Nirmal
-
అవినీతి శాఖలు
నిర్మల్అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్ టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యపై పోలీసులు తక్షణం స్పందించి పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజ లకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలంటే నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్ప ద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.నిర్మల్: జిల్లాలో ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా.. ఎంతమందిపై కేసులు పెడుతున్నా.. కలెక్టర్ వర కూ ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి మాత్రం తగ్గడం లేదు. గ్రామ పంచాయతీ మొదలుకుని కలెక్టరేట్ వరకూ ప్రతీ పనికో రేటు.. అన్నట్లుగా వసూళ్లరాజ్యం కొనసాగుతోంది. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, రిజి స్ట్రేషన్స్ ఇలా ఆ శాఖ, ఈ శాఖ అని కాదు.. దాదాపు అన్నిచోట్లా పని కంటే.. సంపాదనపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఎక్కడికక్కడ ఓ రేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది మండలస్థాయి అధికారులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి. ఫీల్డ్ విజిట్ లేకున్నా.. జిల్లాలో ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు, పేమెంట్లు చేసే ఓ శాఖలో వాహనాల పేరిట డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత శాఖ అధికారికి ఫీల్డ్వర్క్ ఉండదు. కేవలం ఆఫీస్ పని మాత్రమే ఉంటుంది. అయినా ఓ ప్రైవేటు టాక్సీ కారు ను అద్దెకు తీసుకున్నట్లు అగ్రిమెంట్ చేసుకుని, నెలకు రూ.30 వేలకుపైగా బిల్లులు పెట్టుకున్నట్లు కలెక్టర్తోపాటు ఏసీబీ అధికారులకూ ఫిర్యాదు వెళ్లింది. ‘ఇండస్ట్రియల్’లో ఉందంటూ.. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ప్లానింగ్పైనా ఆ రోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతి కో సం వెళ్తే ఇందులో పనిచేసే కొంతమంది డబ్బులిస్తే కానీ రాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్పై పెద్దగా అవగాహన లేని ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే ‘నీది ఇండస్ట్రియల్ ఏరియా’లో ఉంది. పర్మిషన్ రావాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం. అలాగే.. రెవెన్యూ విభాగంలో పనిచేసే సిబ్బంది గతంలో డబ్బులు తీసుకుని ఆస్తిపన్నులనూ తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పని గోరంత.. బిల్లు కొండంత.. ‘ఏం అన్నా.. గింత తక్కువ బిల్లు రాసినవ్.. గిట్లయితే మేమెట్ల బతకాలె. నేను చెప్పింది రాసియన్నా..’ అంటూ జిల్లాకేంద్రంలోని ఓ షాపు నుంచి వస్తువులు తీసుకెళ్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి అన్న మాటలివి. చేసే పనులకు, వారు రాసిచ్చే బిల్లులకు పొంతన ఉండటం లేదు. జిల్లాలోని చాలామంది పంచాయతీ కార్యదర్శులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయినా చాలామందిలో మార్పు కనిపించడం లేదు. ప్రతినిధులదీ అదే దారి..! సారంగపూర్ మండలంలో ఓ చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకునే యువకుడు ఇటీవల మృతిచెందాడు. సామాన్య కుటుంబం కావడంతో అదే పనిని తన తమ్ముడికి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధిత ప్రతినిధి డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం. రూ.2 లక్షలు ఇచ్చుకోలేని ఆ కుటుంబం కన్నీళ్లతో వెనుదిరిగింది. జిల్లాకేంద్రంలోని మెడికల్కాలేజీలో అవుట్సోర్సింగ్ నియమాకాల్లోనూ డబ్బులివ్వనిదే పోస్టులు ఇవ్వలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. వాటిని అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల బాసర ట్రిపుల్ఐటీలోనూ సెక్యూరిటీ గార్డుల నియమాకాల్లో ఇదేతంతు కొనసాగింది. చాలాచోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు మధ్యవర్తిత్వం పేరిట సదరు అధికారులతో కుమ్మకై ్క ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి.ఫిర్యాదులు చేస్తున్నా.. పైసావసూళ్లు, శాఖల్లో అవినీతిపై చాలాసార్లు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా.. జిల్లా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ఓ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వాహనం పేరిట బిల్లులు లేపిన విషయంపై గత కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చేయి తడిపితేనే సర్టిఫికెట్..మిగతా శాఖలతో పోలిస్తే రెవెన్యూశాఖలో అవినీతి అధికంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. ఎంతోకొంత చేతిలో పెట్టాల్సిందేనని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీలు, పైచదువులకు వెళ్లే పిల్లలకు కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర సర్టిఫికెట్లు అవసరం. వీటిని ఇవ్వడానికీ.. డబ్బులు ఆశిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.నెలనెలా వసూలు.. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే ఎకై ్సజ్శాఖలో కొంతమంది సొంత ఆదాయాన్నీ సమకూర్చుకుంటున్నా రు. ప్రతీ వైన్స్ నుంచి నెలకు ఇంత చొప్పున సంబంధిత అధికారులకు మాముళ్లు వెళ్తున్నాయి. ఇందుకు వైన్సుల పరిధిలో కొనసాగే బెల్ట్షాపులను, మద్యం అమ్మకాలను చూసీచూడనట్లుగా వదిలేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాలతోపాటు సిట్టింగ్ నడిపించే హోటళ్లు, దాబాల నుంచీ రెండుమూడు నెలలకోసారి మాముళ్లు అందుతాయని, అందుకే సదరు సిట్టింగ్ల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. -
ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు
బాసర: నిజామాబాద్–భైంసా ప్రధాన రహదారిపై బాసర పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్అండ్బీ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రధాన రహదారిని పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 26 యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. -
తుదిదశకు ధాన్యం కొనుగోళ్లు
భైంసాటౌన్: జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓవైపు అధిక దిగుబడులు, అకాల వర్షాలు, మరోవైపు గోదాముల కొరత వెరసి ధాన్యం సేకరణలో జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈసారి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ నేపథ్యంలో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఎట్టకేలకు అధికార యంత్రాంగం ధాన్యం సేకరణలో సఫలీకృతమైంది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో గోదాములు, రైస్మిల్లులకు తరలించారు. జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. దొడ్డు వడ్లే ఎక్కువ.. జిల్లాలో ఈసారి దొడ్డురకం ధాన్యమే ఎక్కువ మొత్తంలో సేకరించారు. రబీ సీజన్లో 1,83,980 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. 60 కేంద్రాల్లో 21.298 వేల మెట్రిక్ టన్నులు సన్నరకం, 235 కేంద్రాల్లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. మొత్తంగా 1.64 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ.394 కోట్లు కాగా, ఇప్పటివరకు 16,508 మంది రైతులకు రూ.187 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. మరో 14,282 మంది రైతులకు రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది. లక్ష్యం మేరకు కొనుగోలు.. జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం సేకరణ దాదాపు పూర్తయింది. 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా, మరో 19 వేల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. – సుధాకర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ -
నిజాయతీ చాటుకున్న పార్పల్లి వాసి..
లక్ష్మణచాంద: తన ద్విచక్ర వాహనంలో ఇతరుల డబ్బులు రావడంతో ఇంటికి వెళ్లిన తరువాత గమనించి తనవి కావని తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు మండలంలోని పార్పల్లి వాసి. మండల కేంద్రానికి చెందిన గంట శంకర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి పంట డబ్బులను అవసరం నిమిత్తం రూ.30 వేలు విత్డ్రా చేసుకుని తన బైకులో పెట్టుకున్నా అనుకుని పార్పల్లికి చెందిన ఒడిషెల భీమేష్ బైక్లో పెట్టాడు. ఇంటికి వెళ్లిన శంకర్ తన బైకు కవర్లో డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెంది మళ్లీ బ్యాంకు వచ్చాడు. ఇదే భీమేష్ బ్యాంకుకు పని నిమిత్తం వచ్చి అనంతరం ఇంటికి వెళ్లాడు. తన ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్లో డబ్బులు చూసి షాక్ అయ్యాడు. తేరుకుని తనవి కావని వెంటనే లక్ష్మణచాంద బ్యాంకుకు చేరుకున్నాడు. తన బైకులో ఎవరివో రూ.30 వేలు వచ్చాయని మేనేజర్ రాజశేఖర్కు తెలిపాడు. ఆందోళనతో వచ్చిన శంకర్ డబ్బులుగా గుర్తించి భీమేష్ చేతుల మీదుగా శంకర్ తల్లి ముత్తవ్వకు అందచేశారు. వారు భీమేష్ను అభినందించారు. కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీ చాటుకున్న హోంగార్డు బాసర: బాసర ఆలయ సిబ్బంది మరోమారు నిజాయతీ చాటుకున్నారు. ఇటీవలే హైదరా బాద్కు చెందిన ఓ భక్తురాలి బంగారు చెవిపో గు ఆలయ ఆవరణలో పడిపోగా, వెతికి అప్పగించారు. తాజాగా కుంటాల మండలం లింబ (కే)గ్రామానికి చెందిన సునీత అనే భక్తురాలు సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవా రి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కో సం క్యూలైన్లో పర్సు పోగొట్టుకుంది. అందులో ఆధార్, ఏటీఎం కార్డు, సెల్ ఫోన్, రూ.2 వే ల నగదు ఉన్నాయి. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విధులు నిర్వహిస్తున్న ఆల య హోంగార్డులు ఇందాల్ నారాయణ పర్సు ను వెతికి భక్తురాలికి తిరిగి అప్పగించాడు. హోం కార్డును భక్తులు అభినందించారు. -
సర్పంచులకు తీపి కబురు
లక్ష్మణచాంద: నూతనంగా ఎన్నికై న సర్పంచులు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచుల గౌరవ వేతనాలు విడుదల చేసింది. 2025 డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న సర్పంచులు అదే నెల 20వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 10 రోజులు, 2026 జనవరి నుంచి మే నెల వరకు (5 నెలలు) మొత్తం ఆరు నెలల గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. జిల్లాకు ఇలా.. జిల్లాలో మొత్తం 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెర్కపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడంతో 399 మంది సర్పంచులు ఉన్నారు. ఇందులో 10 మంది సర్పంచుల గౌరవ వేతనాలకు కొన్ని కారణాలతో అప్రూవల్ కాలేదు. మిగిలిన 389 మంది సర్పంచుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. 10 మంది సర్పంచుల వేతనాలు కూడా త్వరలోనే అనుమతి పొంది విడుదల అవుతాయని అధికారులు తెలిపారు. వేతనాల మొత్తాన్ని సర్పంచ్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ట్రేజరీకి పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వేతనాలు విడుదలైన విషయం తెలిసి జిల్లా సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్లు ఇక ముందు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అంటున్నారు. 389 మంది సర్పంచులకు నెలవారీ విడుదలైన మొత్తాలు.. డిసెంబర్ (10 రోజులు) రూ.8,13,010 జనవరి రూ.25,28,500 ఫిబ్రవరి రూ.25,28,500 మార్చి రూ.25,22,000 ఏప్రిల్ రూ.25,15,500 మే రూ.25,15,500 మొత్తం 1,34,27,838సర్పంచ్ల ఖాతాల్లో జమ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రథమ పౌరుల డిసెంబర్ నెలలో 10 రోజులతోపాటు, జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు విడుదల చేసింది. జిల్లాకు రూ.1,34,27,838 విడుదల అయ్యాయి. వేతనాలను సర్పంచుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నాం. – శ్రీనివాస్, డీపీవో -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్ట ర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీని నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై శ్రీడీఏపీపై దోపిడీశ్రీ శీర్షికన సోమవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారుల విచా రణ చేశారు. నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్ లైసెన్సును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వానాకా లం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మరో నలుగురు ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేయడం, ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, నకిలీ విత్తనాల విక్రయం వంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. -
పునఃప్రారంభానికి సర్వం సిద్ధం
లక్ష్మణచాంద: పాఠశాలల వేసవి సెలవులు మరో ఆరు రోజుల్లో ముగియనున్నాయి. ఈనెల 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. పునఃప్రారంభం ఏర్పాట్లపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లాలో మొత్తం 830 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈనెల 12 నాటికి పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు పొడిగించారు. దీంతో ఈనెల 15న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సాక్షి: పాఠశాలల్లో పారిశుధ్యం పనులు మొదలు అయ్యాయా? ఎవరు చేస్తున్నారు? డీఈవో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కావేంజర్లు ఉన్నారు. వారితో పరిసరాలు, తరగతి గదులు, బెంచీలు, మూత్రశాలలు శుభ్రం చేయించాలని హెచ్ఎంలకు సూచించాం. ప్రారంభం నాటికి పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈవోల ద్వారా ఆదేశాలు ఇచ్చాం. సాక్షి: కొన్ని పాఠశాలల్లో భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పాఠశాలల్లో ఇబ్బందులు అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: కలెక్టర్ భవేశ్ మిశ్రా అనుమతితో అసంపూర్తి పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. నూతన నిర్మాణాలు పూర్తి చేసేలాగా ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుటాం. సాక్షి: 2026–27 బడిబాట కార్యక్రమంలో ఎంత మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు? డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాం. నమోదు ఇంకా కొనసాగుతోంది. ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను తెలియజేస్తూ చేర్పించేలాగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంచేలా చూస్తున్నారు. సాక్షి: విద్యార్థులకు యూనిఫామ్ అందిస్తున్నారా? డీఈవో: విద్యార్థులకు అందించే యూనిఫామ్కు సంబందించిన వస్త్రం ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. ఇప్పటికే విద్యార్థుల కొలతలు స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకుని కుట్టడానికి సిద్దంగా ఉన్నారు. వస్త్రం రాగానే కుట్టుపని ప్రారంభించి ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు అందేలా చూస్తాం. సాక్షి: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా? ఏమైనా సర్దుబాటు చేస్తారా? డీఈవో: జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఎక్కువ ఉండి సరిపడా ఉపాధ్యాయులు లేకుంటే తక్కువ విద్యార్థులు ఉఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. సాక్షి: విద్యార్థుల తల్లిందడ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? డీఈవో:ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అంకితభావం, అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఉచితంగా ప్రభుత్వం అంద చేస్తుంది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పాఠశాలల్లో అని వసతులు కల్పిస్తున్నాం. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట పాఠశాలల హంగురు చూసి మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి. సాక్షి: విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు వచ్చాయా? ఎప్పుడు పంపిణీ చేస్తారు? డీఈవో: అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పార్ట్–1 పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. వాటిని ఆయా పాఠశాలలకు కూడా పంపిణీ చేశాం. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అందిస్తాం. -
ప్రతిభా పురస్కారాలు ప్రదానం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవ న్లో ఏకలవ్య, దివ్యాంగ శక్తి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు ప్ర దానం చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డీఈవో భోజన్న హాజరై మాట్లాడా రు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, మౌలి క వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫౌండేష న్ల సేవలను ప్రశంసించారు. ఏకలవ్య ఫౌండేష న్ చైర్మన్ వెంకట్రావు, ట్రస్టీ ది గంబర్, బాధ్యులు ప్రశాంత్, రామ్మోహన్, శంకర్, ముత్యం, దివ్యాంగ శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేశ్, ఎంసీ లింగన్న, ఎంఈవోలు పద్మ, సంధ్యారాణి, సదానంద్, నరేందర్, శ్రీహరి ఉన్నారు. -
వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.
డీఏపీపై దోపిడీ!భైంసాటౌన్: జిల్లాలో రైతులు ఏటా దోపిడీకి గురవుతూనే ఉన్నారు. సాగు చేసిన నుంచి పంటలు విక్రయించేదాకా మోసాలకు గురవుతూ వస్తున్నారు. ఎరువులు, విత్తనాల దుకాణా దారులు అమాయక రైతులను నిలువునా ముంచుతూనే ఉన్నారు. జిల్లాలో తాజాగా డీఏపీ విక్రయాల్లో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్ నేపథ్యంలో రైతులు డీఏపీ కోసం డీలర్ల వద్దకు వెళ్తుండగా వారు యుద్ధం సాకుతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.300 అధికంగా వసూలు! కేంద్ర ప్రభుత్వం 50 కేజీల డీఏపీ బస్తా గరిష్ట రిటైల్ ధరను రూ.1,350గా నిర్ణయించింది. కానీ, జిల్లాలో ని ఎరువుల డీలర్లు రూ.1650కి విక్రయిస్తూ బిల్లు మాత్రం రూ.1,350కే ఇస్తున్నారు. అంతే కాకుండా.. డీఏపీ కోసం వెళ్తే ఇతర ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా కొనాలని షరతులు విధిస్తున్నారు. నిర్మల్, భైంసాలో ఎరువులు, విత్తన డీలర్లు ఎక్కువగా ఉండగా, ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో గతేడాది 10,903 మెట్రిక్ టన్నులు డీఏపీ విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,573 మెట్రిక్ టన్నులు విక్రయించారు. డీఏపీ బస్తాను రూ.300 అధికంగా విక్రయిస్తూ.. జిల్లాలో రూ.2కోట్లకు పైగా రైతులను దోచుకున్నారు. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ఎరువుల డీలర్లు డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే రైతులు మా దృష్టికి తీసుకురావాలి. అలాంటి డీలర్లపై చర్యలు తీసుకుంటాం. రైతులు ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. – అంజిప్రసాద్, డీఏవోకొరతతో రైతుల అవస్థలు ముధోల్: జిల్లాలో కొన్నిచోట్ల రైతులకు సరిపడా డీఏపీ అందుబాటులో లేదు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమై డీఏపీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పీఏసీఎస్ కా ర్యాలయాల్లోనూ డీఏపీ లేక ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఎమ్మార్పీ ధర కంటే అ ధికంగా విక్రయిస్తూ రైతులను ముంచుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తో ందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీఏపీ సరిపడా అందుబాటులో ఉంచాలని, అధిక ధరకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘సమీకృతం’.. అసంపూర్ణం
భైంసాటౌన్: పట్టణంలోని ఏఎంసీకి చెందిన మిర్చి యార్డు స్థలం రెంటికి చెడ్డ రేవడిలా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వెజ్, నాన్వెజ్, పండ్లు, పూల మార్కెట్లన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా భైంసాకు రూ.7.20 కోట్లతో సమీకృత మార్కెట్ మంజూరు చేసింది. స్థానిక మిర్చియార్డు ఆవరణలో 33 గుంటల స్థలంలో 2021లో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దాదాపు 50శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్లకుపైగా పనులు జరగక, భవనం అసంపూర్తిగా మిగిలింది. దీనికితోడు భవనం కోసం కేటాయించిన ఏఎంసీ స్థలం నిష్ప్రయోజనంగా మారగా, మార్కెట్ నిర్మా ణం కోసం ఏఎంసీకి చెందిన దుకాణా సముదాయాన్ని కూడా కూల్చివేశారు. ఇటు మార్కెట్ వినియోగంలోకి రాక, అటు దుకాణాలకు అద్దెల రూపంలో ఆదాయం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. స్థలం పాయె.. అద్దెలు పోయె! ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం మిర్చియార్డులో 33 గుంటల స్థలం కేటాయించారు. ఇందుకోసం ఏఎంసీకి చెందిన దాదాపు పదికిపైగా గదులు కూల్చివేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాల భవనాన్ని కూడా కూల్చేశారు. ప్ర స్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచి మార్కెట్ అందుబాటులోకి రాకపోగా, ఏ ఎంసీ స్థలం, దుకాణాల కూల్చివేతతో అద్దెల రూ పంలో వచ్చే ఆదాయం కోల్పోవడం గమనార్హం. వినియోగంలోకి తెస్తేనే.. భైంసా పట్టణంలో ప్రతీ సోమవారం వారసంత ని ర్వహిస్తారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామా ల నుంచి కూరగాయలు విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు వస్తుంటారు. పట్టణంలో ప్రధాన రోడ్ల వెంబడి పండ్లు, పూలు, చికెన్, మటన్, ఫిష్ వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం పూర్తయితే అందులోనే వెజ్, నాన్వెజ్ మార్కెట్లతోపాటు పూలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశముండేది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా నిలిచి రోడ్ల పక్కన కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ విక్రయాలు చేపడుతుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు. -
నాణ్యమైన పోషకాహారం అందించాలి
నిర్మల్చైన్గేట్: అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక‘, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం అంగన్వాడీ టీచర్లకు ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రపంచ ఆహా ర భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహార నియమాలు అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. భవిష్యత్లోనూ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధి కారి వినూత్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కృషి, పట్టుదలతోనే ఫలితం
నిర్మల్ఖిల్లా: కృషి, పట్టుదలతో లక్ష్యం చేరుకో వచ్చని, తద్వారా సమాజంలో గుర్తింపు లభి స్తుందని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్ర భాకర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ కీబోర్డ్లో గిన్ని స్ రికార్డు సాధించిన నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లికి చెందిన దేవోల్ల అనూషను ఆదివారం టీఎన్జీవోల సంఘ భవనంలో సన్మానించారు. తల్లిదండ్రులకు అభినందనలు తెలి పారు. ఆయా సంఘాల నాయకులు భీమ సు రేందర్, ఆనంద్, అశోక్కుమార్, సత్యనారాయణగౌడ్, సుకుమార్, రాములు, అశోక్, ముత్త న్న, స్వామి, గంగారాం పాల్గొన్నారు. -
నిర్మల్
● ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వం ● రుణాల కోసం నిరీక్షిస్తున్న యువతబుస కొడుతున్న సర్పాలు జనావాసాలు, వీధులు, రోడ్లపై విష సర్పాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రక్త పింజరలు, నాగుపాములు ఇళ్లలోకి దూరి ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.గజ్జలమ్మా.. కరుణించమ్మా.. కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మహా రాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్, హిమాయత్నగర్, ఇస్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఆలయానికి చేరుకుని బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు, ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించా రు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, నగేశ్ ఆ ధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ తదితర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. నిర్మల్చైన్గేట్: రాజీవ్ యు వ వికాసం పథకం లబ్ధి దారుల ఎంపికతోనే ఆగిపోయింది. యువతకు స్వ యం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే నెలలో అర్జీలు స్వీకరించిన ప్ర భుత్వం రుణాల ఊసే ఎ త్తడం లేదు. గతేడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు ఇస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మిన్నకుండి పోయింది. అనంతరం దరఖాస్తుల పరిశీలన ప్రక్రి య పూర్తి చేసింది. ఆ తర్వాత రాజీవ్ యువ వికా సం పథకం అమలుపై కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు. నిరాశ చెందుతున్న యువత గత ప్రభుత్వాలు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజికవర్గాల యువతకు రాయితీపై రుణాలు పంపిణీ చేసేవి. దీంతో లబ్ధిదారులు రాయితీ పొందేవారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు, బీసీ బంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘రాజీవ్ యువ వికాసం’ కింద రాయితీ రుణాలివ్వడానికి నిర్ణయించింది. దీంతో ఏడాది క్రితం జిల్లాలోని సుమారు 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ రుణం పంపిణీ చేయకపోవడంతో వారిలో నిరాశే మిగిలింది. దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ఇంటర్వ్యూలు నిర్వహించి.. తొలుత ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూని ట్ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబర్ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2 లో రూ.లక్ష రుణాల వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కాగా, ముఖ్యంగా సిబిల్ స్కోర్ను మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశముంటుంది.మండలాలవారీగా వచ్చిన దరఖాస్తులు మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బాసర 25 196 403 115 భైంసా 82 638 1,228 253 దస్తురాబాద్ 161 302 488 2 దిలావర్పూర్ 130 191 534 163 కడెం 412 690 930 83 ఖానాపూర్ 274 536 957 67 కుభీర్ 469 431 1,234 107 కుంటాల 94 261 799 89 లక్ష్మణచాంద 103 280 717 78 లోకేశ్వరం 110 431 811 74 మామడ 325 238 501 124 ముధోల్ 95 338 586 298 నర్సాపూర్ (జి) 88 229 644 164 నిర్మల్ రూరల్ 178 334 869 70 పెంబి 207 97 234 20 సారంగపూర్ 499 425 1,387 160 సోన్ 101 204 722 75 తానూర్ 143 375 755 95 భైంసా బల్దియా 21 383 952 1,218 ఖానాపూర్ బల్దియా 28 259 784 340 నిర్మల్ బల్దియా 82 514 2,757 2,376 కార్పొరేషన్ దరఖాస్తులు యూనిట్లు రాయితీ (రూ.కోట్లలో) ఎస్సీ 7,350 2,894 39.96 ఎస్టీ 3,627 2,325 25.35 బీసీ 17,286 3,876 41.00 ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90 మైనార్టీ 5,926 1,045 17.41 క్రిస్టియన్ 65 27 0.42బ్యాంకులు సమ్మతించినా.. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తే 100 శాతం, రూ.లక్ష వరకు 90శాతం, రూ.2లక్షల వర కు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70శాతం రాయితీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ మంది రూ. 4లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా రు. బ్యాంకులూ సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీచేయలేకపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పునరాలోచన చేసి పథకాన్ని పునరుద్ధరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
కవి వెంకట్కు పురస్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్కు చెందిన ప్రముఖ పద్యకవి, ఉమ్మడి జిల్లా సంస్కృత భాషా ప్రచార స మితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఆది వారం నిర్వహించిన ఏడో ప్రపంచ తెలుగు సా హిత్య మహాసభల్లో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభల్లో డాక్టర్ కత్తిమండ ప్రతాప్కుమార్, జి.ఈశ్వరీభూషణం, డాక్టర్ టి.పార్థసారథి, కేవీవీ సత్యనారాయణరాజు చేతుల మీదుగా వెంకట్కు పురస్కారం ప్రదానం చేశారు. మహాసభల్లో డాక్టర్ వెంకట్ విశిష్ట అతిథిగా, సమన్వయకర్తగా పాల్గొని తెలుగు భాషా వైభవంపై పద్యపఠనం, గానం చేసి ఆకట్టుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా వెంకట్కు పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6 నుంచి 12 వరకు వారం రోజులు ఈ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, అధునాతనమైన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, విశాలమైన క్రీడామైదానం, ఎన్సీసీ లాంటి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూ చించారు. ఇందులో వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు శ్రీనివాస్, శ్రీహరి, పీజీ.రెడ్డి, సూర్యసాగర్, కట్టా రమేశ్రెడ్డి, హేమలత, సుభాష్, పవన్, రజిత పాల్గొన్నారు. -
20న ప్రత్యేక లోక్అదాలత్
నిర్మల్టౌన్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారాని కి ఈనెల 20న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా ప్రధాన కోర్టులో జిల్లా జడ్జి, ఎస్పీ పోలీస్ అధికారులతో శనివారం కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై చర్చించారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా రు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. రాజీ పద్ధతిలో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ.. రాజీమార్గం రా జమార్గమని, చిన్నచిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ.. తిరుగుతూ సమయాన్ని, డబ్బుల ను వృథా చేసుకోవద్దని సూచించారు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకుని సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, అన్ని కోర్టుల జడ్జీలు, పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు
భైంసాటౌన్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలోని పలు ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దని డీలర్లకు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు తప్పనసరిగా రశీదు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఏడీఏ వీణ, ఏవో గణేశ్ ఉన్నారు. నూనె గింజలు, పప్పు దినుసులు సాగు చేయాలి కుంటాల: రైతులు నూనె గింజలు, పప్పు దినుసులు సాగు చేయాలని డీఏవో అంజిప్రసాద్ సూచించారు. మండలంలోని లింబా(కె), గ్రామంలో వానాకాలం పంటల సాగుపై గ్రామ సభ నిర్వహించారు. పంట మార్పిడి చేస్తే దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని జిల్లా హార్టికల్చర్ అధికారి బీవీ.రమణ సూచించారు. పంట పొలాల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటలు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీత, ఏఈవో శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
సర్కార్ బడికి జై..!
లక్ష్మణచాంద: విద్య నేటి రోజుల్లో వ్యాపారంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల బలహీనతే ప్రైవేటు విద్యాసంస్థలకు ఊతమిస్తోంది. తమ పిల్ల లకు ఉత్తమ విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. కార్పొరేట్ హంగులతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏటా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచి కూడా వేల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు పుస్తకాలు, ఐడీ కార్డులు, టై, బెల్టు, షూ పేరుతో మరింత దోపిడీ జరుగుతోంది. ఈ ఫీజులు సామాన్యులు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువు‘కొన’లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్య.. రాష్ట్ర ప్రభుత్వం పూర్వప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలల్లోనే అందించాలని సంకల్పించింది. గతేడాది కొన్ని పాఠశాలల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈసారి జిల్లాలోని 74 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అందుబాటులోకి తెస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చిన్నారులకు ఆటలు, పాటలతో కూడిన నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించనున్నారు. గ్రామాల్లో తీర్మానాలు.. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పూర్వప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో అందే విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందనుంది. మరో వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని ప్రజలు మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీడీసీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో తీర్మానాలు కూడా చేస్తున్నారు. లక్ష్మణచాంద మండలంలోని తిర్పెల్లి, పార్పల్లి గ్రామాల్లో తమ గ్రామంలోని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని వీడీసీల ఆధ్వర్యంలో ఇటీవల ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. బాబాపూర్ గ్రామంలో శనివారం గ్రామస్తులంతా కలిసి తమ పిల్లలను ఇకపై ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈ పరిణామాలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. -
వివేకానంద ఆవాసాన్ని సందర్శించిన జడ్జి
భైంసాటౌన్: పట్టణంలోని వివేకానంద నిరాశ్రిత పిల్లల ఆవాసాన్ని భైంసా కోర్టు జడ్జి వెంకటరమణ సుహాస్ శనివారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చదువుపై దృష్టి పెడితే ఎంతటి లక్ష్యమైనా చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అలాగే నూతనంగా నిర్మించిన అదనపు గదులను పరిశీలించారు. పిల్లలకు కల్పిస్తున్న వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆవాసం అధ్యక్షుడు శైలేష్ మాశెట్టివార్, న్యాయవాది సంతోష్ కుమార్, వందన, పోశెట్టి, ఆవాసం ఇన్చార్జి లింగారెడ్డి ఉన్నారు. -
నో పైరవీ.. నో రెక్వెస్ట్
● తాజాగా బాధ్యతలు కేటాయింపు సాక్షి, ఆదిలాబాద్: ఆదాయం అధికంగా ఉండే శాఖ ల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంటుందంటే అందులో పైరవీలు, రెక్వెస్టూలు సా ధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మ రో ఆఫీసర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వెనకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయితే ఎక్సైజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్ డిప్యూటీ కమిషనర్(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పోస్ట్ కావాలని పైరవీ చేసుకోలేదని, రెక్వెస్ట్ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం ఎకై ్సజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలకు ప్రమోషన్ లభించింది. డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్ కేటాయిస్తున్నారు. పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు, రెక్వెస్టు చేసుకుంటుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరు సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదా యం ఉండదనేది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థి తి అని బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా రఘురాం ఇన్చార్జి ఆఫీసర్గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఇన్చార్జి డీసీగా కొనసాగుతున్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్లను నియమించనున్నారని చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) లుగా హిమశ్రీ, నందా గోపాల్, జ్యోతి కిరణ్, రజాక్ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బది లీలు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్ కూడా పైరవీ, రెక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు. కొరవడిన పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లా బాస్ డీసీ ఇన్చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇన్చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్సుల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇటీవల జిల్లాలో గంజాయిసాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబాస్థావరాలపై పోలీ సులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉపాధ్యాయులను కేటాయించండి
నిర్మల్ రూరల్: మండలంలోని వెంగ్వాపేట్ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించాలని సర్పంచ్ సాద అనిత ఆధ్వర్యంలో గ్రామస్తులు డీఈవో భోజన్నకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉన్నారని, రాబోయే విద్యా సంవత్సరం మరింత మంది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే మూడు పోస్టులు ఉన్నాయని కానీ అందులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. విద్యా వలంటీర్లను నియమించడానికి గ్రామంపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. వెంటనే ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై పంపించాలని కోరారు. -
విభేదాలు వీడి అభివృద్ధి చేయండి
భైంసాటౌన్: ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చోటు చేసుకున్న ఘటనలు, వాటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం కారణంగా పట్టణ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, విభేదాలు వీడి పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మున్సిపాలిటీ అభివృద్ధి సమీక్షలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి మున్సిపల్ చైర్మ న్ తూమోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, అధికారులతో ప లు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమస్యలుంటే తమ దృష్టికి తేవా లన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరదల ని వారణ చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప రిశుభ్రత, మొక్కల పెంపకం, ఎస్ఐఆర్ ప్రక్రియ, తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ అంశాల పై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించా రు. కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తమ పరిధి కి లోబడి పని చేయాలని, అభివృద్ధికి విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు. కలిసి పనిచేయాలి.. పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విభేదాలకు తావు లేకుండా చూడాలని సూచించారు. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేలా కౌన్సిలర్లు చొరవ చూపాలని, సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత వ్యాఖ్య లు, కల్లోలాలు సృష్టించే పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించా లని ప్రజలకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, మున్సిపల్ కమిషనర్ లింగయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి నిర్మల్చైన్గేట్: మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఈ నెల 9న నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమం, నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు చెప్పారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి లబ్ధి దారులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీడి యో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
● ఈ నెలలో తప్పని అప్పులు బొమ్మను గీస్తే.. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. పేపర్, కాన్వాస్పై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, ఆలోచింపజేసే చిత్రకళలో నైపుణ్యం పెంచుకుంటున్నారు. ఎన్ఎంఎంఎస్కు 55 మంది ఎంపిక నిర్మల్ రూరల్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు జిల్లా నుంచి 55 మంది విద్యార్థులు ఎంపికై నట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్ మండలం మస్కాపూర్ ఉన్నత పాఠశాల నుంచి 26 మంది ఎంపిక కాగా, పొనకల్, బీరవెల్లి, మామడ, నర్సాపూర్(జి) పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున, రాజుర, మంజులాపూర్, జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ బాలికల పాఠశాల, లక్ష్మణచాంద ఉన్నత పాఠశాలల నుండి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారని తెలిపారు. మునియాల్, పెంబి, కడెం, లింగాపూర్, జాఫర్పూర్, కొరటికల్, కుభీర్, ఎడ్బిడ్, కుంటాల మోడల్స్కూల్ నుంచి ఒక్కొకకరు చొప్పున ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ వస్తుందని తెలిపారు. నిర్మల్: జూన్ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యకు సంబంధించిన ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల నేపథ్యంలో సాగు పనులకు సిద్ధమవుతుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతీ కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండూ వేలకువేలు ఖర్చుతో కూడుకున్నవే. రైతులకు రెండింతలు.. వర్షాకాలం ప్రారంభం కావడంతోనే పొలాల్లో పనులు మొదలుపెడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల వేతనాలు వంటి ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రా మాల్లో ధాన్యం, జొన్నలు మిగిలి ఉన్నాయి. వీటి డ బ్బులు చేతికొచ్చేవరకు ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఇటు సాగుపనులు, అటు పిల్లల చదువులకు అంటే.. తప్పని పరిస్థితుల్లో అప్పు చేయాల్సిందే. అదనపు ఖర్చులూ... ఈనెలలో ప్రారంభయ్యే వర్షాకాలం సీజన్లో పిల్లల చదువులు, సాగు పనులే కాదు.. ఇళ్ల మరమ్మతులు, పైకప్పుల లీకేజీల నివారణ, రెయిన్కోట్లు, గొడుగులు, వర్షాకాలానికి అవసరమైన ఇతర వస్తువుల కొనుగోళ్లు కూడా ఉంటాయి. మరోవైపు కూరగాయలు, పాలు, గ్యాస్, విద్యుత్ బిల్లులు, రవాణా ఖర్చులు వంటి నిత్యావసర వ్యయాలూ పెరుగుతున్నాయి. ఇవన్నీ కుటుంబ బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. కుంటాల మండలానికి చెందిన గంగాధర్ జీవనాధారం వ్యవసాయం. పిల్లల చదువుల కోసం నిర్మల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇటు పిల్లల చదువులను చూసుకుంటూ.. రెండుమూడు రోజులకోసారి ఊరికి వెళ్తూ భూమి సాగు చేయిస్తున్నాడు. యాసంగిలో మక్క, వరి దిగుబడి బాగానే వచ్చింది. మొన్ననే పంటలను విక్రయించాడు. ‘హమ్మయ్యా.. పెద్ద పనైపోయింది..’ అని అనుకుంటుండగానే పిల్లల స్కూల్ నుంచి ఫోన్కు మెసేజ్ వచ్చింది. పైతరగతుల పుస్తకాలు, యూనిఫామ్స్ వచ్చాయని, తీసుకోవాలని, వీలైతే ఇదేనెలలో మొదటి విడత ఫీజులనూ చెల్లించాలని సమాచారం ఇచ్చారు. మరోవైపు ఊళ్లో వానాకాలం సాగుపనులు మొదలుపెట్టారు. పంట అమ్మిన డబ్బులు ఎప్పుడు చేతికొస్తాయో కానీ.. ఇటు పిల్లల చదువులు, అటు సాగు పనులకై తే పైసలు కావాల్సిందే. తప్పని పరిస్థితుల్లో జూన్లోనూ అప్పుచేయాల్సిందే. ఇది ఒక్క గంగాధర్ పరిస్థితే కాదు.. జిల్లాలో వేలాది రైతులు, మధ్యతరగతి కుటుంబాలది కూడా. పిల్లల భవిష్యత్తు కోసం విద్యపై రాజీ పడలేరు. అటు పంట కోసం సాగు పనులనూ ఆపలేరు. ఈ నెలలో చాలా కుటుంబాలు ఇలాంటి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బడి ఖర్చులే అధికం..! పాఠశాలలు ప్రారంభం కావడంతో అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, షూస్, బ్యాగులు ఇలా అన్నీ మళ్లీ కట్టాల్సిందే. వీటికి వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్లకే కనీసం ఒక్కొక్కరికి కనీసం రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా మొదటి టర్మ్ ఫీజులనూ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బడిని మార్చి, కొత్త స్కూల్కు వెళ్తే మళ్లీ అక్కడ అడ్మిషన్ ఫీజు కట్టాలి. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
నిర్మల్చైన్గేట్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల కోసం ప్ర భుత్వం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 11వేల దివ్యాంగ పొ దుపు సంఘాల్లో దాదాపు 80వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్లలో పు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భ రోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్ట ర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం స్కూటీలు, అడ్వాన్స్డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరి కరాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రాంగణంలో కార్పొరేషన్ చైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి 38మంది దివ్యాంగులకు ప్రత్యేక స్కూటీలు అందజేశారు. మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి వినూత్న, అధికారులు పాల్గొన్నారు. -
‘అల్లంపల్లివాసుల సమస్యలు పరిష్కరిస్తాం’
కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి వా సుల సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. ఈనెల 4న అల్లంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యల పరిష్కారానికి గ్రామస్తులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అల్లంపల్లి రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సదుపాయం, పాఠశాల, అంతర్గతరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అ టవీశాఖ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శా శ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు వెల్ల డించారు. 10 నెలల్లో రోడ్డు పనులు ప్రారంభించడ మే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు, కలెక్టర్ భవేశ్మిశ్రా, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మండలంలోని గంగాపూర్లో రూ.5లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి, పెంబి మండలంలో మూడు ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు, గుమ్మెన ఎంగ్లాపూర్లో మొబైల్ టవర్ ఏర్పాటు, డీజీపీఎస్ సర్వే చేసి 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నిధులతో నవాబ్పేట్ నుంచి గంగాపూర్ వరకు గ్రావెల్ రోడ్డు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. నోటిఫైడ్ గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు అనుమతి కోసం త్వరలోనే మండలాల్లో పర్యటిస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ఖాజామొయినొద్దీన్, ఎంపీడీవో అరుణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న, పీఆర్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. పేదలకు అండగా ప్రజాప్రభుత్వం పెంబి: పేదలకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల కు చెక్కులు పంపిణీ చేశారు. పర్యావరణ దినోత్స వం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుడిసె రమేశ్, డీసీసీ కార్యదర్శి స్వప్నీల్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, సర్పంచులు సత్యనారాయణస్వామి, భీంరావు, నాయకులు రాజన్న, మహేందర్, పెద్దయ్య తదితరులున్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది. టీ–ప్రైడ్.. సబ్సిడీకి బ్రేక్ నిర్మల్చైన్గేట్: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు స్వ యం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రవేశపె ట్టిన టీ–ప్రైడ్ పథకం దరఖాస్తుదారులకు నిరా శే మిగిలింది. జిల్లాలో 356మంది దరఖాస్తు చే సుకోగా 192మందికి సబ్సిడీ వచ్చింది. మిగతా వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో టీ–ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యూబేషన్ దళిత్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీం) పథకాన్ని ప్రారంభించింది. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వాహనాలు కొనుగోలు చేసి ఉపాధి కల్పించేలా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 2026 వరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. జిల్లాకు సంబంధించి కొందరికే సబ్సిడీని మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ పథకంలో పురోగతి కరువైంది. వందల సంఖ్యలో లబ్ధిదారులు సబ్సిడీ అందక నిరాశలో ఉన్నారు. వాహనాలు ఓ వైపు పాతబ డిపోతుండగా గిరాకీలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సి న డబ్బులు రాక ఆర్థికంగా నలిగిపోతున్నారు. పలు రకాలుగా సబ్సిడీ టీ–ప్రైడ్ పథకం 2016లో ప్రారంభమైంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35నుంచి 45శా తం సబ్సిడీపై కార్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పొక్లెయినర్లు, టిప్పర్లు, ఇతర వ్యవసాయ, వ్యాపార రంగాలకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసి తద్వారా ఉపాధి పొందేలా అవకాశం కల్పించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంక్ రుణం ద్వారా వాహనాలు కొనుగోలు చేశాక ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తుంది. రూ.5కోట్లలోపు ఏదైనా యూనిట్ను ఎంచుకోవచ్చు. కానీ, సబ్సిడీ మాత్రం గరిష్టంగా రూ.75లక్షలే వస్తుంది. వస్తువుల తయారీ పరిశ్రమలు, ట్రాన్స్పోర్టు వాహనాల కొనుగోలు కేటగిరీల్లో మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం సబ్సిడీ అందిస్తుంది. పెండింగ్లో రూ.20 కోట్లు 2016 నుంచి 2025 వరకు జిల్లాలో 356 మంది వివిధ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరి లో 192 మందికే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరైంది. మరో 164 మందికి ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాకు ఇంకా రూ.20 కోట్ల స బ్సిడీ రావాల్సి ఉంది. 2020 జూలై నుంచి ఎస్టీలు, 2021 మార్చి నుంచి ఎస్సీలకు సబ్సిడీ మంజూరు కావడం లేదు. సబ్సిడీ మంజూరు ఇచ్చిన వారికీ నిధులు జమ చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు నిత్యం కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యాపారాలు ఆ శించినంతగా లేక, తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు ఆలస్యమైతే రుణాలిచ్చిన కంపెనీలు వాహనాలను జప్తు చేస్తున్నాయని, ఇంట్లో దాచుకున్న బంగారం అమ్మి వాయిదాలు కడుతున్నామని వాపోయారు. రూ.8.32 లక్షల సబ్సిడీ రావాలి టీ–ప్రైడ్ పథకంలో సబ్సిడీ వస్తుందంటే ఆరేళ్ల క్రితం ధైర్యం చేసి హార్వెస్టర్ కొనుగోలు చేశాం. కానీ, ఇప్పటివరకు రూపాయి సబ్సిడీ కూడా రాలేదు. బ్యాంక్ రుణం మొత్తం మేమే చెల్లించాం. సబ్సిడీ డబ్బులు రూ.8.32 లక్షలు రావాల్సి ఉంది. వెంటనే సబ్సిడీ అందించాలి. – భూక్య స్వరూప, లక్ష్మీసాగర్ రాయితీ సొమ్ము అందజేయాలి 45శాతం సబ్సిడీ వస్తుందంటే ఐదేళ్ల కింద ట్రాక్టర్ కొన్నాం. ప్రతినెలా వాయిదాలు కడుతున్నాం. సబ్సిడీ రూ.2.95 లక్షలు ఇప్పటికీ రాలేదు. గిరాకీలు సరిగా లేని సమయాల్లో వాయిదాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. రాయితీ సొమ్ము మంజూరు చేయాలి. – జాడి ఐలా, మద్దిపడగ, కడెం అందాల్సిన సబ్సిడీ కేటగిరీల వారీగా.. జనరల్ కేటగిరి ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.35,03,235 పావలా వడ్డీ రూ.2,47,52,395 ఎస్సీ కేటగిరి ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.7,61,41,392 ఎస్టీ కేటగిరి ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.11,19,14,150 పావలా వడ్డీ రూ.15,15,624 పీహెచ్సీ కేటగిరి ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.1,62,51,574 పావలా వడ్డీ రూ.14,84,932 -
త్వరగా ధాన్యం తరలించాలి
కుంటాల: వర్షాలు పడకముందే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఓల, అంబకంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు తెలిపారు. కుంటాలలో లారీలు రాక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలుపగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి లారీలు సమకూర్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ కమల్సింగ్, డీటీ కార్తిక్రెడ్డి ఉన్నారు. నర్సాపూర్ (జి): రెండ్రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని గొల్లమాడలో డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మా ట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని కొనుగోళ్లు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ శ్రీకాంత్, సెంటర్ నిర్వాహకులు భూమయ్య, శ్రీను ఉన్నారు. -
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
సారంగపూర్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జౌళి గ్రామంలో శుక్రవారం రూ.9లక్షలు ఈజీఎస్ నిధులతో చేపట్టిన పాఠశాల ప్రహరీ, రూ.10లక్షలతో చేపట్టిన ఐకేపీ వర్క్షెడ్ నిర్మాణాని కి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధి బీజేపీతో నే సాధ్యమవుతుందని తెలిపారు. సర్పంచ్ సురేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు కాల్వ నరేశ్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్రావు, నాయకులు తిరుమలాచారి, విలాస్, పీఆర్ డీఈఈ తుక్కారాం, ఎంఈవో మహేందర్ ఉన్నారు. -
బ్యాంకర్లు మెరుగైన సేవలందించాలి
నిర్మల్చైన్గేట్: బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం 2025–26 ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరా లపై అప్రమత్తత, పొదుపు, బ్యాంకింగ్పై అవగాహ న కలిగేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మ హిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు అందించే రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని సూచించారు. అనంతరం 2026–27 వార్షిక రుణ ప్రణాళిక నివేదిక ఆవి ష్కరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్గో పాల్, ఎస్బీఐ, టీజీబీ రీజినల్ మేనేజర్లు రంజన్కుమార్, నవీన్కుమార్, ఆర్బీఐ లింక్ బ్యాంకింగ్ ఆఫీ సర్ రాములు, అధికారులు, బ్యాంకర్లున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి మామడ: పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆరేపల్లి గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కా ల్చి పర్యావరణానికి హాని కలిగించొద్దని తెలిపారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కళాజా త బృందాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎఫ్డీవో నాగినిభాను తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
నిర్మల్చైన్గేట్: అధికారుల వేధింపులతోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ శా ఖలో పని చేసే అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాడ్య శ్రీధర్బాబు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జే ఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం న ల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై కలెక్టరేట్లో ని రసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ రాజ్, వినోద్కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణ మే స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీయాలని కో రారు. మృతుడి కుటుంబానికి రూ.10లక్షల ఎ క్స్గ్రేషియా, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి జి ల్లా స్థాయిలో ఒక ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అధ్వానంగా స్లాటర్ ఏరియా
నిర్మల్: సారంగపూర్ మండలంలో ని అడెల్లి అటవీ ప్రాంతంలో కొ లువుదీరిన మహాపోచమ్మకు ఏడాదికేడాది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అమ్మవారి ని దర్శించుకునేందుకు ఉత్త ర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు జి ల్లాల భక్తులు అధికసంఖ్యలో వస్తున్నారు. వేలాదిమందితో కిక్కిరిసిపోయే అడెల్లి ప్రతీ ఆదివారం ‘మినీ మేడారాన్ని’ తలపిస్తోంది. చల్లని చూపులతోనే దీవెనలు ఈప్రాంత ప్రజల ఇలవేల్పుగా, లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న అడెల్లి పోచమ్మ తల్లి తన చల్లని చూపులతోనే దీవిస్తుంది. గతేడాది నవంబర్ 7న అంగరంగ వైభవంగా అమ్మవారు కొత్త ఆల యంలో కొలువుదీరారు. గర్భగుడిలో పోచమ్మతో పాటు తన అక్కాచెల్లెళ్లుగా భావించే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణ వి, వారాహి, ఇంద్రాణి, చా ముండి విగ్రహాలున్నాయి. ఎక్క డా లేనివిధంగా ఇక్కడి మహా పోచమ్మ ఆలయంలో ఈ సప్తమాత్రికలు ఉండటం అడెల్లికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. పార్కింగ్ పేరిట పైసా వసూల్! అడెల్లి ఆలయానికి కార్లు, జీపులు, బస్సుల్లో వెళ్తే రూ.50 చెల్లించాల్సిందే. ఇదేంటీ అంటే.. ‘పార్కింగ్ ఫీజు’ అంటున్నారు. రోడ్డుపై అడ్డుపడి మరీ.. వసూలు చేస్తున్నారు. సరే.. అని డబ్బులు చెల్లించి గుడి దగ్గరికి వెళ్తే.. ఎక్కడా పార్కింగ్ ప్లేస్ అని ప్రత్యేకంగా లేదు. గుడి ఎదుట, రోడ్డుపైన, వంటలు చేసుకునే దగ్గర ఇలా.. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపాల్సి వస్తోంది. ఆదివారం వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. అడెల్లిలో మొక్కు తీర్చుకునే చోట ముక్కు మూసుకోవాల్సిందే. ఆలయానికి ఎదురుగా ఈశాన్య భాగంలో అమ్మవారికి మేకలు, కోళ్లు బలిచ్చే (స్లాటర్ ఏరియా) చోటుంది. ఇక్కడ ఎలాంటి సిమెంట్ ప్లాట్ఫాం లేదు. కనీసం గద్దెలూ నిర్మించలేదు. ఆకులతో వేసిన గుడిసెల కింద అపరిశుభ్రంగా ఉంది. వర్షాల సీజన్లో మరీ దారుణం. బురద, ఈగలతో భక్తులకు పరీక్షగా మారుతోంది. -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
కుంటాల: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొ నే అవకాశం ఉందని, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ భవేశ్మి శ్రా పేర్కొన్నారు. మండలంలోని అంబకంటి తండాలో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్తో కలిసి పా ల్గొన్నారు. వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసి పట్టాలని సూచించారు. అందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అవసరానికి మించి ఎరువులు వాడొద్దని తెలిపారు. మొక్కజొ న్న కొనుగోలులో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. నకిలీ విత్తనాలు కొనుగో లు చేయవద్దని, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థి కంగా ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే పవార్ రా మారావు పటేల్ మాట్లాడుతూ.. రైతులు అధికారు ల సూచనలు మేరకు పంటల సాగు చేయాలన్నా రు. మినుములు, పెసర్లు, నువ్వులు, కందులు, పొద్దుతిరుగుడు పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వీవో భవనం, జీవనోపాధి ఆర్థిక అధికారి త కేంద్రాలను ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అంబకంటిలో పాఠశాల ప్రహరీ, వీవో భవనాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించా రు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధి కారి బీవీ.రమణ, తహసీల్దార్ కమల్సింగ్, ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచులు జాదవ్ జ్యోతిబాయి, ముజ్గి రాణి పాల్గొన్నారు. -
అల్లంపల్లిని అభివృద్ధి చేస్తా..
కడెం: మండలంలోని అల్లంపల్లి బాబానాయక్ తండా గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. గురువారం ద్విచక్రవాహనంపై గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బోరు బావుల డ్రిల్లింగ్కు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. బాబానాయక్ తండాలో అంగన్వాడీ కేంద్రం, నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు భూమిపూజల చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల కారణంగా నిలనిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అల్లంపల్లి రోడ్డు సమస్య పరిష్కారానికి పూర్తి నివేదికతో జిల్లా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రాను ఫోన్లో కోరారు. శుక్రవారం గ్రామస్తులు, నాయకులు కలెక్టర్ కార్యాలయానికి రావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తాహసీల్దార్ ఖాజా మోయినుద్దీన్, ఎంపీడీవో బి.అరుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్రెడ్డి, సర్పంచులు సునీత, మాధవ్సింగ్, జంగు, విజయలక్ష్మి, దాసునాయక్ పాల్గొన్నారు. -
వర్షపునీటిని ఒడిసి పట్టాలి
ఖానాపూర్: ఇంకుడుగుంతల ఏర్పాటుతో వర్షపునీటిని ఒడిసి పట్టాలని, ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాల ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, సేవ్ వాటర్ సోక్పిట్స్ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని అడవి సారంగాపూర్లో గురువారం గ్రామసభ నిర్వహించారు. దీనికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్పీవో లింగయ్య, ఎంపీడీవో రాధరాథోడ్, సర్పంచ్ అంకుష్రావు, ఎంపీవో రత్నాకర్రావు, కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకవర్తోనే.. క్యాన్సర్
పొద్దున్న పాలతో మొదలు, రాత్రి తీసుకువచ్చే చిరుతిళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్ కవర్లలోనే. పాలిథిన్, ప్లాస్టిక్ లేకుండా రోజు గడపలేం అంటే అతిశయోక్తి కాదు. చివరకు శుభకార్యాల్లో మంచి చేయాల్సింది పోయి, ప్లాస్టిక్ కవర్తో చేసిన పేపర్ప్లేట్లలో వడ్డిస్తున్నారు. మంచినీటిని, టీ, కాఫీలనీ ఆ గ్లాసుల్లోనే తాగిస్తున్నారు. ఇదే రకరకాల క్యాన్సర్లకు కారణమవుతోంది. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరగడంలో ఇదీ ఓ కారణం కావొచ్చన్న వాదనా ఉంది. మనిషినే కాదు.. ఈ ప్లాస్టిక్ పట్టణాలను ముంచేస్తోంది. డ్రైనేజీలు జామ్ కావడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే... -
రౌడీ షీటర్లపై నిఘా పెంచాలి
నిర్మల్టౌన్: జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందు కు రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ గురువారం నిర్వహించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, పిల్లల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని తెలిపారు. దీర్ఘకా లంగా పెండింగ్లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్డీపీవోలు మెమోలు జారీచేసి వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్హెచ్వోలు కేసుల పురోగతిని సమీకరిస్తూ.. పాత కేసుల పరిష్కారంపై రానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీణ్కుమార్, కృష్ణ, రవీందర్ నాయక్, సమ్మయ్య, సాయికుమార్, దీపక్, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. ప్రజల విశ్వాసం పొందాలినిర్మల్టౌన్: అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసం పొందడం పోలీస్ సిబ్బంది ప్రధా న బాధ్యత అని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబర్చి సేవా పతకాలను ఎంపికై న 11 మంది పోలీస్ అధికారులు, సిబ్బందినికి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ పతకాలు అందజేశారు. మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా పతకాలు నిలుస్తాయన్నారు. ఎంపికై న వారిలో షేక్ అహ్మద్(ఏఎస్ఐ), ఆర్.గంగారాం (ఏఎస్ఐ), గంగాధర్(ఏఎస్ఐ), రాజారాం(హెచ్సీ), పి.మస్తాన్(హెచ్సీ), రత్నారావు(హెచ్సీ), హెచ్.గంగాధర్ (హెచ్సీ), గోవింద్(హెచ్సీ), గేమ్సింగ్ (ఏఆర్హెచ్సీ), వెట్టిసింగ్(హెచ్సీ), రమేశ్ ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
నిర్మల్టౌన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో వ్య ర్థాలను తగ్గించండి– ప్రకృతిని రక్షించండి అనే అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన, చిత్రలేఖ నం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఎఫ్వో మాట్లాడుతూ.. వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణపై మక్కువతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీ యమన్నారు. ప్రకృతిని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అట వీ శాఖ అధికారులు నాగిని భాను, రామకృష్ణారావు, నజీర్ఖాన్, సంతోష్, వెన్నెల, సుజాత పాల్గొన్నారు. -
మళ్లీ ఏడి‘పింఛన్!
నిర్మల్చైన్గేట్: నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎంతో ఎదురుచూస్తున్న అర్హులకు ఈసారీ తీవ్ర నిరాశే మిగిలింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొత్త పింఛన్ల జాబితా విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లోనే..బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు నెలలో చివరిసారి కొత్త పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నాలుగేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేసినా, వాటి పరిష్కారం ఇంకా జరగలేదు. తర్వాత కాలంలో వితంతు పింఛన్ కోసం ఇచ్చిన దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయకుండానే అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ప్రకటనతో ఆశలు..కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పినా, ఆవిర్భావ దినోత్సవానికి జాబితా విడుదల కాలేదు. ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మంజూరు చేస్తారా లేదా కొత్త దరఖాస్తులకు అవకాశం ఇస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. నిలిచిన ప్రక్రియ.. ప్రభుత్వం కొత్త దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించే వ్యవస్థను కూడా ఇంకా ప్రారంభించలేదు. గతంలో అధికారులు ఆన్లైన్ చేసిన దరఖాస్తులు కూడా ఈసారి మంజూరు కాలేదు. ఫలితంగా దరఖాస్తుదారులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కనీసం ఎప్పటి నుంచి మంజూరు చేస్తారన్న స్పష్టమైన సమాచారం కూడా ఇవ్వకపోవడంతో పింఛన్ల విషయం మళ్లీ అనిశ్చితిలో పడింది. ఎలాంటి ఆదేశాలు రాలేదు కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. గతంలో కొత్తగా చేసుకున్న వారి దరఖాస్తులు మండల స్థాయిలోనే ఉన్నాయి. – గంగన్న, డీపీఎంజిల్లాలో పెన్షన్లు ఇలా మొత్తం పెన్షన్లు 1,44,773 వృద్ధాప్య 33,890 వితంతు 35,664 దివ్యాంగ 9,822 గీత కార్మికులు 266 పైలేరియా 221 డయాలసిస్ 110 ఒంటరి మహిళ 2,093 బీడీ కార్మికులు 61,933 ఎదురుచూపులే..గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వ ప్రకటనతో కొంత ఆశ కలిగినా, జాప్యంతో మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు జరుగుతుందని ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లింది
నిర్మల్చైన్గేట్: తెలంగాణలో కాంగ్రెస్కు కాలం చెల్లిందని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన గురువారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేశ్వర్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త అంకితభావంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయశ్రీ, రావుల రాంనాథ్, మేడిసెమ్మె రాజు, యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్రెడ్డి, కరిపె విలాస్, సత్యం చంద్రకాంత్, బుర్ర రమేశ్, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకుంటున్న ఆలయ ఉద్యోగులు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి అభిషేకం సమయంలో ఓ భక్తురాలు తన కుటుంబంతో అమ్మవారి దర్శనానికి వచ్చా రు. ఈ సందర్భంగా ఆమె చెవి పోగును పోగొట్టుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రవి, శ్యామ్, ఆలయ జూనియర్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ సాయి విషయం తెలుసుకుని ఆలయ ప్రాంగణం నుంచి వ్యాస మహర్షి ప్రధాన మెట్లమార్గం వరకు వెతికా రు. అక్కడే పడి ఉండడంతో దానిని భక్తురా లు వెంకట నాగలక్ష్మికి అప్పగించారు. దాని విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుంద ని తెలిపారు. విధుల్లో నిజాయతీ చాటుకున్న ఉద్యోగులను భక్తులు అభినందించారు. -
‘వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం’
దస్తురాబాద్: వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రేవోజీపేటలో రూ.20లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పా రు. కార్యక్రజుమంలో సర్పంచ్ కోల మహేశ్, తహసీల్దార్ యాదవరావ్, ఎంపీడీవో రమేశ్రెడ్డి, పీహెచ్సీ వైద్యుడు నాగరాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షడు రమేశ్రావ్, ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్, నరేశ్రెడ్డి, గంగన్న, నరేశ్, సురేందర్, హెల్త్సూపర్వైజర్లు లలిత, పల్లవి, పంచాయతీ కార్యదర్శి కల్ప న తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ.. ప్రారంభోత్సవాలు ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్లో పా ఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బొజ్జు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని అధికారులు, స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం దిలావార్పూర్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం బాదన్కుర్తిలో నూతన పాఠశాల భవనం, కొత్తపేటలో నూతన పంచాయతీ భవనా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు శంకర్, ప్రశాంత్రెడ్డి, లోహిత, శ్రీనివాస్, మల్లేశ్, పల్లవి, నరేశ్, స త్యం, మాజిద్, పెద్దిరాజు, నవీన్, రాజేశ్వర్, రాజ న్న, పెద్దులు, రాజేందర్, రమేశ్, కుతుబొద్దీన్, సంతోష్గౌడ్, సచిన్, సాగర్, హరి, చరణ్, శోభన్, ధర్మరాజు, గంగన్న, శంకర్ తదితరులున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభం కడెం: మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఇటీవల పలువురు మృతి చెందగా బాధి త కుటుంబాలను పరామర్శించారు. ఆయా కార్య క్రమాల్లో ఏఎంసీ చైర్మన్ భూషణ్, సర్పంచ్ విజ య్కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్రెడ్డి, పా ర్టీ పట్టణాధ్యక్షుడు వాజీద్ఖాన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు భవాని, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కవి వెంకట్కు సన్మానం
నిర్మల్ఖిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు, సంస్కృత పద్యకవి బి.వెంకట్ రాష్ట్ర సాహితీ సన్మానాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని చిక్కడపల్లిలోగల కళాలలిత కళావేదికలో శ్రీత్యాగరాయ గానసభ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రపంచ శాంతి’ పేరిట నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయనను సన్మానించారు. త్యాగరాయ గానసభ అధ్యక్షుడు శ్రీకళా వీఎస్ జనార్దన్ మూర్తి, ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్, సినీ గేయకవి మౌనశ్రీ మల్లిక్, పెద్దూరి వెంకటదాసు, కవయిత్రి శైలజామిత్ర వెంకట్ను ప్ర శంసాపత్రం, శాలువాతో సత్కరించారు. 51 మంది కవులు, కవయిత్రులు పాల్గొన్న సమ్మేళనంలో జిల్లా నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొన్న వెంకట్ ప్రపంచ శాంతి, తెలంగాణ సంస్కృతి అంశాలపై కవితాగానం చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కవులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
పల్లె వైద్యానికి నిధుల సుస్తీ!
నిర్మల్చైన్గేట్: గ్రామీణ ప్రజలకు తొలి వైద్య ఆశ్రయంగా నిలిచే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు (పీహెచ్సీలు) నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటా ఆస్పత్రుల నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ బిల్లులు, ఫ ర్నిచర్, అత్యవసర ఔషధాల కొనుగోలు తదితర అ వసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్సీల పరిస్థితి దయనీయంగా మారింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏటా హెచ్డీఎఫ్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొనడంతో పేదల వైద్యసేవలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా నిధులు విడుదల కావడం లేదు. దీంతో ప్రతీ చిన్న పనికీ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వసతులు సమకూర్చుకునేందుకు వై ద్యులు, సిబ్బంది తంటాలు పడుతున్నారు. వైద్య పరికరాలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఔషధాల కొరత, ల్యాబ్ పరీక్షలు, విద్యుత్, తాగునీటి బి ల్లుల భారం, పారిశుద్ధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలి తంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభు త్వ వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మూడేళ్లుగా పెండింగ్లో రూ.90లక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో 17 పీహెచ్సీలు, మూడు యూపీహెచ్సీలున్నాయి. ఈ లెక్కన 20 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.30లక్షల చొప్పున మూడేళ్లకు రూ.90 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లభించడం లేదు. -
మొక్కల పెంపకం చేపట్టాలి
నిర్మల్టౌన్: మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాల యం నుంచి ప్రారంభమైన ర్యాలీ మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్ ఎక్స్ రోడ్, బస్టాండ్ మీదుగా చించోలి అర్బన్ పార్క్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అటవీశాఖ అధికారులు నాగిని భాను, శివకుమార్, రామకృష్ణారావు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
సనాతన ధర్మం గొప్పది
లోకేశ్వరం: సనాతన ధర్మం గొప్పదని నందిపే ట్ పలుగుట్ట మహారాజ్ కేదార నంద స్వామీజీ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్, మన్మద్ గ్రామాల్లో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని చె ప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ దోమల భోజ న్న హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, నాగేశ్, సుమన్కుమార్, శైలజ, భరత్గౌడ్, ప్రణీత, గంగాప్రసాద్ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ను బలోపేతం చేయాలి’ నిర్మల్టౌన్: రాహుల్గాంధీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో కార్యకర్తలు కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అబ్జర్వర్ సమతా సుదర్శన్ సూచించారు. పార్టీ ఎస్సీ సెల్ నియామకాల కోసం బుధవారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ ఫంక్షన్హాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దళిత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్, ప్రధాన కార్యదర్శి కొంతం గణేశ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి తదితరులున్నారు. -
నిర్మల్
ఉద్యమ జ్ఞాపకాలు తెలంగాణ సాధనకు పదేళ్లపాటు జరిగిన మలి దశ ఉద్యమంలో సబ్బండ వర్గాలు భాగస్వాము లయ్యాయి. జిల్లాలో ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నేపథ్యంలో కథనం..వరి కొయ్యలను కాల్చొద్దు లక్ష్మణచాంద: వరి కొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు. బుధవారం సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో వరి కొయ్యలు కాల్చితే కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొయ్యలు కాలిస్తే సూక్ష్మజీవులు నశించి నేలలో సారం తగ్గుతుందని, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పంట అవశేషాలను నేలలోనే కలియ దున్నితే భూసారం పెరిగి రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని తెలిపారు. సోన్ ఏవో వినోద్కుమార్, ఏఈవో రాజ్కుమార్ తదితరులున్నారు. నిర్మల్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతంగా చేపట్టాల్సిన అవసరముంది. ధాన్యం సేకరణ లక్ష్యం లక్షా 89వేల మెట్రిక్టన్నులు కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 8వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నా రు. కానీ, అనధికారికంగా ఇంకా లక్ష మెట్రిక్ టన్ను ల వరకు ధాన్యం కేంద్రాలు, రోడ్లపై కుప్పలుకుప్పలుగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మణచాంద మండలంలో కాస్త వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నా.. సారంగపూర్, దిలావర్పూర్ తదితర ప్రాంతాల్లో ఇంకా పెద్దమొత్తంలో ధాన్యం అలాగే ఉంది. నిర్మల్తో పాటు ఈసారి భైంసా డివిజన్లోనూ ధాన్యం దిగుబడి పెరగడంతో రోడ్ల పొడవునా ఇప్పటికీ వడ్ల కుప్పలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొరత.. రైతన్నకు వెత వరి ధాన్యం రైతులకు సరిపడా గన్నీ సంచులు లేకపోవడం, హమాలీలు అందుబాటులో ఉండకపోవడం, సమయానికి సరిపోయే లారీలూ రాకపోవడం మరింత ఆలస్యానికి కారణాలవుతున్నాయి. మక్క రైతులు సంచికి అదనంగా డబ్బులు ఇస్తుండటంతో చాలావరకు హమాలీలు, లారీలు వాటిని ఎత్తడానికే మొగ్గుచూపుతున్నారు. అలా వెళ్లిన లారీల్లోని మక్కలను గోదాముల్లో అన్లోడింగ్ చేయడం ఆలస్యమవుతోంది. దాదాపు మక్కలను పూర్తిచేస్తే గాని వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మక్కలు దాదాపు పెద్దసగం పూర్తికాగా, రెండువారాల్లో ధాన్యం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. వానస్తే పరేషానే.. కేంద్రానికి వడ్లు తెచ్చి నైలెతంది. వెంటవెంట కొంటలేరు. 120బస్తాల వడ్లకు రోజూ కేంద్రంలనే కాపలా కాస్తున్న. వానస్తే వడ్లు తడుస్తయేమోనని భయపడుతున్న. సార్లు జెర వడ్లు కొని మా ఇబ్బందులు తీర్చాలె. – లక్ష్మణ్, జామ్, సారంగపూర్ మండలం ‘పంట పండించుడు ఒకెత్తయితే, అమ్ముకునే దాకా కాపాడుకోవడం ఒకెత్తయితోంది. రోజూ ఆరబోసుడు, కుప్పలు చేసుడున్నది. ఎప్పుడు వానస్తదో.. ఎక్కడ పంట తడిసిపోతదో.. అని పరేషానవుడున్నది. ఎక్కడున్నా.. ఉరుక్కుంట పోయి టార్పాలిన్ కప్పి, పంట కాపాడుకోవాల్సి వస్తోంది. మాదగ్గర మక్కలయిపోయే దాకా వడ్లు కొనేటట్టులేరు. సార్లు.. ఎట్లన్న జేసి వానలు రాకముందే వడ్లెత్తాలె..’ అని సారంగపూర్ మండల రైతు భోజన్న వేడుకుంటున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి వేచిచూస్తున్న రైతులంతా ఇదేవిషయం చెబుతున్నారు. ఎప్పడొస్తుందో తెలియని అకాలవర్షంతో పాటు మరో వారం, పదిరోజుల్లో నైరుతి రుతుపవనాలూ రానుండటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మక్కల కొనుగోలు వేగవంతం చేసినట్లే వడ్ల తరలింపునూ త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు. వానలు రాకముందే.. ‘ఇప్పటికే నెలరోజులకంటే ఎక్కువనే ఆగినం. ఇంకొన్నొద్దులు ఆగమా..! కానీ.. యాడ వర్షాలు వస్తాయోనని భయపడాల్సి వస్తోంది. అడపాదడప చెడగొట్టు గాలివానలు వస్తున్నయి. ఇంకో వారమైతే వానాకాలం చాలైతది. అందుకే అప్పటిలోపు వడ్లు ఎత్తాలని కోరుతున్నం..’ అని రైతులు అంటున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలో కేరళ తీరాన్ని దాటితే.. రెండుమూడు రోజుల్లో తెలంగాణకు చేరుకోవచ్చు. ఆలోపే ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం ధాన్యం తరలింపు జూన్ రెండోవారం దాటేలా కనిపిస్తోంది. మరోవైపు కలెక్టర్తోపాటు జిల్లా అధికారులు నిత్యం కొనుగోళ్లపైనే దృష్టిపెట్టి వేగవంతం చేస్తున్నారు. -
రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు
ముధోల్: ఉపాధిహామీ పథకం కింద పానాది రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలుసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని ఎమ్మెల్యే రామారావుపటేల్ పేర్కొన్నారు. బుధవారం ముధోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల ఉపాధిహామీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ మండలానికి రోడ్ల నిర్మాణానికి రూ.కోట్లాది నిధులు మంజూరైనా టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తి చేయించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. రెండేళ్లుగా పానాది రోడ్లపై దృష్టి పెడితే 25శాతం పనులే పూర్తయ్యాయని.. 15 రోజుల్లోనైనా గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కింద రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తి చేశారు? మిగతా పనుల పరిస్థితిపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. డీఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థినులకు అభయహస్తం!
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి భద్రతకు భరోసా కల్పిస్తూ అభయహస్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని (చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) సీపీవోగా నియమించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ అమల్లోకి రానుంది. వేధింపులకు గురై లోలోన కుమిలిపోయేవారు సీపీవోకు ఫిర్యాదు చేయవచ్చు. దీనితో ఇకపై పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా విద్యార్థినుల రక్షణ బాధ్యతలూ పర్యవేక్షించనున్నారు. వారానికి ఒక క్లాస్ చొప్పున.. ప్రతీ పాఠశాలలో చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు వారానికి ఒక క్లాస్ తప్పనిసరిగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందులో రాజ్యాంగ విలువలు, పోక్సో యాక్ట్ తదితర కీలక చట్టాల గురించి విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించనున్నారు. ప్రతీ స్కూల్లో లీగల్ లిటరసీ క్లబ్ లేదా చైల్డ్ రైట్స్ క్లబ్ ఏర్పాటు చేసి సెమినార్లు, పోటీల ద్వారా విద్యార్థినులను చైతన్య వంతులుగా తీర్చిదిద్దుతారు. జిల్లా, మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్లు జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి, మండల స్థాయిలో మండల విద్యాధికారిని నోడల్ ఆఫీసర్లుగా ని యమించనున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి వా రు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన కేసులను పరిష్కరిస్తూ.. విద్యార్థినుల రక్షణ చ ర్యలు పర్యవేక్షిస్తారు. దీని అమలుకు అందుబాటులో ఉన్న వనరులతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను వినియోగించుకో వాలని డైరెక్టర్ తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల నియామకంతో వి ద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని విద్యార్థినులు, పోషకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు భావిస్తున్నారు. ఇవీ.. సీపీవో విధులు జిల్లాలోని పాఠశాలల వివరాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 165 మొత్తం విద్యార్థులు 37,019 నియమించనున్న సీపీవోలు 165 -
● త్వరలోనే రాష్ట్రానికి రుతుపవనాలు ● వర్షాలకు భయపడుతున్న రైతాంగం ● ధాన్యం త్వరగా కొనాలని వేడుకోలు ● చాలా గ్రామాల్లో కనిపిస్తున్న కుప్పలు ● దాదాపు పూర్తయిన మక్కల కొనుగోలు
వడ్లపై మక్కల ప్రభావం వరి ధాన్యం కొనుగోళ్లపై ఈసారి మొక్కజొన్న ప్రభావం పడుతోంది. ప్రైవేట్ మార్కెట్తో పోలిస్తే మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమిచ్చే ధర అధికంగా ఉంది. క్వింటాల్కు మార్కెట్లో రూ.1,800 వరకు వస్తుండగా, ప్రభుత్వం రూ.2,475పైనే చెల్లిస్తోంది. దాదాపు రూ.600 అధికంగా వస్తుండటంతో రైతులు ప్రైవేట్ వైపు చూడటం లేదు. ఇక్కడ కొనుగోలు పరిమితి దాటితేనే ఆ వైపు వెళ్తున్నారు. వరి ధాన్యం కంటే ముందు ధర ఎక్కువగా ఉన్న మక్కలు అమ్ముకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. సంచికి రూ.30–40 అదనంగా ఇస్తూ లారీని తామే తీసుకువచ్చి మక్కలు తరలిస్తున్నారు. చాలాచోట్ల మార్క్ఫెడ్ సంచులూ ఇవ్వకపోవడంతో రైతులే ఒక్కో సంచిని రూ.35పెట్టి మరీ కొనుక్కున్నారు. -
ప్రీప్రైమరీ మరింత బలోపేతం
ముధోల్ : చిన్నారుల విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జి ల్లాలో కొత్తగా 74 ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి జిల్లాలోని ఎంపికై న పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య అధికారికంగా అందుబాటులోకి రానుంది. ప్రతీ బడికి రూ.1.70 లక్షలు.. ప్రైమరీ విద్యను ఆకర్షణీయంగా, ఆధునికంగా మార్చడానికి ప్రతీ పాఠశాలకు ఫర్నిచర్, ఇండోర్–అవుట్డోర్ ఆట వస్తువులు, రంగుల పెయింటింగ్స్తో సహా అన్ని మౌలిక సదుపాయాలకు రూ.1.70 లక్షలు కేటాయించనున్నారు. ఇన్స్ట్రక్టర్, ఆయా నియామకాలు.. ప్రతీ ప్రీప్రైమరీ సెక్షన్లో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయాను ఔట్సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేల వేతనం చెల్లించనున్నారు. నియామకాల కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి, త్రీమెంబర్ కమిటీ ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 74 పాఠశాలలు ఎంపిక జిల్లాలోని 19 మండలాల నుంచి మొత్తం 74 ప్రాథమిక పాఠశాలలను ప్రీప్రైమరీ సెక్షన్ల కోసం ఎంపిక చేశారు. బాసర, భైంసా, దస్తూరాబాద్, దిలావర్పూర్, కడెం, ఖానాపూర్, కుభీర్, కుంటాల, లక్ష్మణచందా, లోకేశ్వరం, మామడ, ముధోల్, నర్సాపూర్, నిర్మల్, నిర్మల్ రూరల్, పెంబి, సారంగాపూర్, సోన్, తానూర్ మండలాల్లోని వివిధ గ్రామాల పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త ప్రీప్రైమరీ సెక్షన్ల ప్రారంభంతో జిల్లాలోని చిన్నారులు నాణ్యమైన, ఆధునిక విద్యా వ్యవస్థను అందుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. -
పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్ధత, గ్రామసభల నిర్వహణ, తదితర అంశాలపై హైదరాబాదు నుంచి డీజీపీ సీవీ.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యావరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. రానున్న వర్షాకాలం, వాతావరణ పరిస్థితులు, పంటల సాగు వంటి అనేక విషయాలను ఈ సభలలో రైతులకు వివరించాలన్నారు. ఆకస్మిక వరదలు, విపత్కర పరిస్థితులపై అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పరస్పరం సమన్వయంతో ఉండాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో కలెక్టర్ భవేశ్మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్ భూభారతి, సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఎస్డీసీఎల్ఏ నాయక్వాడి జల కుమారి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, సీపీవో గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ క్యాంపు కార్యాలయంలో..
నిర్మల్టౌన్:ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారి సేవలను కొనియాడారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఆర్ఐ రామ్నిరంజన్రావు జాతీయ పతాకం ఎగుర వేశారు. వేడుకల్లో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది, డీపీవో సిబ్బంది, హోం గార్డులు పాల్గొన్నారు. -
ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు
కుంటాల: ప్రతీ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండల పరిషత్ కార్యాలయంలో కుంటాల, నర్సాపూర్(జి) మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అందరి సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ నిచ్చారు. మండలంలోని విఠాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో గృహ ప్రవేశాలు చేయించారు. పెంచికల్పాడ్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని, కుంటాల పంచాయతీ కార్యదర్శి రాజబాపు ఆధ్వర్యంలో తయారు చేసిన జ్యూట్ బ్యాగులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్ సింగ్, శ్రీకాంత్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో శోభన, సర్పంచ్లు జక్కుల గజేందర్, పెంటవార్ దశరథ్, చెన్న వసంత, లింగురాం పటేల్, హిమ్మత్ రావుపటేల్, రాజన్న, కట్ట రవి, రాణి, డీటీ కార్తీక్రెడ్డి, హౌసింగ్ ఏఈ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
స్మరిద్దాం.. సాధిద్దాం
నిర్మల్కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ భవేశ్ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి, జాతీయ గీతపాలన చేశారు. పలువురు పాఠశాలల విద్యార్థులకు ఈ సందర్భంగా కలెక్టర్ బహుమతులు పంచి, మిఠాయిలు అందించా రు. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తె లిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవె న్యూ) కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్: అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అమరుల స్మరిస్తూ, ఉద్యమకారులను గుర్తిస్తూ జి ల్లానూ సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని పిలు పునిచ్చారు. కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీరేశం హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల తదితరులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశాన్ని చదివివినిపించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక.. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఈదిశగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా వివిధరంగాల్లో విశేష పురోగతి సాధించామని వీరేశం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు మొత్తం 9,292 గృహాలు కేటాయించగా, ఇప్పటివరకు 7,651 అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. ఖానాపూర్, ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో 6,684 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 1,450 నిర్మాణం పూర్తిచేసుకున్నాయన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.142.79 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈనెల 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,091 గృహప్రవేశాలు అయ్యాయని పేర్కొన్నారు. రెండోదశలో ప్రతీ నియోజకవర్గానికి రెండువేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, పూరి గుడిసెల్లో నివసించే అర్హులైన పేద కుటుంబాలకు 1,500 ఇళ్లను ప్రాధాన్యంగా మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఇల్లు నిర్మించుకుని స్లాబ్ వేయలేకపోయిన 500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి.. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6.90 కోట్లకు పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో గృహజ్యోతి విద్యుత్ సబ్సిడీ పథకం కింద 1.35 లక్షలకుపైగా లబ్ధిదారులకు రూ.107.62 కోట్ల సబ్సిడీ అందించామన్నారు. మహిళా సంఘాలకు చెక్కు అందజేత మహిళా సంఘాలకు మంజూరైన రూ.74.93 కోట్ల చెక్కును, ధాన్యం కొనుగోలు కేంద్రాల కమీషన్ రూ.3.94 కోట్ల చెక్కును అందించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, అడిషనల్ కలెక్టర్లు కిశోర్కుమార్, వెంకటేశ్వర్లు, భైంసా సబ్కలెక్టర్ సంకేత్కుమార్, ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్, డీఎఫ్వో సుఖ్దేవ్ బోబడే, డీఆర్ఓ రాథోడ్ రమేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్చక్రవర్తి తదితరులతో కలిసి అల్పాహారం ఆరగించారు. విద్య, వైద్యరంగాల్లో.. జిల్లాలోని 1,046 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.34 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి 742 బడుల్లో మధ్యాహ్న భోజనంతోపాటు బ్రేక్ఫాస్ట్ అందిస్తామన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 98.96 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. ఇక వైద్యరంగంలో జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 11 ప్రైవేటు, 6 ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా 1,015 శస్త్రచికిత్సలు నిర్వహించగా, రూ.30.47 కోట్ల చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,962 ప్రసవాలు చేసినట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా... -
తప్పుడు కేసులు పెడితే ఊరుకోం
భైంసాటౌన్: అధికార పక్షం ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ మాజీ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ.జాబీర్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జరిగిన ఘటనలో వాస్తవాలు పరిశీలించి కేసులు నమోదు చేయాలన్నారు. ఇటీవల 25వ వార్డులో జరిగిన ఘర్షణలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో ఏఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయిస్తామన్నారు. గతంలో వెలుగుచూసిన బెట్టింగ్ కేసులో భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు దర్యాప్తు పురోగతి ఏదని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కానీ, తప్పుడు కేసులు పెడితే ఊరుకోమన్నారు. మున్సిపల్లో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం అనుభవరాహిత్యంతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. తమ హయాంలో హిందూ పండుగలతోపాటు ముస్లిం పండుగలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత పాలకవర్గం ఇటీవల రంజాన్, బక్రీద్ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేదని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల్లో తమ కౌన్సిలర్లు వార్డు సమస్యలను చైర్మన్ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే, 14వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ తరచూ జోక్యం చేసుకోవడంతో చర్చ సజావుగా జరగడం లేదన్నారు. పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కనీసం ప్రజలకు సకాలంలో తాగునీరు అందించాలని హితవు పలికారు. సమావేశంలో ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్ కూలర్
పెంబి: ఓ ఐరన్ కూలర్.. తండ్రీ కొడుకును బలి తీసుకుంది. కూలర్లో నీళ్లు పోసేందుకు వెళ్లిన భార్యకు షాక్ రావడంతో కేకలు వేసింది. వెంటనే భర్త వెళ్లి కాపాడే క్రమంలో ఆయనకూ షాక్ తగిలింది. ఇద్దరి అరుపులు విన్న వారి కొడుకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయగా, ఆయనకూ షాక్కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం కోరకంటి తండాలో జరిగింది.ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. కోరకంటి తండాకు చెందిన రాథోడ్ సోనాబాయి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఐరన్ కూలర్లో నీళ్లు పోస్తూ విద్యుత్ షాక్కు గురై కేకలు వేసింది. అది విన్న భర్త రాథోడ్ అర్జున్ (56) ఆమెను కాపాడే ప్రయత్నంలో షాక్కు గురయ్యాడు. ఇద్దరి కేకలు విన్న పెద్ద కొడుకు రాథోడ్ శ్రీనివాస్ (28) తల్లీతండ్రిని రక్షించాలని వెళ్లాడు. అతడు కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. చిన్నకొడుకు రాథోడ్ సుభాశ్ వచ్చి కూలర్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్థానికులు వచ్చి ముగ్గురిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అర్జున్, శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సోనాబాయికి తీవ్ర గాయాలయ్యాయి. రాథోడ్ సోనాబాయి–అర్జున్ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. శ్రీనివాస్కు భార్య, నాలుగేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిమిషాల వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది. సోమవారం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవిర్భావ వేడుకలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 8 గంటలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం పతాకావిష్కరణ చేస్తారు. 8:05 కు గౌరవ వందనం, 8:07 నుంచి 8:20 వరకు ముఖ్య అతిథుల ప్రసంగం, 8:20 నుండి 9 గంటల వరకు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 9:15 గంటలకు తేనేటి విందు ఉంటుంది. -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది. స్థిరప్రస్తుత13,470 26,37511,857 24,07811,565 23,0518,247 16,465నిర్మల్ఆదిలాబాద్ఆసిఫాబాద్ -
నిర్మల్
7అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పో లీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పో లీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెనన్స్ ని ర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. స మస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించా రు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రెబ్బెన/ఆసిఫాబాద్: పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీగూడెం, తండాలో గిరిజనులందరికీ నూరుశాతం ఇళ్లు మంజూరు చేసి, అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఏ అభివృద్ధి, సంక్షే మ పథకమైనా ఈ గడ్డనుంచే ప్రారంభిస్తున్నామని, ఏడాదిలోగా గుడిసెలు లేని జిల్లాగా ఉమ్మడి ఆది లాబాద్ను మారుస్తామని అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారా వు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్ రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బా బు, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్తో కలిసి హాజరయ్యా రు. జిల్లాలో రూ. 112 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మావో యిస్టు నగేశ్ దంపతులతోపాటు పలువురు లబ్ధిదా రులకు రెండో విడత ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించారు. రెండోవిడత కార్యక్రమాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తుమ్మిడిహెట్టితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన ప్రాణ హిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎలాంటి ఎత్తిపోతలు, విద్యు త్ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే సాగునీరందిస్తామని అన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రైతాంగం ఉప్పైనె కదులుతుందని హెచ్చరించారు. ఆద్యంతం.. ఉత్సాహభరితం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్ నుంచి నేరుగా కెరమెరి మండలం కొత్తగూడకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద కు చేరుకున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. రాత్రి 7.45 గంటల నుంచి గంటన్నరకు పైగా కొనసాగింది. మంత్రులు మా ట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు వరిధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో మంచిర్యాలకు వెళ్లారు. అయితే కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాకు ప్రత్యేక వరాలేవీ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్, పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రేంసాగర్రావుకు పెద్దపీట సభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు ప్రత్యేక స్థానం దక్కింది. సభాస్థలికి చేరుకోగానే ప్రేంసాగర్రావును వెంట బెట్టుకుని సీఎం సభావేదికపైకి వచ్చారు. స్టేజీపై పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ప్రేంసాగర్రావు జిల్లాలోని సమస్యలతోపాటు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, మంచిర్యాలలో ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలని విన్నవించారు. -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. సబ్బండ వర్గాలు, సమస్త ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ ముందుకు వచ్చాయి. పార్టీలకతీతంగా జెండాలు, అజెండాలు పక్కన పెట్టి నా యకులంతా పోరుబాటలో నడిచారు. చారిత్రక నేపథ్యం ఉన్న పోరుగడ్డ నిర్మల్ ప్రాంతం సైతం స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచింది. ఉద్యమంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక భైంసా నుంచే ముగ్గురు యువకులు తమ ప్రాణాలను అర్పించడం మర్చిపోలేం. ప్రాణత్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణకు నేటితో 12 ఏండ్లు నిండాయి. ఈ పుష్కరకాలంలో జిల్లాగా మారిన నిర్మల్ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ‘పోరు’లో ప్రతీ ఊరు.. ● అప్పటి లక్ష్మణచాంద(ప్రస్తుత సోన్) మండలంలోని బొప్పారం గ్రామస్తులు అఖండ తెలంగాణ జ్యోతిని వెలిగించారు. స్వరాష్ట్రం సాధించే వరకూ ఆ జ్యోతి ఆరకుండా ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. పుష్కరంలో మార్పులెన్నో.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నిర్మల్ ప్రాంత పరిస్థితులూ మారాయి. -
జిల్లాలో రబీ సీఎంఆర్ ఇలా..
భైంసాటౌన్: జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. గత సీజన్లకు సంబంధించి సీఎంఆర్ ప్రక్రియలో అక్రమాలతో జిల్లా రాష్ట్రంలో నే అపఖ్యాతి మూటగట్టుకుంది. 2023–24, 24– 25 ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం పొందిన మిల్లర్లు పలువురు రూ.వందల కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో అధికారులు పలు మిల్లులపై కేసులు సైతం నమోదు చేశారు. గతేడాది కొత్తగా రైస్మిల్లులు ఏర్పాటు చేసిన కొందరు మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం పొందిన కొద్దిరోజుల్లోనే రూ.కోట్ల విలువైన ధాన్యం అమ్మేసుకుని బిచానా ఎత్తేశారు. అధికారులు తీరిగ్గా కేసులు నమోదు చేసి ‘మమ’ అనిపించుకున్నారు. ధాన్యం అలాట్ కోసం.. ఇలా ఏటా రైస్మిల్లర్లు డబ్బు, రాజకీయ ఒత్తిళ్లతో మిల్లింగ్ సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించుకోవడం, ఆపై కొందరు ధాన్యం అమ్ముకుని రూ.కోట్లకు పడగలెత్తడం చూస్తున్నదే. ప్రస్తుతం రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నేపథ్యంలో ఈసారి సైతం కొందరు డీఫాల్ట్ మిల్లర్లు, బినామీ మిల్లర్లు ధాన్యం పొందేందుకు పైరవీలు షురూ చేశారు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు మిల్లర్ల సంఘం నాయకులు, మధ్యవర్తులతో పక్షం రోజులుగా జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రూ.578.46 కోట్లు ఎగవేత..రైస్మిల్లర్లు కొందరు అక్రమార్జన కోసమే ఈ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గత సీజన్లలో ధాన్యం ఎగవేతను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. 2022–23 నుంచి 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో 34 రైస్మిల్లుల్లో రూ.578.46 కోట్ల విలువైన 1,47,074.83 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టించారు. దీంతో సదరు మిల్లులపై అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి సైతం ఒక్క బియ్యం గింజ అప్పగించని రైస్మిల్లులు ఉన్నాయి. డీఫాల్ట్ మిల్లులకు ధాన్యం ఇచ్చేది లేదని అధికారులు చెప్పడంతోపాటు గత సీజన్లో ధాన్యం కేటాయించకపోవడంతో కొందరు మిల్లర్లు కొత్త ఎత్తుగడ వేశారు. బినామీల పేరిట కొత్తగా మిల్లులు ఏర్పాటు చేసుకుని, ధాన్యం కేటాయింపు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. కొందరికి ఇప్పటికే ధాన్యం కేటాయించినట్లు సమాచారం. డమ్మీ పీవీలతో..గత రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ధాన్యం పొందిన పలువురు రైస్మిల్లర్లు ధాన్యం విక్రయించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే సకాలంలో బియ్యం అప్పగించకుండా, అధికారులు పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్) కోసం వచ్చిన సందర్భాల్లో ఇతర మిల్లర్ల ధాన్యం అప్పటికప్పుడు తెప్పించుకుని పీవీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా డమ్మీ పీవీలతో తిరిగి ధాన్యం పొందేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా సీఎంఆర్ ప్రక్రియలో గత అనుభవాల దృష్ట్యా సీఎంఆర్లో అక్రమాలు జరగకుండా, ధాన్యం పక్కదారి పట్టకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. తద్వారా ధాన్యం ఎగవేసే మిల్లర్లకు కల్లెం వేసినట్లవుతుంది.యాక్టివ్ మిల్లులు 31డీఫాల్ట్, డీఫంక్ట్ మిల్లులు 84ధాన్యం సేకరణ అంచనా 1.83 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సేకరించింది లక్ష మెట్రిక్ టన్నులుయాక్టివ్ మిల్లులకే కేటాయింపు.. రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. జిల్లాలో 113 రైస్ మిల్లులు ఉండగా, 84 డీపాల్ట్, డీఫంక్ట్ మిల్లులున్నాయి. వాటికి మినహా మిగిలిన 31 యాక్టివ్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయిస్తున్నాం. జిల్లాలో 14 గోదాముల్లో ధాన్యం నిల్వ చేయడంతోపాటు పెద్దపల్లి జిల్లాలోని 4 మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాం. – రాజేందర్, డీసీఎస్వో -
కోత వెనుక ‘పథకం’!
నిర్మల్ రూరల్/నిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల కేబినెట్లో ఆమోదం తెలిపింది. జూన్ 2 నుంచి పథకం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. పథకం ప్రారంభం కాకముందే.. మే నెల వేతనాల నుంచి 1.5 శాతం ఈహెచ్ఎస్ పేరిట కోత పెట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొనసాగుతున్న నమోదు.. నూతన ఆరోగ్య పథకం కోసం ఉద్యోగి వివరాలు, డిపెండెంట్లు, పిల్లల సమాచారం సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజులుగా ఉపాధ్యాయులంతా ఫారాలు నింపి ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఉపాధ్యాయులు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా, ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వు జారీ కాకముందే, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదరకముందే, ప్యాకేజీ రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు కూడా ఇంకా జారీ కాలేదు. అయినా మే నెల వేతనంలో కోత విధించడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల అసంతృప్తి ప్రభుత్వం మే 31 వరకు వివరాలు నమోదు చేయాలని గడువు విధించింది. అయితే మే 30 వరకు కూడా వెబ్సైట్లో మార్పులు జరుగుతూనే ఉన్నా యి. నిబంధనలు రోజుకోరీతిన మారుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అయినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్స సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం చెప్పినప్పుడు అన్ని సంఘాలు అంగీకరించాయి. విధానాలు ఖరారు కాకుండానే వేతనాల్లో 1.5% కోత విధించడం సరికాదని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. దీరినూ పీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని, మే నెల వేతనంలో కోత విధించిన సొమ్ము జమ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దుర్మార్గమైన చర్య.. మేనెల జీతం నుంచి 1.5 శాతం కోత విధించడం సరైనచర్యకాదు. భార్యాభర్తలు ఉద్యోగులైన ఇరువురు జీతంలో కూడా కోత విధించారు. ఎటువంటి సమాచారం లేకుండా కోత విధించటం దుర్మార్గమైన చర్య. జూన్ నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని మే నెల జీతంలో కోత విధించటం భావ్యం కాదు. విధివిధానాలు, కార్డులజారీ, ఉద్యోగి అనుమతి వంటివి పూర్తయిన తర్వాత నగదు రహిత చికిత్సమార్గదర్శకాలు విడుదల తర్వాతనే కోత విధించాలి. – తోట నరేంద్రబాబు,రమణారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూటీఎస్ జిల్లాలో ఉద్యోగుల వివరాలు..ప్రభుత్వశాఖల ఉద్యోగులు 7,400 (అన్ని శాఖల్లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్) ప్రభుత్వ ఉపాధ్యాయులు 2,500 రిటైర్డ్ ఉద్యోగులు,పెన్షనర్లు 2,800 -
ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు
లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలో పేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆదివారంతో వేసవి సెలవులు ముగిశా యి. సోమవారం జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలల ప్రా రంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలా..జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇందులో ఇంటర్ రెండో సంవత్సరంలో 2,592 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఇందులో కూడా 2,500 మంది విద్యార్థులు చేరుతారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ద్వితీ య సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు చేరాయి. త్వరలో ప్రథమ సంవత్సరంలో చేరుతు న్న విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్థులకు అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ మంది ప్రవేశాలు పొందే అవకాశం ఉందని అధ్యాపకులు భావిస్తున్నారు. క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు...ఈసారి మారిన సిలబస్ పూర్తిగా ఏఐ, డిజిటల్ చి త్రాలతో విద్యార్థులనుట్టే ఆకట్టుకునేవిధంగా పాఠ్య పుస్తకాలను ముద్రించారు. విద్యార్థుల విషయ పరి జ్ఞానం పెంపొందేలాగా నిడివి, నియంత్రణ పాటిస్తూ పాఠ్యాంశాలను రూపొందించినట్లు అధ్యాపకు లు అంటున్నారు. పుస్తకంపై ముద్రించిన క్యూర్ కో డ్ను స్కాన్ చేస్తే ఆడియో, వీడియో పాఠాలు ప్రత్యక్షమై విద్యార్థులు వీక్షించే అవకాశం ఉంది. ఈసారి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుందున దానికి అనుగుణంగా అభ్యాసాలను పొందుపరిచారు. మారిన ఫస్ట్ ఇయర్ సిలబస్.. ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మారింది. కొత్త సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు ముద్రించారు. నూతన సిలబస్ కారణంగా పాఠ్య పుస్తకాల పంపిణీలో ఆలస్యం అవుతుందని ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు భావించారు. కానీ ఇంటర్ బోర్డు అధికారుల ప్రత్యేక చొరవతో కళాశాల ప్రాంభానికి ముందే పుస్తకాలను సిద్ధం చేశారు. ప్రారంభం రోజే అందచేస్తాం ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకా లు జిల్లా కేంద్రానికి చేరా యి. నూతన విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి రోజు కళాశాలలకు వచ్చిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు అందిస్తాం. ప్రథమ సంవత్సరం ప్రవేశాలు కొనసాగుతున్నాయి. వారు రాగానే అందిస్తాం. – పరశురామ్నాయక్, ఇంటర్ నోడల్ ఆఫీసర్ -
పోరుగడ్డకు సీఎం
రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రా నున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా ని ర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజ రుకానున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మక ంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. పర్యటన ఇలా..సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హె లిక్యాప్టర్ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్కు చేరుకుంటారు. విశ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ నివాసానికి వెళ్తారు. రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. భారీగా జనసమీకరణ..సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజ రు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. ఏర్పాట్లు పరిశీలనఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొఠారి పంచాయతీలోని కొత్తగూడతోపా టు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ హరిత, ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
ఎన్నికలు వద్దు.. విలీనం ముద్దు
నిర్మల్టౌన్/భైంసాటౌన్: ఆర్టీసీ నిర్మల్, భైంసా డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్లర్లు, ఉద్యోగులు ఎన్నికలు వ ద్దు.. విలీనం ముద్దు అనే నినాదంతో ఆది వారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపా రు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వీలినం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం కార్మికుల మనోభావాలను దెబ్బ తీయడమే అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. -
వెంకట సాయి.. మీ సంకల్పానికి సెల్యూట్
వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదని నిరూపిస్తున్నారు వీరు. పుట్టుకతోనే తోడైన ఎముకల వ్యాధి మంచానికే పరిమితం చేసినా డిజిటల్ రంగంలో పట్టు సాధించి టీమ్ లీడర్గా ఎదిగాడు ఓ యువకుడు. గాలిపటం ఎగరేస్తూ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా పట్టుదలతో ‘పది’ పరీక్షలు రాసి సత్తా చాటాడు మరో బాలుడు. దైవ నామాలతో సంకల్పదీక్షను జయించిన ఆ ఇద్దరిలో ఒకరు వెంకటరమణ కాగా మరొకరు శ్రీసాయిచరణ్. అన్నీ ఉండి నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువత ఒక్కసారి ఆలోచించాల్సిందే. విధిని సైతం జయించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే. మంచానికే పరిమితమైనా.. డిజిటల్ రంగంలో రాణిస్తూఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్నగర్కు చెందిన టెంబేకర్ సంతోష్కుమార్–సురేఖ దంపతులు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. పెద్ద కుమారుడైన వెంకటరమణను పుట్టుకతోనే ఎముకల జన్యు సంబంధ సమస్య వెంటాడింది. ప్రస్తుతం ఈయన వయస్సు 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. సెల్ఫోన్, టీవీ చూస్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడు. కుమారుడి పట్టుదల, తెలివితేటలు చూసి చదువు నేర్పించేందుకు ఓ ట్యూటర్ను ఏర్పాటు చేశారు పేరెంట్స్. 2018లో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్ష రాసి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పుడు ఈ బాలుడి అమ్మమ్మ ప్రభావతి చార్టుల ద్వారా అక్షరాలు నేర్పించింది. తల్లి అప్పుడప్పుడు బడికి తీసుకెళ్లేది. వెనుక బెంచిలో పడుకోబెట్టినప్పుడు పాఠాలు విని అర్థం చేసుకునేవాడు. ఆంగ్లం ధారళంగా మాట్లాడేవాడు. 2024లో ఎఫ్ఎల్ఎన్ డిజిటల్ మార్ట్లో ఆన్లైన్లో కోర్సు నేర్చుకున్నాడు. 8 నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్ అందుకున్నాడు. నాలుగు నెలల పాటు ఆన్లైన్లోనే ఇంటర్షిప్ పూర్తి చేశాడు. ఈయన తెలివితేటలు చూసి ఆ సంస్థ మొదట రూ.18వేల వేతనం చెల్లించింది.ఆ తర్వాత టీమ్ లీడర్గా నియమించింది. ప్రస్తుతం రూ.35వేల నుంచి రూ.40వేల వరకు వేతనం పొందుతున్నాడు. చాలా మంది కాలక్షేపం కోసం వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ను ఈయన ఆయుధంగా మలుచుకున్నాడు. రెండు చేతుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఆ చేతితో మొబైల్ ఆపరేట్ చేస్తూ డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఎముకల వ్యాధి కారణంగా అతడిని కదిపితే ఎముకలు విరిగిపోతాయి. దీంతో ఎటువెళ్లినా ఓ పీటపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు బడికి వెళ్లే ముందు తినిపించి వెళ్తారు. మధ్యాహ్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి తినిపించడం, కాలకృత్యాలు తీర్చుతారు. ఈయన ముందు వైకల్యం సైతం ఓడిపోయింది. ఎంతో మంది సకలాంగులకు ఈయన జీవితం ఆదర్శనీయం.రెండు చేతులు కోల్పోయినా అధైర్యపడకుండా..ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన పొచ్చన్న–రమ దంపతులకు ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున వీరి కుమారుడు శ్రీసాయిచరణ్ గాలిపటం ఎగిరేసేందుకు పక్కింటికి వెళ్లాడు. బంగ్లాపై ఎగిరేసే క్రమంలో ఇంటి పైనుంచి వెళ్తున్న 33కేవీ విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురయ్యాడు. రెండు చేతులతో పాటు రెండు కాళ్లకు సంబంధించి రెండ్రెండు వేళ్లను కోల్పోయాడు. విధి వక్రించినా అధైర్యపడలేదు. చదవాలనే తపనతో మోచేతులతో పెన్ను పట్టడం, రాయడం నేర్చుకున్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలకు హాజరై 500కు గాను 417 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈ బాలుడు కాలకృత్యాలు, తినడం సొంతగా చేసుకోలేడు. తల్లిదండ్రులే అన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీలో అడ్మిషన్ తీసుకున్నాడు. తల్లి గృహిణి కాగా, తండ్రి డ్రైవర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించడానికి తండ్రి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లగా రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా దిక్కుతోచ ని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ఈ బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. – ఆదిలాబాద్టౌన్ -
అర్హులకే చేయూత
నిర్మల్చైన్గేట్: తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి కొత్తగా చేయూత పింఛన్ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హుల ఏరి వేత ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు ఐరిష్ను నమో దు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. అన్ని గ్రామాలతోపాటు పుర కేంద్రాల్లో ఈనెల 16 నుంచి పింఛన్దారుల వివరాలను ప్రత్యేక చేయూత యాప్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి ఆధార్ నంబర్తోపాటు అతని కళ్లు, ముఖం ఫొటో క్యాప్చర్ చేస్తూ నమోదు చేసుకుంటున్నారు. సకాలంలో యాప్ వివరాలు నమోదు చేసుకోకుంటే వారి పింఛన్ రద్దయ్యే అవకాశం ఉంది. కూలీ పనులతోపాటు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారిని వారి కుటుంబ సభ్యులు పిలిపించుకుని అధికారుల వద్ద వివరాలు నమోదు చేయిస్తున్నారు. జూన్ 15 వరకు నమోదు.. జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 400 గ్రామపంచాయతీలలో చేయూత నమోదు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. జూన్ 15 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించడంతో ప్రతీలబ్ధిదారు తమ వివరాలతోపాటు అధికారులు అడిగిన సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్ పొందుతున్న వారి సంఖ్య 1,44,773గా ఉందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. మృతిచెందిన వారి తొలగింపునకే.. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు చనిపోయినా.. అతడి పేరుపై కుటుంబ సభ్యులు నేటికీ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా పింఛన్ పొందుతున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత యాప్లో లబ్ధిదారుల నమోదుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లే అక్కడే ఐరిష్ నమోదు చేస్తుండటంతో ఇకపై మృతిచెందిన వారి పింఛన్లు నిలిచిపోవడం ఖాయమంటున్నారు. దీంతో అర్హత కలిగి నేటికి పింఛన్ తీసుకోలేని వారికి ఇది ఒక అవకాశంగా మారింది. అర్హుల నిరీక్షణ.. మరోవైపు చేయూత పెన్షన్ల కోసం అర్హులు నిరీక్షిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, బీడీకార్మిక, ఒంటరి మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే.. భార్యకు, భార్య చనిపోతే.. భర్తకు పెన్షను బదిలీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మార్పు చేయలేదు. ఫలితంగా జిల్లాలో అర్హతలు ఉన్నా చేయూత పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ తరువాత కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి అర్హతలను పరిశీలించి చనిపోయినవారి స్థానాల్లో కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్ అథెంటికేషన్ పూర్తయితేనే చేయూతపై క్లారిటీ వస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
జొన్న టోకెన్ల కోసం..
లోకేశ్వరం: మండలంలోని పంచగుడి, లోకేశ్వరం, ధర్మోర, బాగాపూర్, రాయాపూర్కాండ్లీ, వట్టోలి, నగర్, పిప్రి గ్రామాలకు చెందిన రైతులు యాసంగిలో జొన్న పంటలను సాగు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట విక్రయించేందుకు మండల కేంద్రంలోని రైతు వేదికలో టోకెన్లు ఇస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు రైతువేదిక ముందు శుక్రవారం చెప్పులను క్యూలో ఉంచి బారులు తీరారు. ఎకరాకు పది క్వింటాళ్లు విక్రయించేందుకు టోకెన్లు ఇచ్చారు. -
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: పెంబి మండలంలోని ఆదివాసుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరవదిక దీక్ష శుక్రవారం ఐదో రోజు కు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ, పెంబి మండలంలోని ఆదివాసులు రోడ్డు సౌకర్యం, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పోడు భూములకు సాగునీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా నిరవదిక నిరసన దీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. రెండు నెలల క్రితం ఆదివాసులు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించారని, అప్పట్లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కొన్ని గూడేల్లో మాత్రమే మంచినీటి సమస్య పరిష్కరించారని, మిగతా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూముల్లో జేసీబీలతో బావులు తవ్వుకోవడానికి, బోర్లు వేయించుకోవడానికి అనుమతులు ఇ వ్వాలని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదివా సుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసుల పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐఎం ఏరియా కమిటీ సభ్యులు డాకుర్ తిరుపతి, సుంచుల నారాయణ, ఖానాపూర్ పట్టణ కార్యదర్శి పానగంటి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలి
ఖానాపూర్/కడెం : ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. లోడింగ్, అన్లోడింగ్లో జాప్యం చేయకూడదని సూచించారు. ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును, కడెం మండలం నచ్చన్ఎల్లాపూర్, నవబ్పేట్, బెల్లాల్ రైస్మిల్లులను శుక్రవారం తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. మిల్లులో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు అన్లోడ్ చేసిన ధాన్యం వివరాలు, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం, రోజువారీ సగటు అన్లోడింగ్ సామర్థ్యం తదితర అంశాలపై అధికారులను, మిల్లు ని ర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. హమాలీల సంఖ్య పెంచాలి.. అన్లోడింగ్ ఆలస్యం కాకుండా హమాలీల సంఖ్య పెంచాలని మిల్లుల యజమానులకు సూచించారు. స్థానిక అధికారులు అన్లోడింగ్ను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మిల్లుల తనిఖీ అనంతరం అధికా రులతో సమావేశమైన కలెక్టర్ కొనుగోలు కేంద్రాల వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ము గింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలిన ప్రక్రియను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల శాఖ అధి కారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్లు సుజా త, మోయినుద్దీన్, ఎంపీడీవోలు రాధ, అరుణ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంత ప్రజలకు వసతులు కల్పించాలినిర్మల్చైన్గేట్: జిల్లాల్లోని అటవీప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో టెలికాం సేవల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్, రవాణా, పారిశుద్ధ్యం తదితర వసతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం ప్రతీ అంశం ఇంటర్నెట్తో ముడిపడి ఉన్నందున, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అటవీ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా ముఖ్య పట్టణాలకు అనుసంధానం పెరిగి మేలు కలుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన పార్పల్లి రైతులు లక్ష్మణచాంద: వరి ధాన్యం తరలించేలా చూడాలని మండలంలోని పార్పల్లి రైతులు శుక్రవారం కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిశారు. తూకం వేసిన ధాన్యం లారీలు రావడం లేదని ఉప సర్పంచ్ విద్యాసాగర్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందచేశారు. లారీల కోసం ఫోన్ చేస్తే ఒక బస్తాకు రూ.30 అడుగుతున్నారని తెలిపారు. తమ గ్రామంలో ఇంకా 20 వేల బస్తాల ధాన్యం ఉందని పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్ పౌరసరపరాల శాఖ డీఎంతో ఫోన్లో మాట్లాడి పార్పల్లి గ్రామానికి లారీలు పంపి ధాన్యం తరలించాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రైతులు నర్సయ్య, గంగాధర్, గంగన్న, నారాయణ తదితరులు ఉన్నారు. -
నిర్మల్
బాసరకు పోటెత్తిన భక్తులు బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026రేపు జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలునిర్మల్ టౌన్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31న(ఆదివారం) ఉదయం 8 గంటలకు పట్టణంలోని గండి రామన్న సాయిబాబా ఆలయ సమీపంలోని శిక్షణ కేంద్రంలో జిల్లాస్థాయి అండర్–14 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు టీసీఏ జిల్లా కోచ్ రామరాజు తెలిపారు. 2006 జనవరి 1లోపు జన్మించినవారు ఆధార్ కార్డు, తెల్లని జెర్సీ, కిట్ తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9912939724 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.ముహూర్తాల కోసం.. -
వీరులను కన్నఊరు రౌటసంకెపల్లి
ఆసిఫాబాద్: ఆదివాసీ యోధుడు కుమురం భీం జన్మించిన రౌటసంకెపల్లి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని.. వీరుడు కుమురంభీం, ఎడ్ల కొండను కన్న ఊరని, ఆదివాసీ సమాజ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమురంభీం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ కుమురంభీం ఇచ్చిన జల్ జంగల్ జమీన్ నినాదం కేవలం మూడు పదాలు కాదని, ప్రకృతి, మనిషి, సహజీవనానికి ప్రతీక అని పేర్కొన్నారు. హక్కులు, ఆత్మగౌరవం కోసం గొప్ప సైన్యం లేకపోయినా ధైర్య సాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం దేశ ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు, ఆదర్శాలను యువతకు చేరవేడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు, సామాజిక సేవకులను అభినందించారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, సంస్కృతిని కాపాడుతూ సమానాభివృద్ధి కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కుమురంభీం స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా రావడం సంతోషకరమన్నారు. ఆదివాసీలు హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై భీం పోరాడారని గుర్తు చేశారు. అంతకు ముందు గవర్నర్ కుమురంభీం, ఎడ్ల కొండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు చేశారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి సోలార్ పలకలు, ఆరోగ్య, సంక్షేమ కార్డులు, దుస్తులు పంపిణీ చేశారు. భీం, ఎడ్ల కొండు నూతన కాంస్య విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు సామూహిక మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీలు గుస్సాడీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, నిర్వాహకుడు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పూర్తి
లక్ష్మణచాంద: మండలంలోని చామన్పల్లి గ్రా మంలోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మూసివేశారు. 20 రోజుల క్రితం ప్రారంభించిన కొ నుగోళ్లు శుక్రవారం పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన 433 మంది రైతుల నుంచి 51,250 బస్తాల ధాన్యం సేకరించారు. శుక్రవారం చివ రి లారీ తరలించారు. ఇప్పటి వరకు 202 మంది రైతులకు రూ.1,38,56,500 వారి ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం నిర్వాహకులు తెలిపా రు. కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌర సరఫరాల శాఖ డీఎం సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ రఘునందన్రెడ్డికి నిర్వాహకులు రమణ, మహిపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
జౌలా(కె)లో మద్య నిషేధం!
తానూరు: మండలంలోని జౌలా(కె) గ్రామంలో మద్య నిషేధం విధిస్తూ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం, కల్తీ కల్లు కారణంగా యువత దారితప్పుతోంది, తాగుడుకు బానిసైనవారు కుటుంబాలను పట్టించుకోవ డం లేదని పంచాయతీ పాలకవర్గం మద్య నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈమేర కు గ్రామసభలో తీర్మానం పెట్టగా మెజారిటీ గ్రామస్తుల చెయ్యి ఎత్తి నిషేధానికి మద్దతు తెలిపారు. దీంతో అందరి సహకారంతో గ్రా మంలో మద్యం పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో సర్పంచ్ ఇరేష్, పంచాయతీ కార్యదర్శి నగేశ్, ఉపసర్పంచ్ రాణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
భూముల పంచాయితీ తెగేదెన్నడో?
కడెం: పులి ఆవాసం కోసం కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ వారికి పరిహారం కింద అందాల్సిన సాగు భూముల పంచాయితీ తెగడం లేదు. మండలంలోని పెత్తర్పు సమీపంలో పునరావాస గిరిజనులకు సాగుభూముల హద్దులు చూపేందుకు శనివారం తహసీల్దార్ ఖాజా మెయినుద్దీన్, ఎఫ్ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్రెడ్డి వెళ్లారు. గతంలో లానే మళ్లీ పక్కనే ఉన్న గొండుగూడ వాసులు ఆ భూములు తమవని, హద్దులు పెట్టకుండా అడ్డుకున్నారు. ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కలెక్టర్లు, డీఎఫ్వోలు, తహసీల్దార్లు మారినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని పునరావాస గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల్లో తమ సమస్యను పరిష్కరించకపోతే పాత గ్రామా లకు వెళ్తామని అధికారులను హెచ్చరించారు. తహసీల్దార్ కలెక్టర్కు, అటవీ అధికారులు డీఎఫ్వోకు ఇక్కడి పరిస్థితిని వివరించారు. ఇందులో ఆర్ఐ శారద, డీఆర్వో ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
విషయ నిపుణుల కమిటీలో జిల్లావాసి
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెల్మల మధుకు రాష్ట్రస్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బాటనీ పాఠ్యపుస్తక రచన కోసం ఏర్పాటు చేసిన విషయ నిపుణుల కమిటీలో ఆయనకు స్థానం లభించింది. ప్రతిష్టాత్మక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ పుస్తక రచనకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 15మంది విషయ నిపుణులను ఎంపిక చేయగా అందులో డాక్టర్ మధు ఒకరు. మధు ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వృక్షశాస్త్ర విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన, పలు జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించి ప్రత్యేక గుర్తింపు పొందారు. బోధనతోపాటు పరిశోధనారంగంలోనూ విశేష కృషి చేస్తూ విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి పాఠ్యపుస్తక రచన కమిటీలో జిల్లా వాసికి చోటు దక్కడంపై విద్యావేత్తలు, సహచర అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
భైంసా/బాసర: బాసరలోని ప్రముఖ విద్యాసంస్థ రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీ యూకేటీ)లో అవుట్సోర్సింగ్ ద్వారా నియమించే సెక్యూరిటీ గార్డు పోస్టుల అమ్మకం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఖాళీ అయిన సుమారు 15 పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ద్వారా జరుగుతున్న నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, లక్షల్లో వసూళ్లు..అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే అయినా నిరుద్యోగుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న కొందరు దళారులు, మధ్యవర్తులు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ సిఫార్సులతో కొందరు ప్రయత్నాలు చేస్తే, మరికొందరు ఉద్యోగం కోసం లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు భారీ మొత్తాల్లో బేరసారాలు జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కీలక వ్యక్తుల ఖాతాలు పరిశీలిస్తే వసూళ్ల వ్యవహారం స్పష్టమవుతుందని బాధితులు చెబుతున్నారు. గతంలో క్యాంపస్లో పనిచేసిన ఒక అధికారి పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కార్మికులకు బెదిరింపులు.. సెక్యూరిటీ విభాగంతోపాటు పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే సంస్థలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొత్త నియామకాల పేరుతో లంచాలు వసూలు చేయడమే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల్లో కోతలు విధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికులు మౌనం వహిస్తున్నారు. రూ.50 వేలు చెల్లించినా ఉద్యోగం రాలేదు... ఈ అవినీతి ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. బాసరకు చెందిన ముగ్గురు యువకులు ఒక ప్రజా ప్రతినిధిని నమ్మి సెక్యూరిటీ గార్డు పోస్టుల కోసం ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున అడ్వాన్స్గా ఇచ్చారు. పనిలో చేరిన తర్వాత మరో రూ.లక్ష ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు బాసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అవినీతి బయటపడింది. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. బాధితులు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు. విచారణ జరుపుతున్నాం సెక్యూరిటీ గార్డుల నియామకానికి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఫిర్యాదు వచ్చింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్నాం. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీ సుకుంటాం. బాధితులు ఇచ్చిన పేర్ల ఆధారంగా విచారణ జరుపుతున్నాం. – దీపక్, బాసర సీఐ -
అధ్యక్షా..
నిర్మల్చైన్గేట్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా వారోత్సవాలు, స్నేహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాక్ పార్లమెంట్ను స్వయంగా తిలకించారు. విద్యార్థులు ప్రధాన మంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రుల పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. మహిళల భద్రత, విద్య, సమాన హక్కుల సాధనపై సభలో జరిపిన చర్చ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ మాక్ పార్లమెంట్ కార్యక్రమంపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వెంకట సాయి.. మీ సంకల్పానికి సెల్యూట్
వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదని నిరూపిస్తున్నారు వీరు. పుట్టుకతోనే తోడైన ఎముకల వ్యాధి మంచానికే పరిమితం చేసినా డిజిటల్ రంగంలో పట్టు సాధించి టీమ్ లీడర్గా ఎదిగాడు ఓ యువకుడు. గాలిపటం ఎగరేస్తూ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా పట్టుదలతో ‘పది’ పరీక్షలు రాసి సత్తా చాటాడు మరో బాలుడు. దైవ నామాలతో సంకల్పదీక్షను జయించిన ఆ ఇద్దరిలో ఒకరు వెంకటరమణ కాగా మరొకరు శ్రీసాయిచరణ్. అన్నీ ఉండి నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువత ఒక్కసారి ఆలోచించాల్సిందే. విధిని సైతం జయించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే. – ఆదిలాబాద్టౌన్మంచానికే పరిమితమైనా.. డిజిటల్ రంగంలో రాణిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్నగర్కు చెందిన టెంబేకర్ సంతోష్కుమార్–సురేఖ దంపతులు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. పెద్ద కుమారుడైన వెంకటరమణను పుట్టుకతోనే ఎముకల జన్యు సంబంధ సమస్య వెంటాడింది. ప్రస్తుతం ఈయన వయస్సు 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. సెల్ఫోన్, టీవీ చూస్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడు. కుమారుడి పట్టుదల, తెలివితేటలు చూసి చదువు నేర్పించేందుకు ఓ ట్యూటర్ను ఏర్పాటు చేశారు పేరెంట్స్. 2018లో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్ష రాసి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పుడు ఈ బాలుడి అమ్మమ్మ ప్రభావతి చార్టుల ద్వారా అక్షరాలు నేర్పించింది. తల్లి అప్పుడప్పుడు బడికి తీసుకెళ్లేది. వెనుక బెంచిలో పడుకోబెట్టినప్పుడు పాఠాలు విని అర్థం చేసుకునేవాడు. ఆంగ్లం ధారళంగా మాట్లాడేవాడు. 2024లో ఎఫ్ఎల్ఎన్ డిజిటల్ మార్ట్లో ఆన్లైన్లో కోర్సు నేర్చుకున్నాడు. 8 నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్ అందుకున్నాడు. నాలుగు నెలల పాటు ఆన్లైన్లోనే ఇంటర్షిప్ పూర్తి చేశాడు. ఈయన తెలివితేటలు చూసి ఆ సంస్థ మొదట రూ.18వేల వేతనం చెల్లించింది. ఆ తర్వాత టీమ్ లీడర్గా నియమించింది. ప్రస్తుత ం రూ.35వేల నుంచి రూ.40వేల వరకు వేతనం పొందుతున్నాడు. చాలా మంది కాలక్షేపం కోసం వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ను ఈయన ఆయుధంగా మలుచుకున్నాడు. రెండు చేతుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఆ చేతితో మొబైల్ ఆపరేట్ చేస్తూ డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఎముకల వ్యాధి కారణంగా అతడిని కదిపితే ఎముకలు విరిగిపోతాయి. దీంతో ఎటువెళ్లినా ఓ పీటపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు బడికి వెళ్లే ముందు తినిపించి వెళ్తారు. మధ్యాహ్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి తినిపించడం, కాలకృత్యాలు తీర్చుతారు. ఈయన ముందు వైకల్యం సైతం ఓడిపోయింది. ఎంతో మంది సకలాంగులకు ఈయన జీవితం ఆదర్శనీయం. రెండు చేతులు కోల్పోయినా అధైర్యపడకుండా.. ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన పొచ్చన్న–రమ దంపతులకు ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున వీరి కుమారుడు శ్రీసాయిచరణ్ గాలిపటం ఎగిరేసేందుకు పక్కింటికి వెళ్లాడు. బంగ్లాపై ఎగిరేసే క్రమంలో ఇంటి పైనుంచి వెళ్తున్న 33కేవీ విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురయ్యాడు. రెండు చేతులతో పాటు రెండు కాళ్లకు సంబంధించి రెండ్రెండు వేళ్లను కోల్పోయాడు. విధి వక్రించినా అధైర్యపడలేదు. చదవాలనే తపనతో మోచేతులతో పెన్ను పట్టడం, రాయడం నేర్చుకున్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలకు హాజరై 500కు గాను 417 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈ బాలుడు కాలకృత్యాలు, తినడం సొంతగా చేసుకోలేడు. తల్లిదండ్రులే అన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీలో అడ్మిషన్ తీసుకున్నాడు. తల్లి గృహిణి కాగా, తండ్రి డ్రైవర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించడానికి తండ్రి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లగా రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా దిక్కుతోచ ని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ఈ బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. -
మున్సిపల్ సమావేశం రసాభాస
భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా సిబ్బంది ఎజెండా అంశాలను చదివి వినిపించారు. రూ.35 లక్షలతో అన్నివార్డుల్లో గుంతల పూడ్చివేత, సీసీ డ్రెయిన్లు, కల్వర్టులపై స్లాబుల నిర్మాణం, సీసీ రోడ్లకు మరమ్మతులు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు కోసం మరో రూ.10 లక్షలు కేటాయిస్తూ ఎజెండాలో పొందుపర్చారు. అనంతరం ఎజెండాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బక్రీద్ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా చేపట్టారని, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయలేదని ప్రతిపక్ష ఎంఐఎం కౌన్సిలర్లు ఆరోపించారు. 90 రోజుల కార్యాచరణ ప్రణాళికలోనూ తమను భాగస్వాములను చేయలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ క్రమంలో ఎంఐఎం, అధికార కౌన్సిలర్ల మధ్య తోపులాటకు దారి తీసింది. చైర్మన్, మాజీ చైర్మన్ మధ్య వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగింది. అలాగే, పట్టణంలోని ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని భూములను నివాస ప్రాంతాల్లోకి మార్చేందుకుగాను టేబుల్ ఎజెండా ప్రతిపాదించగా, దీనిపై ప్రతిపక్ష ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక, అధికార పక్ష కౌన్సిలర్లు ముగ్గురు సమావేశానికి రాకపోవడంతో వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని మాజీ చైర్మన్ జాబీర్ అహ్మద్ పట్టుబట్టారు. అనంతరం సమావేశం నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ దత్తాత్రి మాట్లాడుతూ.. రెండు అంశాలతో కూడిన ఎజెండా కౌన్సిల్ ఆమోదం పొందిందని, కానీ, టేబుల్ ఎజెండాలోని ఇండస్ట్రీయల్ జోన్లోని భూములను నివాస ప్రాంతంలోకి మార్చేందుకు చేసిన ప్రతిపాదనను ఎంఐఎం అడ్డుకుందని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ ఎం.లింగయ్య, టీపీవో అనురాధ, మేనేజర్ గౌరీష్ పాల్గొన్నారు. -
ప్రతీ గింజ కొనుగోలు చేస్తాం
నిర్మల్చైన్గేట్: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లు రవాణా ప్రక్రియలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ భవేశ్మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై శనివారం మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మొక్కజొన్న, వరి, జొన్నల కొనుగోళ్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మక్కల కొనుగోళ్లలో రికార్డు...మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చారన్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.1,700 నుంచి రూ.1,800 మాత్రమే లభిస్తుండగా, ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా రైతులకు అధిక లాభం చేకూరిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాలకు వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేయడంతో మే 30 నాటికే 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.34 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను గోదాములకు తరలించగా, సుమారు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రాల్లో ఉన్నాయన్నారు. జూన్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వరి కొనుగోళ్లు వేగవంతం..జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతేడాది కూడా ఇదే స్థాయిలో కొనుగోళ్లు జరిగాయని ఇప్పటి వరకు 80 నుంచి 85 వేల మెట్రిక్ టన్నుల వరిని గోదాములకు తరలించామన్నారు. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల వరి రవాణా జరుగుతోందన్నారు. మక్కల రవాణా పూర్తయిన తర్వాత అదనపు లారీలు, హమాలీలను వరి రవాణాకు వినియోగించి రోజువారీ సామర్థ్యాన్ని 9 వేల మెట్రిక్ టన్నులకు పెంచుతామని తెలిపారు. వర్షాలపై ముందస్తు చర్యలు...రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకా శం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామని కలెక్టర వివరించారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా తడవలేదన్నారు. వర్షాలు కురి సినా ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. జొన్నల కొనుగోళ్లకు సన్నద్ధం..జిల్లాలో జొన్నల కొనుగోళ్లకు 13 కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు భవేశ్మిశ్రా తెలిపారు. మక్కల కొనుగోళ్లు పూర్తయిన వెంటనే జొన్నల కొనుగోళ్లు చేయనున్నట్లు చెప్పారు. క్వింటాలుకు రూ.3,700 మద్ద తు ధరతో మార్క్ఫెడ్ ద్వారా 35 వేల నుంచి 40 వే ల మెట్రిక్ టన్నుల జొన్నల కొనుగోలు చేస్తామని వె ల్లడించారు. జొన్నల నిల్వ కోసం ఇప్పటికే 20 నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదా ములను సిద్ధం చేశామని, జూన్ 10 లేదా 11 నాటికి కొనుగోళ్లు, రవాణా పూర్తవుతాయని తెలిపారు. గోదాముల సామర్థ్యం పెంపు..భారీ స్థాయిలో పంట కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో గోదాముల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపా రు. ప్రస్తుతం జిల్లాలో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను అందుబాటులో ఉంచామన్నారు. లోకేశ్వరం, కడెం మండలాల్లో అదనపు గోదాములను గుర్తించి వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మార్క్ఫెడ్ డీఎం మహేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు. -
రైతు గోస చూడండి
సారంగపూర్: రాష్ట్రంలో ఇప్పటివరకు 80 శాతం ధాన్యం సేకరించామని రేవంత్ సర్కారు అబద్ధాలు చెబుతోందని.. ఆ 80 శాతం ఎక్కడ కొనుగోలు చేశారో చెబుతారా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఇంతటి అబద్ధాలకోరు సర్కారును గతంలో ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. గాలిమోటార్లలో గాలి తిరుగుడు తిరిగి చెప్పడం కాదు.. గ్రామాల్లో రైతు గోస చూడాలని, పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలు చూడాలని డిమాండ్ చేశారు. రైతులను గోసపెట్టి, బాధపెట్టే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనేలేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవగలవా? అని ప్రశ్నించారు. ఒకవేళ గెలిచి చూపిస్తే తాను జీవితాంతం రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘రైతుగోస–బీజేపీ భరోసా’ యాత్ర తొలి విడత నిర్మల్ జిల్లా సారంగపూర్లో గురువారం ముగిసింది. అంతకుముందు ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం మార్కెట్యార్డులో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించింది. రైతుల సమస్యలను తెలుసుకుంది. ఆ తర్వాత సాయంత్రం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏలేటి మాట్లాడారు. ప్రతి గింజ కొనుగోలు చేయాలి ‘గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ ఖర్చులు, లారీ ఖర్చులు తామే భరించి పండించిన పంటలను విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? కనిపిస్తే కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలి. బీజేపీ చేసే రైతు భరోసా కార్యక్రమానికి భయపడి అక్కడక్కడా కొన్ని లారీలు, గన్నీబ్యాగులు సమకూర్చడం కాదు.. రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా కొనుగోలు చేయాలి..’ అని ఏలేటి డిమాండ్ చేశారు. దుర్భర పరిస్థితులు కాంగ్రెస్ ఘనతే..: ఈటల రైతులే గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ డబ్బులు అదనంగా చెల్లించి, లారీలు సైతం తామే నమకూర్చుకునేందుకు ముందుకు వస్తున్నా మార్కెట్లలో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రైతాంగానికి ఇలాంటి దుర్భర పరిస్థితులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ‘మూడు నెలల క్రితమే పంట చేతికి వస్తోంది.. ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా..మీకు మీరే కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారా?.. అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను సంప్రదించాం. ఆ సమయంలో మాకు తెలువదా.. మేము ఎలా కొనాలో మీరు చెప్పాలా.. అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దురహంకారానికి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం..’ అని ఈటల ధ్వజమెత్తారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వారిని ఏవిధంగా పట్టించుకుంటోందో చెప్పాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు, హమాలీ, లారీల ఖర్చులు తిరిగి ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కంట కన్నీరు పెట్టించే ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల శంకర్, పాల్వాయి హరీష్ మాట్లాడుతూ.. రైతులను క్షోభపెడితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. రైతు కన్నీరు కారిస్తే ఆ ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల సందర్శన..రైతులతో ముఖాముఖి నిర్మల్: ఏలేటి, ఈటలతోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణరెడ్డి, రామారావు పటేల్, రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, కిసాన్సెల్ అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులతో కూడిన బృందం నిర్మల్ జిల్లాలో పర్యటించింది. కడెం మండలం పెద్దూరుతండా, ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్యార్డు, మామడ మండలం పొన్కల్, సోన్, దిలావర్పూర్ మండల కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మామడ మండల కేంద్రం, పొన్కల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో నెల నుంచి ధాన్యం కుప్పలు ఇలాగే ఉంటున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని మహేశ్వర్రెడ్డి ఈ సందర్భంగా సంబంధిత అధికారిని ప్రశ్నించారు. రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తడుస్తున్న ధాన్యాన్ని చూస్తున్న రైతుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని, వాళ్లను చూస్తుంటే తమకూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
కడెం: కడెం–పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్కుమార్, ఉప సర్పంచ్ పిట్టలరాజు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. మహారాష్ట్రకు చెందిన జవిలాల్ అనే వ్యక్తి కొంతకాలంగా మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 24న వడదెబ్బతో మృతిచెందడంతో పోలీసులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి అతడి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అతని బంధువులెవరూ రాకపోవడంతో బుధవారం రాత్రి స్థానిక యువకులు ముభారక్, రాము, కిట్టు, హసీబ్, మోసిన్, గోవింద్ సాయంతో సర్పంచ్ అనాథ శవానికి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, స్థానిక యువకులను గ్రామస్తులు అభినందించారు. -
భీం జన్మభూమికి నేడు గవర్నర్ రాక
ఆసిఫాబాద్: గోండు బెబ్బులి, ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం జన్మస్థలమైన ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గ్రామాన్ని హైదరా బాద్కు చెందిన నాగేంద్ర దత్తత తీసుకున్న విష యం తెలిసిందే.. కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కుమురంభీంతోపాటు ఎడ్లకొండు 20 అడుగుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పర్యటన ఇలా..రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఉద యం హెలిక్యాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్ర యం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆసిఫా బాద్లోని కలెక్టరేట్కు చేరుకుంటారు. 11 గంట ల నుంచి 12.30 గంటల వరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు రోడ్డు మా ర్గం ద్వారా రౌటసంకెపల్లికి బయలుదేరుతారు. అక్కడ కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.25 గంటల కు హైదరాబాద్కు తిరిగి వెళ్తారని కలెక్టర్ కె.హరిత తెలిపారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు సీఐలు, 19 మంది ఎస్సైలు, 27 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, 34 మంది టీజీఎస్పీ సిబ్బంది, 40 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 47 మంది హోంగార్డులు.. మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
కుంటాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. గురువారం మండలంలోని అర్లి(కె) శ్రీఆంజనేయ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం కల్లూరులోని మొక్కజొన్న, జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. లారీ లు, హమాలీల కొరత లేదని రైతులు అసహనానికి గురికావద్దని సూచించారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం కల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ధాన్యం నిల్వలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 7లోపు కొనుగోళ్లు పూర్తిచేయాలని, కేంద్రాల్లోని నిల్వలను సకాలంలో గోదాములకు తరలించి అన్లోడింగ్ చేయాలని సూచించారు. మండలంలోని పెంచికల్పాడ్ గ్రామంలో గోదాంకు అవసరమయ్యే ఐదెకరాల ప్రభుత్వ స్థలం ఉందని, నిర్మాణం కోసం వెంటనే పరిశీలించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లాలోని లోకేశ్వరం, సారంగపూర్, దస్తురాబాద్ మండలాల్లో కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, పౌరసరఫరాలశాఖ అధికారి రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో వనజ, సర్పంచులు పెంటవార్ దశరథ్, చంద్యాల మురళి, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం తదితరులున్నారు. -
‘ప్రతి గింజా కొనాల్సిందే..’
ఖానాపూర్: మండలంలోని దిల్వార్పూర్ పరిధిలోగల పీఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, సెక్రటరీ నబీఖాన్తో కొనుగోళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రస్తు తం కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని సూచించారు. లారీల సంఖ్య పెంచి ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిర్మల్
7జీలుగ సాగుతో లాభాలెన్నో.. భూమిని సారవంతంగా మార్చేందుకు జీలు గ ఎంతో మేలు చేస్తుంది. ఏపుగా పెరిగాక భూమిలోనే కలియ దున్నితే మొక్కలు కుళ్లి నేల సారవంతంగా మారుతుంది. 9లోu ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఉక్కపోత ఎక్కువవుతుంది.ఆధ్యాత్మికం.. అగస్త్య గుండం అగస్త్య మహాముని చెన్నూర్ ప్రాంతంలో నడయాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే పెద్ద చెరువుకు అగస్త్య గుండంగా పేరు వచ్చినట్లు తెలుస్తోంది. 8లోu -
అన్నదాతల గోస పట్టదా?
లక్ష్మణచాంద/మామడ/కడెం/ఖానాపూర్/దిలావర్పూర్: కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం రైతు గోస–బీజేపీ భరోసా యాత్రలో భాగంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కామారెడ్డి, ఆర్మూర్, ముధోల్ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావుపటేల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్యతో కలిసి సోన్, దిలావర్పూర్ మండల కేంద్రాలు, మామడ మండలంలోని మామడ, పొన్కల్, కడెం మండలంలోని పెద్దూర్తండా గ్రామాలు, ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్యార్డులోని వరి, జొన్న, మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సంచులు, దారాలు, ఇతర సామగ్రి తామే సొంత ఖర్చులతో కొనుగోలు చేసుకుంటున్నామని, ధాన్యం విక్రయించేందుకు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడు తూ.. ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందుల కు గురి కావాల్సి వస్తోందని మండిపడ్డారు. సకా లంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకా ల వర్షాలకు తడిసి రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా జూన్ 5వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీరే దాకా తమ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులతో పెట్టుకుంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, నాయకులు సత్యం చంద్రకాంత్, రాంనాథ్, గంగన్న, రమేశ్, గంగారెడ్డి, నర్సయ్య, చిన్నయ్య, రవి, సాగర్, నరేశ్, విలాస్, శ్రీనివాస్యాదవ్, రవీందర్గౌడ్, రమణారెడ్డి, రవీందర్రెడ్డి, మోహన్నాయక్, సత్తెన్న, రమేశ్గౌడ్, శ్రీరాం, తిరుమల్, సాయికుమార్, రంజిత్, పుల్లారావు యాదవ్, సురేశ్, మౌనిక–మహేందర్, ఉపేందర్, ఆనంద్, వెంకటరాములు, మల్లేశ్, సత్యవతి, శ్రీనివాస్, ముత్యంరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బ బాధితులకువార్డులు
నిర్మల్చైన్గేట్: ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణశాఖ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించింది. వారంరోజులుగా జిల్లా వ్యాప్తంగా 41నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బ బారిన పడిన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి అధికారులు ముందస్తుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, భైంసా ఏరియాస్పత్రిలో ప్రత్యేకంగా హీట్ స్ట్రోక్ వార్డులు ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యులతోపాటు ఏఎన్ఎంలు 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వడదెబ్బ బారిన పడితే వీటిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. మరింత జాగ్రత్తగా ఉండాలి జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. అత్యవసరమైతే టోపీ, రుమాలు ధరించి వెళ్లాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నారులు, వద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. – రాజేందర్, డీఎంహెచ్వోవార్డులో అందుబాటులో ఉన్న మందులుజిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హీట్ స్ట్రోక్వార్డులో చికిత్స పొందుతున్న రోగులు అందుబాటులో మందులుజిల్లా వైద్యారోగ్యశాఖతో పాటు జీజీహెచ్, ఏరియాస్పత్రుల అధికారులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధిహామీ పనులు చేసే ప్రాంతా ల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచా రు. పీహెచ్సీల్లో ఓపీ సేవల కోసం వచ్చే వారు డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రత్యేకంగా లీటర్ నీటిలో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి దాహం వేసిన వారికి అందిస్తున్నారు. వేసవిలో వచ్చే జబ్బులకు సంబంధించిన మందులు, గ్లూ కోజ్ బాటిళ్లను అన్ని ఆస్పత్రులు, పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోజువారీ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. -
భరోసా బాకీ!
నిర్మల్చైన్గేట్: మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానుంది. వానాకాలం సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో యాసంగి రైతు భరోసా అందలేదు. రెండెకరాల్లోపు రైతులకే రెండు విడతల్లో ప్రభుత్వ సాయం అందింది. ఇక వానాకాలం సాగుకు ఎప్పుడు ‘భరోసా’ అందుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులున్నారు. రైతులకు రూ.100 కోట్ల బకాయి? జిల్లాలో 2.24 లక్షల మంది రైతులు సుమారు 4.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎకరాకు రూ.6వేలు చొప్పున వానాకాలం, యాసంగికి కలిపి రూ.12వేలు అందజేస్తోంది. యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధులను డిసెంబర్, జనవరిలో విడుదల చేయాల్సి ఉండగా ఈసారి మార్చిలో మొదటి విడతలో ఎకరంలోపు రైతులకు, ఏప్రిల్లో రెండో విడత కింద రెండెకరాల లోపు రైతులకు సాయం అందించింది. రైతు భరోస సాయం కింద జిల్లాలోని 1,91,288 మంది రైతులకు రూ.266 కోట్లు అందించాల్సి ఉండగా ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి రూ.168కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా రూ.100 కోట్లు రావాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో రైతాంగంగతంలో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే, ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. యాసంగి రైతు భరోసానే పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇక వచ్చే ఖరీఫ్ పెట్టుబడి సాయం వస్తుందో.. రాదోననే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. యాసంగి రైతు భరోసా ఇలా..మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము భైంసా 15,948 రూ.15,38,42,312 కుభీర్ 18,547 రూ.18,49,64,716 కుంటాల 8,318 రూ.7,86,24,343 దస్తురాబాద్ 5,508 రూ.4,17,75,903 కడెం 11,901 రూ.9,78,16,605 ఖానాపూర్ 9,845 రూ.7,59,80,487 పెంబి 6,070 రూ.5,79,24,306 బాసర 6,836 రూ.6,34,71,004 లోకేశ్వరం 12,970 రూ.11,17,46,169 ముధోల్ 12,720 రూ.11,99,29,925 తానూర్ 15,753 రూ.15,55,31,279 దిలావర్పూర్ 7,022 రూ.5,93,19,305 నర్సాపూర్(జి) 7,554 6,49,12,557 సోన్ 7,687 రూ.6,03,56,873 లక్ష్మణచాంద 9,278 రూ.6,93,98,486 మామడ 11,115 రూ.9,55,90,501 నిర్మల్రూరల్ 9,325 రూ.6,93,16,738 నిర్మల్అర్బన్ 579 రూ.32,27,559 -
‘బీజేపీ యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమే’
ఖానాపూర్: రైతు గోస పేరిట బీజేపీ చేపట్టిన యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమేనని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆరోపించారు. గురువారం పట్ట ణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పరిమితి విధించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 80లక్షల మెట్రిక్ టన్నులు చేసిందని చెప్పారు. రైతుల పండించిన చివరి ధాన్యం గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట అధికంగా పండినందున కొనుగోళ్లలో కొంత జాప్యం జరిగినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పెంబిలో అటవీ అనుమతుల కోసం ధర్నా చేస్తున్న బాధితులకు మద్దతివ్వాలని సూచించారు. నాయకులు పడిగెల భూషణ్, గాడ్పు సత్యం, చిన్నం సత్యం, అంకం రాజేందర్, జంగిలి శంకర్, గొర్రె గంగాధర్, రాజునాయ క్, కట్ట శ్యామ్, గంగనర్సయ్య, ప్రశాంత్రెడ్డి, జన్నారపు శంకర్, గుడాల రాజన్న, బొడ్డు గంగన్న, చంద్రశేఖర్, శ్రీకాంత్, శేషాద్రి, ఎనగంటి హరి, శ్రీహరి తదితరులున్నారు. -
నిర్మల్
ఆధునికీకరణకు నోచుకోని ‘సరస్వతి’ ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో ఒకటైన సరస్వతి కెనాల్ ఆధునికీకరణకు నోచుకోక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. తహసీల్దార్కు పదోన్నతినిర్మల్చైన్గేట్:రాష్ట్రంలో పలువురు తహసీల్దార్లను పదోన్నతిపై బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నిర్మల్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఏ.మోతీరాంకు డీఆర్వోగా పదోన్నతి కల్పించి మంచిర్యాలకు బదిలీ చేశారు. రేపు కార్గో వస్తువుల వేలంనిర్మల్టౌన్: ఆర్టీసీ నిర్మల్ డిపో కార్గోలో తీసుకెళ్లని పాత వస్తువులను ఈ నెల 29న డిపో ఆవరణలో వేలం వేయనున్నట్లు డీఎం కె.పండరి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు వేలంలో పాల్గొనాలని సూచించారు. భైంసాలో ఫ్లాగ్మార్చ్భైంసాటౌన్:పట్టణంలో బుధవారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా బలగాలతో కవాతు చేపట్టారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సాయికుమార్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.భైంసా.ఖరీఫ్ సీజన్కు ముందే రైతు నెత్తిన పిడుగుపడింది. ఇప్పటికే యాసంగి పంట అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కేంద్రం కాస్త ఊరట నిచ్చేలా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. అయితే ఈ పెంపు చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది పెదవి విరిచారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను 50 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.400 వరకు పెంచేసింది. మద్దతు ధర పెంపు క్వింటాలుకు రూ.72 నుంచి రూ.622 మాత్రమే. ఎకరాకు లెక్కేస్తే రైతుకు వచ్చే అదనపు ఆదాయం కన్నా ఎరువులకే అయ్యే అదనపు ఖర్చు రెట్టింపు అవుతోంది. జిల్లా పరిస్థితి..... జిల్లాలో ఖరీఫ్లో 1.82 లక్షల ఎకరాల్లో వరి, 1.35 లక్షల ఎకరాల్లో పత్తి, 68 వేల ఎకరాల్లో సోయా, 42 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ సీజన్లో రైతులపై అదనంగా రూ.38 కోట్ల ఎరువుల భారం పడుతుంది. ఎంఎస్పీ పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ.112 కోట్లు. డీజిల్ లీటరు రూ.3, కూలీ రోజుకు రూ.100 పెరగడంతో ఆ మిగులు కూడా కరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ‘క్వింటాలుకు రూ.72 పెంచి ఎరువు బస్తాకు రూ.400 పెంచితే ఎలా బతకాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట చేతికి వచ్చాక తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 3–4 కేజీలు కోత పెడుతున్నారని పేర్కొంటున్నారు. బాధ్యులపై చర్య తీసుకోవాలికాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.లలో ఎరువు పాత ధర కొత్త ధర పెంపు 10:26:26 1850 1,975 125 12:32:16 1,475 1,875 400 14:35:14 1,500 1,850 350 20:20:0:13 1,500 1,800 300 డీఏపీ 1,350 1,350 మార్పు లేదు 28:28:0 1,500 1,800 300 పొటాష్ 1,850 1,975 1215 సూపర్ 615 775 160 పంటల వారీగా కొత్త ఎంఎస్పీ (క్వింటాల్కు)రూ.లలో.. పంట పాత ధర కొత్త ధర పెంపు వరి(సాధారణ) 2,369 2,441 72 వరి(గ్రేడ్–ఏ) 2,389 2,461 72 మొక్కజొన్న 2,329 2,401 72 పత్తి(మధ్యశ్రేణి) 7,710 8,267 557 పత్తి(దీర్ఘశ్రేణి) 8,110 8,667 557 సోయాబీన్ 4,892 5,284 392 కంది 7,550 8,415 865 జిల్లా రైతుపై భారం(ఎకరా లెక్కన) -
గోడు వినేదెవరు..!?
నిర్మల్:జిల్లాలో ఓ దిక్కు వర్షాలు పడుతున్నాయి. మరో దిక్కు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. వర్షం పడితే కళ్లముందే తమ కష్టమంతా కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం కూడా తరలించడం లేదు. సంచికి అదనంగా 20 రూపాయలు ఇస్తామన్నా లారీలు రావడం లేదు. మిల్లులకు వెళ్లిన లారీ రావాలంటే రోజులు పడుతోంది. రైతన్నలే స్వయంగా వెళ్లి బతిమాలుకుని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు కేంద్రాలవైపు కన్నెత్తి చూడడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రాలవైపు రాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత రైతుల కష్టం పట్టదా..!? జిల్లాలోని మూడు నియోజకవర్గాలకుగాను బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్యే ఉన్నా రు. మూడు చోట్ల ధాన్యం, మక్కలు, జొన్నలు ఇలా ఏదో ఒక రకమైన పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. లారీలను సైతం రైతులే తెచ్చుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు స్థానికంగా కాకుండా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేయడం, పర్యటనలకు వెళ్లడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై పోరాటం ప్రారంభించింది. ఇదే సమయంలో జిల్లా రైతులు ధాన్యం, మక్కల కొనుగోలుకు ఆందోళనలు చేస్తున్నారు. కానీ సొంత నియోజకవర్గాల్లో కాకుండా పొరుగు జిల్లాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు యాత్ర చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే విహార యాత్రకు వెళ్లి రెండు రోజుల క్రితమే వచ్చారు. జిల్లా నుంచి గెలిచి ఎమ్మెల్సీలు, అత్యధిక ఓట్లతో గెలిచిన ఎంపీ సైతం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కుతున్న రైతన్న.. ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా తమ కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడంతోపాటు అకాల వర్షానికి తమ కష్టమంతా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ఓవైపు కలెక్టర్సహా జిల్లా అధికారులు కొనుగోలు వేగవంతం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ స్పీడ్ లేక రైతులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట సైతం రైతులు ధర్నాకు దిగారు. తాము బంగారం అడగటం లేదని, పండించిన పంటలు సకాలంలో కొనుగోలు చేసి, తరలించాలనివేడుకుంటున్నారు. చిన్న రైతుల గోస... దిగుబడి ఎక్కువగా వచ్చిన రైతులు సంచికి అదనంగా రూ. 20 నుంచి రూ.25 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మక్క తరలించడానికి రూ.15 నుంచి రూ.20 వరకు రైతులు ఇస్తున్నారు. కానీ.. భూ విస్తీర్ణం తక్కువగా ఉండి, పంట దిగుబడి తక్కువగా వచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సంచికి అంత మొత్తం ఇస్తే తమకు ఏం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే వర్షాలు పడి తమ పంట నష్టం కాకముందే కొనుగోలు చేసి తరలించాలని కోరుతున్నారు. కడెం చేరుకున్న బీజేపీ నేతలుకడెం: రైతు గోస.. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం రాత్రి కడెం చేరుకున్నారు. ఎంపీలు నగేశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రాకేశ్రెడ్డి, రామారావుపటేల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య తదితరులు కడెంలోని బృందావన్ రిసార్ట్స్లో విడిది చేశారు. గురువారం పెద్దూర్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ తెలిపారు. -
పిప్రికి సాగు నీరందించాలి
లోకేశ్వరం: పిప్రి ఎత్తిపోతల పథకం ద్వార పిప్రి గ్రామానికి సాగు నీరందించేలా చూడాలని గ్రామస్తులు, ఎత్తిపోతల పథకం కమిటీ సభ్యులు ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈ అనిల్ను కోరారు. ఈమేరకు బుధవారం కలిసి సమస్యలను వివరించారు. గ్రామ శివారు ప్రాంతంలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలన్నారు. పిప్రి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసిన తర్వాతనే మిగతా పనులు చేస్తామని అనిల్ హామీ ఇచ్చారు. సర్వే ప్రకారంగా 8 డీసీ లను నిర్మించి 557 ఎకరాలను సాగు నీరందిస్తామన్నారు. కార్యక్రమంలో పిప్రి వీడీసీ చై ర్మన్ జీవరత్నం, ఉపాధ్యక్షుడు రంజిత్, క్యాషి యర్ మగ్గిడి రాజు, ఎత్తిపోతల పథకం చైర్మన్ బందు, సభ్యులు చిన్నయ్య, పాపయ్య, నరేశ్గౌడ్, భోజన్న, రమేశ్, ముత్యం పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు కార్డన్సెర్చ్
లోకేశ్వరం/సారంగపూర్: నేరాలను నియంత్రించడానికే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. లోకేశ్వరం మండలం హథ్గాం, సారంగపూర్ మండలం చించోలి(బి)లో వేర్వేరుగా బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారు జామున గ్రామానికి చేరుకున్న బలగాలు ఇంటింటా తనిఖీలు నిర్వహిచారు. హథ్గాంలో ధ్రువీకరణ పత్రాలు లేని 69 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ వాహన చోదకులు వాహనాల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సారంగపూర్ మండలం చించోలి(బి)లో 75 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి, ప్రజలకు భధ్రత కల్పించడానికి, యువత భవిష్యత్తు కోసం తనిఖీలు చేపడుతున్నామన్నారు. 69 వాహనాల చలానాలు కట్టించామని తెలిపారు. కార్యక్రమాల్లో హథ్గాం సర్పంచ్ రమేష్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, లోకేశ్వరం ఎస్సై అశోక్, ముధోల్ ఎస్సై పెర్సీస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, లింబాద్రి, గణేశ్ పోలీసులు పాల్గొన్నారు. -
సన్ స్ట్రోక్.. బీకేర్ఫుల్
నిర్మల్చైన్గేట్:జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్ దాటుతున్నాయి. ఎండలకు వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు వడదెబ్బతో మృతిచెందారు. తలనొప్పి, జ్వరం తదితర సమస్యలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సన్స్ట్రోక్ను లైట్గా తీసుకోవద్దని డీఎంహెచ్వో రాజేందర్ సూచించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. సాక్షి : వడదెబ్బ లక్షణాలను ఎలా గుర్తించాలి? డీఎంహెచ్వో : తలనొప్పి, అధిక జ్వరం (107 డిగ్రీల టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్కు గురికావడం, స్పృహ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించాలి. నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డీహైడ్రేషన్ను అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మృతి చెందే అవకాశాలు ఉంటాయి. సాక్షి : వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్వో : అవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, మాంసం, చికెన్ లాంటివి తీసుకోకపోవడం ఉత్తమం. జ్వరం, తలనొప్పి, ఇతర వడదెబ్బ లక్షణాలు, సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాక్షి : బయటకు వెళ్లేప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్వో : బయటికి వెళ్లేప్పుడు తలకు తెల్లని టోపీ పెట్టుకోవాలి. కళ్లజోడుతోపాటు చెవులు, ముక్కులోకి వేడిగాలులు ప్రవేశించకుండా రుమాలు కట్టుకోవాలి. తెల్లని, కాటన్ దుస్తులు ధరించాలి. సిల్క్, నైలాన్ వంటి దుస్తులు ధరించొద్దు. సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా బయట ఆడుతుంటారు. ఈ క్రమంలో నీరు తీసుకోవడంపై అశ్రద్ధ వహిస్తారు. తల్లిదండ్రులు గమనించి తరచూ నీటిని తాగించాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇండోర్ గేమ్స్ ఆడించాలి. సాక్షి : ఎండల ప్రభావం ఎవరిపై ఎక్కువ... డీఎంహెచ్వో : ఎండల ప్రభావం మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, సిగరేట్, ఆల్కాహాల్ సేవించేవారిపై ఎక్కువగా ఉంటుంది. వీరు ఎండలో ఎక్కువసేపు ఉండొద్దు. తలుపులు మూసి ఇంట్లో ఉన్నా వృద్ధులు, చిన్నారులు సైతం వేడి ప్రభావంతో డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు వడగాలులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాక్షి : ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? డీఎంహెచ్వో : వడగాలులకు శరీరంలోని నీరుచెమట రూపంలో ఆవిరైపోతుంది. సాధారణ రోజుల్లో కన్నా 3 లీటర్ల వరకు నీటిని అధికంగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసు కోవాలి. కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్, చల్లని నీటి కన్నా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగితే మంచిది. పుచ్చకాయ, నిమ్మరసం, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. రోజులో 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది. డాక్టర్ రాజేందర్ డీఎంహెచ్వో -
నేడు బక్రీద్
ఉట్నూర్రూరల్/కెరమెరి/నెన్నెల: ఇస్లాం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ రెండోది. ఇబ్రహీం చేసిన నిరుపమాన త్యాగానికి ప్రతీ కగా ఏటా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మసీదులు, ఈ ద్గాలు ముస్తాబు చేశారు. గురువారం బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పా ట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 10వ రోజున బక్రీద్ పండుగను ఇబ్రహీం త్యా గాన్ని తలుచుకుంటారు. ఇదేరోజు మక్కా నగరంలో హజ్ ఆరాధనోత్సవం జరుగుతుంది. మక్కా వెళ్లే స్థోమత లేనివారు ఉన్న చోటే ప్రత్యేక నమాజ్ చేసి ఖుర్బానీ ఇస్తారు. బుధవారం జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీలు, మండలాల్లో ఈద్గా వద్ద ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. -
ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి
లక్ష్మణచాంద:జిల్లాలోని మిల్లులు, ధాన్యం నిల్వ కేంద్రాలకు వచ్చే వాహనాల్లో బస్తాల అన్లోడింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని తిర్పెల్లి గ్రామంలోని గోదామును మంగళవారం సందర్శించారు. ధాన్యం తెచ్చిన ట్రాక్టర్లు, అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. గోదాం నిల్వ సామార్థ్యం, ఇప్పటి వరకు నిల్వచేసిన ధాన్యం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి, అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్లోడింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత తదితరులు ఉన్నారు. పంట వ్యర్థాలకు నిప్పులక్ష్మణచాంద:సోన్ శివారులో సోమవారం రాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 200 ఎకరాలలో పంటల వ్యర్థాలు కాలిపోయాయి. ప్రమాదవశాత్తు మంటలు నలు దిక్కులా వ్యాపించడంతో సమీపంలోని రైతుల విద్యుత్ మోటార్ల కేబుళ్లు, సమీపంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కేబుల్ తెగిపోయింది. -
ఇందిరమ్మకు అ‘ధనం’
లక్ష్మణచాంద:ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఊరట లభించింది. నిరుపేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా.. ఈ పథకాన్ని ఉపాధి హామీ స్కీమ్తో ప్రభుత్వం అనుసంధానించింది. అయితే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారుడికి 90 రోజులపాటు అన్స్కిల్డ్ కూలీ కింద వేతనం చెల్లించాలని పంచాయతీరాజ్, ఆర్డీ కమిషనర్ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రతీ లబ్ధిదారుకు రూ.27 వేల అదనపు ఆదాయం అందనుంది. ప్రతీ లబ్ధిదారుకు 90 రోజుల వేతనం.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూనే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.27 వేల వేతనం అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వం రూ.5 లక్షలతో నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తమ సొంత ఇంటి పనులు చేసుకుంటూ ఒక్క రోజుకు రూ.300 చొప్పున 90 రోజుల వేతనం పొందనున్నారు. దీంతో ఒక్క లబ్ధిదారుకు మొత్తం రూ.27 వేల అదనపు ఆదాయం లభించనుంది. ఇది ప్రభుత్వం అందించే రూ.5 లక్షలకు అదనం. జాబ్కార్డు ఉన్నవారే అర్హులు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉండాలి. కార్డు ఉన్నవారికే ఉపాధి వేతనం అందుతుంది. జాబ్ కార్డు లేని వారు వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రెటరీ వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేసి ప్రయోజనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇలా... జిల్లాలో మొదటి విడతలో 19 మండలాలు, 400 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 7,651 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 1,352 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 5,740 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. 559 ఇళ్ల పనులు ప్రారంభం కావాల్సి ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని హౌసింగ్ పీడీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జాబ్ కార్డు ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉంటే లబ్ధిదారుల ఇంటి పనులు నడిచే సమయంలో రోజుకు రూ.300 చొప్పున 90 రోజుల పని దినాలకు రూ.27 వేలు పొందవచ్చు. జాబ్ కార్డు లేనివారు వెంటనే పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకుంటే వెంటనే జాబ్ కార్డు ఇచ్చి లభ్ధిపొందేలాగా చూస్తాం. – శ్రీనివాస్రెడ్డి, పీడీ హౌసింగ్ -
నేడు బహిరంగ సభ
నిర్మల్టౌన్:అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్నారు. పూలే అంబేడ్కర్, కాన్షీరాం మార్గంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేస్తున్న చైతన్యంతో ఇటీవల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ముదిరాజ్, లీగల్సెల్ అడ్వైజర్ గొడుగు గంగాధర్, స్వామి పాల్గొన్నారు. బాల్య వివాహాలతో చదువుకు ఆటంకంమామడ: బాల్య వివాహాలతో బాలికల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని, సాధికారిత ను సాధించలేరని మహిళా శిశు సంక్షేమశాఖ అఽ దికారి వినూత్న అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పొన్కల్ గ్రామంలో మంగళవారం అవగాహన సమావే శం నిర్వహించారు. బాల్య వివాహాలు చేస్తే కలిగే నష్టాలపై కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మిరాజారెడ్డి, డీసీపీవో మురళి, సూపర్వైజర్ శ్యామల, రజని, సువర్ణ, మిషన్శక్తి కోఆర్డినేటర్ సవిత, జెండర్ స్పెషలిస్టు మౌనిక, ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యం,అంగన్వాడీ టీచర్లు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల భద్రతకే కమ్యూనిటీ కాంటాక్ట్భైంసారూరల్: ప్రజల భద్రతకే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. మండలంలోని చింతల్బోరి గ్రామంలో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. 80 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును సీజ్ చేసి జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, గంజాయి వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సుప్రియ, సర్పంచ్ పండిత్ పటేల్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. వేడి కాస్త తగ్గుతుంది.భైంసా: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు.. అమ్ముకునేందుకు అగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతకు అకాల కష్టం వచ్చింది. వడగండ్ల వానలు వణికిస్తున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. భైంసా డివిజన్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాల్లోని మొక్కజొన్న, వరి ధాన్యం కాపాడుకోవడానికి రైతులు పరుగులు తీశారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పంట కుప్పల చుట్టూ నీరు నిలిచి ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఏర్పడింది. కొందరు రైతులు కుటుంబ సభ్యులతో కలిసి టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు చీకట్లో పంటను రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు. తరలింపుల జాప్యంతో కష్టాలు.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లారీల కొరత, గోదాముల్లో హమాలీల సమస్య రైతులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. రోజుల తరబడి కల్లాల వద్దే ధాన్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంటను కాపాడుకోవడం, మరోవైపు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగడం రైతులకు నిత్యకృత్యంగా మారింది. సమీపిస్తున్న వర్షాకాలం.. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు తమ పంటను త్వరగా విక్రయించాలనే ఆందోళనలో ఉన్నారు. కానీ కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి కల్లాలకు తెచ్చిన తర్వాత కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. అప్పులు చేసి సాగు చేసిన రైతులు ఇప్పుడు పంట తడవకుండా కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రైతులు రోజూ ఎక్కడో ఒకచోట రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నా అధికారుల నుంచి గానీ, ప్రభుత్వ స్థాయిలో గానీ స్పష్టమైన స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని అంటున్నారు. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో వర్షం పడితే టార్పాలిన్లు కప్పడం, వర్షం తగ్గిన వెంటనే మళ్లీ పంటను ఆరబెట్టడం రైతులకు రోజువారీ పనిగా మారింది. అధికారులు లారీల కొరత తీర్చాలని, హమాలీల సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుంటాల మండలంలో.. కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పల వద్దకు వర్షపు నీరు చేరింది. రైతులు మంగళవారం ధాన్యం నుంచి వర్షపు నీరు తొలగించి ఆరబెట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే తరలించాలని రైతులు కోరుతున్నారు బాసర:బాసర జ్ఞానసరస్వతీ దేవి ఆలయానికి ప్రతిరోజూ వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. పండుగల సెలవులు, పర్వదినాలు, శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయం సమీపంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పురాతన వేదవతి శిలను కూడా సందర్శించుకుంటారు. ఈ శిలను మరో రాయితో తాకిస్తే అమ్మవారి సప్తస్వరాలు వినిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంతటి ప్రత్యేకత ఉన్నప్పటికీ, ఈ ప్రదేశం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. అభివృద్ధి కోసం భక్తుల డిమాండ్.. వేదవతి శిల పరిసరాలను పార్క్లా అభివృద్ధి చేయాలని భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. పచ్చదనంతో చెట్లు నాటడం, విశ్రాంతి వేదికలు, తాగునీరు సౌకర్యాలు, కూర్చునేందుకు బెంచీలు, లైటింగ్, రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి, చిన్న మొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేస్తే ఆలయానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇలా.. ప్రస్తుతం ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో వేదశిల పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చుట్టూ కంచె లేకపోవడంతో పశువులు, పందులు, శునకాలు శిల వరకూ వస్తున్నాయి. భక్తులు వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. ఈ నేపథ్యంలో శిలను సంరక్షించి, అభివృద్ధి చేయడంపై ఆలయ ఈవో ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. చుట్టూ కంచెలు వేసుకోవడంతో ఇరుకుగా మారిన భక్తులు వెళ్లే దారి.. -
రాళ్ల వాన బీభత్సం..
తానూరు: మండల కేంద్రమైన తానూరుతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం రాళ్లవాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో వాన కురిసింది. ఝరి(బి), బెంబర, బోరిగాం గ్రామాల్లో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. బోల్సా, ఉమ్రి(కే), బోరిగాం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో ఉమ్రి(కె), బోరిగాం, ఝరి(బి), వడ్ఝరి(బి) గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తానూరు గోదాంకు లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చిన మొక్కజొన్న పంట తడవకుండా చూసేందుకు హమాలీలు, రైతులు తిప్పలు పడ్డారు. -
ఖానాపూర్లో..
ఖానాపూర్: పట్టణంతో పాటు మండలంలో ని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురి సిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తరలింపులో జాప్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదు రు గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభా లు విరిగిపడ్డాయి. వృక్షాలు కూలిపోయాయి. పట్టణంలోని అంబేడ్కర్ నగర్ శివారులో కొత్త ప్లాట్ల కాలనీలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడింది. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఇగ్లూ థియేటర్ ముందు విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి, అక్కడే చెట్ల కొమ్మలు కూడా విరిగిపోయాయి. పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోని దుకాణాల బోర్డులు కొట్టుకుపోయా యి. కొన్ని ఇళ్లపై వాటర్ ట్యాంకులు, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసముంటున్న బోగు రవి ఇంటి పైకప్పు కొట్టుకుపోవడంతో రవితోపాటు అతని భార్య హేమలత, కుమారుడు నందు గాయపడ్డారు. -
కళ్లకు గంతలు కట్టుకుని గిరిజనుల నిరసన
పెంబి: మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రోడ్లు, కడెం, దోత్తి వాగుపై వంతెన నిర్మాణాలు చేపట్టాడంతోపాటు అటవీ ప్రాంతాల్లోని గిరిజన గూడేలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని గిరిజనులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. మంగళవారం మండల కేంద్రంలో కళ్లకు గంతలు కట్టుకుని ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట వినూత్నరీతిలో నిరసన తెలిపారు. గిరిజనులకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకులు మారడం లేదని పేర్కొన్నారు. ఇందులో సీపీఐ(ఐ) మండల నాయకులు బాబురావు, నిర్మల, శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
లక్ష్మణచాంద:వరి ధాన్యం తరలించడంలో జాప్యం చేస్తున్నారని సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదని, దీంతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులుకాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది రైతులు కలెక్టరేట్ ఎదుట గంటపాటు ఆందోళన చేశారు. కలెక్టర్ లారీలు పంపుతామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో లారీలు పంపుతామని హామీ ఇచ్చారు. వారం రోజులు రోజుకు మూడు లారీలు పంపుతామని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఇందులో సర్పంచ్ రాచకొండ సాగర్, రైతులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు అండగా నిలవాలి
నిర్మల్టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను త్వరగా పరిష్కరించి తాము ఉన్నామన్న భరోసా సామాన్యులకు పోలీసులు కల్పించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని కలిసి తమ అర్జీ సమర్పించారు. సమస్య చెప్పుకున్నారు. ఓపికగా విన్న ఎస్పీ వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించా రు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ స మస్యలకు సంబంధించి 56 దరఖాస్తులు వచ్చా యి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరి శీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూ చించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలికలెక్టరేట్ ప్రాంగణంలో జూన్ 02న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్, ప్రధాన వేదికను పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. వేడుకలకు ప్రొటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు సరిపడా సీటింగ్ వేయాలని, ఏర్పాట్లలో లోటు రాకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
రైతు వేదన.. అరణ్య రోదన!7ఆరుగాలం శ్రమించి వరి, మక్క సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. కాంటా వేసిన ధాన్యం మిల్లులకు తరలించడం లేదు. లారీలు రావడం లేదని కొందరు, గన్నీ సంచులు లేవని కొన్ని కేంద్రాల్లో ధాన్యం తూకం నిలిచిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ధాన్యం తూకం వేయాలని, తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని, కేంద్రాల్లో అదనపు వసూళ్లు ఆపాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతోంది. 200 ఎకరాల్లో మంటలులక్ష్మణచాంద: సోన్ మండల కేంద్రం శివారులో వరి కొయ్యలకు సోమవారం రాత్రి నిప్పు అంటుకుంది. 9:30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులు వీయడంతో సోన్–కూచన్పల్లి గ్రామాల మధ్య సుమారు 200 ఎకరాల్లోని పంటల వ్యర్థాలకు మంటలు విస్తరించాయి. మోటార్లు, విద్యుత్ తీగలు, బోరు బావులు కాలిపోయాయి. ఒకరిద్దరు రైతుల కోయని పంట కూడా ఆహుతైనట్లు తెలిసింది. -
ఆగని పెట్రో బాదుడు
నిర్మల్టౌన్: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత్వంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. చమురు సంస్థలు పది రోజుల వ్యవధిలో నాలుగుసార్లు ధరలు పెంచాయి. వరుస పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పది రోజుల్లో నాలుగు సార్లు..మే 15న లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3, మే 19న 90 పైసలు, మే 23న పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి. తాజాగా మే 25న డీజిల్పై రూ.2.61, డీజిల్పై రూ.2.71 వరకు పెంచాయి. మంత్తంగా పరది రోజుల్లో రూ.8 వరకు పెట్రో ధరలు పెరిగాయి. జిల్లాలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు రూ.117 ఉండగా, డీజిల్ ధర రూ.103కు చేరింది. నిత్యావసరాలపై ప్రభావం..అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ధరలు పెట్రో ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ ప్రభావం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోటళ్లలో అల్పాహారం, భోజనాల ధరలు కూడా భారంగా మారాయి. -
బిహారీ.. హమాలీ
లోకేశ్వరం: గ్రామాల్లో కూలీలు తగ్గిపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర, బిహార్ కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. బీహార్ కూలీలు మొన్నటి వరకు వరి నాట్లు వేసే పనులు చేశారు. ఇప్పుడు వరికోతల సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బిహార్ హమాలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వేసవిలో సొంత రాష్ట్రంలో పనులు లేక కూలీలు జిల్లాకు వస్తున్నారు. ఆ సమయంలో మన ప్రాంతంలో ధాన్యం చేతికి రావడంతో పని దొరుకుతోంది. ఏటా సీజన్లో 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్కోకొనుగోలు కేంద్రంలో దాదాపు 10–20 మంది హమాలీలు పని చేస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో 225 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం బస్తాలు నింపి తూకం చేయడంతోపాటు లారీల్లో నింపేందుకు స్థానికంగా హమాలీలు దొరక లేదు. దీంతో చేసేదేమీ లేక కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బిహార్తోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, అమరావతి ప్రాంతాల నుంచి హమాలీలను ఇక్కడికి రప్పిస్తున్నారు. రూ.32 వేల ఆదాయం...మహారాష్ట్ర, బిహార్ నుంచి వచ్చే కూలీలు కొనుగోలు కేంద్రాల వద్దే కుటుంబాలతో ఉంటారు. ఒక్క ముధోల్ నియోజకవర్గంలోనే ఇరత రాష్ట్రాల హమాలీ బృందాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10–20 మంది వరకు పని చేస్తున్నారు. ధాన్యాన్ని బట్టి వీరి సంఖ్య పెరగొచ్చు. ధాన్యాన్ని సంచుల్లో నింపడం, తూకం చేయడం, తర్వాత లారీల్లోకి ఎక్కించడం వంటి పనులకు క్వింటాల్కు రూ.42 వరకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని బట్టి ఒక్కొక్కరికీ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఇలా సీజన్కు రూ.32 వేల వరకు మిగులుతుంది. -
00000000000000
వరి ధాన్యం తరలింపు పెంబి: మండలంలోని మందపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో తూకం నిలిచిపోయింది. దీనిపై కొను‘గోడు’ పట్టదా.. శీర్షికన ‘సాక్షి’లో కథ నం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధి కారులు సోమవారం నాలుగు లారీలు, డీసీ ఎంలో దాదాపుగా మూడు వేలకుపైగా ధా న్యం బస్తాలు తరలించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సాక్షికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. బక్రీద్కు ఏర్పాట్లు నిర్మల్టౌన్: బక్రీద్కు మున్సిపల్ ఆధ్వర్యంలో ముస్లింల ప్రార్థనల కోసం ఈద్గా వద్ద ఏ ర్పాట్లు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి తెలిపారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను కౌన్సిలర్లతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈద్గా వద్ద పరిశుభ్రత, నీటి సరఫరా, వీధి దీపాలు, శాని టేష్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వేసవి ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 16 చోట్ల తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పండ గ వేళ ముస్లింలకు ఇబ్బందులు లేకుండా చే ర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ఇర్ఫాన్, జాకీ, ఫెరోజ్, రఫీ, ముజాహిద్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ అస్లాం, డీఈ హరిభువన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై చర్య తీసుకోవాలినిర్మల్రూరల్: భైంసా పట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ డిమాండ్ చేశారు. సంఘం నాయకులతో కలిసి సోమవారం డీఈవో భోజనకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడినవారిని శిక్షించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు ఉన్నారు. నాణ్యమైన పాలు అందించడమే లక్ష్యం మామడ: నాణ్యమైన పాలు, పెరుగు విని యోగదారులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు అన్నారు. మండలంలో ని పొన్కల్ గ్రామంలో డెయిరీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడిపరిశ్రమను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డెయిరీ జగిత్యాల్ జిల్లా మేనేజర్ లక్ష్మీపతి, సేల్స్ ఏజీఎం విష్ణు, సూపర్వైజర్ రమేశ్, చందు, స్థానిక నాయకులు రాజారెడ్డి, వంశీ, వినియోగదారులు పాల్గొన్నారు. 29 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్–2026 అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 29 నుంచి జూన్ 1 వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ప్రిన్సిపాల్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకు సాధించిన విద్యార్థులు ఈనెల 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు నిర్ణయించిన తేదీ, సమయానికి గంట ముందుగానే నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరుకావాలని సూచించారు. తమ వెంట పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు పదేళ్ల నివాస ధ్రువపత్రం తెచ్చుకోవాలని పే ర్కొన్నారు. మిగతా వివరాలకు 90102 22174, 9948156588 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
● 000 ● 000 ● 000
ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు సోమవారం ఆందోళన చేశా రు. ధాన్యం తూకం వేసేందుకు రూ.50 హమాలీ చార్జీ వసూలు చేస్తున్నారని, లారీలలో ధాన్యం బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకు రూ.5 డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలిపారు. 20 రోజులుగా కేంద్రం నుంచి ఒక్క ధాన్యం బస్తా కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాళ్లు మొక్కుతాం.. మా ధాన్యం సమస్యను వెంటనే పరిష్కరించండి’ అంటూ అక్కడికి వచ్చిన అధికారులను వేడుకున్నారు. డీఆర్డీవో విజయలక్ష్మి ఫోన్లో రైతులతో మాట్లాడారు. ఐకేపీ సీసీని మార్చడంతోపాటు ఆర్ఐ నాగేష్ ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సుర్జాపూర్లో అదనపు వసూళ్లు.. -
నిర్మల్ జిల్లా ఆదర్శం
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళి క’’ మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అభివృద్ధి కా ర్యక్రమాలకు సీఎం సోమవారం వర్చువల్ వి ధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో నిర్మల్ జిల్లా మహిళలను అభినందించారు. బ్యాంకు లింకేజీ, రుణ వసూ ళ్ల సాధనలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంద ని సీఎం ప్రశంసించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణితో మాట్లాడి, జిల్లాలో మహిళా సంఘాల పనితీరును అభినందించారు. మళ్లీ జిల్లాకు వచ్చినప్పుడు నేరుగా కలుస్తానని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామ ని పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో ఉక్కపోత
జిల్లాలో వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 46.5 డిగ్రీల సెల్సియస్కుపైగా నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడితో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో పిల్లలు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. సరైన గాలి వ్యవస్థ లేకపోవడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. వార్డుల్లో గాలి ఆడక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కొందరు ఫ్యాన్ గాలి సరిపోక సొంతంగా ఇళ్ల నుంచి కూలర్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న కూలర్లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. చల్లని తాగునీరు అందించే వాటర్ కూలర్ పనిచేయడం లేదు. దీంతో చల్లటి నీటిని కూడా బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ అలంకార ప్రాయంగా ఉన్న ఆస్పత్రి కూలర్ మాతాశిశు ఆస్పత్రిలో ఇంటి నుంచి తెచ్చుకున్న కూలర్, వాటర్ క్యాన్పసిపాపకు గాలి విసురుతున్న అమ్మమ్మ -
కొనుగోడు పట్టదా..!
పెంబి: మండలంలోని మందపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రానికి రైతులు భారీగా ధాన్యం తెచ్చారు. ఇప్పటి వరకు 5 వేల బస్తాలు తూకం వేశారు. మిల్లులకు తరలించారు. మరో 4 వేల బస్తాలు తూకం వేశారు. అయితే లారీలు రాక బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి. కేంద్రంలో మరో 25 వేల బస్తాల ధాన్యం ఉంది. కానీ తూకం వేసిన బస్తాలు తరలించిన తర్వాతనే మిగతా ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే కమ్ముకుంటున్న మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. భైంసా: జిల్లాలో రైతుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక కేంద్రాల్లో ధాన్యం కుప్పలు రోజుల తరబడి నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పంట తడిసి నష్టపోతామని భయపడుతున్నారు. దీంతో రాత్రింబవళ్లు కేంద్రాల వద్దే కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పాలకవర్గాల నిర్లక్ష్యం.. జిల్లాలో ఐదు మార్కెట్ కమిటీలు, పలు పీఏసీఎస్ సొసైటీలు ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. వేలాది క్వింటాళ్ల మొక్కజొన్న, వరి ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయింది. సకాలంలో రవాణా సదుపాయం లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. లారీ యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండగా, హమాలీ చార్జీలు కూడా పెరిగాయి. దీంతో మద్దతు ధర వచ్చినా రైతు చేతికి మిగిలేది చాలా తక్కువగా మారింది. లారీల కొరత..రైతులను ఈసారి లారీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ధాన్యం తరలించడానికి లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో సంచికి రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా ఇస్తేనే లారీలు వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో క్వింటాల్కు రూ.80 నుంచి రూ.100 వరకు రవాణా ఖర్చు పెరిగింది. ఇప్పటికే సాగు ఖర్చులు, ఎరువులు, కూలీల భారంతో నష్టాల్లో ఉన్న రైతులకు ఈ అదనపు ఖర్చులు మరింత భారంగా మారాయి. గన్నీ సంచుల కొరత.. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉంది. సరిపడా సంచులు లభ్యం కాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల రైతులే స్వయంగా డబ్బులు పెట్టి సంచులు కొని ధాన్యాన్ని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
భైంసాటౌన్: బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా పనిచేయాలని ఆ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ క్రిషాంక్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలో మీట్అండ్గ్రీట్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముధోల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీ నర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విస్మరిస్తోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. ఇందుకనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికార కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉపాధిపై మరింత నిఘా
లక్ష్మణచాంద: వలసలను తగ్గించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పేద కూలీలు లబ్ధి పొందుతున్నా రు. అయితే ఇదే పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. తాజాగా మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పనులకు హాజరు అయ్యే కూలీలకు ప్రస్తుతం ముఖ గుర్తింపు హాజరు ను అమలు చేస్తుంది. అలాగే ఉదయం, పని ముగించుకుని ఇంటికి వచ్చే సమయాల్లో తప్పనిసరిగా ఫొటో ను తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. దీనికి తోడు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామాల్లో నిఘా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఇలా..జిల్లాలో 19 మండలాలు 400 గ్రామ పంచాయతీల పరిధిలో 1,74,282 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 94,789 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం కూలీలు 3,20,936 మంది ఉండగా, యాక్టివ్ కూలీలు 1,54,931 ఉన్నారు. ఏటా తనిఖీలు..ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ఏటా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ పేరిట ఆయా మండలాల పరిధిలో సభలు నిర్వహించి అక్రమాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయినా అవినీతిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు సక్రమంగా పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామ సభల ద్వారా ఏర్పాటు...గ్రామ నిఘా కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సగం సభ్యులు మహిళలే ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ఉపాధ్యాయుడు, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘం సభ్యులు, సోషల్ ఆడిట్ వ్యక్తులు, యువజన సంఘం సభ్యులు ఉండాలి. గ్రామసభ ద్వారా కనీసం ఆరు నెలల కాలానికి కమిటీని ఎన్నుకుంటారు. కమిటీ విధులు.. ఎన్నికై న కమిటీ ఉపాధి హామీ పనులు జరిగిన వారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు జరిగిన తీరు, నాణ్యతను పరిశీలిస్తారు. కూలీల హాజరు, వేతనాల చెల్లింపులు సక్రమంగా జరిగాయా లేదా నమోదు చేయాలి. కమిటీ పర్యటించి పరిశీలించిన అంశాలను గ్రామస్థాయి సామాజిక తనిఖీ జరిగే సమయంలో అందచేయాలి. వారు తయారు చేసిన నివేదికను ప్రజాపత్రాలు పరిగణించి గ్రామ పంచాయతీలలో భద్ర పరచాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ప్రభుత్వం సూచించిన విధంగా జిల్లాలోని 400 గ్రామాల్లో ప్రతీ గ్రామంలో ఐదుగురు సభ్యులతో నిఘా కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మయ్య, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్జిల్లా సమాచారం... -
నిర్మల్ వైద్యులకు ఎక్స్లెన్స్ అవార్డులు
నిర్మల్టౌన్: అరుదైన వైద్య సేవలతో ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన వైద్య దంపతులు నాళం స్వప్న–శశికాంత్ హెల్త్ కేర్ ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ చేతులమీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ స్వప్న చిన్నపిల్లల వైద్యురాలిగా, డాక్టర్ శశికాంత్ జనరల్ సర్జన్గా సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే చేసే శస్త్ర చికిత్సలను నిర్మల్లోనే చేయడం, పేషెంట్లకు దూర భారం, అలాగే వ్యయ భారాన్ని తగ్గించడంతో వీరు పురస్కారాలకు ఎంపికయ్యారు. -
అడెల్లి ఆలయంలో భక్తుల రద్దీ
సారంగపూర్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకో వడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలు మూలలతోపాటు పొరుగు జిల్లాలైన నిజా మాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరా బాద్, మెదక్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే తాగునీరు దొరకక కొంత ఇబ్బంది పడ్డారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అపూర్వ సమ్మేళనం
కుభీర్: కుభీర్ ఉన్నత పాఠశాలలో 1995–96 లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. వివిధ వృత్తుల్లో స్థిర పడిన పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హా జరయ్యారు. చిన్ననాటి స్నేహితులను పలకరించారు. పరిచయం చేసుకున్నారు. తమకు వి ద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎర్రన్న, గంగాధర్, వెంకటేశ్వర్, నాగమణి, లింగన్న ను సన్మానించారు. పాదాభివందనం చేసి ఆ శీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం వర కు సరదాగా ఆట పాటలతో గడిపారు. అప్ప టి విధ్యార్థులలో ఎల్.అరవింద్(టీచర్), బషీ ర్(మాజీ ఎంపీటీసీ), శ్రీకాంత్(ప్రముఖ వ్యా పారి), దశరథ్, లింగన్న, అప్సర్, అహూఫ్ తదితరులతోపాటు 90 మంది పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్టౌన్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారు. జిల్లాల వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చోట స్థానిక హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 25 నుంచి మహిళా వారోత్సవాలు..‘‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలివీసీ అనంతరం కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా కొనుగోళ్లు పూర్తిచేసి, రోజువారీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహిళా వారోత్సవాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కార్యక్రమాలను మహిళలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్ఫెడ్ మహేశ్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, హార్టికల్చ ర్ అధికారి రమణ పాల్గొన్నారు. వర్షాలకు ముందే కొనుగోళ్లు పూర్తి చేయాలినిర్మల్టౌన్: జిల్లాలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు వర్షాలకు ముందే పూర్తి చేయాలని, ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల పురోగతిని తెలుసుకున్నారు. లారీలు అందుబాటులో ఉంచడంతోపాటు, హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీల లారీలతోపాటు ఇతర రవాణా సౌకర్యాలను వినియోగించి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం నిల్వ కోసం ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, రైతు వేదికలు, అవసరమైన చోట్ల ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న సుదర్శన్రెడ్డికి కలెక్టర్ భవేశ్ మిశ్రా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అదనపు ఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
నిర్మల్
7మీసేవ కేంద్రాలపై నజర్ ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన మీసేవ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. రాత్రి వరకు వేడి సెగలు కొనసాగుతాయి. బాసరలో భక్తుల రద్దీ బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.8లోu -
చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చూస్తాం
లక్ష్మణచాంద: రైతులు ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. వడ్యాల్, పీచర, పార్పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట ఉత్పత్తులను పరిశీలించి,అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా జరిగేలా చూడాలని, సేకరించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు త్వరగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఆయన వెంట సురేందర్రెడ్డి, వడ్యాల్ సర్పంచ్ నరేశ్, నాయకులు నరేశ్రెడ్డి, మేకల రాజేందర్, సురేశ్రెడ్డి, సుదర్శన్, కేశం రమేశ్, గంగారం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నిరాశ్రయులకు నిర్మల్ పోలీసుల అండ
నిర్మల్టౌన్: నాలుగైదు రోజులుగా తీవ్ర ఎండల కారణంగా జిల్లా కేంద్రంలోని రోడ్లపై, బస్టాండ్లో నివసిస్తున్న నిరాశ్రయ యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎస్పీ జానకీషర్మి ల పట్టణంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా బస్టాండ్లు, ప్రజా ప్రదేశాల్లో ఆశ్రయం లేకుండా జీవిస్తున్న భిక్షాటనదారులను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొంతమంది నిరాశ్రయులను ఓల్డ్ ఏజ్ హో మ్లకు తరలించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సై జ్యోతిమణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల మనసులో నర్సన్నబాపు
నిర్మల్: ‘ఎంతోమంది నేతలను చూసిన. కానీ.. ప్రజల చేత బాపు అని పిలిపించుకున్న నర్సన్నబాపు వంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు..’ అని పొద్దుటూరి నర్సారెడ్డికి సంతాపం తెలుపుతున్న సందర్భంలో సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. రాష్ట్ర సరిహద్దు మండలంలోని మారుమూల గ్రామం మలక్చించోలి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఎదిగిన ప్రజాప్రతినిధి. నిర్మల్ ప్రాంతంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, కాలేజీలు కట్టిన అభివృద్ధి ప్రదాతగా ఇప్పటికీ ప్రజల్లో నిలిచి ఉన్న రాజకీయ దిగ్గజం. అలాంటి నర్సన్నబాపు ఇన్నేళ్లకు జిల్లాకేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు నోచుకుంటున్నారు. మారుమూల నుంచి..సారంగపూర్ మండలం మలక్చించోలికి చెందిన నర్సారెడ్డి(నర్సన్నబాపు) కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు, హోదాల్లో పనిచేశారు. 1971 నుంచి 1972 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. 1978 ఎ న్నికల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటిపారుదల శా ఖ, రెవెన్యూశాఖ, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రిగా పనిచేశారు. వరుసగా 1967 నుంచి 1982వరకు మూడు పర్యాయాలు గెలిచి ‘హ్యాట్రిక్ ఎమ్మెల్యే’గా పనిచేశారు. 1991 లో ఆదిలాబాద్ ఎంపీగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. ముందుచూపున్న అభివృద్ధి ప్రదాత..జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు స్వర్ణ, దోనిగాం ప్రాజెక్టులను నిర్మింపజేసిన ఘనత నర్సన్నబాపుదే. నిర్మల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నటరాజ్ స్పిన్నింగ్ మిల్, ఉట్నూర్లో ఐటీడీఏ ఏర్పాటు నర్సన్నబాపు హయాంలో తీసుకువచ్చినవే. ఈ ఏడాది జనవరి 16న నిర్మల్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి స్వర్ణ ప్రాజెక్టుకు నర్సన్నబాపు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ వారసత్వం లేకుండా..ప్రస్తుత రాజకీయాల్లో సర్పంచ్, కౌన్సిలర్లే తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. కానీ నర్సారెడ్డి కుటుంబం నుంచి రాజకీయ వారసులు లేకపోవడం గమనార్హం. ఆయన ముగ్గురు కుమారులు, కుమార్తె రాజకీయాలవైపు రాలేదు. నర్సారెడ్డి తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా, నిబంధనల కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ, విజ్ఞాపనల కమిటీ, సంప్రదింపుల కమిటీల సభ్యుడిగానూ పనిచేశారు. వయసు పైబడటంతో 2024 జనవరి 29న నర్సన్నబాపు కన్నుమూశారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన నర్సన్నబాపు విగ్రహాన్ని ఈ నెల 24న ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించనున్నారు. -
ప్రగతి ప్రణాళికతో అభివృద్ధి
నిర్మల్టౌన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామీణ, నియోజకవర్గ స్థాయిలలో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, విద్య, వైద్యం, అరైవ్ అలైవ్’, రైతు వారోత్సవాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహర్దశ
మూడు చెరువులకు చెరువుల వారీగా నిధులు..నిర్మల్: ప్రాచీనకాలం నుంచి నీళ్లున్న చోటనే నాగరికతలు వెల్లివిరిశాయి. నాటికాలం నుంచే నీటి గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. కానీ.. నిర్మల్లో మాత్రం గొప్పగా చెప్పుకునే గొలుసుకట్టు చెరువులతోపాటు జిల్లాలోని చాలా జలాశయాలు కబ్జాలపాలై, డ్రైనేజీ నీళ్లతో నిండిపోయి మురికికూపాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కొన్నింటినైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో మూడు చెరువులను ఎంపిక చేశారు. మున్సిపాలిటీకో చెరువు..జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో చెరువు చొప్పున పునరుద్ధరణకు నోచుకోనున్నాయి. నిర్మల్లో బస్టాండ్ పక్కనగల ధర్మసాగర్, భైంసాలోని సిద్ధార్థనగర్లోని మహదేవ్పూర్ చెరువు, ఖానాపూర్లోని శాంతినగర్లోని బొడ్డోనికుంట చెరువులను అభివృద్ధి పనులకు ఎంపిక చేశారు. ధర్మసాగర్ చెరువులో కట్ట బలోపేతంతోపాటు ఎప్పటి నుంచో స్థానికులు డిమాండ్ చేస్తున్న చెరువులో కలుస్తున్న డ్రైనేజీని మళ్లించనున్నారు. గతంలో వేసిన వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేసి, రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఖానాపూర్లోని బొడ్డోనికుంట, భైంసా మహదేవ్పూర్ చెరువుల్లో ప్రధానంగా కట్ట బలోపేతం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మిగిలిన వాటినీ కాపాడాలని..జిల్లాలో చాలా చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని గొలుసుకట్టు చెరువులూ కబ్జాకు గురయ్యాయి. చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణకు కృషిచేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నిర్మల్లో నీటికష్టం అనేది తెలియదంటే కారణం ఈ గొలుసుకట్టు చెరువులే. అలాంటి వాటిని కాపాడాలని స్థానికులూ డిమాండ్ చేస్తున్నారు. ఎంపికై న చెరువుల్లో పనులు.. జిల్లాలో ఎంపికై న మూడు చెరువుల్లో ప్రధానంగా కట్ట బలోపేతం పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 50 చెరువులకు కలిపి ఒకే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. – అరుణ్, పబ్లిక్హెల్త్ డీఈఈభైంసా – మహదేవ్పూర్ చెరువు రూ.2.14 కోట్లు ఖానాపూర్ – బొడ్డోనికుంట చెరువు రూ.1.21 కోట్లుధర్మసాగర్.. దశమారేనా!?నిర్మల్ పట్టణం నడిబొడ్డున అందరికీ అందుబాటులో, బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువు ఇది. ఎప్పుడో మినీ ట్యాంక్బండ్గా ప్రకటించారు. అప్పట్లోనే రూ.కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టారు. కానీ ఏం లాభం..! నిత్యం డ్రైనేజీ నీళ్లతో, వ్యర్థ పదార్థాలతో ఆ చెరువును నింపేస్తున్నారు. పరిసరాలూ కంపుకొడుతున్నాయి. గతంలోనూ పాలకులు ఈ చెరువును సుందరీకరిస్తామంటూ పనులు చేపట్టినా మధ్యలోనే వదిలేశారు. తాజాగా సగం కేంద్రం, సగం రాష్ట్రం నిధులతో చేపట్టే చెరువుల అభివృద్ధిలో ధర్మసాగర్ ఎంపికైంది. ఇప్పటికై నా చెరువు దశ మారాలని నిర్మల్వాసులు కోరుతున్నారు.చెరిసగం నిధులతో..చెరువుల పునరుద్ధరణకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం, రాష్ట్రం 50–50 చొప్పున నిధులు కేటాయిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చెరువులకు కలిపి ఒకే కాంట్రాక్టర్కు పనులను అప్పగించారు. జిల్లాలోని మూడు చెరువుల్లోనూ ఒకే సంస్థ పనులను చేపట్టనుంది. ఈ పనుల్లో ప్రధానంగా ఆయా చెరువుల కట్టలను బలోపేతం చేయనున్నారు. పర్యాటకపరంగా ఆకట్టుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి నిర్మల్లో ధర్మసాగర్ చెరువు వద్ద ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. -
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం
ఖానాపూర్: మండలంలోని ఇక్బాల్పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను తరలించడంలో జాప్యం జరుగుతోంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. గ్రామంలోని జాతీయ రహదారి ఎన్హెచ్–61పై సుమారు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు లారీలను ఏర్పాటు చేసి కొనుగో లు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాలను తరలించాల ని రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు ఉన్నారని, వాతావరణ మార్పుల నేపథ్యంలో రాత్రి వేళ వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం తరలింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్, రమేశ్, శివలాల్, సుమన్ పాల్గొన్నారు. -
సడలింపు సరే...నోటిఫికేషన్లు ఏవీ...?
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొంత ఆశ కలిగించినప్పటికీ, ‘‘నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి?’’ అనే ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్–ఏ) జారీ చేసిన జీవో 86 ప్రకారం, ఈ వయోపరిమితి సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. కరోనా సంక్షోభం కారణంగా వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది కొత్త అవకాశం కల్పించింది. అయితే యూని ఫాం సర్వీసులు (పోలీసు, ఎకై ్సజ్, ఫైర్, అటవీ, జైళ్ల శాఖలు) వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు. నోటిఫికేషన్లు లేక నిరాశ..వయోపరిమితి పెంపు సానుకూలం కానీ, ఖాళీల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం నిరుద్యోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అనేక శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని యువత వాపోతోంది.‘‘సడలింపులు ఇస్తున్నారు కానీ ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు. చదువు పూర్తి చేసి ఏళ్ల తరబడి కోచింగ్లు చేస్తూ వయసు పెరుగుతోంది. కుటుంబ భారం ఒకవైపు, నిరుద్యోగం మరోవైపు వెంటాడుతున్నాయి’’ అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ యువత పరిస్థితి దయనీయం..జిల్లా కేంద్రాల్లో హాస్టళ్లు, గదులు అద్దెకు తీసుకుని కోచింగ్ చేస్తున్న గ్రామీణ యువకుల పరిస్థితి మ రింత దారుణంగా ఉంది. తల్లిదండ్రులపై ఆర్థిక భా రం పెరుగుతుండగా ఉద్యోగ భరోసా కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్సీ వంటి కొన్ని నోటిఫికేషన్లు విడుదలైనా కోర్టు వివాదాలు, పరీక్షల వాయిదాలు, ఫలితాల ఆలస్యాలు అభ్యర్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్కు డిమాండ్..నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ‘‘ప్రతి ఏడాది వయోపరిమితి పెంచడం కాకుండా, ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే అంశాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో నియామకాలు చేపడతామని సంకేతాలు ఇస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వయోపరిమితి సడలింపు సానుకూలం కానీ, వాస్తవ ఉద్యోగ అవకాశాలే యువతకు ప్రధానం అని అందరూ పేర్కొంటున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు నిర్ణయం హర్షదాయకం. వెంటనే ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలతో కూడిన వివిధ నోటిఫికేషన్లను విడుదల చేయాలి. ప్రస్తు తం నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకోవాలని సంకల్పంతో యువత ఎదురుచూస్తున్న దశలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాలి – దాసరి గణేశ్, కౌట్ల–బి, సారంగపూర్ మండలంజాబ్ క్యాలెండర్ ప్రకటించాలి... రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాలు భర్తీ చే స్తామని అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర తాత్సారం చేస్తోంది. ఇప్పటికై నా జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించి ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలి. లేనిపక్షంలో నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. – కుమ్మరి వెంకటేశ్, బీజేవైఎం రాష్ట్రకార్యవర్గ సభ్యుడు -
విద్యతోనే అభివృద్ధి
భైంసాటౌన్: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పి రామారావు పటేల్ అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించి జ్ఞాపిక అందించారు. విద్యార్థులు బాగా చదవి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, రాజేశ్బాబు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరి శీలించారు. వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో రాధా రాథోడ్, ఎంపీవో రత్నాకర్రావు, సి బ్బందితో సమావేశమై కార్యాలయ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీసీ వికాస్, సిబ్బంది స్వామి, సాగర్, లతీఫ్, రమేశ్ తదితరులున్నారు. -
నిర్మల్
7జీవాలకు అందని వైద్యం మూగజీవాల ప్రాణాలు కాపాడాల్సిన బాసర పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇన్చార్జి వైద్యుడు, అరకొర సిబ్బందితో పశువులకు వైద్యం అందని దుస్థితి ఉంది.ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. ఉక్కపోత ఎక్కువవుతుంది.బార్న్స్వాలో గూడు చూడు.. కడెం ప్రాజెక్ట్ వద్ద గల మిషన్ భగీరథ ఇంటెక్వెల్ చుట్టూ బార్న్స్వాలో పక్షిగూళ్లు కనువిందు చేస్తున్నాయి. ఒకే ప్రదేశంలో అనేక గూళ్లను నిర్మించుకోవడం విశేషం. -
భవిష్యత్కు అనుగుణంగా ‘బాసర’
భైంసా: బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రం త్వరలోనే సరి కొత్తగా రూపాంతరం చెందబోతోంది. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.225 కోట్లతో చేపట్టబోయే పనులకు సంబంధించి యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 10న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే వందేళ్ల వరకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గర్భాలయం, అనివెట్టి మండపం, కాళికామాత ఆలయాల ఆధునికీకరణ తో పాటు ఆలయానికి తూర్పున వైభవోపేతమైన తోరణాల నిర్మాణం, నాలుగు వైపులా విశాలమైన రహదారుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. భక్తుల సనతి కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించనున్నట్లు హనుమంతరావు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా.. బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని భవి ష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక మాస్టర్ ప్లాన్పై అధికారుల పర్యటన ముగిసింది. పెరుగుతున్న భ క్తుల రద్దీ, విద్యార్థుల అవసరాలు, భవిష్యత్లో బా సర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూ.225 కోట్ల అంచనాతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆలయ పరిస ర ప్రాంతాలను ఆధునికీకరించడం, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం వసతిగృహాలు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి వసతి, స్నాన ఘాట్లు, రహదారుల విస్తరణ, హరిత వనాల అభివృద్ధి తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా..అక్షరాభ్యాసం, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, విద్యార్థుల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆడిటోరియం ఉపయోగపడేలా రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. దీంతో బాసరను కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా విద్యా, సాంస్కృతిక కేంద్రంగానూ అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచన స్పష్టమవుతోంది. పర్యటన సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. స్థానికుల అభిప్రాయాలు పరిగణనలోకి.. మాస్టర్ ప్లాన్ అమలులో స్థానిక ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామని అధికా రులు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బాసర రూపురేఖలు మారనున్న నేపథ్యంలో స్థానికులు, భక్తులు, విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. బాసర అభివృద్ధితో ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి కూడా కొత్త శోభ రానుందని అంతా భావిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆడిటోరియం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏప్రిల్ 6న బాసరకు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం ప్రత్యేక చొరవతో విద్యార్థుల కోసం ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించనున్నట్లు దేవాదా య శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించా రు. అక్కడ విద్యా సంబంధిత అంశాలపై ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ప్రాజెక్ట్ విశేషాలను మ్యాపుల ద్వారా వివరించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
పామాయిల్ చెట్లు దగ్ధం
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల పామాయిల్ చెట్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి. వివరాలు.. గ్రామానికి చెందిన కొంపెల్లి రవీందర్ రెండెకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాడు. తోట పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ వద్ద బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో తోటకు నిప్పంటుకుని 25చెట్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మరో రైతు కడారి సంజీవ్ తోటలోని ఐదు పామాయిల్ చెట్లు కాలిపోయాయి. గురువారం ఉద్యాన అధికారి స్పందన, ఆర్ఐ శారద కాలిన చెట్లను పరిశీలించారు. పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి
మామడ: వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. గు రువారం మామడ కేజీబీవీలో కొనసాగుతున్న వేస వి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్యాంపులో వి ద్యార్థినులకు నేర్పిస్తున్న నైపుణ్యాలను పరిశీలించా రు. సమ్మర్క్యాంపుల ద్వారా డ్యాన్స్, పాటలు, యో గా, పెయింటింగ్, ఆటలు, కంప్యూటర్,, కళలు తది తర అంశాల్లో ఇస్తున్న శిక్షణను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించా రు. శిక్షణ శిబిరాల్లో నూతన విషయాలు నేర్చుకుని భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు అందిస్తున్న సదుపాయాల గురించి వారినే అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఇ బ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు కలెక్టర్ స్వయంగా బోధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డీఈవో భోజన్న, తహసీల్దార్ శ్రీనివాస్రావు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘రైతులు ఆందోళన చెందొద్దు’
సారంగపూర్: రైతులు ఆందోళన చెందొద్దని, పండించిన చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని జామ్, కౌట్ల(బి), సారంగపూర్ గ్రామాల్లోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఐకేరెడ్డికి వివరించారు. ఒక్కో గన్నీబ్యాగు రూ.30, లారీకి ఒక బస్తాకు రూ.50చొప్పున చెల్లించి విక్రయించుకునే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. హమాలీలు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఐకేరెడ్డి అక్కడే ఉన్న హమాలీలను ఇదేం తీరని ప్రశ్నించారు. డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండడం విచారకరమని, ఈ విషయం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం తాలూకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, కౌట్ల(బి) పీఏసీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్రెడ్డి, నాయకులు ధర్మాజి రాజేందర్, అట్ల మహిపాల్రెడ్డి, మాధవరావు, సాయినాఽథ్రెడ్డి తదితరులున్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలి
భైంసాటౌన్: దేశ సమగ్రత కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. పట్టణంలోని హరియాలి ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్పై గురువా రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టి న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ ఓటు ను పరిశీలించుకోవాలని సూచించారు. బోగస్ ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులు పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర (ఎస్ఐఆర్) ఇన్చార్జి జయశ్రీ 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ఉద్దేశాలను వివరించారు. కార్యక్రమంలో సాదుల కృష్ణదాస్, రావుల రాంనాథ్, సరికొండ దామోదర్ తదితరులున్నారు. -
సమస్యల పరిష్కారంపైనే దృష్టి
భైంసాటౌన్: పట్టణంలో విడతలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని ము న్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి పేర్కొన్నా రు. పట్టణంలోని సాయినగర్ కాలనీలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ముందుగా అతడిని ఘనంగా స న్మానించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలు తె లుసుకున్నారు. కాలనీలో డ్రెయినేజీలు, సీసీ రో డ్లు నిర్మించాలని చైర్మన్ను కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్ చెర్ల సుభాష్, కాలనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక డంపులు స్వాధీనం
నర్సాపూర్ (జి): మండలంలోని అర్లి(కే) సు ద్దవాగు నుంచి రాత్రి వేళ జోరుగా ఇసుక అ క్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక శ్మశాన వా టిక పక్కన ఇసుకను డంపు చేసి రాత్రి వేళ ఇ తర ప్రాంతాలకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో బుధవారం రాత్రి డీటీ ఏంఎ వాహీద్, వీఆర్ఏ రఘు, పోలీస్ సి బ్బంది వెళ్లి ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను పట్టుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మైనింగ్ ఏఈ కాంబ్లె ఆనంద్, ఆర్ఐ సుమలత, జీపీవో సుమలత ఇసుక డంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
తగ్గుతున్న కూలీల సంఖ్య
కూలీలు పని చేసే చోట నీడ కోసం టెంట్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం ఎక్కడా ఆ పరిస్థి తి కనిపించడంలేదు. పని ప్రదేశంలో చెట్టు ఉంటేనే వారికి నీడ. లేదంటే మండుటెండలో మగ్గిపోవాల్సిందే. చాలాచోట్ల ఇంటి నుంచి దుప్పట్లు తీసుకువెళ్లి పని చేసే చోట చెట్ల కొమ్మలకు కట్టి నీడ ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పట్లో పంచాయతీల వారీగా అన్ని గ్రూపులకు అధికారులు టెంట్లు, టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి గ్రూపులు ఎక్కువ కావడంతో వారికి టెంట్లు లేక విరామ సమయంలో చెట్ల కింద సేద తీరుతున్నారు. పనిప్రదేశంలో ప్రథమ చకిత్స కిట్లు కూడా అందుబాటులో లేవని కూలీలు వాపోతున్నారు. -
ఉపాధిహామీ.. వసతుల లేమి?
తానూరు: మండుటెండల్లో ఉపాధిహామీ కూలీలు విలవిల్లాడుతున్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిహామీ కూలీలకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు పనులకు వెళ్లకపోతే పూట గడవని దుస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు పనులకు వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, పని ప్రదేశంలో వారికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. తాగడానికి గుక్కెడు నీరు, సేద తీరడానికి నిలువ నీడ లేక ఎండలకు మలమల మాడిపోతున్నారు. గతంలో వడదెబ్బతో పలువురు మృతిఎండకు తట్టుకోలేక గతంలో పలువురు ఉపాధిహామీ కూలీలు మృతి చెందారు. తానూరు మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన సంతురాం, తానూరుకు చెందిన సరస్వతి వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. పని అడిగిన వారంలోపు జాబ్కార్డులు జారీ చేసి పని కల్పిస్తున్నామంటున్న అధికారులు వారికి వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. దీంతో ఇప్పటికే కొందరు కూలీలు ఎండ భయానికి పనులకు దూరమవుతున్న పరిస్థితి ఉంది. ఎండలకు తోడు ఎఫ్ఆర్ఎస్ గండం!జిల్లాలో 18 మండలాల్లోని 400 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 1.24 లక్షలు జాబ్కార్డులుండగా 2.10 లక్షల మంది కూలీ లు నమోదై ఉన్నారు. ఇందులో 74,682 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం కూలీల కు రెండుపూటలా ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేస్తోంది. పని ప్రదేశంలో ఉదయం ఫొటో తీసుకున్న 4గంటల తర్వాత రెండోసారి ఫొటో తీసుకోవడంతో చాలామంది పనులకు వెళ్లడం లేదు. ఎండాకాలం కావడంతో పనులు పూర్తి చేసినా గంటల తరబడి ఫొటో కోసం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎండలు తగ్గే వరకు ప్రభుత్వం ఉదయం ఒక్కసారే ఎఫ్ఆర్ఎస్ హాజరు తీసుకునేలా చూడాలని కోరుతున్నారు.వసతుల కల్పనకు చర్యలు చేపడతాం ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించాం. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు, నీడ కోసం టెంట్లు సమకూర్చాలి. మరోసారి సిబ్బందితో సమావేశం నిర్వహించి పని ప్రదేశాల్లో తప్పనిసరిగా కూలీకలు సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతాం. – నాగవర్ధన్, ఏపీడీ -
ఎస్ఐఆర్ను పారదర్శకంగా చేపడతాం
నిర్మల్ఖిల్లా: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివి జన్) ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రక్రియ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ.. జూన్ 25నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను ని యమించాలని సూచించారు. అర్హులెవరూ ఓటు హ క్కు కోల్పోకుండా, పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చే స్తామని చెప్పారు. అనంతరం తహసీల్దార్లు, అధికా రులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అ జ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఖానా పూర్ ఈఆర్వో గంగాధర్ తదితరులున్నారు. అర్హులందరికీ పని కల్పించాలి అర్హులందరికీ పని కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ సూచించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి సె ర్ప్ సీఈవో దివ్య దేవరాజన్తో కలిసి కలెక్టర్లు, గ్రా మీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పనులు వేగవంతం చే యాలని, ప్రణాళికలోని అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఎండ తీవ్రం కాకముందే పనులు ముగించి ఇళ్లకు చేరుకోవాలని, కూలీలకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీ వో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారు స్కూళ్లకు కార్పొరేట్ సొబగులు
ముధోల్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పేద గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా విశాలమైన స్థలం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని కుంటాల మోడల్ స్కూల్, నిర్మల్లోని నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖానా పూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ జెడ్పీఎస్ఎస్ ఎంపికయ్యాయి. వీటిలో ఎల్కేజీ, యూకేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారని, విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. వీటిలో డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండనుంది. ఒక్కో టీపీఎస్కు రూ.38కోట్లు..! ఒక టీపీఎస్ ఏర్పాటుకు సుమారు రూ.38కోట్ల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 40వేల లీటర్ల సంప్, డైనింగ్ హాల్, మూడంతస్తులతో స్కూల్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, ఫర్నిచర్, ల్యాబ్, ఇండోర్ స్పోర్ట్స్, ప్రొవైడింగ్ అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ తదితర నిర్మాణాలు చేపడతారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్
నిధులు విడుదల చేసిన సర్కారు లక్ష్మణచాంద: గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కాస్మొటిక్, డైట్ చార్జీల చెల్లింపునకు ఇక నుంచి నెలనెలా నిధులు విడుదల చేయనుంది. రెండ్రోజుల క్రితం డిప్యూ టీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తొలి త్రైమాసికానికి సంబంధించి గురుకులాల విద్యార్థుల డైట్, కాస్మొటిక్, అద్దె భవనాల అద్దె చెల్లించేందుకు గాను రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 10వేల మందికి పైగా విద్యార్థులకు మేలు జరగనుంది. అయితే, గతంలో సకాలంలో నిధులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలల అద్దె డబ్బులు నెలల తరబడి చెల్లించలేక ప్రిన్సిపాల్లు ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలు, పాఠశాలలు, కళాశాలల అద్దె డబ్బులు ప్రతినెలా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. జిల్లాలో ఇలా.. ఎస్సీ సంక్షేమశాఖకు సంబంధించిన ఐదు పాఠశాలలు, ఒక డిగ్రీ కళాశాల ఉంది. ఇందులో దాదాపు 2వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో రెండు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు డీసీవో ప్రశాంతి తెలిపారు. మైనార్టీ గురుకులాలు పాఠశాలలు, కళాశాలలు ఐదు ఉండగా నిర్మల్లో మాత్రమే బాలికలు, బాలురకు సంబంధించి సొంత భవనముంది. ఖానాపూర్, భైంసా, ముధోల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో 2వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు, నాలుగు కళాశాలలున్నాయి. ఇందులో దాదాపు 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక టీఎస్ఆర్జేసీ పాఠశాల, కళాశాల ఉండగా దీనికి సొంత భవనముంది. ఒక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ఉంది. విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ఇటీవల రూ.221.24 కోట్ల నిధులు విడుదల చేయడంతో నెలనెలా కాస్మొటిక్, డైట్ చార్జీలు చెల్లించే అవకాశముంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి ప్రతినెలా అద్దె చెల్లించొచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో గురుకులాల విద్యార్థులకు మేలు జరుగుతుంది. – ఆర్.ప్రశాంతి, డీసీవో -
ఖానాపూర్లో శాంతి కమిటీ సమావేశం
ఖానాపూర్: బక్రీద్ నేపథ్యంలో పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బు ధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు. చిన్న ఘట నలను సోషల్ మీడియాలో పెద్దగా చూపి ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సి పల్ అధికారులు పారిశుద్ధ్యం, క్లీనింగ్, వ్యర్థాల తొ లగింపు పనులు పకడ్బందీగా నిర్వహించాలని సూ చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవా లని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక మహేందర్, సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, వైస్ చైర్పర్సన్ షోయబ్, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, ఏడీ రామచంద్రుడు, ఎంపీవో రత్నాకర్రా వు, కౌన్సిలర్లు, నాయకులు సత్యవతి, ఇందిరా, జ హీర్ అహ్మద్, సురేశ్, సతీశ్, ప్రకాశ్గౌడ్ ఉన్నారు. -
ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను నిషేధించాలి
నిర్మల్టౌన్: ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను ని షేధించాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బాధ్యులు కోరారు. ఆన్లైన్ అమ్మకాల ప్రభావంతో కనీసం మెడికల్ షాపుల అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ షాపుల బంద్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల యజమానులు ర్యాలీగా వెళ్లి ఆర్డీవో రత్నకళ్యాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆన్లైన్లో పైనుంచి మంచి కంపెనీల పేరిట మోసం చేస్తూ.. ఔషధాలు సరఫరా చేయడంతో కింది స్థా యిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్స్ బలవుతున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం నేరుగా అధిక డిస్కౌంట్తో మందులు ఇవ్వడంతో మెడికల్ షాప్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా తమ సమస్యలు పరిష్కరించాలని షాపుల యజమానులు కోరారు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
నిర్మల్టౌన్: ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రం (ఐటీఐ) లో బుధవారం ‘యూత్ లీడర్ షిప్ సమ్మిట్’ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. యువజన, క్రీడ ల శాఖ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి, ఐటీఐ కన్వీనర్ కోటిరెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన
భైంసాటౌన్: ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవా రం ప్రజావాణి నిర్వహించారు. డివిజన్ పరిధి లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదా రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఎదుటే సంబంధిత ఎస్హెచ్వోలతో మా ట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించా రు. కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చిన త ల్లి, కొడుకులతో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడా రు. పరస్పర అవగాహనతో సమస్యలు పరి ష్కరించుకోవాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రంలో షీటీం సేవలను పరిశీలించారు. కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు. -
దారి పొడవునా ధాన్యమే..
లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ ప్రధాన రహదారి చింతల్చాంద, చామన్పెల్లి, రాచాపూర్, పోటపెల్లి, వడ్యాల్, కనకాపూర్ గ్రామాల వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్ల మేరకు ఉండగా రోడ్డుకు ఇరువైపులా వరి ధాన్యమే కనిపిస్తోంది. 15–20 రోజులుగా రైతులు 43 డిగ్రీల ఎండలో ధాన్యం ఆరబోస్తూ అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, సంచుల కొరత ఉండగా సకాలంలో కొనుగోళ్లు జరగక రోడ్లపైనే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. కాగా, పిల్లలు కూడా సంచుల్లో ధాన్యం నింపుతూ తల్లిదండ్రులకు సాయపడుతుండడం విశేషం.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


