాబాద్ సాయికుమార్, గడిచర్ల జనార్దన్శర్మ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న పండితులు, నాయకులు -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్ టౌన్: కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని తపస్ జిల్లా అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్కుమార్, సుదర్శ న్ కోరారు. ఆదివారం హైదరాబాద్లో ఉపాధ్యా య ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. విద్యారంగంలో సేవలందిస్తూ, వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో వివక్షకు గురవుతున్న ఉపాధ్యాయ వర్గాలకు సరైన న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ వేతనాలు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధించాలని కోరారు. -
టీచర్స్డే ఘనంగా నిర్వహించాలి
నిర్మల్ టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్నాయక్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆయన మాట్లాడారు. వృత్తిపరంగా నైపుణ్యం కనబరిచి బోధనతో పాటు విద్యార్థుల అభివృద్ధికి పా టుపడుతున్నవారిని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డి మాండ్ చేశారు. ప్రతిభ గల ఉపాధ్యాయులను అప్లికేషన్ లేని విధానంలో అవార్డులకు ఎంపిక చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, ఉపాధ్యక్షుడు మధుకర్ తదితరులున్నారు. -
పాండురంగ్కు డాక్టరేట్
తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన బోనోడ్ పాండురంగ్కు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది. పాండరంగ్ హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పీ రాజ్యశ్రీమమోరే పర్యవేక్షణలో ‘నాయి సదికే ఉపన్యాసోమే’ అనే అంశంపై విశ్లేషణాత్మక అధ్యయనం చేసి గ్రంథాన్ని సమర్పించగా యూనివర్సిటీ అధికారులు పరి శీలించి డాక్టరేట్కు ఎంపిక చేశారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఇస్రో చైర్మన్ వీ నారాయణ్ తదితరుల చేతుల మీదుగా పాండురంగ్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు అతడిని అభినందించారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీలకు ప్రాధాన్యం కల్పించాలి
నిర్మల్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ లకు తగిన ప్రాధాన్యం కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో తుడుం దెబ్బ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో ఆదివాసీలకే సీట్లు కేటాయించి వారిని గెలిపించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ తెగలకు సీట్లు కేటాయించిన పార్టీలకే పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ఆదివాసీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పోడు భూములు సాగు చే సుకుంటున్న ఆదివాసీలపై అటవీ అధికారుల దా డులు ఆపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ, ఫారెస్ట్ అధికారులు కావా లని అడ్డుకుని మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ మంద మల్లేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోడుసం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు పోతురాజు శ్రీనివాస్, బోర్ర భీమేశ్, శ్రీనివాస్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సప్తవర్ణాల ‘స్వర్ణ’
సారంగపూర్: మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధికసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు తాకిడి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,151.9 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తకున్నా లీకేజీల రూపంలో నీరు అధికంగా బయటకు వెళ్లడాన్ని సందర్శకులు తిలకిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. -
జీవాలకు వ్యాక్సినేషన్
వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన గొర్రెలు, మేకల్లో అధిక జ్వరం రావడం.. కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, నోటిలో పొక్కులు ఏర్పడి జిగురుతో కూడిన విరోచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని పారుడు వ్యాధి అంటారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు ముక్కు నుంచి చీము కారడం, నోటిలోని చిగుళ్లు, నాలుకపై పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి సోకిన జీవాలు ఆకలి మందగించి మేత తినకపోవడం, విరోచనాలు, దగ్గు లాంటి లక్షణాలతో 5నుంచి 10రోజుల్లో మరణిస్తాయి. నిర్మల్చైన్గేట్: మేకలు, గొర్రెలకు పీపీఆర్ (పెస్టిడీస్ పైటెటిస్ రూమి నాంట్స్) వ్యాధి నిరోధక టీకా లు వేయనున్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26నుంచి సెప్టెంబర్ 10వరకు జి ల్లాలోని అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు టీకాలు వేసే ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచారు. ఉన్నతాధికారులు అన్ని పశువైద్యశాలలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక, పశువైద్య కేంద్రాలకు వ్యాక్సిన్ పంపుతున్నారు. ఆయా బృందాలు ఉదయం 7గంటలకే గ్రామాలకు చేరుకుని మధ్యాహ్నం 12గంట ల వరకు గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తారు. వ్యాప్తి చెందే విధానం గొర్రెలు, మేకల్లో మారిబిల్లివైరస్తో పీపీఆర్ అనే అంటువ్యాధి సోకుతుంది. ఇది జీవాలకు సరైన గా లి, వెలుతురు అందకపోవడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడంతోపాటు వర్షాల కారణంగానూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జీవాలు మందలో ఉంటే మిగతావాటికి ఇది సోకుతుంది. వ్యాధి వచ్చిన జీవాలు విసర్జించే పేడ, స్రవాల ద్వారా ఇది ఇతర జీవాలకు వ్యాపిస్తుంది. నిర్ధారణ, చికిత్స ఇలా.. చనిపోయిన జీవాల శవపరీక్ష చేసినప్పుడు చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రక్తపు చారలు కనిపించడం ద్వారా శ్వాసకోశ, జీర్ణావస్థకు సంబంధించిన లక్షణాల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. వ్యాధిని ముందుగా గుర్తించి పశువైద్యులతో చికిత్స అందిస్తే జీవాలను కాపాడుకోవచ్చు. పశువైద్యుడి సలహా మేరకు వ్యాధి లక్షణాలకు తగినట్లు యాంటి బయాటిక్ మందులు వాడుకోవాలి. నోటి పుండ్లు తగ్గడానికి బోరిక్ యాసిడ్ కలిపిన గ్లిజరిన్ పూయాలి. మేత మేయని జీవాలను గుర్తించి వాటికి జావ, అంబలి తాగించాలని పశువైద్యులు సూచిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 26నుంచి సెప్టెంబర్ 10వరకు పీపీఆర్ టీకాలు వేయనున్నాం. గొర్రెల, మేకల పెంపకందారులు తమ గొర్రెలు, మేకలకు టీకాలను విధిగా వేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాజేశ్వర్, జిల్లా పశువైద్యాధికారి -
జలాశయాలకు జనకళ
నిర్మల్మితిమీరితే అనర్థమే.. మోతాదుకు మించి యూరియా, డీఏపీ వాడొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులతో నేల నిస్సారంగా మారుతుందని పేర్కొంటున్నారు. ఆలయాభివృద్ధికి కృషి భైంసాటౌన్: పట్టణంలోని ఏకముఖ హనుమా న్ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మె ల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ్రావు పటేల్ హామీ ఇచ్చారు. హనుమాన్ ఆ లయం వరకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ.18 లక్షల నిధులు మంజూరు చేయించి ఆ దివారం ఆలయ కమిటీ సభ్యులకు ప్రొసీడింగ్ అందజేశారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం నారాయణ్రావు పటేల్ మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు శంకర్ చంద్రే తదితరులున్నారు. భైంసా: పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుని సందర్శకులకు ఆహ్లాదం పంచుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. భైంసా పట్టణంతోపాటు సమీప గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చిన జ నం ప్రాజెక్ట్ అందాలను తిలకించారు. చల్లగాలులు వీస్తుండగా జల సవ్వడులు చూస్తూ సేదదీరారు. ప్రాజెక్ట్ అందాలను కెమెరాల్లో బంధించారు. సెల్ఫీ లూ తీసుకున్నారు. కాగా, సందర్శకులు గేట్ల వైపు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహ్లాదం పంచుతోంది నేను మా కుటుంబంతో కలిసి ప్రాజెక్ట్ వద్దకు వచ్చాను. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణం బాగుంది. సెలవు రోజుల్లో ఎక్కువసార్లు ఇక్కడికే వస్తుంటాం. కుటుంబంతో కలి సి ఇక్కడ గడిపితే ఆ అనుభూతే వేరు. ప్రతీ సంవత్సరం గేట్లు ఎత్తే సమయంలో వచ్చి ఇక్కడి దృశ్యాలను చూస్తుంటాం. – సాయినాథ్, సందర్శకుడు ప్రాజెక్ట్ చూసేందుకు వచ్చా నేను భైంసాలో వ్యాపారం నిర్వహిస్తుంటాను. ప్రతీరోజు పనిలో భాగంగా దుకాణంలోనే ఎక్కువ సేపు గడుపుతుంటాను. వానాకాలం కావడంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చింది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సరదాగా ఫ్యామిలీతో కలిసి చూద్దామని ఇక్కడకి వచ్చాను. – గంగాధర్, సందర్శకుడు ఉల్లాసంగా ఉంటుంది భైంసా పట్టణంలో ఎక్కడా పార్కు లేదు. స్నేహితులమంతా ప్రాజెక్ట్ వద్దకే ఎక్కువగా వస్తుంటాం. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. పక్కనే ఉన్న గుట్ట పైనుంచి నీటి దృశ్యాలు చూస్తే మనస్సు ఉప్పొంగుతోంది. అయితే.. ప్రాజెక్ట్ వద్ద బెంచీలు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. – గజ్జారాం, సందర్శకుడు -
కట్టి పడేసే అందాల ‘కడెం’
బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటకులు బోటింగ్ చేస్తున్న పర్యాటకులుకడెం: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైనా కడెం ప్రాజెక్ట్ సందర్శకులకు ఆహ్లాదం పంచుతోంది. వీకెండ్స్.. హాలీడేస్లలో పర్యాటకులతో సందడిగా మారుతోంది. ఆదివారం హైదరా బాద్, జగిత్యాల, మంచిర్యాల తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు బంధుమిత్రులు, మిత్రబృందంతో కలిసి ప్రాజెక్ట్ అందాలను తనివి తీరా తిలకించారు. ప్రాజెక్ట్లో బోటింగ్ చేస్తూ సెల్ఫీలు దిగారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇక్కడే గడిపారు. ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి ప్రకృతి అందాలతో కడెం ప్రాజెక్ట్ పరిసరాలు చాలా బాగున్నాయి. ప్రాజెక్ట్ అందాలు చూస్తూ ఉంటే దినమంతా ఇట్టే గడిచిపోయింది. పురాతన కడెం ప్రాజెక్ట్ నిర్మాణ శైలి నేటి విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని పంచుతుంది. అయితే పర్యాటకులకు ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. – దివ్య, పర్యాటకురాలు,హైదరాబాద్ పాపికొండలను తలపించింది ఫ్రెండ్స్తో కలిసి కడెం ప్రాజెక్ట్ను సందర్శించాను. ప్రాజెక్ట్ అందాలను తిలకించడం, సహ్యాద్రి కొండల అంచున ప్రాజెక్ట్లో బోటింగ్ చేయడం పాపికొండలను తలపించింది. రోజంతా మిత్రులతో కలిసి చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి అందాలు చూసేందుకు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోంది. – చంద్రశేఖర్, విజయవాడ -
విశ్వబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి
బాసర: విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కోరారు. బాసరలో ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభ, రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ సంఘంలో రాజకీయంగా అన్ని అర్హతలు కలిగి నాయకులున్నారని, వారికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ, గ్రామ, మండ ల స్థాయిలో సంఘం కార్యక్రమాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తానని మధుసూదనాచా రి తెలిపారు. అనంతరం శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ప్రతి నిధులతో కలిసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్చారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పుమేలవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు, ఆయా మండలాలు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
మానవ్వకు ఇల్లు రాలే..
కుంటాల: మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన మక్కాయి మానవ్వ–సుధాకర్ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నివాసముండే పాత పెంకుటిల్లు గతేడాది భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో యాదవ సంఘం సభ్యులు సంఘ భవనంలో వీరికి ఆశ్రయమిచ్చారు. ఇందిరమ్మ ఇంటి కోసం మానవ్వ దరఖాస్తు చేసుకుంది. ఇటీవల సర్వే కోసం వచ్చిన అధికారులు మానవ్వ దంపతులు ఆశ్రయం పొందిన సంఘ భవనా నికి స్లాబ్ ఉందని ఎల్–3 (ఇల్లు ఉన్నట్లు) లో ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం ఇంటి స్థలం ఉన్న ఈమెను ఎల్–1లో ఎంపిక చేయకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని మానవ్వ దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం పలుసార్లు స్థానిక అధికారులను కలిసినా తమ చేతిలో ఏమీ లేదని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
సర్కారు బడుల్లో అఆ.. ఇఈ.. ‘ఏఐ’..
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ, కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వా రా విద్యాబోధనను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో గణిత బోధనలో సాంకేతికతను వినియోగించడం లక్ష్యంగా, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతేడాది పైలట్ ప్రాజెక్ట్గా 19 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని పాఠశాలలకు విస్తరించనుంది. జిల్లాస్థాయిలో 48 కాంప్లెక్స్ ల నుంచి 96 మంది ఉపాధ్యాయులు ఒకరోజు శిక్షణ పొందారు. ఏప్రిల్ 3, జూలై 31 తేదీల్లో రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ఐదుగురు డీఆర్పీలు ఈనెల 13న ఈ శిక్షణను అందించారు. ఈ ఉపాధ్యాయులు ఈ నెల చివరి వారంలో కాంప్లెక్స్ సమావేశాల్లో తమ సహోద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. డిజిటల్ లిటరసీ సిలబస్ 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కరిక్యులంలో డిజిటల్ లిటరసీని జోడించారు. 1, 2 తరగతుల పుస్తకాల్లో ప్రథమ భాగంలో, 3 నుంచి 5వ తరగతుల పుస్తకాల్లో ద్వితీయ భాగంలో కృత్రిమ మేధ ద్వారా పాఠాలు బోధించనున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో సమానంగా నిలిపేందుకు దోహదపడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. సాంకేతిక సాధనాలు ఈ విద్యా సంవత్సరంలో గణిత బోధన కోసం జీ–కంప్రైజ్, ఎడ్యుఆక్టివ్ 8, కోడ్మిత్ర, చాట్బాట్, ఏఎక్సెల్ వంటి ఎస్సీఈఆర్టీ రూపొందించిన సాంకేతిక సాధనాలను ఉపయోగిస్తారు. ఇవి విద్యార్థులకు ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్ఎస్) వంటి సాంకేతికతలు విద్యార్థుల ఉత్సాహాన్ని పెంచి, డ్రాపవుట్ రేటును తగ్గిస్తాయని అధికారులు విశ్వసిస్తున్నారు. సౌకర్యాల విస్తరణ జిల్లాలో 700కు పైగా పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత ్వం ఇప్పటికే ట్యాబ్లను పంపిణీ చేసింది. త్వరలో డెస్క్టాప్ కంప్యూటర్లను కూడా అందించనున్నా రు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. పేద విద్యార్థులకు ప్రయోజనం.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు ఉత్సాహపరితంగా నేర్చుకునేందుకు వీలుపడుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని జిల్లా ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి నర్సయ్య అభిప్రాయపడుతున్నారు.రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు 5జిల్లాస్థాయిలో శిక్షణపొందిన ఎమ్మార్పీలు 96మండలాలవారీగా శిక్షణపొందనున్న ఉపాధ్యాయులు 1,200మొత్తం కాంప్లెక్స్లు 48మొత్తం పాఠశాలలు 735 -
ఆటలాడించాలి..
బడీడు పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు ఆకర్షితులవుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది. శారీరకంగా ఆడేలా ప్రోత్సహించాలి. ఇండోర్, అవుట్డోర్ గేమ్స్పై ఆసక్తి పెంచాలి. క్రీడలవైపు పిల్లల మనసు మళ్లిస్తే.. వారు సెల్ఫోన్లకు దూరంగా ఉంటారు. చెడు వ్యసనాలకు బానిస కారు. – అన్నపూర్ణ, ఫిజికల్ డైరెక్టర్, చించోలి(బి) ఉన్నతపాఠశాల సమయం కేటాయించాలి.. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. కనీసం పడుకునే ముందైనా వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ప్రేమపూరితవాతావరణం లేకపోతే ఇతర అలవాట్లకు బానిసవుతారు. తల్లిదండ్రులే పిల్లలను సెల్ఫోన్కు బానిసలుగా చేస్తున్నారు. పిల్లలు చూసే ఆన్లైన్ గేమ్స్ వారిపై విపరీత ప్రభావం చూపుతుంది. – డాక్టర్ సురేశ్ అల్లాడి, సైకియాట్రిస్ట్ -
నిబంధనల మేరకే వేడుకలు
నిర్మల్ టౌన్: మరో నాలుగు రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేడుకల కోసం ఊరూరా.. వాడవాడలా మండపాలు సిద్ధమవుతున్నాయి. గణనాథులు కూడా కొలువుదీరేందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో మండపాల నిర్వాహకులకు ఎస్పీ జానకీషర్మిల కీలక సూచనలు చేశారు. అందరూ నిబంధనల మేరకే వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. సురక్షితమైన, సామరస్యపూర్వకంగా ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. నిర్వహణ జాగ్రత్తలు.. అనుమతి తప్పనిసరి.. విద్యుత్ జాగ్రత్తలు.. అగ్ని ప్రమాద నివారణ.. సీసీ కెమెరాల ఏర్పాటు.. శబ్ద కాలుష్య నియంత్రణ.. నిమజ్జన ఊరేగింపు సూచనలు.. ఊరేగింపు నిర్వహణ.. క్రాకర్ల వినియోగం.. -
పిల్లలపై ఓ కన్నేయండి!
నిర్మల్: ఈ రోజుల్లో చిన్న వయసులోనే పిల్లల తప్పుడు ఆలోచనలు, నేరపూరిత ప్రవర్తన తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో పదో తరగతి విద్యార్థి ఒక చిన్నారిని హత్య చేసిన ఘటన, జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న తీరు చర్చనీయాంశంగా మారాయి. ఈ సమస్యల వెనుక తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సెల్ఫోన్ వినియోగం, మీడియా ప్రభావం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో తప్పిదాలు.. 15 ఏళ్లు నిండని పిల్లలు ప్రేమ, గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్ వంటి విషయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఇలాంటి ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేయడంతో, ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించారు. ఇక సినిమాలు, సోషల్ మీడియా రీల్స్, వెబ్ సిరీస్లు, ఓటీటీ వేదికల్లోని క్రైం కథనాలు విద్యార్థులు, యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. హింసాత్మక ఆన్లైన్ గేమ్లు, యూట్యూబ్లోని విపరీత ధోరణి వీడియోలు పిల్లల మనసుల్లో నేరపూరిత ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిజీ జీవనశైలిలో మునిగిపోయి, పిల్లల విషయంలో శ్రద్ధ చూపడం మరచిపోతున్నారు. పిల్లల కోర్కెలు తీర్చడానికి సెల్ఫోన్లు, బైక్లు కొనిచ్చేస్తున్నారు కానీ, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో పట్టించుకోవడం లేదు. గతంలో తాతమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనను గమనించేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో బాధ్యత వహించకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. పిల్లల సెల్ఫోన్ వినియోగిస్తున్న తీరు చూసి గర్వపడుతున్న తల్లిదండ్రులు, వారు ఏ కంటెంట్ చూస్తున్నారో గమనించడం లేదు. చదువుకునే వయసులో సెల్ఫోన్ అవసరమా అనే ప్రశ్నను కూడా వారు వేయడం లేదు. ఓటీటీలు, యూట్యూబ్, రీల్స్లోని కంటెంట్ పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కమీషన్.. పరేషన్!
నిర్మల్భక్తిమార్గం.. ఐక్యతా మంత్రం! గణేశ్ ఉత్సవాలు కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాన్ని ఒక శక్తివంతమైన వేదికగా మలిచారు. పోలీసులకు ఆరోగ్యం ముఖ్యం నిర్మల్ టౌన్: శాంతిభద్రతల నిర్వహణ విధులు నిర్వహించే పోలీసులకు ఆరోగ్యం చాలా ముఖ్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయాలన్నారు. ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రేమ్కుమార్, రవీంద్రనాయక్, మల్లేశ్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: పేదలకు రేషన్ బియ్యం అందించే డీలర్లు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఐదు నెలలుగా కమీషన్ చెల్లించకపోవడంతో వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. పౌరసరఫరాల సంస్థ నుంచి కమీషన్ డబ్బులు సకాలంలో విడుదల కాక డీలర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 412 రేషన్ షాపుల ద్వారా 7,54,523 మంది లబ్ధిదారులకు ప్రతినెలా సుమారు 4,428 మెట్రి క్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. క్వింటాల్కు రూ.140 కమీషన్గా చెల్లించాలి. నెలకు సుమారు రూ.56 లక్షల కమీషన్ డీలర్లకు చెల్లించాలి. అయితే ఏప్రిల్, మే నెలల కమీషన్ డబ్బులు పెండింగ్లో ఉండగా, జూన్లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో మొత్తం ఐదు నెలల కమీషన్ బకాయిలు పేరుకుపోయాయి. కమీషన్ చెల్లింపుల ఆలస్యం వల్ల డీలర్లు షాపు అద్దె, సిబ్బంది జీతాలు, బియ్యం రవాణా, హమాలీ చార్జీలు వంటి ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. మారిన నిబంధనలు.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర కమీషన్ డబ్బులు ఒకేసారి చెల్లించేవి. నిబంధనల మార్పులతో విడివిడిగా కమీషన్ చెల్లిస్తున్నాయి. ఈ మార్పు డీలర్లలో అయోమయాన్ని సృష్టిస్తోంది. అమలు కాని ఎన్నికల హామీలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ను క్వింటాకు రూ.70 నుంచి రూ.140కు పెంచగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కమీషన్ను రూ.300లకు, అదనంగా డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడంతోపాటు, సకాలంలో కమీషన్ చెల్లింపులు కూడా జరపకపోవడంపై డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కార్డులు 2,42,205యూనిట్లు 7,54,523మొత్తం రేషన్ షాపులు 412ప్రభుత్వం క్వింటాల్కు చెల్లించే కమీషన్ రూ.140డీలర్లకు ప్రతినెలా రావాల్సిన కమీషన్రూ.56 లక్షలు పరేడ్ లో పాల్గొన్న మహిళా పోలీసులు -
ఆర్జీయూకేటీలో ఎన్డీఎల్ సెషన్
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) బాసరలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ(ఎన్డీఎల్) రిజిస్ట్రేషన్ సెషన్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జాతీయ డిజిటల్ లైబ్రరీలో సభ్యత్వం పొందడం, అందులోని విద్యా వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్ మాట్లాడుతూ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు అమూల్యమైన జ్ఞానసంపదను అంది స్తోందన్నారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, వివిధ అధ్యయన వనరులు ఒకే వేదికపై అందుబాటులో ఉండడంతో అకడమిక్ ప్రగతికి దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ డిజిటల్ వనరులను సద్వినియోగం చేసుకుని పరిశోధ న, ఆవిష్కరణల్లో ప్రతిభ కనబర్చాలని సూ చించారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్యక్రమంలో లైబ్రరీ అసిస్టెంట్లు డాక్టర్ అరుణ జ్యోతి, శైలజ, అర్చన, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ వహించాలి
నిర్మల్ రూరల్: ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ వహించి, వారి ఉన్నతికి పాటుపడాలని జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కొండాపూర్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్ద అందించే విద్యను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందిస్తున్న విద్య, అభ్యసన కార్యక్రమాలను పరిశీలించారు. అభ్యసన కార్యక్రమాల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. రిసోర్స్ ఉపాధ్యాయులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించి అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా తల్లిదండ్రులు వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఇందులో రిసోర్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిర్మల్ రూరల్: భైంసా పట్టణంలోని బస్తీ దవాఖానలో ఒప్పంద ప్రాతిపదికన వైద్యాధికారి పోస్ట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో రాజేందర్ తెలిపారు. అర్హత ఉన్నవారు దరఖాస్తుఫాం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఈనెల 25న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జరిగే ఇంట ర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
పాఠశాలలకు ‘పది’ మెమోలు
లక్ష్మణచాంద: సెకండరీ బోర్డు 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేపట్టింది. గతంలో ఉన్న గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానాన్ని తొలగించి, సబ్జెక్టుల వారీగా మార్కులతో కూడిన ఫలితాలను ప్రకటించింది. ఈ మార్పులు విద్యార్థులకు స్పష్టమైన మార్కుల వివరాలను అందించినప్పటికీ, కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టాయి. ఫలితాలు, మెమోలు ఆలస్యం.. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. ఏప్రిల్ 7 నుంచి 15 వరకు మూల్యాంకనం జరిగింది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థులు మార్కుల మెమోల కోసం 100 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెకండరీ బోర్డు అధికారులు స్పీడ్ పోస్ట్ ద్వారా మెమోలను పాఠశాలలకు పంపగా, రెండు రోజుల క్రితం అవి చేరాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కొత్త మార్కుల విధానం.. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, వాటిని కలిపి మొత్తం జీపీఏ ప్రకటించేవారు. కానీ, కొత్త విధానంలో ఇంటర్నల్(20 మార్కులు), ఎక్స్టర్నల్ (80 మార్కులు) మార్కులను విడివిడిగా చూపిస్తూ, సబ్జెక్టు వారీగా గ్రేడ్ పాయింట్తోపాటు ‘పాస్’ అని మాత్రమే మెమోలో సూచిస్తున్నారు. అయితే, విద్యార్థి సాధించిన మొత్తం మార్కుల సమగ్ర వివరాలు మెమోలో లేకపోవడంతో, సబ్జెక్టుల వారీ మార్కులను కలిపి లెక్కించుకోవాల్సిన పరిస్థితి. కొత్త విధానంపై విమర్శలు.. కొత్త మార్కుల విధానం విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంచుతోందని, ఇది విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచవచ్చని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని, తమ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారని ప్రచారం చేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గత జీపీఏ విధానంలో మార్కుల బేధాలు స్పష్టంగా తెలియకపోవడంతో విద్యార్థుల మధ్య పోటీ తక్కువగా ఉండేదని, అదే విద్యార్థులకు అనువైనదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు తీసుకెళ్లాలి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలు గురువారం పాఠశాలకు వచ్చాయి. విద్యార్థులు పాఠశాల సమయంలో వచ్చి తమ మార్కుల మెమోలు తీసుకెళ్లాలి. – రాజు నాయక్, ప్రధానోపాధ్యాయుడు, లక్ష్మణచాంద ఉన్నత పాఠశాల -
ఆర్ఎంపీల హైడోస్!
నిర్మల్7యూరియా కొరత లేకుండా చూడాలి నిర్మల్: నర్సాపూర్(జి) మండల రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం డీసీఎంఎస్ గోదాముల్లో నిల్వఉన్న స్టాక్ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఫర్టిలైజర్ లైసెన్స్ ధ్రువపత్రాల గడువును పరిశీలించారు. ద్రవరూప నానో యూరియా బాటిళ్లను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఏఈవో గణేశ్ ఉన్నారు. నిర్మల్ : తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజి స్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గ్రామాల్లో అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించడానికి మాత్రమే అర్హులు. వారి ప్రధాన విధి ఫస్ట్ ఎయిడ్ చేసి, రోగిని సమీప ఆస్పత్రికి తరలించడం. తమ క్లినిక్లను ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు లేదా మెడికల్ హాల్లుగా పేర్కొనడం, పేరు ముందు ‘డాక్టర్’ ఉపయోగించడం, ఇన్పేషెంట్లను చేర్చుకోవడం నిషిద్ధం. అయితే, కొందరు ఆర్ఎంపీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చిన్నపాటి ఆస్పత్రులను నడుపుతున్నారు, ఇవి ఇటీవల అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. అనర్హ వైద్యంతో ప్రమాదం.. జిల్లాలో కొందరు ఆర్ఎంపీలు తమ అర్హతలను మీరి వైద్యం చేస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ స్థాయిలో మందులు రాస్తూ, రక్తపోటు, మధుమేహం మాత్రలు సూచిస్తున్నారు. కొందరు సంతానలేమి చికిత్సలు, మగపిల్లల జననం కోసం మందులు ఇస్తున్నారు. రహస్యంగా అక్రమ గర్భస్రావాలు చేయడం లేదా తెలిసిన వైద్యులతో చేయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఆర్ఎంపీల వైద్యంతో ఇద్దరు మృతి చెందారు. జాగ్రత్త సుమా.. ప్రస్తుతం వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కొందరు ఆర్ఎంపీల వద్ద జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆస్పత్రులకు సమానమైన రద్దీ కనిపిస్తోంది. మోతాదుకు మించిన మందులు ఇవ్వడం వల్ల రోగాలు త్వరగా తగ్గినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది స్థానికులను ఆర్ఎంపీల వైపు ఆకర్షిస్తున్నప్పటికీ, దీర్ఘకాల పరిణామాలను వారు గుర్తించడం లేదు. ప్రజలు అర్హతలేని ఆర్ఎంపీల వద్ద చికిత్సలు తీసుకోకుండా, ధ్రువీకరణ పొందిన వైద్యులను ఆశ్రయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తనిఖీలు కొనసాగిస్తాం.. ఇటీవల జిల్లాలో అర్హతలేని వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తరచూ దాడులు చేస్తున్నాం. ఈ తనిఖీలను కొనసాగిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వైద్యం చేసినా చర్యలు తప్పవు. –డాక్టర్ రాజేందర్, ఇన్చార్జి డీఎంహెచ్వో‘ఇయాల్టికి మూడ్రోజులాయే.. దగ్గు, జరం తగ్గుతనే లేదు. మా కొడుకు తెచ్చిన గోలీలేసుకుంటున్న ఏం ఫాయిదా లేదు. ఇగ రేపు నిర్మల్వోయి దవాఖాన్ల సూపిచ్చుకుంటా అంటున్న..’ అని నర్సయ్య దగ్గుకుంట చెబుతుండంగనే.. ‘అరె..నర్సన్న నిర్మల్దాకా ఎందుకే..! మనూళ్లె డాక్టరే రెండు సూదులు గుచ్చిండంటే ఖతం.. నీ దగ్గు, జరం అన్నీ పోతయ్..పో.’ అని రమేశ్ చెప్పాడు. నర్సయ్య ఊళ్లో ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. రమేశ్ చెప్పినట్లే.. రెండురోజుల్లో నర్సయ్య దగ్గు, జరం, ఒంటినొప్పులన్నీ పోయాయి. ఇదెలా సాధ్యం..!? అని కాస్త చదువుకున్న నర్సయ్య కొడుకు ఆరాతీస్తే.. ఆ ఆర్ఎంపీ ఇచ్చినవి అధిక డోసు మందులు. పేషెంట్కు భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా.. ఇలా చాలామంది అర్హతలేని ఆర్ఎంపీలు యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇవేవీ.. తెలియని గ్రామీణులు వారి వైద్యాన్ని గుడ్డిగా నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. 25న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్మల్రూరల్: జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మనాభంగౌడ్, శామ్యూల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పరుగు పందెం, త్రోజ్ జంప్ అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు ఉంటాయని వివరించారు. విజేతలను మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9440516634, 8501054234 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోవాలి
కడెం: ఈజీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండలంలోని ధర్మాజీపేట్ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ నర్సింహులు, డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి ఉపాధిహామీ పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. లక్ష్మీసాగర్ గొండుగూడలో తొమ్మిది గొర్రెల షెడ్లను ప్రారంభించారు. అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా పనుల జాతర కార్యక్రమం చేపట్టామన్నారు. షెడ్ల నిర్మాణానికి నిధులు తగ్గించకుండా చూడాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఏపీడీ ప్రసాద్, ఎంపీడీవో అరుణ, ఏపీవో జయదేవ్, ఆర్ఐ శారద, ఏపీఎం గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి, యూత్కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి నిర్మల్ రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు, కూలీలకు పనికొచ్చే పనులు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్లో శుక్రవారం నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకను లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో గొర్రెలు, పశువుల పాకలు, పౌల్ట్రీ, పొలం బాటలు వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో వందశాతం అక్షరాస్యతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం 100 రోజుల పనులు పూర్తిచేసిన కూలీలను సన్మానించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎంపీడీవో గజానన్, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఖానాపూర్/భైంసాటౌన్: ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లతోపాటు దివ్యాంగ పెన్షన్ల పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విమర్శించారు. నిలదీయాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ మిన్నకుండిపోయిందని పేర్కొన్నారు. ఖానాపూర్, భైంసాలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాల నిర్లక్ష్యం కారణంగానే పింఛన్లు పెరగడం లేదన్నారు. వారి బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేయడానికే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో నిర్వహించే మహాగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయినాథ్, బిక్కి మురళికృష్ణ, ప్రణీత్, రేణికుంట్ల సాగర్, శనిగారపు రవి, లక్ష్మణ్, శంకర్, రహీం, వకీల్, లక్ష్మి, సాజిద్, ముస్తాక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వినతి కుంటాల: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మండలంలోని కల్లూరు వాసవి కళాశాలలో ప్రతినిధులు మందకృష్ణ మాదిగకు వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మందకృష్ణను సన్మానించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, టీపీడీఎంఏ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ స్టేట్ మెంబర్ బోయ సాయిలు, ప్రిన్సిపాళ్లు గట్టుపల్లి శ్రీనివాస్, సంతోష్ ఉన్నారు. -
విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం
బాసర: విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంద రూ విధులు నిర్వహించాలని ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సూచించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, వివిధ విభాగాధిపతులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్య కార్యక్రమాలు, విద్యార్థుల తరగతులు, ల్యాబ్లు, సెమినార్లు, ప్రాజెక్టులు రాబోయే విద్యా ప్రణాళికలపై చర్చించారు. క్యాంపస్ సౌకర్యాలు, వసతి గృహాల్లో వాతావరణం, ఆహార వసతులు, శుభ్రత, ఆరోగ్య సౌకర్యాలు లైబ్రరీ, క్రీడా తదితర సదుపాయాలపై సమీక్ష చేశారు. ప్రతీ విభాగాధిపతి, సెక్షన్ హెడ్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే క్యాంపస్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గోవర్ధన్ అన్నారు. మెంటరింగ్ సిస్టమ్, కౌన్సిలింగ్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, పరిశోధన అవకాశాలు, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలను బలోపేతం చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సృజనాత్మక అభివృద్ధి కలిగించే వాతావరణాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై శిక్షణ ఆర్జీయూకేటీలో ఎలక్ట్రిక్ వాహనాలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, నమ్యాట్ ఫేస్–3, తిరువనంతపురంలోని సీడీఏసీ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్), భారత ప్రభుత్వ మెయిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. వాహన భాగాలను విడదీసి అమర్చడం, పరీక్షించడంపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నవీన్ కుమార్, రెంజి వీ.చాకో, రామ్గోపాల్గుప్తా నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభమైందన్నారు. పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, భవిష్యత్ సాంకేతికతలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల పరిశోధన, ప్రాజెక్టు ఆవిష్కరణలకు దోహదపడుతుందని, ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: కేజీబీవీలో నాణ్యమైన విద్యాబోధనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని అనంతపేట్ కస్తూరిబాగాంధీ పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్రూం, వంటగది, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేలా పాఠశాల ప్రాంగణంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్, ఎంఈవో వెంకటేశ్వర్లు, తాహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
దెబ్బతిన్న రోడ్లు బాగుచేయండి
కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి గ్రామ రోడ్లు భారీ వర్షాలు, వరదలకు దెబ్బ తిన్నాయని, వాటిని బాగు చేయించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ అన్నారు. అ ల్లంపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లతో అల్లంపల్లి, బాబానాయక్తండా, మంగల్సింగ్తండా, మీ సాలభూమన్నగూడెం, గంగన్నపేట్, పాలరేగ డి తదితర గ్రామల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్ స్పందించి వెంట నే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరా రు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులు పరి హారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
భైంసాలో బెట్టింగ్ మాఫియా
భైంసాటౌన్: భైంసా పట్టణంలో బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమ లావాదేవీలతో కోట్ల రూపాయలు గడించింది ఈ మాఫియా. అమాయకులకు డబ్బు ఆశ చూపి, వారి పేరిట బ్యాంకు ఖాతాలను తెరిపించి, నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ వాటిని ఈ ముఠానే నిర్వహిస్తోంది. ఈ ఖాతాల ద్వారా లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతూ, ఖాతాదారులకు తెలియకుండానే అక్రమ కార్యకలాపాలు నడుపుతున్నారు. అధిక మొత్తంలో లావాదేవీలు జరగడంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బెట్టింగ్ బుకీల అడ్డా.. భైంసా పట్టణం బెట్టింగ్ బుకీలకు అడ్డాగా మారింది. ఓ మాజీ కౌన్సిలర్ సుదీర్ఘకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి గతంలో అరెస్ట్ చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఓవైసీనగర్లో బెట్టింగ్ బుకీ సయ్యద్ అజామ్ నివాసంపై పోలీసులు దాడిచేశారు. అజామ్ మీసేవా కేంద్రం, బ్యాంక్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తూనే బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతని నుంచి రూ.కోటిన్నర విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఈ దందాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు.. బెట్టింగ్ నిర్వాహకులు ‘ఆల్ ప్యానల్స్’ అనే వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓవైసీనగర్లో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఈ దందాకు కేంద్రంగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యక్తులు అమాయకులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తూ వారి బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తీసుకుని, ఖాతాదారులకు తెలియకుండా రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నారు. ఈ ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరగడంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేస్తోంది. దీంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగ్ బుకీలు ఆదాయపన్ను శాఖను కూడా తప్పుడు పత్రాలతో మభ్యపెడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కొందరికి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో గణేశ్నగర్కు చెందిన షిందే ప్రవీణ్ అనే యువకుడిని క్రికెట్ బెట్టింగ్, మ్యూల్ ఖాతాల సమకూర్పులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వైఫల్యం.. అక్రమ దందాలను అరికట్టే బాధ్యత పోలీసులతోపాటు నిఘా విభాగాలపై ఉంది. అయితే, భైంసాలో ఇటువంటి కార్యకలాపాలు వెలుగులోకి రావడం నిఘా విభాగాల వైఫల్యంగా విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగే కార్యకలాపాలపై నిఘా విభాగాలకు సమాచారం ఉన్నప్పటికీ, వాటిని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతో నేరాలను నియంత్రించలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్తోపాటు మట్కా, గుట్కా, గంజాయి అక్రమ రవాణా వంటి దందాలు రహస్యంగా జరుగుతున్నప్పటికీ, వీటిని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం... అక్రమదందాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ దందాపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఈ కేసులో ఇదివరకే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం. తాజాగా, ఓవైసీనగర్కు చెందిన సయ్యద్ అజామ్ అనే బుకీని అరెస్ట్ చేశాం. జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తాం. – అవినాష్కుమార్, ఏఎస్పీ, భైంసా -
‘పీఎంశ్రీ’ నిధులపై సందేహాలు నివృత్తి చేయాలి
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం అమలుచేస్తోంది. ఎంపిక చేసి న పాఠశాలలకు భారీగా నిధులు ఇస్తోంది. అయితే ఈ నిధుల వినియోగంలో గందరగోళం నెలకొందని తపస్ జిల్లా ఇన్చార్జి శశిరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడారు. పీఎంశ్రీకి జిల్లాలో మొత్తం 82 పాఠశాలల్లో ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల చొప్పున విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ నిధుల విడుదల, వాటి పంపిణీ విషయంలో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. డీఈవో పారదర్శకంగా వ్యవహరించి, స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే విద్యాశాఖపై విశ్వాసం ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ సమన్వయంతో పనిచేసి జిల్లా విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్కుమార్, సుదర్శన్, రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఎస్తో పెరిగిన హాజరు
లక్ష్మణచాంద: పాఠశాల విద్యాశాఖ ఈ నెల 1 నుంచి అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు నమోదు (ఎఫ్ఆర్ఎస్) విధానం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు పారదర్శకతను మెరుగుపరిచింది. ఈ విధానం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ హాజరును క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 19 మండలాల పరిధిలో మొత్తం 711 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 3,110 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వీరిలో 3,079 మంది ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేసుకున్నారు. గురువారం 2,655మంది ఉపాధ్యాయులు హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 378 మంది సెలవులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ గణాంకాలు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదులో పారదర్శకతను సూచిస్తున్నాయి. గైర్హాజరీకి చెక్ గతంలో కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలల కు హాజరు కాకుండా, రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లి పోయేవారు. కొందరు ప్రైవేట్ పాఠశాల నిర్వహణ, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ వ్యాపారాలు చేసుకునేవారు. ఎఫ్ఆర్ఎస్ విధానం ఈ అనవసర గైర్హాజరీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విధానం పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేయడానికి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఈ విధానం ఉదయం హాజరు నమోదు, సాయంత్రం విధుల ముగింపు సమయంలో రెండుసార్లు అమలవుతుంది, ఇది ఉపాధ్యాయుల బాధ్యతను మరింత పెంచింది. పర్యవేక్షణ, పారదర్శకత ఎఫ్ఆర్ఎస్ విధానం అమలును పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు(డీఈవో), మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈవో) పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణతో హాజరు నమోదు ప్రక్రియలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడింది. ఈ విధానం ఉపాధ్యాయులు పాఠశాలల్లో క్రమం తప్పకుండా హాజరయ్యేలా చేయడమే కాక, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూడా దోహదపడుతోంది. ఉత్తమ ఫలితాలు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు నమోదు జిల్లాలో ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. పాధ్యాయులందరూ సకాలంలో పాఠశాలలకు చేరుకుని సాయంత్రం వరకు ఉండి హాజరు నమోదు చేసుకుంటున్నారు. దీంత అనధికార డుమ్మాలకు చెక్ పడింది. – రామారావు, డీఈవోహాజరు నమోదు శాతం 85.78లీవ్లో ఉన్న ఉపాధ్యాయులు 378గురువారం హాజరైన ఉపాధ్యాయులు 2,655 గైర్హాజరైన ఉపాద్యాయులు 74 -
మళ్లీ ముందస్తే..!
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన నూతన మద్యం పాలసీలో మద్యం దుకాణాల లైసెన్స్ అప్లికేషన్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజుకు 50 శాతం అదనంగా విధించింది. ఈ పెరిగిన ఫీజు, కఠిన నిబంధనలు లిక్కర్ వ్యాపారులను, అలాగే ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునేవారిని నిరుత్సాహపరుస్తున్నాయి. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 18 మండలాల పరిధిలో 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల కోసం రిజర్వేషన్ విధానం అమలులో ఉంది. ఇందులో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించారు. లైసెన్స్ ఫీజు జనాభా ఆధారంగా ఆరు స్లాబ్లుగా విభజించింది ఎకై ్సజ్ శాఖ. 5 వేల జనాభా వరకు రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు, లక్ష జనాభా ఉంటే రూ.60 లక్షలు. లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో రూ.85 లక్షలుగా పేర్కొంది. ఆందోళనలో జిల్లా వ్యాపారులు.. 2023–25 మద్యం పాలసీ సమయంలో జిల్లాలో 47 దుకాణాల కోసం 1,067కు పైగా టెండర్లు దాఖలయ్యాయి. దరఖాస్తుల ద్వారా ఎకై ్సజ్ శాఖకు రూ.21.34 కోట్ల ఆదాయం (నాన్–రిఫండబుల్) సమకూరింది. అయితే, టెండర్ల సమయంలో కనిపించిన పోటీ వ్యాపారం ప్రారంభమైన తర్వాత కనిపించలేదు. చాలా మంది వ్యాపారులు పెట్టుబడికి తగిన ఆదాయం లేక నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. కొందరు గుడ్విల్ కింద అమ్మేందుకు యత్నించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లాలో నెలకు రూ.20 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.400 కోట్ల వ్యాపారం నమోదైంది. గత పాలసీలోనే వ్యాపారం గిట్టుబాటు కాలేదని, ఇప్పుడు దరఖాస్తు ఫీజు 50 శాతం పెంపుతో వ్యాపారం చేయలేమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముందస్తు ఇలా.. ప్రస్తత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టెండరు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి షెడ్యూల్ విడుదల చేయనుంది. అదే నెలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అక్టోబర్లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించే అవకాశం ఉంది. ఎకై ్సజ్ శాఖ కమిషనర్ ఆదేశాల ఆధారంగా ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది. వివరాలు అర్బన్ ఏరియాలో వైన్సులు బార్లు నిర్మల్ 11 4 ఖానాపూర్ 3 1 భైంసా 5 8 18 మండలాల పరిధిలో 28 షాపులుగత పాలసీల్లో వచ్చిన దరఖాస్తులు, ఆదాయం.. సంవత్సరం దరఖాస్తులు ఆదాయం 2021–23 636 రూ.12.72 కోట్లు 2023– 25 1067 రూ.21.34 కోట్లు -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
నిర్మల్చైన్గేట్: రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ ఆదేశించారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాలలోని ఎరువుల దుకాణం తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, యూరియా, డీఏపీసహా అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలని సూచించారు. ఆయన వెంట డీఏవో అంజిప్రసాద్, సంబంధిత అధికారులు ఉన్నారు. నానో యూరియా వాడాలి కుంటాల: పెట్టుబడుల తగ్గింపు, అధిక దిగుబడుల కోసం రైతులు నానో యూరియా వాడాలని డీఏవో అంజిప్రసాద్ సూచించారు. మండలంలోని విఠాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతులకు నానో యూరియాపై గురువారం అవగాహన కల్పించారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉండి నేరుగా మొక్కకు అందుతుందని తెలిపారు. డీఏవో వెంట ఏవో విక్రమ్, ఏఈవో గణేశ్, రైతులు ఉన్నారు. -
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్చైన్గేట్: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ సూచించారు. ఏఎస్పీ రాజేశ్మీనాతో కలిసి పట్టణంలోని బుధవార్పేట్ నంబర్ వన్ గణేశ్ మండపం నుంచి ఓల్డ్ బస్టాండ్, బాగులవాడ చౌక్ (ఎంఎల్ఏ క్యాంపు ఆఫీస్), గుల్జార్ మార్కెట్, గాంధీచౌక్ మార్గంగా బంగల్పేట్ చెరువు నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టణంలో విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. వారివెంట ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఆది కర్మయోగి అభియాన్ అమలు నిర్మల్చైన్గేట్: జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ కింద అమలుకు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గిరిజన జనాభాకు విద్య, వైద్యం, మౌలిక ఆర్థిక సదుపాయాలు అందించడంతోపాటు, గ్రామస్థాయిలో పాలనను బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులందరికీ పథకం ఫలాలు అందించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏడుగురు మాస్టర్ ట్రైనర్లు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ పొందినట్లు తెలిపారు. సమావేశంలో గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, డీఏవో అంజిప్రసాద్, ఉద్యానవన అధికారి రమణ, పశుసంవర్ధకశాఖ అధికారి రాజేశ్వర్, గ్రామీణ నీటి సరఫరా అధికారి సందీప్, వైద్యశాఖ అధికారి సౌమ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ పాల్గొన్నారు. -
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభం
లక్ష్మణచాంద: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కూలీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల కూలీ పని దినాలను కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం.చేపట్టే పనులు..కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్లాస్టిక్ నెస్ట్ యూనిట్, సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణంతోపాటు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తారు.పూర్తయిన పనుల ప్రారంభోత్సవంఇప్పటికే పూర్తయిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, గ్రామీణ రహదారులు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేస్తారు.ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసాస్వయం సహాయక సంఘం మహిళలకు పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు, గొర్రెల షెడ్లు, కొత్త వ్యవసాయ బోరు బావులు, పండ్ల తోటల పెంపకం, వానపాముల ఎరువు తయారీ, అజోలా ఫీడ్ నిర్మాణం వంటి జీవనోపాధి అభివృద్ధి పనులకు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందిస్తారు.వ్యక్తిగత లబ్ధిదారుల పనులుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతీ గ్రామంలో వ్యక్తిగత లబ్ధిదారులకు చెందిన కనీసం ఒక పనికి శంకుస్థాపన చేస్తారు.ఫల వనాలు, వన మహోత్సవం...ఈత మొక్కలు, తాటి చెట్లు, పండ్ల తోటల పెంపకం వంటి పనులకు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందిస్తారు.జల నిధి పథకం..నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులు చేపట్టిన లబ్ధిదారులను గుర్తించి సన్మానిస్తారు.దివ్యాంగుల సన్మానంగత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి ఘనంగా సన్మానిస్తారు.పచ్ఛదనం పెంపకం..గ్రామంలో స్వచ్ఛందంగా చెట్ల పెంపకంలో పాల్గొని, ఇతరుల భాగస్వామ్యంతో పచ్ఛదనాన్ని పెంచడానికి తోడ్పడిన వ్యక్తులు/కుటుంబాలను సన్మానిస్తారు.కడెంలో ప్రారంభం‘పనుల జాతర–2025’ కార్యక్రమం ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండలం, ధర్మాజీపేట్ గ్రామంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు.పకడ్బందీగా అమలు..పనుల జాతర 2025 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు మరింత మెరుగైన పనులను కల్పించడం, సంవత్సరం పొడుగునా పని కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం కార్యక్రమం లక్ష్యం. – విజయలక్ష్మి, డీఆర్డీవో -
భైంసాలో పీస్ కమిటీ సమావేశం
భైంసాటౌన్: పట్టణ ప్రజలు పండుగలు, ఉత్సవాలు శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, ఏఎస్పీ అవినాష్కుమార్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో మతపెద్దలు, గణేశ్ మండపాల నిర్వహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో గురువారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. అధ్వాన్న రోడ్లు, విద్యుత్ తీగలు, స్తంభాలతో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. సున్నిత ప్రాంతంగా భైంసాకు ఉన్న పేరును తొలగించుకునేలా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ రాజేశ్కుమార్, సీఐ గోపీనాథ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మతపెద్దలు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
మట్టి మేలు తలపెట్టి..!
మంచిర్యాలఅర్బన్: సంప్రదాయంగా వస్తున్న పండుగలను ప్రస్తుతం జరుపుకునే విధానంలో చేస్తున్న పొరపాట్లు పర్యావరణానికి ఎన్నో అనర్థాలు తెచ్చి పెడుతున్నాయి. వినాయక చవితి రోజు చేస్తున్న పొరపాట్లు చీకట్లు మిగుల్చుతున్నాయి. కానీ.. వినాయక చవితి అనగానే ఆకర్షణ, హంగు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నేళ్లుగా రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కులవృత్తులు కాపాడుతూ.. ఉపాధినిస్తూకనుమరుగవుతున్న కులవృత్తిని కాపాడాలనే సదుద్దేశంతో మట్టి వినాయకుల తయారీతో పాటు ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నాగపూరి రాజేంద్రప్రసాద్ మంచిర్యాలలోని సున్నబట్టివాడలో నివాసం ఉంటున్నారు. ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన ఆయన కులవృత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ఆలోచన చేశారు. 2015లో ఏడు మట్టి విగ్రహలు తయారీ చేసి విక్రయించారు. 2018లో 52 మట్టి ప్రతిమలను రూపొందించి పర్యావరణ హితానికి నడుం బిగించారు. ప్రస్తుతం శ్రీగణేష్ క్లే వర్క్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 80 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. మున్ముందు దీపావళికి ఉపయోగించే ప్రతిమలు, ఇంట్లో వినియోగించే మట్టిపాత్రలు, కుండలు ఇలా అన్ని రకాలు తయారీ చేయాలని నిర్ణయించారు. మట్టివిగ్రహాలతో ఆదాయం భళా..పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ సరఫరా టెండర్ దక్కించుకున్నారు. 40వేల వినాయకులు సరఫరా చేయనున్నారు. మరోవైపు రెండో అన్నవరంగా పేరొందిన గూడేం సత్యనారాయణ టెంపుల్లో ఏర్పాటు చేసే మట్టి వినాయకుడు ఇక్కడే తయారు చేశారు. ఆదిలాబాద్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2వేల మట్టి వినాయకుడు ఆర్డర్ ఇచ్చింది. ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టి వినాయకులు తయారు చేశారు. వినాయకుల తయారీలో కర్ర, మట్టి, గడ్డితో తడి సున్నం, వాటర్ కలర్లు విని యోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర భుత్వం పర్యావరణంతోపాటు కులవృత్తులను ప్రో త్సహించటానికి ప్రభుత్వ స్థలం లీజుకు ఇస్తే మరింత మందికి ఉపాధినిస్తానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తాతల కాలం నుంచి..తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మట్టి వినాయకులు తయారీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మంచిర్యాలకు చెందిన తాళ్లపల్లి తిరుపతి. ఇంటర్ పూర్తి చేసిన కులవృత్తి మట్టికుండల తయారీలో తర్ఫీదు పొందాడు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఏటా 2వేల విగ్రహాలకు పైన మట్టి విగ్రహాలు తయారు చేసి ఆర్డర్పై ఇస్తుంటాడు. మూ డు కుటుంబాలు మట్టి వినాయకుల తయారీలో పాలు పంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలను చూడముచ్చటగా తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తుంటా రు. మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంద ని, విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినయోగంతో పూడిక సమస్య తొలగిపోతందుని అందు కే మట్టికి ప్రాధాన్యం ఇస్తున్నామని తిరుపతి తెలి పారు. వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగని, మట్టితో పూజించాలని సూచించారు. -
జరుపుకోవాలి
ఉత్సవాలు శాంతియుతంగానిర్మల్: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించుకోవా లని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గణే శ్ నవరాత్రోత్సవాల నేపథ్యంలో ఎస్పీ జానకీ ష ర్మిలతో కలిసి కలెక్టరేట్లో బుధవారం జిల్లా శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రోత్సవాలు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలవాలని సూచించారు. ఇతరుల ఆచార, సంప్రదాయాలకు భంగం కలగకుండా చూసుకోవా లని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనలు మొదలు నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చూడాలని సూచించారు. జిల్లా, డివిజన్ స్థాయిలో అధికారులు ప్ర త్యేక సమావేశాలు నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో రూట్ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిమజ్జనం జరిగే రూట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, రహదారులు సక్రమంగా ఉండేలా పటి ష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట క్రేన్లు సిద్ధం చేయాలని సూచించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో నిమజ్జన ప్రాంతాలను అధికారులు ముందుగానే పరిశీలించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పకడ్బందీ చర్యలు : ఎస్పీ గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా శాంతిభద్రతల విషయంలో పోలీస్శాఖ కట్టుదిట్టమైన చ ర్యలు చేపడుతోందని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద ప్రత్యేక బందోబస్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఉత్సవాలు సాఫీగా సాగేలా ప్రజలంతా సకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిశోర్కుమార్, ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనా, భైంసా సబ్కలెక్టర్ సాంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మ న్ ఆనంద్రావు పటేల్, వివిధ శాఖల అధి కారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, త దితరులు పాల్గొన్నారు. -
‘ఉపకార’ంతో ఊతం
నిర్మల్ చైన్గేట్: ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే పేదవిద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపాలనుకునేవారికి ఉపకార వేతనాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. ఇందుకోసం 2008లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)ను అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పరీక్ష నిర్వహించి అర్హత సాధించినవారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తి చేసేదాకా నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ మంజూరు చే యనుంది. ఎంపికై న విద్యార్థులు ప్రతీ సంవత్సరం ఉపకార వేతనం కోసం వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. నవంబర్లో ప్రతిభ పరీక్ష ఈ నెల 31వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆ దేశాలు జారీ చేశారు. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. అయితే.. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉపాధ్యాయులే ఫీజు చెల్లించి పోటీ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్లో ప్రతిభ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. కేంద్ర విద్యాశాఖ ఏటా ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రధానంగా మెంటల్ ఎబిలిటీ 30మార్కులు, మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. స్కాలస్టిక్ ఎబిలిటీ పరీక్ష 90 మార్కులు, 7వ, 8వ తరగతుల సైన్స్, గణితం, సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలుంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. ముఖ్యంగా జిల్లా యూనిట్గా, కేటగిరీల వారీగా, ప్రతిభ కొలమానంగా అర్హుల ఎంపిక ఉంటుంది.దరఖాస్తుకు అర్హతలు ఉపకార వేతనానికి అర్హత సాధించేందుకు ప్రతిభ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించి ఉండకూడదు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫాం జిరాక్స్ కాపీతోపాటు ఏడోతరగతిలో పాందిన మార్కుల జాబితా, ఆదాయ, కుల ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలను ఈనెల 31న డీఈవో కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది.సద్వినియోగం చేసుకోవాలి గడువులోపు దరఖాస్తు చేసుకుని ప్రతిభ పరీక్ష రాస్తే మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్కాలర్షిప్నకు ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యేదాకా నాలుగేళ్లపాటు రూ.12వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పరమేశ్వర్, ఇన్చార్జి డీఈవో -
అదుపుతప్పి లారీ బోల్తా
నర్సాపూర్ (జి): మండలంలోని చాక్పల్లి గ్రా మ శివారు 61వ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జింతూ ర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లికి సో యా పొట్టుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రో డ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచాయి. సమాచారం అందుకున్న ఎస్సై గణేశ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీతో లారీని పక్కకు జరిపించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్కు గాయాలు కాగా 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. -
పార్వతి తనయా
పర్యావరణహితాయ.. ఆదిలాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు గణనాథుని ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రం వ్యాప్తంగా మట్టి ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఉపాధి అందిస్తున్నాయి. వైవిధ్యమైన రూపాల్లో పార్వతి తనయున్ని పర్యావరణహితంగా ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయక ప్రతిమలను నిలబెట్టేందుకు యువత, ఉత్సవ సమితి సభ్యులు ప్రాధాన్యతనిస్తుండడం విశేషం. పీఓపీ విగ్రహాలు తక్కువ సమయంలో పూర్తవుతాయి. మట్టి ప్రతిమల తయారీకి 10 నుంచి 20 రోజులు పడుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు వైవిధ్యమైన రూపాల్లో మట్టి వినాయకున్ని కొలువుదీర్చేందుకు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. దీంతో కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ సైతం సాధ్యమవుతుండడంతో పర్యావరణ ప్రేమికుల నుంచి సైతం హర్షం వ్యక్తం అవుతుంది. -
పేదల కల నెరవేరింది
నిర్మల్ చైన్గేట్: రేషన్ కార్డుల కోసం 11ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త రేషన్కార్డుల పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా కార్డులు అందించారు. దీంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్లో మూడు నెల ల రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేశారు. దీంతోపాటు మూడు నెలలుగా ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల జారీతోపాటు ఉన్న కార్డుల్లో సభ్యుల పేర్లు నమోదు చేసింది. జిల్లాలో పెరిగిన ఆహారభద్రత కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.అదనంగా 328 మెట్రిక్ టన్నులుకొత్త రేషన్కార్డుదారులకు బియ్యం పంపిణీకి అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా పాత కార్డులతోపాటు కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు సెప్టెంబర్ కోటాకు సంబంధించిన సన్నబియ్యం కేటాయించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం త రలింపునకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చౌకధర ల దుకాణాలు, మండలస్థాయి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యానికి తోడు అదనంగా కావాల్సిన కోటా ను సరఫరా చేస్తున్నారు. కొత్త రేషన్కార్డుల పంపిణీకి ముందు ప్రతినెలా సుమారు 412 షాపుల ద్వా రా 2,19,972 కార్డులకు 4,428 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. పెరిగిన లబ్ధిదారు ల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతం అదనంగా జిల్లాకు 328 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.నాలుగు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానిర్మల్, ముధోల్, భైంసా, ఖానాపూర్ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 18మండలాల్లోని 412రేషన్షాపులకు బియ్యం కోటా చేరనుంది. స్టేజ్–1 గోదాము ల నుంచి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు బి య్యం నిల్వల రాక ప్రారంభమైంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా రేషన్షాపులకు బియ్యం పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.జిల్లా రేషన్ సమాచారంపాత కార్డులు 2,19,972యూనిట్లు 7,03,796కొత్త కార్డులు 22,233కొత్త యూనిట్లు 50,727మొత్తం కార్డులు 2,42,205మొత్తం యూనిట్లు 7,54,523గత కోటా 4,428 మెట్రిక్ టన్నులుపెరిగిన కోటా 328 మెట్రిక్ టన్నులుసెప్టెంబర్ కోటా 4,756 మెట్రిక్ టన్నులుఫిర్యాదులపై స్పందించాలినిర్మల్ టౌన్: ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధి కారులు, సిబ్బందితో జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫి ర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కీలక సూచనలు చేశా రు. పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని, పోక్సో కేసుల్లో వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు అనుమతి కోసం త ప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని, అనుమతిపత్రం, క్యూఆర్ కోడ్ను మండపం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భైంసా, నిర్మల్ ఏఎస్పీలు అవినాష్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. -
అరచేతిలోనే పల్లె పద్దు
నిర్మల్ఖిల్లా: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామాలకు ఆర్థికసంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలైన నిధులు, పథకాల వారీగా వ్యయం వివరాలను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ‘మేరీపంచాయత్’ పేరిట ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే పనులను అడ్డుకునేలా చొరవ చూపింది. ఈ యాప్ ద్వారా పంచాయతీ సమగ్ర సమాచారం తెలుసుకునే మార్గాన్ని సులభతరం చేసింది. యాప్ లో ప్రతీ లెక్క పక్కాగా పొందుపరిచి ఉంటుంది. తప్పుడు గణాంకాలు లేకుండా.. గ్రామపంచాయతీ నిధులు, చేపట్టిన పనుల వివరాలు.. వార్డులవారీగా ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం ఎన్ని నిధులు విడుదల చేసింది.. ఇంకా ఎన్ని నిధులు రావాల్సి ఉంది.. ఇందులో తెలిసిపోతుంది. గ్రామపంచాయతీ పాలకవర్గాలు కూడా పొరపాట్లకు తావివ్వకుండా ప్రతీ పైసాను లెక్క ప్రకారం ఖర్చు చేసే అవకాశముంటుంది. పంచాయతీ కార్యదర్శి నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల వరకు ఎవరు తప్పుడు నివేదికలు చూపినా పౌరులు ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టవచ్చు. ఎలా లాగిన్ అవ్వాలంటే.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ప్లేస్టోర్లో ‘మేరీపంచాయత్’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేస్తే మొదటి పేజీలో పేరు, మొబైల్ నంబర్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలు నమోదు చే యాలి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, నిధుల పూర్తి సమాచారం వార్డులవారీగా నమోదై ఉంటుంది. జిల్లాలో 19 మండలాలుండగా ఇందులో ఒక అర్బన్ మండలం ఉంది. 18 మండలాల్లోని 400 గ్రామాల పరిధిలో 3,368 వార్డులున్నాయి. పారదర్శకత కోసమే.. ప్రతీ గ్రామపంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనుల ఆర్థిక పురోగతి, ఆస్తులు జియో ట్యాగింగ్ ద్వారా ఈ యాప్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని పొందుపరచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖదే. గ్రామపంచాయతీ పాలక వర్గాల పేర్లతో సహా వివరాలు, పంచా యతీ కార్యదర్శి వివరాలు, మంజూరైన నిధులు, ఏయే పనులకు ఎంత వ్యయం చేశారు? ఆ పనుల ప్రస్తుత పురోగతి? తదితర అంశాలూ అందుబాటులో ఉంటాయి. అంచనా వ్యయాలు, అభివృద్ధి పనుల నివేదికలు ఇందులో క్లుప్తంగా పొందుపరిచి ఉంటాయి. జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించడంతో ఒకసారి చేసిన పనులకు మరోసారి బడ్జెట్ కేటాయించడానికి అవకాశం ఉండదు. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత ఎక్కువగా ఉంటుంది. -
సమస్యల పరిష్కారంలో విఫలం
ఖానాపూర్: రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖి ల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ ప్రభాకర్ ఆరోపించారు. మండలంలోని అడవిసారంగాపూర్ గ్రామంలో ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అంకుష్రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ప్రథమ మహాసభకు హాజరై మాట్లాడారు. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయ ని విమర్శించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షుడు నందిరామయ్య ఏఐయూకేఎస్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కట్ల రా జన్న, నాయకులు జక్కుల రాజన్న, అడ్డగట్ల శంకర్, ఎల్లయ్య, గోరేబాయ్, సుదర్శన్, మహేందర్, చాంద్పాషా, రాజన్న, శ్రీనివాస్, భీంరావు, లింగు, లచ్చన్న, సంజీవ్, రాజేశ్వర్ తదితరులున్నారు. -
జిల్లాలో ‘మహా’ వరద
నిర్మల్: వర్షం, వరద ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వర్షం తగ్గినా.. ఎగువన మహారాష్ట్రలో జోరువానలతో జిల్లాలో వరదలు వస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో క్లౌడ్బరస్ట్తో భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం జిల్లాపై ఇంకా కొనసాగుతూనే ఉంది. గోదావరి నది ఉప్పొంగుతోంది. సమీప గ్రామాలకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టులకూ ఇన్ఫ్లో కొనసాగుతోంది. ‘మహా’ ఎఫెక్ట్.. జిల్లాకు పక్కనే ఉన్న నాందేడ్లో రెండురోజుల క్రితం క్లౌడ్బరస్ట్తో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. దీని ప్రభావం జిల్లాపైనా పడుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరితోపాటు సుద్ధవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులకూ ఇన్ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఉప్పొంగుతున్న గోదావరి.. బాబ్లీ నుంచి బాసర మీదుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 2.28 లక్షల క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీలోకి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మొత్తంగా శ్రీరాంసాగర్ ఎగు వ, దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వర్షసూచన.. జిల్లాలో బుధవారం కూడా మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దులోని భైంసా, కుభీర్, కుంటాల తదితర మండలాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రణాళికశాఖ సూచిస్తోంది. దీంతో బుధవారం జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ అభిలాష అభినవ్ సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. ప్రమాదకర వాగులు, నీటిప్రవాహం ఉన్న లోలెవల్ వంతెనలను ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. ప్రాజెక్టుల సమాచారం.. ప్రాజెక్టు మొత్తం ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో (టీఎంసీల్లో..) (క్యూసెక్కుల్లో..) కడెం 4.699 3.416 13,383 22,583 ఎస్సారెస్పీ 80.5 72.99 2,28,000 4,03,867 స్వర్ణ 1.037 0.831 2,100 1,965 గడ్డెన్నవాగు 1.83 1.685 3,000 00ఖానాపూర్లో ఉధృతంగా గోదావరి -
కడెం నిలబడింది
నిర్మల్వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి సారంగపూర్: భారీ వర్షాలకు కోతకుగురైన వంతెనలు, రోడ్ల పునర్నిర్మాణం త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై కోతకు గురైన వంతెనను మంగళవారం పరిశీలించారు. అక్కడే ఉన్న ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసరావుకు, పీఆర్ డీఈ తుక్కారంకు వంతెన వద్ద రక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టును సందర్శించారు. ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు ఏఈ వేణుగోపాల్ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు, గేట్ల పరిస్థితి గురించి వాకాబు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, బీజేపీ మండల అధ్యక్షుడు నరేశ్ తదితరులు ఉన్నారు. కడెం: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి మంగళవారం కడెం ప్రాజెక్టును సందర్శించా రు. ఈ సందర్భంగా వరద నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వహణను నిర్లక్ష్యం చేసి ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.9 కోట్లతో చేపట్టిన మర్మతులతో ప్రస్తుతం ప్రాజెక్టు నిలబడిందని, భారీ వరదలను సైతం తట్టుకుంటోందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోత ట్టు ప్రాంతాల్లో రహదారులు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేలా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, ముందస్తు సమాచారం అందించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నష్ట అంచనాకు ఆదేశం.. వర్షాలు తగ్గిన వెంటనే సంబంధిత శాఖలు నష్ట అంచనా సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి.. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. స్థాని క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. మంత్రి వెంట కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, ఎస్ఈ వెంకటరాజేంద్రప్రసాద్, ఈఈ విఠల్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ఆర్జీయూకేటీలో ఇండక్షన్ ప్రోగ్రాం ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు మంగళవారం ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ మాట్లాడారు.పునర్నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలి -
ఉగ్ర గోదావరి
బాసర: తెలంగాణలోని బాసరలో గోదావరి నది ఉగ్రరూపందాల్సింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలతో తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీవో గంగాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అభిమన్యు, ఏపీఓ సదానంద చారి, ఈవో ప్రసాద్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్లు గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. బాసర వద్ద పుష్కర ఘాట్లు నీటమునిగాయి. దీంతో నదిలో స్నానాలకు ఎవరినీ అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలకు అంతరాయం.. గోదావరి ఉధృతి కారణంగా ప్రధాన రహదారిపైకి వరద రావడంతో బాసర మండలం ఓని, కౌటా, సాలాపూర్, సావర్గం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమీపంలోని సోయా, పత్తి పంటలు నీటమునిగాయి. లోతట్టు, నదీ పరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, పాత ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పశువుల కాపరులు, చేపల వేటగాళ్లు నది ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.