breaking news
Wanaparthy
-
రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..
దేవరకద్ర మండలం నుంచి మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి ఆదివారం పత్తిని బొలెరో వాహనంలో తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక బంద్ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజురోజుకూ బండి కిరాయి పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను తీర్చాలి. – ఆనంద్, పత్తి రైతు, అమ్మాపూర్, దేవరకద్ర మండలం వాహనం అద్దె పెరుగుతుంది.. మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకొని ఆదివారం సాయంత్రం వచ్చాం. త్వరగా అమ్ముకొని పోదాం అనుకున్నాం. బంద్ ఉండడంతో వాహనం అద్దె పెరుగుతుంది. దీంతో ఇంటి దగ్గర పనిపోతుంది. ఇక్కడ మాకు ఖర్చులు అవుతున్నాయి. – తౌర్యనాయక్, పత్తి రైతు, మరికల్, నాగర్కర్నూల్ జిల్లా గద్వాల నుంచి వచ్చినం.. శనివారం స్లాట్ బుక్ చేసుకోగా మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి వచ్చింది. గద్వాల నుంచి వచ్చి 3 రోజులు అవుతుంది. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇన్నిరోజులు ఉండాలంటే మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కిరాయితోపాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి. – రమేష్, పత్తి రైతు, గద్వాల దిక్కుతోచడం లేదు.. రెండ్రోజుల కిందనే స్లాట్ బుక్చేసుకొని వినాయక మిల్లు దగ్గర పత్తిని ట్రాక్టర్లో తీసుకొస్తే క్యూలైన్లో నిలబెట్టారు. ఇప్పుడు కాటన్ మిల్లు బంద్ అని చెప్పడంతో దిక్కుతోచడం లేదు. స్లాట్ క్యాన్సల్ చేసుకొని మళ్లీ బుక్ చేసుకుంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. – దేవర రాము, లింగంపల్లి, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా ● -
తెల్లబోతున్నారు..!
సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్తో చిక్కులు నిలిచిన కొనుగోళ్లు..పలు చోట్ల ఆందోళనలు జిన్నింగ్ వ్యాపారుల బంద్తో సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ● నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేట్ వద్ద ఎన్హెచ్–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. ● జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. -
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యనాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి వారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజావాణితో సహా సీఎం ప్రజావాణికి అందే ఫిర్యాదులతో పాటు ఇన్చార్జి మంత్రి నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 31 ఫిర్యాదులు అందినట్లు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. -
చేనేత కార్మికులను విస్మరించడం తగదు
● చేనేత బాట కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లీ అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కళను అందలమెక్కిస్తున్నామంటూనే కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లీ ధ్వజమెత్తారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత బాట కార్యక్రమంలో భాగంగా ఆయన అమరచింతలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్వేస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీని అమలు చేయడంతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జియోట్యాగ్ ఉన్న నేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. మరుగున పడిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి.. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలను త్రిఫ్ట్ ఫండ్తో ఆదుకోవాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు రూ. 5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. బీహార్ తరహాలో ఓట్ల తొలగింపునకు కుట్రలు.. బీహార్లో ఓట్ల చోరీతో అధికారం చేజిక్కించుకున్న ఎన్డీఏ కూటమి.. ఇక మిగిలిన 12 రాష్ట్రాల్లో సైతం అదే తరహాలో ఓట్లను తొలగించి గద్దెనెక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జాన్వేస్లీ ఆరోపించారు. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించి.. తమకు అనువుగా 25 లక్షల ఓట్లను చేర్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కూటమికి ఏజెంట్గా పనిచేసిందని విమర్శించారు. అక్కడ ప్రతిపక్షాలు, ఎన్డీఏ కూటమికి పోలైన ఓట్లే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి జుబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో మిత్రపక్షాల ఐక్యత గుర్తించాలన్నారు. ప్రతిపక్షాలతో కలిసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంతో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు మహమూద్, జీఎస్ గోపి, వెంకటేశ్, రమేశ్, రాఘవేంద్ర, శ్యాంసుందర్, బుచ్చన్న, దామోదర్, శంకర్, జలగరి రాములు, బుచ్చన్న, రాఘవేంద్ర ఉన్నారు. -
చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాలని.. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి వి.రజని అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం మండలం దొంతికుంట తండా సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్తో పాటు ఖిల్లాఘనపురం ఎస్టీ ఆశ్రమ, మామిడిమాడ పాఠశాలల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్టికల్–21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా బడిఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చైల్డ్ లేబర్ యాక్టు ప్రకారం చర్యలు తప్పవన్నారు. అదే విధంగా బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపకూడదన్నారు. బాలికలను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇంట్లోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, అహ్మద్, రాహుల్, రాంలాల్, సత్యన్న పాల్గొన్నారు. వయోవృద్ధుల హక్కులపై అవగాహన ఉండాలి వనపర్తి: వయోవృద్ధుల హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారిణి సుధారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వయోవృద్ధులపై నిర్లక్ష్యం వహించే వారిపై ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయవచ్చని, 90 రోజుల వ్యవధిలో పూర్తిగా విచారించి న్యాయం చేకూర్చడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వృద్ధ తల్లిదండ్రుల పోషణ బాధ్యత ఎవరిది.. వారి పోషణ నిమిత్తం దరఖాస్తులు ఎక్కడ ఎవరికీ సమర్పించాలి.. గిఫ్ట్ డీడీ అంటే ఏమిటనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ బాలయ్య, చీఫ్ ఎల్ఏడీసీ రఘు, వయోవృద్ధుల కమిటీ సభ్యులు నాగేంద్రం, చిన్నమ్మ తామస్, నర్సింహాగౌడ్, కమర్ రెహమాన్, అమీర్, వీరయ్య పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి వనపర్తి: జిల్లాలో నిర్ధారించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని వెంటనే ప్రారంభించాలని.. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సత్వరమే డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి, ఆన్లైన్లో చేసిన డేటా ఎంట్రీకి పొంతన లేదని.. డేటా ఎంట్రీ ఆలస్యం ఎందుకు అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 291 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. 13వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో 10,682 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించినల్లు వివరించారు. 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మిల్లులకు ధాన్యం తరలించే అన్ని వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు ప్రైవేటు మిల్లింగ్ సైతం చేసుకోడానికి వీలు లేదన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లులను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యనాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఏఓ ఆంజనేయులు, కోఆపరేటివ్ అధికారి ఇందిరా, రవాణాశాఖ అధికారి మాన స, మార్కెటింగ్శాఖ అధికారి స్వరణ్సింగ్ తదితరులు ఉన్నారు. -
చలి.. పులి
జిల్లాలో పెరిగిన తీవ్రత ● వారం రోజులుగా మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు మదనాపురం: జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం వేళ పొగమంచు కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతుండగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కార్మికులు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రతతో వరి, కంది, టమాట, పూల తదితర పంటల్లో ఎదుగుదల మందగిస్తోందని రైతులు చెబుతున్నారు. దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉష్ణోగ్రత మార్పులతో జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, గుండె, మధుమేహ, రక్తపోటు వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జిల్లాలో గత వారం నమోదైన ఉష్ణోగ్రతలు తేది గరిష్టం కనిష్టం 10 32.3 15.3 11 32.3 15.3 12 33.0 16.2 13 33.1 17.2 14 32.7 15.1 15 33.2 13.2 16 33.0 13.7 తెల్లవారుజామున, రాత్రిళ్లు బయటకు వెళ్తే కోట్లు, మఫ్లర్, చేతి తొడుగులు తప్పనిసరిగా ధరించాలి. వేడి నీరు, సూప్లు, వేడి పాలు, కాఫీ, టీ వంటి పానీయాలు తీసుకోవడం మంచిది. చిన్నారులకు చన్నీటితో స్నానం చేయించకూడదు. పొగమంచు సమయంలో వాహనాలు నడిపేటప్పుడు ఫాగ్ లైట్లు ఉపయోగించాలి. పొగమంచు ప్రభావం తగ్గే వరకు పంటలకు నీరు అందించేందుకు ఉదయం ఆలస్యం చేయాలి. పూల, కూరగాయల తోటలపై ప్లాస్టిక్ సంచులు లేదా షేడ్ నెట్లు వేయడంతో చలి తీవ్రత నుంచి రక్షించవచ్చు. పశువులకు వేడి నీరు తాగించడంతోపాటు రాత్రివేళల్లో గదుల్లో ఉంచాలి. చలికాలంలో రాత్రివేళల్లో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం చాలా ప్రమాదకరం. చలి నుంచి రక్షణ కోసం దుప్పట్లు, కోట్లు వినియోగించాలి. నీరు తాగడం తగ్గించకూడదు. శరీరం తేమ కోల్పోతే రోగనిరోధక శక్తి పడిపోతుంది. వృద్ధులు ఉదయం సూర్యకాంతి వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. పిల్లలకు తగిన వేడి దుస్తులు వేసి పాఠశాలలకు పంపించాలి. – డా. భవాని, వైద్యురాలు, మదనాపురం పీహెచ్సీ -
‘చేయూత’ సేవలు అభినందనీయం
వనపర్తి రూరల్: అనాథలను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న చేయూత ఆశ్రమ నిర్వాహకుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం మండలంలోని చిట్యాల సమీపంలోని చేయూత అనాథ ఆశ్రమానికి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం రూ.6 లక్షల విలువైన ఆటోను ఎమ్మెల్యే ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. అలాగే 2004లో అనాథగా ఆశ్రమంలో చేరిన మాధవి వివాహం చిన్నంబావి మండలం గోపాలాపురం గ్రామానికి చెందిన సందీప్రెడ్డితో ఆశ్రమంలో జరగగా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. వివాహం జరిపిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్రెడ్డి దంపతులను ఎమ్మేల్యే అభినందించారు. ఆశ్రమ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమానికి వాహనం అందించి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. ఆశ్రమం నుంచి గ్రామాల్లోని అనాథ వృద్ధులకు భోజనాన్ని అందించేందుకు వాహనాన్ని వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, సూర్యచంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, ఆర్యభవన్ శ్రీనివాస్, ఆదిత్య, చీర్ల విజయ్చందర్, లక్కాకుల సతీష్, చంద్రాయుడు సాగర్ పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ.. గోపాల్పేట: ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన గడ్డికోపుల నారమ్మ శనివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు, జమ్మి మల్లేష్, సురేష్గౌడ్, పరశురాం, రవి, రాజేష్, శేషయ్య తదితరులు ఉన్నారు. -
సహజ సిద్ధంగా..
నేడు సోమశిలకు ప్రత్యేక బస్సులు చిన్నంబావి మండలంలోని ఓ చెరువులో చేప పిల్లలు వదులుతున్న నాయకులు (ఫైల్) ●ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025– 26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, పీఏసీఎస్లు, ఎఫ్పీఓలు, ఎస్హెచ్జీలు లాంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2 వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు ‘కృషి సఖులు’ సాగు సహాయకులను ఉపయోగించనున్నారు. మహబూబ్నగర్ (వ్యవసాయం): అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులతో కూడిన ప్రకృతి వ్యవసాయానికి రైతులను సమాయత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ పథకానికి పచ్చజెండా ఊపింది. సేంద్రియ పద్ధతులతో విభిన్న పంటలు పండించడానికి రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించనుంది. ఆరోగ్యకర దిగుబడులతోపాటు పర్యావరణ హితంగా పంటలు పండిస్తూ.. భూమి, సహజ వనరులను కాపాడుతూ.. రైతులు తక్కువ ఖర్చులతో కూడిన సుస్థిర వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసేందుకు ఈ పథకం తోడ్పడనుంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సహజ రీతిలో ప్రకృతి వ్యవసాయంగా మార్చాలనే దృక్పథాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనున్నాయి. 2025– 26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. సహజ వ్యవసాయ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామం లేదా గ్రామ సముదాయంలో 125 మంది చొప్పున జిల్లాలో 20 క్లస్టర్ల నుంచి మొత్తం 2,500 మంది ఔత్సాహిక రైతులను గుర్తించారు. వారి వ్యవసాయ కమతంలో మొదట ఒక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించేలా ప్రోత్సహిస్తారు. మొదటి సంవత్సరం రైతులు శిక్షణలో భాగంగా క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో అవసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. రెండు, మూడేళ్లలో ఆవుపేడ, గోమూత్రం సేకరణ, జీవామృత లాంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులు అవలంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలుపెట్టాలి. 4–5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరించాలి. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 క్లస్టర్లలో 9,375 రైతులను ఎంపిక చేశారు. వీరందరికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు, జీవసంబంధం పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. సహజ వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక వనరుల వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది.కొల్లాపూర్: కార్తీక సోమవారం సందర్భంగా కొల్లాపూర్ నుంచి సోమశిలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ ఉమాశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా వచ్చే అమావాస్య రోజున కొల్లాపూర్ నుంచి పంచముఖి హనుమాన్ ఆలయానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటుచేసినట్లు డీఎం తెలిపారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు పంచముఖికి బస్సు బయలుదేరుతుందని.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం పంచముఖి ఆలయానికి చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కొల్లాపూర్కు తిరుగు ప్రయాణం ఉంటుందని వివరించారు. ఆహార అవసరాల డిమాండ్ పెరగడంతో అధిక దిగుబడులు పొందేందుకు వ్యవసాయ సేద్యంలో ఉపయోగిస్తున్న ప్రమాదకర ఎరువులు, పురుగు మందులు, రకరకాల సాగు విధానాలు పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని సహజ పద్ధతులతో చేయడం వల్ల ఆరోగ్యకర దిగుబడులు లభించడమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. ఈ పథకం దేశం మొత్తంలో యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అపోహలు వీడి రైతులు ముందుకు రావాలి. – వార్ల మల్లేశం, సేవ్ నేచర్ ప్రతినిధి, కోస్గి ప్రకృతిలో దొరికే వనరులను వినియోగించడంతోపాటు రసాయనాలు, పురుగు మందుల వాడకం తగ్గించి సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఎంపిక చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ మూస ధోరణికి స్వస్తిపలికి.. విభిన్న పంటలకు ప్రోత్సాహం ప్రతిరైతు సేంద్రియ పద్ధతిని అవలంభించేలా చర్యలు తద్వారా సురక్షితమైన పోషకాహారం తీసుకొచ్చేందుకు కృషి ఉమ్మడి జిల్లాలో 9,375 మంది రైతుల ఎంపిక -
చేప పిల్లల సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు
స్థానిక పెద్ద చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. చేప పిల్లల పంపిణీ కోసం మరో నెలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత చెరువులో వదిలినా ఆశించిన ఫలితాలు అందకపోవడం ఖాయం. ప్రభుత్వం త్వరగా పంపిణీ చేసి ఆదుకోవాలి. – గోపి, మత్స్యకారుడు, అమరచింత ఈ ఏడాది ప్రభుత్వం అందించే రాయితీ చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఏటా ఇదివరకే చేప పిల్లలు చెరువుల్లో వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన మత్స్యబీజాన్ని అందించేవారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు. త్వరగా సరఫరా చేసి ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్గల్ రాయితీ చేప పిల్లల సరఫరా కోసం గతంలో టెండర్లు ఆహ్వానించాం. నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినా.. ఆశించిన ధరలు లేవనే కారణంతో ఒకరు తప్పుకున్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. వారంలోగా రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఉచిత చేప పిల్లలను అందించే ప్రయత్నం చేస్తున్నాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ ● ఆశించిన ధర లేదంటూ ఆసక్తిచూపని వైనం ● రీ–టెండర్ నిర్వహణకు సిద్ధమైన అధికారులు ● జిల్లాలో 143 మత్స్య పారిశ్రామిక సంఘాలు.. 13,600 మంది మత్స్యకారులు ● గతేడాది 54.84 లక్షలు పంపిణీ అమరచింత: జిల్లాలో రాయితీ చేప పిల్లల సరఫరాకుగాను మత్స్యశాఖ ఇటీవల టెండర్ నిర్వహించినా ఆశించిన ధరలు లేవంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో అధికారులు రీటెండర్ నిర్వహణకు సిద్ధమయ్యారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో రాయితీ చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు ఇదివరకే చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, పాలమూరు, నాగర్కర్నూల్ జిల్లాల్లో రాయితీ చేప పిల్లల పంపిణీ కొనసాగుతుండగా.. జిల్లాలో ఆలస్యం కావడంతో మత్స్యకారులు ప్రతిరోజు అధికారులను సంప్రదిస్తున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర పెరుగుదల ఉండక నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ● వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభమైనా.. ప్రభుత్వం రాయితీ చేప పిల్లలను ఎప్పుడు అందిస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. గతేడాది జిల్లాలో 1.50 కోట్ల చేప పిల్లలను అందిస్తారని ఆశించినా.. సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే సరఫరా చేశారు. ఈ ఏడాదైనా రెండు కోట్ల మత్స్యబీజాన్ని పూర్తిస్థాయిలో ఉచితంగా అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిందని.. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆయా సొసైటీలకు చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు. చెరువులు, కుంటలు1052 గతేడాది పంపిణీ చేసిన చేప పిల్లలు 54.84 లక్షలు -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వనపర్తి రూరల్: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నెహ్రూ సేవలు చిరస్మరణీయం
వనపర్తి: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఉన్న బాలసదనంలో జిల్లా మహిళ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడే ఉన్న చిన్నారులతో కేక్ కట్ చేయించి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెహ్రూకు చిన్నారులంటే అమితమైన ప్రేమని గుర్తు చేశారు. బాలసదనం విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారులు కోరినట్లుగా హైదరాబాద్ పర్యటనకు తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. క్విజ్ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలసదనం ప్రహరీ నిర్మాణానికి సహకరించిన కలెక్టర్కు సంక్షేమశాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, తహసీల్దార్ రమేష్రెడ్డి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలకు.. కొత్తకోట రూరల్: విద్యార్థులు ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట ప్యూపిల్స్ పాఠశాలలో నిర్వహించిన కిడ్స్ ఉత్సవ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివి వైద్య సీట్లు సాధించిన పలువురు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్కు పాఠశాల యాజమాన్యం జ్ఞాపిక అందజేశారు. పాఠశాల చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఎంపీడీఓ వినీత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక పరిజ్ఞానంతో కుంకుమపువ్వు సాగు
కొత్తకోట రూరల్: చదువుకున్న గ్రామీణ యువత, ఆసక్తి ఉన్న యువ రైతులు ఆధునిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కుంకుమపువ్వు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని నాబార్డు మహబూబ్నగర్ క్లస్టర్ డీడీఎం పి.మనోహర్రెడ్డి అన్నారు. జిల్లాలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోఫోనిక్స్ పద్ధతిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుంకుమపువ్వు సాగుపై నిర్వహించిన ఒకరోజు శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కుంకుమపువ్వు ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు ప్రొ. పిడిగం సైదయ్య మాట్లాడుతూ... కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కుంకుమ పువ్వును ఎలా పెంచాలో విద్యార్థులు, రైతులకు వివరించినట్లు తెలిపారు. ఏరోఫోనిక్స్ పద్ధతిలో దిగుబడి, నాణ్యత పెంచేందుకు మరిన్ని పరిశోధనలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ, సాగులో మెళకువలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేలైన పద్ధతులు, ఖర్చు తగ్గించే పద్ధతితో పాటు తెలంగాణ ప్రాంతంలో సాగు చేసేందుకు అవసరమైన మెళకువలను ప్రొ. సైదయ్య వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్ కుంకుమపువ్వు పరికరాల పనితీరు గురించి అవగాహన కల్పించారు. 50 మంది విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు. -
ఉత్సాహంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సంయుక్తంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్ జిల్లా మీట్ 2025–26 నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ తెలిపారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల సతీష్ హాజరయ్యారని చెప్పారు. సాయంత్రం ముగింపు సమావేశానికి లక్కాకుల సతీష్ పాల్గొని విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసినట్లు వివరించారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో పోటీలు కొనసాగుతున్నాయని.. గ్రామాల్లోని బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భావిభారత అథ్లెట్లుగా తీర్చిదిద్దడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్తక్రా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భాస్కర్గౌడ్, బోలమోని నర్సింహ, శంకర్, అలి, శ్రీనివాస్రెడ్డి, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు. -
మూడు ప్రధాన వైద్య పరీక్షలు..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో రూపొందించిన మధుమేహ దృష్టి కార్యక్రమంలో మధుమేహ వ్యాధ్రిగస్తులకు మూడు ప్రధాన వైద్య పరీక్షలు చేస్తాం. లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సురీత్యా వచ్చే కంటి సమస్యలేమైనా ఉన్నాయా పరీక్షిస్తాం. అవసరం మేరకు జిల్లా అస్పత్రి, హైదరాబాద్లోకి సరోజిని కంటి ఆస్పత్రికి రెఫర్ చేస్తాం. శుక్లాల శస్త్రచికిత్స సైతం జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. – డా. రాంచందర్రావు, కార్యక్రమ అధికారి మానవాళిని పట్టిపీడిస్తున్న మధుమేహ నియంత్రణకు వ్యాయామం, ఆహారపు అలవాట్లు, వైద్యుల సూచనలు పాటించాలి. మధుమేహం ప్రభావంతో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు, చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మధుమేహ దృష్టి కార్యక్రమాన్ని రూపొందించాం. వ్యాధగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలి. – ఆదర్శ్ సురభి, కలెక్టర్ ● -
సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం వద్దు
కొత్తకోట రూరల్: రైస్మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో జాప్యం జరగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శుక్రవారం పెద్దమందడి మండలం జగత్పల్లి, మణిగిళ్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తూకం సరిగా చేయాలని, తేడాలొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రానికి వచ్చిన ప్రతి రైతు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, పారదర్శకత పాటించాలని సూచించారు. తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేయాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని కోరారు. అనంతరం జిల్లాకేంద్రంలోని రాఘవేంద్ర రైస్మిల్లును సందర్శించి పంట నూర్పిళ్ల పురోగతిని సమీక్షించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని జాగ్రత్తగా తరలించాలని.. మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన మేరకు హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు పాన్గల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి గురువులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉన్న లిటిల్స్టార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలను చైతన్యం చేసేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మహనీయులను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యపైనే దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, సరైన మార్గంలో నడిచేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని అకట్టుకున్నాయి. అంతకుముందు ఎస్పీ జ్యోతి వెలిగించి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఈఓ ఆనంద్, ఎస్ఐ శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శేఖర్యాదవ్, కరస్పాండెంట్ ఆంజనేయులు, గిరిజన సంఘం జిల్లా నాయకులు బాల్యానాయక్, జానపద కళాకారులు డప్పు స్వామి పాల్గొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
ఆనవాళ్లు కోల్పోతున్న పాలమూరు నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్, రవాణా, మైనింగ్ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందుతుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. ‘నారాయణపేట’లో ఇష్టారాజ్యం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్, అప్పిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు తవ్వకాలు చేపడుతున్నారు. ఒక ట్రిప్పుపై వచ్చిన లాభంలో జేసీబీ యజమానులు, టిప్పర్ ఓనర్లు వాటాల లెక్కన పంచుకుంటున్నారు. మాగనూరు మండలం నుంచి నారాయణపేటకు ఇసుక రవాణా నిత్యం కొనసాగుతోంది. నారాయణపేటలో ఇసుకను అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి మాగనూరుకు వెళ్తున్న క్రమంలో ఖాళీగా వెళ్లకుండా మొరం నింపుకుని వెళ్తూ అవసరమైన వాళ్లకు అమ్ముకుంటున్నారు. ఒక టిప్పర్ మొరం లోడ్కు మార్కెట్లో సుమారు రూ.4,500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. ఊట్కూరు మండలం ఎర్గట్పల్లి గుట్టను కూడా కొందరు తొలుస్తున్నారు. గ్రామంలోని చెరువు కట్ట మీద నుంచి టిప్పర్లు, జేసీబీలు తీసుకెళ్లి గుట్ట వద్ద తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. ధన్వాడ మండలం మణిపూర్ తండా గుట్ట, గున్ముక్ల, ఎమ్మినోనిపల్లి మాలేగుట్ట, దేవుని గుట్టపై అక్రమంగా తవ్వకాలు చేపట్టి.. మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మద్దూరు మండలం ఎరగ్రోల్ తండా సమీపంలో, కోస్గి మండలం కడెంపల్లి పెద్ద గుట్టను కూడా కొల్లగొడుతున్నారు. ● మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నగర పరిధిలో ఎదిర, మౌలాలి గుట్ట, వీరన్నపేట, కొర్షగుట్ట ప్రాంతాల్లో అక్రమార్కులు గుట్టలను పిండి చేస్తున్నారు. మొరం, ఎరమ్రట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అడ్డాకుల మండలం కేంద్రంలోని పలుగు గుట్టపై కూడా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ● వనపర్తి జిల్లాలో వీపనగండ్ల మండలం గోపాల్దిన్నె రిజర్వాయర్ రక్షణ కట్ట, ఖిల్లాఘనపురం మండలం సోళిపూర్, కర్నెతండా, జిల్లాకేంద్రంలోని శ్రీనివాసాపురం శివారులోని మబ్బు గుట్టపై అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా తవ్వతున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో పూడూరు, వజ్రాలగుట్ట, నది అగ్రహారం సమీపంలో, పిల్లిగుండ్ల కాలనీ, ముల్కల్ పల్లి, జమ్మిచేడు తదితర ప్రాంతాల్లోని గుట్టలను అక్రమార్కులు కేరాఫ్గా చేసుకుని మట్టి దందా చేస్తున్నారు. అదేవిధంగా ధరూరు, గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అనధికారకంగా మట్టి తరలిస్తున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఊర గుట్టను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో టిప్పర్లతో నిత్యం మట్టి తరలింపు కొనసాగుతోంది. అదేవిధంగా తాడూరు మండలంలోని కొమ్ముగుట్టపై తరచుగా తవ్వకాలు జరుగుతున్నాయి. రాయల్టీ చెల్లించకుండా దందా.. ప్రభుత్వ పనులకై నా, ప్రైవేట్కై నా మట్టి కావాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం టన్నుకు రూ.56 చొప్పున మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంత మేర కావాలో పేర్కొంటూ ఆ శాఖకు అర్జీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మైనింగ్ శాఖ డీడీఓ కోడ్ పేరిట చలానా తీయాలి. ఈ మేరకు నిర్దేశిత సర్వే నంబర్లో చలానా చెల్లించిన మేరకు అధికారులు కొలతలు (పొడవు, వెడల్పు, లోతు) వేసి అనుమతి పత్రాలు ఇస్తారు. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టి మట్టి తరలించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లో ఒకరిద్దరు మినహా అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. రాయల్టీ ఎగవేస్తూ యథేచ్ఛగా గుట్టలు తొలుస్తుండడంతో పర్యావరణంపై ప్రభావం పడుతుండడంతోపాటు ప్రభు త్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా ఎరమ్రట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా దందా రాయల్టీ ఎగవేతతో సర్కారు ఆదాయానికి గండి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖపై విమర్శలు నేను కొత్తగా వచ్చా. రెండు రోజులు మాత్రమే అటెండ్ అయ్యా. ఎక్కడ గుట్ట తవ్వి మొరం, మట్టి కొడుతున్నారో వివరాలు నాకు తెలవదు. రాయల్టీ కూడా చెల్లిస్తున్నారో లేదో తెలవదు. మొరం, మట్టి తరలింపునకు ఇసుక లెక్క నిబంధనలు ఉండవు. 24 గంటలూ కొట్టుకోవచ్చు. – సత్యనారాయణ, మహబూబ్నగర్ ఏడీ, మైనింగ్ శాఖ -
రైస్మిల్లులపై విజిలెన్స్ దాడులు
వనపర్తి: జిల్లాలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. విజిలెన్స్ ఎస్పీ ఆనంద్కుమార్కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో విజిలెన్స్ దాడులు కొనసాగాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని చాముండి మిల్లులో 97 వేల బస్తాలు, వారాహి మిల్లులో 37 వేల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్ డీఎస్పీ వెల్లడించారు. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించనున్నట్లు విజిలెన్స్ తహసీల్దార్ రాజశేఖర్, సీఐ గణేశ్, డీసీటీఓ సురేశ్ తెలిపారు. రెండు మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కింపు సమయంలో వనపర్తి డీఎస్ఓ, డీటీ ఎన్ఫోర్స్మెంట్ తదితరులున్నారు. కలెక్టర్ తనిఖీ చేసిన మరునాడే.. ప్రస్తుత వానాకాలం వరి ధాన్యం కేటాయింపుల్లో భాగంగా ఆయా మిల్లులకు ధాన్యం కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం తనిఖీ చేశారు. మరునాడే విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
వైద్యశాఖలో గందరగోళం
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం నెలకొంది. జిల్లా వైద్యాధికారి, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, అక్రమాల ఫిర్యాదులతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అనారోగ్య కారణాలతో జీజీహెచ్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా. రంగారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో జీజీహెచ్లో పని చేస్తున్న సీనియర్ వైద్యుడికి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించినా.. వ్యక్తిగత కారణాలతో ఆయన కూడా సెలవు పెట్టారు. ప్రస్తుతం విధుల్లో ఎవరు ఉన్నారనే విషయంపై గందరగోళం నెలకొంది. ఆర్ఎంఓలు అన్నింటికీ తామే అన్నట్లుగా పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీజీహెచ్లో ఏదైనా పనుల కోసం ఎవరిని సంప్రదించాలనే విషయంలో అధికారులు, పాలకులు అయోమయంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వైద్యాధికారి విషయంలోనూ.. జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి డా. ఏ.శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి నారాయణపేట జిల్లాకు బదిలీ చేశారు. ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్కు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఏ.శ్రీనివాసులు ఇక్కడి నుంచి రిలీవ్ కాకపోగా.. ముందస్తుగా కలెక్టర్తో తీసుకున్న అనుమతి మేరకు సెలవుపై వెళ్తూ డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులుకు బాధ్యతలు అప్పగించారు. డా. సాయినాథ్ పేరుతో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆదేశాలొచ్చినా.. ఇక్కడ ఉన్న అధికారి రిలీవ్ కాకపోవడం, ఆయన సెలవు పూర్తి చేసుకుని వచ్చే వరకు డిప్యూటీ డీఎంహెచ్ఓకు ఇన్చార్జ్ ఇవ్వటంతో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది విస్మయంలో పడ్డారు. పాలకులు, ఉన్నతాధికారులు చొరవచూపి నెలకొన్న అనిశ్చితిని పరిష్కరిస్తేనే వైద్యశాఖలో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రెండు కీలక పోస్టుల్లో ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వనపర్తి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని.. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్ 14, 17, 19 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ క్రీడా జ్యోతి వెలిగించి వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని సూచించారు. ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీ గురుకుల పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లా బీసీ గురుకులాల విద్యార్థులు ఐదేళ్లుగా స్టేట్ మీట్లో పాల్గొని సత్తా చాటుతున్నట్లు గుర్తు చేశారు. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలు, 4 కళాశాలల నుంచి 450 విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎస్ఐ జలంధర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్, ప్రశాంతి, పాఠశాల చైర్మన్ రాజు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
పాన్గల్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు. బాలల న్యాయ చట్టం, పోక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించే వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, కౌన్సిలర్ స్వరూప, జెండర్ స్పెషలిస్ట్ సలోమి, ఆర్డీఎస్టీ సభ్యుడు రాజశేఖర్, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి విద్యావిభాగం: ఈఎంఆర్ఐ సంస్థలో 102 వాహనాల పైలెట్ల (డ్రైవర్ల) నియామకానికి అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు, ఎల్ఎంవీ (బ్యాడ్జీ) లైసెన్న్స్ కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని.. ఒరిజినల్ ధ్రువపత్రాలతో నర్సింగాయపల్లిలోని ప్రభుత్వ మెటీర్నరీ, చిల్డ్రన్ ఆస్పత్రిలో హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 99498 21962 సంప్రదించాలని సూచించారు. కురుమూర్తిస్వామికి రూ.24.83లక్షల ఆదాయం చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన రెండో హుండీని మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.24,83,628 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పరిశీలకులు శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు భారతమ్మ, బాదం వెంకటేశ్వర్లు, గౌని రాము, నాగరాజు, కమలాకర్, ప్రభాకర్రెడ్డి, ఉంధ్యాల శేఖర్, ఆలయ పూజారులు వెంకటయ్య, సత్యనారాయణ, విజయ్లక్ష్మి నరసింహచార్యులు, పాల్గొన్నారు. -
బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళన
ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కోరారు. మంగళవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్ ఎదుట కార్మికులు నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఆస్పత్రిని 30 పడకల నుంచి 23 పడకలకు కుదించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కార్మికులు ఏళ్లుగా కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే వేతనం రూ.11 వేలుకాగా.. అందులో రూ.1,500 కోత విధిస్తున్నారని, వెంటనే ఏజెన్సీని రద్దు చేయాలని, జీఓ ప్రకారం రూ.12,093 వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని వైద్యాధికారి హరినారాయణరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తొలి విద్యాశాఖ మంత్రికి ఘన నివాళి..
విద్యారంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్కే దక్కుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం జరుపుకొంటున్నట్లు వివరించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జల్, డీపీఆర్వో సీతారాం నాయక్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘విద్యను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు’
వనపర్తిటౌన్: పాలకులు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ జేడీ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని యాదవ భవనంలో పీడీఎస్యూ 4వ జిల్లా మహాసభలు సంఘం జిల్లా అధ్యక్షుడు దినేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పాలకుల అసమర్థతతో ధనికుల పిల్లలకు ఒక విద్య, పేదల బిడ్డలకు ఒక విద్య అందుతోందని, ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను విద్యార్థులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి 50 ఏళ్లుగా పీడీఎస్యూ కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాక ముందు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. నేడు గాలికొదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 29 డీఈఓ, 530కి పైగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ లోపించి నిర్వాహణ గాఢి తప్పుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దినేష్, ప్రధాన కార్యదర్శిగా గణేశ్, కోశాధికారిగా గోవర్ధన్తో పాటు 11 మంది సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో సంఘం జెండాను ఎగురవేశారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్కుమార్, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొంకల వెంకట నారాయణ, అరుణ్, గోవర్ధన్, కృష్ణవేణి, విశ్వతేజ, చరణ్, మనోహర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి: రహదారి నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటిస్తూ వాహనాలు నడపాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లైసెనన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్బెల్టు ధరించాలని సూచించారు. ట్రిబుల్ రైడింగ్, వాహనాన్ని అతివేగంగా నడపడం, యువత స్టంట్లతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోతున్నారని తెలియజేశారు. యూటర్న్, జీబ్రా క్రాసింగ్, డివైడర్ టర్న్ తదితర నిబంధనలపై యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు తెలియకపోవడం, తెలిసినా వాటిని పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏడాదికి 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, భాగస్వామి మన రాకకోసం ఎదురుచూస్తుంటారని.. ఎదురుచూపు విషాదకరంగా మారొద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు యువత ముందుకురావాలని, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలుసుకొని విధిగా పాటించాలని సూచించారు. యువత ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ పొందడమే కాకుండా తమ జూనియర్లు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, స్టేషన్ హౌజ్ అధికారులు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చెరుకు కోతలు షురూ
45 కోత బృందాలు, 12 యంత్రాల సాయంతో.. ● కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలోప్రారంభమైన క్రషింగ్ ● టన్నుకు రూ.3,924 మద్దతు ధర ● ఫ్యాక్టరీ పరిధిలో 7,800 ఎకరాలు ● టన్ను పంట కోతకు రూ.610, డ్రైవర్ బత్తా రూ.300, ఎద్దుల బండి అద్దె రూ.150 రైతులే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించింది. రైతులు ఈ ధరలు మాత్రమే కోత కార్మికులకు ఇవ్వాలని తెలియజేస్తూ పంట కోతలు చేపడుతున్నారు. ●మూడు నెలల పాటు ఉపాధి.. ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు చేపట్టేందుకు ఏటా వస్తుంటాం. రోజు రూ.500 నుంచి రూ.600 సంపాదిస్తాం. మూడు నెలల పాటు భార్యాపిల్లలతో ఇక్కడే ఉండి కోతలు పూర్తి చేస్తాం. కుటుంబ పోషణకు పంట కోతలున్న ప్రాంతాలకు వలస వెళ్తుంటాం. – యోగేశ్వర్, కోత కార్మికుడు, ఎర్రగొండపాలెం గ్రామాల వారీ కోతలు చేపట్టాలి.. కోత కార్మికులను సకాలంలో రప్పించి గ్రామాల వారీగా కోత పనులు పూర్తి చేయాలి. తక్కువ సాగుచేసిన రైతుకు ఒక న్యాయం.. అధికంగా సాగు చేసిన రైతుకు మరో న్యాయం అన్నట్టుగా ఫ్యాక్టరీ సిబ్బంది తేడా చూపకుండా కోత పనులు చేపట్టాలి. – నారాయణ, రైతు, సింగంపేట, అమరచింత రూ.6 వేలు మద్దతు ధర ఇవ్వాలి.. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఇస్తున్న మద్దతు ధర ప్రకారం టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.3,924 ధర చెల్లిస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఒకేసారి 150 కోత కార్మికుల బృందాలను రప్పించాలి. – రాజన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, కృష్ణవేణి చెరుకు రైతు సంఘం సకాలంలో పూర్తి.. సకాలంలో చెరుకు కోతలు పూర్తి చేయడానికి యాజమాన్యం తగిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఫ్యాక్టరీలో సోమవారం నుంచి క్రషింగ్ ప్రారంభమైంది. ఇందుకు కావాల్సిన ముడి చెరుకును సకాలంలో ఫ్యాక్టరీకి తరలించేందుకుగాను 45 కోత కార్మిక బృందాలతో పాటు 12 యాంత్రాలను సిద్ధంగా ఉంచాం. పంట ఫ్యాక్టరీకి చేరిన 15 రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. – నాగార్జునరావు, డీజీఎం, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ అమరచింత: రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటం, రాయితీలను కొనసాగిస్తుండటంతో ఈసారి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరి పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం గతేడాది కంటే 3 వేల ఎకరాలు పెరిగింది. మద్దతు ధర రూ.3,924 చెల్లిస్తుండటంతో రైతులు చెరుకు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అనుకున్న సమయానికి పంట కోతలు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం శ్రీకారం చుట్టినా.. వర్షాల కారణంగా పది రోజులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగొండపాలెం నుంచి 30, తుని నుంచి 5, నల్గొండ నుంచి 10 కోత కార్మికుల బృందాలతో పాటు 12 కోత యంత్రాలను సిద్ధం చేసి రోజు వివిధ గ్రామాల్లో పంట కోతలు చేపట్టేలా యాజమాన్యం తగిన చర్యలు చేపట్టింది. ఫ్యాక్టరీ పరిధిలో సాగు ఇలా.. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 7,800 ఎకరాల్లో చెరుకు సాగైంది. ఐదేళ్ల కిందట 15 వేల ఎకరాల సాగు ఉండగా.. పంట విక్రయించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం త్వరగా డబ్బులు చెల్లించకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. రెండేళ్లుగా సకాలంలో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం, రాయితీలను సైతం అందిస్తుండటంతో ఆరువేల నుంచి 7,800 ఎకరాలకు చేరింది. గతంలో జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, నారాయణపేట జిల్లా నర్వ మండలంలో 3,200 ఎకరాలు, గద్వాల జిల్లాలోని రాజోలి, అలంపూర్లో రెండు వేల ఎకరాల్లో చెరుకు సాగు ఉండగా.. రెండేళ్లలో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. అత్యధికంగా జిల్లాలోనే చెరుకు సాగవుతుండటంతో అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలో ముందుగా కోతలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. అధ్వాన రహదారులతో ఇబ్బందులు.. ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో పంటను ట్రాక్టర్లలో ఫ్యాక్టరీకి తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీడీసీ నిధులతో రహదారి మరమ్మతులు చేపట్టాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పక్కాగా జల వనరుల గణన
వనపర్తి: జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క పక్కాగా తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్ననీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. రెండు వేల హెక్టార్లలోపు ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్న ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, నీటిపారుదలశాఖ ఏఈలు సూపర్వైజర్గా ఉంటారని, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 228 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న నీటి వనరుల గణన కోసం 67 మంది ఏఈఓలు, 102 మంది జీపీఓలు, అవసరానికి తగ్గట్టుగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించాలన్నారు. ఎన్యూమరేటర్లకు మండలాల స్థాయిలో త్వరతగతిన శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను గణన చేస్తున్న వారికి అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ తరుణ్ చక్రవర్తి, సీపీఓ రవీందర్, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖర్, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘ఉద్యమాల వల్లే చెరుకుకు మద్దతు ధర పెంపు’
అమరచింత: కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులకు మద్దతుగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పలు దఫాలుగా నిర్వహించిన ఉద్యమం కారణంగానే చెరుకు పంటకు రూ.ఽ3,924 ధర లభించిందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న తెలిపారు. మండల కేంద్రంలోని మార్క్ భవనంలో సోమవారం విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా డ్రిప్పై సబ్సిడీ లేనందున చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ సంఘంగా ద్వారా సీఎం రేవంత్రెడ్డికి విన్నవించినట్లు తెలిపారు. డ్రిప్ సబ్సిడీని కొనసాగించడంతో పాటు టన్ను చెరుకుకు రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు వెంటనే మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న 9 రకాల సమస్యలపై పలు దఫాలుగా ఆందోళనలు నిర్వహించి యాజమాన్యాన్ని ఒప్పించామని పరిష్కారం చూపామని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి బకాయిలు పెట్టకుండా ఫ్యాక్టరీ నుంచి చెరుకు రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయన్నారు. సమావేశంలో వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ఆంజనేయులు, రాజశేఖర్రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా నియామకాలు..!
పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట ●విచారణ చేపట్టాలి.. ఏ ప్రభుత్వ సంస్థల్లో చేపట్టని విధంగా పీయూలో నియామకాలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో నేరుగా భర్తీ చేపట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నియామకాలపై కమిటీతో విచారణ చేపట్టాలి. – రాము, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఏజెన్సీలే భర్తీ చేస్తాయి.. అవసరాల మేరకు కొల్లాపూర్, గద్వాలతో పాటు పలువురు సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నాం. గురుకులాలు ఇతర సంస్థలలో నియామకాలు ఎలా చేపడుతున్నారో తెలియదు కానీ యూనివర్సిటీల్లో మాత్రం ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఏజెన్సీలే భర్తీ చేస్తాయి. అందుకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ అర్హత లేని వారిని తీసుకుంటే తొలగిస్తాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, రోస్టర్ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్, కొల్లాపూర్ పీజీ సెంటర్, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్, హెల్పర్, కేర్ టేకర్, వాచ్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత మంది.. మూడు నెలల క్రితం గద్వాల పీజీ సెంటర్లో బాలికలు, బాలుర హాస్టళ్లను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు హాస్టళ్లకు సంబంధించి ఇద్దరు కుక్, ఇద్దరు హెల్పర్, ఒక కేర్ టేకర్, 9 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అలాగే కొల్లాపూర్ పీజీ సెంటర్లో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది, కేర్టేకర్, కుక్, హెల్పర్ ఒక్కొక్కరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు మధ్యవర్తులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పీయూలో కేర్టేకర్లు, కుక్లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇందులో ఓ మహిళా అధికారి పలువురు సిబ్బందిని నియమించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలువురు సిబ్బందితో డబ్బులు తీసుకోవడంతోపాటు భవిష్యత్లో నియమించే పోస్టులకు సైతం ముందస్తు ఒప్పందాలను సదరు మహిళ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఏజెన్సీలో పనిచేసే మరో వ్యక్తి సైతం సిబ్బంది నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ వీసీ, రిజిస్ట్రార్లకు తెలిసినా వారికే మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. అన్ని విద్యాసంస్థలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల భర్తీని ప్రభుత్వం చేపడుతుంది. అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో పాటు యూనివర్సిటీలకు కూడా ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో స్కావెంజర్ పోస్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు సిబ్బందిని నియమించాలంటే తప్పకుండా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మెరిట్ మార్కులు, తదితర స్కిల్స్కు సంబంధించి సర్టిఫికెట్, రిజర్వేషన్ తదితర అంశాల ఆధారంగా రోస్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి పాయింట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అనంతరం ఎంపిక చేసిన వారిని ఏజెన్సీలకు అప్పగించి ఆర్డర్స్ ఇస్తారు. కానీ, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు కేవలం ఏజెన్సీలు తీసుకువచ్చి చూపించిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం కొసమెరుపు. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ద్వారా కూడా సీనియార్టీ ఆధారంగా కూడా భర్తీ చేసే విధానం ఉంది. ఉన్న వారికి జీతాలేవీ? పీయూలో పనిచేస్తున్న 42 మంది పార్ట్టైం లెక్చరర్లకు కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో వేతనాలు అందడం లేదు. పని ఒత్తిడి తగ్గించడంతో వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. దసరా, దీపావళి పండగలకు సైతం వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సెక్యూరిటీ సిబ్బందికి సైతం రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజుల క్రితం ఒకనెల వేతనం రూ.10 వేలు ఖాతాలో జమచేశారు. గతంలో రూ.11 వేలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.వెయ్యి తగ్గించి ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గద్వాల పీజీ సెంటర్లో 14, కొల్లాపూర్ పీజీ సెంటర్లో 11 మంది నియామకం యూనివర్సిటీలోనూ 9 మంది వరకు అవకాశం.. ఎలాంటి ప్రకటనలు, రోస్టర్ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు? -
ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పాన్గల్: వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపక బృందం విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్(డీఐఈఓ) అధికారి ఎర్ర అంజయ్య సూచించారు. సోమవారం పాన్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే ల్యాబ్లు, సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో వార్షిక పరీక్షలు ఉన్నందున సిలబస్సు త్వరగా పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. కళాశాలల్లో 90 రోజుల ప్రణాళికను పక్కగా అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడుతూ.. ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతాన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించి వార్షిక పరీక్షలు, విద్యార్థుల సన్నద్ధంపై పలు సూచనలు, సలహాలు అందించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ తిరుమల్రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు
పాన్గల్: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అకాల మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని పాన్గల్ బాలుర ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, బహుజన రచయిత చింతకుంట కిరణ్కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీతో సుమారుగా దశాబ్దానికి పైగా తనకు అనుబంధం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఆనాడు తాను పనిచేస్తున్న గోపాల్పేట ఉన్నత పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులతో ముచ్చటించారని గుర్తు చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 25న పాన్గల్ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చి విద్యార్థులు రాసిన ‘ఫ్లయింగ్ బర్డ్స్’ అనే కవితా సంకలనం పుస్తకావిష్కరణకు హాజరై విద్యార్థులతో, ఉపాధ్యా యులతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి అన్నారు. ప్రజలు మరువలేరు వనపర్తి టౌన్: అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహానీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ రాజారామ్ప్రకాశ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.అలివేలమ్మ, ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీను, కవులు గిరిరాజాచారి, గంధం నాగరాజు, మండ్ల దేవన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి టౌన్: విద్యార్థులు రాజ్యాంగం, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.రజని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, బాల్య వివాహాల నిషేధ చట్టం, మోటార్ వాహనాల చట్టాలు, నిర్భంద విద్యా హక్కు చట్టం, డ్రగ్, పోక్సో చట్టాల గురించి వివరించారు. ఆర్టికల్ 39ఏ ప్రకారం ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని, ఉచిత న్యాయ సలహాల కోసం ఎన్ఏఎల్ఎస్ఏ 15100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బాలయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి, కళాశాల ప్రధానోపాధ్యాయుడు జగన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణికి 8 ఫిర్యాదులు
వనపర్తి: పోలీసులు అప్రమత్తంగా ఉండి బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. అప్పుడే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 8 మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదులు అందించారు. ప్రతి ఫిర్యాదును అప్పటికప్పుడే సంబంధిత పోలీస్స్టేషన్ బదలాయించి, తక్షణమే చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్ మురళీగౌడ్, ప్రొఫెసర్లు శంకర్, కృష్ణతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, నాయకులు వెంకట్రాములు, ముకుందంగౌడ్, రాంరెడ్డి, దయాకర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, లక్ష్మన్నాయుడు, ప్రభాకర్గౌడ్, బాలకృష్ణనాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి క్రీడా పోటీలు వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల ఎంజేపీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 11 నుంచి 18 వరకు ఉమ్మడి జిల్లా అండర్ 14, 17, 19 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రశాంతి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ గురుకుల పాఠశాలు, 4 కళాశాల నుంచి 450 విద్యార్థులు పాల్గొంటారని ఆమె తెలిపారు. నిలకడగా రామన్పాడు నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జ లాశయం సోమవారం సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సమాంతరంగా వచ్చే నీటిని నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విని యోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
మధుమేహం వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై శ్రద్ధ
వనపర్తి: జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహం వ్యాధిగ్రస్తులందరికీ రెటినోస్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో రెటినోపతి వైద్య పరీక్షల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో జిల్లాలోని ప్రతి మధుమేహం వ్యక్తికి రెటినోపతి వైద్య పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వ్యాధి సోకి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని, కావున ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించాలని సూచించారు. గతేడాది జిల్లాలోని ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి, దాదాపు 20 వేల మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు తెలిపారు. వారందరికీ షెడ్యూల్డ్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇందులో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించాలన్నారు. అవసరమైన వారికి సరోజినీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆస్పత్రి సికింద్రాబాద్కు సిఫారసు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్రెడ్డి, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు, ఉప వైద్య ఆరోగ్య అధికారి డా.శ్రీనివాసులు, ఆప్తాల్మాలజీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 50 ఫిర్యాదులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యనాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరైన కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావానికి 50 దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
వర్షాలకు భయపడి..
పంట కోతలు పూర్తయిన తర్వాత వరిధాన్యం ఆరబోయడానికి అనువైన కల్లాలు లేవు. ఎప్పుడు వర్షం పడుతుందో అని భయం ఎక్కువైంది. ప్రభుత్వం బోనస్ ఇస్తుందోలేదో అనే సందేహలతో వచ్చిన కాడికి ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నాం. – రాజు, రైతు, అమరచింత అవగాహన కల్పిస్తున్నాం ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆయా క్లస్టర్ల వారీగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులతో పాటు మహిళ సంఘాల ద్వారా రైతులకు సూచనలు ఇస్తున్నాం. వరి కోతలు అక్కడక్కడ ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. – జగన్మోహన్, డీఎం -
దళారుల దోపిడీ
వరి కొనుగోలు కేంద్రాల్లో తూకాలు చేయడంలో నిర్లక్ష్యం ●అమరచింత: జిల్లాలో వరి కోతలు ప్రారంభించి 20 రోజులు దాటి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా ప్రభుత్వం తూకాలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా వారు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లిస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. కానీ ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కాంటా చేసిన వెంటనే రైతుకు డబ్బులు చెల్లిస్తుండడంతో గ్రామాల్లో వారి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఆయా మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారే తప్పా.. ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధర, బోనస్ చెల్లింపులపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 396 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినా.. ఇప్పటి వరకు కేవలం 178 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి 816 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో ధాన్యం కల్లాల్లోనే రోజుల తరబడి ఉండాల్సి రావడంతో వర్షాలు వస్తే చేతికందిన ధాన్యం పాడవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు తమ కమీషన్ ఏజెంట్లను గ్రామాలకు పంపుతూ వరి ధాన్యం తమ మిల్లులకే చేరే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైతులకు హమాలీ ఖర్చులు మిగులుతుండడంతో తాము పండించిన వరిధాన్యం ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. మద్దతు ధర రూ.2,380 ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయిస్తే క్వింటాల్కు రూ.2380 రైతులకు అందుతుంది. కానీ కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు రూ.2100 కే దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటి వరకు సర్కార్ సేకరించిన ధాన్యం 816 క్వింటాళ్ల్లే తప్పనిసరి పరిస్థితుల్లోప్రైవేట్కు మొగ్గు.. రూ.2,100 కే విక్రయించాల్సిన దుస్థితి యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నాలకు అందని బోనస్ -
అదిగో.. పులి
అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు. అతిపెద్ద టైగర్ రిజర్వు.. దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్ జోన్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్ ద్వారా సేకరించిన ప్లగ్ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు పెద్ద పులులకు పుట్టినిల్లు.. నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్–6 ఆడపులి, ఫరాహా ఎఫ్–6, తారా ఎఫ్–7, భౌరమ్మ ఎఫ్–18, ఎఫ్–26, ఎఫ్–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి. -
జూరాల రహదారికి మోక్షం
●అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి. అడుగుకో గుంత.. పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుకు రూ.30 లక్షలు మంజూరు బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు తీరనున్న ప్రయాణికుల కష్టాలు కుడి, ఎడమ కాల్వల పరిధిలో.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
పోలీస్స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన ఐజీ
అమరచింత: మండల కేంద్రంలోని దుంపాయికుంటలో పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను చూశారు. ప్రస్తుతం టెలిఫోన్ ఎక్స్ఛేంజీ భవనంలో కొనసాగుతుందని ఎస్ఐ స్వాతి ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. భవన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా తనవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం పీజేపీ నందిమళ్ల క్యాంపు కాలనీలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనులను పరిశీలించారు. నేడు అప్రెంటీస్షిప్ మేళా వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం అప్రెంటీస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మే ళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించాలి కొత్తకోట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించే వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోడ్లపై ఆరబోసి ఐదు రోజులైనా కాంటాలు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు రైతుల దగ్గర నుంచి తరుగు తీస్తామని చెబుతున్నారని, కొన్న ధాన్యానికి కచ్చితంగా పట్టి ఇవ్వాలని, నష్టం కలగకుండా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వం కొన్న సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ నేటి వరకు రైతుల ఖాతాలో జమ చేయలేదని, జిల్లాలోని 18 వేల మంది రైతులకు రూ.48 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే విడుదల చేయకుంటే పెద్దఎత్తున రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, హమాలీలు నారాయణ, శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, వెంకటయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీటీ రహదారి నిర్మించాలి..
నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల త్వరగా చేపట్టాలి.. ప్రాజెక్టు రహదారిపై నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. రూ.30 లక్షలతో చేపట్టే మరమ్మతు నాణ్యతగా పూర్తిచేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు కృషిచేయాలి. పీజేపీ ప్రాజెక్టు రహదారి మరమ్మతు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. – రాజు, మస్తీపురం రూ.30 లక్షలతో మరమ్మతు.. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – ఖాజా జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల -
కమీషన్ల కక్కుర్తి..!?
ట్రాక్టర్ల కొనుగోళ్లలో పుర అధికారుల లీలలు ● ప్రతిపాదనలు ఒకలా..వచ్చినవి మరోలా... ● స్వీపింగ్ మిషన్ బాగోతం మరువకముందే మరో ఉదంతం ● అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ● హడావుడిగా షోరూంకు తిప్పిపంపిన వైనం రూ.రెండు లక్షల తేడా.. విషయం బయటకు తెలియడంతో అధికారులు గుట్టుగా సదరు కంపెనీకి ట్రాక్టర్లను తిప్పి పంపించే ప్రయత్నం చేశారు. అధికారుల చర్యలు పుర సిబ్బంది, ప్రజల్లో నవ్వుల పాలయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఒక్కో ట్రాక్టర్ ధరలో రూ.2 లక్షల మేర తేడాతో ఉ న్న పాత సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను తె ప్పించి కమీషన్లు దండుకునేందుకు ప్రయత్నా లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వనపర్తి: స్థానిక పురపాలికలో 2021లో సుమారు రూ.65 లక్షలు వెచ్చించి స్వీపింగ్ మిషన్ కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి బాగోతం నాలుగేళ్లు గడిచినా కొలిక్కిరాలేదు. కనీసం నెలరోజులు కూడా వినియోగించని ఈ యంత్రాన్ని మరమ్మతుల పేరిట కొంతకాలంగా ఇతర ప్రాంతానికి తరలించారు. కమీషన్ల కోసం పాత యంత్రానికి రంగులద్ది కొత్తదిగా పేర్కొంటూ అధికార, పాలకవర్గం ప్రజాధనాన్ని వృథా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం మరువకముందే పుర అఽధికారులు ట్రాక్టర్ల కొనుగోళ్లలో మరో కమీషన్ల వ్యవహారానికి తెరతీయడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ● విస్తరిస్తున్న పట్టణానికి అనుగుణంగా చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం కలెక్టర్ అనుమతితో మూడు ట్రాక్టర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. ఆధునిక సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. కానీ దశాబ్దా కాలానికి ముందున్న ట్రాక్టర్లను తీసుకొచ్చి ఇవే కొత్తవి అంటూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో అధికారికంగా ప్రారంభింపజేశారు. తీరా పుర డ్రైవర్లు పరిశీలించగా.. ట్రాక్టర్లలోని డొల్లాతనం బయటపడింది. నెలరోజుల తర్వాత అంచనాల్లో పేర్కొన్న సాంకేతికత వేరు.. సదరు కంపెనీ నుంచి అధికారులు తెప్పించిన ట్రాక్టర్లు వేరు అన్న విషయం బయటకు పొక్కింది. పదేళ్ల కిందట కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు పంపిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ లేకుండా ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. విచారణ చేపడతాం.. ట్రాక్టర్ల కొనుగోలులో జరిగిన ఉదంతంపై పుర కమిషనర్తో చర్చించా.. పవర్ స్టీరింగ్ ట్రాక్టర్ల కొనుగోలుకే ప్రతిపాదనలు ఇచ్చాం. సాధారణ స్టీరింగ్తో వచ్చిన ట్రాక్టర్లని ఆలస్యంగా గుర్తించాం. ఇంకా చెల్లింపులు జరగలేదు. ఆయా ట్రాక్టర్లను తిరిగి షోరూంకు పంపించామని చెప్పారు. స్వీపింగ్ మిషన్ విషయంపై విచారణ చేపడతాం. – యాదయ్య, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ -
న్యాయసేవలు సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: పేదలకు ఉచిత న్యాయసాయం అందించడం, ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన పెంపొందించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి అన్నారు. న్యాయ సేవాధికార చట్టం 1987 అమలును స్మరించుకుంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని సూచన మేరకు ఆదివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజీయే రాజమార్గమంటూ కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత న్యాయసాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్, ఉచిత న్యాయ సలహా కేంద్రాలు, మధ్యవర్తిత్వం విధానాలతో తక్షణ పరిష్కారం పొందవచ్చని వివరించారు. జిల్లా ప్రజలు న్యాయసేవల ప్రయోజనాలను వినియోగించుకోవాలని, హక్కుల రక్షణ కోసం చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం, న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని.. ప్రతి ఒకరికి ఉచిత న్యాయసేవలు, న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్అదాలత్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం న్యాయసేవలపై తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సఖి కేంద్రం ప్రతినిధి కవిత, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘చేనేత’ సమస్యల పరిష్కారానికేమహాధర్నా
కొత్తకోట: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20న కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పొబ్బతి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీవర్స్కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు కాలేదన్నారు. 15 రోజుల్లో రుణమాఫీ నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోతే హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో ఉన్న చేనేత చేయూత నగదు బదిలీ పథకం స్థానంలో చేనేత భరోసా పథకాన్ని నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. నేతన్న బీమా పథకాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవ్వాలని నిర్ణయించడం సంతోషమేగాని.. మరణించిన నేత కార్మికులకు ఏడాది గడిచినా బీమా సొమ్ము అందకపోవడం విచారకమని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుపలేదని.. చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏడాది దాటిందని, తక్షణమే నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కల్పనకు ప్రభుత్వ రంగంలోని ఏకరూప దుస్తులకు మగ్గాలపై నేసిన వాటినే అందించాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు సాంబరి వెంకటస్వామి, పగిరాకుల రాములు, ఎంగలి రాజు, కొంగటి శ్రీనివాసులు, కొంగటి వెంకటయ్య, దిడ్డి శ్రీకాంత్, గోరంట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులోకి స్థానిక చరిత్ర..
మన ఊరు – మన చరిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఔత్సాహిక చరిత్ర పరిశోధకుల బృందం పలు పురాతన గ్రామాలను ఎంచుకుని క్షేత్రస్థాయిలో పరిశోధన చేపట్టింది. ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది.. గ్రామానికి ఉన్న చారిత్రక మూలాలేంటి, గ్రామ భౌగోళిక, నైసర్గిక స్వరూపం, పురాతన ఆలయాలు, కట్టడాలు, చెరువులు, కొండల వంటి వివరాలు తెలుసుకుని గ్రామ చరిత్రను తెలుసుకున్నారు. గ్రామంలోని పురాతన ఆలయాలు, గడీలు, నాటి చరిత్ర, ఆనాటి సామాజిక పరిస్థితులను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. -
సరళాసాగర్.. రికార్డు
ఒకే ఏడాది ఏడుసార్లు తెరుచుకున్న సైఫన్లు ● ప్రాజెక్టు చరిత్రలో 2025 ఓ మైలురాయి ● ఆరు దశాబ్దాల్లో తొలిసారి అంటున్న స్థానికులుసరళాసాగర్ జలాశయం వనపర్తి: సంస్థానాధీశుల కాలంలో అమెరికాలోని కాలిఫోర్నియా టెక్నాలజీని వినియోగించి ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు 2025 సంవత్సరంలో ఓ చరిత్ర సృష్టించిందని స్థానికులు, ఇంజినీర్లు భావిస్తున్నారు. వనపర్తి సంస్థానాన్ని పాలించిన రాణి సరళాదేవి జ్ఞాపకార్థం రాజారామేశ్వరరావు 1949లో సరళాసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1959లో పూర్తిచేసి ప్రారంభించిన విషయం పాఠకులకు విధితమే. ప్రాజెక్టు చరిత్రలో 2025 సంవత్సరం ఒకే వర్షాకాలంలో ఏడు పర్యాయాలు ఆటోమెటిక్ సైఫన్లు తెరుచుకొని దిగువకు నీరు ప్రవహించడం రికార్డు బ్రేక్గా చెప్పవచ్చు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడంతో ఊకచెట్టువాగు పొంగి ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్ మూడుసార్లు, అక్టోబర్ 24వ తేదీ వరకు మూడుసార్లు మొత్తంగా ఏడుసార్లు సైఫన్లు తెరుచుకొని దిగువకు వరద పారినట్లు ఇంజినీర్ ప్రమోద్ అధికారికంగా వెల్లడించారు. ● ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగిన సమయంలో మానవ రహితంగా గేట్లు తెరుచుకునే విధంగా ఆసియాలోనే ప్రథమంగా వనపర్తి సంస్థానాధీశులు తమ సంస్థానంలో నిర్మాణం చేయించారు. నిర్దేశిత స్థాయి మించి నీరు ప్రాజెక్టులోకి చేరిన వెంటనే ఆటోమెటిక్గా ప్రైమరీ, ఉడెన్ సైఫన్లు తెరుచుకొని దిగువకు నీరు పారడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దశాబ్దాల కాలం పాటు తెరుచుకొని ఈ ప్రాజెక్టు సైఫన్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పాలకులు ఈ ప్రాజెక్టుకు నీటి పాటుతో పాటు కేఎల్ఐ కాల్వతో అనుసంధానం చేయడంతో జలకళను సంతరించుకుంది. 2014 వరకు పదేళ్లకు ఓసారి తెరుచుకొనే సైఫన్లు ఇటీవల భారీ వర్షాలకు తరుచుగా తెరుచుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, మంత్రుల బృందం ప్రాజెక్టుని సందర్శించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సిఫారస్ చేశారు. ● ఆగస్టు 13 నుంచి 31వ తేదీ వరకు 18 రోజుల పాటు సైఫన్లు తెరుచుకుని గరిష్టంగా 14,760 క్యూసెక్కులు, కనిష్టంగా500 క్యూసెక్కులు దిగువకు నీరు పారింది. ● సెప్టెంబర్ 1 నుంచి ఏడో తేది వరకు, తిరిగి 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గరిష్టంగా 11,320, కనిష్టంగా 500 క్యూసెక్కులు దిగువకు పారింది. ● అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు, 24, 25వ తేదీల్లో గరిష్టంగా 7,380 క్యూసెక్కులు, కనిష్టంగా 500 క్యూసెక్కులుప్రాజెక్టు నుంచి దిగువకు నీరు పారింది. -
విద్యావ్యవస్థలో మార్పు అమరుల త్యాగఫలమే..
వనపర్తి విద్యావిభాగం: శాసీ్త్రయ విద్యా విధానం, సమాజ మార్పు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడుతూ అమరులైన విద్యార్థుల త్యాగం చిరస్మరణీయమని.. వారి పోరాటాల ఫలితంగానే నేటి విద్యావ్యవస్థలో కొంత మార్పు సాధ్యమైందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్కుమార్ అన్నారు. ఈ నెల 11 వరకు నిర్వహించే విద్యార్థి అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్లో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే హక్కును విద్యార్థుల నుండి దూరం చేసే దిశగా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రస్తుత విద్య విధానం కార్పొరేట్ల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిందని.. పేదలకు అందనంత దూరంగా ఉండటం గమనించదగిన విషయమని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోవడం, స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్లు ఆపడం, కమిటీల పేరిట కాలయాపన చేయడం ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక ధోరణికి నిదర్శనమని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యకు మతం రంగు పులుముతూ, విదేశీ కార్పొరేట్ యూనివర్సిటీలకు అనుమతులిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులపై విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. సంఘం నాయకులు స్వామి, అనిల్, అవినాష్, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. 0000667174-000001-MBNR ADSALES SP 7.00x6.00 MBNR ADSALES SPOT PAYMENT ACCOUNT -
చారిత్రక వైభవం..
నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు తెలకపల్లి మండలంలోని గడ్డంపల్లి గ్రామంలోని పురాతన గడి ఇది. మొదట్లో పాత గ్రామం మరోచోట ఉండేది. గ్రామంలో అంటువ్యాధి సోకి మరణాలు పెరిగాయి. దీంతో గ్రామంలో ఉన్నవారందరూ మరో చోటుకి తరలివెళ్లాలని ఓ గడ్డం సాధువు చెప్పాడట. గడ్డంతో ఉన్న సాధువు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన చోటుకి వెళ్లడంతో అది గడ్డంపల్లి అయింది. ఈ ఊరిలోని గడి కేంద్రంగా రెడ్డిరెడ్డి వంశస్తులు చుట్టుపక్కల 8 ఊళ్లతో కలిపి పాలించారు. వట్టెం కేంద్రంగా పాలించిన రెడ్డిరెడ్డి వంశస్తులు వీరి బంధువులే. ప్రస్తుతం ఈ గడి శిథిలావస్థకు చేరుకుంది. -
దళారులను నమ్మి మోసపోవద్దు
కొత్తకోట: వరి ధాన్యం విక్రయించడానికి కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన రోజే పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేసి తేమ శాతం పరిశీలించి టోకన్ నంబర్ల వారీగా కొనుగోలు చేయాలన్నారు. బరువు, తేమశాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. వాతావరణ మార్పుల దృష్ట్యా కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, ఇతర అధికారులు ఉన్నారు. -
జోనల్స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో గురువారం ప్రారంభమైన 11వ జోనల్స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. క్రీడపోటీల్లో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. గతేడాది నాలుగు రోజుల పాటు కొనసాగిన జోనల్స్థాయి క్రీడాపోటీలు ఈ ఏడాది మూడు రోజుల్లోనే ముగించారు. క్యారమ్స్లో గోపాల్పేట మొదటిస్థానంలో నిలువగా మన్ననూరు రెండోస్థానంలో నిలిచింది. చెస్లో కొత్తకోట మొదటి స్థానం, గోపాల్పేట రెండోస్ధానం.. వందమీటర్ల పరుగుపందెంలో పెద్దమందడి మొదటిస్థానంలో నిలువగా పెద్దమందడికి చెందిన విద్యార్థిని రెండోస్థానంలో నిలిచింది. 200 మీటర్ల పరుగు పందెంలో మొదటిస్థానం, రెండోస్థానంలో పెద్దమందడికి చెందిన విద్యార్థులే నిలవడం గమనార్హం. 400, 800, 1500, మూడు వేల మీటర్ల పరుగుపందెంలో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. డిస్కస్త్రో, షాట్పుట్, లాంగ్జంప్ పోటీల్లో పెద్దమందడి విద్యార్థినులు మొదటిస్థానంలో నిలిచారు. హైజంప్లో వంగూర్, వ్యక్తిగత చాంపియన్షిప్లో వెల్దండకు చెందిన కీర్తన ప్రతిభ కనబర్చారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఓవరాల్గా పెద్దమందడి 80 పాయింట్లు సాధించింది. శనివారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీసీఓ ప్రమోద, ఎంఈఓ చంద్రశేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాపోటీల నిర్వహణకు సహకరించిన వారికి ప్రిన్సిపాల్ ఆరోగ్యం ధన్యవాదములు తెలిపారు. -
90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
వనపర్తి రూరల్: ఇంటర్మీడియట్ కళాశాలల్లో 90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య కోరారు. గురువారం పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేసి రికార్డులు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే ల్యాబ్ల వివరాలు, సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిలబస్ను త్వరగా పూర్తి చేసి ఫిబ్రవరిలో జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని అధ్యాపకులను ఆదేశించారు. అంతకుముందు తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని.. ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతాన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తారన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా బాగా చదవాలని సూచించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచినందుకు అధ్యాపకులను అభినందించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ఓబుల్రెడ్డి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. -
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వనపర్తి: గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని.. సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ పి.కృష్ణ గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ నిర్వహించగా.. డీపీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించడమే కాకుండా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామని.. చట్టాలపై అవగాహన కలిగి ఉండి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. లైన్ డిపార్ట్మెంట్లు అయిన పంచాయతీరాజ్, సంక్షేమ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యశాఖల నుంచి 35 మంది గ్రామస్థాయి సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ● ప్రారంభమైన జోనల్స్థాయి క్రీడాపోటీలు గోపాల్పేట: క్రీడలతో మానసికోల్లాసం పెంపొందడమేగాక ఏకాగ్రత పెరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 11వ జోనల్స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ, క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి వనాలపర్తి కాదని, క్రీడాపర్తిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యంత ప్రతిభ కనబర్చి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఇటీవల మహిళా క్రికెటర్లు వరల్డ్కప్ సాధించారని గుర్తుచేసి.. అంతటి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా క్రీడలపై ఆసక్తి ఉన్నవారని, ఆయనకు ఫుట్బాల్పై పట్టుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఓటమిని పాఠంగా తీసుకొని మళ్లీ సాధన చేసి విజయాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వెల్దండ – తెల్కపల్లి జట్ల కబడ్డీ పోటీని ప్రారంభించారు. పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్పేట, పెద్దమందడి, కొత్తకోట.. నాగర్కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెల్కపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల క్రీడాకారులు 680 మంది పాల్గొన్నారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ తదితర పది విభాగాల్లో క్రీడా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, అచ్చుతరామారావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన వేరుశనగ రైతులు
● రాయితీ విత్తనాలు పంపిణీ చేయాలంటూ రాస్తారోకో పాన్గల్: రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యయాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలు శాగాపూర్తో పాటు మండలంలోని చాలా గ్రామాల రైతులకు అందలేదన్నారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు కొందరు నాయకులకే పెద్ద మొత్తంలో అందించి అర్హులైన చాలా మంది రైతులను విస్మరించారని ఆరోపించారు. వేరుశనగ సాగు చేసే రైతులకే విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా.. వరి సాగు చేసిన వారికి, అనర్హులకు పంపిణీ చేసి అర్హులకు ఇవ్వలేదన్నారు. విత్తనాల పంపిణీపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించడంతో వనపర్తి–కొల్లాపూర్ రహదారికి ఇరువైపులా బస్సులు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో పాటు మద్దతు తెలిపిన నాయకులను ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వినలేదు. దీంతో పోలీసులు ఏఓ మణిచందర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొని మాట్లాడారు. ఇప్పటి వరకు మండలానికి వచ్చిన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని.. ఇంకా విత్తనాలు అందని రైతుల విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని, మంజూరైతే పంపిణీ చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ● మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం సమీపంలో ఉన్న గోదాంలో నిల్వచేసిన రాయితీ వేరుశనగ విత్తన బస్తాలను కొందరు రాత్రిళ్లు వాహనాల్లో తరలించారని, వాటికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. సమగ్ర విచారణ జరపాలని రైతులు, మద్దతు తెలిపిన నాయకులు ఏఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏఓ మాట్లాడుతూ.. గోదాంలో రాయితీ విత్తనాలతో పాటు ఇక్రిశాట్ నుంచి వచ్చిన 50 శాతం రాయితీ విత్తన బస్తాలు కూడా ఉన్నాయన్నారు. ఇక్రిశాట్ నుంచి వచ్చిన విత్తన బస్తాలనే తరలించారన్నారు. -
బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన
వనపర్తిటౌన్: ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ గురువారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ సమీపంలో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గోపాలకృష్ణ, ఆది, రమేష్, గణేష్, వీరయ్య, యశ్వంత్ మాట్లాడుతూ.. పాలకులకు ఓట్లు, సీట్ల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్పై లేదని మండిపడ్డారు. ఏళ్లుగా స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయని, దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్... రెండేళ్లవుతున్నా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.8,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో విద్యార్థులందరినీ ఏకం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ● విద్యార్థుల రాస్తారోకోతో హైదరాబాద్, మహబూబ్నగర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ిపీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్ నాయకులు వంశీ, దినేష్, సూర్యవంశం గిరి, అరవింద్, బన్ని, వీరన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆశలకు గండి..
తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాల్వలు సాక్షి, నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వల నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్కు నోచుకోలేదు. ఫలితంగా నీటి ప్రవాహానికి తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్గల్ మండలాల్లో తరచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడుగడునా గండ్లతో నష్టం.. కేఎల్ఐ కాల్వకు ఒకే చోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్గల్, రేవల్లి మండలాల్లోని కేఎల్ఐ కాల్వలతో పాటు బీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్గల్ మండలంలోని దావాజీపల్లి, బండపల్లి, శాగాపూర్, జమ్మాపూర్, మందాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు తరచుగా నీటమునుగుతున్నాయి. నిధులు లేక నిర్వహణ గాలికి.. కేఎల్ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతులు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టలేదు. కేఎల్ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. భారీ వర్షాలకు ఉధృతంగా నీటి ప్రవాహం ఏటా ఏదో ఒక చోట తెగుతున్న కాల్వలు సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం పదేళ్లుగా ఇదే తీరు.. నిర్వహణ పట్టని అధికారులు -
నేర రహిత సమాజమే ధ్యేయం
పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పాఠశాలల క్రీడాకారులు వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టిగా విధులు నిర్వహించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించి పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్ కేసులు, ఆయా కేసుల విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో విచారణ ఏ విధంగా చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అదృశ్యం, దొంగతనం కేసుల దర్యాప్తులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదని.. ముందు నుంచే వాటిని అరికట్టే విధానాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని సూచించారు. ఠాణాల్లో రిసెప్షన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించి పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంపొందించే చూడాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డుల నిర్వహణ పక్కాగా చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
వనపర్తి రూరల్: పెబ్బేరులో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్యార్డులో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు కూడా సమయం దొరకలేదని.. ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనులపండువగా ఆదిదంపతుల కల్యాణంకొత్తకోట రూరల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్త కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ సంకల్ప, మాంగళ్య పూజలు నిర్వహించగా.. భక్తులు తలంబ్రాలు పోసి అమ్మవారికి వడి బియ్యం పోశారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ జట్ల ఎంపిక కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈమేరకు ఎంపికలు చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిది నుంచి 180 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన 16 మంది బాలురు, 16 బాలికలను ఉమ్మడి జిల్లా జట్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అంతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు సాయినాథ్ , రామకృష్ణారెడ్డి , రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
విస్తరణ.. సాగేనా?
జిల్లాకేంద్రంలో నత్తనడకన కర్నూలు రహదారి పనులు ● రెండేళ్లుగా కొనసాగుతున్న వైనం ● హడావుడి తప్ప.. ముందుకుపడని అడుగులు ● టీడీఆర్ ఊసే మరిచిన అధికారులు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణపై స్పష్టత కొరవడింది. రెండేళ్లుగా విస్తరణ కొనసాగుతోందని చెప్పడం తప్పా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రహదారి విస్తరణలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే బాధితులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని.. పనులు మాత్రమే మిగిలాయని ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు హడావుడి చేశారు. కర్నూలు రహదారి వైపు వివేకానంద మార్గ్ నుంచి రామాలయం వరకు సుమారు 165 నివాసాలు ఉండగా.. వాటిలో కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ వ్యాపారవేత్త ఎమ్మెల్యే సూచన మేరకు బస్టాండ్ మార్గంలోని తన వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే విస్తరణ పనులు ఉపందుకున్నాయని అందరూ భావించినా.. ప్రధానంగా సమస్య ఉన్న ప్రాంతంలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అంతేగాకుండా గాంధీచౌక్ మలుపు నుంచి పాతబజార్ మార్గంలో రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న పలు ఆలయాలను తొలగించి పునః నిర్మించారు. మరో ఆలయం అలాగే ఉండటంతో పాటు గత ప్రభుత్వ హయంలో కొద్దిగా దెబ్బతిన్న ప్రహరీని సరిచేసి యధావిధిగా మార్చడంతో ఈ ప్రాంతంలో విస్తరణ ఉంటుందా? లేదా.. ఆలయం వరకు అలాగే వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు యూకో బ్యాంక్ మలుపు నుంచి చల్మారెడ్డి ఆస్పత్రి వరకు రెండేళ్ల కిందట రహదారి విస్తరణ పూర్తయినా.. నేటికీ డివైడర్లను నిర్మించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ మార్గంలో కలెక్టర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇతర అధికారులు నిత్యం ప్రయాణిస్తున్నా డివైడర్ల ఏర్పాటుపై ఎందుకు చొరవ చూపడం లేదోనని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. పుర కార్యాలయం మలుపు నుంచి చౌడేశ్వరి ఆలయం వరకు పలు ఇళ్లను తొలగించిన అధికారులు రహదారిని మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం లేదు. మరికొన్ని నివాసాలు అలాగే ఉండటం.. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వివేకానంద విగ్రహం నుంచి బస్టాండ్ ప్రాంగణం వరకు పలు ఇళ్లు పుర స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని గతంలో పుర, ఆర్అండ్బీ అధికారులు తేల్చడంతో పాటు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని పట్టుబట్టిన వ్యాపారులతో అధికారులు, ప్రజాప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో విస్తరణకు మార్గం సుగమమైందని భావించినా.. నేటికీ వివేకానంద విగ్రహం నుంచి బస్టాండ్ వరకు విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. రహదారి విస్తరణ బాధితులు నష్టపరిహారం ఇవ్వాలని పట్టుబట్టగా అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) అనేది తెరపైకి తెచ్చారు. ఆస్తి కోల్పోయిన యజమానికి డబ్బులకు బదులు టీడీఆర్ను జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రాన్ని బాధితులు స్వయంగా వినియోగించుకోవడం లేదా అమ్ముకోవడం చేసుకోవచ్చు. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క టీడీఆర్ కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఈ విధానంపై బాధితులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు విస్తరణ బాధితులకు ప్లాట్ల స్థలాలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై కూడా ఏ మాత్రం స్పష్టత లేదు. విస్తరణపై అన్ని శాఖల అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారే తప్పా సమగ్రంగా సమాధానమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నష్టం తక్కువగా ఉండే మర్రికుంట నుంచి రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు అధికారులు, అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఫుట్పాత్పై ఉన్న దుకాణాలు, రహదారికి అడ్డుగా ఉన్న చిన్నపాటి నివాసాలను తొలగించి ఇరువైపుల డ్రైనేజీలు నిర్మించారు. ఐదు నెలలుగా అర కిలోమీటర్ పరిధిలోనే పనులు కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. విస్తరణ పూర్తయిన మార్గాల్లో రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కలెక్టరేట్, మర్రికుంట మార్గంలో విస్తరణ పనులతో పాటు డ్రైనేజీ పనులు చేపడుతున్నాం. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కాస్త జాప్యం జరిగింది. పట్టణాభివృద్ధి కోసం అందరి సహకారంతో విస్తరణ పనులు చేపడతాం. టీడీఆర్ కోసం ప్రజావాణికి బాధితులు వచ్చారు. దీనిపై కూడా అవగాహన కల్పిస్తాం. – యాదయ్య, పుర ప్రత్యేక అధికారి -
చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్లో వేస్తున్నారు. దీంతో సీజన్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేపలు అంతగా పెరగడం లేదు. ప్రతిసారి ఇలాగే చేస్తుండటంతో మాకు మేలు జరగకపోవడంతోపాటు సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలం ప్రారంభంలోనే చేపపిల్లలు చెరువుల్లో వదలితేనే ప్రయోజనం ఉంటుంది. – ఇప్పలి జనార్దన్, మత్స్యకారుడు, కొనగట్టుపల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి చేప విత్తనాలు అప్పుడే వేయాలి. ఆ సమయంలో వేస్తే ఇప్పటి వరకు చేప బరువు 250 గ్రాముల వరకు పెరిగేది. ఆలస్యంగా వేయడం వల్ల కొన్ని చెరువులలో నీరు తగ్గి.. చేప బరువు పెరగదు. దీని వల్ల మత్స్యకారులకు ఎలాంటి లాభం ఉండదు. ఈసారి ఇప్పటి వరకు చేప విత్తనాలు పంపిణీ చేయలేదు. – అల్లోజి, జిల్లా ఉపాధ్యక్షుడు, మత్స్య సహకార సంఘం, నాగర్కర్నూల్ ● -
ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
ఎర్రవల్లి: కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు బీచుపల్లికి కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం ఉపవాసంతో 80 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు దత్తుస్వామి, భువనచంద్రాచార్యులు వేదమంత్రాల నడుమ సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు గద్వాలకు చెందిన రిటైర్డ్ టీచర్ రామ తులశమ్మ కుటుంబ సభ్యులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు ఉన్నారు. -
చెరువుకు చేరినా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. రెండేళ్లుగా ఆలస్యంగానే.. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించగా.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఈ పథకాన్ని కొనసాగించింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో బొచ్చ, బంగారు తీగ, రౌట, మోస్ వంటి రకాల చేప పిల్లలను వదిలారు. ఈసారి కూడా ప్రభుత్వం చేప విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఎప్పుడూ ఏప్రిల్లో టెండర్లు ప్రారంభించి వర్షాకాలంలోగా చేపల పంపిణీని పూర్తిచేసేవారు. కానీ, రెండేళ్లుగా పలు కారణాలతో ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతూ.. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారు. ఈసారి అదే తీరు.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని 4,225 నీటి వనరుల్లో రూ.11.80 కోట్ల వ్యయంతో 10.63 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 863 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులు, లైసెన్స్దారులు మొత్తం 66,808 మందితోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కానీ, ఇప్పటి వరకు పదిశాతం కూడా లక్ష్యాన్ని చేరలేదు. మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో చేపపిల్లల పంపిణీ ప్రారంభం కాగా.. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఇక్కడ మంత్రి చేతులమీదుగా ప్రారంభించాలని వేచిచూస్తుండడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని ‘అధికార’ యంత్రాంగం చెబుతున్నా.. గతేడాదిలాగే కోత తప్పదని మత్స్యకార సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68, 000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్ చివరలో మొదలుపెట్టి నవంబర్ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు. చివరికి నిర్దేశిత లక్ష్యంలోనూ సగం మేర కుదింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా ఇదే తంతు కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్ ‘అధికార’ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం -
దీపం.. దైవ స్వరూపం
వనపర్తి అయ్యప్ప ఆలయంలో దీపోత్సవం పరమ పవిత్రమైన కార్తీక మాసం.. పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలోని ఆలయాలు దీపకాంతులతో వెలిగిపోయాయి. ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు.. రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. భక్తులు వివిధ ఆకారాల్లో ప్రమిదలను అలంకరించి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కల్యాణ క్రతువును తిలకించారు. ఆత్మకూర్లో పల్లకీసేవ, జ్వాలా తోరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ పెబ్బేరు మండలం గుమ్మడం సమీపంలో ఉన్న కృష్ణానదిలో దీపాలు వదులుతున్న మహిళలు – మరిన్ని 9 లోu -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వనపర్తి: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు సినీ ఫక్కీలో పథకం రచించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. వనపర్తి పట్టణంలోని గణేశ్నగర్ కాలనీకి చెందిన కురుమూర్తి, కె.నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా నాగమణి ఎన్.శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ బంధానికి కురుమూర్తి అడ్డొస్తున్నాడని.. ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. అందులో భాగంగా గతనెల 25న ఇంట్లోనే అతడికి మద్యం తాగించారు. ఆ తర్వాత తాడును గొంతుకు బిగించి హతమార్చారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం సమీపంలోని కృష్ణానది వద్దకు చేరుకొని మృతదేహాన్ని నీటిలో పడేశారు. ఈ క్రమంలో కురుమూర్తి కనిపించడం లేదని అతడి సోదరుడు గతనెల 28న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా, ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణానదిలో మూడు రోజులపాటు గాలించి శవాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో హత్య కేసును ఛేదించి.. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. 72 గంటల్లో హత్య కేసును ఛేదించిన సీఐ కృష్ణతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్స్ను ఎస్పీ అభినందించారు. -
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
గోపాల్పేట: బాలల హక్కులు పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన గ్రామ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని.. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగ పిల్లాడికి 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గృహహింస పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే 14 ఏళ్లలోపు చిన్నారులను పాఠశాలలకు పంపించాలని చెప్పారు. మధ్యలో చదువు మానిన విద్యార్థులను గుర్తిస్తే వెంటనే పాఠశాలలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అయేషా అంజన్, బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ లక్ష్మమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఈదమ్మ, రాందేవ్రెడ్డి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
అమృత్ 2.0.. ఆలస్యం
జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు అమరచింత: పుర ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి చేపడుతున్న మిషన్ 2.0 పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు చేసి జనాభా ప్రాతిపదికన పైప్లైన్లు, ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నారు. పైప్లైన్ ఏర్పాటు సమయంలో స్థానిక వాటర్మెన్ల సమన్వయం లేకపోవడంతో గుంతలు తవ్వుతుండగా పాత పైప్లైన్లు దెబ్బతింటున్నాయి. అమరచింత పురపాలికలోని బీసీకాలనీలో ఉన్న పైప్లైన్పైనే కొత్తది వేయడం ఏమిటని మిషన్ 2.0 సిబ్బందిని కాలనీవాసులు నిలదీయడంతో తిరిగి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగిలిన పురపాలికల్లోనూ తాగునీటి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పురపాలికల వారీగా ఇలా.. వనపర్తి పురపాలికలో మిషన్ 2.0 పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.72.36 కోట్లు మంజూరు చేసింది. వీటితో 5300 కేఎల్ సామర్థ్యం గల 8 ట్యాంకులు, 200 కేఎల్ల సామర్థ్యం గల సంప్ నిర్మించాల్సి ఉంది. పట్టణంలో 60 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేసి 48 వేల ఇళ్లకు తాగునీరు అందించాల్సి ఉంది. ● కొత్తకోట పురపాలికకు రూ.14.95 కోట్లు మంజూరయ్యాయి. వీటితో 2,100 కేఎల్ సామర్థ్యం గల 2 ట్యాంకులు, 20 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తిచేసి 1,260 ఇళ్లకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ● పెబ్బేరు పురపాలికకు రూ.10.76 కోట్లు మంజూరు కాగా 21 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ట్యాంకులు, 25 కిలోమీటర్ల పైప్లైన్ వేసి 1,900 ఇళ్లకు నీటిని అందించాలి. ● ఆత్మకూర్ పురపాలికకు రూ.17.22 కోట్లు మంజూరు కావడంతో 25 లక్షల సామర్థ్యంగల రెండు నీటి ట్యాంకులు, 16 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తిచేసి వెయ్యి ఇళ్లకు నీటివసతి కల్పించాలి. ● అమరచింత పురపాలికలో 11 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు నీటి ట్యాంకులు, 16 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తిచేసి వెయ్యి ఇళ్లకు శుద్ధజలం అందించేందుకు రూ.13 కోట్లు మంజూరు చేశారు. అమరచింతలో కొనసాగుతున్నపైప్లైన్ పనులు గతేడాది ఆగస్టులో ప్రారంభమైన పనులు నేటికీ పూర్తికాని పైప్లైన్లు పెబ్బేరు, కొత్తకోటలో మరీ ఆలస్యం.. గడువులోగా పూర్తయ్యేనా? -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అమరచింత: రైతులు ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగల్కడ్మూర్లో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులకు ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం రైతులు పండించిన ఆయిల్పాం విత్తనాలను జిల్లాలోనే విక్రయించేలా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎకరా సాగుతో ఏడాదికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. తక్కువ నీటితో పాటు తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పారు. అదేవిధంగా మామిడి రైతులకు రాయితీ ప్లాస్టిక్ కవర్ల గురించి తెలియజేశారు. పత్తిని సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ అరవింద్, మండల ఉద్యా న అధికారి సతీష్, ఏఈఓ నందకిషోర్ పాల్గొన్నారు. -
ప్రయాణ ప్రాంగణం.. అధ్వానం
● పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం ● దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పట్టించుకోని పుర, ఆర్టీసీ అధికారులు కొత్తకోట రూరల్: జాతీయ రహదారి సమీపంలో రోజు రద్దీగా ఉండే కొత్తకోట ప్రయాణ ప్రాంగణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. చెత్తా చెదారం, మురుగు పేరుకుపోయినా శుభ్రం చేయించేందుకు అటు ఆర్టీసీ, ఇటు పుర అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అపరిశుభ్రతతో రోగాలబారిన పడతారని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. ఇక్కడి అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులతో పాటు పట్టణవాసులు ఒంటికి, రెంటికి ప్రాంగణంలో ఉన్న ముళ్లపొదల చాటుకు వెళ్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు, పరిసరాల్లోని నివాస ప్రాంతాల వారు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● కొత్తకోట బస్టాండ్ను 1976, మార్చి 16న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు శంకుస్థాపన చేయగా.. 1978, ఆగస్టు 1న ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంగణం నుంచి నిత్యం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బస్సులు 150 నుంచి 200 బస్సుల వరకు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం సుమారు 5 వేల మందికిపైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. ● గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు ఓ రేకుల షెడ్ నిర్మించారు. షెడ్లో విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతకు గురవుతున్నారు. షెడ్ పక్కనే ఖాళీ స్థలం ఉండటంతో ప్రయాణికులతో పాటు పట్టణవాసులు ఒంటికి, రెంటికి వెళ్తున్నారు. బస్టాండ్ ప్రాంగణ సమీపం, ప్రాంగణంలోని దుకాణాల వెనుకభాగం వృథా ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులతో నిండి ఈగ, దోమలకు నిలయంగా మారింది. ఓ పక్క దుర్వాసన, మరోపక్క దోమల బాధతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా క్యాంటీన్ మూతబడటంతో టిఫిన్స్, భోజనానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగునీటి వసతి సైతం కల్పించకపోవడంతో ఆర్టీసీ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలకు నిలయం..
కొత్తకోట బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రాంగణం పక్కనే ముళ్లపొదలు ఏపుగా పెరగడంతో పట్టణవాసులతో పాటు ప్రయాణికులు మూత్ర విసర్జన చేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. బస్టాండ్లో కూర్చోవాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బస్టాండ్ను బాగు చేయాలి. – చాపల భాస్కర్, పీఏసీఎస్ డైరెక్టర్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.. బస్టాండ్లో క్యాంటీన్ లేకపోవడంతో దూరప్రాంతా ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. స్వ చ్ఛమైన తాగునీరు అని బోర్డుపై రాసి ఉన్నా.. అందుబాటులో లేకపోవడం అధికారుల పనితీరు కు నిదర్శనం. బస్టాండ్లో నెలకొన్న సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. – అయ్యన్న, పట్టణవాసి స్వచ్ఛతకు కృషి చేస్తాం.. స్థానికులతో పాటు ప్రయాణికులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. బస్టాండ్ను ఇంటి మాదిరిగా చూసుకోవాలి. వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు చెత్తకుండీల్లోనే వేయాలి. మరుగుదొడ్లు ఉన్నా వాటిని వినియోగించడం లేదు. ఎవరికీ వారు పరిశుభ్రతపై దృష్టి సారించాలి. సాధ్యమైనంత వరకు బస్టాండ్ను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తాం. – దేవేందర్గౌడ్, డిపో మేనేజర్, వనపర్తి ● -
సకాలంలో పూర్తయ్యేనా..?
జిల్లాలో గతేడాది ఆగష్టులో అమృత్ 2.0 తాగునీటి పనులు ప్రారంభించారు. అమరచింత, ఆత్మకూర్, వనపర్తి పురపాలికల్లో పనులు ప్రారంభించిన అధికారులు.. ట్యాంకుల నిర్మాణానికి స్థల కేటాయింపులో ఆలస్యం కావడంతో కొత్తకోట, పెబ్బేరులో ఆలస్యమైంది. రెండునెలల కిందట ఆయా పురపాలికల్లో సైతం పనులు మొదలయ్యాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సకాలంలో పనులు పూర్తిచేసి ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని వెల్లడిస్తున్నారు. పనులు చేపడుతున్న కంపెనీకి బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నా.. పనులు మాత్రం చేపడుతున్నట్లు వివరించారు. -
గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు
వనపర్తి రూరల్: గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని జిల్లా వైద్యాధికారి ఆలె శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ‘మాత, శిశు సంరక్షణ.. పోషకాహారంశ్రీపై జిల్లా మాత, శిశు సంరక్షణ అధికారి డా. మంజుల ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు సమయానికి పరీక్షలు చేయించుకుంటే రక్తహీనత, పోషక లోపాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఏఎన్ఎంలు వారిలో పోషక లోపాలు గుర్తించి సమగ్ర సేవలు అందించి రక్తహీనత, పోషక సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య పర్యవేక్షణ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మోతాదు, ప్రసవ అనంతర సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నర్సింహారావు, డేటా మేనేజర్ వెంకటకృష్ణారెడ్డి, గిరిజ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన అవసరం
వనపర్తి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని, ఏవైనా సమస్యలుంటే వారు ప్రజావాణిలో కూడా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల చివరి వారంలో మండలాల్లో నిర్వహించే సివిల్ రైట్స్ డేలో పాల్గొనాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలు చదువుకు దూరం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆయా వర్గాలపై దాడులు జరిగితే సకాలంలో న్యాయం జరిగేలా, పరిహారం అందేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సభ్యులకు సూచించారు. అంటరానితనం ప్రదర్శించడం, దాడులు చేస్తే పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేయాలన్నారు. హక్కులు చట్టాలపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ అధికారి మల్లికార్జున్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బోజరాజు, వీరప్ప, విశ్వంబాబు, వెంకటేష్, వెంకటేష్ గౌడ్, ఖమర్ పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
● ప్రోత్సహిస్తే కేసుల నమోదు ● కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్తకోట రూరల్: బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం 18 ఏళ్లు నిండని యువతులకు పెళ్లి చేయడం నేరమని.. వాటిని నివారించే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం పరిధిలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు శిక్షార్హులన్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాల కట్టడిలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ఫీ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రెండేళ్లుగా ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు కాకపోవడం అభినందనీయమని కొనియాడారు. బాలికలను బాగా చదివిస్తే జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను అప్పటికప్పుడు సంబంధిత స్టేషన్లకు కేటాయించి, వెంటనే చర్యలు తీసుకొని బాధితుల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయానికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పార్కింగ్ షెడ్ నిర్మాణం పనుల పరిశీలన జిల్లా సాయుధ దళ పోలీస్ కార్యాలయం పక్కన పోలీసు వాహనాలు నిలిపేందుకు నిర్మిస్తున్న పార్కింగ్ షెడ్ పనులను ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనాల పార్కింగ్, భద్రతా ప్రమాణాలు, వర్షాకాలంలో రక్షణపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది సమయానికి, సమర్థవంతంగా ప్రజలకు సేవ చేయాలంటే వారికి మౌలిక వసతులు ఉండాలన్నారు. పోలీస్ శాఖ అభివృద్ధి అంటే ప్రజా సేవకు బలమైన పునాదని, సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్చుకున్నప్పుడే భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మై భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం మూడు రోజులుగా నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బీవీ రాంనరేష్యాదవ్, అసోసియేట్ ప్రొఫెసర్, సీహెచ్ ఆశాజ్యోతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజేందర్ గౌడ్, ప్రోగ్రాం వలంటరీ అవినాష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మాదక ద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం’
వనపర్తి: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత వనపర్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న గంజాయి రవాణా, గంజాయి సాగు కేసులు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారి కేసులపై డీఎస్పీ వెంకటేశ్వర్లుతో వివరాలు సేకరించారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు. స్పందించిన అదనపు కలెక్టర్ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం, వినియోగించడం జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సాగుపై వ్యవసాయ విస్తరణాధికారుల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు అనుమానం ఉన్న ప్రతి చోట ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాలతో తనిఖీలు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని కల్లు దుకాణాలపై నిఘా ఉంచాలని, మైనర్లకు చిన్న పిల్లలకు కల్లు ఇవ్వకుండా దుకాణదారులకు సూచన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్తో కలిసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పాన్గల్: తుపాను దాటికి వరి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పాన్గల్, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, వెంగళాయిపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను సీపీఐ బృందం ఆధ్వర్యంలో పరిశీలించారు. వరి పంటలు చేతికందే దశలో తుపాను వర్షాలతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. గత యాసంగిలో రైతులు విక్రయించిన సన్న ధాన్యానికి ఇప్పటికీ రూ.500 బోనస్ పడలేదన్నారు. రమేష్, డంగు కుర్మయ్య, బాలస్వామి, పెంటయ్య, రైతులు పాల్గొన్నారు. ప్రైవేటు కళాశాలల బంద్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఉన్నత విద్య అందిస్తున్న పలు ప్రైవేటు కళాశాలలు సోమవారం మూతబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలను రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఈ మేరకు డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలల యాజమాన్యాలు జిల్లాకేంద్రంలో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. పీయూ పరిధిలో మొత్తం 65 ఉన్నత విద్య అందిస్తున్న కళాశాలలు ఉండగా.. వీటితోపాటు రెండు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారు కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెల 8 నుంచి పీయూ పరిధిలోని పలు కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. బంద్ నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది. ● ఉమ్మడి జిల్లాలో మూతబడిన 65 డిగ్రీ, పీజీ, ఫార్మ కాలేజీలు ● పీయూ వీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు -
నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ బ్యాక్వాటర్తో పంట నష్టానికి గురైన మార్లతండా, కేశతండా గ్రామస్తులకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మరోసారి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ సురభి, డీఐజీ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సీఈలు విజయ్కుమార్రెడ్డి, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసులు చేధిస్తున్నాం..
గతంతో పోల్చితే.. మిస్సింగ్ కేసులు పెరిగినా ఆశించిన స్థాయిలోనే వాటిని చేధిస్తున్నాం. ఇటీవల టౌన్ పీఎస్లో నమోదు చేసిన కురుమూర్తి మిస్సింగ్ కేసులో భార్య ప్రియుడితో కలిసి ఇంట్లోనే చంపి శ్రీశైలం వద్ద కృష్ణానదిలో పడేసినట్లు నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని తమ సిబ్బంది గుర్తించారు. రూరల్ పీఎస్లో నమోదైన ఎద్దులగేరి ప్రాంతానికి చెందిన వ్యక్తి కోసం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఆచూకీ లభించలేదు. దర్యాప్తు చేస్తున్నాం. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. – వెంకటేశ్వర్రావు, డీఎస్పీ, వనపర్తి ● -
15 న ప్రత్యేక లోక్ అదాలత్
వనపర్తిటౌన్: కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. సోమవారం జిల్లా కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జిలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్, చెక్బౌన్స్, మెయింటెనెన్స్, గృహహింస చట్టం, ప్రమాద బీమా క్లెయిమ్, సివిల్, వైవాహిక, వినియోగదారుల, ఆస్తి విభజన, భూమి, కుటుంబ వివాదాలు రాజీకి పరిష్కారానికి యోగ్యమైన క్రిమినల్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.కళార్చన, జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ‘కార్మిక హక్కులు కాలరాయొద్దు’ అమరచింత: కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం ఆరోపించారు. మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి 24 వరకు శ్రామిక ఏకతా మహాసంఘ్, టీయూసీఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని పుణె పట్టణంలో అంతర్జాతీయ ఆటోమేటివ్ వర్కర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో హనుమంతు, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు, కురుమన్న, ప్రేమరత్నం, మస్లమని ఉన్నారు. అతిథి అధ్యాపక పోస్టుకు ఇంటర్వ్యూ వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారులోని ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ బీఎస్సీ (హాన్స్) వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ ఎకనామిక్స్ బోధించేందుకు ఒక అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్స్పాల్ ప్రశాంతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పీహెచ్డీ, ఎన్ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటు దని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ ధ్రువపత్రాలు, 2 పాస్ఫొటోలు, పూర్తి బయోడేటా తీసుకొని ఈ నెల 6న పెద్దగూడెం శివారులోని హాన్స్ వ్యవసాయ కళాశాలల్లో నిర్వహించే ఇంటర్ూయ్వలకు హాజరు కావాలని కోరారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండల పరిధిలోని రామన్పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం1,021 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, సమాంతరంగా 195 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రాసాద్ తెలిపారు. -
ఖర్చులు పెరిగాయి..
ఈసారి వరి సాగు ఖర్చులు అధికంగా పెరిగాయి. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండటం.. సకాలంలో అందక ఆశించినస్థాయిలో దిగుబడి చేతికందుతుందో లేదోనన్న భయం ఉంది.ఽ ఎరువుల ధరలు పెరగడం, కూలీల కొరతతో పెట్టుబడి గతంలో కన్నా ఎకరాకు రూ.10 వేలు పెరిగింది. ఎకరాకు రూ.30 వేల వరకు వెచ్చించాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత కోత యంత్రాల కొరత.. పంట కోతలకు యంత్రాల కొరత అధికంగా వేధిస్తోంది. యంత్రాలకు డిమాండ్ ఉండటంతో యజమానులు అద్దె సైతం పెంచారు. గంటకు రూ.2,500, ట్రాక్టర్ అద్దె ట్రిప్పునకు రూ.600 చొప్పున వసూలు చేస్తుండటంతో ఈసారి కోత ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత ● -
నేడు ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్ లెట్కు చేరుకొని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని విద్యుత్ డివిజినల్ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లింగ్, సరఫరాలో అంతరాయం, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని గృహ, వ్యాపార, పరిశ్రమ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,0 21 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 832 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటిని నిలిపివేశారని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. దిగువకు పారుతున్న వరద వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగ సముద్రం రిజర్వాయర్కు వరద కొనసాగుతుండటంతో ఆదివారం కూడా ఒక షట్టర్ తెరిచి నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ వినయ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి కొత్తకోట రూరల్: అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనాలు అవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో ఎఫ్పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి సాగుచేసిన వరి పంటను, ధాన్యాన్ని పశ్చిమబెంగాల్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. డీఆర్ఆర్–75 వరి విత్తనం సాగు చేయడంతో ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. దీంతో జిల్లాలోని వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రైతులకు విత్తనం అవసరం ఉంటే సెల్నంబర్ 99081 61633 సంప్రదించాలని సూచించారు. -
భద్రత.. కరువు!
–8లో uవనపర్తి: కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా.. నేటికీ అందని ద్రాక్షగానే మారాయని చెప్పవచ్చు. ఇందుకు అక్టోబర్ 26న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం వద్ద బిహార్ కార్మికుడి మృతి, అక్టోబర్ 31న పెబ్బేరు మండలం వైశాఖాపూర్ శివారు పెద్దగుట్ట మైనింగ్ రీచ్లో డ్రైవర్ బాలరాజు మృతి ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. భారత ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికుల కోసం 1996లో బీఓసీడబ్ల్యూ (బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్) చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ చట్టాన్ని నిరక్ష్యరాస్యులైన కార్మికులు ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదు. అవగాహన కల్పించాల్సిన కార్మికశాఖలో అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి కార్మికులకు అందాల్సిన భరోసా ఊరించేందుకే పరిమితమైంది. బడా కాంట్రాక్టర్లకు నో రూల్స్..? రూ.వందల కోట్ల పనులు చేసే బడా కాంట్రాక్టర్లకు అనాధిగా చట్టం చుట్టంగా మారుతూనే ఉంది. వనపర్తి సమీకృత కలెక్టరేట్కు అతి సమీపంలో సుమారు రూ.205 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్, రెసిడెన్సీ తదితర బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. స్వరాష్ట్రంతో పాటు బిహార్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడే ఉంటూ పనులు చేపడుతున్నారు. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్పించాల్సిన భద్రత విషయంలో కాంట్రాక్టర్ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆ వైపు చూసేందుకు అధికారులు ఎన్నడూ ఆసక్తి చూపలేదు. ఇందుకు రాజకీయ నాయకుల ఆశీస్సులు లేదా ఇంకేవైనా కారణాలు కావచ్చు. దీంతో ఇక్కడ పని చేసే కార్మికులకు ప్రభుత్వం నుంచి ఇప్పించాల్సిన బీఓసీడబ్ల్యూ సంక్షేమ గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. ఇదివరకు పలువురు కార్మికులు చిన్న చిన్న ప్రమాదాల బారిన పడినా.. విషయం బయటకు రానివ్వకుండా కాంట్రాక్టర్ తరుపు ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఇటీవల ఓ కార్మికుడు మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందడంతో జిల్లాలో వలస కార్మికుల విషయంలో అధికారుల డొల్లతనం బయపడిందని చెప్పవచ్చు. బీహార్ కార్మికుడు తిలక్సా మృతిచెందిన వైద్య కళాశాల భవనం ఇదే అందుబాటులో లేని ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు తహసీల్దార్, ఠాణాల్లో నమోదు చేయని కాంట్రాక్టర్లు పని ప్రదేశాల్లో జాగ్రత్తలపై పర్యవేక్షణ ఏది? మేనమీషాలు లెక్కిస్తున్న అధికారులు కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నట్లేనా?భవన నిర్మాణం, ఫ్యాక్టరీలు, గనులు, రోడ్డు(ప్రభుత్వ, ప్రైవేటు) పనుల వద్ద ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికులకు కార్మికశాఖలో రిజిస్ట్రేషన్ లేకున్నా డబ్ల్యూసీ యాక్ట్ ప్రకారం లేబర్ కోర్టులో దావా వేస్తే ప్రభుత్వం తరుఫున పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల వద్ద జరిగిన ఘటనలో మృతిచెందిన కార్మికుడికి మా వద్ద రిజిస్ట్రేషన్ లేదు. అలాగే పెద్దగుట్ట మైనింగ్ రీచ్లో స్తంభం పడి మృతిచెందిన డ్రైవర్ రిజిస్ట్రేషన్ విషయం పరిశీలిస్తాం. ఆయా విషయాలను శాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. వారు ఈ రెండు ఘటనా స్థలాలను పరిశీలిస్తామన్నారు. – వేణుగోపాల్, జిల్లా సహాయ కార్మికశాఖ అధికారి ‘పెబ్బేరు మండలం శాఖాపూర్ శివారులో ఉన్న ఓ మైనింగ్ రీచ్ వద్ద అక్టోబర్ 31న విద్యుత్ స్తంభం పడి కొత్తకోట మండలం నాచవెళ్లికి చెందిన బాలరాజుగౌడ్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఇతడు టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. రీచ్లో పొక్లెయిన్తో కొనసాగుతున్న పనుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబానికి వర్తించాల్సిన ఇన్సూరెన్స్, ఇతర అంశాల ప్రస్తావన పక్కనబెట్టి రూ.లక్షల్లో పరిహారం చెల్లించేలా ప్రైవేటు వ్యక్తుల ఒప్పందంతో ఎలాంటి హడావుడి లేకుండా ఘటన సద్దుమణిగింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగుచూస్తున్నా.. కార్మికశాఖ మేల్కోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.’ -
వరి కోతలు షురూ..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ప్రారంభం ● కూలీల కొరతతో యంత్రాలకు పెరిగిన డిమాండ్ ● జిల్లాలో 2,09,835 ఎకరాల్లో పంట సాగు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వతో పాటు బోరుబావులు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగు చేసిన వరి సకాలంలో చేతికందడంతో రైతన్నలు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. ఈసారి వానాకాలంలో అధిక వర్షాలు కురవడంతో అక్కడక్కడ పంటలకు తెగుళ్లు సోకినా.. దిగుబడి మాత్రం ఆశించిన మేర పొందుతున్నారు. కూలీల కొరత కారణంగా చాలావరకు కోత యంత్రాలను వినియోగించి నూర్పిళ్లు పూర్తిచేసి మార్కెట్కు తరలించే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. వారం నుంచి పంట కోతలు ప్రారంభం కావడంతో యంత్రాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఫ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 2,09,835 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అతివృష్టి కారణంగా పంటలు చేతికందుతాయో లేదోనని ఆందోళన చెందిన రైతులు నష్టాన్ని అధిగమించినా.. కూలీల కొరతతో వరి కోతలకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించే పరిస్థితి దాపురించింది. వరి, పత్తి పంటలు ఒకేసారి రావడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగిందని.. తప్పని పరిస్థితుల్లో రోజువారి కూలి రూ.450 నుంచి రూ.500 చెల్లించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన పెట్టుబడులు.. వరిసాగు ఎకరాలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అయినట్లు రైతులు చెబుతున్నారు. వరి కోత యంత్రానికి ప్రస్తుతం గంటకు రూ.2,500 ఉండగా.. ఎకరా కోతకు రెండు గంటల సమయం పడుతుండటంతో రూ.5,200 ఖర్చవుతుందని తెలిపారు. దీనికితోడు కోసిన ధాన్యాన్ని కల్లాలకు తరలించేందుకు ట్రాక్టర్ అద్దె ట్రిప్పునకు రూ.600 వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.2,380తో పాటు బోనస్ రూ.500 చెల్లిస్తామని ప్రకటించడంతో త్వరగా మార్కెట్కు తరలించే పనుల్లో లీనమయ్యారు. మండలం విస్తీర్ణం (ఎకరాల్లో..) కొత్తకోట 20,510 పాన్గల్ 19,580 ఆత్మకూర్ 16,040 పెద్దమందడి 18,600 పెబ్బేరు 17,618 ఖిల్లాఘనపురం 16,430 వనపర్తి 15,600 వీవనగండ్ల 15,200 మదనాపురం 14,863 గోపాల్పేట 13,325 అమరచింత 10,120 శ్రీరంగాపురం 8,980 చిన్నంబావి 8,060 ఏదుల 9,059 రేవల్లి 5,850 అమరచింత మండలం నందిమళ్లలో యంత్రంతో వరి కోత మండలాల వారీగా వరి సాగు ఇలా.. ఎడమకాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో వరి కోతల పండుగ మొదలైనట్టుంది. ఈసారి ఆయకట్టు రైతులు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా జలాశయానికి భారీగా వరద రావడంతో ఆయకట్టుకు పూర్తిస్ధాయిలో సాగునీరు అందించారు. దీంతో రైతులు అత్యధికంగా వరి సాగు చేశారు. -
అమరుల ఆశయ సాధనకు పనిచేద్దాం
వీపనగండ్ల: పేద ప్రజల బాగు కోసం అహర్నిశలు పనిచేసి మరణించిన అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. ఉపసర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు పెద్ద రాములు ఇటీవల మృతిచెందగా.. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. పేదరికంలో ఉన్న పలువురికి కామ్రేడ్ పెద్ద రాములు అండగా నిలిచారని కొనియాడారు. భూ స్వాములు, నక్సలైట్లు దాడి చేసి గాయపర్చినా పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి గోపాల్, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఎండీ జబ్బార్, యూటీఎఫ్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు రవిప్రసాద్గౌడ్, కృష్ణయ్య, మండల కార్యదర్శి బాల్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాబి, మహబూబ్పాషా, జితేందర్గౌడ్, ఆశన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పటేల్ జీవితం.. అందరికీ ఆదర్శం
వనపర్తి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం.. ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేసి ఐక్య భారతంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దేశ ఐక్యత అంటే కేవలం భూ భాగాల కలయిక కాదని.. మనసులు, ఆలోచనలు, చర్యలు ఒకే దిశగా సాగడం కూడా ఐక్యతేనన్నారు. ప్రజల్లో శాంతి, భద్రత, పరస్పర విశ్వాసం, జాతీయ సమగ్రతను కాపాడటం పోలీసుల విధి అని.. ప్రవర్తన, సేవ, నిబద్ధతతో ప్రజల్లో పోలీసులంటే నమ్మకమనే భావనను నిలబెట్టాలని కోరారు. పటేల్ చూపిన మార్గంలో నడిస్తే దేశం మరింత బలపడుతుందని తెలిపారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. -
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
వనపర్తి: స్వతంత్ర దేశంలో 562 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతావని నిర్మాణానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదర్శ్ సురభి కోరారు. మాజీ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ఆర్డీఓ కార్యాలయ చౌరస్తా మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ 2కే పరుగు పందాన్ని ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అటవీశాఖ అధికారి కె.అరవింద్ ప్రసాద్రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి అనేక సంస్థానాల్లో రాజులు పాలన కొనసాగిస్తుండేవారని, అందులో హైదరాబాద్ సంస్థానం సైతం ఒకటని గుర్తు చేశారు. దేశం 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, 2047 నాటికి రాష్ట్రం 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమి సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. యువత విదేశాల్లో ఎక్కడ ఉన్నా స్వదేశానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. యువత కులమతాలకు అతీతంగా, ఐక్యంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరికి వారు ప్రత్యేకం కాదని.. అందరూ కలిసికట్టుగా ఉండి విజయం సాధించాలని, ఆస్ట్రేలియాతో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చిరస్మరణీయమైన విజయం ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతలు గుర్తెరిగి పారిశుద్ధ్యం, పచ్చదనం సంరక్షణలో తమవంతు బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్రెడ్డి, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత రన్లో పాల్గొన్నారు. -
కలెక్టరేట్కు తిరుగుతున్నాం..
బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికయ్యా. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని దసరా సెలవుల తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు. భోజనం, టిఫిన్ అందించలేమని.. హాస్టల్కు రావొద్దని తేల్చి చెప్పారు. డే స్కాలర్స్గా వచ్చి వెళ్లాలని యాజమాన్యం సూచిస్తోంది. దీంతో చేసేది లేక రోజు కలెక్టరేట్లో అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. పాఠ్యాంశాలను మిస్ అవుతున్నాం. – యశ్వంత్, 7వ తరగతి మా అమ్మాయి ఐదేళ్లుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతోంది. ప్రస్తుతం పదో తరగతి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని యాజమాన్యాలు పాఠశాలకు రానిచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. గందరగోళ పరిస్థితులు తలెత్తి పిల్లలతో పాటు మేము మానసికంగా కుంగిపోతున్నాం. – గంధం రవి, విద్యార్థి తండ్రి -
అప్రకటిత విద్యుత్ కోతలు
● రోజు పదుల సంఖ్యలో.. ● ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు, చిరు వ్యాపారులు ● అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వనపర్తిటౌన్: జిల్లాలో విద్యుత్ కోతలు ఇష్టానుసారంగా విధిస్తున్నారు. సంబంధిత అధికారులు కనీస సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటంతో వినియోగదారులు, చిరు వ్యాపారులకు ఇక్కట్లు తప్పడం లేదు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే అరగంట, గంట కోత విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అనధికారంగా లెక్కలేకుండా పోతోంది. రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 10 నుంచి 20 సార్లు కోతలు విధిస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ సరఫరా నిలిచిపోతుండటంతో దుకాణదారులు, జిరాక్స్, ఇంటర్నెట్, మీసేవ కేంద్రాలు, ఫొటోస్టూడియోలు, ఫ్లెక్సీలు, ప్రింటింగ్ ప్రెస్, డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహకులతో పాటు కులవృత్తుల్లో యంత్రాలపై పనులు చేసేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చినుకు రాలినా.. గాలి వీచినా... గాలి వీచినా, కొద్దిపాటి వర్షం కురిసినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. క్షేత్రస్థాయిలో లైన్మెన్ల లోపమా.. అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యమా తెలియదు కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మోంథా తుపాను ప్రభావం కారణంగా మంగళ, బుధవారాల్లో అనధికార విద్యుత్ కోతలు విధించారు. రాత్రిళ్లు దోమల బెడదతో జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని.. విద్యుత్ కోతలు విధించడం సరికాదని వినియోగదారులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడంతో బ్రేక్డౌన్, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్, లోఓల్టేజీ తదితర సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారిక కోతలపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం, వినియోగదారుల నుంచి విద్యుత్ సరఫరాపై సమాచారం తీసుకోకపోవడం తదితర కారణాలతో ఇష్టారీతి విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి. -
అంతరాయం కలగకుండా చూస్తాం..
సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. వీటిని కోతలుగా పరిగణించొద్దు. మంగళవారం రాత్రి 33 కేవీ బ్రేక్డౌన్ కావడంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అనధికార విద్యుత్ కోతలు విధించడం లేదు. వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో బ్రేక్డౌన్ అవుతుంది. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి సరఫరాలో అంతరాయం కలగకుండా మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం. – రాజశేఖరం, ఎస్ఈ, విద్యుత్శాఖ -
వేరుశనగ పంటను పరిశీలించిన పాలెం శాస్త్రవేత్తలు
లింగాల: మండలంలోని మగ్దూంపూర్, మాడాపూర్ గ్రామాల్లో శుక్రవారం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శంకర్, శోభ పర్యటించి వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్లో భాగంగా ఆయిల్ సీడ్స్ పథకం ద్వారా పీఏసీఎస్, అంబట్పల్లి ద్వారా రైతులకు పంపిణీ చేసిన జీజేజీ–32 రకం వేరుశనగ విత్తనాల మొలక శాతం, పంట పెరుగుదల, పంట స్థితి వంటి అంశాలను పరిశీలించారు. ఇది మేలు రకం విత్తనమని, సరైన రీతిలో పంటల సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, ఏఓ అనిల్, ఏఈఓ భరత్కుమార్, రైతులు పాల్గొన్నారు. పంట నష్టంపై అంచనా.. మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టపోయిన వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శుక్రవారం మండల వ్యవసాయాధికారి అనిల్, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం
●మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/వనపర్తి టౌన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది. బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● దసరా సెలవుల తర్వాత బీఏఎస్ స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు అనుమతించలేదు. ఈ క్రమంలో బహుజన విద్యార్థి సంఘంతో పాటు మరిన్ని సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ కలెక్టరేట్ను ముట్టడించడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ హామీ మేరకు పాఠశాలలకు యాజమాన్యాలు అనుమతించాయి. జిల్లాల వారీగా బీఏసీ పాఠశాలలు, విద్యార్థులు ఇలా.. జిల్లా బీఏసీ ఎస్సీ ఎస్టీ పాఠశాలలు విద్యార్థులు విద్యార్థులు మహబూబ్నగర్ 12 806 356 వనపర్తి 8 532 84 నాగర్కర్నూల్ 18 1,062 208 నారాయణపేట 1 120 30 గద్వాల 11 442 240 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు, హాస్టల్స్కు డబ్బులు వసూలు అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు షూలు పాఠశాల యాజమాన్యం ఇప్పించకపోతే తల్లిదండ్రులే ఇప్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని పాఠశాలను ఆదేశించినా ఇప్పటికీ అలా చేయలేదు. జిల్లాకేంద్రంలోని వన్టౌన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలల్లో బీఏఎస్ స్కీం కింద చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్స్కు డబ్బులు కట్టే దాక యాజమాన్యం వినకపోవడంతో తల్లిదండ్రలు చెల్లించే పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఏఎస్ స్కీం ద్వారా ఎన్నికై న విద్యార్థులను ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు బయటికి పంపించడంతో తల్లిదండ్రులు డీఈఓ, సంక్షేమ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ పాఠశాల బీఏఎస్ స్కీం డబ్బులు గత మూడేళ్లుగా రావడం లేదని ఈసారి స్కీం ద్వారా విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్లు కల్పించలేదు. -
తుపాను బాధితులను ఆదుకోవాలి : సీపీఎం
పాన్గల్: మోంథా తుపానుతో వరి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాల్రెడ్డి, మండల కార్యదర్శి బాల్యానాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ బృందం పాన్గల్, అన్నారంతండా, కేతేపల్లిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాలకు చేతికంది వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఓ పక్క తెగుళ్లు, మరోపక్క తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం మండలంలో సుమారు 100 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో రైతుల వెంట ఉండి పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పాన్గల్లో రైతు లింగాల రాములు పొలానికి అగ్గితెగులు సోకి గింజలు లేని పంటను వారు పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటయ్య, నిరంజన్, రైతులు ఉన్నారు. -
రైతన్నకు కన్నీరే దిక్కు..!
ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్క జొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో 36,970 ఎకరాల్లో పంట నష్టం కోత దశలో వరద నీటిలో నేలకొరిగిన వరి ఏరే దశలో చేలల్లోనే తడిసి ముద్దయిన పత్తి నాగర్కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం ఆ తర్వాత వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో.. నష్ట పరిహారం ఇవ్వాలని అన్నదాతల వేడుకోలు -
శాసీ్త్రయ విద్యను దూరం చేస్తున్న కేంద్రం
● పీడీఎస్యూ జాతీయ ప్రతినిధి విజయ్ కన్నా వనపర్తిటౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో మతపరమైన మూఢ విశ్వాసాలను పొందుపర్చి భవిష్యత్ తరాలకు శాసీ్త్రయ విద్యను దూరం చేస్తోందని పీడీఎస్యూ జాతీయ ప్రతినిధి విజయ్కన్నా ఆరోపించారు. జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న పీడీఎస్యూ రాష్ట్ర 4వ మహాసభల్లో గురువారం విద్యారంగ పరిస్థితులపై జరిగిన సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి సభాధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథిగా విజయ్ కన్నా హాజరై మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలను నిబంధనల మార్పుతో కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జ్యోతిష్యంలో డిగ్రీ పట్టా ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ హామీల అమలును కమిటీలతోనే సరిపెడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం తరహాలోనే విద్యారంగానికి నిధులు తగ్గించి పేదవాడికి విద్యను దూరం చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా.. బీజేపీ కాషాయికరణగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు తీవ్రతరం చేస్తేనే పాలక వర్గాల్లో మార్పు వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాంబ, ఉపాధ్యక్షులు సతీష్, పవన్, రంజిత్, సహాయ కార్యదర్శి గణేష్, రాష్ట్ర నాయకులు సైదులు, వంశీ, వంశీకృష్ణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజాబాట’తో విద్యుత్ సమస్యలుపరిష్కారం
ఖిల్లాఘనపురం: గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని విద్యుత్ సమస్యలను ప్రజాబాట కార్యక్రమంలో పరిష్కరిస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని సోళీపురం, ఉప్పరిపల్లిలో గురువారం వారు పర్యటించి సబ్స్టేషన్లను పరిశీలించి ఆయా గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సోళీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెల ఎత్తు తక్కువగా ఉండటంతో వారాంతపు సంత రోజు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, వెంటనే ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉప్పరిపల్లిలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద వర్షం, సాగునీరు నిల్వడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారాన్ని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వేసవిలో లోఓల్టేజీ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున మరో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాకు ఏబీ స్విచ్ఛులు ఏర్పాటు చేస్తామన్నారు. వారి వెంట ఏడీఈ రాజయ్యగౌడ్, ఏఈ సుధాకర్, పలువురు విద్యుత్ సిబ్బంది ఉన్నారు. మానవత్వం చాటిన అటవీ సిబ్బంది మన్ననూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న చెంచు మహిళను అటవీ శాఖ సిబ్బంది ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. లింగాల మండలం లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ గ్రామంలో గర్భిణి తోకల జగదీశ్వరి రెండు రోజులుగా పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, డీఎఫ్ఓ రోహిత్రెడ్డికి అటవీ శాఖ సిబ్బంది ద్వారా సమాచారం అందింది. దీంతో పీఓ, ఎఫ్ఆర్ఓ వీరేష్ తక్షణమే స్పందించి ఫరహాబాద్ వద్ద ఉన్న సఫారీ వాహనంతోపాటు అటవీ శాఖకు చెందిన ఎఫ్బీఓ శిల్ప, మరి కొంత మంది సిబ్బందిని అప్పాపూర్కు పంపించారు. గర్భిణికి తోడుగా ఉండే మహిళలను సఫారీ వాహనం ద్వారా మన్ననూర్ గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. -
రూ.2 లక్షలు నష్టపోయా..
నాకు కత్వచెరువు సమీపంలో ఉన్న 1.20 ఎకరాలతో పాటు గ్రామ సమీపంలో మరో రైతు పొలం ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. బుధవారం కురిసిన వర్షానికి కౌలు చేస్తున్న వరి పంట మీదుగా వరద పారి నీట మునిగింది. పంట చేతికొచ్చింది.. ఐదురోజుల్లో కోయాలని అనుకున్నా. చేతికొచ్చిన పంట మొత్తం నాశనమైంది. కౌలు తీసుకున్నందుకు ఎకరాకు రూ.ఏడు వేల చొప్పున చెల్లించాలి. రూ.రెండు లక్షలకుపైగా నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి. – గజ్జెల శ్రీశైలం, గోపాల్పేట ● -
చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాకు రూ.7 వేల మద్దతు ధర చెల్లిస్తోందని.. అదే మాదిరిగా టన్ను చెరుకుకు రూ.6 వేలు ఇవ్వాలని, కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తున్న రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. గురువారం సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులు ఫ్యాక్టరీ ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావు, కేన్ అడ్వయిజర్ రామ్మోహన్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేలు చెల్లించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో పంట కోతలు పూర్తిచేసి డబ్బులు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని.. రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ ఈడీ హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రాచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఈత చెట్లు తొలగించిన వారిని శిక్షించాలి’ కొత్తకోట: జిల్లాలోని కల్వరాల గ్రామ శివారు సర్వేనంబర్లు 398, 399, 407, 394, 395, 396, 407లో 200కు పైగా ఉన్న ఈత చెట్లను అదే గ్రామానికి చెందిన ఉమేష్రెడ్డి, వెంకట్రామారెడ్డి, అనిల్రెడ్డి, రంగారెడ్డి పొక్లెయిన్తో తొలగించారని.. వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గౌడజన గీతకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామన్గౌడ్ కోరారు. గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో కార్యాలయ అధికారి కరుణకు ఫిర్యాదు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహించే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరగడం హేయమైన చర్య అన్నారు. జిల్లాలో చాలాచోట్ల ఈతవనాలు తొలగించడం నిత్యకృత్యంగా మారిందని చెప్పారు. ఎకై ్సజ్ చట్టం ప్రకారం రైతు తన సొంత పొలంలో ఈత, తాటి చెట్లను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. శంకరసముద్రానికి స్వల్పంగా వరద కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రానికి గురువారం స్వల్పంగా వరద చేరినట్లు ఏఈ మనోజ్కుమార్ తెలిపారు. ఎగువ నుంచి 1,300 క్యూసెక్కుల వరద రాగా.. జలాశయం 4 గేట్లను రెండు ఫీట్ల మేర పైకెత్తి 2,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ముందస్తు జాగ్రత్తగా గేట్లను ఎత్తినట్టు పేర్కొన్నారు. రంగసముద్రం జలాశయం వద్ద.. వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్లో గురువారం నీటిమట్టం పెరగడంతో ఒక షట్టర్ తెరిచి 280 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ వినయ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆయుధాల భద్రతలో జాగ్రత్తలు తప్పనిసరి
వనపర్తి: ఆయుధాల భద్రతలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచిందారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన డీఎస్పీ శ్రీనివాసులు బృందం వార్షిక ఆయుధాల తనిఖీల్లో భాగంగా గురువారం వనపర్తి సాయుధదళ పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయుధాల సంరక్షణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, వినియోగ విధానాలను పరిశీలించింది. విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడికి చేరుకొని మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతో వ్యవహరించడంలోనే పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. సాయుదదళ పోలీసులు వ్యవస్థకు వెన్నెముక లాంటివారని.. క్రమశిక్షణ, ఏకత్వం, సమగ్రతతో విధులు నిర్వర్తించడంతోనే ప్రజల్లో విశ్వాసం, భద్రతా భావం పెంపొందుతుందని తెలిపారు. ఆయుధాల వినియోగంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రావీణ్యం, పనితీరు మరింత మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆయుధాల తనిఖీ బృందం అధికారి, వనపర్తి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, తనిఖీ బృందం సిబ్బంది, ఏఆర్ ఎస్సై రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు వెంకట అప్పారావు, అరవింద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించే 2కే రన్ను విజయవంతం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
2కే రన్ విజయవంతం చేయాలి
వనపర్తి: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలో జాతీయ సమైక్యత దినోత్సవ 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 7 గంటలకు జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్ద రన్ ప్రారంభమై ఆర్డీఓ కార్యాలయ చౌరస్తా మీదుగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ముగుస్తుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాకారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రన్లో పాల్గొనే వారికి తాగునీరు, పండ్లు, అంబులెన్స్, మ్యూజిక్ సిస్టం తదితర సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
తెరుచుకున్న జలాశయాల గేట్లు..
మదనాపురం/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: మండలంలోని సరళాసాగర్ జలాశయం ఆటోమెటిక్ సైఫన్లు బుధవారం తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయంలో నీటిమట్టం పెరగడంతో ఒక ఉడ్ సైఫన్, ప్రైమరీ సైఫాన్ తెరుచుకొని 3,950 క్యూసెక్కుల నీరు దిగువకు పారింది. దీంతో ఊకచెట్టు వాగులో నీటి ప్రవాహం కొనసాగింది. ● రామన్పాడు జలాశయానికి కోయిల్సాగర్ నుంచి వరద చేరడంతో బుధవారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు పైకెత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ● శ్రీరంగాపురం రంగసముద్రం రిజర్వాయర్లో నీటిమట్టం పెరగడంతో బుధవారం తహసీల్దార్ రాజు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ● కొత్తకోట మండలం కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రం జలాశయానికి బుధవారం స్వల్పంగా వరద చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జలాశయానికి ఎగువ నుంచి 2,400 క్యూసెక్కుల వరద రాగా.. మూడు గేట్లను 1.5 ఫీట్ల పైకెత్తి 2,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ మనోజ్కుమార్ వివరించారు. వరద తగ్గుముఖం పట్టినా ముందస్తు జాగ్రత్తగా 3 గేట్లను ఎత్తినట్లు వెల్లడించారు. -
వర్షం.. రైతన్నకు నష్టం
ఖిల్లాఘనపురంలో పొంగి పొర్లుతున్న పెద్ద వాగు వనపర్తి: మోంఽథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రేవల్లి మండలంలో 142 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. అమరచింత, ఆత్మకూరు మండలాల్లో అత్యల్పంగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించంది. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. పెద్దమందడి, మదనాపురం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులపై వరద పారడంతో రాకపోకలు కాసేపు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా వర్షంతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే సమాచారం ఇచ్చేలా కలెక్టరేట్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ● జిల్లాకేంద్రంలోని మర్రికుంట చెరువు అలుగు పారడంతో రోడ్డుపై నీరు పొంగిపొర్లింది. వాహనదారులు, పాదచారులు జిల్లాకేంద్రం నుంచి కర్నూలు రోడ్డులో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొల్సిన పరిస్థితి నెలకొంది. నేలకొరిగిన వరి.. తడిసిన పత్తి పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు మళ్లీ తెరుచుకున్న జలాశయాల గేట్లు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
వనపర్తి: మోంథా తుపానుతో జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సమయంలో ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేట, నీళ్లలో ఆట ప్రమాదకరమని హెచ్చరించారు. వర్షాలకు రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. రైతులు తమ పశువులు, వ్యవసాయ సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, పిల్లలు, వృద్ధులు నీటిముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 63039 23200 సమాచారం అందించాలని, తక్షణ సహాయక చర్యలకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలి వనపర్తి: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 10,958 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకాగా.. సుమారు 2,73,800 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అత్యధికంగా చిన్నంబావి మండలంలో 7,492 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల, గోపాల్పేట, చిన్నంబావిలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పంట కోతలు ప్రారంభమయ్యాయని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర నిర్ణయించిందని.. రైతులు దళారులకు తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రైతులు తేమశాతం 14 మించకుండా తీసుకురావాలన్నారు. పంట విక్రయాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మార్క్ఫెడ్ అధికారి చంద్రమౌళి (సెల్నంబర్ 99898 04756) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మార్క్ఫెడ్ అధికారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. చివరి గింజ వరకు కొంటాం : ఎమ్మెల్యే కొత్తకోట రూరల్: అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలం వెల్టూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొదటి విడత జిల్లావ్యాప్తంగా 396 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మహిళా సంఘాలు 170, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 218, మెప్మా ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శంకర్నాయక్, రఘుప్రసాద్, సింగిల్విండో అధ్యక్షులు మధుసూదన్రెడ్డి, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఖిల్లా’లో పొంగిన వాగులు, వంకలు
ఖిల్లాఘనపురం: మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షానికి పెద్దవాగు పెద్దఎత్తున ప్రవహించింది. అలాగే మండలంలోని వాగులు, వంకలు, చెక్డ్యామ్లు పొంగిపారాయి. ఈదురు గాలులకు చేతికొచ్చిన వరి పంటలు నేలకొరగడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని వెంకటాంపల్లి – కమాలోద్ధీన్పూర్ రహదారిపై వరద పారడంతో స్థానిక అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు నుంచి వర్షంపునీరు లోనికి చేరడంతో సిబ్బంది బకెట్లతో బయటకు పారపోశారు. -
నష్ట పరిహారం అందించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కట్ట ఎక్కడికక్కడ కోతకు గురైంది. పలు చోట్ల కట్ట లీకవుతుండడంతోపాటు కట్ట కోతకు గురై వరద మా పంట పొలాలను ముంచెత్తింది. మట్టి మేటలు వేయడంతో నేను నాలుగు ఎకరాల్లో వేసిన వరి దెబ్బతింది. రిజర్వాయర్ కాంట్రాక్టర్లతో మాకు నష్టపరిహారం ఇప్పించాలి. – వెంకటేష్, కిష్టారం, జడ్చర్ల, మహబూబ్నగర్ వరి చేనును మట్టి కమ్మేసింది ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వరద నీరు మా పొలంలోకి వచ్చింది. ఎకర పొలంలో సాగు చేసిన వరి చేనుపై మట్టి దిబ్బలు పేరుకుపోయి మాకు తీవ్ర నష్టం జరిగింది. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్ట తెగిన ప్రతిసారి మా పొలాల్లోకి మట్టి కొట్టుకు వస్తుంది. పంటలు నష్టపోతున్నాం. మాకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – గడ్డల రమేష్, రైతు, కిష్టారం -
ఉదండాపూర్ లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు.12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్ట కోతకు గురై పగుళ్లు ఏర్పడి.. పలు చోట్ల నీరు లీకవుతోంది. ఈ మేరకు ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు ఇటీవల మరమ్మతులు చేయించారు. తాజాగా కురిసిన వర్షంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పొలాల్లోకి నీటి ఊటలు రావడం.. కట్ట మట్టి కొట్టుకువచ్చి మేటలు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు వట్టెం పంప్హౌస్ నీట మునగడం.. తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకముందే డొల్లతనం బయటపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 20 ఫీట్ల మేర గోతులు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద 15.91 టీఎంసీల సామర్థ్యంతో 9.36 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టారు. ఇంతటి భారీ కట్ట నిర్మాణం నాసిరకంగా కొనసాగినట్లు ఇటీవల వర్షాలు నిరూపిస్తున్నాయి. కట్టపై ఒక్కో చోట దాదాపు 20 ఫీట్ల మేర గోతులు ఏర్పడ్డాయి. నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నాసిరకం మట్టిని వాడడం.. అందులో ఉన్న రాళ్లను తీయకుండా రోలింగ్ చేయడంతో వానలకు కట్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రివిట్మెంట్ పనుల్లో సైతం నాణ్యత కొరవడింది. అందుకే రివిట్మెంట్లలో రాళ్లు చిందరవందరగా పడి ఉన్నాయని.. నీళ్లు లీకవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన రిజర్వాయర్ కట్ట మరమ్మతులు చేసినా అదే పరిస్థితి పలు చోట్ల పొలాల్లోకి చేరుతున్న మట్టి, బురద నీరు రివిట్మెంట్ పనులు, నిర్మాణంలో నాణ్యత లేమి? నాసిరకం మట్టి వాడకం, సరిగ్గా రోలింగ్ చేయకపోవడమే కారణం పనులు పూర్తిగాకముందే బయటపడిన డొల్లతనం పొలాల్లోకి నీటి ఊటలు.. ఆందోళనలో రైతులు -
మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సిలిండర్లు
వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి గ్యాస్ సిలిండర్లు వినియోగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఎల్పీజీ కనెక్షన్ ఇప్పించేందుకు చొరవ చూపాలని, ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు నిత్యం తనిఖీ చేపట్టాలని.. అక్టోబర్లో నిర్దేశించిన లక్ష్యాన్ని మరో రెండ్రోజుల్లో సాధించాలని సూచించారు. విద్యార్థుల అపార్ ఐడి జనరేషన్లో పురోగతి కనిపించిందని.. ఇంకా వేగంగా పూర్తి చేయాలన్నారు. గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించడమే కాకుండా ఆ సమాచారాన్ని సంబంధిత పీఎం పోషణ్ పర్ఫామెన్స్ పోర్టల్లో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు. -
వందలాది ఎకరాల్లో నష్టం..
ప్రస్తుతం కట్ట వెలుపలి భాగంలో రిజర్వాయర్ చుట్టూ రైతులు వేలాది ఎకరాల్లో మక్కలు, పత్తి, వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. వర్షాలకు కట్ట కోతకు గురై మట్టి మొత్తం పొలాల్లోకి చేరడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పత్తి వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం పత్తి ఏరేదశలో ఉండగా.. నీళ్లు, మట్టి చేరడంతో దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. ఈ మేరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చే స్తున్నారు. దీంతోపాటు రిజర్వాయర్ కట్ట పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికే సర్వం కోల్పోయామని.. ఇంకా పరిహా రం అందనే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నీటి లీకేజీ, మట్టి, ఇసుక మేటలతో నష్టం వాటిల్లుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. కాగా రిజర్వాయర్ కట్టకు కోత, నీటి లీకేజీపై పీఆర్ఎల్ఐ అధికారులను ఫోన్లో సంప్రదించేందుందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
సమాజంలో పోలీసుల పాత్ర కీలకం
వనపర్తి: పోలీసుల విధి కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాదని.. సమాజంలో చట్టాలపై అవగాహన పెంపు, శాంతిభద్రతల పరిరక్షణతో ప్రశాంత వాతావరణం నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ను సీఐ కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర వంటి అంశాలను తెలుసుకోవాలని, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ బారిన పడితే టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత కోసం భరోసా కేంద్రం, షీ టీమ్స్, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బంది షీటీమ్, భరోసా, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్ డ్రగ్స్, కమ్యూనికేషన్ యూనిట్లకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ పరికరాల వినియోగం, డయల్ 100 సేవలు, ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. జిల్లాకేంద్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్పర్సన్ చెన్నమ్మ థామస్, షీటీమ్ ఎస్ఐ అంజద్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, ఎస్ఐలు హరిప్రసాద్, శశిధర్, షీటీం, భరోసా, నార్కోటిక్ డ్రగ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నయనానందం ఉద్దాలోత్సవం
వడ్డెమాన్ నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొస్తున్న ఉద్దాలు చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి. దారులన్నీ కురుమూర్తి వైపే.. కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి. బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం గ్రామగ్రామాన మంగళ హారతులతో స్వాగతం జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు -
రాష్ట్రస్థాయి రోడ్ స్పీడ్ సైక్లింగ్ పోటీలకు ఎంపిక
కొత్తకోట: మండలంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులకు సోమవారం నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, రిటైర్డ్ పీడీ బి.గోపాలం ఆధ్వర్యంలో రోడ్ స్పీడ్ సైకిల్ పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. ఈ పోటీల్లో ఐశ్వర్య, శ్రీలక్ష్మి, పావని, నందిని, బిందు, అఖిల, నందిని, ఇందు, పూజ, చింటు, మాధురి, అనూష, అక్షయ, ఇందు, కీర్తన ప్రతిభ చాటారని, వారిని రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు వివరించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేసి అభినందించారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 2వ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ.76 కోట్లు మంజూరు వీపనగండ్ల: బీటీ రోడ్ల నిర్మాణాలకుగాను రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.76 కోట్లు మంజూరు చేయించినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ తెలిపారు. మండల కేంద్రం నుంచి కేతేపల్లి వరకు డబుల్ బీటీ రోడ్డు, బొల్లారం చౌరస్తా నుంచి కొర్లకుంట ఆర్అండ్బీ రహదారి, అలాగే కొండూరు, తూంకుంట నుంచి శ్రీరంగాపురం వరకు బీటీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే ఆన్లైన్ టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దంపతులకు మద్యం దుకాణాలు పాన్గల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపులో భార్యాభర్తలకు రెండు షాపులు దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేవు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వెంగళాయిపల్లికి చెందిన గండం ప్రవీణకుమారి, మొగిలి సురేష్కుమార్ మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. లక్కీడిప్లో గౌడ్ రిజర్వేషన్లో ప్రవీణకుమారికి పాన్గల్–2 దుకాణం, సురేష్కుమార్గౌడ్కు ఓపెన్ కేటగిరిలో కొత్తకోట–3వ దుకాణం లభించింది. ఈ విషయం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వనపర్తి: పట్టణాభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని.. ఇదివరకే అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు తీసుకురాగా, మిగిలిన పనులకు తాజాగా మరో రూ.18.70 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు లక్కాకుల సతీష్, బి.కృష్ణ, పాకనాటి కృష్ణ, పరశురాం తదితరులతో కలిసి మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ వనపర్తిని ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని, రూ.కోటి తీసుకొస్తే పాలాభిషేకాలు చేసేవారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పెద్దమొత్తంలో నిధులు తీసుకొచ్చినా.. ప్రచారం చేసుకునే అలవాటు లేదని చెప్పారు. మంజూరైన నిధులతో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం లక్కాకుల సతీష్ మాట్లాడుతూ.. మర్రికుంటను మరమ్మతు చేసి అలుగు మార్చడం, తూములు మూసివేయడంతో వరద నీరు రోడ్డుపై పారుతోందని, సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే, అధికారులతో ఇదివరకే చర్చించామన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలకు ప్రస్తుత ప్రభుత్వాన్ని, పాలకులను నిందించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మంచారి, ఎల్ఐసీ కృష్ణ, నాయకులు వినోద్, శరవంద తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం
వనపర్తి: మరో వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేపడతామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఆయా మిల్లర్లు వారు పూర్తిచేసిన సీఎంఆర్కు అనుగుణంగా నిబంధనల ప్రకారమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈసారి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా వేశామని.. అందులో 80 శాతం సన్న ధాన్యమే ఉంటుందని చెప్పారు. ఎఫ్ఏక్యూ ప్రమాణలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ధాన్యం కేటాయింపులు పొందడానికి గతంలో ఉన్న పెండింగ్ పూర్తి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించగా.. ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా చూడాలని, ఇందుకు పోలీసు అధికారులు, విద్య, వైద్యం, సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రతి నెల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని.. అర్చకులు, కులపెద్దలు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, చేస్తే నమోదు చేసే కేసులు, తదుపరి చర్యలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ తదితర సిబ్బంది సమష్టిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. చదువు మానేసిన బాలికలను గుర్తించాలని, వారితో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మాట్లాడి తిరిగి విద్యాలయాల్లో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. బాల్య వివాహానికి సహకరించే ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామన్నారు. చదువు మధ్యలో మానేసిన ప్రతి బాలికను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి విద్యాలయాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలను అడ్డుకొని బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రాంబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సీఐలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి చిన్నమ్మ థామస్, మహిళా సంఘాల అధ్యక్షులు స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
‘కపాస్ కిసాన్’లో నమోదు తప్పనిసరి
ఖిల్లాఘనపురం: జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి రైతులు గతంలో మాదిరిగా నేరుగా పత్తి తీసుకొని సీసీఐ కేంద్రాలకు వెళ్లొద్దని.. ఇంటి దగ్గరే ముందుగా కపాస్ కిసాన్ యాప్లో పేర్లు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇలా చేయడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దని చెప్పారు. జిల్లా రైతులు పత్తి విక్రయానికి అడ్డాకుల దగ్గర ఉన్న ఎస్ఎస్ఆర్ మిల్లును ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అలాగే జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట కోతలను చూసి ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్ చైర్మన్ క్యామ రాజు, వివిధ గ్రామాల ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజావాణితో పాటు సీఎం ప్రజావాణి నుంచి వచ్చే వినతులు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 56 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్లో మండల అధికారులు పాల్గొన్నారు. -
అన్ని దుకాణాలు సిండికేట్లకే..
● స్థానికులదే అగ్రభాగం.. కడప, కర్నూలు వ్యాపారుల భాగస్వామ్యం ● కొత్తవారిని వరించిన లక్కు వనపర్తి: కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో లక్కీడిప్ నిర్వహించారు. డిసెంబర్ నుంచి ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగే కొత్త మద్యం పాలసీలో లక్కు కొత్తవారినే ఎక్కువగా వరించింది. 40కి పైగా దరఖాస్తులు వేసిన జిల్లాకేంద్రం, పెబ్బేరు ప్రాంతాలకు చెందిన పాత సిండికేట్లకు ఈసారి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. జిల్లాలోని మొత్తం 36 మద్యం దుకాణాలను లక్కీడిప్ విధానంలో కేటాయించగా.. అందులో అగ్రభాగం కొత్తవారికి దక్కడం గమనార్హం. జిల్లాకేంద్రంలోని ఆరు దుకాణాలకుగాను నాలుగు కొత్త వారికి, రెండు పాత సిండికేట్ గ్రూప్లు దక్కించుకోగా.. కొత్తకోట, పానగల్, పెబ్బేరులో కొత్తవారికి దక్కాయి. మదనాపురం, ఆత్మకూర్ ప్రాంతాల్లో పాతవారే మరోసారి దుకాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని దుకాణాలు దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న సిండికేట్లలో కర్నూలు, కడప ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారులు భాగస్వామం ఉన్నట్లు సమాచారం. కొన్ని సిండికెట్లలో 45 మందికి పైగా వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. గోపాల్పేటలోని ఓ దుకాణం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సిండికేట్కు దక్కినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఒక్కో దుకాణానికి 55 నుంచి 60 వరకు దరఖాస్తులు వచ్చాయి. దుకాణాల వారీగా దరఖాస్తు చేసుకున్న వారి సమక్షంలో లక్కీడిప్ తీసి కేటాయించారు. లక్కీడిప్ ప్రక్రియను తిలకించేందుకు వీలుగా కలెక్టరేట్ ఆవరణలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 36 దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ లక్కీడిప్ నిర్వహించే హాల్లోకి అనుమతించడం సాధ్యం కాదని.. ఒక్కోసారి ఐదు నుంచి ఆరు దుకాణాల దరఖాస్తుదారులను సీరియల్ నెంబర్ల వారీగా పిలిపించారు. దుకాణం దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/6 వంతు నగదు చెల్లించాల్సి ఉంటుందని వారితో సంతకాలు తీసుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి లోపలి వరకు పోలీస్, ఎకై ్సజ్శాఖ సిబ్బంది గస్తీ నిర్వహించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన లక్కీడిప్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట లోపు పూర్తయింది. -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
వనపర్తి: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించగా.. ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలీసు సమాజ సేవలో నిబద్ధతతో ముందుకుసాగి ప్రజల్లో సామాజిక బాధ్యత, దేశభక్తి స్ఫూర్తి పెంపొందించాలన్నారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక దేశ సైనికుల్లా ముందుకు సాగుతున్న పోలీసుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. అమరుల త్యాగాలను స్మరించుకునేలా ఏటా పోలీస్ ఫ్లాగ్డే నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు తమ దైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట సీఐలు కృష్ణయ్య, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాత్రికేయులు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పేదలకు చేరువగా న్యాయసేవలు
వనపర్తిటౌన్: పేదలకు న్యాయసేవలు చేరువ చేయడంతో పాటు వారికి అండగా నిలిచేందుకు న్యాయ సేవాధికార సంఽస్థ కృషి చేస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీనగర్లో ఉన్న సీఆర్సీ కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో న్యాయపరమైన సమస్యల పరిష్కారం, న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అర్హులైన వారికి ఉచితంగా న్యాయసాయం అందించనున్నట్లు వెల్లడించారు. పేదల బస్తీలో ప్రారంభించిన లీగల్ సర్వీస్ క్లినిక్ను ప్రజలు సద్వినియోగం చేసుకొని న్యాయం పొందవచ్చన్నారు. ప్రతి సోమవారం లీగల్ క్లినిక్లో దరఖాస్తులు అందజేస్తే న్యాయ సేవాధికార సంస్థ పరిశీలించి బాధితులకు న్యాయపరంగా తోడుగా ఉంటుందని తెలిపారు. కూలీ పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకునే దళిత, పేదల బస్తీలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్తో ప్రజలకు సాంత్వన చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పుర వార్డు అధికారి ఆకాశ్, పారా లీగల్ వలంటీర్లు అన్నపూర్ణ, రవీందర్, దళిత నేత గంధం నాగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘విశ్రాంత ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే..’
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.యేసేపు ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఉద్యోగ విరమణ పొందిన 8,972 మందికి రూ.13 వేల కోట్ల బిల్లుల బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. ఉద్యోగులతో జరిపిన చర్చల్లో ప్రతి నెలా రూ.700 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు రాక అనారోగ్యం బారినపడి కొందరు చికిత్స చేయించుకోలేక మృతిచెందారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు చేసుకోలేక కుటుంబంలో అశాంతితో ఆయువు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోజనాలు అందక మానసిక క్షోభతో మరణించిన రిటైర్డ్ ఉద్యోగుల మరణాలను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని తెలిపారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డాకుల అగ్గిరాముడు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు ఐ.నారాయణ, శ్రీనివాస్గౌడ్, కె.శ్రీనివాస్గౌడ్, డి.సత్యనారాయణమూర్తి, ఎం.కేశవులు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగాా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు. రేవులపల్లి–నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మా పొలాలకు కాస్త రేట్లు వస్తాయి. చిన్నాచితక వ్యాపారాలతో జీవనోపాధి పొందొచ్చనేది మా ఆశ. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలి. అంతవరకూ పోరాటం తప్పదు. – రాజు, రేవులపల్లి, ధరూర్ (జోగుళాంబ గద్వాల) ఎవరూ అడ్డుకోవద్దు.. ఆత్మకూరు మండలంలోని జూరాల పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రయోజనకరం. ఆత్మకూరు నుంచి గద్వాలకి వెళ్లాలంటే ప్రస్తుతం 33 కి.మీలు ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 12 కి.మీ.లకే గద్వాల వెళ్లొచ్చు. 1979లోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో కొత్తపల్లి – జారాల మధ్య నిర్మాణం కానుంది. ఎవరూ అడ్డుకోవద్దని.. అటుఇటు అయితే మేమూ పోరాటానికి సిద్ధం. – రహమతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్ (వనపర్తి)● -
జిల్లాకు ఏడుగురు ఎంపీడీఓలు
వనపర్తి: ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి ఎంపీడీఓలుగా ఎంపికై న ఏడుగురిని జిల్లాకు కేటాయించారు. సోమవారం స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ యాదయ్య వారికి మండలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నంబావి మండలానికి ఎస్.ఆదర్శ్గౌడ్, ఖిల్లాఘనపురం మండలానికి విజయసింహారెడ్డి, గోపాల్పేటకు అయేషా అన్జూం, పెబ్బేరుకు బిట్టు వెంకటేష్, పెద్దమందడికి టి.పరిణతి, రేవల్లి మండలానికి అల్లి కీర్తనను నియమించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ వనపర్తి: నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి సుధారాణి తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆమె ఆవిష్కరించి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించే ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 30న విద్యాసంస్థల బంద్ వనపర్తిటౌన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యాసంస్థల బంద్ వాల్పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు మాత్రమే రాష్ట్రవ్యాప్త బంద్ వర్తిస్తుందని తెలిపారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడం.. విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాసంస్ధలను బలోపేతం చేసే ఆశయం ఉంటే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంద్కు జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్ననాయక్, ఈశ్వర్, శివ, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
కొత్తకోట రూరల్: వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లిలో తడిసిన వరి ధాన్యాన్ని శనివారం ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అన్నదాతలు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కొంటామన్నారు. నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతిచోట కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటంకాలు లేకుండా బిల్లుల మంజూరు.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం జంగమాయపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి ఆటంకం లేకుండా బిల్లులు మంజూరవుతున్నాయని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్గౌడ్, బాలరాజు, మల్లేష్, నర్సింహ, యాదగిరి, సురేందర్గౌడ్, వేణుగౌడ్, మన్యం, బుచ్చన్న పాల్గొన్నారు. -
డబుల్ ఓట్ల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్
వనపర్తి: ఒక వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే గుర్తించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 2002లో చేసిన ఎస్ఐఆర్తో 2025 ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్స్థాయి అధికారులతో వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. వచ్చే శనివారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ప్రజావాణి అర్డీఓ కార్యాలయంలో.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని.. అర్జీలను అక్కడే అధికారులకు అందించాలని పేర్కొన్నారు. -
వృద్ధులకు ఉచిత న్యాయ సలహాలు
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని వనపర్తిటౌన్: నిరాశ్రయులైన వృద్ధులు, తల్లిదండ్రులు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నాల్సా (లీగల్ సర్వీసెస్ టు సీనియర్ సిటిజన్స్) స్కీం–2016 ప్రకారం ప్రతి ట్రిబునల్స్లో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ చట్టం, సంక్షేమ చట్టం–2007 ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు పంపిన వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని.. పారా లీగల్ వలంటీర్ కొమ్ము వెంకటేశ్ నుంచి ఉచిత న్యాయ సాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఏజీపీ అనంతరాజ్, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి, వలంటీర్ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
వనపర్తి: రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా, క్యాన్సర్, హిమోఫీలియా, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర సమయాల్లో రక్తం అవసరమవుతుందన్నారు. ఇలాంటి శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని వారి కోసం ఉపయోగిస్తారని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి ప్రతి ఐదునెలలకు ఓసారి రక్తదానం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధి నుంచి ప్రజలు, యువత తరలివచ్చి 252 యూనిట్ల రక్తదానం చేశారని వెల్లడించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి సాయుదదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించిన గోర్ల సుమశ్రీ, ఆమె తల్లిదండ్రులను ఎస్పీ శాలువా కప్పి సన్మానించారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
వరి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణనిస్తున్నాం. సన్న, దొడ్డురకం గుర్తింపు, తేమశాతం కొలవడం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. – అరవింద్, ఏఓ, అమరచింత ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 490 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 40 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉండగా.. అవసరం మేరకు మరిన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రవాణా వ్యవస్థ కుంటుపడకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాల సంస్థ ● -
పత్తిపై.. కపాస్ కత్తి
●నారాయణపేట: భారత పత్తి సంస్థ (సీసీఐ) కొత్త నిబంధనలతో పత్తి రైతులకు కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి. పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పత్తి రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై పత్తి అమ్మకాలకు ‘కపాస్ కిసాన్’ యాప్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్మార్ట్ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ఈ యాప్పై రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డులలో హెల్ప్డె స్క్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతుండగా.. గ్రామస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వేదికలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 29 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తొలిసారిగా నారాయణపేట జిల్లా ధన్వాడ సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో బుధవారం తొలి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. వ్యాపారుల్లో ఆందోళన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సీసీఐ అధికార యంత్రాంగం ఉమ్మడి పాలమూరులోని ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుతో వ్యవహరిస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో ఎల్1, ఎల్2, ఎల్3 మిల్లులు కేటాయించారు. నాగర్కర్నూల్ జిల్లాలో బేల్స్ వారీగా కేటాయింపు చేశారు. అయితే ఏ మండలం రైతులు ఆ మండలంలో ఉండే కాటన్ మిల్లులో విక్రయించేందుకు వీలుగా అవకాశం క ల్పించాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఎల్–1 నిండిన తర్వాతే ఎల్–2 మిల్లుకు కేటాయించడం.. ఆ యాప్లో కనిపిస్తుందనే నిబంధన పెట్టడంతో అటు రైతులు.. ఇటు మిల్లర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. 8 శాతానికి మించితే.. రైతులు తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉన్న పత్తిని తీసుకురావాల్సి ఉంటుంది. అత్యధికంగా 8 శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుంది. అంతకు మించి పెరిగే ఒక్కొక్క శాతానికి రూ.81 ధర తగ్గుతుంది. తేమ శాతం 9 ఉంటే రూ.7,929– 8,028, 10 శాతం ఉంటే రూ.7,849– 7,947, 11 శాతం ఉంటే రూ.7,769– 7,866, 12 శాతం ఉంటే రూ.7,689– 7,785 మద్దతు ధరగా నిర్ధారించారు. అంత కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే పత్తి ప్రైవేట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. వినియోగం ఇలా.. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి ముందు రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఆయా ప్రాంత వ్యవసాయ విస్తరణాధి కారులు (ఏఈఓ) వద్ద నమోదు చేసుకోవాలి. పంట వివరాలను నమోదు చేసుకునే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ నంబర్ తప్పుగా నమోదై ఉంటే దానిని ఏఈఓతో సరిచేయించుకోవాలి. స్మార్ట్ఫోన్ లోని ప్లే స్టోర్లో కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే రైతులు తాము ఏ రోజు పత్తిని విక్రయించాలనుకుంటున్నారో మాతృభాషలో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తిని విక్రయించే మార్కెట్ లేదా మిల్లు ఎంపిక చేయాలి. విక్రయించే పత్తి పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఒక సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. మక్తల్, నారాయణపేట మార్కెట్ యార్డు పరిధిలోని మిగతా కాటన్ మిల్లులోనూ వారం రోజుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి లబ్ధిపొందాలి. – బాలమణి, డీఎంఓ, నారాయణపేట సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ గందరగోళం నిబంధనలపై రైతులు, అమ్మకాలపై వ్యాపారుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాకు 29 కేటాయింపు.. పేటలో తొలికేంద్రం ప్రారంభం మార్కెట్ యార్డులలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు -
జిల్లాలో 400 కొనుగోలు కేంద్రాలు
ఖిల్లాఘనపురం: రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో 400 వరిఽ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేధికలో ధాన్యం కొనుగోలుపై కేంద్రాల నిర్వాహకులు, ఏఈఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత అంచనాల ప్రకారం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ఐకేపీ, సింగిల్విండోల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ఇప్పటికే 60 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే 40 వేల బ్యాగులు వస్తాయని తెలిపారు. గతంలో ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు రైతులు, అధికారులు చెప్పారని.. ఈసారి పునరావృతం కాకుండా ముందుగానే లారీలు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రోజు ఓ లారీ కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. కేంద్రాల నిర్వహణలో తేడాలు జరిగినా, రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. టార్పాలిన్లు, తాగునీరు, తూకపు, తేమ గుర్తించే యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏఈఓలు రైతులకు అవసరమైన టోకన్లు రాయాలని, గ్రామాలకు కేటాయించిన రైస్మిల్లుకు మాత్రమే ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఽసన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కచ్చితంగా గుర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, సింగిల్విండో మండల చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తహసీల్దార్ సుగుణ, ఏపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడుకు 1,076 క్యూసెక్కుల వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి గురువారం జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వ నుంచి 46 క్యూసెక్కులు, మొత్తం 1076 క్యూసెక్కుల వరద చేరినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. -
ప్రజలకు నిరంతరం సేవలందించాలి
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి ● ఎస్పీ రావుల గిరిధర్ కొత్తకోట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకొనేలా ఉత్సాహంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని పెండింగ్ కేసులు, అందుకుగల కారణాలు, దర్యాప్తు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పత్రాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలని సూచించారు. ఎస్ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. ఆన్లైన్, సైబర్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీస్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను నమ్మకూడదని కోరారు. సైబర్ మోసానికి గురైన మొదటి గంటలోపు టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని లేదా https://www. cybercrime.gov.in/ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులకు త్వరగా స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా తదితర వాటిని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు. సమీక్షలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ, ఐటీ కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కిక్కు తగ్గింది..!
● ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణ ● ఈ నెల 27న కలెక్టరేట్లలో లక్కీడిప్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఈసారి జరిగిన మద్యం టెండర్ల ప్రక్రియలో జోష్ తగ్గింది. వ్యాపారులు దుకాణాల కోసం తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి కనిపించలేదు. రెండుసార్లు గడువు పెంచినా కూడా వ్యాపారుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. గత రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణతో పోల్చితే ఈసారి చాలా వరకు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు మొత్తం 5,536 టెండర్లు రావడం జరిగింది. చివరి రోజు గురువారం మొత్తం 251 దరఖాస్తులు రాగా ఇందులో మహబూబ్నగర్లో 69, వనపర్తిలో 75, నారాయణపేటలో 43, నాగర్కర్నూల్లో 81, గద్వాలలో 46 దరఖాస్తులు ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లా నుంచి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.166.08 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ నెల 27న ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. 2023తో పోలిస్తే ఈ సారి 3,038 టెండర్లు తక్కువగా వచ్చాయి. జిల్లాల వారీగా ఇలా.. జిల్లా చివరిరోజు మొత్తం సమకూరిన వచ్చిన టెండర్లు ఆదాయం టెండర్లు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 69 1,634 49.02 నాగర్కర్నూల్ 81 1,518 45.54 నారాయణపేట 43 853 25.59 జోగుళాంబ గద్వాల 46 774 23.22 వనపర్తి 75 757 22.71 దాఖలైన టెండర్లు 5,536 -
ఉద్యోగుల పర్యవేక్షణ మా పరిధి..
టీ–హబ్లో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షణ, నియామకం తదితర అంశాలు మాత్రమే మా పరిధిలో ఉంటాయి. యంత్రాలు, నమూనాల సేకరణ, పరీక్షలు, రిపోర్టులు అందించడం వైద్య, ఆరోగ్యశాఖ విభాగం అధికారుల పర్యవేక్షణలోకి వస్తాయి. – డా. రంగారావు, సూపరింటెండెంట్, జీజీహెచ్ టీ–హబ్లో కెమిస్ట్రీ యంత్రం మరమ్మతుకు గురికావడంతో కంపెనీ టెక్నీషియన్లకు సమాచారం ఇచ్చాం. వారు పరిశీలించి మిషన్లోని ఓ పార్ట్ను మార్చాలని సూచించారు. రెండు, మూడురోజుల్లో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. – డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి ● -
వసతుల కల్పనకే నిధులు మంజూరు
వనపర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. వినియోగించుకొని పనులు వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో మనోధైర్యం నింపడం కూడా బాధ్యతని, అప్పుడప్పుడు విద్యార్థులతో మమేకమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని, చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. కేవలం పాఠాలే కాకుండా మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కూడా కీలకమన్నారు. అపార్ ఐడీ పునరుద్ధరణలో వేగం పెంచాలని, విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా విధిగా కళాశాలలకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఐఈఓ ఎర్ర అంజయ్య, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పవర్.. ఫుల్
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు. 2022–23లో నవంబర్ చివరి నాటికి 640 మిలియన్ యూనిట్ల లక్ష్యానికిగాను 876 మి.యూ.గా నమోదైంది. ఈ ఏడాది విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వరద చేరుతుండటంతో అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. వరదపైనే ఆధారం.. ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత వచ్చే వరద జూరాల జలాశయానికి చేరుతుంది. వరద చేరితేనే ఇక్కడ విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా జలాశయానికి వరద చేరడంతో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది. మొరాయించిన మూడో యూనిట్.. జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తగా చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు రెండేళ్లుగా మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో బాగు కావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ● జూరాల దిగువ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి రోజుకు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 40 మెగావాట్ల ఉత్పత్తి 9,600 యూనిట్లకు సమానం. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికిగాను 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. ● ఈ ఏడాది దిగువ జల విద్యుత్ కేంద్రంలో 290 మి.యూ. లక్ష్యానికిగాను ఈ ఏడాది 447 మి.యూ.. ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 320 మి.యూ. లక్ష్యానికిగాను 435 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 2014–15 నుంచి 2024–25 వరకు ఎగువన 3,039 మి.యూ., దిగువన 2,531 మి.యూ., మొత్తం 5,570 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. 610 మిలియన్ యూనిట్లకుగాను.. 882 మి.యూనిట్లకు మించి... ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికం 2022–23లో 876 మిలియన్ యూనిట్లు -
కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టం కావాలి
వనపర్తి టౌన్: కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టమైతే మేలు చేకూరుతుందని.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శి డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఆర్ శంకరన్ అధికారిగా ఉన్న కాలంలో ఆయన నిర్ణయాలకు మంత్రులు సైతం ఎదురు చెప్పేందుకు భయపడేవారని, ఇందుకు ప్రజామోదమైన ఆయన ఎజెండానే కారణమని తెలిపారు. ఉన్నతాధికారులు ఆయన మాదిరిగా సాధారణ జీవితానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకరన్ సారథ్యంలోనే నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారని గుర్తు చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శంకరన్నే కారణమని.. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చే పింఛన్ డబ్బులను సైతం నిరుపేద దళిత, గిరిజనుల ప్రగతికి ఖర్చు చేశారని తెలిపారు. నేటితరం అధికారులందరికీ స్ఫూర్తిదాతగా, ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.మురళీధర్, రిటైర్డ్ ఎంఈఓ, న్యాయవాది రాఘవరెడ్డి, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్గౌడ్, ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక కన్వీనర్, న్యాయవాది శశిభూషణ్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ పాల్గొన్నారు. -
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం మండలంలోని పాలెం రైతువేదికలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని గుర్తించడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశించిన మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
శిక్షణ ఎవరికి ఇవ్వాలి?
● అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ● ఏఓ, ముగ్గురు ఏఈఓలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశం అమరచింత: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు హాజరుకాకపోతే శిక్షణ ఎవరికి ఇస్తారంటూ జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్పై కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి రైతువేదికలో వరి కొనుగోళ్లపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు వ్యవసాయశాఖ, పీఏసీఎస్, ఐకేపీ శాఖల అధికారులు హాజరయ్యారు. శిక్షణకు ఎంతమంది నిర్వాహకులు హాజరయ్యారనే విషయాన్ని హాజరు పట్టికను పరిశీలించి తెలుసుకున్నారు. పలు కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రాకపోవడంతో ఇక్కడ ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. శిక్షణకు రాకపోతే తేమశాతం ఎలా గుర్తిస్తారు, వరి ధాన్యం ఎలా కొంటారని నిలదీశారు. శిక్షణకు కేంద్రాల నిర్వాహకులను కాకుండా రైతులను ఎలా పిలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. శిక్షణకు హాజరుకాని వారితో పాటు ఏఓ అరవింద్తో పాటు ముగ్గురు ఏఈఓలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మరోమారు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, గృహ నిర్మాణశాఖ డీఈ విఠోబా, జిల్లా సహకారశాఖ అధికారి రాణి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఏడీఏ దామోదర్, తహసీల్దార్లు రవికుమార్యాదవ్, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే.. డ్రైడే నిర్వహించాలి.. వనపర్తి: జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తున్నందున నవంబర్ 15 వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో అబా కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా డెంగీ పరీక్షలు కూడా కొనసాగించాలని సూచించారు. ఏఎన్ఎంలతో ఎన్సీడీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంసీహెచ్లో ప్రెజర్ ఆక్సిజన్, ఇంక్యుబేటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు సాయినాథ్రెడ్డి, రామచందర్రావు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ పోస్ట్ ఏర్పాటుతో మరింత భద్రత
అమరచింత: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటుతో ప్రజలతో పాటు డ్యాం భద్రతపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మండలంలోని పీజేపీ క్యాంపు సమీపంలో ఉన్న సత్యసాయి వాటర్ స్కీం పక్కన పోలీస్ అవుట్ పోస్టు భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.కోటితో ఆధునిక సాంకేతికతతో భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో అవుట్ పోస్టును ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అమరచింత పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ముందుండాలని, క్రైం రేట్ను తగ్గించాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించారు. స్టేషన్ ఆవరణను ఆహ్లాదకరంగా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాలు అన్ని గ్రామాలతో పాటు పట్టణంలో ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి ఉన్నారు. పట్టుదలతో లక్ష్యసాధన సులభమే.. వనపర్తి: పట్టుదలతో కృషి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభమేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అండర్–14 ఉమ్మడి జిల్లా సైకిల్రేస్ పోటీల్లో సత్తా చాటిన గోపాల్పేటకు చెందిన మనస్వీ, జ్ఞాపికను ఆయన అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్నవారి పిల్లల్లో ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయని.. తల్లిదండ్రులే గురువులుగా మారి మెళకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఉర్సు ఐక్యతకు చిహ్నం..
వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహించే ఉర్సు, గ్రామ దేవతల పండుగలు ప్రజల ఐక్యతను చాటి చెబుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరులోని హజ్రత్ షేఖ్ అలీషా తాతయ్య ఉర్సులో వారు వేర్వేరుగా పాల్గొని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లో సర్వమత సమ్మేళనంగా అందరూ అన్ని పండుగలను జరుపుకొంటారని, దీంతో కొత్త వ్యక్తుల మధ్య సైతం స్నేహ బంధం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంచిపెట్టారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమోదిని, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, రంజిత్కుమార్, సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, యాపర్ల రాంరెడ్డి, యుగంధర్రెడ్డి, వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగం చిరస్మరణీయం
వనపర్తి: దేశ సరిహద్దులో సైనికుడు ఎంత కీలకమో.. రాష్ట్ర భద్రతలో పోలీసులు కూడా అంతే ముఖ్యమని, పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్డే) ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అధికారులు, సిబ్బందితో కలిసి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరున పరామర్శించి శాలువాతో సన్మానించి చిరు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా అవసరాలు, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీసుశాఖ అన్నారు. సమాజంలో శాంతిస్థాపన కోసం అసాంఘిక శక్తులు జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని.. వారి స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, సాంకేతిక వినియోగం, ప్రజారక్షణలో పోలీసుల పాత్ర, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
కమీషన్.. అందేనా?
●కమీషన్ డబ్బులు రాలే.. ఐకేపీ ద్వారా పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లి, చంద్రప్పతండాలో కేంద్రాలు ఏర్పాటుచేసి వరి ధాన్యం సేకరించి గోదాములకు తరలించాం. మా సంఘానికి క్వింటాకు రూ.32 కమీషన్ చెల్లిస్తామన్నారు. వానాకాలం, యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాం. ఇప్పటి వరకు కమీషన్ డబ్బులు అందలేదు. – కె.పద్మ, గ్రామ సంఘం అధ్యక్షురాలు, పాంరెడ్డిపల్లి మిగిలేవి 45 శాతమే.. అధికారుల ఆదేశాల మేరకు ప్రతి సీజన్లో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత చేపడుతున్నాం. ప్రభుత్వం చెల్లించే కమీషన్ డబ్బుల్లో తమ సంఘం కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి వస్తోంది. వచ్చిన డబ్బులను సమాఖ్య అభివృద్ధితో పాటు సేవలు అందించిన వారికి ఇవ్వాలి. – వెంకటమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఈర్లదిన్నె ఉన్నతాధికారులకు నివేదించాం.. 2023–24 సంవత్సరం వానాకాలం, యాసంగికి సంబంధించిన కమీషన్ డబ్బులు ఇదివరకే చెల్లించాం. 2024–25 సీజన్ కొనుగోలుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా చెల్లింపులు జరగాల్సి ఉంది. వచ్చిన వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేస్తాం. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరచింత: జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు 2024–2025 వానాకాలం, యాసంగి కమీషన్ సుమారు రూ.15.99 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు నుంచి గోదాములకు తరలించే వరకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నా.. కమీషన్ డబ్బులు సకాలంలో అందకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కొనుగోళ్లుకు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా 2023–2024 వానాకాలం, యాసంగి కొనుగోళ్ల కమీషన్ డబ్బులు సుమారు రూ.9 కోట్లు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. క్వింటా కొనుగోలుపై ప్రభుత్వం రూ.32 చెల్లిస్తుండటంతో ఐకేపీతో పాటు మెప్మా, పీఏసీఎస్ సంఘాలు రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతుల పొలాల వద్దే ధాన్యం సేకరిస్తూ ఇటు అన్నదాతలకు, అటు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు మంజూరైన కమీషన్ డబ్బుల్లో కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకునే సదుపాయం కల్పించడంతో కొనుగోళ్లపై వారు అనాసక్తి కనబరుస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకుఅందని డబ్బులు రెండు సీజన్లకుగాను రూ.15 కోట్ల పైచిలుకు బకాయి జిల్లావ్యాప్తంగా 368 కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఎదురుచూపులు -
కేంద్రాల నిర్వాహకులకు పకడ్బందీ శిక్షణ
వనపర్తి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం సేకరణపై బుధ, గురువారం పకడ్బందీ శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వాహకులకు శిక్షణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓల ఆధ్వర్యంలో ఎఫ్ఏక్యూ ప్రమాణాలు కలిగిన ధాన్యం గుర్తించడం, తేమశాతాన్ని నిర్ధారించడం, సన్న, దొడ్డు రకాల గుర్తింపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పంట చేతికొచ్చే సమయానికి అనుకూలంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా గత సీజన్లో ఏర్పాటుచేసిన సన్న, దొడ్డు రకం ధాన్యం కేంద్రాల వివరాలను పరిశీలించి ఈసారి ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డీసీఓ రాణి, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల స్కూళ్లకు కొమురంభీం పేరు పెట్టాలి
వనపర్తిటౌన్: రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల పేర్లను కొమురంభీం పేరుతో పిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూవాహిని ఉమ్మడి పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబులు చేసిన దోపిడీ, దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించి శ్రీజల్–జంగిల్–జమీన్శ్రీ నినాదంతో 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరంభీం త్యాగనిరతి మరువలేమన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడి పేరు, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తుల పేర్లు చరిత్రలో పదిలంగా ఉండటంతో పాటుగా, ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు గిరిజన గురుకులాల పాఠశాలలకు కొమరంభీం పేరు పెట్టాలన్నారు. కొమరంభీం త్యాగ ఫలితాలను పాఠ్య పుస్తకాల్లో పొందిపర్చి భావితరాలకు అందజేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం పేరు పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా హిందూవాహిని ఆధ్వర్యంలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అరుణ్గౌడ్, కోకన్వీనర్ శ్రీకాంత్, నవీన్, శరత్, రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
● ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 27న లక్కీడిప్ ద్వారా దుకాణాల కేటాయింపు మహబూబ్నగర్ క్రైం: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించగా ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5,183 దరఖాస్తులు వచ్చాయి. అయితే 2023 సంవత్సరంలో చేసిన టెండర్ల ప్రక్రియ కంటే ఈసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గడంతో మరోసారి గడువు పెంచారు. ఈ నెల 23 వరకు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఈ నెల 27న కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా దుకాణాల కేటాయింపు చేయనున్నారు. మద్యం వ్యాపారులకు మరో మూడు రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కొంత మేర టెండర్లు పెరగవచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. -
పండుగ సంతోషం నింపాలి.. విషాదం కాదు
వనపర్తి: దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. పండుగ ఉత్సాహంలో భద్రతను విస్మరించకుండా.. టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలని, రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దని కోరారు. సింథటిక్ దుస్తులు ధరించకుండా, నూలు దుస్తులు ధరించాలని, టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా వెళ్లాలని, వెలగని వాటిని మళ్లీ ముట్టిచేందుకు ప్రయత్నించకూడదని సూచించారు. నీరు, ఇసుక బకెట్ సమీపంలో ఉంచుకోవాలని, టపాసుల గోదాంలు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. వెలగని టపాసులను నీటిలో వేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. పర్యావరణ హితం కోసం ఎకో ఫ్రెండ్లీ టపాసులు వాడాలని, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపావళి వెలుగులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, అజాగ్రత్త వల్ల చీకటి తెచ్చుకోవద్దని, భద్రతతో పండుగ జరుపుకుంటేనే నిజమైన దీపావళి సార్థకమవుతుందన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ శ్రీసాక్షిశ్రీకి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఒక్కో లారీకి ప్రత్యేక రేటు కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
వీరులారా.. వందనం
ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇక్కడి నుంచే ప్రకటన శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
వెలుగుల దీపావళి
వనపర్తి టౌన్: దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పూలు, ప్రమీద, బాణాసంచా దుకాణాలు ప్రజలతో కిక్కిరిశాయి. మండల కేంద్రాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో పండుగ సామగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన వాహనదారులతో రోడ్లన్నీ నిండిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూజ సామగ్రి, బాణసంచా కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద ప్రజలు చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆదివారం సంత కావడం, పండుగ సరుకులు కొనేందుకు ప్రజలు తరలిరావడంతో మార్కెట్ పరిసరాల్లో కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు ఆలయాలను విద్యుదీపాలతో అలంకరించారు. ప్రతి ఇంట ముందు దీపం వెలిగించడానికి మట్టి ప్రమీదలు తీసుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపడంతో వాటికి డిమాండ్ భారీగా పెరిగింది. దీపావళికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, హనుమాన్టేకిడి, శంకర్గంజ్, కమాన్ చౌరస్తాల్లో పాదాచారులతో పాటు ద్విచక్రవాహనాలతో సందడి నెలకొంది. రూపాయి నుంచి రూ.4వేల వరకు టపాసుల దుకాణాల్లో ఒక్క రూపాయి విలువ కలిగిన బాణాసంచా నుంచి రూ. 4వేల విలువ కలిగినవి కూడా అందుబాటులో ఉంచారు. చిచ్చుబుడ్డీలు, కాకరవత్తులు, వంకాయ బాణాలు, భూ చక్రాలు, తుపాకులు, రాకెట్, లక్ష్మి టపాసులు, వన్షాట్, 10 షాట్స్, 25 షాట్స్, 1000 షాట్స్, తదితర టపాసులను వ్యాపారస్తులు సిద్ధం చేసిన స్టాల్స్లో ఉంచారు. స్టాల్స్ వద్ద అకస్మత్తుగా ప్రమాదాలు జరిగితే నివారించేందుకు సెప్టీ సిలిండర్, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే బాణాసంచా దుకాణాల వద్ద విక్రయాల జోరు కొనసాగింది. ఏదైనా ప్ర మాదం జరిగితే అన్ని టపాసు ల షాపులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉందని, స్టాల్స్ ఏర్పాటు చేసిన డాక్టర్ బాలక్రిష్టయ్య క్రీడా ప్రాగంణంలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పూలు, ప్రమీదలు కొనుగోళ్లతో మార్కెట్ బిజీబిజీ బాణాసంచాల దుకాణాల్లో కిక్కిరిసిన ప్రజలు ప్రయాణికులతో రద్దీగా బస్సులు -
విష సంస్కృతికి బీజం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై వార్తలు రాశారన్న కారణంతో సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదు. మీడియాపై దాడులు విష సంస్కృతికి బీజం వేస్తుంది. – అరవిందస్వామి బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడులు సరికాదు. పత్రిక స్వేచ్ఛను కాపాడే బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వాలే పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని పౌర సమాజం ఖండించాలి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం హేమమైన చర్య. అక్రమంగా పెట్టిన కేసులను భేషరత్గా ఉపసంహరించుకోవాలి. – పవన్కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
హరిత దీపావళికి సహకరించాలి
వనపర్తి విద్యావిభాగం: దీపావళి పండుగను పురస్కరించుకొని గాలి కాలుష్యం చేసే బాణాసంచాకు దూరంగా ఉండి హరిత దీపావళికి సహకరించాలని జిల్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన ఎకో బజార్కు శనివారం ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కళాశాల క్యాంపస్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శించారు. అలాగే అమ్మకానికి ఉన్న వివిధ రకాల సహజ ఉత్పత్తుల గురించి విద్యార్థులతో తెలుసుకున్నారు. కళాశాల టీచింగ్, నాన్టీచింగ్తో పాటు కళాశాల విద్యార్థులు, వారి వారి గ్రామాల్లో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, క్యాంపస్ ఎకో బజార్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమ, లెక్చరర్లు ధామ్సింగ్, రామకృష్ణ, మూర్తి, మల్లికార్జున్, స్వప్న, నాగలక్ష్మి, వెంకటస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలు అందరికీ సమానం ఆత్మకూర్: చట్టాలు అందరికీ సమానమే అని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శిరీష అన్నారు. శనివారం మండలంలోని బాలకిష్టాపూర్లోని కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, ఉన్నత చదువులతో లాభాలు, పోక్సో చట్టం, ర్యాగింగ్ తదితర విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. కేజీబీవీ ఎస్ఓ స్వప్న, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ముందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లు గద్వాల: ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్లో 2025–26వి ద్యాసంవత్సరంలో చదివేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ గొప్ప అవకాశం అని తెలిపారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను 1780మంది అభ్యర్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఇప్పటి వరకు 1065 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17సెంటర్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
ప్రశ్నిస్తే కేసులా..
సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని జర్నలిస్ట్, ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగడుతన్న సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో నివదించారు.


