Nirmal
-
బీపీ : 79,199 మంది షుగర్ : 37, 902 మంది
జిల్లాలో..వయస్సులవారీగా బీపీ వ్యాధిగ్రస్తులు: 30 నుంచి 40 15,729 40 నుంచి 50 36,750 50 ఏళ్లు దాటినవారు 26,716 వయస్సులవారీగా షుగర్ వ్యాధిగ్రస్తులు.. 30 నుంచి 40 ఏళ్లు 10,450 40 నుంచి 50 ఏళ్లు 17,550 50 ఏళ్లు దాటినవారు 9,902పట్టణ ప్రాంతాల్లోనే అధికం.. గత ఐదేళ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారినపడుతున్నట్లుగా గుర్తించారు. నిర్మల్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,386 మంది బీపీ, 4,575 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. -
నిర్మల్ లయన్స్ క్లబ్కు పురస్కారాలు
నిర్మల్ఖిల్లా: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ కాన్ఫరెన్స్లో నిర్మల్ లయన్స్ క్లబ్కు పలు పురస్కారాలు దక్కాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రాంతీయస్థాయి కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ వివిధ రంగాల్లో చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారాలు ప్రదానం చేసినట్లు నిర్మల్ అధ్యక్షుడు కె.చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో క్లబ్ కేటగిరీలో ఎక్సెలెంట్ క్లబ్ అవార్డుతోపాటు మూడు పురస్కారాలు.. వ్యక్తిగత విభాగంలో ఐదు పురస్కారాలు అందించారు.. పురస్కారాలు స్వీకరించిన వారిలో కె.చంద్రమోహన్రెడ్డి(ఉత్తమ అధ్యక్షుడు), శ్రీనివాస్యాదవ్(ఉత్తమ కార్యదర్శి), లక్ష్మీనారాయణగౌడ్(ఉత్తమ కోశాధికారి), వట్టిమల్ల నరసయ్య(రీజియన్ సెక్రెటరీ), లక్కడి రాజేశ్వర్రెడ్డి(జోన్ చైర్మన్) తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ డీకే.రాజేశ్ శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని పలు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
● పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ నిర్మల్ రూరల్: రాష్ట్రంలో వెంటిలేషన్పై ఉన్న విద్యారంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం నిధుల కొరతతో మౌలిక వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట రాజ్, నరేశ్, నవీన్, లోకేశ్ తదితరులు ఉన్నారు. మాట్లాడుతున్న వెంకటేశ్ -
నిర్మల్
లెక్కింపు పెద్ద కథే..! పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్లో జరగనుంది. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20258లోu బాలుర వసతి గృహం తనిఖీ నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జాదవ్ అంబాజీ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్లో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల విద్యార్థులకు చికున్ పాక్స్ సోకడంతో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రమోద్చంద్రారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రాజశేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ హేమ, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ దుర్గాభవాని, హెచ్ఎం ముత్యం పాల్గొన్నారు. సైవేని(40) అనే మహిళ కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పి, మైకం, వికారం వంటి లక్షణాలతో బాధపడుతుంది. ఎన్సీడీ సర్వేలో ఈమెకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ముందస్తుగా వ్యాధిని గుర్తించడంతో ఆమె మందులు వాడి ప్రస్తుతం రక్తపోటును అదుపులో ఉంచుకుంది. జీవన శైలిలో మార్పు రావాలి.. ప్రస్తుతం 30 ఏళ్లకే బీపీ, షుగర్ వస్తోంది. జీవన శైలిలో స్వల్ప మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్ ఫుడ్కు అలవాటు పడడం, వాకింగ్ చేయకపోవడంతో ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. – డాక్టర్ శ్రీనివాస్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి వ్యాయామం లేకనే.. ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారం తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడలవైపు మళ్లించాలి. పెద్దవారు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్ జిల్లా కేంద్రానికి చెందిన జమున(35) అనే మహిళకు కొద్ది రోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఎన్సీడీ సర్వేలో వైద్య సిబ్బంది ఆమెకు పరీక్షలు చేశారు. ఇందులో జమునకు షుగర్ నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు మందులు అందజేసి వ్యాధి అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు. ఈ రోజుల్లో ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఉరకలేస్తున్న యువత ఉడుకు నెత్తురులోకి బీపీ, షుగర్ ప్రవేశిస్తున్నాయి. గుట్టుగా ఒంట్లోకి జొరబడి.. మెల్లగా ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ జబ్బులు.. 30 ఏళ్లు దాటగానే బయటపడడం కలవరపెడుతోంది నిర్మల్చైన్గేట్: జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు వ్యాధులబారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతోపాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 79,199 మందికి బీపీ, 37, 902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నర్లు, క్లినిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేస్థాయిలో చికిత్స కూడా అందుతోంది. వంశపారపర్యంగానూ.. డయాబెటిస్ ఎక్కువగా వంశపార్యపరంగా, వయస్సు పెరిగే కొద్దీ వస్తోంది. దీంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండటం వల్ల పాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి ఈ వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడం, ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల ఊబకాయం పెరిగి అది డయాబెటిస్కు దారి తీస్తోంది. దీంతో శరీరం అధికంగా లావు పెరుగుతుంది. చిన్న వయసులో ఎత్తు కంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్ర పట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు. నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం.. చాలా మంది బీపీ, షుగర్ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన జనాభాలో 79,199 మంది బీపీ, 37,902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. చిన్నారులూ.. బాధితులే ఇటీవల కాలంలో పిల్లల్లోనూ డయాబెటిస్ బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యుపరమైన లో పంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. ఇటీవల పదేళ్లలోపు పిల్లలూ ఈ వ్యాధి బారినపడుతున్నా రు. త్వరగా అలసిపోవడంతోపాటు వెనువెంటనే ఆకలిగా అనిపించడంతో బాధిత పిల్లలు చదువుతో పాటు ఇతర ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. న్యూస్రీల్ 30 ఏళ్లు దాటగానే ముసురుకుంటున్న వ్యాధులు ఎన్సీడీ స్కీన్రింగ్తో గుర్తింపు.. మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు ఒత్తిడి, తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావంనియంత్రణే మార్గం రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డీసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా, సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. -
‘పది’ పరీక్షల్లో పొరపాట్లు జరగొద్దు
● డీఈవో రామారావునిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్, డీవోలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ప్రకారం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపా రు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు నిషేధమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రశ్న పత్రాలు తీసుకురావడం, జవాబు పత్రాలు తరలింపు జాగ్రత్తగా పోలీస్ సమక్షంలో జరగాలని సూచించారు. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పద్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కొత్తగా 24 పేజీల జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తామన్నారు. వెంకటరమణ, సమన్వయకర్త ప్రవీణ్కుమార్, డీసీఈబీ సహాయ కార్యదర్శి భానుమూర్తి, అధికారులు పాల్గొన్నారు. -
‘సదరం’.. సరళతరం
వాతావరణం ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం కూడా తగ్గుతుంది. ● దివ్యాంగులకు ప్రత్యేకంగా యూడీఐడీ పోర్టల్ ● సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. ● కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ఖిల్లా: ప్రత్యేక వైకల్యగుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను ఈనెల నుంచే అమల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడీఐడీ(యూనిక్ డిజేబిలిటీ ఐడీ) కార్డును పొందవచ్చని తెలిపారు. ఇదివరకే సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ప్లాంట్ల ఏర్పాటు.. పీఎం కుసుం ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని దివ్య దేవరాజన్ సూచించారు. ఆసక్తి, అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో విజయలక్ష్మి, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఎరువు.. కరువు!
లింకులతో ఇక్కట్లు.. యూరియ కోసం గ్రోమోర్ ఫర్టిలైజర్తోపాటు, ప్రైౖవేట్ డీలర్ల వద్దకు వెళ్తే వారుగంట గుళికలు, పొటాషియం కొనుగోలు చేయాలని లింకు పెడుతున్నారు. ఫిబ్రవరి 18న ఖానాపూర్ పట్టణంలోని గోమ్రోర్ సెంటర్కు వెళ్లిన రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఖానాపూర్: జిల్లాలో యాసంగి పంటలకు యూరియా దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల్లో కలుపుతీత పనులు చేపడుతున్నారు. కలుపు తీసిన వెంటనే పంటలకు యూరియా వేయాలి. దీంతో రైతులు యూరియా కోసం సొసైటీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అంతా ఒకేసారి యూరియా కోసం వస్తుండడంతో సొసైటీలకు వస్తున్న ఎరువు చాలడం లేదు. అదనుకు యూరియా వేయకుంటే పంట ఎదగక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, లోకేశ్వరం తదితర మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు పీఏసీఎస్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో పంటల సాగు వివరాలు.. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1,02 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగు చేశారు. యాసంగి పంటలకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. అయినా రైతుల ఇంకా యూరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు సరఫరా అవుతోంది. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయడంతోపాటు సాగు చేసిన పంటలకు సైతం ఎక్కువగా వినియోగించడంతోనే కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా తిప్పలు.. ఖానాపూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన రైతులు మూడు రోజులుగా వేకువ జామునే పీఏసీఎస్ల ఎదుట బారుతులు తీరుతున్నారు. కొద్ది రోజులుగా కార్యాలయాలు, దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకకపోవడంతో వెనుదిరుగుతున్నారు. తప్పని అగచాట్లు.. వారం రోజులుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. శుక్ర, శనివారాల్లో వేకువ జామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద వరుసలో చెప్పులు పెట్టి కాలకృత్యాలు, టీ, టిఫిన్ లేకుండా పడిగాపులు కాస్తే తప్ప యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరమని, అదనుకు అందకుంటే పంటలు ఎదగక నష్టపోతామని పేర్కొంటున్నారు. ఖానాపూర్ పీఏసీఎస్ ఎదుట వరుసలో చెప్పులతో పడిగాపులు కాస్తున్న రైతులు జిల్లాలో యూరియా కొరత అదనుకు అందక రైతుల ఆందోళన సొసైటీల వద్ద అన్నదాతల బారులుకొరత లేకుండా చూస్తున్నాం జిల్లాకు ఈ యాసంగిలో గత ఏడాదికంటే ఎక్కువగా యూరియా తెప్పించాం. జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదు. రైతులు ఆందోళన చెందవద్దు. మరో 4 రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. రైతులు యూరియా వినియోగంపై స్థానిక వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అవసరానికి మించి వాడిడం అనర్థమే. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
● 2021–22 నుంచి పెండింగ్లోనే దరఖాస్తులు ● ఏళ్లుగా సాయం కోసం ఎదురుచూస్తున్న జంటలు
నిర్మల్చైన్గేట్:కుల రహిత సమాజాన్ని నిర్మించి అంతరాలను చెరిపి వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు కొన్నేళ్లుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, జంటలో ఒకరు ఎస్సీ అయి ఉండాలనేది నిబంధన. ప్రస్తుత సమాజంలో పలువురు తల్లిదండ్రులు కులాంతర వివాహాలకు అడ్డుచెప్పడం లేదు. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకున్నా పోలీసులను ఆశ్రయించి ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్న కులాంతర వివాహం చేసుకున్న వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం ఏళ్లుగా పెండింగ్ ఉంది. రూ.2.50 లక్షలకు పెంపు... కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఇస్తు న్న ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.50 వేలు ఉండగా 2019లో దానిని రూ.2.50 లక్షలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమాజంలో కులాంతర వివాహలపై అవగాహన పెరిగింది. పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు తమతో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైన ధ్రువపత్రాలు.. వేర్వేరు కులాలకు చెందిన సీ్త్ర, పురుషులు వివాహం చేసుకుంటే.. పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల విచారణలో అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కుల ధ్రువపత్రాలు, వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీలు, మార్కుల మెమో, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెండింగ్లో 37 దరఖాస్తులు.. ఈ పథకం కింద ప్రభుత్వాలు ఎస్సీలకు రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. 2011 వరకు రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. 2012లో రూ.50 వేలకు పెంచారు. ప్రస్తుతం రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కులాంతర వివాహం చేసుకున్న దంపతుల సంయుక్త ఖాతాలో మూడేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అవుతుంది. జిల్లాలో 2019 నుంచి 37 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15 లక్షలను విడుదల చేయగా ఆరుగురు దరఖాస్తుదారులకు అందించారు. ఇంకా 37 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’ వైపు మొగ్గు.. జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అనేక కులాలు ఉన్నప్పటికీ.. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు చాలా మంది పెద్దలను ఒప్పించి.. కులాంతర వివాహం చేసుకుంటున్నారు. సకాలంలో ప్రోత్సాహకం అందించకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు(పెద్దలు ఒప్పుకున్న వారు) కల్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. దరఖాస్తుల వివరాలు ఐదేళ్లలో వచ్చిన దరఖాస్తులు 93 హార్డ్ కాపీ అందజేసిన వారు 82 ఇప్పటివరకు లబ్ధి పొందినవారు 56 పొందిన నగదు రూ.140 కోట్లు ఇంకా లబ్ధిపొందని వారు 37 జమ చేయాల్సిన నగదు రూ.92 లక్షలు పెండింగ్లో ఉన్న సహాయం వివరాలు: ఏడాది దరఖాస్తులు నగదు 2021–22 5 రూ.12.50 లక్షలు 2022–23 7 రూ.17.50 లక్షలు 2023–24 7 రూ.17.50 లక్షలు 2024–25 18 రూ.45 లక్షలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరిస్తున్నాం. వీటిని పరిశీలించి సాయం మంజూరుపై సమాచారం కూడా చేరవేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పెండింగ్లో ఉన్నజంటల ఖాతాల్లో జమ చేస్తాం. – రాజేశ్వర్గౌడ్, ఎస్సీ సంక్షేమ అధికారి -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● సీఎస్ శాంతికుమారినిర్మల్ చైన్గేట్: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య, పరీక్ష కేంద్రాల సంఖ్య, పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించా రు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రుసుంలో 25 శాతం రాయితీని కల్పించినందున మార్చి 31లోగా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష చేశారు. మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. తెల్లవారుజామున చలి ప్రభావం ఉంటుంది. రంజాన్కు ఏర్పాట్లు చేయాలినిర్మల్చైన్గేట్: రంజాన్ మాసం నేపథ్యంలో జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ముస్లింలు ఉపవాసం ఉండే సమయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ జానకీషర్మిలతో కలిసి అధికారులు, ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముస్లింల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలు అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, ముస్లిం మత పెద్దలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెరిగిన ఓటు.. మొగ్గు ఎటు?
నిర్మల్ఘనంగా సైన్సు దినోత్సవం జాతీయ సైన్సు దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్లో వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. బాబోయ్ దొంగలు తానూరు మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వారం రోజుల్లోనే నాలుగు వరుస దొంగతనాలు జరిగాయి. శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 20259లోu ఆ ఉపాధ్యాయులను అరెస్టు చేయండి ● నర్సాపూర్ పోలీసులకు ఎస్పీ ఆదేశం నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్మీనా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిపై వివరాలను ఎస్సై సాయికిరణ్ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వెంటనే వారు ఎక్కడ ఉన్నా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘హలో అన్న.. మీ నిజామాబాద్ల ఓట్లు ఎటేసిండ్రు.. ఎవరికి ఎక్కువచ్చేటట్లున్నయ్..? మా ఆదిలాబాద్లైతే ఎటూ చెప్పస్తలేదు. మెదక్, కరీంనగర్ల కూడా ఇట్లనే ఉన్నదట. టీచర్లదైతే పక్కా అయినట్లే కనిపిస్తున్నది కన్ని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీదే చెప్పస్తలేదని అంటున్నరు...’ ఇలా పోలింగ్ పూర్తయిన నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. తమ జిల్లానే కాదు.. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లోని తమ దోస్తులు, బంధువులకూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రులు, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ నమోదైంది. –నిర్మల్గతానికి భిన్నంగా.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరిగాయని చెప్పొచ్చు. సంబంధిత అధికారులకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని రంగంలోకి దిగిన అభ్యర్థులు ఓటర్ల ఎన్రోల్మెంట్ కోసం విశేష కృషిచేశారు. బలమైన ప్రత్యర్థులు ఉండటంతో అభ్యర్థులు ఎన్నికలతోపాటు ఎన్రోల్మెంట్ కోసమూ పోటీపడాల్సి వచ్చింది. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక టీమ్లను పెట్టుకున్నారు. ‘హలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్రోల్ చేయించుకున్నారా..!?’ అంటూ తరచూ ఫోన్లు చేస్తూ పట్టభద్రులు, టీచర్ ఓటర్లను పెంచే ప్రయత్నం చేశారు. ఈమేరకు గత ఎన్నికల కంటే ఓటర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఓటర్లుగా ఎన్రోల్ చేయించుకోవడమే కాకుండా.. ఈసారి ఓపికగా గంటలపాటు వరుసలో నిల్చోని మరీ తమ ఓటును వేశారు. క్యాస్ట్–క్యాష్ ఈక్వేషన్లో.. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కులం, డబ్బు బాగానే ప్రభావం చూపాయన్న చర్చ కొనసాగింది. పార్టీలు సైతం వీటి ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇందులో ఏపార్టీకి ఏది వర్కవుట్ అయ్యిందనే దానిపైనా లెక్కలు వేస్తున్నారు. అభ్యర్థులు, పార్టీలు మాత్రం ఎవరిది వారే గెలుపు ఖాయమన్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు కాస్త ముందు తెరపైకి వచ్చిన బీసీ నినాదం, బరిలో నిలువకుండా ఉన్న బీఆర్ఎస్ సహకారం, అభ్యర్థుల తీరుతెన్నులు, పార్టీలకు ఉన్న ఆదరణ వీటితో పాటు చివర్లో డబ్బులూ పోలింగ్పై ప్రభావం చూపినట్లు చాలామంది ఓటర్లు అంచనా వేస్తున్నారు. ఈసారి టీచర్ల ఎమ్మెల్సీ స్థానం కంటే పట్టభద్రుల స్థానంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. ఎమ్మెల్సీ పోలింగ్, కౌంటింగ్ భిన్నంగా ఉండటం, పట్టభద్రులు, టీచర్లు చదువుకున్నవారు కావడం, నియోజకవర్గాలు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండటంతో ఫలితాలపై పక్కాగా అంచనా వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. న్యూస్రీల్ఓట్లు ఎటుపడ్డయో..! జిల్లావ్యాప్తంగా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ కావడమూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఓట్లు ఎటుపడ్డాయోనని పోలింగ్ పూర్తయిన నుంచే లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా పోటీ చేసిన అభ్యర్థులు, వారి పార్టీల నేతలు తమ దగ్గరగా ఉండే వివిధ వర్గాల వారికి ఫోన్లు చేస్తూ.. ఓటింగ్ సరళిపై ఆరాతీస్తున్నారు. వారు చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటూ ఓట్ల లెక్కలపై అంచనా వేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో ‘ఎమ్మెల్సీ’ పోలింగ్ భారీగా పెరిగిన ‘గ్రాడ్యుయేట్స్’ టీచర్స్ ఓటింగ్ కూడా.. గత ఎన్నికలను మించి పోలింగ్ ఓట్లు ఎటు పడ్డాయంటూ ఆరాపెరిగిన పోలింగ్.. గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి 56.69శాతం ఓట్లు నమోదుకాగా, ఈసారి 72.59(నిర్మల్ డివిజన్–72.77 భైంసా డివిజన్–72.12)శాతం నమోదైంది. ఈలెక్కన ఈసారి పట్టభద్రులు ఏకంగా 15.9శాతం ఓటింగ్ను పెంచారు. ఉపాధ్యాయుల పోలింగ్శాతంతో పోలిస్తే మొత్తం ఓటర్లలో తక్కువగా నమోదైనా.. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం గణనీయంగా పెరిగింది. ఇక ఉపాధ్యాయుల స్థానానికి గత ఎన్నికల్లో 82 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి 89.27(నిర్మల్ డివిజన్–89.07 భైంసా డివిజన్–89.73)శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే మరో 7.27శాతం ఓటింగ్ పెరగడం గమనార్హం. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ అందులో దాదాపు 90 శాతం పోల్ అవ్వడంపై ఉపాధ్యాయ, అధికారవర్గాలూ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. -
కులాంతరం.. అందని ప్రోత్సాహం
● నర్సాపూర్(జి) మండలానికి చెందిన ఓ వ్యక్తి 2022, మార్చి 23న కులాంతర వివాహం చేసుకున్నారు. అదే ఏడాది మే 24న ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు దాటినా ప్రోత్సాహం అందలేదు. అధికారులను అడిగితే త్వరలోనే ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని చెబుతున్నారు. ● మామడ మండలానికి చెందిన రవి 2024లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -
మహిళా సాధికారతకు బ్యాంకుల చేయూత
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్చైన్గేట్: మహిళా సాధికారతకు బ్యాంకులు చేయూత అందిస్తున్నాయని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు. ఫైజాన్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేలా, అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ఈ 2కే రన్ ర్యాలీ సాగింది. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బ్యాంకుల ద్వారా మహిళలు అన్నిరంగాల్లో పరిపుష్టి సాధించడమే అన్నారు. ఆయా పథకాలకు, రుణాలకు అర్హులైన మహిళలందరూ వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలన్నారు. మహిళలకు సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల పథకాలపై అధికారులు మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. స్వయం సంఘాలకు చేయూతనివ్వడానికి ఎన్నోరకాల పథకాలు ఉన్నాయని, మహిళా సాధికారిత సాధించడానికి ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలు, ట్రాన్స్ జెండర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సుభాష్, వెనుకబడిన తరగతుల అధికారి రాజేశ్వర్గౌడ్, సీడీపీవో నాగలక్ష్మి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అశోక్కుమార్, మహిళలు, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
● మూడు దశల్లో నిర్వహణ ● సద్వినియోగం చేసుకుంటే మేలునిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 3 దశల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. నూతనంగా నియమితులైన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు శిక్షణ అందించనున్నారు. మూడు రోజులు తరగతులు.. ఎస్టీటీ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు మార్చి 4, 5, 6 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, పీఈటీలకు మార్చి 10, 11, 12 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలను విద్యాశాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. శిక్షణ అంశాలు ఇవీ.. ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతిగది నిర్వహణ, విద్య అభ్యసన ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్ఎస్సీ, బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పగడ్బందీగా అమలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రతీరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం అందజేస్తారు. నిధులు విడుదల.. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా మొత్తం 288 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటీలు 204 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు 57, భాషా పండితులు 03, పీఈటీలు 04 మంది నియామకమయ్యారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయునికి రూ.775 చొప్పున మొత్తం జిల్లాకు రూ.2.23 లక్షలు కేటాయించారు. అదేవిధంగా ఒక్కో కేంద్రానికి అదనంగా రూ.వెయ్యి విడుదలయ్యాయి. ఒక్కో శిక్షణ కేంద్రంలో గరిష్టంగా 40 నుంచి 45 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు అందించే శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. తరగతుల్లో విద్యార్థులకు బోధించే విధానాన్ని విద్యార్థులతో అవలంబించాల్సిన పద్ధతులను శిక్షకులు నేర్పిస్తారు. డిజిటల్ బోధన, అభ్యసన ప్రమాణాల పెంపు, ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలపై వివరిస్తారు. కొత్త ఉపాధ్యాయులకు ఈ శిక్షణ తరగతులు ఎంతో వరం లాంటివి. విద్యార్థుల్లో విద్య ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తాయి. – రామారావు, డీఈవోశిక్షణ పొందే ఉపాధ్యాయుల వివరాలు భాషా పండితులు 03 పీఈటీలు 04 ఎస్జీటీలు 204 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 20 స్కూల్ అసిస్టెంట్లు 57 మొత్తం 288 -
జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ట్రిపుల్ఐటీ విద్యార్థి
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థి కె.వెంకటేశ్ జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు హర్యానాలోని కలింగలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థి జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై ఇన్చార్జి వీసీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపిక కాగా, అందులో అందులో ఆర్జీయూకేటీ విద్యార్థి ఉండడం గర్వకారణమని తెలిపారు. అభినందించిన వారిలో స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్రావు, ఫిజికల్ డైరెక్టర్ శ్యాంబాబు, పీటీలు ఉన్నారు. వెంకటేశ్ -
సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్లు
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్లు అందుబాటులోకి రానున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్య అమల్లో భాగంగా చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే పీఎంశ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలకు మొదటి విడతలో కంప్యూట ర్లు, యూపీఎస్, ఇన్వర్టర్లు మంజూరు చేయగా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చేందుకు కసర త్తు పూర్తయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యా బ్ల ద్వారా బోధన చేయనున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్లను త్వరలోనే సరఫరా చేయనున్నారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాంసంగ్ ఏ7 లైట్(ఎస్ఎం–టీ225) ట్యాబ్లు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 చొప్ప్పున 1350 ట్యాబ్లు మొదటి విడతలో మంజూరయ్యాయి. త్వరగా ట్యాబ్లను విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేలా బోధన చేయనున్నారు.జిల్లా పాఠశాలలు ట్యాబ్లు ఆదిలాబాద్ 13 325 ఆసిఫాబాద్ 10 250 మంచిర్యాల 16 400 నిర్మల్ 15 375 -
పోలింగ్ ప్రశాంతం
నిర్మల్: ఉపాధ్యాయులు ఓటెత్తారు.. పట్టభద్రులు పోటెత్తారు. మొత్తం మీద రికార్డుస్థాయిలో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 46పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 8గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. చాలా కేంద్రాల్లో పోలింగ్ మందకొడిగా సాగడంతో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. పలు కేంద్రాల్లో పోలింగ్ నెమ్మదిగా సాగడంపై పలువురు పట్టభద్రులు, టీచర్లు అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. దివ్యాంగులతో సహా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సహకరించారు. మందకొడిగా ప్రారంభమై..ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8గంటలకే ప్రారంభమైంది. ఒకరోజు ముందు శివరాత్రి పర్వదినం ఉండటం పోలింగ్పై కాస్త ప్రభావం చూపింది. పర్వదినాన రాత్రంతా జాగారం, ఉదయాన్నే ఉపవాసాలు వీడటం క్యాక్రమాలు ఉండటంతో చాలామంది ఉదయం వేళల్లో రాలేదు. 10గంటల తర్వాత నుంచే క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కేంద్రాల్లో బారులు తీరారు. అధికారులు ప్రతీ రెండు గంటలకోసారి ఓటింగ్శాతాన్ని వెల్లడించారు. ‘ఉపాధ్యాయ’ ఉత్సాహంపట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో 17,141మంది పట్టభద్రుల ఓటర్లుండగా 12,442 మంది ఓటేశారు. పోలింగ్ 72.59శాతంగా నమోదైంది. టీచర్లతో పోలిస్తే గ్రాడ్యుయేట్స్ కాస్త నిరాశపర్చారు. జిల్లాలో 1,966 మంది మాత్రమే ఉన్న ఉపాధ్యాయులు ఉత్సాహంగా కనిపించారు. 1,755 మంది ఓటు వేయగా 89.27శాతంగా పోలింగ్ నమోదు కావడం విశేషం. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థితో పాటు పట్టభద్రుల అభ్యర్థికీ ఉపాధ్యాయులు ఓటేశారు. రెండు పోలింగ్బూత్లు వేర్వేరు చోట్ల ఉన్నా.. రెండుచోట్లకు వెళ్లి, దాదాపు గంటకు పైగా లైన్లలో ఓపికతో వేచి ఉండి మరీ ఓటేశారు. ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా చాలామంది మధ్యాహ్నం వేళలోనే ఓటు వేయడానికి వచ్చారు. ఉపాధ్యాయ సంఘాల హల్చల్రాజకీయంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సందడిగా ఉంటాయి. కానీ.. జిల్లాలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల కన్నా.. ఉపాధ్యాయ సంఘాలే హల్చల్ చేశాయి. పార్టీ నాయకుల కన్నా ఈ సంఘాల నేతల సందడి కనిపించింది. ఓటర్లను గుర్తించడం, వారిని ఓటు వేసేందుకు రప్పించడంలో సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకే ఉపాధ్యాయ పోలింగ్శాతం అధికంగా నమోదైంది. ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు టెంట్లు వేసుకుని మరీ కూర్చున్నాయి. సంఘాల వారీగా ఓటర్లకు తమ మద్దతు ఉన్న అభ్యర్థిని గెలిపించాలంటూ నూరిపోశాయి. ఇక పట్టభద్రుల స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల స్థానిక నాయకులు అండగా నిలిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఓటర్లను రప్పించడం, ఓటేయించడం చేశారు. బీఎస్పీ నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి బరిలో ఉన్నా.. వారికి సంబంధించిన నేతలు పెద్దగా కనిపించలేదు. ఓటేసిన ముఖ్యులు..జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో, డీసీసీ అ ధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు మామడ ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో ఓటు వేశారు. బీఎస్పీ టీచర్ ఎ మ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న, స్వతంత్ర అ భ్యర్థి నంగె శ్రీనివాస్ జిల్లాకేంద్రంలో ఓటేశారు. బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ ఆదిలాబాద్ జి ల్లా ఉట్నూర్లో ఓటు వేయగా, బీజేఎల్పీ నేత మ హేశ్వర్రెడ్డి హైదరాబాద్లో ఉండటం గమనార్హం. కేంద్రాలను పరిశీలిస్తూ.. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చే యడానికి యంత్రాంగమంతా శ్రమించింది. ప్రధానంగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ ష ర్మిల తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు వి జయవంతం చేశారు. కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 89.27 శాతం నమోదైన పోలింగ్ పట్టభద్రుల స్థానానికి 72.59 శాతం కేంద్రాలను పరిశీలించిన అధికారులుఓటేసిన అంధుడు నర్సాపూర్(జి): అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా ఓటు వేయడానికి కొందరు పట్టభద్రులు బద్ధకిస్తుంటారు. అంధుడైన పట్టభద్ర ఓటరు చెల్లెలి సహకారంతో ఓటు వేసి ఆదర్శంగా నిలిచాడు. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఎడ్దూర్ ప్రవీణ్కుమార్ దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనను విధులకు తీసుకొచ్చి తీసుకెళ్లే తండ్రి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓటు వేయాలనే సంకల్పంతో ప్రవీణ్కుమార్ చెల్లెలు సహాయంతో మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. చూపులేకపోయినా తన చెల్లెలు సాయంతో వచ్చి ఓటేసిన ప్రవీణ్కుమార్ను పలువురు అభినందించారు. పోలీసుల పనితీరు భేష్ : ఎస్పీనిర్మల్టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాశ్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు ప్రేమ్కుమార్, మల్లేశ్, ప్రవీణ్కుమార్, ఆర్ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు. -
న్యూస్రీల్
నేడు నేత్ర వైద్యశిబిరం నిర్మల్చైన్గేట్: హైదరాబాద్కు చెందిన గ్లోబ ల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు పరీక్షించి అవసరమైనవారికి ఉచి తంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు శుక్ర, శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కస్బా హైస్కూల్, ఎస్జీటీ తెలుగు మీడియం ఉపాధ్యాయులకు గాజుల్పేటలోని పంచశీల్ బీఎడ్ కాలేజీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
‘నయనం’ ప్రధానం
● విద్యార్థి దశలోనే దృష్టి లోపాలు ● ఆర్బీఎస్కే స్కీం కింద పరీక్షలు ● జిల్లాలో 1,578 మందికి సమస్య ● త్వరలో వీరికి కళ్లద్దాల పంపిణీనిర్మల్చైన్గేట్: ఒకప్పుడు వయస్సు మీరిన వారికి వచ్చే కంటి సమస్యలు ఇప్పుడు చిన్నారులకూ వస్తున్నాయి. పోషకాహార లోపం, సెల్ఫోన్ వినియోగం, ఎక్కువ సమయం టీవీలు చూడడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల శ్రేయస్సు కోసం రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బీఎస్కే) కార్యక్రమం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత నేత్రపరీక్షలు నిర్వహిస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్యారోగ్య శాఖ, ఆర్బీఎస్కే కార్యక్రమం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య నిపుణుల బృందాలు పాఠశాలల్లో ఇప్పటివరకు 46,453 మందికి స్క్రీనింగ్ చేశాయి. మూడు విడతల్లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో 1,578 మంది పిల్లలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొంతమంది దూరపు చూపు, మరికొందరు దగ్గరి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మెజార్టీ పిల్లలు కనీసం అక్షరాలు చదవలేకపోతున్నట్లు తేల్చారు. అతుక్కుపోతున్నందునే..పాఠశాలల నుంచి ఇంటికి చేరిన వెంటనే చాలామంది పిల్ల లు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వీడియో గేమ్లు ఆడుతున్నారు.. కార్టూన్ సీరియళ్లు చూస్తున్నారు. హోం వర్క్ కంటే వీటిపైనే అధికంగా దృష్టి సారిస్తుండడంతో చిన్న వయసులోనే సోడాబుడ్డి లాంటి కంటి అద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తప్పనిగా సెల్ఫోన్ వినియోగంవైపు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. అదికాస్త అలవాటుగా మారి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ఆస్పత్రులకు తరలించి..మసక చూపుతో బాధపడుతున్న నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన పిల్లలను జిల్లా జనరల్ ఆస్పత్రి, ముధోల్ నియోజకవర్గానికి చెందిన పిల్లలను భైంసా ఏరియాస్పత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 80–100 మంది విద్యార్థులకు మూడో విడత చెకప్ చేస్తున్నారు. వీరిలో కంటి అద్దాలు అవసరమైన వారికి నిర్ధారించిన సైట్ పర్సంటేజీ, ఫ్రేమ్లు, అద్దాలకు ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. వార్షిక పరీక్షల ప్రారంభానికి ముందే వీరికి అద్దాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1,578 మంది విద్యార్థులకు సంబంధించి అద్దాలకు ఆర్డర్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.పరీక్షలు నిర్వహిస్తున్నాం వైద్యశిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు తిరిగి పరీక్షలు చేయిస్తున్నాం. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు భైంసా ఏరియాస్పత్రిలో కంటి వైద్యశిబిరం కొనసాగుతుంది. – శ్రీనివాస్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి సమస్యలకు కారణాలివే.. కంటి సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విటమిన్ ‘ఏ’ కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందుకు పిల్లలకు పాలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు రోజువారీ ఆహారంలో ఇవ్వాలి. సెల్ఫోన్లు, టీవీలు చూసినపుడు వాటి స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కిరణాలు పిల్లల కంటిపై పడి దృష్టిలోపం రావడానికి కారణమవుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం కూడా కంటి సమస్యలకు కారణం కావచ్చు. ఎంత చిన్న కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులకు చూపించాలి. – సురేశ్, సీనియర్ నేత్ర వైద్యుడు -
కాయిన్ కొడితే..కప్ పడాల్సిందే
● క్యారమ్స్లో రాణిస్తున్న సింగరేణి క్రీడాకారుడు ● కోలిండియా పోటీల్లో గోల్డ్మెడల్స్ శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిలోనే కాదు ఆటల్లో తమకు తామే సాటి అంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రేణికుంట్ల సృజన్రావు క్యారమ్స్లో జాతీయస్థాయి పోటీల్లో రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బోర్డుపై కూర్చొని కాయిన్స్ కొడితే కప్ తన ఖాతాలో పడాల్సిందే అంటున్నాడు. తనదైన ఆట తీరుతో పలు బహుమతులు సాధించాడు. ఈయన 2020లో కారుణ్య కింద సింగరేణిలో ఉద్యోగంలో చేరారు. సింగరేణిలో రాకముందే ఆయనకు ఈ ఆటపై పట్టుంది. హైస్కూల్ లెవల్ నుంచే క్యారమ్స్పై పట్టు సాధించాడు. ఇంటర్, డిగ్రీలో తన ఆటకు మరింత పదును పెట్టాడు. కళాశాల స్థాయిలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. నిజామాబాద్లోని భీంగల్, హైదరాబద్లోని ఖైరతాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు అందుకున్నాడు. జాతీయస్థాయిలో పోటీల్లో.. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆలిండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీల పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు సాధించాడు. 2024 మార్చిలో ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో సెమీస్ వరకు వెళ్లాడు. అదే ఏడాది మధ్యప్రదేశ్లోని సింగరోలిలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 జనవరిలో జార్జండ్లోని రాంచీలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఈ పోటీల్లో సింగరేణి జట్టు టీం ఛాంపియన్ సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రోత్సహిస్తే శిక్షణ ఇస్తాను కంపెనీ మరింత ప్రోత్సాహిస్తే నేను మెరుగ్గా ఆడటమే కాకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చే స్తాను. కంపెనీ క్లబ్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఉద్యోగులతో పాటు వారి పిల్లలకు ఆట నేర్పించాలని ఉంది. ఈ ఆటలో మహిళలు తక్కువగా ఉన్నారు. పోటీ లేనందున వారు నేర్చుకుంటే సులువుగా రాణించగలుగుతారు. జాతీయ స్థాయిలో పాల్గొంటే చాలు బ్యాంకుల్లో తదితర సంస్థల్లో పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. – సృజన్రావు -
గణితం..
గణితం అంటే విద్యార్థులు భయపడుతారు. ప్రణాళిక ప్రకారం చదివితే గణితంలో సులువుగా మార్కులు సాధించవచ్చని నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. వాస్తవ సంఖ్యలు: సంయుక్త సంఖ్యలను ప్రధాన కారణాంకల లబ్దంగా రాయడం, యూక్లిడ్ భాగాహార న్యాయం ఆధారంగా గాసాభా కనుగొనడం, ధన బేసి, సరిసంఖ్య రూపం, కరణీయ సంఖ్య అని చూపడం, సంవర్గమనం, లాఘరిథమ్స్ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సమితిలు: శూన్య, వియుక్త సమితి నిర్వచనాలు, సమితి నిర్మాణ, జాబితా రూపం రాయడం, వీటికి ఉదాహరణలు సమితి సమ్మేళనం, చేదనము సమస్యలను సాధించడం, వెన్ చిత్రాలను గీయడం ప్రాక్టీస్ చేయాలి. బహుపదులు: బహుపది శూన్య విలువలు కనుగొనడం, గ్రాఫ్ నుంచి శూన్యాలను చెప్పడం, వర్గ, ఘన బహుపదుల శూన్యాలు కనుగొనాలి. వర్గ సమీకరణాలు: విచక్షిని కనుగొని మూలాల స్వభావం చెప్పడం, ఆల్ఫా, బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం రాయడం, రాత సమస్యలకు వర్గ సమీకరణం రాసి గ్రాఫ్ ద్వారా శూన్యాలు కనుగొనాలి. చర రాశుల్లో రేఖీయ సమీకరణాలు: సంగతా, అసంగతా, పరస్పర ఆధారిత సమీకరణాలు ఎలా అవుతాయి, వీటిని కనుగొనడం, సమీకరణాలను చరరాశిని తొలగించడం, ప్రతిక్షేపన పద్ధతి, గ్రాఫ్ పద్ధతుల ద్వారా సాధించాలి. సరూప త్రిభుజాలు: ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి అనువర్తన సమస్యలు, సరూప త్రిభుజాలు నిర్మాణాలు గీయడం. శ్రేడులు: అంక,గుణ శ్రేడుల్లో మొదటి పదం, సామాన్య భేదం, నిష్పత్తులను కనుగొనడం, అంక శ్రేడీలో N వ పదం, N పదాల మొత్తం సంబంధించి సమస్యలు సాధించాలి. సాంఖ్యక శాస్త్రం: ముడి దత్తాంశం ఇచ్చి సగటు, మధ్యగతం, భాహులకాం కనుగొనడం, సగటు, మధ్యగతం, బాహులకం సూత్రం రాసి అందులో పదాలను వివరించాలి. వర్గీకత దత్తాంశానికి సగ టు, మధ్యాగతం, బాహులకం కనుగొనాలి. ఓజీవ్ వక్రాలను గీయడం వంటి వాటిపై సాధన చేయాలి. -
సూర్యాపూర్లో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని సూర్యాపూర్లో గురువారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్, కరీంనగర్తోపాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మల్లయోధులు పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు రూ.6100 నగదు, వెండి కడియం బహూకరించి సన్మానించారు. రెండో విజేతకు రూ.3 వేల నగదు అందజేసి సత్కరించారు. ఎస్సై సీహెచ్ భాస్కరాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు వెంగల్రావు, రాజరాజేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీసీసీ నస్పూర్కు చెందిన వొంటెల సత్యనారాయణరెడ్డి వద్ద 2017లో కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మ్యాకల సత్యనారాయణరెడ్డి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సమయంలో చెక్కులు ఇచ్చాడు. ఒప్పంద ప్రకారం తీసుకున్న అప్పు చెల్లించే గడువు తీరింది. ఆ తర్వాత బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. 2019లో కోర్టులో చెక్బౌన్స్ కేసు వేశాడు. విచారణలో భాగంగా సాక్ష్యాదారాలు పరిశీలించి నేరం రుజువు కావడంతో మ్యాకల సత్యనారాయణరెడ్డికి ఏడాది సాధారణ జైలుశిక్షతోపాటు తీసుకున్న అప్పు రూ.8 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. దాడి కేసులో ఒకరికి జరిమానా మంచిర్యాలక్రైం: పాత మంచిర్యాలకు చెందిన ఈద శ్రీనివాస్పై దాడి చేసిన కేసులో రావుల రాజ్కుమార్కు రూ.10వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. సీఐ ప్రమోద్రావ్ కథనం ప్రకారం..శ్రీనివాస్కు చెందిన బ్యాంకు అటాచ్డ్ ఉన్న బజాజ్ ఫైనాన్స్లో రాజ్కుమార్కు నెల వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు రూ.30 వేల వాషింగ్ మిషన్ ఇప్పించాడు. వాయిదాలు సకాలంలో చెల్లించలేదు. 2021 జూన్ 19న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదుతో రాజ్కుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాదారాలు పరిశీలించి తర్వాత నేరం రుజువుకావడంతో రాజ్కుమార్కు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
గోదావరి నదికి హారతి
బాసర: మహాశివరాత్రి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో సనాతన వేదభారతి పీఠం, వ్యవస్థాపకుడు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున గోదావరి నదికి హారతి ఇచ్చారు. గంగమ్మ తల్లి, శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్యారు. అనంతరం వారికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాపహరేశ్వర ఆలయంలో.. బాసరలోని శ్రీ పాపహరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శివరాత్రిరోజు ఉపవాసం ఉండి భిక్షను స్వీకరించారు. అర్చకుడు నాగేష్ అప్పా తదితరులు ఉన్నారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
దిలావర్పూర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని మాడేగాం అనుబంధ గ్రామమైన కదిలికి చెందిన ధానూర్ పాపన్న (34) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి పాపాన్న.. ఆలయానికి వెళ్తాడని కుటుంబ సభ్యులు భావించారు. వెళ్లకుండా ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం భార్య గంగాసాగర, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు 10 సంవత్సరాల లోపు కుమారులు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి జాలరి మృతిదిలావర్పూర్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని జాలరి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సముందర్పల్లి అనుబంధ గ్రామమైన కాండ్లికి చెందిన కొత్తూరు భోజన్న (59) గురువారం ఉదయం గ్రామానికి ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ వద్ద చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో వల చుట్టుకుని మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని దిలావర్ఫూర్ ఎస్సై సందీప్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బోథ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సొనాల మండల కేంద్రానికి చెందిన బొంపాల పోశెట్టి చేనులో పనినిమత్తం బుధవారం అదే గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం పోశెట్టి బైక్పై ఇసాక్తో సొనాల గ్రామానికి వస్తున్నారు. సాయంత్రం టివిటి క్రాస్రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా ఢీకొట్టింది. పోశెట్టి వెనకాల కూర్చున్న ఇసాక్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య షాహినాజ్ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనాథ శవానికి అంత్యక్రియలు●బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అనాథ శవానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. పల్లపు రాజు (44) బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో గత కొంతకాలం నుంచి రోడ్డుపై పడేసిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుని జీవనం సాగిస్తూ రోడ్డుపై నిద్రిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రామకృష్ణ థియేటర్ ముందు రోడ్డుపై రాజు అకస్మికంగా పడిపోయాడు. గమనించిన మహిళ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే టూటౌన్ కానిస్టేబుల్ రాజీవ్ రతన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలికి చేరుకుని రాజును పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మద్యం తాగడంతో రాజు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు, మున్సిపల్ సిబ్బందిని ఎస్సై మహేందర్ అభినందించారు. -
కావడి పడితేనే తాగునీరు..
దహెగాం: మండలంలోని చిన్నఐనం గ్రామంలో తాగునీటి తీవ్రమైంది. మిషన్ భగీరథ పైపులైన్ సమస్య కారణంగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామంలోని మూడు వాడలకు రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రోజురోజుకు ఎండలు తీవ్రం అవుతుండడంతో గ్రామస్తులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. గ్రామానికి అర కిలోమీటరు దూరంలోని ఒర్రె నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గురువారం గ్రామానికి చెందిన వృద్ధుడు ఏమ రాజయ్య కావడిలో బిందెలతో నీరు తెచ్చుకుంటుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. -
జీవశాస్త్రం
జీవశాస్త్రంలో పాఠాలను అర్థం చేసుకుని చదవాలని నిర్మల్ జిల్లా పార్పెల్లి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గంగ సురేష్ తెలిపారు. ● పోషణ అనే పాఠ్యాంశంలో ఆకుల్లో పిండి పదార్థాలు కలవని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాకై ్సడ్ అవశ్యకత, హైడ్రిల్లా, నల్ల కాగితం ప్రయోగం, విటమిన్లు తెలిపే పట్టిక, జీర్ణ వ్యవస్థను సూచించే ఫ్లో చార్ట్, హరిత రేణువు, అమీబా–పోషణ పటం భాగాలు, స్వయం పోషణ– పరపోషణ, కాంతి చర్య–నిష్కాంతి చర్య మధ్య గల భేదాలు చదవాలి. ● శ్వాసక్రియలో ఈస్ట్తో అవాయు శ్వాసక్రియ ప్రయోగం, కార్బన్డయాకై ్సడ్ ఉష్ణోగ్రత విడుదలయ్యే ప్రయోగం, వాయుగోని పటం–భాగాలు, మైటో కాండ్రియా పటం వంటివి చదవాలి. ● ప్రసరణలో పేరు పీడనం ప్రయోగం వ్యాసరూప ప్రశ్న వేసే అవకాశం ఉంది. హృదయం అంతర్నిర్మాణం–పటం భాగాలు ఏకవలయ– ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ బేధాలు తెలపడంలో ధమనులు–సిరలు, సిస్టోల్–డయస్టోల్, దారువు–పోషక కణజాలం మధ్య గల భేదాలు గుర్తించి అవగాహన చేసుకోవాలి. ● విసర్జన అనే పాఠ్యాంశంలో నెఫ్రాన్ నిర్మాణం వ్యాసరూప ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. ఇతర జీవుల్లో విసర్జన అవయవాలు– అల్కలైడ్ మొక్క పేరు– ఉపయోగాలు పట్టిక, మానవ మూత్రపిండం అడ్డుకోత పటం–భాగాలు బేధాల, విసర్జన– స్రావం మధ్య గల భేదాలు చూసుకోవాలి. ● వనపర్తి వడ్డిచెర్లలోని నీటి వనరుల పరిస్థితి గురించి సమాచార పట్టికలు, కొత్తపల్లిలో నీటి యాజమాన్యంపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే అడవుల సంరక్షణపై సమాధానాలు రాయాలి. ● హార్మోన్ల పేర్లు, వాటి ప్రభావం, ఫైటో హార్మోన్లు–ఉపయోగాలు, సమాచార పట్టిక, మానవ మెదడు పటం–భాగాలు తదతర వాటిపై అవగాహన చేసుకోవాలి. ● ప్రత్యుత్పత్తి పాఠ్యాంశంలో మానవ శుక్రకణం పటం–భాగాలు, సీ్త్ర, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పటం–భాగాలు, పుష్పము పటం– భాగాలు, అండం నిర్మాణం పటం, భాగాలు, భేదాలను చదవాలి. ● ఆమ్లం పత్ర ప్రయోగం సమాచార పట్టికలు, బోలాస్–కై మ్, మాస్టిఫికేషన్–రూమినేషన్ మధ్య గల భేదాలు, అంత్ర చూశకం పటం–భాగాలు చూసుకోవాలి. ● అనువంశికత–పరిణామంలో డార్విన్ సిద్ధాంతం, లామార్కు వాదం, లింగ నిర్ధారణ, ఏక సంకరీకరణ, ద్విసంకరీకరణ వివరణ భేదాలను తెలుసుకోవాలి. ● ఆహారపు గొలుసులు, ఆహారపు, జాలకం జైవిక వృద్ధి కరణ, శక్తి పిరమిడ్ సంఖ్య, పిరమిడ్, విషపూరిత పదార్థాల వాడకం వల్ల జరిగే ప్రభావం ఏంటో చదవాలి. -
భౌతిక, రసాయన శాస్త్రం..
భౌతిక, రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే పాఠాలను అర్థం చేసుకోవాలని లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్బాబు తెలిపారు. ● పుటాకార దర్పణాల, కుంభకారా దర్పణాల కిరణ చిత్రాలు బాగా సాధన చేయాలి. ● తుల్య రసాయన సమీకరణాలకు సంబంధించిన సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. ● ఆమ్లా, క్షారాలా పీహెచ్ విలువలు గుర్తుంచుకోవాలి. ● దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి గురించి వేసే ప్రశ్నలపై సమాధానాలు రాయాలి. ● 20 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసి ఉండాలి. ● పౌలీ వర్జన నియమం, ఆఫ్ బౌ నియమం, హుండ్ నియమం చదువుకోవాలి. ● ఆధునిక అవర్తన పట్టిక ధర్మాలు ప్రతిసారి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ● లోహ శాస్త్రంలో ఖనిజాలు, దాతువులు వాటి ఫార్ములాలు తెలిసి ఉండాలి. ● కర్బన రసాయన శాస్త్రంలో అల్కేన్, అల్కీ న్, ఆల్కైన్ల మధ్య భేదాలు తెలిసి ఉండా లి. నామీకరణ సూత్రాలు చదువుకోవాలి. -
ఏజెన్సీ అలవెన్స్లు..పట్టణాల నుంచి రాకపోకలు
కాసిపేట: రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏజెన్సీ అలవెన్స్ అందిస్తున్నా స్థానికంగా ఉండకపోవడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మండలంలోని లంబాడీతండా, కాసిపేట, ముత్యంపల్లి, ధర్మరావుపే ట, దేవాపూర్ జెడ్పీ పాఠశాలలు, మోడల్, కేజీబీ వీ, రేగులగూడ, మల్కేపల్లి, దేవాపూర్ గిరిజన ఆ శ్రమ పాఠశాలలుండగా సుమారు 100 మంది వ రకు టీచర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మండలంలో 16 మంది టీచర్లు ఓటరుగా నమోదు చేసుకోగా, ఇందులో 10 మంది ఈ మండలానికి చెందిన ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవా రే. మిగతా ఆరుగురు కాసిపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే స్థాని కులు ఆరుగురే ఓటర్లుగా నమోదు చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అంటే తొంబై శాతానికిపైగా టీచర్లు జిల్లా కేంద్రం, ఇతర దూరప్రాంతాల నుంచి వస్తూ ఏజెన్సీ అలవెన్స్లు పొందుతున్నారు.ఎస్ఏల పరిస్థితి ఇలా ఉంటే ఎస్జీటీలు, ఉద్యోగులు, అధికారులు కూడా 85 శాతానికి పైగా ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్నవారే కావడం గమనార్హం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జాబితా చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నా రు. ఏజెన్సీ అలవెన్స్లు పొందుతూ ప ట్టణప్రాంతాల నుంచి రావడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు. -
క్లుప్తంగా
చెరువులో యువకుడి మృతదేహం లభ్యంఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలోని ఖానా పూర్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్ట ణంలోని ఖానాపూర్కు చెందిన పిట్ల సాయికుమార్ (29) ఈనెల 22న ఇంటి నుంచి బ యటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబీకులు 25న అదృశ్యమైనట్లు ఫిర్యా దు చేశారు. గురువారం ఖానాపూర్ చెరువులో మృతదేహం నీటిపై తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధి తిమ్మాపూర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని ఆరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రదీప్ ఇంట్లో బుధవారం రాత్రి దాడి చేసి 11 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ.38,290 నగదు, నాలుగు బైక్లు, ఒక కారు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన రవితేజను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న గోల్డెన్ కార్తీక్, ప్రణీ త్, సాయికిరణ్లపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలి పారు. ఈముగ్గురు నిందితులతో సంబంధాలు ఉండి అల్లర్లకు పాల్పడిన ఆరుగురిని ఆది లాబాద్ అర్బన్ తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఆటోబోల్తా: ఒకరికి గాయాలుముధోల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ముధోల్–భైంసా ప్రధాన రహదారిపై గురువారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా నయాగావ్ గ్రామానికి చెందిన నాగేష్ తన ఆటోలో పని నిమిత్తం భైంసాకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు గమనించి 108లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. నాగేష్ మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
సాంఘిక శాస్త్రం..
సమకాలీన అంశాలపై పట్టు, విశ్లేషణాత్మక ధోరణి ఉంటే సాంఘిక శాస్త్రంలో విజయం తథ్యమని నిర్మల్ జిల్లా గుండంపెల్లి ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు అంటున్నాడు. ● బట్టీ పద్ధతిని వదిలేసి పాఠాలను అర్థం చేసుకోవాలి. ● దేశంలోని నదులు, పీఠభూములు, ఎత్తైన శిఖరాలు, పర్వత శ్రేణులు, తీర ప్రాంతాలు, ప్రధాన నగరాలు, ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణ, భూగర్భ జల సమస్యలు తదితర అంశాలపై అవగాహన చేసుకోవాలి. ● గ్రాఫ్లు పట్టికలు, పై చార్ట్లు విశ్లేషణాత్మక ధోరణిలో రాయాలి. ● ప్రపంచ పటంలో మిత్ర రాజ్య కూటమి దేశాలు, అక్షరాజ్య కూటమి దేశాలు, నినాదాలు, కరపత్రం తదితర వాటి గురించి తెలుసుకోవాలి. ● ప్రతీ సిలబస్లో ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకుని చదవాలి. బిట్ పేపర్లో వచ్చే 20 మార్కులను సులభంగా సాధించవచ్చు. ● ప్రశ్నప్రత్రంలో ముందుగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం
● ఎస్పీ జానకీ షర్మిల ● పోలీస్ అధికారులతో సమావేశంనిర్మల్టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పే ర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎన్నికల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 224 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 (144) సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల ప రిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నా రు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్ల యితే వారి సమాచారం ‘డయల్ 100’కు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు నవీన్కుమార్, సైదారావు, ప్రేమ్కుమార్, నైలు, గోపీనాథ్, ప్రవీణ్కుమార్, మల్లేశ్, కృష్ణ, ఆర్ఐలు రామ్నిరంజన్, రమేశ్, రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం సందర్శన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలోగల ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● 1,966 మంది ‘టీచర్స్’ ఓటర్లు ● 17,141 మంది పట్టభద్రులు.. ● పోలింగ్ సెంటర్లకు చేరిన సిబ్బందినిర్మల్చైన్గేట్: జిల్లాలో నేడు నిర్వహించనున్న ఎ మ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది బరిలో ఉన్నారు. జిల్లాలో 1,966 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,141 మంది పట్టభద్రుల ఓటర్లుండగా 27 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామగ్రితో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సామగ్రిని అప్పగించారు. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్లకు చేర్చనున్నారు. సమస్యలుంటే తెలుపాలి ● కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పైఅధికారులకు సమాచారం అందివ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, అదనపు ఎస్పీలు రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమాచారం టీచర్స్ అభ్యర్థులు : 15 పట్టభద్రుల అభ్యర్థులు : 56 జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు : 46 నిర్మల్ డివిజన్లో.. : 31 భైంసా డివిజన్లో.. : 15 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు : 27 టీచర్ పోలింగ్ కేంద్రాలు : 19 మోడల్ కోడ్ కండక్ట్ టీం : 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ : 4 వీఎస్టీ: 2 ప్రిసైడింగ్ అధికారులు : 37 పోలింగ్ సిబ్బంది : 148 సూక్ష్మ పరిశీలకులు : 26 నోడల్ అధికారులు : 19 జోనల్ అధికారులు : 10 -
ఆగస్త్యకూడం అధిరోహించిన చెన్నూర్ యువకుడు
చెన్నూర్: పట్టణానికి చెందిన యువకుడు మంచాల సూరజ్.. ఆగస్త్యకూడం (శిఖరం) అధిరోహించాడు.మంచాల రాజబాపు– పద్మజ దంపతుల కుమారుడు సూరజ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కేరళలోని తిరువనంతపురానికి 60 కి.మీ దూరంలో ఆగస్త్యకూడం(శిఖరం) 50 మీటర్ల ఎత్తును మూడురోజుల్లో ట్రెక్కింగ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ట్రెక్కింగ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. శిఖరానికి ఆగస్త్య మహాముని పేరు పెట్టడంతో ఇది ప్రసిద్ధి చెందిన తీర్థయాత్రగా పేరొంది. యాత్ర చేపట్టేవారికి కేరళ ప్రభుత్వం ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేసిన సూరజ్ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. -
అప్పుల బాధతో ఒకరు..
దస్తురాబాద్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గోండుగూడ గ్రామానికి చెందిన నామెల్లిపురుక జగన్(45), రాధ దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. ఆయనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం జగన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పలువురి వద్ద చేసిన అప్పులు చేసి మద్యం తాగేవాడు. అప్పలు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆ సమయంలో భార్య రాధ పక్కింట్లోకి వెళ్లి తిరిగివచ్చింది. అప్పటికే పురుగుల మందు తాగిన జగన్ భార్యతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నోట్లో నుంచి నురుగులు కక్కడంతో 108 సిబ్బందికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గమనించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి: మద్యానికి బానిసై జల్సాల కోసం అప్పు చేసిన యువకుడు తీర్చేమార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజేశ్వర్ కథనం ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం క్రాంతి (29) జులాయిగా తిరిగేవాడు. అడపాదడపా మంచిర్యాలకు చెందిన ఓ రియల్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తూ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మద్యం తాగేవాడు. అవివాహితుడైన క్రాంతి నెలక్రితం తల్లి దుర్గం వెంకటమ్మను బతిమిలాడటంతో ఆమె రూ.10 వేలు వేరే వ్యక్తుల వద్ద అప్పు అడిగి ఇచ్చింది. ఆ డబ్బులను తాగుడుకు ఖర్చు చేశాడు. మరోపక్క అప్పు ఇచ్చినవారు అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పు తీర్చేమార్గం లేక క్రాంతి సోమవారం అర్ధరాత్రి సుబ్బారావుపల్లి శివారు వైపు వెళ్లి గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్గం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని అనంతపూర్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో కోరెంగ హన్మంతు ఇల్లు దగ్ధమైంది. విద్యుత్ వైరు తెగి ఇంటిపై కప్పుపై పడటంతో మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి మంటలార్పేందుకు యత్నించారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ అక్కడికి చేరుకుని మంటలార్పివేసింది. తహసీల్దార్ శ్యాంసుందర్ ఆదేశాలతో మంగళవారం ఎంఆర్ఐ నూర్సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో రూ.2.50 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి, టీవీ, కూలర్, సోఫాసెట్, బెడ్స్, జొన్నలు, గోధుమ పంట, కందులు, బియ్యం, సర్టిఫికెట్లు కాలిపోయాయి. సుమారు రూ. 17 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ సోయం బాపురావ్ అక్కడికి చేరుకుని పరిశీలించి బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
యువకుడి దారుణహత్య
ఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ముగ్గురు కత్తితో ఆయన గొంతు కోసి పొడిచి చంపిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన కొమ్మవార్ రవితేజ (26) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం భోరజ్ మండలానికి చెందిన ప్రవళికతో వివాహమైంది. రవితేజ చిన్న వయస్సులోనే తండ్రి వదిలిపెట్టి మరో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం తల్లి భాగ్యశ్రీ మృతిచెందింది. కాగా రవితేజ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తిరిగిరాలేదు. పట్టణంలోని ఇందిరానగర్ దత్త మందిర్ సమీపంలో ముగ్గురు యువకులు గోల్డెన్ కార్తీక్, సిద్దూ, సాయికిరణ్ ఆతన్ని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ విషయం మృతుడి భార్యకు స్థానికులు తెలియజేయడంతో ఆమె ఘటన స్థలానికి చేరుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరైంది. మూడు రోజుల క్రితం ముగ్గురు యువకులతో రవితేజకు గొడవలు జరిగాయి. తమ గ్యాంగ్తో కలిసి ఉండాలని తన భర్తను హెచ్చరించినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత కక్షలతోనే హత్య చేసినట్లు ఆమె పేర్కొంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరు గంటల్లోనే కేసు ఛేదించాం: డీఎస్పీ గ్యాంగ్లు నిర్వహించడంతోపాటు అసాంఘిక కా ర్యకలాపాలకు పాల్పడుతూ యువకుడిని హత్య చేసిన కేసును ఆరు గంటల్లోనే ఛేదించి నిందితుల ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి టూటౌన్ పోలీ సుస్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కత్తి, మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు నేరాలకు పాల్పడుతూ తమతో కలిసి తిరగాలని రవితేజకు చెప్పినా నిరాకరించడంతో హత్యకు ఒడిగట్టినట్లు చెప్పారు. నిందితులు సోమవారం రాత్రి మద్యం తాగి పేకాట ఆడిన తర్వాత ఇందిరానగర్లో మరోసారి మద్యం తాగుతున్న సమయంలో రవితేజ బైక్పై వెళ్తుండగా అడ్డగించి కత్తితో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఏ–1గా చిల్కూరి ల క్ష్మినగర్కు చెందిన గోల్డెన్ కార్తీక్, ఏ–2, ఏ–3గా ఇందిరానగర్కు చెందిన సిద్దూ, దేవుల సాయికిరణ్లు ఉన్నట్లు తెలిపారు. ఏ–1, ఏ–2తోపాటు మృతుడి పై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిపై రౌడీషీటర్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన కత్తులతో ఫొటోలు దిగుతూ నేరాలను ప్రేరేపించేలా సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఆరుగంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో టూటౌన్ సీఐ కరుణాకర్రావు, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ పాల్గొన్నారు. తెల్లవారుజామున కత్తితో గొంతుకోసి.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పాత కక్షలే కారణం -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన యువకుడు మంగళవారం మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యవత్మాల్ జిల్లాలోని ధగడ్లాల్ గ్రామానికి చెందిన సట్పుటే దత్తు (22) గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఉమర్ఖేడ్ తాలుకాలోని కొర్ట గ్రామంలో బంధువుల పంట చేనులో ఈనెల 22న పురుగుల మందు తాగాడు. గమనించిన బంధువులు అతన్ని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్టుఆదిలాబాద్టౌన్: ఇటీవల చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్లో ఈనెల 8న తుమ్మల విజయ ఇంట్లో చోరీ జరిగింది. రూ.5వేల నగదు అపహరణకు గురైంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని నేతాజీ చౌక్లో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ తబ్రేజ్ను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఇంట్లో చోరీతానూరు: మండలంలోని భోసి గ్రామంలో చాదల దత్తాత్రి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి దత్తాత్రి ఇంట్లో నిద్రించాడు. భార్య గోదావరి మరో గదికి తాళం వేసి గ్రామంలో నిర్వహించిన భజన కార్యక్రమానికి వెళ్లి మంగళవారం వేకువజామున వచ్చింది. గదికి వేసిన తాళం పగిలిపోయి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం, గల్లగురిగి ధ్వంసమై కనిపించాయి. శనగ పంట విక్రయించిన రూ.36 వేలు, గల్లగురిగిలో పోగుచేసిన రూ.20 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కోతుల దాడిలో మహిళకు గాయాలు ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్లోకు చెందిన మమతపై మంగళవారం కోతుల దాడి చేసి గాయపర్చింది. సోమవారం రాత్రి కుక్కల దాడిలో అదే గ్రామానికి చెందిన ఆశల లచ్చన్న, చిన్నారి వేదశ్రీకి గాయాలయ్యాయి. పట్టణంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చింది. సాగునీటికోసం రైతుల ఆందోళనదండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబంధీ పద్ధతిలో అందిస్తున్న సాగునీరు సక్రమంగా అందడంలేదని డిస్ట్రిబ్యూటరీ 24బీ పరిధిలోని మాకులపేట, తాళ్లపేట గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కడెం ప్రధాన కాలువలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగికి సాగునీరందిస్తామని అధికారులు చెప్పడంతో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశామని, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రావణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
జైపూర్: వేలాల జాతర ఏర్పాట్లను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. గుట్టపై భక్తులకు తాగునీటి వసతి, ఆలయం వద్ద సౌకర్యాలు, గోదావరినదిలో పుణ్యస్నానాలు, గుట్టపైకి కాలినడక మార్గంలో వెళ్లేవారికి తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలతో పాటు 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి వేలాలకు 100 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. యంత్రాల పనిగంటలు పెంచాలి శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పనిగంటలు మరింత పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్) ఎల్వీ.సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూ ర్ ఓపెన్ కాస్ట్ గని సందర్శించారు. ఓసీపీలోని ఇన్ఫిట్ క్రషర్, సర్ఫేస్ క్రషర్లను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ గని నుంచి ప్రతీరోజు 4రేకుల బొగ్గు రవాణా చేయాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియా మొత్తం 7 రేకుల బొగు్గ్ రవాణా కావాల్సి ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్పీ) తిరుమల్రావు, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్రెడ్డి, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇంచార్జి కే.వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు పాల్గొన్నారు. మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణతానూరు: మహిళ మెడలో పుస్తెల తాడు అపహరించిన ఘటన మండలంలో బోంద్రట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. బోంద్రట్ గ్రామానికి చెందిన పంచశీల మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగివస్తుంది. ఈ క్రమంలో ఎదురుగా బైక్పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో పుస్తెతాడును ఎత్తుకెళ్లి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పెద్దల సభలో..మనోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి పలువురి ప్రాతినిధ్యం ● చైర్మన్గా ఆదిలాబాద్కు చెందిన సయ్యద్ ముకషీర్ షా ● పి.నర్సారెడ్డి, జీవీ సుధాకర్రావు, పలువురు ఎమ్మెల్సీగా ● స్థానికసంస్థలు, ఎమ్మెల్యే కోటాలోనే అవకాశాలుసాక్షి,ఆదిలాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల, టీచర్స్ శాసనమండలి సభ్యుల ఎన్నికల వేడి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు పట్టభద్రుల పరంగా, అటు టీచర్స్ పరంగా ఒకరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. పలువురు పోటీ చేసినప్పటికీ నిరాధారణకు గురయ్యారు. అయితే శాసనమండలి పరంగా ఉమ్మడి జిల్లాలో ఘన చరిత్ర ఉంది. ఆదిలాబాద్కు చెందిన సయ్యద్ ముకషీర్షా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలికి 6వ చైర్మన్గా వ్యవహరించారు. రెండుసార్లు ఆయన చైర్మన్గా ఉండటం గమనార్హం. ఆ సమయంలో మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయ్భాస్కర్రెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు సీఎంలుగా ఉన్నారు. మనోళ్లు ముఖ్య పదవుల్లో.. ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ముకషీర్ షా వ్యవహరించిన ఘనత ఉంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎన్నిక చేయగా, మరోసారి శాసన పరిషత్కు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో ఏర్పాటు కాగా, సీఎంగా వ్యవహరించిన ఎన్టీ రామారావు ఈ శాసనమండలి వ్యవస్థను 1985లో రద్దు చేశారు. అప్పుడు మండలి చివరి చైర్మన్గా ముకషీర్ షా ఉన్నారు. ఆ తర్వాత 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మళ్లీ శాసనమండలి పునరుద్ధరించారు. నిర్మల్కు చెందిన పి.నర్సారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అప్పట్లో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దండేపల్లికి చెందిన జీవీ సుధాకర్రావు ఒకసారి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. స్థానిక సంస్థల నుంచే.. ఉమ్మడి జిల్లా స్థానికసంస్థల నుంచే జిల్లా ముగ్గురు నేతలకు అవకాశం దక్కింది. అందులో కాంగ్రెస్ నుంచి సయ్యద్ ముకషీర్ షా, ప్రేమ్సాగర్రావులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించిన పురాణం సతీశ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్ ఇప్పటికీ పదవిలో కొనసాగుతుండగా ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీలు 1.సయ్యద్ ముకషీర్ షా(మృతిచెందారు). 1979–80, 1981–85 (మండలి చైర్మన్), (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు 2.పి.నర్సారెడ్డి (మృతిచెందారు). మూడుసార్లు ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి, ఆ తర్వాత 1981–85 వరకు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు. 3.జీవీ సుధాకర్రావు (మృతిచెందారు). 1977 (పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు). 4.మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (మృతిచెందారు), 2007–09 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 5. ప్రేమ్సాగర్రావు, 2007–13 (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 6. పొగాకు యాదగిరి (మృతిచెందారు). 2007 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 7. పురాణం సతీశ్, 2015–22 వరకు (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం) 8. దండే విఠల్.. 2022 నుంచి 2028 వరకు కొనసాగనున్నారు. ‘స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం). ఎమ్మెల్యే కోటాలో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెన్నూర్కు చెందిన సుల్తాన్ అహ్మద్ను మెనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అంతకుముందు 1999లో ఈయన సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో మళ్లీ టికెట్ ఆశించారు. ఆ సమయంలో కోనేరు కోనప్పకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వగా, సుల్తాన్ అహ్మద్కు నామినేట్ పదవి విషయంలో భరోసానిచ్చారు. ఈమేరకే అప్పట్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మంచిర్యాలకు చెందిన పొగాకు యాదగిరి న్యాయవాదిగా వ్యవహరించేవారు. ఎన్టీ రామారావు హయాం నుంచి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు మినహా ఎవరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. -
ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్
● రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం.. భైంసాటౌన్: లంచం తీసుకుంటూ ఓ ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన ఘటన భైంసా ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... భైంసా మండలం కామోల్కు చెందిన సుభాష్గౌడ్ అనే కల్లు వ్యాపారికి, అదే గ్రామానికి చెందిన మరో కల్లు వ్యాపారికి కల్లు విక్రయాల విషయమై గొడవ తలెత్తింది. దీంతో ఈ విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో సమస్య పరిష్కరించాలని సుభాష్గౌడ్ ఎకై ్సజ్ ఎస్సై నిర్మలను సంప్రదించాడు. ఆమె కానిస్టేబుల్ సుజాత ద్వారా రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో సుభాష్గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం కానిస్టేబుల్ సుజాతకు డబ్బు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు విజయ్కుమార్, రమణమూర్తి, సీఐలు కిరణ్, స్వామి, సిబ్బంది ఉన్నారు. -
ఖేలో ఇండియా పోటీలకు జిల్లా విద్యార్థి
భైంసాటౌన్: అఖిల భారత ఖేలో ఇండియా యోగా పోటీలకు తెలంగాణ నుంచి జిల్లా విద్యార్థి వార్లే దిలీప్ ఎంపికై నట్లు యోగా గురువు మల్లేశ్ తెలిపారు. తానూర్ మండలం హిప్నెల్లికి చెందిన దిలీప్ బెంగళూరులోని వ్యాస యూనివర్సిటీలో బీఎస్సీ యోగా చేస్తున్నారు. ఇటీవల భువనేశ్వర్లో జరిగిన యోగా పోటీల్లో యూనివర్సిటీ తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చాడు. దీంతో మార్చిలో జమ్మూలో జరిగే ఖేలో ఇండియా జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాతోపాటు, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. -
గొడిసిర్యాల రాజన్న...
దస్తురాబాద్: కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా గోడిసిర్యాల రాజన్న భక్తుల విశేష పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాభైంది. ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 27న కుంకుమ పూజలు, సాముహిక హోమం, 28న అన్నపూజ, మల్లన్న, పోచమ్మ బోనాలు నిర్వహిస్తారు. గోడిసిర్యాల రాజన్న ఆలయంలో అర్ధరాత్రి 12 గంటలకు లింగద్బోవం సమయంలో నాగుపాము దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. ఇక గోడిసిర్యాల రాజన్న ఆలయంలో ముడుపు కట్టివెళ్తే కోరిక తీరుతుందని భక్తుల ప్రాగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని రావి, మేడి, మామిడి చెట్లు భక్తుల ముడుపులతో నిండి పోతాయి. -
ఓలాదీశ్వరుని ప్రత్యేకత..!
కుంటాల: మండలంలోని ఓలా, దౌనెల్లి శివాలయం, సూర్యాపూర్ శ్రీరాజరాజేశ్వరాలయం, కుంటాల ఉమామహేశ్వర, మహాదేవుడు, ఆత్మలింగ ఆలయాలను ముస్తాబు చేశారు. ఓలా గ్రామంలో 150 ఏళ్ల క్రితం రాతి కట్టడంతో శివాలయాన్ని నిర్మించారు. ఆలయంలో లింగమూర్తిని ప్రతిష్టించారు. ఆలయం గర్భగుడి నుంచి సొరంగం మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడి నుంచి బాసరలోని గోదావరి, కాశీకి వెళ్లి మునులు స్నానం ఆచరించేవారని చెబుతారు. సూర్యాపూర్ రాజరాజేశ్వరుడు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతంలో వాగు, చెరువు సమీపాన కొలువుదీరి ఉన్నాడు. -
పకడ్బందీగా బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్
నిర్మల్చైన్గేట్: బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వినియోగించే బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్తో కలిసి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అందించే సామగ్రిని పరిశీలించారు. 25 మంది సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని రవాణా చేసే వాహనాలన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో కండీషన్లో ఉన్న వాహనాలను వినియోగించాలన్నారు. అదనంగా వాహనాలను, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, తహసీల్దార్ రాజు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్టౌన్: శాంతియుత వాతావరణంలో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ముస్లిం మత పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో అందరూ సంయమనం పాటించాలన్నారు. ఘర్షణలు, గొడవలు జరగకుండా మత పెద్దలు చర్యలు చేపట్టాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను నమ్మవద్దని తెలిపారు. ఎలాంటి సందేహం ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, పట్టణ మసీద్ లా మేనేజింగ్ అధ్యక్ష, కార్యదర్శులు తాజా మాజీ కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, ఇమ్రాన్ ఉల్లా, అబ్దుల్ మతిన్, గుల్బర్ మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అలీ, మాజీ వైస్ చైర్మన్ అజీమ్ బిన్ యహీయా తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: Ððl$§ýl-MŠS-&MýS-È…¯]l-VýS-ÆŠ‡-&-°-gêÐ]l*-»ê§Šæ-&-B-¨-Ìê»ê§Šæ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y GÐðl$Ã-ÎÞ G°²MýSÌS çœ$rt… ™èl$¨ A…M>°MìS ^ólÆý‡$-MýS$…¨. ´ùÍ…VŠæMýS$ 48VýS…-rÌS Ð]l¬…§ól {ç³^éÆý‡… °Íí³ ÐólĶæ*-ÍÞ E…yýl-yýl…-™ø ™ðlÆý‡-Ððl-¯]l$-MýS- A¿ýæÅ-Æý‡$¦ÌS Ð]l$…{™é…VýS… Ððl¬§ýl-OÌñæ…¨. ¯éË$VýS$ ´ë™èl hÌêÏ-ÌZÏ° Ððl¬™èl¢… 42AòÜ…½Ï Ý릯éÌS ç³Ç«¨ÌZ fÆý‡$-VýS$-™èl$¯]l² ç³rt¿ýæ-{§ýl$ÌS, sîæ^èlÆŠ‡ GÐðl$Ã-ÎÞ G°²MýS-ÌSOò³ DÝëÇ çÜÆý‡Ó{™é E™èlP…uý‡ ¯ðlÌS-Mö…¨. ´ùsîæ-ÌZ E¯]l² ÐéÆý‡…-§ýlÆý‡* VðSË$ç³#¯]l$ {糆Úët-™èlÃ-MýS…-V> ¡çÜ$-MøÐ]l-yýl…-™ø KrÆý‡Ï Ððl¬VýS$YOò³ BçÜMìS¢ Mö¯]l-Ýë-VýS$-™ø…¨. ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS ÑfĶæ$… MøçÜ… Æ>çÙ‰ A{VýS-¯éĶæ$-MýS-™èlÓ… {ç³^éÆý‡… ^ólĶæ$-yýl…-™ø VýS™èl G°²MýSÌS MýS…sôæ DÝëÇ Ð]l$Ç…™èl §ýl*MýS$-yýl$-V> A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlÌS-ç³-yýl$-™èl$-¯é²Æý‡$. {ç³^éÆý‡…-ÌZ JMýS-Ç° Ñ$…_ Ð]l$ÆöMýSÆý‡$ àÒ$Ë$ CçÜ*¢ KrÆý‡ÏMýS$ ^ólÆý‡$-Ð]lÄôæ$Å {ç³Ä¶æ$-™èl²… ^ólÔ>Æý‡$. ¯ólyýl$ ÕÐ]l-Æ>{† ç³…yýl$VýS Ð]l¬WíÜ, VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 8¯]l$…^ól »êÅÌñæsŒæ õ³ç³-ÆŠ‡Oò³ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l*-°² KrÆý‡$Ï ÐólĶæ$yýl… Ððl¬§ýl-ÌS-Ð]l#-™èl$…¨. ©…™ø A¿ýæÅ-Æý‡$¦-Ë$ G°²MýSÌS gêV>Æý‡… ^ólĶæ*-ÍÞ ˘Ð]lÝù¢…¨. టీచర్ల స్థానానికి హోరాహోరీ ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్సీపీఎస్ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు పట్టభద్రులు 3,55,159 టీచర్లు 27,088 -
నేడు రథాలగుడిలో పల్లకియాత్ర
నిర్మల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక రథాలగుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పల్లకియాత్ర నిర్వహించనున్నట్లు వంశపారంపర్య పూజారులు తెలిపారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఉత్సవ విగ్రహాలతో సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ మహాశివరాత్రికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బ్రహ్మపురి రథాలగుడిలో కొలువైన విశ్వేశ్వరుడు -
జాతరకు సిద్ధమైన మహాదేవుడు
లక్ష్మణచాంద: బాబాపూర్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాదేవుని జాతరకు సిద్ధమైంది. రెండవ వేములవాడగా బాబాపూర్ రాజేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బాబాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు బుధవారం జిల్లాలోని వివిధ మండలాల ఉండి వేలాది మంది భక్తులు వచ్చి ఉపవాస దీక్షలు స్వీకరిస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. బాబాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శివలింగం ఉంది. దీంతో ఇక్కడకు వచ్చి పూజలు చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కోడెలు సమర్పించడం ప్రత్యేకత... వేములవాడ తర్వాత బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు కోడెలు సమర్పిస్తారు. సామి కోర్కెలు తీరిస్తే కోడెను సమర్పిస్తామని మొక్కుకుని ఇలా చేస్తారు. -
పార్డి(బి)లో జాతర
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర మందిరం మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. బుధవారం మందిరంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గురువారం దేవతా మూర్తులకు జోడువాగులో స్నానం చేయిస్తారు. అదేరోజు రాత్రి కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం అంబళ్లు గ్రామంలోని మహిళలందరూ అంబళ్ల బుడ్లతో వచ్చి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం కుస్తీపోటీలు జరుగుతాయి. పార్వతీల వ్యవస్థ.. గతంలో భక్తులు తమ కూతుళ్లకు దేవునితో పెళ్లి చేసి అక్కడే వదిలిపెట్టేవారు. పార్వతిగా ఉన్న మహిళ దేవుని సేవచేస్తూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. ఆమె చనిపోతే అక్కడే సమాధి చేసేవారు. ఇక్కడ ఆరుగురు మహిళలు పార్వతిలుగా మారి చనిపోయారు. చివరి పార్వతమ్మ 2011లో చనిపోయింది. ఆ తరువాత పార్వతమ్మగా ఎవరూ మారలేదు. -
నేడు రథాలగుడిలో పల్లకియాత్ర
నిర్మల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక రథాలగుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పల్లకియాత్ర నిర్వహించనున్నట్లు వంశపారంపర్య పూజారులు తెలిపారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఉత్సవ విగ్రహాలతో సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ మహాశివరాత్రికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బ్రహ్మపురి రథాలగుడిలో కొలువైన విశ్వేశ్వరుడు -
పార్డి(బి)లో జాతర
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర మందిరం మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. బుధవారం మందిరంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గురువారం దేవతా మూర్తులకు జోడువాగులో స్నానం చేయిస్తారు. అదేరోజు రాత్రి కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం అంబళ్లు గ్రామంలోని మహిళలందరూ అంబళ్ల బుడ్లతో వచ్చి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం కుస్తీపోటీలు జరుగుతాయి. పార్వతీల వ్యవస్థ.. గతంలో భక్తులు తమ కూతుళ్లకు దేవునితో పెళ్లి చేసి అక్కడే వదిలిపెట్టేవారు. పార్వతిగా ఉన్న మహిళ దేవుని సేవచేస్తూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. ఆమె చనిపోతే అక్కడే సమాధి చేసేవారు. ఇక్కడ ఆరుగురు మహిళలు పార్వతిలుగా మారి చనిపోయారు. చివరి పార్వతమ్మ 2011లో చనిపోయింది. ఆ తరువాత పార్వతమ్మగా ఎవరూ మారలేదు. -
పట్టభద్రుల ప్రసన్నం కోసం
కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్రెడ్డి, బీజేపీ మద్దతుతో అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణతో సహా మొత్తం 56మంది బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక నాయకులు చెమటోడుస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రచారం చేశారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ప్రసన్న హరిక్రిష్ణ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు. వీరితోపాటు బక్క జడ్సన్ పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాక ఎవరికివారు సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, మేసేజ్లు, వాట్సాప్ల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొనడంతో పట్టభద్రులు తమ ప్రాధాన్యతను ఎలా వ్యక్తపరుస్తారనేది ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ప్రసన్నం కోసం చివరి అస్త్రంగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. -
పాపహరేశ్వరుని దర్శనం... సర్వపాపహరణం
దిలావర్ఫూర్: సహ్యాద్రిపర్వత శ్రేణుల్లోని ‘కదిలి’ లోయలో కొలువుదీరి ఉన్న శ్రీమాతాన్నపూర్ణ సహిత పాపహరేశ్వరాలయాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మాడేగాం గ్రామ పంచాయతీ పరిధిలోని కదిలి గ్రామ పరిసర అటవీప్రాంతంలో వెలిసిందే శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయం. సహ్యాద్రి కొండల్లో మాతృహత్యాపాపం నుంచి విముక్తి పొందేందుకు పరశురాముడు ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రకృతి అందాల నడుమ వెలసిన పాపహరేశ్వర స్వామి చెంతనే శ్రీమాతన్నపూర్ణేశ్వరీదేవి వెలిసింది. కదిలె శివలింగం.. గర్భగుడిలోని శివలింగం భక్తితో పరిశీలిస్తే కదులు తున్నట్లు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఒకే కాండంలో 18 వృక్షాలు మిలితమైన వట వృక్షం అత్తకోడళ్ళ గుండాలు, సీతమ్మ అల్లుబండ, అన్నపూర్ణమాత, ఆలయ ద్వారపాలకులు సప్త రుషుల ధ్యాన మందిరం, నందీశ్వరుడు, ఆవునోటి ద్వారా కోనేరులో చేరే నీరు వంటి వి ఇచ్చట భక్తులను ఆకట్టుకుంటున్నాయి. -
పన్నుల వసూలు వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అన్నిరకాల పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన పన్నుల వివరాలు మున్సిపాలిటీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలలో వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మొత్తంలో పన్నులు కట్టకుండా ఉన్నవారి జాబితా ను సిద్ధం చేసి, అందులోని మొదటి వంద మందికి రెడ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ వాణిజ్య సముదాయాల అద్దెలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, నిర్మల్ మున్సిపల్ డీఈ హరిభువన్, అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: Ððl$§ýl-MŠS-&MýS-È…¯]l-VýS-ÆŠ‡-&-°-gêÐ]l*-»ê§Šæ-&-B-¨-Ìê»ê§Šæ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y GÐðl$Ã-ÎÞ G°²MýSÌS çœ$rt… ™èl$¨ A…M>°MìS ^ólÆý‡$-MýS$…¨. ´ùÍ…VŠæMýS$ 48VýS…-rÌS Ð]l¬…§ól {ç³^éÆý‡… °Íí³ ÐólĶæ*-ÍÞ E…yýl-yýl…-™ø ™ðlÆý‡-Ððl-¯]l$-MýS- A¿ýæÅ-Æý‡$¦ÌS Ð]l$…{™é…VýS… Ððl¬§ýl-OÌñæ…¨. ¯éË$VýS$ ´ë™èl hÌêÏ-ÌZÏ° Ððl¬™èl¢… 42AòÜ…½Ï Ý릯éÌS ç³Ç«¨ÌZ fÆý‡$-VýS$-™èl$¯]l² ç³rt¿ýæ-{§ýl$ÌS, sîæ^èlÆŠ‡ GÐðl$Ã-ÎÞ G°²MýS-ÌSOò³ DÝëÇ çÜÆý‡Ó{™é E™èlP…uý‡ ¯ðlÌS-Mö…¨. ´ùsîæ-ÌZ E¯]l² ÐéÆý‡…-§ýlÆý‡* VðSË$ç³#¯]l$ {糆Úët-™èlÃ-MýS…-V> ¡çÜ$-MøÐ]l-yýl…-™ø KrÆý‡Ï Ððl¬VýS$YOò³ BçÜMìS¢ Mö¯]l-Ýë-VýS$-™ø…¨. ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS ÑfĶæ$… MøçÜ… Æ>çÙ‰ A{VýS-¯éĶæ$-MýS-™èlÓ… {ç³^éÆý‡… ^ólĶæ$-yýl…-™ø VýS™èl G°²MýSÌS MýS…sôæ DÝëÇ Ð]l$Ç…™èl §ýl*MýS$-yýl$-V> A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlÌS-ç³-yýl$-™èl$-¯é²Æý‡$. {ç³^éÆý‡…-ÌZ JMýS-Ç° Ñ$…_ Ð]l$ÆöMýSÆý‡$ àÒ$Ë$ CçÜ*¢ KrÆý‡ÏMýS$ ^ólÆý‡$-Ð]lÄôæ$Å {ç³Ä¶æ$-™èl²… ^ólÔ>Æý‡$. ¯ólyýl$ ÕÐ]l-Æ>{† ç³…yýl$VýS Ð]l¬WíÜ, VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 8¯]l$…^ól »êÅÌñæsŒæ õ³ç³-ÆŠ‡Oò³ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l*-°² KrÆý‡$Ï ÐólĶæ$yýl… Ððl¬§ýl-ÌS-Ð]l#-™èl$…¨. ©…™ø A¿ýæÅ-Æý‡$¦-Ë$ G°²MýSÌS gêV>Æý‡… ^ólĶæ*-ÍÞ ˘Ð]lÝù¢…¨. టీచర్ల స్థానానికి హోరాహోరీ ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్సీపీఎస్ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు పట్టభద్రులు 3,55,159 టీచర్లు 27,088 -
శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలి
తానూరు: ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే రామారావ్పటేల్ సూచించారు. కళ్యాణి గ్రామంలో మంగళవారం నిర్వహించిన శివాజీమహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ శివాజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, సోమ్నాథ్, బాలాజీ ఆయా గ్రామాల కార్యకర్తలు, శివాజీ యుత్ సభ్యులు పాల్గొన్నారు.శివాజీమహ రాజ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే -
మాస్టర్ప్లాన్కు నిధులివ్వండి..
– మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావుమంచిర్యాలలో మాస్టర్ప్లాన్ అమలుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టామని, అందుకు రూ.78కోట్లు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. మంచిర్యాలను కార్పొరేషన్గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో నాలుగు ఎకరాల్లో రూ.11 కోట్లతో గ్రీన్క్రిమిటోరియం పద్ధతిలో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని, దీనిలో పూర్తిగా సోలార్ పవర్ వాడే విధంగా చర్యలు తీసుకున్నామని, పూర్తి కావొచ్చిందని తెలిపారు. కరకట్ట నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు కేంద్రం ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని, ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. -
బాలల హక్కులు కాపాడదాం
● ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో 66 మంది బాల కార్మికులకు విముక్తి ● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో భాగంగా 66 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సోమవారం ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 66 మంది బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని తెలిపా రు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం అయిందన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతానికి జిల్లాలో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, రాజేశ్మీనా, సీడీపీవో నాగలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్మన్ వహీద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు, డీసీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటి ష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 19,107 మంది ఓటు హక్కు పొందారని ఇందులో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉ న్నారని వివరించారు. ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. ఓటర్లకు ఆర్డీవో కార్యాలయంలో సోమ, మంగళవారం అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాల వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో రెండుసార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పటిష్ట భద్రత..ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి రూ.38,06,830 నగదు, రూ.3,03,000 విలువ గల 827 లీటర్ల మద్యాన్ని, రూ.5,750 విలువ చేసే నిషే ధిత మత్తు పదార్థాలు, పీడీఎస్ బియ్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్రెడ్డి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, హైదర్, మజార్, జగన్మోహన్, అధికారులు పాల్గొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రికి సంబంధించిన వివరా ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 6,571 మంది ప్రథమ సంవత్స రం, 6,562 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మార్చి 5 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయ ని వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేయాల ని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రి ని నిర్దేశిత ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచాలన్నా రు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించా లన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూ చించారు. పరీక్ష జరుగుతున్నంతసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయాని కి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధి కారులు ప్రత్యేక బస్సులు నడపాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, డీఈవో పి.రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, విద్యుత్ అధికారి వెంకటేశ్వర్లు, పోస్ట్మాస్టర్ వెంకటరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
● నస్పూర్లోని మైదానంలో ఏర్పాటు ● వేలాదిగా తరలివచ్చిన పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి హామీ
నస్పూర్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంకల్పసభ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా పట్టభద్రులు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం ప్రకటించడంతో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ సభలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కంటోన్మెంట్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర కనీస వేతన సవరణ బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చా ర్జీలు శ్యాంనాయక్, అడె గజేందర్, కంది శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నరు: సీఎం‘మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు. మీరు ఒక్క ఓటు వేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటే మీకు ఇద్దరు సేవకులు వచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు రోజుకు 16గంటలు పని చేస్తే, డీసీసీ అధ్యక్షురాలిగా సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. -
‘ఎమ్మెల్సీ’ ప్రలోభాలు షురూ
● ఉన్నచోటికే మందు, విందు ● ఇంటికే పైసల్... ● టీచర్లు, గ్రాడ్యుయేట్లకు తాయిలాలు నిర్మల్ఖిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరుతోంది.. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లుగా ఉండే గ్రా డ్యుయేట్లు, టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం వాకింగ్ చేసే వారితో మొదలు పెట్టి.. రాత్రి మందు, విందు సిట్టింగ్ల వరకు సాగుతోంది. ప్రధానంగా ఉపాధ్యాయులైతే నలుగురైదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసి హోటల్ రూంలు బుక్ చేసి.. అక్కడికే వారికి అవసరమైన మందు, విందు పంపుతున్నారు. ఎలాగైనా తమ వారికి ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సోష ల్ మీడియాలో సైతం తగ్గేదేలే.. అన్నట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరులతోపాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించుకుని బాధ్యతలు అప్పగించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా ప్రచారానికి విరివిగా వినియోగిస్తున్నారు. గంపగుత్తా ఓట్ల కోసం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో ప్రతీ ఓటరు ఇంటికి పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారులు వెళ్లి కలుస్తున్నారు. ఓటరుతోపాటు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 10 నుంచి 12 మంది వరకు బృందంగా ఉంటే వారికి ప్రత్యేక తాయిలాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలకు రెండు రోజుల ముందే మద్యం షాపులు మూసివేయనుండడంతో సరుకు నిల్వ ఉంచుతున్నారు. మరోవైపు ఆత్మీయ సమ్మేళనాల పేరిట 50, 100 మందితో ప్రత్యేక మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘం నేతలు తమ సంఘం జిల్లా, మండల కార్యవర్గ సభ్యులతో బృందాలుగా ఏర్పడి నిర్మల్ ఖానాపూర్, భైంసా తదితర పట్టణాలతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్లను ఇంటికి వెళ్లి మరీ కలుస్తున్నారు. మందు, విందు, నగదు...గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలో తయారుచేసి పెట్టుకున్న లిస్టు ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు చేసి సమయం తీసుకుంటున్నారు. సాయంత్రం వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.3 వేలు, ఉపాధ్యాయ ఓటర్లకు దాదాపు రూ.5 వేల వరకు ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.ముగ్గురి మధ్యే పోటీ..గ్రాడ్యుయేట్ ఎన్నికల సమరంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్రెడ్డి పోటీలో ఉండగా, బీజేపీ తరఫున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ తరఫున అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ మద్దతుతో మల్క కొమురయ్య, పీఆర్టీయూ మద్దతుతో వంగ మహేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. వారి అనుచరులు ప్రచారంలో ముందున్నారు. ఇక జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో బరిలో నిలిచారు. ప్రధానంగా పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు అన్నిరకాల తాయిలాలు అందించేందుకు వెనకాడడం లేదు. -
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వూటుకూరి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వూటుకూరి అన్నారు. ఎన్నికల్లో ఓటరు నమోదు చేసుకున్న వారందరికీ ఉచితంగా రూ.3 లక్షల ప్రమాద బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్లకు ప్రమోషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్లకు కనీస వేతనం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్కు యూనివర్సిటీ తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉండి వారి సమస్యలన్నీ పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ
నిర్మల్ఖిల్లా: ఖేలో ఇండియా సౌత్ జోన్ మార్షల్ ఆర్ట్స్(వూషూ) ఎంపిక పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈనెల 18, 19 తేదీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఆదిలాబాద్లోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా ఉమె న్స్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో నిర్మల్ జిల్లా నుంచి 39 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. 5 బంగా రు, 2 రజత, 8 కాంస్య పతకాలు సాధించా రు. లోలం మమత –కేజీబీవీ(భైంసా), జి.నక్షత్ర–కేజీబీవీ(భైంసా), జే.ఈశ్వరి–జెడ్పీహెచ్ఎస్(పార్డీ–బీ), జే.గౌరీబాయి–ఎడ్బిడ్ తండా, ఎస్.భాగ్యలక్ష్మి–భైంసా బంగారు పతకా లు సాధించారు. శృతి, ప్రణతి రజత పతకా లు, మైథిలి, కౌశర్, వైష్ణవి, సోనిబాయి, స్వాతి, శైలజ, షేక్జోయా, కృషిక కాంస్య పతకాలు సాధించారు. వీరంతా త్వరలో తమిళనాడులో నిర్వహించే సౌత్జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూషూ పోటీల్లో పాల్గొంటారని కోచ్ శ్రీరాముల సాయికృష్ణ తెలిపా రు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, ఖేలో ఇండియా వూషూ కోచ్ జ్ఞానతేజ, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు తేజేందర్సింగ్ భాటియా, శ్రీకాంత్, శివరాజ్గౌడ్, భూషణ్, మృణళిని, సాయినాథ్, రాజ శ్రీ, ప్రతిక్ష, చిరంజీవి, వంశీ తదితరులు అభినందించారు. -
పని చేసే ప్రభుత్వం
– ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకేంద్రం నుంచి ఎటువంటి సాయం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్లు, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జీతాలు పెంచడానికి కూడా మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ మాటలతో మోసం చేసిందని, పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమని, నాలుగేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి పట్టభద్రులు కాంగ్రెస్కు ఓటెయ్యాలని కోరారు. -
వాలా దశాబ్ది ఉత్సవాలు
నిర్మల్టౌన్: నిర్మల్ వాకర్స్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ (వాలా) దశాబ్ది ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్, చెస్, వాలీబాల్, క్యారమ్స్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాలం శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న వాలా సభ్యులు -
గజ్జలమ్మకు ప్రత్యేక పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వచ్చారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, సినీగేయ రచయిత తాటి శివ ఆధ్వర్యంలో పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఘనంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ
సోన్: మండల కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి, లోకల్ వెల్మల్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ధ్వజ, శిఖర, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మారా గంగారెడ్డి, నాయకులు సరికెల గంగన్న, జక్క రాజేశ్వర్, నరేశ్, నర్సారెడ్డి, నర్సయ్య, సంతోష్, ప్రశాంత్, గంగన్న, సాయన్న, మక్కన్న, అమృత్, రాజు, ఉదయ్, శివ భక్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ధర్మోర హన్మాన్ ఆలయంలో.. లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామంలో నూతనంగా నిర్మించిన హనూమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావుపటేల్ హాజరై పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నాయకులు సాయన్న, మెండె శ్రీధర్, మంద భాస్కర్, మంద గణేశ్, జయసాగర్రావు, అనిల్, ఆజోబ పటేల్, ఉత్సవ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఐ కేర్..!
భైంసాటౌన్: విద్యార్థుల్లో దృష్టిలోపం నివారణే లక్ష్యంగా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అవసరమైనవారికి మందులు అందిస్తున్నారు. అయితే, ఈసారి తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆదేశాల మేరకు 5 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు ఆప్తాల్మజిస్ట్ ఆధ్వర్యంలో మరోసారి పరీక్షలు జరిపి కంటి అద్దాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి అద్దాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో... ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. వీరు పాఠశాలస్థాయిలో ఆప్తోమెట్రిస్ట్లతో 1,385 మంది విద్యార్థులను పరీక్షించారు. వీరిలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థుల్లో కంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దృష్టిలోపం ఉన్న విద్యార్థులను ఆర్బీఎస్కే వాహనాల్లో జీజీహెచ్, భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించి పరీక్షిస్తున్నారు. కార్యక్రమం 15 రోజులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. దృష్టిలోపం నివారణే లక్ష్యంగా కార్యక్రమం అమలు జిల్లావ్యాప్తంగా స్టూడెంట్లకు కంటి పరీక్షలు447 మందికి కంటి అద్దాలు దృష్టిలోపమున్న విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాకేంద్రంలోని జీజీహెచ్తోపాటు భైంసాలోని ఏరియాస్పత్రిలో మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 448 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 447 మందికి కంటి అద్దాలు అవసరమని నిర్ధారించారు. మార్చి మొదటివారం వరకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్నాం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జీజీహెచ్లో కంటి వైద్యులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. లోపాలు ఉన్న వారిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. 448 మంది విద్యార్థులకు దృష్టిలోపమున్నట్లు గుర్తించాం. కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – నయనరెడ్డి, ఆర్బీఎస్కే ప్రోగ్రాం జిల్లా అధికారి -
ఆరోగ్య కిట్లు అందేదెప్పుడో..!
● ప్రభుత్వం నుంచి నిలిచిన సరఫరా ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ప్రభుత్వం శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతీ మూడు నెలలకోసారి కిట్లు అందించింది. ఏడాదిన్నర కాలం సజావుగా సాగిన ఈ కార్యక్రమం తర్వాత నిలిచిపోయింది. నాలుగేళ్లుగా విద్యార్థినులకు కిట్లు అందించడం లేదు. దీంతో బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థినులతోపాటు పోషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 8,9,10 తరగతుల నుంచి.. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ తదితర 15 రకాల వస్తువులు కలిగిన హెల్త్ కిట్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏడాదిన్న ర కాలం సజావుగా కిట్లు అందజేసింది. అనంతరం కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు రావడంతో హెల్త్ కిట్ల పంపిణీ నిలిచింది. విద్యార్థినుల వివరాలు జిల్లాలో 164 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎనిమి దో తరగతిలో 2,855 మంది విద్యార్థినులు, తొమ్మిదో తరగతిలో 2,835 మంది, 10వ తరగతిలో 2,476 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థినులు 1,013 మంది, సెకండియర్ విద్యార్థినులు 941 మంది ఉన్నారు. అందని కాస్మొటిక్ చార్జీలు జిల్లాలో 18 కేజీబీవీలు, 18 కళాశాలలున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంత్సరం విద్యార్థినులు 2,880 మంది ఉన్నారు. కేజీబీవీల్లో 6,7,8,9,10 తరగతుల్లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 18 కేజీబీవీల్లో మొత్తం 3,600 బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఈ సంవత్సరం నుంచి కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.100 చొప్పున అందజేస్తామని చెప్పడటంతో ఎస్వోలు విద్యార్థినులతో బ్యాంక్ ఖాతాలు తీయించారు. ఈ ప్రక్రియ గత డిసెంబర్ చివరి వరకు కొనసాగిందని కేజీబీవీల ఎస్వోలు చెబుతున్నారు. విద్యార్థినుల ఖాతాల్లో నేరుగా నెలకు రూ.100 జమ అవుతున్నట్లు అధికారులు తెలిపినా ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థినికి జమ కాలేదని ఎస్వోలు తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినులకు హెల్త్ కిట్లు, కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నేడు మంచిర్యాలకు సీఎం
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం మంచిర్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలిక్యాప్టర్లో బయలు దేరుతారు. 11.45 గంటలకు నిజామాబాద్కు చేరుకుని అక్కడ 11.50 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 2.15 గంటలకు మంచిర్యాలకు వచ్చి 2.20 నుంచి 3.55 వరకు సభకు హాజరవుతారు. సీఎంతోపాటు మంత్రులు, రాష్ట్రస్థాయి నాయకులు సభకు హాజరుకానున్నారు. ఈ సభకు 12వేల మంది పట్టభద్రులను తరలించేలా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పట్టభద్రులను సభకు రప్పించే ఏర్పాట్లు చేశారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్లోని హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. డీసీపీ భాస్కర్ నేతృత్వంలో సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటి నిర్మల్ పర్యటన రద్దు నిర్మల్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్రెడ్డి నిర్మల్ పర్యటన రద్దయినట్లు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు. అడెల్లిలో భక్తుల సందడి సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు పొరు గు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ ఈవో రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
నిర్మల్
బాసరలో భక్తుల రద్దీ బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా అమ్మవారికి ఒక్కరోజే రూ.15.46 లక్షల ఆదాయం సమకూరింది.సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల బాలబాలికలకు భద్రతతోపాటు భవిష్యత్పై నమ్మకం కలిగించేలా నాలుగు అంశాలతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం కార్యక్రమ ఉద్దేశం. ముందుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు చేసి, మున్ముందు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరించే ఆలోచనతో కలెక్టర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భైంసాటౌన్: విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నారు. బాలశక్తి పేరిట రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గత సెప్టెంబర్ నుంచి జిల్లాలో కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది విద్యార్థులకు ఆరో గ్యపరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల ను గుర్తించారు. వారికి అవసరమైన చికిత్సను వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీల సందర్శన ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుండడంతో ప్రభుత్వ సీఎస్ కలెక్టర్ను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలిసింది. దీంతో ఆమె జిల్లాలో కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులను అభినందించారు. విస్తృతంగా వైద్య పరీక్షలు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంలో భాగంగా ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 57 విద్యాసంస్థల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తహీనత, థైరాయిడ్, తక్కువ బరువు, ఊబకా యం, విటమిన్ లోపాలున్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల్లో రుతు సంబంధ సమస్యలుంటే గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, లోపాలున్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సైకియాట్రిస్ట్తో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. న్యూస్రీల్ కలెక్టర్ చొరవతో ప్రత్యేక కార్యక్రమం సక్సెస్ కావడంతో సర్వత్రా హర్షం విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంజిల్లాలోని స్కూళ్లలో ఆరోగ్య పరీక్షలిలా..ఎంపిక చేసిన పాఠశాలలు : 57మొత్తం విద్యార్థుల సంఖ్య : 20,082 పరీక్షలు చేయించుకున్నవారు : 17,545నమోదైన రక్తహీనత కేసులు : 384రిఫ్రాక్టివ్ లోపాలున్నవారు : 892నమోదైన థైరాయిడ్ కేసులు : 180 కార్యక్రమ ఉద్దేశం.. 20వేల మందికి పరీక్షలు బాలశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో 20వేల మందికిపైగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ కార్డులు రూపొందించాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భరోసా క ల్పించాలన్న ఉద్దేశంతో పకడ్బందీగా దీన్ని అ మలు చేస్తున్నాం. విద్య, వైద్యం, నైపుణ్యం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్ వివిధ అంశాలపై అవగాహన విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా పొదుపు బ్యాంక్ ఖాతాలు, నమూనా బ్యాంకింగ్, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక నిర్వహణపై అవగాహన కల్పించడం, పొదుపు అలవాట్లను నేర్పించడం, సైబర్ భద్రతపై అవగాహన, కిడ్డీ బ్యాంక్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా నెక్ట్స్ స్కిల్స్ 360 ఎడ్యుటెక్ సహకారంతో జిల్లావ్యాప్తంగా 48 విద్యాసంస్థల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజిక సంస్థల సందర్శనలో భాగంగా విద్యార్థులకు బ్యాంకులు, పోస్టాఫీసులు, పోలీస్స్టేషన్, అగ్నిమాపక కేంద్రాలు, కోర్టులు, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాలు, పీహెచ్సీలు, మీసేవలు, చిన్న తరహా పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల సందర్శనతో వాటి కార్యకలాపాలపై అవగాహన పెంచుతున్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
● 122మంది విద్యార్థుల గైర్హాజరునిర్మల్ రూరల్: జిల్లాలోని సంక్షేమ గురుకుల పా ఠశాలల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అ ర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వర కు పరీక్షలు నిర్వహించారు. గంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. పరీ క్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 6,034 మంది విద్యార్థులకు గా ను 5,912 మంది హాజరు కాగా, 122 మంది హా జరు కాలేదు. ఐదో తరగతిలో ప్రవేశానికి 4,276 మంది విద్యార్థులకు గాను 4,210 మంది హాజ రు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. ఆరో తరగతిలో 727 మందికి గాను 706 మంది హాజరు కాగా, 21 మంది పరీక్ష రాయలేదు. ఏడో తరగతిలో 418 మందికి గాను 399 మంది హాజరు కాగా, 19 మంది గైర్హాజరయ్యారు. ఎనిమిదో తరగతిలో 326 మందికి గాను 316 మంది హాజరు కాగా, 10 మంది హాజరు కాలేదు. తొమ్మిదో తరగతిలో 287 మందికి గాను 281 మంది హాజరు కాగా, ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. -
‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
సారంగపూర్: పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టారని, తల్లిదండ్రులు కూడా అంతే దృష్టి పెట్టాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని బీరవెల్లి ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు సీగ్రేడ్ నుంచి ఏగ్రేడ్లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రతీరోజు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. డీఈవో వెంట ఎంఈవో మధుసూదన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. మాట్లాడుతున్న డీఈవో రామారావు -
కాంగ్రెస్ మహిళా నాయకుల నియామకం
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దుర్గ భవాని నూతన జిల్లా కార్యవర్గాన్ని శనివారం నియమించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలిగా తన్నే లక్ష్మి, కడెం మండలం అధ్యక్షురాలిగా మాదాసు సురేఖ, సోన్ మండలం అధ్యక్షురాలిగా రేఖ, నిర్మల్ పట్టణ అధ్యక్షురాలిగా వాసవి, కుభీర్ మండలం అధ్యక్షురాలిగా నిఖిత రాథోడ్, కుంటాల మండలం అధ్యక్షురాలిగా గంగామణిని నియమించారు. ఈమేరకు నియామకపత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పని చేయాలని సూచించారు. -
శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నిర్మల్టౌన్: మహాశివరాత్రికి ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ నిర్మ ల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ బస్సులు 25, 26, 27 తేదీల్లో నడుపుతుమని పేర్కొన్నా రు. వేములవాడకు 30 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సులు అదనపు చార్జీలు వసూలు చేస్తామన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపా రు. వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.140 చార్జి ఉంటుందని పేర్కొన్నారు. కదిలి పాపహరేశ్వర్, బూరుగుపల్లికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30, కాల్వకు పెద్దలకు రూ.40, పిల్ల లకు రూ.20 చార్జి వసూలు చేయనున్నట్లు వివరించారు. ఏదైనా గ్రామంలో 50 మంది ఉంటే బస్సు పంపుతామన్నా రు. వివరాలకు 9959226003, 9492767879 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
కుంటాల/సోన్/సారంగాపూర్/భైంసాటౌన్: గురుకుల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని లెఫ్ట్ పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్, నిర్మల్ జిల్లా సమన్వయ అధికారి ఆర్.ప్రశాంతి, సూపరింటెండెంట్ నవీన్కుమార్, సారగాపూర్ పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, భైంసా పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత తెలిపారు. తెలిపారు. ఐదో తరగతి నుంచి 9వ తరగతిలో అడ్మిషన్ కోసం జిల్లాలోని ఎంపిక చేసిన 15 సెంటర్లలో 23(ఆదివారం) ఫిబ్రవరి 2025 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ , బ్లూ, బ్లాక్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకుని రావాలని వివరించరు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. వివరాలకు 7995010575, 9642200405 నంబర్లను సంప్రదించాలన్నారు. -
నిర్మల్
పుస్తకరాజం పుస్తకం హస్తభూషణం అనేవారు అయితే ప్రస్తుతం సెల్ఫోన్ హస్తభూషణంగా మారింది. కానీ ఇప్పటికీ కొందరు గ్రంథాలయాల్లో పుస్తకాలతో విజ్ఞానాన్ని పొందుతున్నారు. ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సీఎంను కలిసిన కోనప్ప సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్లో సీఎంతో భేటీ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులు రద్దు చేయడం, స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని కోనప్ప ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాదని బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. కాగజ్నగర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరైన సమావేశానికి దూరంగా ఉండడంతో కోనప్ప కాంగ్రెస్ను వీడుతారనే సంకేతాలు వెళ్లాయి. సీఎంను కలిసిన తర్వాత పార్టీలోనే కొనసాగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల పెండింగ్పై సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.నిర్మల్చైన్గేట్: ఎల్ఆర్ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ ప్రకటనతో దరఖాస్తుదారులు ముందుకొస్తారని భావిస్తుండగా.. భారీగా పేరుకుపోయిన దరఖాస్తుల పరిశీలన అరకొరగా ఉన్న సిబ్బందికి భారంగా మారుతోంది. ఈఏడాది మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయితే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేరు. దీంతో పరిశీలన పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజు చెల్లించింది 51 మందే.. మూడు మున్సిపాలిటీల పరిధిలో 26,726 మంది, గ్రామీణ ప్రాంతంలో 19,286 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో మున్సిపాలిటీల పరిధిలో మూడు నెలల వ్యవధిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించి 2,695 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. కానీ అందులో కేవలం 50 మంది మాత్రమే ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఇంకా 2,645 మంది ముందుకు రాలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని 18 మండలాల పరిధిలో 17,949 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒక్కరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కో దశ దాటితేనే.. తొలుత సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆపై మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన బృందం పరిశీలన చేపట్టాలి. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని యాప్లో అప్లోడ్ చేస్తుంది. అదే సమయాన భూములు నీటి వనరుల బఫర్జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో లేవని ధ్రువీకరించాలి. ఇదంతా మూడు దశల్లో జరగాల్సి ఉన్నా చాలా సమయం పడుతోంది. రూ.కోట్లలో ఆదాయం.. 2001లో ఎస్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగతా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వేగవంతం కానున్న ప్రక్రియ..! ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో, ఆలోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించటం సాధ్యమవుతుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లను మూడు శాఖల అధికారులు పరిశీలించిన తర్వాతే క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 40 రోజుల గడువు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి, స్పెషల్ డ్రైవ్ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది.న్యూస్రీల్సీఎం సమావేశ స్థలం మార్పు నిర్మల్చైన్గేట్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో నిర్వహించే సమావేశ స్థలం మార్చినట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై సీఎం సమావేశం విజయవంతం చేయాలని కోరారు. క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ మార్చి 31 వరకు గడువు జిల్లావ్యాప్తంగా 44,970 దరఖాస్తులు ఇప్పటివరకు ఫీజు చెల్లించింది51 మందే.. మొత్తం వచ్చిన దరఖాస్తులు 44,970 ప్లాట్లు 44,436 లేఅవుట్లు 534మండలాల వారీగా దరఖాస్తులు మండలం ప్లాట్లు లేఅవుట్లు బాసర 2,598 36 భైంసా 1,578 15 దస్తూరాబాద్ 6 0 దిలావర్పూర్ 171 10 కడెం 77 1 ఖానాపూర్ 1,648 27 కుభీర్ 621 9 కుంటాల 372 13 లక్ష్మణచాం 269 11 లోకేశ్వరం 319 9 మామడ 59 3 ముధోల్ 622 8 నర్సాపూర్(జి) 218 5 నిర్మల్ రూరల్ 5,596 94 పెంబి 65 4 సారంగాపూర్ 1,985 30 సోన్ 1,588 15 తానూర్ 157 5 ఊరట నిచ్చేలా రాయితీ.. ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ దరఖాస్తుదారులకు కలిసొస్తుంది. ఒక ప్లాట్కు సంబంధించి రోడ్లు, పైపులైన్లు, ఇతర సౌకర్యాలు లేకుండా ఏర్పాటుచేసినందుకు ఎల్ఆర్ఎస్ చార్జీలు విధిస్తుంటారు, వీటితోపాటు గ్రీన్ ల్యాండ్కు 10 శాతం స్థలాన్ని ఇవ్వనందుకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం విలువను లెక్కించి దానిపై 14 శాతం చార్జి విధిస్తారు. ఈ రెండూ చెల్లిస్తేనే యజమానికి స్థలం రెగ్యులరైజ్ అవుతుంది. మొత్తంగా రాయితీతో దరఖాస్తుదారులకు ముందుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే సమయాన అదనపు సిబ్బందిని కేటాయించాలనే సూచనలు వస్తున్నాయి.ఈనెల 21వ తేదీ వరకు మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు.. మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు అనుమతి ఫీజు చెల్లించినవి పొందినవి ఖానాపూర్ 1,928 8 8 నిర్మల్ 15,515 2,100 42 భైంసా 9,044 587 0 -
విధులపై అవగాహన కలిగి ఉండాలి
నిర్మల్చైన్గేట్: ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా తమ విధులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ మందిరంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 46 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల రోజు ముందు, ఉదయమే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియానికి చేరుకుని తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని తీసుకుని, తమకు ఇచ్చిన సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 14 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని ఓటర్లు ఓటు వేయడానికి తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈ గుర్తింపు కార్డులలోని చివరి 4 అంకెలను సంబంధిత ఫారాలలో అధికారులు నమోదు చేయాలన్నా రు. పోలింగ్ పూర్తయిన వెంటనే సామగ్రిని జాగ్రత్తగా నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలన్నారు. అనంతరం అధికారుల సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు. సమావేశంలో మాస్టర్ ట్రెయినర్లు రవి, లింబాద్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట చర్యలు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, తది తర అంశాలపై మాట్లాడారు. జిల్లాలో మొత్తం 19,107 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇందులో 17141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 149 పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎన్నిక ల సామగ్రిని ఈనెల 26న ఎన్నికల అధికారులకు అప్పగిస్తామన్నారు. రేపటి నుంచి 26వ తేదీ వరకు ఓటరు గుర్తింపు స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు. ఓటరు ఓటు వినియోగంపై అవగాహన పెంపొందించడానికి ఆర్డీవో కార్యాలయంలో 24, 25వ తేదీల్లో అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వరి కొనుగోలు ప్రక్రియకు యాప్.. అనంతరం పౌరసరఫరాల శాఖపై కలెక్టర్ మట్లాడుతూ జిల్లాలో ప్రత్యేకంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై యాప్ను తయారు చేసినట్లు తెలిపారు. సమయానికి సీఎంఆర్ బియ్యాన్ని అందివ్వని 8 మంది రైస్ మిల్లర్లను గుర్తించి, రెవెన్యూ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిహారం చెల్లించని మిల్లర్ల నుంచి దాదాపు 30 ఎకరాల భూమిని, ఇతర ఆస్తులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి బ్లాక్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. పకడ్బందీగా బాలశక్తి కార్యక్రమం... జిల్లాలో ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న బాలశక్తి కార్యక్రమంలో ఇప్పటివరకు 20 వేల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య కార్డులు రూపొందించినట్లు తెలిపారు. నిర్మల్ ఉత్సవాల విజయవంతంలో కీలకపాత్ర పోషించిన పౌర సంబంధాల అధికారిని, ప్రింట్, ఎలక్టాన్రిక్ పాత్రికేయులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్, డీఎస్వో కిరణ్కుమార్, డీఎం వేణుగోపాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, ఈడీఎం నదీం, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.