breaking news
Wanaparthy
-
పొగతో సావాసం
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో పారబోసి తగులబెట్టడంతో పొగతో బాధపడుతున్నాం. డంపింగ్ యార్డుకు తీసుకెళ్లమని చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. – శేఖర్, పెబ్బేరు రెండు రోజులకోసారి.. కొత్తకోట మున్సిపాలిటీలో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకెళ్లిన చెత్తను శివారులో తగులబెడుతున్నారు. దీంతో దు ర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. – లాల్కోట రవి, కొత్తకోట రూ.25 లక్షలు వెచ్చించినా.. చెత్తను ప్రాసెస్ చేయడం కంటే తగులబెట్టడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.25 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించినా ఉపయోగం లేదు. ప్రయాణికులతో పాటు సెగ్రిగేషన్ షెడ్డు సమీపంలోని కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్న వారందరూ పొగను పీల్చుకోలేక రోగాల బారిన పడుతున్నారు. – చంటి, అమరచింత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను నిత్యం డంపింగ్ యార్డుకు తరలించి, వాటి నుంచి ప్లాస్టిక్, ఇనుప వస్తువులను వేరు చేస్తున్నాం. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆదాయం సమకూర్చి, మున్సిపల్ అభివృద్ధికి వినియోగిస్తున్నాం. – శశిధర్, మున్సిపల్ కమిషనర్ ఆత్మకూర్ ● -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్గల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి మోసం చేసే ఫర్టిలైజర్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, మాందాపూర్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏఓ రాజవర్ధన్రెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణం వద్ద ఎరువుల ధరల వివరాలు నమోదు చేయాలని, దుకాణంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. అనంతరం దుకాణాలల్లో రికార్డులు, ఈ–పాసు యంత్రాలను పరిశీలించారు. యూరియా వాడకం తగ్గించాలి వానాకాలం సాగులో యూరియా వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించినట్లు డీఓ గోవింద్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. విత్తనాలు, ఎరువులు ఎంపికలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని కోరారు. మల్లాయిపల్లి, దొండాయిపల్లి రైతువేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయా గ్రామాల ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఈఓ అఖిల తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వనపర్తి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిరంతరం సూపర్వైజర్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాలను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే స్టాక్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా ఫార్ములాలను అనుసరించి పాఠ్యాంశాలను నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణిత శాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగి విద్యార్థుల ద్వారా సమాధానాలను రాబట్టారు. హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల సందర్శన జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థుల మా ర్కులను పరిశీలించిన కలెక్టర్, వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులు అంజి, వెంకటమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీవో శుభలక్ష్మి, హౌసింగ్ డీఈ విఠోబా, తహసీల్దార్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రోగులతో గౌరవంగాప్రవర్తించాలి వనపర్తి: వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స చేయడమే కాకుండా, ఉత్తేజమైన మాటలతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నర్సింగాయపల్లి పరిధిలోని ఎంసీహెచ్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికోస్ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వైద్య విద్యార్థులను అభినందించారు. వైద్య వృత్తిలో ఉన్న వారు ఎక్కడ ఉన్నా.. ఆ స్థానిక భాషను నేర్చుకొని రోగులతో స్నేహపూర్వకంగా మెలిగితే వారికి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ సమక్షంలో వైద్య విద్యార్థులు కేక్ కట్ చేశారు. కలెక్టర్ నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్మయి, జీజీహెచ్ సూపరిటెండెంట్ రంగారావు తదితరులు ఉన్నారు. -
3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..
మరమ్మతుల కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా.. పట్టింపు లేకుండాపోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత మరమ్మతులకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదన చేయగా.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్లోని ఎనిమిది గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలని భావించగా.. వీటి కోసం ఫిబ్రవరి నెలలో రూ.కోటి మంజూరు చేశారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా.. పురోగతి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తగలబెడుతున్నారు!
● ఆత్మకూర్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 5,050 నివాస గృహలు ఉండగా.. 19 వేల జనాభా ఉంది. 28 మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒక ట్రాక్టర్, 3 ఆటోల ద్వారా నిత్యం 700 కిలోల తడి, టన్ను పొడి చెత్త సేకరిస్తున్నారు. వీటిని డంపింగ్ యా ర్డుకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. అమరచింతలోని చింతలకుంట సమీపంలో పారబోసిన చెత్త● కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 6 వేల ఇళ్లు ఉండగా 23 వేల మంది నివసిస్తున్నారు. 23 మంది పారిశుద్ధ్య కార్మికులు 2 ట్రాక్టర్లు, 4 ఆటోల ద్వారా ఇళ్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. వీటిని పట్టణానికి కిలో మీటరు దూరంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలించలేక సమీప కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో పారబోసి తగలబెడుతున్నారు. -
జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 73.521 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 86.948 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రెండు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 160.469 మి.యూ విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి ఉపయోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 150 క్యూసెక్కుల నీరు పారుతుండగా.. సమాంతర కాల్వకు సరఫరా లేదన్నారు. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 610 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. కోయిల్సాగర్ @ 20.6 అడుగులు.. దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 20.6 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11అడుగులుగా ఉన్న నీటిమట్టం 9.6 అడుగులు పెరిగి 20.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు ఉండగా మరో 6 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి నీటిమట్టం చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లేవల్ వరకు నీటిమట్టం 32.6 అడుగులు ఉండగా మరో 12 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఈ ఏడాది జూన్ చివరి వరకే నీటిమట్టం బాగా పెరగడం ఇదే మొదటిసారి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వివరాలు ఆన్లైన్ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా పర్యటనకు రాగా కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వైద్య కళాశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మాత, శిశు వైద్యశాలపై ప్రిన్సిపాల్ కిరణ్మయి ప్రొజెక్టర్ ద్వారా ప్రస్తుతం ఉన్న వసతులు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వివరించారు. ప్రొఫెసర్లు, అసోసియట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉందని, విద్యార్థులు ట్రాన్స్పోర్టేషన్, క్యాడవర్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సీఈఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి వసతులు, డయాలసిస్ చేయించుకునే వారి వివరాలు, సమస్యలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ సిబ్బందితో మాట్లాడి రోజు ఎన్ని క్లెయిమ్స్ చేస్తున్నారు? వస్తున్న అవుట్ పేషంట్ల సంఖ్య ఎంత.. ఉదయాన్నే విధులకు రాగానే ఎవరు ఏయే పనులు చేస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం.. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరగాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని పడకలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా మెడికల్ కో–ఆర్డినేటర్ డా. రమాదేవి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఆన్లైన్ పోర్టల్లో వివరాల నమోదు తప్పనిసరి ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్కుమార్ -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుదారులకు వినతులపై తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 87 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. ఎస్పీ గ్రీవెన్స్కు 14 వినతులు.. వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 14 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనంతరం సంబంధిత ఠాణాల ఎస్ఐ, సీఐలకు ఫోన్ చేసి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. 8 భూ తగాదాలు, 4 కుటుంబ ఘర్షణలు, రెండు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
పురం.. అధ్వానం
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం పట్టణవాసులకు శాపంగా మారుతోంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగతా కాలనీల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగంతా రహదారులపై పారుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఇళ్ల ముంగిట మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నామని ఆయా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్నిచోట్ల కాలనీవాసులే మురుగు తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫొటోలకే పరిమితం.. పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక రూపొందించినా.. అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. ఫొటోల కోసం ఓ చిన్న ప్రాంతంలో హడావుడి చేయడం తప్పితే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జూన్ 2 నుంచి వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తూతూమంత్రంగా చేపడుతుండటంతో స్వచ్ఛ ఆశయం మరుగున పడుతోంది. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, వారితో కలిసి శ్రమదానం చేయడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపర్చాలి. వారితో అధికారులు ప్రతిజ్ఞ చేయించాల్సి ఉంది. ఒకటి, రెండుచోట్ల మొ క్కుబడిగా సమావేశాలు నిర్విహించడం మిగతా చోట్ల ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. కొత్త కాలనీల్లో.. వేధిస్తున్న సిబ్బంది కొరత.. పురపాలిక వార్డులు జనాభా పారిశుద్ధ్య కార్మికులు వనపర్తి 33 70,416 150 పట్టణంలో ఏర్పడిన కొత్త కాలనీల్లో మురుగు కాల్వలు, రహదారులు లేక రోడ్లు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అంతర్గత వీధుల్లో రహదారులపై పారుతున్న మురుగు వంద రోజుల ప్రణాళిక అమలులోనూ నిర్లక్ష్యం తూతూమంత్రంగా పనులు పట్టించుకోని అధికారులు -
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలి
కొత్తకోట రూరల్: రైతులు ఆయిల్పామ్ సాగుచేసేలా అధికారులు ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలో రైతులు నాగరాల తిరుపతిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పొలాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఆయిల్పామ్ సాగు చేసిన రైతులతో మాట్లాడి ఎకరాకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత దిగుబడి వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గెలలను పరిశీలించి అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 2025–26 సంత్సరంలో జిల్లాలో 3,500 ఎకరాల ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించారని.. అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని రైతులకు కావాల్సిన డ్రిప్ పరికరాలు, మొక్కలను అందించాలని కోరారు. జిల్లాలోని 15 మంది రైతులు 41 ఎకరాల్లో మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, ఉద్యాన అధికారి వి.విజయభాస్కర్, అధికారులు ఎన్.సురేష్, ఆర్.కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్రెడ్డి, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ అధికారి, ఏరియా మేనేజర్, డ్రిప్ కంపెనీ అధికారులు, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బీచుపల్లియాదవ్, రైతులు హరీశ్రెడ్డి, బుచ్చన్న, మాదన్న, మోహన్రెడ్డి, రాంచందర్రెడ్డి తదితరులు ఉన్నారు. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణాలకు శంకుస్థాపన.. కొత్తకోట: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణాలకు సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.33 లక్షల వ్యయంతో భవనాలు నిర్మిస్తున్నామని, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లను ఆధునికీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మండల విద్యాధికారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ
వనపర్తి రూరల్: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని చందాపూర్లో పార్టీ మండల అధ్యక్షుడు సందా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఆయనతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, అయ్యంగారి ప్రభాకర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటీ పడావో.. బేటీ బచావో పథకంతో మొదలుకొని పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్, ఉచిత బియ్యం ఇలా అనే పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా వారు పంచాయతీ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, కుమారస్వామి, బాలరాజు, వాకిటి సుదర్శన్, చిన్న నర్సింహ, రాఘవేందర్, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్’ లక్ష్యం
పాన్గల్: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంటలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అర్హులందరికీ రైతు భరోసా.. రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని.. గ్రామాల వారీగా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు అర్హత ఉన్న రైతు భరోసా రాలేదని.. మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్లు తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. -
డ్రెయినేజీలు నిర్మించడం లేదు..
మా కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా నేటికీ స్పందించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీరంతా రహదారులపై పారుతోంది. పారిశుద్ధ్య కార్మికులు కూడా రాకపోవడంతో మేమే తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. – చెన్నయ్య, రాంనగర్కాలనీ దుర్వాసన భరించలేకపోతున్నాం.. మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక మురుగంతా ఖాళీ ప్రదేశాల్లో నిలుస్తోంది. దోమలు, పందుల బెడదతో సతమతం అవుతున్నాం. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. – సంపూర్ణ, కాలనీవాసి, 11వ వార్డు భయంగా బతుకుతున్నాం.. మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మరుగు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో విషపు పురుగుల సంచారం పెరిగింది. దీంతో భయం భయంగా బతుకుతున్నాం. పిచ్చి మొక్కల తొలగింపునకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. – నిరంజన్పాషా, కొత్తకోట రోడ్ ● -
చినుకు రాలక.. చింత తీరక..
తిర్మలాయపల్లి శివారులో వాడుముఖం పట్టిన మొక్కజొన్న రోహిణి కార్తెలో ముందస్తుగా వర్షాలు కురవడంతో పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసిన అన్నదాతలు పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం వంటి మెట్ట పంటలు సాగు చేశారు. తర్వాత చినుకు రాలక పంటలు మొలక దశలోనే వాడుముఖం పడుతున్నాయి. 20 రోజులుగా మబ్బులు, ఈదురుగాలులు మినహా వాన చినుకు రాలడం లేదు. దీంతో రైతు చేసేది లేక రోజు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం మండలంలో పత్తి 960 ఎకరాలు, జొన్న 370 ఎకరాలు, మొక్కజొన్న 430 ఎకరాలు, ఆముదం 50 ఎకరాలు మొత్తం 1,810 ఎకరాల మెట్ట పంటలు సాగైనట్లు తెలుస్తోంది. మొలకలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. – ఖిల్లాఘనపురం -
అందిన పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ బడుల్లో 90 శాతం పంపిణీ పూర్తి ●కొత్త పుస్తకాలు ఇచ్చారు.. గతంలో పాఠశాలలు తెరిచిన కొన్ని రోజుల తర్వాత పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు. ఈసారి ముందుగానే తరగతిలో ఉన్న వారందరికి కొత్త పుస్తకాలు అందించారు. దీంతో ప్రారంభం నుంచే విషయాల వారీగా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో రోజువారీగా పుస్తక పఠనంతో పాటు ప్రశ్నలకు జవాబులు రాసుకొని ఉపాధ్యాయులకు అప్పజెబుతున్నాం. – చరణ్, 4వ తరగతి, నందిమళ్ల పాత పుస్తకాలు ఇచ్చేవారు.. గతంలో కొత్త పాఠ్య పుస్తకాలు సకాలంలో రాకపోవడం, అరకొరగా రావడంతో ఉపాధ్యాయులు పాత పుస్తకాలు సరి చేసేవారు. ఈ ఏడాది మాత్రం తరగతిలో అందరికి కొత్త పుస్తకాలు ఇవ్వడంతో పాటు పాఠాలు కూడా బోధిస్తున్నారు. వీటితో పాటు ఒక జత యూనిఫాం కూడా ఇచ్చారు. – రమ్య, 5వ తరగతి, నందిమళ్ల 90 శాతం పంపిణీ పూర్తి.. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. 2,54,650 వచ్చాయి. మిగిలిన 8 వేల పుస్తకాలు వచ్చిన వెంటనే మండలాల వారీగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఈసారి ముందస్తుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో రోజువారి తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తవుతుంది. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి అమరచింత: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బడిబాట కార్యక్రమం కంటే ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం ఆచరణలో సాధ్యమైంది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలు ఆయా మండలాల విద్యాధికారులకు చేరడం, వాటిని పాఠశాలల వారీగా తరలించడం వంటి కార్యక్రమాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు బడులకు వచ్చిన వెంటనే వారి చేతికి పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో ఇప్పటి వరకు 90 శాతం పంపిణీ పూర్తయిందని విద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 2,54,650 రాగా పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా సరఫరా చేశారు. విద్యార్థులకు ఈసారి పాఠ్య పుస్తకాలతో పాటు ఒకజత యూనిఫామ్ను సైతం ముందస్తుగా అందించారు. పాత, కొత్త విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరడంతో తరగతుల నిర్వహణ సజావుగా సాగుతుందని, విద్యార్థులకు విషయాల వారీగా తరగతులు ప్రారంభించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. బడిబాట కంటే ముందే.. పాఠశాలలు తెరవకముందే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో విద్యాధికారులు సఫలీకృతమయ్యారు. జూన్ 16 వరకు కొనసాగిన బడిబాటలో ఉపాధ్యాయులు పాఠశాల క్లస్టర్ల వారీగా విద్యార్థుల నమోదుతో పాటు డ్రాపౌట్ విద్యార్థులను బడికి రప్పించేందుకు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లాలో 558 సర్కారీ పాఠశాలలు సకాలంలో ప్రారంభమైన తరగతులు ఒక జత యూనిఫామ్స్ కూడా.. -
జూలై 5న ‘పాలమూరు’ సదస్సు
వనపర్తిటౌన్: పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై జూలై 5న పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు పాలమూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వేదిక ప్రతినిధులు వెంకటేశ్వర్లు, యోసేపు కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న దొడ్డి కొమురయ్య హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు సదస్సు కొనసాగుతుందని.. పాలమూరు శాశ్వత వెనుకబాటుతనంపై చర్చించడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బీజేపీవనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో గడప గడపకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి కోరారు. ఆదివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, సీనియర్ నాయకుడు కొమ్ము శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాములు, మండల ప్రధానకార్యదర్శి శివ, ఎల్లస్వామి, చరణ్, విరాట్, శివ, రాయన్నసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయాల సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. విగ్రహావిష్కరణలో మాజీ మంత్రులు -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తిటౌన్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకు రూ.10,29,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సాయం అందజేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సమద్ మియా, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, పార్టీ పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న యాదవ్, ఏఐపీసీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగార్జున, నాయకులు ఆవుల చంద్రశేఖర్, రాగి అక్షయ్, కోళ్ల వెంకటేష్, రాగి వేణు, మణిగిళ్ల బాలరాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత ● రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు ● పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు ● 2 వేలకుపైగానే ఎఫ్లైన్ అర్జీలు పెండింగ్ ● తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు రికార్డులు శిథిలావస్థకు.. ఉమ్మడి ఇల్లాలో సర్వే చేసేందుకు సిబ్బంది కొరతతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. రీ సర్వే చేయకపోవడంతో చాలా కార్యాలయాల్లో రికార్డులు శిథిలావస్థకు చేరాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ సంతకం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసేలా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. దీని ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనిపై చర్యలకు అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. లైసెన్స్ సర్వేయర్ తప్పు చేస్తే ఏమి టి పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇందుకోసం సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరిస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనుంది. మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జోగుళాంబ గద్వాల 20 9 11 నాగర్కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 జిల్లాల వారీగా ఇలా.. -
మెనూ విధిగా పాటించాలి
గోపాల్పేట: వసతిగృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందుబాటులో ఉండి మెనూ పాటించేలా చూసుకోవా లని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తినేముందు ప్లేట్లు, చేతులు కడుక్కునేందుకు నీరు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు. బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వార్డెన్ రమేష్గౌడ్ ఉన్నారు. -
మత్తుకు బానిసైతేభవిష్యత్ నాశనం
ఆత్మకూర్: విద్యార్థులు, యువత మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని.. దూరంగా ఉండాలని ఆత్మకూర్ జూనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి శిరీష కోరారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్, ధూమపానం, మద్యం లాంటి చెడు అలవాట్లకు యువత ఆకర్శితులై బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుపై దృష్టిసారించి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని, గ్రామాల్లో సైతం మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, బాలల హక్కులకు భంగం కలిగించే వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, ప్రధానకార్యదర్శి ముక్తేశ్వర్, సీనియర్ న్యాయవాదులు తిప్పారెడ్డి, రామేశ్వర్రెడ్డి, నారాయణగౌడ్, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, కురుమూర్తి పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 800 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. 19.6 అడుగులకు కేఎస్పీ నీటిమట్టం.. దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రం వరకు 19.6 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదలను కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటి మట్టం 8.6 అడుగులు పెరిగింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్ల లేవల్ వరకు నీటి మట్టం 32.6 అడుగులుగా ఉంది. ‘కేంద్ర పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి’ వీపనగండ్ల: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకుడు ఎల్లేని సుధాకర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, మహిళలుకు 33 శాతం రిజర్వేషన్, ట్రిబుల్ తలాక్ లాంటి అనేక సమస్యలను పరిష్కరించిందని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర, కిసాన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్గౌడ్, పార్టీ మాజీ మండల అఽధ్యక్షుడు నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరేష్, రాకేష్యాదవ్, కృష్ణ, రవిగౌడ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
నేడు సాయిచంద్ విగ్రహావిష్కరణ
అమరచింత: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం గిడ్డంగులశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జానపద కళాకారుడు సాయిచంద్ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీసంఖ్యలో హాజరు కానున్నారు. బహిరంగ సభ నిర్వహణకు కావాల్సిన స్థలంతో పాటు సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమానికి వచ్చిన వారికి భోజన వసతి కల్పించనుండగా.. నిర్వహణ ఏర్పాట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఫ అమరచింతలో పుట్టి పెరిగిన వేద సాయిచంద్ తన తండ్రి వెంకట్రాములు గానాన్ని వారసత్వంగా స్వీకరించి తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే విప్లవ పాటలకు అకర్షితుడై పీడీఎస్యూ, అరుణోదయ కళాకారుడిగా అరంగేట్రం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ఉద్యమంలో తమ కళాకారులతో కలిసి ఎన్నో జిల్లాల్లో ధూంధాం కార్యక్రమాలు నిర్వహంచి తన గానంతో ప్రతి ఒక్కరి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. శ్రీకాంతాచారి స్మారక సభలో సాయిచంద్ పాడిన ‘రాతి గుండెలో కొలువైన శివుడా..’ అన్నపాట ప్రతి తల్లి హృదయాన్ని కలిచి వేసింది. 2023, జూన్ 20న రాష్ట్ర గిడ్డంగులశాఖ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్న సమయంలో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. రెండో వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సతీమణి రజనీ సాయిచంద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజులుగా పట్టణంలో పర్యటిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. హాజరుకానున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు -
బోనస్.. బకాయి
జిల్లాలో యాసంగి కొనుగోళ్లు పూర్తయినా ప్రారంభం కాని చెల్లింపులు ● 17,900 మంది రైతులు.. రూ.48.92 కోట్లు పెండింగ్ ● వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు ● డబ్బుల కోసం ఎదురుచూపులు వనపర్తి: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినా.. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి చెల్లిస్తామన్న బోనస్ క్వింటాకు రూ.500 చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటే బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సర్కార్.. యాసంగి సీజన్ బోనస్ చెల్లింపులో ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందో అధికారులకు సైతం తెలియకపోవడం శోచనీయం. నిత్యం ఏదో ఒకచోట రైతులు ఈ విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం వద్దనే పెండింగ్ అనే సమాధానమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొత్తం 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తే.. అందులో సుమారు లక్ష మెట్రిక్ టన్నులు సన్నరకమే ఉంది. దీంతో భారీ మొత్తంలో రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన సన్నాల సాగు.. యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 17,900 మంది రైతుల నుంచి సుమారు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. వారికి ధాన్యం డబ్బుల చెల్లింపుతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ రూపంలో సుమారు రూ.48.92 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లా రైతులు కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో మాత్రమే ఎక్కువగా సన్నాలు సాగు చేసేవారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు సన్నాలకు బోనస్ అందిస్తామని చెప్పడంతో పాటు గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటు బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో యాసంగిలో రైతులు పెద్దఎత్తున సన్నాలు పండించారు. గతేడాది వానాకాలంలో సుమారు రూ.10 కోట్ల మేర బోనస్ చెల్లిస్తే.. యాసంగిలో ఆ మొత్తం ఏకంగా రూ.48.92 కోట్లుకు చేరిందంటే ఎంత విస్తీర్ణంలో సన్నాలు సాగు చేశారో అర్థమవుతుంది. వానాకాలంలో మరింత పెరుగుదల.. గతంతో పోలిస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో సన్నాల సాగు జిల్లావ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన సాగునీటి వనరులు, స్వల్పకాలికాల్లోనూ సన్నాల రకం విత్తనాలు అందుబాటులోకి రావటమే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారు. రూ.1.90 లక్షలు రావాలి.. బోనస్ వస్తుందనే ఆశతో యాసంగి సీజన్లో 15 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశా. మొత్తం 380 క్వింటాళ్లు విక్రయిస్తే ఇందుకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. బోనస్ డబ్బులు రూ.1.90 లక్షలు రావాల్సి ఉంది. ఎప్పుడు వేస్తారని ఎదురుచూస్తున్నా. – శేషిరెడ్డి, చెన్నూరు (గోపాల్పేట) త్వరగా చెల్లించాలి.. సన్నరకం వడ్లు వేస్తే క్వింటాకు రూ.500 ఇస్తమని ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో కొంత పొలం దొడ్డు రకం, కొంత పొలం సన్నరకం సాగు చేశా. సన్న రకం వరి 30 క్వింటాళ్లు పండితే కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా బోనస్ రాలేదు. త్వరగా చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయి. – భద్రయ్య, తిర్మలాయపల్లి (ఖిల్లాఘనపురం) ప్రభుత్వానికి నివేదించాం.. జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన బోనస్ వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతాయి. ఈ విషయంలో రైతులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్ -
సోమశిలకు సొబగులు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్(సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● కృష్ణాతీరంలోని సుందరప్రాంతాలు, నల్లమలలోపర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ● జటప్రోలు, కొల్లాపూర్లోని పురాతన ఆలయాల అనుసంధానం ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం -
డిసెంబర్ నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ.3.50 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సాగునీరు విడుదల
వీపనగండ్ల: మండలంలోని గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి శనివారం అధికారులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కాల్వలకు సాగునీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ అవుట్ ఫాల్ గేట్లను ఎత్తడంతో మండలంతో పాటు చిన్నంబావి మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరు అందుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం ఉమ్మడి మండలంలోని రైతులు సకాలంలో వరి తుకాలు పోసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేసినట్లు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్యాదవ్, మాజీ సర్పంచ్లు బీచుపల్లి యాదవ్, రంజిత్కుమార్ వివరించారు. కార్యక్రమంలో జూరాల ఇరిగేషన్ డీఈ భావన తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్పేట: నిజామాబాద్లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్ 15 బాలుర ఫుట్బాల్ పోటీలకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ సురేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ నెల 18న జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారని.. జిల్లా నుంచి 18 మంది పాల్గొంటుండగా గోపాల్పేట విద్యార్థులు ప్రశాంత్, బాబునా యక్, సాయి మణికంఠ, మహేష్, చరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పీడీతో పాటు ప్రధానోపాధ్యాయుడు రాందేవ్రెడ్డి అభినందించారు. -
నేర రహిత సమాజమే ధ్యేయం : ఎస్పీ
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. యాక్సిడెంట్, మిస్సింగ్, దొంగతనం కేసుల దర్యాప్తులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని.. విధుల్లో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. పోలీస్స్టేషన్లలో రిసెప్షన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలను త్వరగా పరిష్కరించి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని, ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఠాణా ఆవరణలో అనవసర వాహనాలు లేకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉ న్న కేసులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూర్, వనపర్తి సీఐలు శివకుమార్, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, డీసీఆర్బీ, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
●ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 9, యూజీ కోర్సులలో టాపర్స్లో 17 మంది గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ము ఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీ యూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు గవర్నర్కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గవర్నర్ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. స్పాన్సర్లకు అవకాశం.. కాన్వకేషన్లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పీయూలో 4వ కాన్వకేషన్ కు సిద్ధమవుతున్న అధికారులు మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మాలో 88 మందికి గోల్డ్మెడల్స్ రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇచ్చే అవకాశం -
సంత చింత తీరేనా?
ఖిల్లాఘనపురంలో అసంపూర్తిగా వే సైడ్ మార్కెట్ ●రాకపోకలకు ఇబ్బందులు.. మండల కేంద్రంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వేసైడ్ మార్కెట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తిచేసి ప్రారంభించి అన్ని వ్యాపారాలు అక్కడే జరిగేలా చూడాలి. – పాలవాది శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం చేపల మార్కెట్ లేదు.. మండల కేంద్రంలో చేపలు విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ లేదు. కొత్తగా నిర్మించే వేసైడ్ మార్కెట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. నిర్మాణం పూర్తిగాకపోవడంతో మహబూబ్నగర్కు వెళ్లే రహదారి పక్కన విక్రయాలు చేపడుతున్నాం. వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలకు సాగిస్తుండటం ఇబ్బందిగా మారింది. – బెస్త గోపాల్, ఖిల్లాఘనపురం త్వరగా పూర్తిచేస్తాం.. ఖిల్లాఘనపురంలో వే సైడ్ మార్కెట్ నిర్మాణంలో ఉంది. 90 శాతం పనులు పూర్తయ్యాయి.. ఇంజనీరింగ్శాఖ అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు పూర్తి చేయించి వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. వినియోగంలోకి వస్తే కూరగాయలు, చేపలు, మాంసం అన్నింటిని అక్కడే విక్రయించుకునే అవకాశం ఉంటుంది. – స్వరణ్సింగ్, డీఎం, మార్కెటింగ్శాఖ ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో కూరగాయలు, చేపలు, మాంసం రోడ్లపైన విక్రయిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసైడ్ మార్కెట్ భవన నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 90 శాతం పనులు పూర్తి చేసి బిల్లులు రాకపోవడంతో మిగిలిన 10 శాతం పనులు చేపట్టడం లేదు. సీసీ, విద్యుత్ సౌకర్యం తదితర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. సంబంధిత శాఖ అధికారులు, పాలకులు స్పందించి కాంట్రాక్టర్కు బిల్లులు ఇప్పించి మిగతా పనులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు. రోడ్లపైనే విక్రయాలు.. వే సైడ్ మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో యధావిధిగా ఖిల్లాఘనపురం, మామిడిమాడ, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయాలు చేపడుతున్నారు. వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారి పక్కన చేపలు విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన చిరు వ్యాపారులు విక్రయాలు చేపడుతుండటంతో వాహనదారులు, దారి వెంట వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం వారాంతపు సంత రోజున ఇబ్బందులు వర్ణనాతీతం. నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు.. 90 శాతం పనులు పూర్తి బిల్లులు రాక అర్ధాంతరంగా వదిలేసిన కాంట్రాక్టర్ ప్రధాన రహదారులపైనే కూరగాయలు, మాంసం, చేపల విక్రయం ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు, ప్రజలు -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటి మట్టం సాక్షి, నాగర్కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం.. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్లో భాగమైన ఎల్లూర్ పంప్హౌస్లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి జలకళ ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానదిలో కొనసాగుతున్న వరద రిజర్వాయర్లో 125 టీఎంసీలకు చేరువైన నీరు ఈసారి జూన్లోసగానికిపైగా నిండిన శ్రీశైలం జలాశయం కేఎల్ఐ కింద ఆయకట్టుకు సీజన్ ముందు నుంచే నీటి సరఫరాకు అవకాశం -
సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే
మదనాపురం: రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని రామన్పాడు రిజర్వాయర్ వద్ద ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకం ప్రధాన మోటార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులకు అనేక విధాలుగా మేలు చేకూరుతుందని, పేదల ప్రభుత్వమని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు మహేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..
డ్యాం క్రస్ట్గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల పొంచి ఉన్న ముప్పు.. జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల ● -
‘మత్తు’ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరగగా.. సంబంధిత శాఖల నుంచి నివేదిక తీసుకోవడంతో పాటు బాధ్యతలను అప్పగించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లు, పాన్ డబ్బాలు, మద్యం దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నిఘా ఉంచాలని ఎకై ్సజ్శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన 222 యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలకంగా మార్చి ప్రతి నెల మొదటి శుక్రవారం సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని ఆదేశించారు. యాంటీ డ్రగ్ కమిటీ సమావేశాలకు జిల్లా అధికారులు హాజరుకావాలని, అప్పుడప్పుడు తాను సైతం వస్తానని తెలిపారు. పీహెచ్సీలకు అనారోగ్యంతో వచ్చే యువతను నిశితంగా పరిశీలించి మత్తు పదార్థాల అలవాటు ఉందా అనే విషయాలను గుర్తించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. పత్తి, జొన్న తదితర పంటల సాగులో అక్కడక్కడ గంజాయి పండించే అవకాశాలు ఉంటాయని.. వ్యవసాయ విస్తరణ అధికారులు గట్టి నిఘా ఉంచాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణులు కల్తీ కల్లు తాగడంతో ఆరోగ్యం పాడవడంతో పాటు పుట్టబోయే పిల్లలపై దాని ప్రభావం ఉంటుందని.. తాగకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 22 మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2025లో వనపర్తిలో 2, గోపాల్పేట మండలంలో 2, పెబ్బేరులో ఒక కేసు నమోదైందన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, సరఫరా చేసినా, గంజాయి పండించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధ్యాపకులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఒంటరిగా ఉండటం, కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడకపోవడం, కళాశాలకు తరచూ డుమ్మా కొట్టడం, అకస్మాత్తుగా కోపానికి రావడం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తే కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమేలా..?
వనపర్తిశుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు వరప్రదాయిని.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువు పట్టుగా నిలిచే క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్ రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్గేట్లకు ఉన్న ఇనుప రోప్లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీలమయం.. -
నాగులకుంట కబ్జాపై నివేదిక ఇవ్వండి
అమరచింత: పుర పరిధిలోని నాగులకుంట కబ్జాపై సమగ్ర నివేదిక అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రవికుమార్ యాదవ్ను ఆదేశించారు. గురువారం ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంటను పరిశీలించారు. కొన్నేళ్లుగా కుంట స్థలంలో మట్టి వేసి నీరు నిల్వకుండా కొందరు కబ్జా చేస్తున్నారని ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. మిషన్ కాకతీయలో చేపట్టిన కట్ట నిర్మాణం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కుంటలు, చెరువులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఈ ఆంజనేయులు, రైతులు ఉన్నారు. -
విద్యాశాఖలో డీసీఈబీ రగడ!
వనపర్తి టౌన్: జిల్లా విద్యాశాఖలో డీసీఈబీ (డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) కార్యదర్శి కొనసాగింపుపై రగడ మొదలైంది. ఈ పోస్టు కోసం పలువురు ప్రధానోపాధ్యాయులు పోటీ పడుతుండగా.. వారికి ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నేతలు సహకరిస్తూ పోటాపోటీగా పాపులు కదుపుతుండటంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏడాదికి సుమారు రూ.30 లక్షల వరకు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు కావడం.. వీటి వినియోగానికి డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి అధికారం ఉండటంతో ఈ పోస్టుకు డిమాండ్ పెరిగి తమ వర్గానికి చెందిన వారికే కేటాయించాలంటూ ఎమ్మెల్యే, మంత్రితో సిఫారస్ చేయడం విస్మయం కలిగిస్తోంది. ● డీఈఓ డీసీఈబీ కార్యదర్శి నియామకంతో పాటు పలువురు ప్రభుత్వ గజిటెడ్ ఉపాధ్యాయులు, ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ మూడు, ఆరు నెలలకొకసారి సమావేశమై నిధుల వినియోగంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిధుల వినియోగానికి చెక్ పవర్ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శికి ఉండటంతో ఈ పోస్టు దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ కథ.. జిల్లా ఏర్పాటు అనంతరం 2017 నుంచి ఇప్పటి వరకు డీసీఈబీ సెక్రటరీగా జిల్లాకేంద్రంలోని దళితవాడ జీహెచ్ఎం సూర చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఈయనతో పాటు గతంలో విధులు నిర్వర్తించిన ఏఎంఓ సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఎనిమిదేళ్లుగా ఒక్కరినే ఎలా కొనసాగిస్తారని, మరొకరికి అవకాశం ఇవ్వాలని డీఈఓకు ఫిర్యాదులు వచ్చాయి. డీసీఈబీని తాను కాపాడానని, తననే కొనసాగించాలంటూ ప్రస్తుత కార్యదర్శి పట్టుబడుతున్నారు. బాధ్యతల నుంచి తప్పిస్తే డీఈఓ కార్యాలయంలో జరిగే సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఈ పదవిపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం కలెక్టర్ చెంతకు చేరడంతో నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఫీజుల వసూలు ఇలా.. ఎనిమిదేళ్లుగా ఒకే వ్యక్తిని కొనసాగించడంపై విమర్శలు ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటాపోటీ రాజకీయ జోక్యంతోస్పందించేందుకు జంకుతున్న అధికారులు మరొకరికి అవకాశం ఇవ్వాలి.. ఒకే ఉపాధ్యాయుడిని డీసీఈబీ కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగించడం సరైంది కాదు. గతేడాది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశాలు ఉన్నాయి. సీనియర్లను కాదని ఇనాళ్లు ఒక్కరికే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మార్చాలని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలి. – బౌద్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీపీఆర్టీయూ నిబంధనలు పాటిస్తాం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీసీఈబీ కార్య దర్శి నియామకం చేపడతాం. ఈ పోస్టుకు మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అ న్ని విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ య న ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – మహ్మద్ అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థుల నుంచి ఏడాదికి ఒకసారి రూ.110, ప్రైవేట్లోని 9, 10 విద్యార్థులకు రూ.150 పరీక్ష ఫీజులు వసూలు చేస్తారు. అలాగే ప్రైవేట్లోని 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.130 చొప్పున డీసీఈబీ వసూలు చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీసీ బుక్ కోసం రూ.300, ప్రైవేట్ పాఠశాలల నుంచి రూ.600 వసూలు చేస్తారు. ఈ నిధులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించడం, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తారు. ప్రస్తుతం డీసీఈబీలో రూ.37,62,536 నిధులున్నాయి. ఇవేగాక గత విద్యాసంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు చెల్లించిన ఫీజులు జమ చేయాల్సి ఉంది. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, క్షయ నిర్మూలన, ఏఎన్సీ నమోదు, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలు వ్యాప్తిచెంది డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులతో పాటు డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అరికట్టాలని సూచించారు. గతేడాది డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాము, కుక్క కాటుకు చికిత్సలు అందించేలా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. దగ్గు, జ్వరం లక్షణాలున్న ప్రతి ఒక్కరికి నాట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 567 మంది వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా చూడాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్సీ నమోదులు సకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి డా. పరిమళ, సీహెచ్సీ నుంచి డా. చైతన్య, వైద్యాధికారులు పాల్గొన్నారు. స్యామ్, మ్యామ్ పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలి జిల్లాలోని స్యామ్, మ్యామ్ పిల్లలను ఎన్ఆర్సీకి తీసుకెళ్లి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు.. వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 441 మంది ఉన్నట్లు గుర్తించామని, వారందరిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకెళ్లి వారం పాటు వైద్యం చేయించాలన్నారు. అదేవిధంగా బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతినెల మొదటి మంగళవారం గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులను భాగస్వాముల ను చేయాలన్నారు. అంగన్వాడీల్లో ఐదేళ్లు నిండిన ప్ర తి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో.. 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా విద్యాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆదర్శం.. అమరచింత నేతన్నలు
అమరచింత: స్థానిక చేనేత కార్మికుల సమష్టి కృషితోనే పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలు ఆర్థికంగా, వ్యాపారపరంగా ముందుకు సాగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు కొనియాడారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకుగాను బుధవారం ఆయన పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. యువత, మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలోనే మక్తల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదివరకే రెండుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని.. అమరచింతలోనూ ప్రభుత్వపరంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకుగాను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కార్మికులకు సరైన వేతనాలు లేక వృత్తికి దూరమవుతున్న తరుణంలో పట్టణానికి చెందిన మహంకాళి శేఖర్ నాబార్డు ఆర్థిక సహకారంతో స్వయంగా కంపెని స్థాపించి కార్మికులను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతోపాటు కుట్టులో అనుభవం ఉండి, ఉపాధి లేని మహిళల కోసం రెడీమేడ్ వస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. పలు రెడీమేడ్ కంపెనీలు వస్త్రాల తయారీకిగాను ముడి సరుకును పంపడంతో నిత్యం సుమారు 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ ఎండీకి వివరించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నా మని వేణుగోపాల్రావు హామీ ఇచ్చారు. సెట్విన్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ్కుమార్, చేనేత కార్మికులతో పాటు కాంగ్రెస్ నాయకులు అరుణ్, మహేందర్, తిరుమల్లేష్, వెంకటేశ్వర్రెడ్డి, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆదేశాలతో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
గద్వాల కాంగ్రెస్లో అదే తీరు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్జాన్తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వాళ్లకే పనులు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ పేరుకు అధికార పార్టీ నాయకులమే కానీ.. పనులన్నీ బీఆర్ఎస్కు చెందిన నాయకులకే జరుగుతున్నాయని బాహాటంగానే ఆరోపించినట్లు తెలిసింది. పరిశీలకులు ఇది వరకే రెండుసార్లు వచ్చారని.. ఇది మూడోసారని.. అయినా నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పరిశీలకులకు ఉదాహరణలతో వివరించినట్లు సమాచారం. 2, 3 రోజుల్లో శుభవార్త.. సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్హాట్గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మా రూటే ‘వేరు’ అన్యాయం అంటూ సరిత.. తాము పార్టీని నమ్ముకుని ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నామని.. కానీ, తమకు తీరని అన్యాయం జరుగుతోందని పరిశీలకుల ఎదుట సరిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు మొదలుకొని.. ప్రభుత్వ శాఖలలో అన్ని రకాల పనుల వరకు తమకు భంగపాటు ఎదురవుతోందని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా నా వర్గం అని తెలుసుకుని పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీస్ కేసులు నమోదవుతున్నాయని, ప్రతిరోజు పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎదురుకాదని.. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని గట్టిగా కోరినట్లు సమాచారం. మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బండ్ల కృష్ణమోహన్రెడ్డితో.. హరిత హోటల్లో సరిత వర్గంతో.. చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు సీఎం సహకారంతో ముందుకు.. తనకు న్యాయం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధే ధేయ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారమందిస్తానని చెప్పినట్లు తెలిసింది. -
గాడి తప్పుతోంది..!
జిల్లా విద్యాశాఖలో అడ్డగోలుగా డిప్యుటేషన్లు ●కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలో డిప్యుటేషన్ల విషయమై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్లపై వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారిలో ఏడుగురికి జిల్లాస్థాయిలోనే గత విద్యాసంవత్సరం ఇవ్వగా.. మరొకరు డీఎస్ఈ స్థాయిలో ఇచ్చారు. ఇటీవల వెల్లువెత్తుతున్న నిరసనలు, ఫిర్యాదుల మేరకు కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాఽధికారి -
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం : ఎస్పీ
వనపర్తి: విద్యార్థులు, యువత దృష్టి జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని.. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావొద్దని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జేఎస్ రాములు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందని.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రహిత జిల్లా ఏర్పాటే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని.. అందులో భాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. యువత తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తూ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలన్నారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, నిర్వాహకులు జె.సతీష్రాజు, మహిమరాజు, సంతోష్రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోక్సో బాధితురాలికి ఆర్థిక సాయం.. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ రావుల గిరిధర్ పోక్సో కేసు బాధితురాలి కుట్టు శిక్షణకుగాను తక్షణ సాయంగా రూ.10 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార బాధితులకు భరోసా కేంద్రం అన్నివిధాలుగా అండగా నిలుస్తోందని, సిబ్బంది బాధితుల ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి బాధిత సహాయ నిధి నుంచి రూ.10 వేల వరకు తక్షణ పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. భరోసా కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్, శిరీష పాల్గొన్నారు. -
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్కు కేరాఫ్గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్లోని హనుమాన్, శంకర్గంజ్లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
స్థానిక పోరుకు కసరత్తు
ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ● ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి ● బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ● ప్రధాన పార్టీల సమావేశాలతో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్కర్నూల్లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదం తెలిపి పార్లమెంట్కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుపొందిన స్థానాలు గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు జిల్లా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మహబూబ్నగర్ 14 175 నాగర్కర్నూల్ 20 214 వనపర్తి 14 128 జోగుళాంబ గద్వాల 20 214 నారాయణపేట 11 142 జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇండిపెండెంట్ మహబూబ్నగర్ 111 42 6 16 నాగర్కర్నూల్ 137 52 4 16 వనపర్తి 89 20 – 19 జోగుళాంబ గద్వాల 50 17 – 5 నారాయణపేట 88 26 23 5 జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మహబూబ్నగర్ 14 – – నాగర్కర్నూల్ 17 3 – వనపర్తి 13 1 – జోగుళాంబ గద్వాల 7 – – నారాయణపేట 9 1 1 -
ముందుజాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధుల నివారణ
పాన్గల్: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సూచించారు. సోమవారం పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అదే విధంగా దావాజీపల్లిలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. శిబిరంలో హెచ్ఐవీ, టీబీ తదితర నిర్ధారణ పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు అందిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించా రు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్, సీ హెచ్ఓ రామయ్య, ఆయుస్మాన్ మందిర్ వైద్యాధికారి మైథిలి, సిబ్బంది రాంచందర్, రేవతి పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నషాముక్త్ భారత్పై జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యాలయాలు, బస్టాండ్, ఆటో స్టాండ్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్, విద్యాశాఖ, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 90 ఫిర్యాదులు వచ్చినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మండల విద్యాధికారులు, హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ హెచ్ఎంలతో విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు సైతం జరిగినందున.. విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని.. అంగన్వాడీ కేంద్రాల నుంచి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే విధంగా ఎంఈఓలు, హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం టీజీ ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్శాఖ, పరిశ్రమలశాఖ, టౌన్ ప్లానింగ్, లేబర్ డిపార్ట్మెంట్ వంటి శాఖలు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అన్నింటినీ పరిశీలించాక జిల్లాస్థాయి టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 24 దరఖాస్తులను పరిశీలించి.. 18 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ చెప్పారు. మరో నాలుగింటిని తిరస్కరించగా.. రెండు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటుచేసిన ఏడుగురు ఎస్సీ లబ్ధిదారులకు, 12మంది ఎస్టీ లబ్ధిదారులకు, ఒక పీహెచ్సీ లబ్ధిదారుడికి టి.ప్రైడ్ పాలసీ సబ్సిడీకి ఆమోదం తెలిపారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఎంఈఓ అబ్దుల్ ఘని, జీఎం ఇండస్ట్రీస్ జ్యోతి తదిరతులు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
సివిల్స్ కోచింగ్ వినియోగించుకోండి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వహించే సివిల్స్ కోచింగ్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ సునీత అన్నారు. సోమవారం ఆ శాఖ కార్యాలయంలో సివిల్స్ కోచింగ్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీ డీడీ ఉప సంచాలకులు, ఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ నందు 2025– 26 సంవత్సరానికి గాను 10 నెలల సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వచ్చే నెల 7లోగా http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 040– 23546552, 81216 26423 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ సుదర్శన్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్, కన్యాకుమారి, వార్డెన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
‘బెస్ట్’ నో అవైలబుల్!
బీఏఎస్ పథకానికి నిధుల కొరత ●వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) నిధుల కొరతతో నీరసించిపోతోంది. రెండేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో పేద విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులను లక్కీ డిప్ పద్ధతిన ఎంపిక చేసి.. ఆయా స్కూళ్లకు అధికారులు కేటాయిస్తారు. విద్యార్థులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా పథకాన్ని రూపొందించారు. అయితే కొన్నేళ్ల పాటు ఈ పథకం సజావుగా సాగింది. ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలకు బ్రేక్ వేయడంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఐదు పాఠశాలలకు వర్తింపు.. బీఏఎస్ పథకంలో భాగంగా విద్యార్థులకు డే స్కాలర్స్, రెసిడెన్షియల్ విభాగాల్లో అవకాశం కల్పిస్తారు. ఒకటో తరగతిలో ఎంపికచేసే విద్యార్థులకు డే స్కాలర్స్లో.. ఐదో తరగతి నుంచి ఎంపికచేసే విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఎంపిక చేస్తారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ పాఠశాల, వనపర్తి మండలం పెద్దగూడెం సమీపంలోని రేడియంట్ హైస్కూల్, పెబ్బేరు మాస్టర్మైండ్, ఆత్మకూరులోని అక్షర, శ్రీవాణి పాఠశాలలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బెస్ట్ అవైలబుల్ పథకానికి ఎంపికై న విద్యార్థులకు ఆయా కేటగిరీల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు అందించి విద్యనందించారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో తాము బీఏఎస్ పథకంలో అడ్మిషన్లు ఇవ్వలేం.. మునుపు పంపిన వారిని సైతం కొనసాగించలేమంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం.. రెండేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు నిధులు విడుదల కాలే దు. రూ.లక్షల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తాం. అప్పటి వరకు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరాం. కొందరు పాజిటివ్గా.. మరికొందరు నెగిటివ్గా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. – అబ్దుల్ ఘని, డీఈఓ ఆందోళనలో తల్లిదండ్రులు.. బీఏఎస్ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమస్యను లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ స్పందించి ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాము రూ.లక్షల్లో అప్పులు చేసి రెండేళ్లుగా నెట్టుకొచ్చామని.. ఇక తాము భరించలేమంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. జిల్లాలో రూ. 4కోట్ల వరకు పెండింగ్ రెండేళ్లుగా నిధుల విడుదలకు బ్రేక్ అడ్మిషన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రజావాణిలో కలెక్టర్ను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రులు -
ఇంటర్లో 1,445 అడ్మిషన్లు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు చేపట్టిన ఇంటింటి ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. సోమవారం పలు గ్రామాల్లో అధ్యాపకులు పర్యటించి.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. జిల్లాలో ఇంటింటి ప్రచారంతో ఇప్పటి వరకు 1,445 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. 1,71,405 మంది ఖాతాల్లో రూ.196.49కోట్లు జమ వనపర్తి: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 1,71,405 మంది రైతుల ఖాతాల్లో రూ.196.49 కోట్లు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందు నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,27,492 ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందిందని.. మిగిలిన రైతులందరి ఖాతాల్లో మంగళవారం సాయంత్రంలోగా రైతుభరోసా నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని 43 రైతువేదికల వద్ద రైతుల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడతారన్నారు. రైతులందరూ కోలాహలంగా రైతువేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీఏఓ కోరారు. జానియర్ సివిల్కోర్టు న్యాయమూర్తిగా శిరీష ఆత్మకూర్: పట్టణంలోని జూనియర్ సివిల్కోర్డు న్యాయమూర్తిగా సోమవారం శిరీష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, న్యాయవాదులు ముక్తేశ్వర్, తిప్పారెడ్డి, నారాయణగౌడ్, రామేశ్వర్రెడ్డి, శంకర్లింగం, అశోక్, రామచందర్ తదితరులు న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
మీనమేషం..!
మత్స్యబీజం పంపిణీకి ఖరారు కాని టెండర్లు ఊసేలేని టెండర్ల ప్రక్రియ.. ఉచిత చేప పిల్లల పంపిణీకి డిమాండ్ ఆధారంగా ఏటా మే, జూన్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించేవారు. చెరువులు నిండిన వెంటనే చేప పిల్లలను వదిలే ఆస్కారం ఉండేది. గతేడాది నుంచి టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతుండటంతో అక్టోబర్ వరకు చేప పిల్లలను చెరువుల్లో వదిలితే.. మార్చి, ఏప్రిల్ నాటికి అవి ఆశించిన మేర పెరగడం లేదు. ఉత్పత్తి తగ్గిపోతుందనే వాదనలు మత్స్యకారుల్లో లేకపోలేదు. 2.04 కోట్ల డిమాండ్.. జిల్లాలో గతేడాది మాదిరిగానే 900 పైచిలుకు చెరువులు, కుంటల్లో 2.04 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో రెండు నుంచి మూడు అంగుళాల చేప పిల్లలు, చెరువులు, కుంటల్లో ఒటిన్నర అంగుళాల చేప పిల్లలను వదిలిలేందుకు ఏటా టెండర్లు పిలుస్తారు. జిల్లాలో ఎక్కువగా బంగారు తీగ, బొచ్చ, రౌటతో పాటు మరికొన్ని రకాల చేప పిల్లలను ఎక్కువగా తీసుకొస్తారు. వనపర్తి: ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రతిపాదనలు, టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిర్లక్ష్యం అలుముకుందనే చర్చ వినిపిస్తోంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారు జీవనోపాధి కోసం వలసబాట పట్టకుండా ఉన్న ఊరులోనే జీవించేందుకు గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా జూన్ మొదటి వారంలో అంచనా ప్రణాళికలు, టెండర్ల పక్రియ నిర్వహించేవారు. గతేడాది నుంచి ఈ పథకంపై కొంత అలసత్వం అలుముకుందని మత్స్యకారుల్లో అసహనం నెలకొంది. గతేడాది ఆలస్యంగా ఆగష్టులో ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రారంభించి అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి కార్యాచరణ ప్రారంభించకపోవడం శోచనీయం. ఉమ్మడి జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరికి ఇటీవల మత్స్యశాఖ మంత్రి పదవి కేటాయించడంతో అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందనే భావనలో మత్స్యకారులు ఉన్నారు. గతేడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మత్స్యకారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లాలో 1,050 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు 900 పైచిలుకు చెరువులను గుర్తించిన మత్స్యశాఖ 40 శాతానికిపైగా నీరుంటేనే అనుమతి ప్రభుత్వమే నిర్ణయించాలి.. టెండర్ల ప్రక్రియ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. జిల్లాలో ఏటా 900 చెరువుల్లో చేప పిల్లలు వదులుతాం. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లల్లో నీరు వస్తే సుమారు 2 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయని ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆయా చెరువులు, రిజర్వాయర్లలో 40 శాతం నీరుంటేనే చేప పిల్లలు వదిలేందుకు వెసులుబాటు ఉంటుంది. – లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి -
కోయిల్సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తుండటంతో ఆదివారం సాయంత్రం వరకు 17.6 అడుగులకు చేరింది. ఈ నెల 1న జూరాల వద్ద ఉన్న ఫేస్–1 ఉంద్యాల పంపుహౌస్ నుంచి ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి పర్దీపూర్ రిజర్వాయర్కు తరలించారు. ఆ తర్వాత 6న ఫేస్–2 తీలేర్ పంపుహస్కు వద్దకు చేరిన నీటిని అక్కడ ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 22 రోజులుగా కోయిల్సాగర్కు నీటి విడుదల కొనసాగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటిమట్టం 6.6 అడుగులు పెరిగి 17.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 9 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులుగా ఉండగా.. మరో 15 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. -
‘భగవద్గీత మత గ్రంథం కాదు’
వనపర్తి రూరల్: భగవద్గీత మత గ్రంఽథం కాదని.. సర్వ మానవుల జీవితాలను ఉద్దరించే గ్రంఽథమని కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. ఎల్వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి పట్టణ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో భగవద్గీత విజయభేరి నిర్వహించగా.. ఆయన హాజరై భగవద్గీత శ్లోకాలు చదివి వాటి సారాంశం వివరించారు. సృష్టి ఉన్నంత వరకు ప్రపంచానికి నిదర్శనంగా నిలబడి ఉండే సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోని ఎన్నో గ్రంథాల సారాంశం భగవద్గీతలో ఇమిడి ఉందని వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పట్టణ పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు ఒమేష్గౌడ్, నిర్వాహకులు వెంకటస్వామి, బీచుపల్లి, పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షుడు రామకృష్ణ, మాస్టర్ పాండురంగయ్య, రుక్మానందం తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఆదేశాలతో జూరాల ఎడమ కాల్వకు..
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్రెడ్డి, హన్మంతునాయక్ పాల్గొన్నారు. కుడి కాల్వకు 500 క్యూసెక్కులు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వ కు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మదనపురం: ప్రాజెక్టులు నిర్మించి ఆయకట్టురైతులకు సాగునీరు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిర్మలాయపల్లి సమీపంలో ఉన్న భీమా ఫేజ్–2 ఎత్తిపోతల పంప్హౌస్ వద్ద పూజలు చేసి ఆయకట్టుకు సాగునీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని వెల్లడించారు. భీమా ఫేస్–2 ద్వారా వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన 48 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వర్షాలు ముందస్తుగా కురవడంతో జూన్లోనే రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. భీమాకు నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, శేఖర్రెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, శరత్రెడ్డి, సమన్వయ కమిటీ కో–ఆర్డినేటర్ మహేష్, హనుమాన్రావు, వడ్డె కృష్ణ, వడ్డె రాములు, వెంకట్ నారాయణ, గోపి స్వామి, సాయిబాబా, మహదేవన్గౌడ్, అంజద్ అలీ, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం
వనపర్తి: విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్పార్టీ ఎన్ఎస్యూఐ విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హమ్ బదిలేంగే కార్యక్రమానికి ఆయనతో పాటు ఇతర నాయకులు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఉజ్వల భవిష్యత్కు విభాగం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్చార్జ్ రావడం సంతోషంగా ఉందని.. విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎన్ఎస్యూఐ సభ్యత్వాలు పెద్దఎత్తున చేయించాలని, రాష్ట్రంలోనే వనపర్తిని అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, నాయకులు కోట్ల రవి, ఆదిత్య, ఎత్తం చరణ్రాజ్, మన్యంకొండ, కృష్ణబాబు, చంద్రమౌళి, వెంకటేష్, రఘుయాదవ్ పాల్గొన్నారు.ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ఆత్మకూర్: పుర కేంద్రంలో ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళలు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుర కమిషనర్ శశిధర్ హాజరై మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తమ వంటల నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, ఆహార ఉత్పత్తులను విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు గొప్ప అవకాశమన్నారు. సాంప్రదాయ వంటకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. ఉత్సవాలతో క్యాటరింగ్ ఆర్డర్లు వస్తాయని, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా వంటకాలను ప్రదర్శించిన మహిళలను కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, వార్డు అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.పెంపకందారుల సమస్యల సాధనకు పోరాటంపాన్గల్: గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల సాధనకు పోరాటాలు కొనసాగించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అన్నారు. ఆదివారం మండలంలోని రేమద్దులలో జిల్లా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీవాల మేత కోసం ప్రభుత్వం కొండలు, బంజారు భూములు కేటాయించాలన్నారు. నేటి పాలకుల విధానాలతో సహజ వనరులన్నీ పెట్టుబడిదారులు, ధనిక వర్గాలకు కేటాయిస్తుండటంతో కాపారులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. వాతావరణ మార్పులతో జీవాలకు రోగాలు పెరుగుతున్నా.. ఏ రకమైన మందులు పంపిణీ చేయడం లేదన్నారు. రెండో విడత రాయితీ గొర్రెల లబ్ధిదారులకు రూ.2 లక్షలు జమ చేస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదని వివరించారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న జిల్లాకేంద్రంలోని యాదవ సంఘం భవనంలో నిర్వహించే జిల్లా సదస్సుకు కాపా రులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వేణుగోపాల్, బాలస్వామి, వెంకటయ్య, నిరంజన్ పాల్గొన్నారు.టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అమరచింత వాసిఅమరచింత: టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అమరచింతకు చెందిన కె.సూర్యం ఎన్నికయ్యా రు. ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ తెలిపారు. రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ప్రసాద్, హన్మంతు, రాజుకు చోటు లభించినట్లు తెలిపారు. -
పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక
వనపర్తి: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించినట్లు డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సమక్షంలో విద్యార్థుల ఎంపికకు లక్కీ డిప్ నిర్వహించారు. మొత్తం 10 సీట్లకు 54 దరఖాస్తులు రాగా.. 3వ తరగతిలో ఆరుగురు, 5వ తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ఇద్దరిని ఎంపిక చేశారు. ఆయా విద్యార్థులు జిల్లాకేంద్రంలోని ప్రతిభ ఉన్నత పాఠశాల, రేడియంట్ కాన్సెప్ట్ స్కూల్ విద్యను అభ్యసించనున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటికల్ కో–ఆర్డినేటర్ జి.నారాయణమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.మహిళలపై దాడులను అరికట్టాలిపాన్గల్: మహిళలపై దాడులను అరికట్టడంలో, రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి, అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల హామీ అమలు కావడం లేదని.. బాల్య వివాహాల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారన్నారు. మండలంలోని ఓ గిరిజన తండాలో బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో ఐద్వా నాయకులు లక్ష్మి, అనిత, సాలమ్మ, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.పాఠశాలలకు చెస్ బోర్డులువనపర్తి: పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు మేరెడ్డి రవిప్రకాశ్రెడ్డి అండ్ టీం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలకు జులై నుంచి చెస్ బోర్డులు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఫోరం జిల్లా కో–ఆర్డినేటర్ మల్లెల మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలెక్టరేట్లోని ఆయన చాంబర్ కలిసి విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మండలాల వారీగా పాఠశాలల వివరాలు, విద్యార్థుల సంఖ్యను ఫోరం సభ్యులకు అందించాలని ఏఎంఓ మహానందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. చెస్తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని చెస్ బోర్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సీసీ కిరణ్కుమార్రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాంవనపర్తి రూరల్: దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టే సమ్మెలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులతో కలిసి కలెక్టరేట్లోని వివిధ శాఖల జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందజేసి మాట్లాడారు. కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలుకు తీవ్ర ప్ర యత్నం చేస్తోందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా వచ్చే నెల 9 చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని చేయాలని కార్మికులను కోరారు. కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్ర మహాసభలకు తరలిరావాలి
వనపర్తిటౌన్: టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల 8వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 24న హైదరాబాద్లో జరగనున్నాయని.. ఆర్టీసీలోని బీసీ కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సంఘం నాయకుడు వీవీ మూర్తి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని డిపో ఎదుట రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్లను బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో బీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, కృష్ణయ్య, కిరణ్కుమార్, వెంకటేష్, సురేష్, శ్రీను, శ్రీనివాసులు, యాదగిరి, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం పదిలం
వనపర్తి: మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడితో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని.. వాటిని దూరం చేయడానికి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక మర్రికుంట గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగా ప్రధాన కార్యదర్శి సుగుణ కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు యోగా సాధన చేసే వారని, 2014లో ప్రధాని మోదీ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా అమలయ్యేటట్లు చేశారన్నారు. నిత్యం యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, ఆయుష్ విభాగం వైద్యురాలు డా. మంజుశ్రీ, డా. ఒమర్ అలీ, డా. జ్యోతి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు సాగునీరు
●నారుమడి సిద్ధం.. యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేసినా నీరందక ఆశించిన దిగుబడి రాలేదు. వానాకాలంలో ఎడమ కాల్వకు నీటిని ముందస్తుగా వదులుతారన్న ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. మరోమారు 5 ఎకరాల్లో వరి పండించేందుకు పొలం సిద్ధం చేసుకుంటున్నా. – మోహన్రెడ్డి, రైతు, సింగంపేట ఆనందంగా ఉంది.. జూరాల ఎడమకాల్వకు ముందస్తుగా సాగునీరు వదలడం సంతోషంగా ఉంది. ఆదివారం నీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. ఉన్న 5 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు వరి నాడుమడి ఇప్పటికే సిద్ధం చేసుకున్నా. ముందస్తుగా నీటిని వదులుతుండటంతో అనుకున్న దిగుబడి చేతికందే అవకాశం ఉంది. – బానా గిర్రెన్న, కానాయపల్లి (కొత్తకోట) మంత్రి చేతుల మీదుగా విడుదల.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో వానాకాలం పంటల సాగుకుగాను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఎడమ కాల్వకు నీరు వదులుతున్నాం. జూన్లోనే ఆయకట్టుకు నీరందిస్తున్నాం.. పొదుపుగా వినియోగించుకోవాలి. వానాకాలంలో పూర్తిస్థాయిలో నీటిని రోజువారీగా అందించనున్నాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల క్యాంపు డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు వదిలితే సాగు పనులు ప్రారంభిస్తారని.. ఉన్న నీరంతా దిగువకు వెళ్లిన తర్వాత వదలడంతో తలెత్తే సమస్యను అధికారులు ముందస్తుగా గుర్తించడం సంతోషకరమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు 100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తుండటంతో వరితో పాటు చెరుకు సాగు చేస్తున్నారు. అధికారుల సూచనల మే రకు నీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతుంది. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అమరచింత/ఆత్మకూర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి శుక్రవారం అమరచింత, ఆత్మకూర్ మండలాలకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట అమరచింతలో పోలీసులు గౌరవ వందనం సమర్పించగా.. స్థానిక కాంగ్రెస్ నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి సత్కరించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూర్లో అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గాంధీచౌక్ నుంచి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు మోపిందే తప్ప పేదల సొంతింటి కలను అణిచివేసి డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కాలయాప చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రకటించుకుంటామని వెల్లడించారు. పరమేశ్వరస్వామి చెరువు అభివృద్ధి, రూ.22 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనం, డయాలసిస్ కేంద్రం, జూరాల వంతెన, రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతామన్నారు. రాజావళి దర్గాలో మంత్రి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంబీ కర్మేల్ చర్చిలో పాస్టర్ హ్యాపీపాల్తో కలిసి ప్రార్థించారు. మార్కండేయ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు తిరుమల్లేష్, మహంకాళి విష్ణు, చుక్కా ఆశిరెడ్డి, సర్వారెడ్డి, హన్మంతునాయక్, పోసిరిగారి విష్ణు, శ్యాం, తౌఫిక్, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, నాయకులు గంగాధర్గౌడ్, రహ్మతుల్లా, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్ డివిజన్ సాధిస్తా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
సాధించిన పతకాలు..
వనజారెడ్డి 2007 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది వైజాగ్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం సాధించారు. 2023 ఏపీ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో, 2024లో పలుచోట్ల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంది. సిద్దిపేటలో యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వనజారెడ్డి ప్రతిభచాటి ప్రథమస్థానంలో నిలిచారు. అదేవిధంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పతకాలు సాధిస్తూ ప్రతిభచాటుతున్నారు. వనజారెడ్డి, కీర్తనారెడ్డి యోగా విన్యాసాలు -
మహనీయుల ఆశయ సాధనకు కృషి
వీపనగండ్ల: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంతో పాటు కల్వరాల, గోవర్ధనగిరిలో ప్రజలు, యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ రేయింబవళ్లు శ్రమించి అంటరానితనాన్ని రూపుమాపి ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచారన్నారు. వారి ఆశయాల సాధనకు రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు వివరించారు. మండల కేంద్రంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం, రూ.50 లక్షలతో మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. కల్వరాలలో రూ.50 లక్షలతో గ్రామ కమ్యూనిటీహాల్, మండల కేంద్రంలోని గ్రంథాలయానికి రూ.2 లక్షలు, క్రీడలకు మరో రూ.2 లక్షలు, మిగతా గ్రామాల్లోని గ్రంథాలయాలు, క్రీడలకు రూ.2 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పర్యాటక అధికారి నర్సింహ, బీరయ్యయాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.. రెవెన్యూ సదస్సుకు వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ వరలక్ష్మి ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 40 రోజుల్లో పరిష్కరించాలని.. రైతుల నుంచి ఎలాంటి డబ్బులు ఆశించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
1,282 గ్రామాలు.. 43,047 అర్జీలు
ఉమ్మడి జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు జిల్లాల వారీగా ఇలా.. మహబూబ్నగర్ జిల్లాలోని 16 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అత్యధికంగా కోయిల్కొండ మండలంలో 1,317 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 2,348, భూ విస్తీర్ణంలో తప్పులపై 966, భూ యజమాని పేర్లలో తప్పులు సవరించాలని 435 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● నారాయణపేట జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు జరగగా.. నారాయణపేట మండలంలో అత్యధికంగా 1,230 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 1,284, భూ విస్తీర్ణంలో తప్పులపై 776, పేర్లలో తప్పులు సవరించాలని 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గద్వాల మండలంలో అత్యధికంగా 1,324 అర్జీలు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు సవరించాలని 832, పెండింగ్ సక్సేషన్లపై 750, అసైన్డ్మెంట్ ల్యాండ్లపై 640, గెట్ల పంచాయితీలపై 200 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో 19 మండలాల పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,559 దరఖాస్తులు వచ్చాయి. కొల్లాపూర్ మండలం నుంచి అత్యధికంగా 2,138 అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 3,921, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,062, పేర్లలో తప్పులు సవరించాలని 478 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగగా.. అత్యధికంగా పాన్గల్ మండలంలో 1,555 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 1,135, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,064, పేర్లలో తప్పులకు సంబంధించి 824 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో తప్పులను సవరిస్తూ.. మార్పులు, చేర్పులతో భూ భారతి పోర్టల్ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. నిర్దేశిత గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 1,282 గ్రామాలకు సంబంధించి 43,047 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 15,559 అర్జీలు రాగా.. నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 4,052 వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాగర్కర్నూల్లో అత్యధికంగా 15,599 దరఖాస్తులు నారాయణపేటలో అత్యల్పంగా 4,052.. -
‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం
మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్హెచ్ఓ సక్రమంగా మానిటరింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్ డీఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్బీ, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్ అప్లికేషన్ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్రావు, యోగేష్ గౌతం పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల అతి జాగ్రత్త వల్లే తప్పిదం జరిగింది మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
సక్రమంగా బియ్యం పంపిణీ
కొత్తకోట రూరల్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా సజావుగా పంపిణీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు డీలర్లకు సూచించారు. శుక్రవారం మండలంలోని చర్లపల్లిలో రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు మార్కెట్ గోదామునకు స్థల పరిశీలన చేశారు. బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో లోపాలు తెలిస్తే డీలర్లు, సంబంధి త శాఖల అధికారులపై చర్యలు తప్పవని హె చ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శేఖర్రెడి ఉన్నారు. రూ.30.05 కోట్లు జమ వనపర్తి: రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ శుక్రవారం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ బటన్ నొక్కి రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా నిధులు విడుదల చేశారు. సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో అయిదు ఎకరాల భూమి ఉన్న 11,476 మంది రైతుల ఖాతాల్లో రూ.30,05,62,758 జమ చేసినట్లు చెప్పారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. 2 వేల వ్యవసాయ కనెక్షన్లు బిగిస్తాం వనపర్తిటౌన్: జిల్లాలో జనవరి నుంచి నేటి వరకు 1,200 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, కమర్షియల్ డైరెక్టర్ సాయిబాబా అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ నెలలో మరో 2 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు 25 కేవీఏ నియంత్రికలు 180, 75 కిలో మీటర్ల కండక్టర్ వైరు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. 9,997 విద్యుత్ స్తంభాలను, 470 నియంత్రికలను, 254 కిలోమీటర్ల కండక్టర్ వైరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్ ఆనంద్, హైదరాబాద్ ఆపరేషన్ రూరల్ జోన్ బాలస్వామి, ఎస్ఈ రాజశేఖరం, వనపర్తి ఆపరేషన్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, టెక్నికల్ డివిజనల్ ఇంజినీర్ వెంకటశివరాం, డివిజనల్ ఇంజినీర్ ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. -
తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి
వనపర్తి: తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మొదటి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పుడు కేసులు నమోదు చేస్తే కమిటీ సభ్యులు నచ్చజెప్పి ఉపసంహరించుకునేలా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు నమోదు చేయడం, తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా బయట రాజీ కుదర్చడంతో చట్టం నీరుగారుతుందన్నారు. అదేవిధంగా ఎక్కడ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్నాయి.. ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి అనే విషయాలు నిశితంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తే ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించవచ్చని పోలీస్శాఖను ఆదేశించారు. ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవం ఏ గ్రామంలో నిర్వహించాలనే షెడ్యూల్ ముందుగానే రూపొందించి కమిటీ సభ్యులు, అధికారులకు అందజేశారని.. పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైనా అంటరానితనం వంటి సమస్యలు గుర్తిస్తే కమిటీ సభ్యులు, పోలీసులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 58 ఎస్సీ, 10 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని వివరించారు. మొదటి దశలో 48 మందికి చట్ట ప్రకారం నష్ట పరిహారం రూ.2.72 లక్షలు, రెండో దశలో 25 మందికి రూ.40 లక్షలు పరిహారంగా అందజేయగా.. ఇంకా 21 మందికి మంజూరు కాలేదని తెలిపారు. 59 కేసుల్లో చార్జ్షీట్ ఫైల్ చేయడంతో పాటు 108 పీటీ కేసులు నమోదైనట్లు చెప్పారు. జిల్లా సంక్షేమశాఖ ద్వారా 2024 నుంచి ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసులు 26 నమోదయ్యాయని.. వాటిలో 17 కేసులకు రూ.6.50 లక్షలు పరిహారంగా అందజేసినట్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఎడవల్లి వీరప్ప మాట్లాడుతూ.. ముమ్మళ్లపల్లి, గోపాల్పేట మండలం చాకల్పల్లిలో బుడగ జంగాల వారిని బెదిరించడం, రచ్చకట్టపై కూర్చోకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ బెదిరించే వారిపై కేసులు నమోదు చేసి తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా కమిటీ సభ్యులు వెళ్లి బుడగ జంగాల ప్రజలకు ధైర్యం చెప్పాలని సూచించారు. బుడగ జంగాల విద్యార్థులకు హాస్టల్ వసతి, పాఠశాలలో సీటు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్ నాయక్, డీఐఈఓ అంజయ్య, డీడబ్ల్యూఓ సుధారాణి, ిసి.విశ్వంబాబు, నాగన్న, రామచందర్, వీరప్ప మాదారి భోజరాజు, స్వచ్ఛంద సంస్థల నుంచి చిన్నమ్మ థామస్, ఏకే కమర్ రహమాన్ పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం పదిలం
గోపాల్పేట: నిత్యం యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని.. దినచర్యలో భాగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రేవల్లి మండలం నాగపూర్లో 300 మందితో యోగా డే నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజు కేవలం 20 నిమిషాలు యోగా చేస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు సైతం యోగా చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. అనంతరం శిక్షకుడు శ్రీనునాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, డీఆర్డీఓ ఉమాదేవి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు, లోడె రఘు, పాపులు తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం వనపర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సెల్నంబర్ 73828 26289కు సంప్రదించి తెలియజేయాలని పేర్కొన్నారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను గురువారం 1,017 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలో నీటి సరఫరా లేదని.. రామన్పాడు నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు. నేడు మంత్రి వాకిటి శ్రీహరి రాక ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి శుక్రవారం మధ్యాహ్నం పట్టణానికి రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు రహ్మతుల్లా, పరమేష్, తులసీరాజ్, శ్రీను తెలిపారు. మంత్రి హోదాలో తొలిసారి వస్తున్నందున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
రెండు పాఠశాలలు.. ఐదు గదులు...
అమరచింత: మండలంలోని నాగల్కడ్మూర్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు కేవలం ఐదు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉన్నత పాఠశాలకు 3, ప్రాథమిక పాఠశాలకు 2 గదులు వినియోగించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గతేడాది పదోతరగతిలో ఆశించినస్థాయి ఫలితాలు రాలేదు. వీటికితోడు మరుగుదొడ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉన్నత పాఠశాలకు వినియోగిస్తున్న తరగతి గదులను మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా గతేడాది రూ.10 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ఏడాది గడువకముందే పైకప్పు పెచ్చులూడుతున్నాయి. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన కాల్వల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కేటగిరి భూ సేకరణను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలం షాపూర్ పరిధిలో 28 ఎకరాలు, మల్కాపూర్లో 8.35 ఎకరాలు, బుద్ధారం పరిధిలో 109 ఎకరాల భూ సేకరణకు సంబంధించి వారం రోజుల్లో అవార్డు పాస్ చేయాలన్నారు. రేమద్దుల పరిధిలో 6 ఎకరాలు, గణప సముద్రంలో 388 ఎకరాలకు ఎంజాయ్మెంట్ సర్వే 10 రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందజేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. అదేవిధంగా గోపాలపేట మండలం పొల్కెపహాడ్, దత్తాయపల్లిలో 12.87 ఎకరాలకు త్వరగా అవార్డు పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ సేకరణలో ఉన్న స్ట్రక్చర్లను గుర్తించి వ్యాల్యూవేషన్ వివరాలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్, ఉద్యాన అధికారులను ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి, ఇరిగేషన్ డీఈలు, ఏఈలు, సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం మండలంలోని వడ్డేవాటలో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై అనంతరం అదే గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కంసలి పార్వతమ్మ ఇంటిని సందర్శించి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆషాఢ మాసం రోజులు బాగోలేవని పనులు ప్రారంభించలేదని సమాధానమివ్వగా మూఢ నమ్మకాలతో కాలయాపన చేయొద్దని.. గడువులోగా పనులు ప్రారంభించకుంటే రద్దవుతుందని కలెక్టర్ వివరించారు. గ్రామానికి మొత్తం 23 ఇళ్లు మంజూరు కాగా.. చాలామంది పనులు ప్రారంభించలేదన్నారు. మిగిలిన లబ్ధిదారుల ఇళ్లను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించి త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. అక్కడి నుంచి పెద్దమందడి మండలం వెల్టూరుకు వెళ్లి లబ్ధిదారు డి.పద్మ ఇంటి నిర్మాణానికి తహసీల్దార్తో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా.. పంచాయతీ కార్యదర్శి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామానికి 34 ఇళ్లు మంజూరయ్యాయని.. లబ్ధిదారులు త్వరగా ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పదోతరగతి పాసైన ప్రతి బాలికను కళాశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత.. వెల్టూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో ఎంతమంది బాలికలు పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించారు.. వారు ఇప్పుడేం చేస్తున్నారనే వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలకు పంపకుండా బాల్య వివాహాలు చేసే ప్రమాదం ఉందని.. కచ్చితంగా కళాశాలలో చేర్పించేలా ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పెద్దమందడి తహసీల్దార్ సరస్వతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజలకు సమర్థ సేవలు అందించాలి
వనపర్తి రూరల్: ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమర్థమైన సేవలు అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలు, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల రికార్డులు పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం సరికాదని.. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. బ్లూకోల్ట్ ,పెట్రోకార్ సిబ్బంది డయల్ 100 కాల్స్కు తక్షణమే స్పందిస్తూ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరుచూ సందర్శించాలని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారి నిబంధనలు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పోలీస్స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణతో మెలగాలని కోరారు. స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిబ్భంది కృషి చేయాలని, అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని వివరించారు. పాత నేరస్తుల కదలికలను ఏ విధంగా గుర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆయన వెంట వనపర్తి సీఐ కృష్ణయ్య, నరేష్, ఎస్ఐ జలంధర్రెడ్డి, బాలయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రాచీన కళలను బతికించుకుందాం వనపర్తి రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర (జీవ సమాధి ఘట్టం) నాటక ప్రదర్శనను గురువారం ఆయన తిలకించి మాట్లాడారు. రంగస్థల కళలు మన వారసత్వ సంపద అని.. కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమేగాక గొప్ప సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం గొప్పదనానికి సాటి రావని వివరించారు. గ్రామాల్లో నాటకాలు ఆదరింపబడుతున్నాయంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.ఈ సందర్భంగా కళాకారులను ఆయన శాలువాలు, పూలమాలలతో సన్మానించి రూ.5 వేల విరాళాన్ని అందజేశారు. అనంతరం గ్రామస్తులు, కళాబృందం ఎస్పీని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, పీఆర్వో రాజాగౌడ్, గ్రామ పెద్దలు, కళాకారులు, యువకులు పాల్గొన్నారు. -
దోమలు బాబోయ్..!
●పట్టణాల్లో పడకేసిన పారిశుద్ధ్యందోమల బెడద అధికం.. కాలనీలోని డ్రెయినేజీల్లో నాలుగు నెలలకు ఓసారి మురుగు తొలగిస్తున్నారు. దీంతో దుర్వాసన, దోమల బెడద అధికమైంది. సాయంత్రం అయిందంటే చాలు ఇంటి తలుపులు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. – విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత మురుగు తొలగించడం లేదు.. ఒకటో వార్డులోని నాగుల బావిలో మురుగు చేరి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. రాంనగర్ నుంచి వస్తున్న మురుగు కాల్వలను నేరుగా బావిలోకి వెళ్లేలా నిర్మాణం చేశారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమల బెడద అధికమై ఇబ్బందులు పడుతున్నాం. – బాలకృష్ణ, అమరచింత దోమల నివారణకు చర్యలు.. పురపాలికలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డుల వారీగా ఫాగింగ్ చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – శిశిధర్, ఇన్చార్జ్ పుర కమిషనర్, అమరచింత ● మరుగునపడిన ఫాగింగ్ యంత్రాలు ● తూతూమంత్రంగా వంద రోజుల కార్యక్రమం అమరచింత: పురపాలికల్లో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడంతో దుర్గందం వెదజల్లడమే గాకుండా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల నివారణకు ప్రతి పురపాలికలో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసినా సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా మారాయి. ముందస్తుగా కురిసిన వర్షాలకు కుంటల్లో నీరుచేరి దోమలు వృద్ధి చెందుతున్నా.. వాటిని నిర్మూలించే ప్రయత్నాలు మాత్రం పుర అధికారులు చేపట్టడం లేదు. ● జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో మొత్తం 14 ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. దోమల నివారణకు గతంలో నీటి నిల్వ ప్రాంతాల్లో గంబూషియా చేపలు వదిలేవారు. అవి లార్వాను తినేసి దోమల ఉత్పత్తిని తగ్గించేవి. అంతేగాకుండా భ్లీచింగ్ పౌడర్, సున్నం వంటి వాటిని చల్లి దోమల బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండేవారు. కాని ఇలాంటి పనులు సైతం ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోనే సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమలు, ఈగల బెడదను అరికట్టి విషజ్వరాల బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పుర అధికారులపై ఉంది. పారిశుద్ధ్యానికి అరకొర నిధులు.. పారిశుద్ధ్య పనులకు నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన వార్డుల వారీగా ఎన్ని ఫాగింగ్ యంత్రాలు అవసరం అవుతాయనే వివరాలను సైతం ఇప్పటి వరకు గుర్తించకపోవడం ఏమిటని పుర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పురపాలికల్లో వందరోజుల ప్రణాళికలో స్వచ్ఛత కార్యక్రమాలు తూతూమంత్రంగా చేపడుతున్నారని.. కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చేపట్టాల్సిన పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ప్రత్యేక అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. పురపాలికల వారీగా ఇలా.. వనపర్తిలో ఆరు ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. వీటిలో మూడు పని చేయడం లేదు. అమరచింతలో 1, ఆత్మకూర్లో 1, కొత్తకోటలో 1, పేబ్బెర్లో 5 ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. వీటిలో 2 మరమ్మతుకు గురయ్యాయి. -
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
వనపర్తి రూరల్: అంబేడ్కర్ ఎంతో కష్టపడి ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదిగారని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని మెంటేపల్లిలో డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి గజమాల వేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేడ్కర్ అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో పాఠశాల ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో యువ నాయకుడు డా. జిల్లెల ఆదిత్యారెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, నాయకులు చీర్ల జనార్దన్, కోళ్ల వెంకటేష్, సతీష్ మాదిగ, జానకిరాముడు, నారాయణ, రాములు, అంబేడ్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపత్రాలు అందజేత.. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పాల్గొని చిన్నారులకు 1వ తరగతిలో ప్రవేశానికి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సునీల్కుమార్, గీతారాణి, గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎఫ్సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు పునఃప్రారంభం అయిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,429 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటి వరకు 1,066 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా ఇంకా 363 బస్సులకు పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో ఎంవీఐల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో 30 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. మహబూబ్నగర్లో బుధవారం ఉదయం, సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సుకు సంబంధించి ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) కచ్చితంగా ఉండాలని, లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని డీటీసీ కిషన్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు -
కోర్టు సముదాయ నిర్మాణానికి చర్యలు
వనపర్తి టౌన్: జిల్లాలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరారు. బుధవారం ఉదయం జిల్లా న్యాయస్థానం కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన మూడు కార్ పార్కింగ్ షెడ్లు, రెండో అదనపు కోర్టు హాల్, వైద్య చికిత్స కేంద్రాన్ని కలెక్టర్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్, ఇతర ప్రధాన న్యాయమూర్తులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టు ప్రాంగణంలో వైద్య కేంద్రం ఉండటం చాలా అవసరమని, కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అడిగిన వెంటనే వైద్య చికిత్స కేంద్రం, కారు పార్కింగ్ షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి న్యాయస్థానంలోని ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, వారి బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోడానికి ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. కారు పార్కింగ్ ప్రాంతంలో సీసీ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్ కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి రజని, న్యాయమూర్తులు కళార్చన, కవిత, శ్రీలత, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ఆత్మకూర్: టీయూసీఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో జరుగుతాయని.. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి ప్రసాద్, మండల అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో కార్మికులతో కలిసి మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఇఫ్టూను టీయూసీఐలో విలీనం చేసిన అనంతరం జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తున్నామని.. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. కార్యక్రమంలో నాయకులు జీవరత్నం, నాగేష్, రాజు, వెంకటన్న, మంజుల, సునీత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందేందుకు సివిల్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, బంజారాహిల్స్, హైదరాబాద్లో 2025–26 సంవత్సరానికి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు వెబ్సైట్ htt p://tsstudycircle.co.in లో బుధవారం నుంచి జూలై 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని కోరారు. శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. అభ్యర్థులు జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదని, ఎలాంటి ఉద్యోగం చేయని వారు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్, ఎంపిక చేయబడిన ఇతర సెంటర్లలో జూలై 13న ఉంటుందని, పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం ప్రకారం ఎంపిక చేస్తారని, అమ్మాయిలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు ల్యాండ్లైన్ నంబర్ 040–23546552, సెల్నంబర్ 81216 26423 సంప్రదించాలని సూచించారు. రేపు పాలమూరుకు మంత్రి పొన్నం రాక పాలమూరు: మహబూబ్నగర్లో శుక్రవారంరాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్టీఏ, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. -
రైతులకు విద్యుత్ సమస్యలు ఉండొద్దు
కొల్లాపూర్: రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో విద్యుత్శాఖ అధికారులతో మంత్రి సమావేశమై.. కొల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ కనెక్షన్లు, స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు. లోఓల్టేజీ సమస్య ఏర్పడకుండా అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, కొల్లాపూర్లోని వంద పడకల ఆస్పత్రిలో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతుండటంతో డయాలసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. మల్లేశ్వరంలో కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటుచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖ్ అలీ తదితరులు ఉన్నారు. ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు..
జిల్లాలో మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తుల వైద్య పరీక్షలు పూర్తిచేసి వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 5 ప్రాథమిక కేంద్రాల పరిధిలో మధుమేహం పరీక్షలు ఎంతమందికి నిర్వహించారు? వివరాల ఆన్లైన్ నమోదు ఎంతవరకు వచ్చిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మధుమేహం లక్షణాలు గుర్తించిన 19,300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలు ఫోన్నంబర్తో సహా ప్రత్యేక యాప్లో పొందుపర్చామన్నారు. అదేవిధంగా 594 మంది క్షయ వ్యాధిగ్రస్తుల వివరాలు సైతం నమోదు చేసినట్లు వైద్యాధికారులు వివరించారు. గర్భిణులు ఎప్పుడు వైద్య పరీక్షలకు వెళ్లాలి.. ఐదేళ్లలోపు పిల్లలకు ఏ టీకా ఎప్పుడూ వేయించాలనే వివరాలు పిల్లల తల్లుల సెల్ఫోన్లకు ప్రతినెల సంక్షిప్త సమాచారం పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రోగ్రాం అధికారిని ఆదేశించారు. వారి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభమైనందున ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు, వంట, ఇతర పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
‘నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదు’
వనపర్తి రూరల్: నమ్మక ద్రోహులకు బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని.. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలతో అప్రమత్తంగా ఉండి సంక్షేమ పథకాల మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీకి విధేయులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవచూపే నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ఎగవేతపై ప్రజలకు వివరించాలన్నారు. అందరూ సంఘటితంగా ఉండి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, దిలీప్రెడ్డి, వెంకటస్వామి, విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, నాయకులు కర్రెస్వామి, పృథ్విరాజ్, రాజశేఖర్, కృష్ణారెడ్డి, పెద్దింటి వెంకటేష్, సూగూరు పరశురాం, మాధవరెడ్డి, ఆనంద్, గోవింద్నాయుడు, వడ్డె రమేష్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి
వనపర్తి రూరల్: బీజేపీ పాలనలోనే గ్రామాలు అభివృద్ధిచెందుతున్నాయని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే అందిస్తుండటంతో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు పాపన్నగౌడ్ అన్నారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు నర్సింహనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయనతో పాటు కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి, కిరణ్, బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండిస్తున్న అన్నిరకాల ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర గణనీయంగా పెంచిందని.. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. మండలంలోని గ్రామాలకు వారబందీ విధానంలో సాగునీరు అందిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శ్రీరంగాపురం రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నీటితో నింపాలని కోరారు. రైతులకు కిసానన్ సమ్మాది నిధి పథకంలో భాగంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్గౌడ్, మాధవరెడ్డి, వెంకట్రామారెడ్డి, భగవంతుయాదవ్, దేవేందర్నాయుడు, శివారెడ్డి, జమ్ములు, అజయ్గౌడ్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో విక్రయిస్తే చర్యలు..
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్టులు విక్రయిస్తే తనిఖీలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇలాంటి స్టేషనరీ వ్యాపారాలు చేయొద్దని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు కూడా జారీ చేశాం. బుధవారం పక్కా సమాచారంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించి పాఠ్య, రాత పుస్తకాలు, సామగ్రిని సీజ్ చేశాం. – అబ్ధుల్ ఘని, జిల్లా విద్యాధికారి ● -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసగృహంలో వనపర్తి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. పార్టీపై విధేయత, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపే నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, నాయకులు భానుప్రకాశ్రావు, రవిప్రకాశ్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, మతీన్, మాధవరెడ్డి, శివన్న, ధర్మా నాయక్, లక్ష్మీకాంత్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, అశో క్, చిట్యాల రాము తదితరులు ఉన్నారు. -
మన పాలమూరు ఫస్్ట..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు.. నాకు జన్మనిచ్చిన జిల్లా. మక్తల్ నుంచి ఇక్కడకు కాళ్లతో తిర్లాడిన.. సైకిల్పై తిర్లాడిన.. ఆ తర్వాత బండిపై తిర్లాడిన. ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం చెప్ప లేని ఆనందంగా ఉంది.’ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, పాడి అభివృద్ధి, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించగా.. పలు విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితం, పలు పరిణామాలతో పాటు 1991లో ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ఇతర జిల్లాల్లో మంత్రి పదవులకు పోటీ ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నన్ను మంత్రిగా చేయాలని కోరారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఏ లక్ష్యంతోనైతే నాకు మంత్రిగా బాధ్యత కట్ట్టబెట్టారో.. అందుకనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తా. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా. -
వీడని సందిగ్ధం!
జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణపై మీనమేషాలు ●పురోగతిలో ఉంది.. రహదారి విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. బాధితులకు న్యాయం చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కర్నూలు రోడ్డులో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశాం. దీంతో పాటు దుకాణాలు, నివాసగృహాల అనుమతి పత్రాల జిరాక్స్ అందించాలని యజమానులను కోరాం. ప్రజల భాగస్వామ్యం పెంచి విస్తరణ చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ యోచిస్తున్నారు. – ఎన్.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, వనపర్తి భవనాలు తొలగిస్తేనే.. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసేందుకు సిద్దంగా ఉన్నాం. పురపాలిక అధికారులు రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగిస్తేనే పనులు ప్రారంభమవుతాయి. కర్నూలు రోడ్డును ఎంత విస్తరించాలనేది స్పష్టత రావాల్సి ఉంది. – రాకేశ్, ఆర్అండ్బీ ఏఈ వనపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తిలో రహదారుల విస్తరణపై నెలకొన్న సందిగ్ధం వీడటం లేదు. నెలరోజుల క్రితం విస్తరణ పనులను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేసిన అధికారులు.. ఒక్కసారిగా మిన్నకుండిపోయారు. 2020 ఏప్రిల్ 25న సుమారు రూ. 45కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు.. 2023 ఆగస్టులో నిలిచిపోయాయి. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడపాదడపా రోడ్ల విస్తరణలో కదలిక కనిపిస్తున్నా.. కార్యాచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారిపోయింది. పాన్గల్ రోడ్డు విస్తరణలో నివాసగృహాలు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంపై స్పష్టత లేకుండా పోయింది. కర్నూలు రోడ్డు విస్తరణ పరిధిని తేల్చడం లేదు. ఈ రోడ్డు 100 అడుగుల లేక 80 అడుగుల అనేది అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే కర్నూలు రోడ్డులో 18 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మున్సిపల్శాఖ నోటీసులు జారీ చేసినా.. వా టిపై తదుపరి కార్యాచరణపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య దోరణితో కర్నూలు రోడ్డు విస్తరణపై సందిగ్ధం నెలకొంది. ఇంకా తేలని కర్నూలు రోడ్డు విస్తరణ పరిధి పరిహారంపై కొరవడిన స్పష్టత మూడు, ఆరు నెలలకోసారి హడావుడి చేస్తున్న అధికారులు -
భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
మదనపురం: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మదనాపురం మండలం దుప్పల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై.. భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సుల్లోనే భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జేకే మోహన్, ఆర్ఐ రాజేశ్వరి, సిబ్బంది సుచరిత, శ్రీధర్, నాయకులు చింతకుంట శేఖర్, నాగరాజు, అరుణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
కొత్తకోట: దేవరకద్ర నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులు రూ. 1.50 కోట్లతో మంగళవారం కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, సీబీఎఫ్ నిధులు రూ. 80లక్షలతో బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. కొత్తకోట పట్టణ నడిబొడ్డున ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో కనీస మౌలిక వసతులు, తరగతి గదులు లేకున్నా ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలో అదనపు గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్కు దీటుగా అన్ని వసతులతో పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు స్థానిక దండుగడ్డ అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ఎగ్ బిర్యాన్నీ వడ్డించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ రుచి చుశారు. అదే విధంగా బాల్యవివాహాలను అరికట్టాలనే సందేశంతో సంక్షేమశాఖ రూపొందించిన పోస్టర్ను అదనపు కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. అదే విధంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 60 మంది రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, ఉద్యానశాఖ అధికారి ఎంఏ అక్బర్, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ కృష్ణయ్య, హెచ్ఎం కె.నిర్మలాదేవి, వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు వరద
●జూరాలకు జూన్లోనే మొదలైన ప్రవాహం ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానాకాలం పంటల సాగుకు త్వరగా సాగునీరు అందించాలనే ఆలోచనను ఉన్నతాధికారులకు విన్నవించాం. రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా నెలాఖరు నాటికి కాల్వలకు సాగునీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం వరి నారు పోసుకున్నా.. ఎడమ కాల్వకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. గతేడాది యాసంగిలో 8 ఎకరాల వరి సాగుచేసినా సాగునీరు సరిపడా అందక ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఈసారి సైతం 8 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు పొలం చదును చేస్తున్నా. – కుమార్, రైతు, జూరాల ఎత్తిపోతల పథకాలకు నీరివ్వాలి.. జూరాల ఎడమకాల్వ ద్వారా ఎత్తిపోతల పథకాలకు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మండలంలోని అమరచింత ఎత్తిపోతల పథకం రైతుల భాగస్వామ్యంతో నిర్విరామంగా కొనసాగుతోంది. గత యాసంగిలో సాగునీరు అందక ఇబ్బందిపడిన రైతులకు ఈసారి పూర్తిస్థాయిలో సాగునీటిని అందించి ఆదుకోవాలి. – ఆంజనేయులు, కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ముందస్తుగా జూన్లోనే వరద వస్తుండటంతో ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ముందుగా కాల్వలకు సాగునీరు విడుదల చేస్తే పొలాలు దుక్కి దున్నడం, కరిగెట చేసుకోవడం వంటి పనులు చేపట్టేందుకు ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి నారుమడులను సిద్ధం చేసుకుంటూ ఎప్పుడు నీరు వదులుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి కేవలం 35 వేల ఎకరాలకే పరిమితం చేసి సాగునీటిని అతి కష్టం మీద అందించగలిగింది. దీంతో పంటలకు దూరంగా ఉన్న చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం సన్నరకం వరిని మాత్రమే సాగు చేసేందుకు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడే పొలాలకు అందిస్తే సాగు పనులు మొదలు పెడతామని.. అధికారులు గుర్తించాలని వేడుకుంటున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో జూన్లోనే నిండుకుండను తలపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.184 టీఎంసీల నీటిమట్టం ఉంది. ఆయకట్టు పరిధి ఇలా.. జూరాల ఎడమ కాల్వ కింద అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు గత కొంతకాలంగా యాసంగిలో వారబందీ విధానంలో సాగునీరు వదులుతుండటంతో వరితో పాటు చెరుకు సాగుపై రైతులు దృష్టి సారించారు. అధికారుల సూచన మేరకు రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతోంది. ● గతేడాది యాసంగిలో ఎడమ కాల్వ పరిధిలో అధికారులు రామన్పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించారు. ఈసారి వానాకాలంలో చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారులకు విన్నవించారు. రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి నీటి పారుదలశాఖ మంత్రి ఆదేశాలతో చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నెలాఖరున కాల్వలకు విడుదల చేసే అవకాశం వానాకాలం వరి సాగుకు ఆయకట్టు రైతులు సన్నద్ధం ప్రాజెక్టులో ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నారుమడులు సిద్ధం.. జూరాల ఎడమ కాల్వ పరిధిలో చాలామంది రైతులు ఇది వరకే వరి నారు పోసుకున్నారు. అకాల వర్షాలు, ముందస్తు వానలు కురవడంతో ఎగువ నుంచి జలాశయానికి వరద భారీగా చేరుతుండటంతో ఆయకట్టుకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో రైతులు తమ పొలాలను చదును చేసుకుంటూ నీటిరాక కోసం ఎదురు చూస్తున్నారు. -
అన్నదాతల ఆనందం
ప్రారంభమైన రైతుభరోసా నిధుల జమ ●పెట్టుబడికి ఉపయోగం.. వానాకాలం సాగుకుగాను ప్రభుత్వం రైతుభరోసా నిధులను అందిస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగిన విషయం. సకాలంలో చేతికందడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. యాసంగి మాదిరిగా రైతులు అయోమయానికి గురికాకుండా పూర్తి వివరాలు వెల్లడించాలి. – తెలుగు పరశురాం, రైతు, పాన్గల్ సీఎం ప్రకటనతో ఉత్సాహం.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో 5 ఎకరాల పొలం ఉంది. రైతు భరోసా డబ్బులు సమయానికి అందితే పంట సాగుకు ఉపయోగపడుతాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం ఉత్సాహం కలిగించింది. వార్షాకాలం సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేద్దామనే సమయంలో రైతుభరోసా డబ్బులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. – సుధాకర్, రైతు, మూలమళ్ల అర్హులందరికీ రైతుభరోసా.. సోమవారం నుంచి తొమ్మిది రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలని ఆదేశాలొచ్చాయి. తొలిరోజు సోమవారం 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానుంది. జూన్ 5వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసిన వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వనపర్తి: వానాకాలం సాగు సమయం ఆసన్నం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుభరోసా (పెట్టుబడి సాయం) సాయాన్ని సోమవారం నుంచి పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో తొలిరోజు 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమంలో ప్రకటించారు. నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్న సమయంలో రైతుభరోసా నిధులను మునుపటి కంటే పకడ్బందీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించడంతో ఎన్నిక స్టంటేనన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మొదటిరోజు రెండెకరాలలోపు వారికి.. జిల్లాలో 1,96,683 మంది రైతులు రైతుభరోసాకు అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో రెండెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 1,08,214 మంది ఉండగా.. మొదటిరోజు సోమవారం రూ.57,40,20,979 జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండెకరాలలోపు భూమి ఉన్న వారికి నిధులు జమ చేస్తూ మీట నొక్కారు. మిగతా రైతులందరికి తొమ్మిది రోజుల్లో సుమారు రూ. 155 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా ఇలా.. మండలం అర్హులైన మంజూరైన రైతులు నిధులు వనపర్తి 20,083 15,71,41,940 పాన్గల్ 19,917 20,36,50,440 కొత్తకోట 18,536 17,13,93,636 ఖిల్లాఘనపురం 16,399 15,49,04,522 పెద్దమందడి 16,066 16,51,72,632 పెబ్బేరు 15,354 17,81,37,153 గోపాల్పేట 13,355 13,33,76,394 చిన్నంబావి 11,776 17,06,41,323 ఆత్మకూరు 11,585 17,13,93,636 మదనాపురం 10,227 11,28,48,975 ఏదుల 8,843 8,74,99,288 శ్రీరంగాపురం 8,241 8,09,73,330 అమరచింత 8,070 11,35,64,983 రేవల్లి 5,789 6,43,01,888 వీపనగండ్ల 2,442 17,85,98,920 జిల్లాలో తొలిరోజు 70 శాతం మంది రైతులకు.. అర్హులైన రైతులు 1.96 లక్షలు మొదటిరోజు 1.08 లక్షల మంది ఖాతాల్లో రూ.57.40 కోట్ల చెల్లింపులు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు -
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏయే మండలంలో ఎంతమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని తరగతులకు కలిపి 1,25,983 పాఠ్య పుస్తకాలు వచ్చాయని, వాటిలో ఇప్పటి వరకు 48,011 మంది విద్యార్థులకు పంపిణీ చేశామని, యూనిఫామ్స్ డీఆర్డీఓ, మెప్మా ద్వారా 34,665 వచ్చాయని.. అందులో మొదటి విడతగా ఒక జత దుస్తులు 12,737 మంది విద్యార్థులకు అందించినట్లు జిల్లా విద్యాధికారి వివరించారు. విద్యార్థులు పాఠశాలకు హాజరుకాగానే పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని చెప్పారు. పాఠశాలల వారీగా నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత సామర్థ్య పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఫోరం అధ్యాపకులు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నపత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నాలుగు సెట్ల ప్రశ్నపత్రం తయారు చేయాలని, ఈ వారంలో పరీక్ష నిర్వహించి కనీస మార్కులు రాని విద్యార్థులకు నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి గణితంలో ఫెయిల్ కావడానికి వీలులేదన్నారు. సమావేశంలో జిల్లా విద్యా ధికారి మహ్మద్ అబ్దుల్ ఘని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ గణేష్, డీఆర్డీఓ ఉమాదేవి, సీఎంఓ యుగంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రామరాజ్యంతోనే ఆర్థిక పరిపుష్టి : బీజేపీ
వనపర్తిటౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత గూడూరి నారాయణరెడ్డి ఆరోపించారు. ఆయన రజాకార్ల వారసుడని.. పదేళ్లలో రాష్ట్రంలో ఏమీ మిగల్చలేదని దుయ్యబట్టారు. సోమవారం జిల్లాకేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో 11 ఏళ్ల మోదీ పాలనపై నిర్వహించిన ప్రదర్శనశాల, మేధావుల అవగాహన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. దేశం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని.. ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారత్ను 4వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. రూ.64 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.1.14 లక్షలకు చేర్చారని చెప్పారు. భావితరాలకు పునాది వేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణే ఏకై క మార్గమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు అట్లూరి రామకృష్ణ మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ వరకు కాంగ్రెస్ పాలనలో అన్నీ తప్పులే జరిగాయని, ప్రజా మద్దతుతోనే మోదీ మూడోసారి అధికారం చేపట్టారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. అనంతరం నారాయణరెడ్డి నిర్మించిన రజాకార్ల సినిమాకు గద్దర్ అవార్డు రావడంతో బీజేపీ జిల్లా నాయకులు గూడూరు నారాయణరెడ్డిని సన్మానించారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గౌని హేమారెడ్డి, మున్నూరు రవీందర్, ఫొటో ఎగ్జిబిషన్, ప్రొఫెషనల్ మీట్ కార్యక్రమాల కన్వీనర్, స ర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆలయాల విధ్వంసం..
పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్, వడ్డేమాన్లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ మాయగాళ్లు, నాటువైద్యులు ఉమ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ. సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు -
కానరాని పురోగతి
●● విచారణలో జాప్యానికి తెలియని కారణాలు ● సీసీ కెమెరాలు వినియోగంలోకి వచ్చినట్లేనా? ● జిల్లా కార్యాలయాల్లో భద్రతపై వీడని సందేహాలు నేటికీ తెలియలేదు.. ఏప్రిల్లో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో మా కార్యాలయంలో కొత్త బ్యాటరీ చోరీ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ చోరీకి పాల్పడింది ఎవరనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం మా ఫ్లోర్లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చిందని అప్పుడప్పుడు అడుగుతున్నాం. – అఫ్జల్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, వనపర్తి వనపర్తి: కలెక్టరేట్లోని రెండు జిల్లా కార్యాలయాల్లో బ్యాటరీలు మాయమైన ఘటన ఏప్రిల్ 16న వెలుగుచూసింది. చోరీ జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోవడం శోచనీయం. చోరీ ఘటనపై కలెక్టరేట్ ఏఓ, ఆయా శాఖల అధికారులు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సమయంలో హడావుడి చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది ఎవరనేది నేటికీ తేల్చలేదు. వందలాది మంది ఉద్యోగులు, ఫ్లోర్కు పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు, గస్తీ నిర్వహించే సెక్యూరిటీ గార్డులు, సెలవు రోజుల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులున్న కలెక్టరేట్లో చోరీకి ఎలా ఆస్కారం ఉంటుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. కలెక్టరేట్లోని పలువురు సిబ్బందిని విచారణ చేయడంతో పాటు బయట ఎక్కడైనా విక్రయించారా అన్న కోణంలో జిల్లాకేంద్రంలోని పలు బ్యాటరీల దుకాణాల్లో విచారణ చేపట్టినా ఫలితం లేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస సెలవుల సమయంలోనే.. ఏప్రిల్ 16వ తేదీకి ముందు వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో భారీ బరువున్న బ్యాటరీని సైతం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మైనార్టీ సంక్షేమశాఖలో ఒకటి, జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారి కార్యాలయంలో రెండు బ్యాటరీలు మొత్తం మూడు చోరీ అయినట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొలిక్కిరాని కలెక్టరేట్ బ్యాటరీల చోరీ కేసు సీసీ కెమెరాల నిర్వహణ లేక.. కలెక్టరేట్లోని ప్రధాన ద్వారం నుంచి ప్రతి ఎంట్రెన్స్, మలుపుల వద్ద, ప్రతి ఫ్లోర్లో హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాల పర్యవేక్షణ, ఫుటేజీలను ఏఓ కార్యాలయం, కలెక్టర్ పేషీలో భద్రపర్చే ఏర్పాటు చేసినా.. చాలా వరకు పని చేయ లేదు. చోరీ ఘటన వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే బాగు చేయించారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీల కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఆధారాలు లభించకపోవడంతో కేసులో నేటికీ ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ కొనసాగుతోంది.. కలెక్టరేట్లో బ్యాటరీల చోరీపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నాం. ఫిర్యాదు అందిన రోజుకంటే ముందు వరకు కలెక్టరేట్లో చాలా సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఆధారాలు లభించడం లేదు. చోరీ చేసిన బ్యాటరీలను బయటకు తీయకపోవడంతో ఎక్కడా మార్కెట్లో విక్రయించినట్లు తెలియరాలేదు. త్వరలో కేసును ఛేదిస్తాం. – జలంధర్రెడ్డి, ఎస్ఐ, వనపర్తి రూరల్ -
శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది
వనపర్తి టౌన్: దేశవ్యాప్తంగా మహాకవి శ్రీశ్రీకి అభిమానులున్నా.. ఆయనను కష్టకాలంలో ఆదుకొని అండగా నిలిచిన చరిత్ర వనపర్తి సొంతమని మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ రాజారామ్ప్రకాశ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శ్రీశ్రీ 42వ వర్ధంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కవులు, నాయకులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారామ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. తన కలం, గళంతో జన చైతన్యానికి శ్రమించిన విప్లవ కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ అని, కవులు, రచయితలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో కవులు గిరిరాజాచారి, డా. నాయికంటి నరసింహశర్మ, చిలుక రవి, బాలెమియా, గాయకుడు చింతకుంట కురుమయ్య, గద్వాల కృష్ణ, నర్సింహ, సులిగిరి వెంకటస్వామి, పరమేశ్వరాచారి, శ్రీనివాస్ శెట్టి, రఘునాథ్ రెడ్డి, పుల్లారెడ్డి, గంధం శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 ఒక్కో పాకెట్పై రూ.37 పెంపు -
విద్వేషాలు, ఉద్రిక్తతలే మోదీ ఆయుధాలు
పాన్గల్: విద్వేషాలు, ఉద్రికత్తలే ప్రధాని మోదీ ఆయుధాలని, బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని రేమద్దులలో రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. ఆపరేషన్ కగార్ పేరుతో విధ్యంసం సృష్టించేందుకు యత్నిస్తోందన్నారు. పాకిస్థాన్తో యుద్ధం ఆపి చర్చలు జరుపుతామంటున్న కేంద్రం.. దేశంలో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా వినకుండా ఎన్కౌంటర్లు జరుపుతోందన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని.. అదేవిధంగా ఇజ్రాయిల్ మారణహోమ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, 19న పాలస్తీనా సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, ఇందుకు ప్రతి సభ్యుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టి రాయితీపై రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, పని పద్ధతులపై రెండ్రోజుల పాటు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించామని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జబ్బార్ వివరించారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాల్రెడ్డి, జి.వెంకటయ్య, మహబూబ్పాషా, ఆది, వేణుగోపాల్, దేవేందర్, వెంకటేష్, రాజేందర్గౌడ్, రాము, భగత్, ఎం.వెంకటయ్య, భాస్కర్, ఖాజా, మహేష్, మల్లేష్, శేఖర్, కమలాకర్, రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విధేయతకు తగిన గుర్తింపు
వనపర్తి: కాంగ్రెస్పార్టీలో విధేయతకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శిగా జిల్లాకేంద్రానికి చెందిన నందిమళ్ల యాదయ్య ఎన్నిక కాగా.. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై యాదయ్యను శాలువాతో సన్మానించి మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న యాదయ్యకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి గుర్తించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఏఐసీసీ సైతం మొదటి నుంచి పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తోందని గుర్తు చేశారు. కార్యకర్తలు పదవులు ఆశించి పని చేయవద్దని.. అంకితభావంతో పనిచేస్తే పదవులు కచ్చితంగా వరిస్తాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అధిష్టానం పని చేస్తోందని.. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆసరాగా నిలబడ్డామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని.. దేశంలో కులగణన చేసిన ఏకై క రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తానని నందిమళ్ల యాదయ్య తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఆదిత్యారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కమర్మియా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్మియా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
పాన్గల్: వర్షాకాలం ప్రారంభమైనందున సిబ్బంది సీజనల్గా వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్రెడ్డి అన్నారు. ఫ్రై డే.. డ్రై డేలో భాగంగా శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు, అపరిశుభ్రతతో దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందుతాయని.. రోగాల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, వైద్యసిబ్బంది రాంచందర్, నర్సమ్మ, నాగేశ్వరి, శైలజ, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించండి
ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 603.46 ఎకరాలు అవసరం ఉండగా.. అందులో 388 ఎకరాలు చెరువు లోపల శిఖం పట్టాలున్నాయని వివరించారు. మొత్తం 991 మంది రైతులకు పట్టాలు ఉండగా.. ఇప్పటికే 251 మంది రైతులు భూమిని అప్పగించడానికి అంగీకారం తెలపడంతో పాటు అవార్డు అందజేసినట్లు తెలిపారు. మిగతా 740 మంది రైతులు అంగీకారం తెలిపి అవార్డు చేసుకుంటే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి మండలంతో పాటు మూసాపేట మండలంలోని ముసాపేట, నిజాలాపూర్, మహ్మద్హుస్సేన్పల్లి తదితర గ్రామాల్లోని 5,200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పరిహారం అందుతుందని చెప్పారు. 15 రోజుల సమయం తీసుకొని అన్నివిధాలుగా ఆలోచించి అంగీకారం తెలపాలని కోరగా.. రైతులు అందుకు సమ్మతించారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ నరేందర్రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను భూ సమస్యలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లిలో కొనసాగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరైన ఆయన రైతులు ఇచ్చిన ధరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలకు వచ్చే అధికారులకు సమస్యలు ఉన్న రైతులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, ఆర్ఐ తిర్పతయ్య, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన
ఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకొని ప్రవేశాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. గతేడాది కంటే 30 శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల ఆవరణలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధన అందించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, టీజే విశ్వేశ్వర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2,307 ప్రవేశాలే లక్ష్యం.. వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు గతేడాది కంటే 30 శాతం పెంచాలని ఆదేశించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలు ఉన్న ప్రతి గ్రామాన్ని అధ్యాపకులు సందర్శించి ప్రవేశాలు చేయిస్తున్నట్లు వివరించారు. గతేడాది 1,775 అడ్మీషన్లు ఉండగా.. ఈ ఏడాది 30 శాతం కలిపి మొత్తం 2,307 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కచ్చితంగా లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి టీజీటీ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు, గైడ్ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్ పవర్ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్పేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం బయలుదేరి వెళ్తాడు. రైతుల అనుమతి లేని రిజర్వాయర్ వద్దు బల్మూర్: రైతుల అనుమతి లేకుండా ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాల్లోని 2,601 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
ఏపీడీపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు
వనపర్తి: తమను అవమానించేలా, మా పనితీరును కించపర్చేలా కామెంట్స్ చేస్తున్నారంటూ డీఆర్డీఓ ఏపీడీ సుల్తాన్పై పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలు, టీఏలతో పెద్దమందడిలో నిర్వహించిన సామూహిక ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమను కించపర్చడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీసం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయడం లేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యారని హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీడీ సుల్తాన్ను వివరణ కోరగా తాను వారి జాబ్చాట్ను గుర్తుచేశానని.. ఎవరినీ కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
వనపర్తి రూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నేడు పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలో రూ.13 కోట్లు, శ్రీరంగాపురం మండలంలో రూ.21.75 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి, తోమాలపల్లి, కొత్తసూగూరు, ఈర్లదిన్నె, శేరుపల్లిలో గ్రామపంచాయతీ భవనాలు, రంగాపురంలో హమాలి సంఘం భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, వైశాఖాపూర్లో మహిళా సంఘం భవనం, చెలిమిళ్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, బునాదిపురం గ్రామ పాఠశాలలో ల్యాబ్, కంచిరావుపల్లిలో హైమాక్స్ లైట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అలాగే వైశాఖాపూర్, యాపర్ల, తోమాలపల్లిలో అంగన్వాడీ భవనాలు, పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.10.76 కోట్లతో చేపట్టే అమృత్ స్కీం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యాపర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించి, అయ్యవారిపల్లి, యాపర్ల బడిబాటలో పాల్గొని పాఠశాలలో సరస్వతి పూజ చేసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అలాగే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ లాంటి అనేక పథకాలు అమలవుతుండటంతో పేదలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మార్కెట్ చైర్మన్లు ప్రమోదిని, శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, నాయకులు సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, రంజిత్కుమార్, సూగూరు శివ, రామచంద్రారెడ్డి, దయాకర్రెడ్డి, రామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని 19 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే భూ భారతిని రూపొందించి అమలు చేస్తోందని.. భూ సమస్యల పరిష్కారానికే ఈ చట్టం తీసుకొచ్చామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మిరాసిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణి పేరుతో రైతులను దగా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అంతేగాకుండా ధనవంతులతో సమానంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేదని, ఈ ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని తెలిపారు. గ్రామానికి మొదటి విడత 24 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. రెండోవిడతలోనూ మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు గ్రామంలో పెండింగ్లో ఉన్న వడ్డెర, యాదవ కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్ల నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బాలమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, బీచుపల్లియాదవ్, కాంగ్రెస్ నాయకులు రావుల కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత.. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ను ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు ధీటుగా సౌకర్యాలు, బోధన అందుతుందని.. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఎస్ హెచ్ఎం భీంపల్లి బాలరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక చేయూత
చేనేత.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం ●రూ.50 వేలు అప్పు తీసుకున్నా.. నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల మగ్గాల కొనుగోలుకు.. కొత్త మగ్గాల కొనుగోలుకు డబ్బులు అవసరం ఉండి బ్యాంకు నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతిసారి రెన్యూవల్ చేశా. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో తీసుకున్న డబ్బులు మాఫీ అవుతాయనే సంతోషం ఉంది. – పుట్టా సరిత, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం అందరికీ వర్తింపజేయాలి.. చేనేత కార్మికులు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేసి విముక్తి కల్పించాలి. ముద్ర, క్రెడిట్ కార్డులతో పాటు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకోవాలి. రూ.లక్షలోపు రుణాలు పొందిన వారి జాబితాను తయారుచేసి త్వరగా మాఫీ వర్తింపజేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి. – అక్కల శాంతారం, జిల్లా కార్యదర్శి, చేనేత కార్మికుల సంఘం, గద్వాల అమరచింత: చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా.. ఇందుకు సంబంధించి తాజాగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు అందాయి. 2017, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు నేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికులకు ఆర్థిక ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ ఆదేశాలతో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల ఏడీ కార్యాలయాల పరిధిలో నేత కార్మికులు ఎంతమంది రూ.లక్ష రుణాలు తీసుకున్నారనే వివరాలను బ్యాంకు మేనేజర్లతో సేకరించి జాబితా రూపొందిస్తున్నారు. ఆ జాబితాను మరోమారు పరిశీలించి కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎల్సీ (జిల్లాస్థాయి కమిటీ) ఏర్పాటు చేసి స్టేట్ లెవల్ కమిటీకి నివేదించనున్నారు. రూ.6.50 కోట్లకుపైగా రుణాలు.. ఉమ్మడి జిల్లాలో 4,537 జియోట్యాగ్ కలిగిన మగ్గాలు ఉండగా.. 8,338 మంది కార్మికులు నేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మగ్గం పనిచేసే కార్మికులు ముద్ర యోజన, క్యాష్ క్రెడిట్, చేనేత మగ్గాల పేరున రుణాలు పొందారు. ఇలా చేనేతకు సంబంధించి సుమారు రూ.6.50 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు గతంలో అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని ప్రకటించడం, ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఆయా జిల్లాల ఏడీలకు అందడంతో ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది. వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ.. చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆయా చేనేత సహకార సంఘాల ద్వారా ఇదివరకే సేకరించిన జౌళిశాఖ అధికారులు తాజాగా మరోమారు ఏ బ్యాంకులో రుణాలు ఇప్పించారో అక్కడికే వెళ్లి రుణగ్రహీతల వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారి వివరాలను సైతం సదరు ఏడీ కార్యాలయాల సిబ్బంది సేకరించే పనుల్లో లీనమయ్యారు. రెండు, మూడు రోజుల్లో జౌళిశాఖకు పూర్తి నివేదిక అందనుంది. వీటిని రాష్ట్రస్థాయి కమిటీకి అందజేసిన తర్వాత ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటించనుంది. ఇవీ మార్గదర్శకాలు.. కలెక్టర్ చైర్మన్గా ఆరుగురితో కూడిన జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ) ఆమోదం పొందాలి. తర్వాత చేనేత డైరెక్టర్ చైర్మన్గా ఉన్న స్టేట్ లేవల్ కమిటీ ఆమోదం పొందితే బ్యాంకర్లు నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ప్రతి కార్మికుడికి వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు రుణ మాఫీ అవుతుంది. అంతకుమించి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 8,338 కార్మికులు.. 4,537 జియోట్యాగింగ్ మగ్గాలు రూ.6.50 కోట్ల అంచనా బ్యాంకర్లను నివేదిక కోరిన అధికారులు వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల -
ఆశాలకు వేతనం ఇవ్వాలి : సీఐటీయూ
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు కచ్చిత వేతనం కింద రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల 4వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి పనిభారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జులై 9న జరిగే దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో ఆశా కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆశ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి సునీత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు నిక్సన్, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, జిల్లా కోశాధికారి జె.భాగ్య, నాయకురాలు గిరిజ, దేవమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. గురువారం ఆత్మకూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల, జూరాలలోని ఉన్నత, జెడ్పీ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ బడులను కాపాడుకునే బాధ్యత గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలికలు భవిష్యత్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యాభ్యాసం ఆపకుండా లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలన్నారు. బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికేందుకు భవనాలను మామిడాకుల తోరణాలు, పూలమాలలతో అలంకరించడంతో పాటు డప్పుచప్పుళ్లతో ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఖిల్లాఘనపురం/కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఖిల్లాఘనపురంలోని పద్మశాలి కల్యాణ మండపంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, హౌసింగ్ డీఈ విఠోభాతో కలిసి అలాగే పెద్దమందడి, శ్రీరంగాపురం, పెబ్బేరులోని ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిందన్నారు. ఏడాదికి అయిదు ఇళ్లు ఇచ్చినా నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వనపర్తిని పూరి గుడిసే లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత చీర, పంచె, పసుపు, కుంకుమతో ఇళ్లకు వస్తామన్నారు. ఖిల్లాఘనపురం గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడటానికి శుక్రవారం అధికారులు వస్తారని.. అన్ని విషయాలు మాట్లాడుకోవాలని సూచించారు. త్వరలో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలాగే పెబ్బేరులో రుక్సానాబేగం ఇంటిని ముగ్గు వేసి ప్రారంభించారు. ఖిల్లా ఘనపురంలో జరిగిన కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ వెంకటాచారి, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రావు, పెబ్బేరు, శ్రీరంగాపురంలో జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, తహసీల్దార్లు మురళిగౌడ్, రాజు, ఎంపీడీఓ రవీంద్ర, రవినారాయణ, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, సమయపాలనతో గుర్తింపు
వనపర్తి: క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ, విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ అధికారుల మన్ననలు పొందాలని.. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి పోలీసుశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందికి విధుల నిర్వహణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవాలని, న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా, భద్రత కల్పించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వివిధ వర్టికల్ విభాగాల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలని, ఐటి సెల్ సేవలు వినియోగించుకొని జిల్లాను ముందువరుసలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిమ కనబర్చిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణయ్య, ఆత్మకూర్ సీఐ శివకుమార్, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, డీసీఆర్బీ ఎస్ఐ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ!
జిల్లాలో నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివరాలు 8లో u●బేస్మెంట్ నిర్మించినా బిల్లు రాలే.. అధికారులు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం ఇచ్చారు. దీంతో అప్ప చేసి బేస్మెంట్ వరకు నిర్మించినా ఇప్పటి వరకు రూ.లక్ష ఇవ్వలేదు. కారణం ఏమిటంటే బ్యాంకు ఖాతాలో తేడాలున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరగా బిల్లు చెల్లించి ఆదుకోవాలి. – అంజమ్మ, చింతరెడ్డిపల్లి (అమరచింత) అప్పు చేసి నిర్మాణం.. బిల్లు త్వరగా వస్తుందని రూ.50 వేలు అప్పుచేసి బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టా. ఇప్పటి వరకు బిల్లు రాకపోవడంతో పనులు నిలిపివేశా. మండలంలోని యూనియన్ బ్యాంకులో ఖాతా తెరవమన్నారు.. ఇప్పటి వరకు బిల్లు మాత్రం రాలేదు. ఎంపీడీఓతో పాటు అధికారులు వచ్చి పనులు చేపట్టాలని బిల్లు వస్తుందని భరోసానిస్తున్నారు. మొదటి బిల్లు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తా. – వై.అనిత, చింతరెడ్డిపల్లి (అమరచింత) రెండో బిల్లు వచ్చింది.. అధికారుల సూచనతో ఇంటి నిర్మాణం చేపట్టా. ఆత్మకూర్ ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఇచ్చా. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.రెండు లక్షల బిల్లు వచ్చింది. ప్రస్తుతం స్లాబ్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇంటి పనులు పూర్తి చేసుకుంటే పూర్తి బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. – వెంకటన్నగౌడ్, చింతరెడ్డిపల్లి (అమరచింత) అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచడానికి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 499 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తిచేశారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష జమ చేశాం. మిగిలిన లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు ఖాతాల్లో లోపాలు గుర్తించి సవరిస్తూ బిల్లులు అందిస్తున్నాం. – విఠోభా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పథక ప్రారంభంలో జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి పేదలను గుర్తించి జనవరి 26న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన విధి విధానాలను గ్రామసభల ద్వారా అధికారులు తెలియజేశారు. కాని అధికారుల గైడ్లెన్స్ ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టలేమంటూ లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకొచ్చి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 14 గ్రామాల్లో 1,131 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణ పత్రాలు అందించారు. వీటిలో ఇప్పటి వరకు 499 బేస్మెంట్ లేవల్కు, 54 రూఫ్ లేవల్కు, కేవలం 10 ఇళ్లు మాత్రమే స్లాబ్ లేవల్కు వచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల సమస్య.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలు తలెత్తడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. జాతీయ బ్యాంకుల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు హౌసింగ్శాఖ విడతల వారీగా చెల్లిస్తున్నారు. కాని ఇప్పటి వరకు యూనియన్ బ్యాంకులో మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తిందని.. గుర్తించి పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడం సాధ్యం కాదంటూ లబ్ధిదారులు మండల పర్యటనకు వచ్చిన అధికారులకు ఇంటి మంజూరు పత్రాలను వెనక్కి ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో అధికారులు వారానికోమారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి త్వరగా బెస్మెంట్ నిర్మిస్తే రూ.లక్ష మంజూరు చేస్తామని, అధైర్యపడొద్దని భరోసానిస్తూ ప్రోత్సహిస్తున్నారు. బిల్లుల చెల్లింపులు.. మొదటి బిల్లు రూ.లక్ష బేస్మెంట్ నిర్మించిన తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. రెండోబిల్లు రూ.లక్ష గోడలు నిర్మించిన తర్వాత, మూడో బిల్లు రూ.రెండు లక్షలు స్లాబ్ వేసిన తర్వాత, చివరి బిల్లు రూ.లక్ష మరుగుదొడ్డి, ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తారు. పైలెట్ గ్రామంగా మండలానికి ఒకటి ఎంపిక 14 గ్రామాలు.. 1,131 మంది లబ్ధిదారులు స్లాబ్ వరకు చేరినవి కేవలం 10 మాత్రమే.. బేస్మెంట్ లేవల్కు వచ్చినవి 499 అడ్డంకిగా మారిన నిబంధనలు.. మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలి. ఇంటి నిర్మాణం 400 X 600 విస్తీర్ణం మించకుండా, ఆర్సీసీతో నిర్మించుకోవాలి. రెండు గదులతో పాటు వంట గది, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. అనర్హులుగా తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్లు తెలిసినా ఇంటి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లును ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేయబడును. -
573 బస్సులకు నో ఫిట్నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.జిల్లాల వారీగా ఇలా.. ఉమ్మడి జిల్లాలో పునః ప్రారంభమైన పాఠశాలలు నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పాన్గల్: రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, కేతేపల్లి, జమ్మాపూర్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అందించాలనేదే గాంధీజీ ఆలోచన అని.. ఆయన ఆశయ సాధనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షించిందని.. నేడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని.. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం తరుగుపై ఆరా.. మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయంపై మంత్రి జూపల్లి పౌరసరఫరాల డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో ఆరా తీశారు. ఈ విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రైతులకు పారదర్శక సేవలు
ఖిల్లాఘనపురం: రైతులకు పారదర్శకమైన సేవలు అందించే బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని షాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుల్లో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ దరఖాస్తులకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పుడు ఎంట్రీలకు నోటీసులు జారీ చేయాలని.. హెల్ప్డెస్క్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది రైతులకు పూర్తి సమాచారం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. రైస్మిల్లు తనిఖీ.. గురువారం మండలానికి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర రైస్మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. మిల్లుకు వచ్చిన ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని యజమానిని ఆదేశించారు. దించుకున్న ధాన్యం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని.. సీఎంఆర్ కోసం మిల్లింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, సీనియర్ అసిస్టెంట్ కురుమూర్తి, ఆర్ఐ తిరుపతయ్య, పలువురు సిబ్బంది ఉన్నారు. -
వేసవి శిక్షణ.. సత్ఫలితం
శిక్షణ కేంద్రాలు ఇవే.. మదనాపురం, గోపాల్పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్గల్, కొత్తకోట, ఆత్మకూర్, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రచారం చేయడానికి వీలు లేకపోవడంతో ఆయా మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిబిరాలు నిర్వహించారు. క్రీడా సామగ్రి పంపిణీ.. క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందించిందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ పరికరాలను ఆయా కోచ్లకు జిల్లాకేంద్రంలో అందించడంతో క్రీడాకారులు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. రోజు ఉద యం ఎనిమిది గంటల వరకు, సాయంత్ర ఐ దు నుంచి ఆరు గంటల వరకు శిక్షణనిచ్చారు. అమరచింత: బడిఈడు పిల్లలు వేసవి సెలవుల్లో చెడుదారులు పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కలిగిస్తూ నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ తర్ఫీదునిచ్చే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని వివిధ మండలాల్లో 10 చోట్ల క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసి మే ఒకటో తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శిక్షణనిచ్చింది. శిబిరాలకు హాజరైన విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో శిక్షణ పొంది వాటిలో ప్రతిభ చాటే స్థాయికి ఎదిగారు. కోచ్లు క్రీడా నైపుణ్యాలను నేర్పిస్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారిలోని ప్రతిభను వెలికితీయడంలో సఫలీకృతులయ్యారు. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీతో పాటు వివిధ క్రీడా విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి వారికి శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. శిక్షకులకు శిక్షణ కాలంలో గౌరవ వేతనంగా రూ.4 వేలు అందించారు. 16 ఏళ్లలోపు విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి నెల పాటు శిక్షణనిచ్చినట్లు కోచ్లు వెల్లడించారు. జిల్లాలో ముగిసిన క్రీడా శిబిరాలు వివిధ ఆటల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాఠశాల స్థాయిలో విద్యతో పాటు ఆటలపై దృష్టి హాకీ, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో తర్ఫీదు -
రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్ : మంత్రి
చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని గూడెం, అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని.. బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్లే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడి ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యమని.. రాహుల్గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారని వివరించారు. భారత్ జోడోయాత్రతో దేశ ప్రజలకు రాహుల్పై మక్కువ పెరిగిందని.. పార్లమెంట్ వేదికగా బీజేపీ నాయకులు అవమానిస్తున్నారన్నారు. అదేవిధంగా జూరాల చివరి ఆయకట్టు కోసం ఏర్పాటు చేస్తున్న లింక్ కెనాల్ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కొత్త కళ్యాణ్రావు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, చిదంబర్రెడ్డి, రంజిత్కుమర్, తేజారెడ్డి, జ్యోతిగౌడ్, మందడి కృష్ణ, గూడెం సుధాకర్ పాల్గొన్నారు. రామన్పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా లేదని.. రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. ఖిల్లాఘనపురం: రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తికేంద్రాలు, బూత్కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా బుచ్చిబాబుగౌడ్, ఉపాధ్యక్షులుగా రాజు, శాంతమ్మ, భద్రయ్య, శంకర్నాయక్, ప్రధాన కార్యదర్శులుగా దశరథం, గోపాల్రెడ్డి, కార్యదర్శులుగా కేశన్న, లక్ష్మి, తులసీకుమార్, సంధ్య, కోశాధికారిగా మల్లేష్ ఎన్నికయ్యారు. జిల్లా, మండల నాయకులు రాంరెడ్డి, గోపి ముదిరాజ్, రామచంద్రి, అక్బర్, రాజు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా 4వ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జి.శారద, ప్రధానకార్యదర్శిగా బి.కవిత, కోశాధికారిగా జి.రాధ, ఉపాధ్యక్షులుగా బి.నారా యణమ్మ, జి.జ్యోతి, వెంకటేశ్వరమ్మ, విజయ, రమాదేవి, సహాయ కార్యదర్శులుగా నాగేంద్ర మ్మ, సుమతి, అరుణ, రామచంద్రమ్మ, రాజే శ్వరి, భాగ్యలక్ష్మి, ప్రశాంతి, రాధతో పాటు 25 మంది సభ్యులుగా ఎనుకున్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భూ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
వనపర్తి రూరల్: రైతుల నుంచి స్వీకరించిన భూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మండలం వై శాఖాపూర్లో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులపై గ్రామంలో ఒక రోజు ముందుగానే చాటింపు వేయించాలని ఆదేశించా రు. నిర్ణీత నమూనాలోనే దరఖాస్తు చేసుకోవాలని, ఫారాలు నింపేందుకు రెవెన్యూ సిబ్భందిని నియమించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వాల్సిన వాటికి వెంటనే జారీచేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కంచిరావుపల్లిలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని మహేశ్వర ట్రేడర్స్ దుకాణాన్ని తనిఖీచేసి లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, విత్తనాలను పరిశీలించారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, డీటీ నందకిషోర్, ఆర్ఐ రాఘవేందరావు, ఏఓ షేక్ మున్నా పాల్గొన్నారు. -
తీవ్రంగా నష్టపోతున్నారు..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను తెప్పించి ఇక్కడి మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో చేపపిల్లలు నాణ్యతగా లేకపోవడం, సరైన మోతాదులో పంపిణీ చేయకపోవడం, చేపపిల్లల నిర్ణీత సైజు లేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులకు పంపిణీ చేయాలి. అక్రమాలను నివారించాలి. – లక్ష్మయ్య, అధ్యక్షుడు అమ్మాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం -
‘నీలి’నీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’మేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాల వారీగా ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారించని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నష్టపోతున్న మత్స్యకారులు మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు. పిల్లలమర్రిలో నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ‘మీన’మేషాలు -
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లిస్తే చర్యలు
వనపర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీల నిధులు, వాటాలు కచ్చితంగా వారికే అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులతో జిల్లాస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్లోకు చేరుకోగానే ఎస్పీ, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సమీక్షలో పాల్గొని ప్రభుత్వపథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం విధిగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఏడాది ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పౌర హక్కుల దినోత్సవం మొక్కుబడిగా కాకుండా గ్రామ చావడి, గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించాలని.. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, మీడియాకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలు ఎలా పొందవచ్చనే విషయాలపై అవగాహన కల్పించాలని, సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం తప్పక నిర్వహించాలని, లేనిపక్షంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభ్యున్నతికి మాత్రమే కేటాయించాలని, నిధులను దారి మళ్లిస్తే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో క్రిమినల్ కేసుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువని.. జిల్లా పోలీసుశాఖ మంచి పనితీరుతోనే సాధ్యమైందని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలని.. ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవం కోసం భావోద్వేగంతో ఉంటారని, పోలీసులు వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరించి భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ను కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల కేటాయింపులు పారదర్శకంగా చేపట్టాలని.. జిల్లాకేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
వన మహోత్సవ లక్ష్యం 21 లక్షలు
వనపర్తి: ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 21 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్లో మండల అధికారులు పాల్గొనగా వన మహోత్సవంపై దిశా నిర్దేశం చేశారు. లక్ష్య సాధనకు ప్రతి గ్రామం, మండలం, పురపాలికకు సంబంధించి నిర్ధిష్ట ప్రణాళిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ గొప్పగా జరగాలని, రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర పెద్ద మొక్కలు నాటాలని, దీంతో గ్రామానికి కళ వస్తుందన్నారు. ప్రస్తుత ఫొటోలు.. మొక్కలు నాటిన నెల తర్వాత తిరిగి ఫొటోలు తీసి సమర్పించాలని ఎంపీడీఓలు, పుర కమిషనర్లను ఆదేశించారు. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల ప్రాంగణాల్లో మొక్కలతో కంచె వేయాలన్నారు. సాగునీటి కాల్వల వెంట ఖాళీ స్థలాల్లో ఈత, తాటి మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. అన్ని శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామని.. అందుకు అనుగుణంగా స్థలాలు గుర్తించి మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి టీజీఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాలన్నారు. కోతులు అడవిని వదిలి పల్లెలు, పట్టణాలకు వస్తున్నాయని.. వాటికి ఆహారం దొరికేలా అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు విరివిగా పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని.. అప్పుడే నాటిన మొక్కలు బతికి ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి వన మహోత్సవం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ప్రతి ఇంటికి 5 పండ్ల మొక్కలు పంపిణీ చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, జిల్లా ఇన్చార్జ్ అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఇంటింటికి 5 పండ్ల మొక్కలు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
మెట్ట సాగు తగ్గుముఖం
జిల్లాలో 50 శాతానికిపైగా తగ్గిన పంటల విస్తీర్ణం ●అవగాహన కల్పిస్తున్నాం.. ప్రత్యేక రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులు, పంట కాల్వలతో సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. దీంతో చాలామంది రైతులు వర్షాధార మెట్టపంటల సాగును తగ్గించి వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మెట్టపంటల సాగు ప్రాముఖ్యత, మార్కెటింగ్, పెరిగిన ధరలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
టీపీసీసీలో మనోళ్లు
ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక? టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు. కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఎం.రాజీవ్రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్ ముదిరాజ్ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు. కార్యకర్తల్లో హుషారు టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరోనలుగురు -
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు..
ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు ● -
తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యరి్థగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జని్మంచారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పారీ్టలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కలి్పంచాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.రాజకీయ నేపథ్యం.. వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2022 సెపె్టంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. -
నూనెగింజల సాగుతో అధిక లాభాలు
కొత్తకోట రూరల్: నూనెగింజల సాగుతో రైతులు అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగులో తీసుకోవాల్సిన చర్యలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కృషి విజ్ఞాన కేంద్రం, భారతీయ నూనెగింజల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మే 29 నుంచి జూన్ 12 వరకు ‘వికసిత కృషి సంకల్ప అభియన్’ కార్యక్రమం మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తోంది. ఆదివారం మండలంలోని మిరాసిపల్లిలో జరిగిన కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి వరి సాగులో సమస్యలు, సేంద్రియ వ్యవసాయం, పచ్చిరోట్ట ఆవశ్యకత, జీవన ఎరువుల వాడకం, పప్పు, చిరుధాన్యాల సాగు.. యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. భారతీయ నూనెగింజల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. రమ్య వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుతు, నువ్వుల రకాలు, సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, భూసార సంరక్షణ, నేల ఆరోగ్యం గురించి వివరించడంతో పాటు మార్కెటింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
మదనాపురం: అమరచింతలో ఈ నెల 11న నిర్వహించే టీయూసీఐ జిల్లా మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, కోశాధికారి రాజు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. టీయూసీఐ కార్మిక సంఘం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అమరచింత ఉద్యమాలకు కేంద్రంగా మారిందని.. అందుకే మహాసభలు అక్కడే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం
వనపర్తిటౌన్: హక్కుల సాధన కోసం భవన నిర్మాణ, ఇతర 54 రంగాల కార్మికులు సంఘటితంగా పోరాడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోటం రాజు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా నాలుగో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల పింఛన్, ఇళ్లు లేని వారికి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు జూలై 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో అందరు కార్మికులు పనులు నిలిపివేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు గంధం మదన్, జిల్లా కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, ఉపాధ్యక్షులు డి.కురుమయ్య, కె.వెంకటయ్య, చెన్నారం శ్రీను, బాలస్వామి, రాబర్ట్, బాలరాజు, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి : బీజేపీ వనపర్తిటౌన్: పురపాలికలో పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కృషి చేయాలని.. త్వరలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు శ్రమించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ కోరారు. ఆదివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉందేకోటి అంజి, జి.ఉపేందర్ యాదవ్, కాటమోని రాణిగౌడ్, అశ్విని గోవింద్, ప్రధాన కార్యదర్శులుగా దంతోజు నవీన్చారి, అరవింద్, కార్యదర్శులుగా కడమంచి శివ, అశ్విని, పవన్, మందడి మనీషా, రేణుక, పట్టణ కోశాధికారిగా కూన శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్గా వంశీ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా వసంత్కుమార్రెడ్డి, కిషోర్కుమార్, ఉందేకోటి వెంకటేష్, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం పుర ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ శ్రేయస్సుకు శ్రమించాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్రెడ్డి, పట్టణ ఇన్చార్జ్ బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర సహ కోశాధికారి జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి, వెంకటేశ్వర్రెడ్డి, సీతారాములు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికి కృషి వనపర్తి: గ్రామస్థాయి నుంచి వచ్చిన తనకు జర్నలిస్ట్ల సమస్యలు తెలుసని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేయడంతో పాటు జీవిత బీమా చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని.. స్నేహపూర్వకంగా ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా స్వేచ్ఛా వాతావరణంలో పాలన అందిస్తానని వివరించారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులు నిజాలు, సమస్యలను నిర్భయంగా రాయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలిన జిల్లా, మండలాల ప్రెస్క్లబ్ స్థలం, భవన నిర్మాణం, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాల కేటాయింపు, రాజీవ్ యువశక్తి పథకం వర్తింపునకు తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రివర్గంలో చోటు హర్షణీయం
కొత్తకోట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని వడ్డెవాటలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భీమన్ననాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని.. అనేక పోరాటాల ఫలితంగానే కరుడుగట్టిన కాంగ్రెస్పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటిసారి ఇద్దరు, రెండోసారి ఒక బీసీకి మంత్రివర్గంలో అవకాశమిచ్చారన్నారు. బీసీల పోరాటం ఎక్కడా వృథా కాలేదని.. ఇటీవల ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్పార్టీ చరిత్రలో లేనివిధంగా అగ్రకుల సామాజిక వర్గానికి లేకుండా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారని తెలిపారు. ఎవరి వాటా వారికి దక్కాలని రాహుల్గాంధీ చెప్పారని.. అందుకు అనుగుణంగా అటు ఇటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీగా, మంత్రులుగా అవకాశం దక్కడం హర్షిస్తున్నామన్నారు. ఇదే పద్ధతిన నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, సమాచార కమిషన్లో బీసీల వాటా బీసీలకు కేటాయించాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించి రెండు నెలలవుతుందని.. రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పారని.. బీజేపీని నమ్మాలంటే బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామన్నగౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దోమ వెంకట్ ముదిరాజ్, బీసీ నేతలు జనార్దన్గౌడ్, బస్వరాజ్, రంగస్వామి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్గౌడ్, తిరుపతయ్య, రాందాస్, ఉద్యోగ సంఘం నేతలు వెంకటేష్, మహేష్ మేరు, దోమ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు ఏం తేల్చారంటే..
పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఉన్న రోడ్ నుంచి రామాలయం వరకు పుర స్థలంలో ఆక్రమణదారులు తిష్ఠ వేసినట్లు గుర్తించారు. ఒక్కొక్కరు 3 ఫీట్ల నుంచి 40 అడుగుల వరకు స్థలాన్ని ఆక్రమించారని గుర్తించి వాటి తొలగింపునకు చర్యలు చేపట్టడంతో బస్టాండ్ మార్గంలో ఉండే బడా వ్యాపారులు కంగుతున్నారు. అత్యధికంగా పుర స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేసినట్లు తేలడంతో పొక్లెయిన్లతో మెట్లు, ర్యాంప్లను తొలగించారు. అంతలో ప్రభుత్వం మారడంతో ఆ అంఽశం మరుగునపడింది. పుర అధికారులు బస్టాండ్ మార్గంలో నిర్మాణాలపై మాస్టర్ ప్లాన్, అప్పట్లో వేసిన వెంచర్లు బయటకు తీయగా రాజారామేశ్వర్రావు పాలిటెక్నిక్ కళాశాల నుంచి బస్టాండ్కు వెళ్లే రోడ్డుకు 20 ఫీట్ల గ్రీన్ మార్కెట్కు స్థలం వదలగా.. ఆ స్థలంలోనూ నిర్మాణాలు చేసినట్లు తేలింది. దీనికితోడు కొన్నిచోట్ల డాక్యుమెంట్లలో ఉన్న స్థలానికి అదనంగా ఆక్రమించి నిర్మాణాలు గుర్తించారు. -
రహదారి విస్తరణలో కదలిక
జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన పనులు●వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. గత ప్రభుత్వ హయంలో పలు ప్రాంతాల్లో రహదారి విస్తరణ చేపట్టినా డివైడర్ల నిర్మాణాలు మిగిలిపోగా, పానగల్, కర్నూలు రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. ప్రస్తుతం పానగల్ రోడ్ విస్తరణకు మార్గం సుగమం కాగా.. బడా వ్యాపారులుండే కర్నూలు రోడ్పై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రహదారుల విస్తరణ చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా.. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పానగల్ రోడ్ను 100 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించినా.. ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని 70 అడుగులకు కుదించి అందుకు అనుగుణంగా మార్కింగ్ ఇస్తున్నారు. స్వల్పం నుంచి పూర్తిస్థాయి వరకు ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే 63 మంది వివరాలు సేకరించారు. బాధితులు ఏం ఆశిస్తున్నారనే అంశాలతో అధికారులు నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు అందించడంతో దాదాపు విస్తరణ ఖాయమైనట్లే కనిపిస్తోంది. కర్నూలు రోడ్పై ఉత్కంఠ.. కర్నూలు రోడ్ను 100 అడుగుల మేర విస్తరించాలని అధికారులు నిర్ణయించగా.. 70 నుంచి 80 అడుగుల వరకే విస్తరించాలని ఈ ప్రాంత వ్యాపారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ రహదారిలో 130 వరకు భవన సముదాయాలకు నష్టం వాటిల్లనుంది. ఈ దారిలో పాలిటెక్నిక్ కళాశాల రోడ్ నుంచి రామాలయం వరకు పూర్తిస్థాయిలో విస్తరణకు మార్కింగ్ ఇచ్చినా.. అధికారులు, వ్యాపారులు ప్రస్తుత మార్కింగే ఫైనల్ అని చెప్పే స్థితిలో లేకపోవడంతో విస్తరణ అంశం సందిగ్ధంలో పడిందనే భావన వ్యక్తమవుతోంది. దీనికితోడు రహదారికి ఓ వైపు ఉన్న దుకాణాలు అక్రమ కట్టడాలని రెండేళ్ల కిందట పుర అధికారులు తేల్చారు. ఆక్రమణలపై కొరడా ఝుళిపించకపోతే సక్రమంగా ఉన్న దుకాణదారులు నష్టపోతారనే వాదన వినిపిస్తుండగా.. ఆక్రమణలు తొలగించాలంటే వనపర్తిలో ఏవీ ఉండవని మరోపక్క ఉన్న వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు రోడ్డు విస్తరణ బాధితులకు డబుల్, ఖాళీ స్ధలాలు, టీడీఆర్ను అధికారులు తెరపైకి తీసుకొచ్చినప్పటికీ వ్యాపారులెవరూ ఆ ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. అధికారులకు కూడా ఆ వివరాలు రాబట్టేందుకు ప్రయాస తప్పడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు.. జిల్లాకేంద్రంలో రహదారుల విస్తరణ పనులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపడతాం. పానగల్ రహదారిలో ఇప్పటికే బాధితుల నుంచి అభిప్రాయాలు సేకరించాం. బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని టీడీఆర్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం. పుర ప్రజల విస్తరణ కల త్వరలోనే తీరనుంది. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి పానగల్ రోడ్లో మార్గం సుగమం కర్నూల్ రోడ్లో వీడని సందిగ్ధత -
వనపర్తిలో వీరగల్లు స్మారక శిలలు
వనపర్తి టౌన్: చైతన్య, వివేకాపర్తిగా పేరున్న వనపర్తిలో క్రీస్తు పూర్వం నాటి వీరగల్లు యుద్ధ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో వీరుల మరణాలను స్మరించుకునే వీరగల్లు శిలలు వనపర్తి జిల్లా కేంద్రంలో వెలుగుచూశాయి. పట్టణంలోని పోచమ్మగుడి వద్ద శతాబ్దాల నాటి వీరగల్లు స్మారక శిలలను చరిత్ర పరిశోధకులు, చరిత్రకారులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్ గుర్తించారు. ఈ వీర శిలలలో తొమ్మిది మంది వీరుల్లో ఒక అశ్వారూఢుడైన వీరుడు బల్లెంతో, మరొక వీరుడు బల్లెం, డాలుతో కనిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల కిందట కర్ణాటక, తెలంగాణలోని సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్లో వీరగల్లుల ఆనవాళ్లు ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీరగల్లు శిలలు కొన్నేళ్ల తరబడి వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో ఉన్నప్పటికీ వాటిని ఎవరూ గుర్తించలేపోయారు. ఈ క్రమంలోనే వనపర్తిలోని చిట్యాల రోడ్డులో వీరులగడ్డ అనే పేరుతో ఒక ప్రాంతం ఉండటంతో ఆ పేరు ఎలా వచ్చిందని పరిశోధకులు పరిశీలిస్తుండగా, వనపర్తి పోచమ్మ ఆలయంలో ఉన్న శిలలు వీరగల్లు విగ్రహాలని తేలింది. 150– 300 ఏళ్ల కిందట వీరుల స్మారక శిలలను వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఈ వీరగల్లు శిలలను స్థానిక ప్రజలు దేవతామూర్తులుగా భావించారు. ఈ వీరశిలలలో సతి శిలలు నాలుగు, కత్తి ఆయుధంగా ధరించిన ఎక్కటీలు ఇద్దరు ఉన్నారు. వనపర్తి చరిత్ర శతాబ్దాల కిందటిదే.. వీరుల స్మారక శిలలు ఒకేచోట లభించడంతో వందలు, వేల సంవత్సరాల కిందటే వనపర్తి ఒకనాటి యుద్ధరంగమై ఉంటుందని చరిత్రకారులు, పరిశోధకులు భావిస్తున్నారు. వీరగల్లు శిలలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయని, వీరగల్లులలో దాదాపు 40 రకాలున్నాయని, శాసనంతో కూడిన వీరగల్లులు వాటిలో ప్రత్యేకమని కొత్త తెలంగాణ చరిత్ర బృంద కన్వినర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. వనపర్తికి అతి సమీపంలో ఉండే నాచహళ్లి గ్రామంలో గోపాల్ వ్యవసాయ పొలంలో కూడా శాసనంతో కూడిన గుడిలాంటి ప్రాంతంలో ఒక సతి శిల, ఒక వీరశిల ఉన్నట్లు గుర్తించామన్నారు. -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతులు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, వెంకటేష్, నర్సింహ, రజినిబాబు, నరేష్ కుమార్, బొల్లు శ్రీనివాసులు, యుగంధర్గౌడ్, మధు గౌడ్, శంకర్ యాదవ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రూపురేఖలు మారుస్తా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భక్తిభావం పెంపొందించుకోవాలి పాన్గల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్లో సీతారామాంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. పండుగలను శాంతియుత వాతావరణంలో ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. పిల్లలను గొప్ప చదువులు చదివించాలని.. విద్యబుద్ధులతో పాటు సోదర భావం, ప్రేమానురాగాలు, ధైర్యం, సాహసం, పట్టుదలవంటి లక్షణాలను నేర్పించాలన్నారు. మహాత్ముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం ప్రయత్నించాలని సూచించారు. కుటుంబాల్లో చిన్న, చిన్న విషయాలకు సోదరుల మధ్య ఘర్షణలు, తల్లిదండ్రులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో డైరెక్టర్ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు రవికుమా ర్, వెంకటేష్నాయుడు, పుల్లారావు, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధ్దలతో బక్రీద్
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు బక్రీద్ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రం శివారు గోపాల్పేట రహదారిలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా తొలిసారి శ్రీనివాసపురంలో ముస్లింలకు కేటాయించిన స్థలంలో కూడా పలువురు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ముస్లింలు పట్టణం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈద్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి శ్రీనివాసపురంలో, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతి, సహనానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని ఎమ్మెల్యే మేఘారెడ్డి వివరించారు. విశ్వాసం, నమ్మకం, పరోపకారానికి బక్రీద్ ప్రతీక అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ముస్లీంలకు వివిధ పార్టీల ప్రముఖులు, అధికారులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, చీర్ల విజయచందర్, వెంకటయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు జిల్లాకేంద్రంలో తొలిసారిగా శ్రీనివాసపురం ప్రాంతంలో కేటాయించిన స్థలంలో నమాజ్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
మరుగునపడిన మలశుద్ధి
జిల్లాకేంద్రంలో కర్మాగారం ఏర్పాటుకు పడని అడుగులు ఆదాయ సమీకరణకు.. గ్రామాలు, పట్టణాల్లో మానవ వ్యర్థాలను యథేచ్ఛగా కాల్వల్లోకి వదులుతున్నారు. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని.. దీనిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పురపాలికల్లో కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మల శుద్ధి కర్మాగారాల ద్వారా ఎరువు తయారు చేసే విధానం అమలులోకి తేవాలని భావించింది. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే ఎరువును మొక్కలు, రైతులు పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎరువు విక్రయంతో పురపాలికకు కూడా ఆదాయం సమకూరనుంది. ఈ విధానం ఇప్పటికే వరంగల్, రాజన్న సిరిసిల్లలో అమలువుతున్నందున మిగతా పురపాలికలకు విస్తరించనున్నారు. కానీ ఆ దిశగా పురపాలికలో ఇప్పటి వరకు అడుగులు పడకపోవడం శోచనీయం. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే త్వరలోనే ప్రారంభం కానుంది. వనపర్తి టౌన్: జిల్లాకేంద్రానికి ఐదేళ్ల కిందట మలశుద్ధి కర్మాగారం మంజూరైంది. అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మొదట పురపాలికలోని నాగవరం శివారులో ఎకరా స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలం కేంద్రం నిర్మాణానికి అనువుగా లేదని అధికారులు నిర్ణయించడంతో రెండేళ్ల కిందట పాన్గల్ రోడ్లో కేటాయించారు. అప్పటి నుంచి పనులు చేపట్టేందుకు ఏజెన్సీ ముందుకు రాకపోవడం.. తర్వాత బదిలీపై వచ్చిన అధికారులు అవగాహన లేమితో మిన్నకుండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2022, ిఫిబ్రవరి 18న పుర బడ్జెట్ సమావేశంలో మలశుద్ధి కర్మాగారం నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ పుర అధికారులను ప్రశ్నించగా ఏజెన్సీ ముందుకు రావడం లేదని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సీడీఎంఏ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయా లని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్లోని పాత పురపాలికల్లో మానవ వ్యర్థాల రీసైక్లింగ్ చేసేందుకు ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. చర్యలు చేపడతాం.. జిల్లాకేంద్రంలో మలశుద్ధి కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలను ఇంజినీరింగ్ విభాగం నుంచి తీసుకుంటాం. గతంలో ప్రక్రియ ఎక్కడి వరకు జరిగింది.. ఎందుకు నిలిచిపోయింది.. స్థలం కేటాయింపు, నిర్మాణం, ప్రభుత్వ ఆదేశాలను అధ్యయనం చేస్తాం. ఉన్నతాధికారులకు విన్నవించి వారి ఆదేశానుసారం ముందుకు సాగుతాం. – ఎన్. వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి ఐదేళ్ల కిందటే ఎకరా స్థలం కేటాయింపు.. పట్టించుకోని అధికారులు నిర్మాణానికి నోచుకోని వైనం -
ప్రజాపాలనలో భూ సమస్యలు పరిష్కారం
మంత్రి ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నంబావి: బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఎంతోమంది రైతులను ఇబ్బందులకు గురి చేసిందని.. ప్రజా ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మంత్రి స్వగ్రామం మండలంలోని పెద్దదగడలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్నేళ్లుగా భూ సమస్యలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడటమేగాక ఎన్నో మానవ ఘోరాలకు భూ వివాదమే కారణం అవుతుందని తెలిపారు. దీర్ఘకాలిక భూ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందని చెప్పారు. గత పాలకులు ధరణి ద్వారా అనేక అక్రమాలకు తెర తీసారని.. వాటికి కొత్త చట్టం ద్వారా చరమగీతం పాడుతామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయట వేయడమేగాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాయని వివరించారు. గ్రామంలో 100 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టునున్నట్లు తెలిపారు. అదేవిధంగా సర్వేనంబర్ 30లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాషా, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, ఎంపీడీఓ రమణారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కళ్యాణ్రావు, బీచుపల్లి యా దవ్, కృష్ణప్రసాద్ యాదవ్, విద్యాసాగర్రావు, తేజారెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, మాజీ ఎంపీటీ సీ సభ్యురాలు పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27న ప్రారంభం: ఆర్ఎం -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు, క్షయ, మధుమేహం గుర్తించడం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వాంతులు, విరేచనాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు చేపట్టడంతో పాటు రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్యం, వాడుతున్న మందులపై నివేదిక తయారుచేసి ఆన్లైన్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తూ వైద్యచికిత్సలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే ప్రత్యేక యాప్ జూన్ 20 వరకు అందుబాటులోకి వస్తుందని, అవసరమైన అన్ని వివరాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలపై సమీక్షిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఏఎన్సీ వైద్య పరీక్షలు సమయానుసారం నిర్వహిస్తూ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో ‘పాలమూరు’ పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తాం నిధులు ఆవిరైనా.. నీళ్లు రాలేదని... కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మా ర్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కతలప్ప పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులు తెలంగాణ రైజింగ్ను ఆపలేరు -
టెంట్ సప్లయ్ చేసినందుకు..
మాది చిన్నధన్వాడ గ్రామం. అయితే గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి టెంట్లు, డ్రమ్ములు, సప్లయర్ వస్తువులు అద్దెకు అందిస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న క్రమంలో మా ఆయన పరుశరాముడు టెంట్ ఇతర వస్తువులు సప్లయ్ చేశాడు. దానికి బుధవారం జరిగిన ఘటనలో ఆయన పేరు చేర్చి రిమాండ్కు తరలించారు. నాయకులు, పెద్ద వాళ్లు అయితే ఏదోలా బయట పడతారు. కానీ పని చేసుకుని బతికే మమ్మల్ని ఎవరు బయటకు తీసుకువస్తారు. మాకు ముగ్గురు పిల్లలున్నారు. పిల్లలకు బడులు ప్రారంభమవుతాయి. కానీ ఇంట్లో నా భర్త లేని కారణంగా మాకు ఏం అర్ధం కావడం లేదు. – శ్రావణి, రిమాండ్కు వెళ్లిన పరుశరాముడి భార్య ● -
ఆ.. 40లో ఉన్నదెవరు?
రాజోళి: రాజోళి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ప్యాక్టరీ వద్ద జరిగిన రగడ రోజురోజుకో మలుపు తిరుగుతుంది. బుధవారం ఫ్యాక్టరీ, వాహనాలపై దాడులు, కంటైనర్ తగలబెట్టిన ఘటనల్లో పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మందిని ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా మిగిలిన వారిపై కేసులు, రిమాండ్కు తరలిస్తారని తెలియడంతో పెద్దధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 మందిని రిమాండ్ పంపించగా అందులో ఒకరు చిన్నధన్వాడకు చెందిన వ్యక్తి ఉన్నాడు. మిగతా వారు పెద్దధన్వాడ గ్రామస్తులే. అయితే మిగిలిన 29 మందిలో ఏ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారు? వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారనే ఆందోళన నెలకొంది. అసలు ఆ కేసుల్లో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారా, రైతులా, కూలీలా, మహిళలు ఉన్నారా అనే అనుమానాలు ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. జైలుకు వెళితే రాజకీయ నాయకులు ఏదోలా బయటకు వస్తారు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అసలు 40 మందితోనే కేసులు ఆగుతాయా లేక వీడియోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. చిన్నధన్వాడలో ఒక్కరిపైనే కేసు నమోదు కాగా.. మాన్దొడ్డి, నసనూరు, తుమ్మిళ్ల తదితర గ్రామాల్లో ఎవరిౖపైనెనా కేసులు నమోదు చేశారు అనే అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఒక జైలర్ శాఖకు సంబందించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో పలువురిపై పోలీసుల ప్రత్యేక నజర్ కొందరి స్వార్థంతో అమాయక రైతులు బలయ్యారని వాదన ఇప్పటికే 12 మంది రిమాండ్.. మరికొందరిపై కేసులు ? ఆందోళనలో జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు -
నిపుణుల అభిప్రాయం
పెబ్బేరు గోదాంలో గల రూ.7కోట్ల విలువ గల గన్నీ బ్యాకులు దగ్ధమైన ఘటనపై జిల్లాకు సంబంధించిన డీసీఆర్బీ డీఎస్పీ, సీసీఎస్, ఎస్బీ వంటి విభాగాలతో విచారణ చేయడంతోపాటు హైదరాబాద్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీంను పిలిపించి క్షుణ్ణంగా ఆధారాలు సేకరించాం. ఈ కేసులో దాదాపు వంద మందికిపైగా విచారించాం. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. గన్నీ బ్యాగులు దగ్ధమైనప్పు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని, గోదాం పైకప్పు మీద గల రేకులు (ట్రాన్పరెంట్ షీట్స్) దగ్గరగా ఉండే బస్తాలు వేడికి మంటలు వచ్చి తగులబడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. – రాంబాబు, సీఐ, పెబ్బేరు ● -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తి: మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ వద్ద శ్రమదానం చేసి మొక్కలు నాటారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. అధునాతన విజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మనిషి తన మనుగడ కోసం విచ్చలవిడిగా యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. అలాగే కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ఇందుకోసం మొక్కలు నాటడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి పరిసర ప్రాంతాల్లో కనీసం మూడు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రభుత్వ సేవకులపై ఎల్లప్పుడూ ఆధారపడకుండా తమ వీధులను తాము శుభ్రపరుచుకునేలా నెలలో ఒకరోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖాధికారి నిఖిల్రెడ్డి మాట్లాడుతూ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రధానంగా నీటి వనరుల కోసం భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు. అందుకు చెట్లను పెంచడమే అసలైన మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు, స్నేక్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలి
వనపర్తి: జిల్లాకేంద్రం నుంచి వెళ్లే పాన్గల్, పెబ్బేరు రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. పాన్గల్ రోడ్డుకు సంబంధించి మొత్తం ఎంత మంది స్థలాలు కోల్పోతున్నారు.. వారికి ఇప్పటి వరకు అందజేసిన పరిహారంపై వివరాలు తెలుసుకున్నారు. పెబ్బేరు రోడ్డుపై మాట్లాడుతూ 80 ఫీట్ల రోడ్డుకు కొలతలు తీసుకోవాలని, స్థలం కోల్పోతున్న వారికి టీడీఆర్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండో దఫా నోటీసులు జారీ చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ఇప్పటికే నిధులు మంజూరై పనులు పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాభవన్, మినీ ట్యాంక్ బండ్, అమ్మ చెరువు, నల్లచెరువు అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలన్నారు. అలాగే మురుగు కాల్వలు, చిట్యాల, అప్పాయిపల్లి రోడ్ల పురోగతిపై ఆరాతీశారు. ఆయా సమావేశాల్లో సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనివాస్, ఏఈ పావని తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండలం రంగాపురంలో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. అనంతరం అదే గ్రామంలోని చౌకధర దుకాణానికి ఆకస్మికంగా వెళ్లి రికార్డులు పరిశీలించారు. పాతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి కొనుగోలు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రాజు, మురళిగౌడ్, ఆర్ఐ రాధాకృష్ణ పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు, బీఆర్ఎస్ నాయకుడు, రాజోళి పొలం వద్దకువెళ్లి అరెస్టు చేశారు.. పొలంలో బోర్ మోటా ర్ ఆన్ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి. – నర్సమ్మ● -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వనపర్తి టౌన్: రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులకు తెలియజేస్తూ వారి కేసులను పరిష్కరించాలని, కక్షిదారులు కోర్టు చుట్టూ తిరగకుండా త్వరగా కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఈ నెల 14న నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు క్రిమినల్, న్యాయవాదులు సివిల్ కేసులను అధిక మొత్తంలో పరిష్కరించాలన్నారు. కేసు పరిష్కారమయ్యే వరకు కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసును పరిష్కరించుకుంటే ఎలాంటి తగాదాలకు తావుండదని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజనీ, సీనియర్ సివిల్ జడ్జి కల్పన, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కవిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీలత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ● ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు. -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
వనపర్తి విద్యావిభాగం: మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో గురువారం కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు. దీనికి పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా గురవుతున్నారన్నారు. సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణాలతోపాటు సామాజిక కారణాలు దోహదం చేస్తాయని, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వారిని ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం, సినిమా అవకాశం అంటూ మోసం చేస్తారన్నారు. అనంతరం ప్రజ్వల సీనియర్ కోఆర్డినేటర్ మల్లేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ శుభలక్ష్మి, ఏఎంఓ మహానంది, సీఎంఓ యుగంధర్, ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలీరాజ్ పాల్గొన్నారు. -
అలజడి.. ఆందోళన
● ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త ఘటనలతో గ్రామాల్లో అలజడి ● అరెస్టులతో 12 గ్రామాల్లో ఆందోళన ● 41 మందిపై కేసు.. 12 మంది రిమాండ్ ● ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజల్లో కునుకులేకుండా పోయింది. తాజాగా బుధవారం ఫ్యాక్టరీ వద్ద జరిగిన దాడులు, నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. రైతులు చేసిన దాడికి సంబంధించి కంపెనీకి చెందిన సీఏఓ మంజునాథ్ రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కావడంతో పాటు కంపెనీకి చెందిన వాహనాలు, సామగ్రి ధ్వంసమైనట్లు అందులో పేర్కొన్నారు. దాడులకు దిగిన 41 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేయగా.. ఇందులో జనం సాక్షి పత్రిక ఎడిటర్ రహమాన్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సమయంలో వారు ఘటన స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై రాజోళి ఎస్సై జగదీష్ని సంప్రదించగా.. దాడులకు ప్రేరేపించింది రహమాన్, నాగరాజు అని, మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా.. కేసులు నమోదైన వారిలో 12 మందిని పోలీసులు గద్వాల జిల్లా కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్కు తరలించిన వారిలో పెద్ద ధన్వాడకు చెందిన రైతులు నర్సింహులు, కె.నర్సింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటన్, శివ గౌడ్, సూర్యప్రకాష్, భీమన్న, మనోహర్, యేసన్న, నాగేంద్రంతోపాటు చిన్న ధన్వాడకు చెందిన పరుషరాముడు ఉన్నారు. జడ్జి తీర్పు అనంతరం పోలీసులు వీరిని ప్రత్యేక వాహనంలో మహబూబ్నగర్లోని జిల్లా జైలుకు తరలించారు. బుధవారం ఘటన అనంతరం రాత్రి పోలీసులు అరెస్టులు మొదలు పెట్టడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంతో పాటు ఇటు చిన్నధన్వాడ గ్రామస్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు తీసిన వీడియోల ఆధారంగా అరెస్టులు ఉంటాయని తెలియడంతో, మామూలుగా ఘటనా స్థలి దగ్గరకు వెళ్లిన వారు కూడా ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు అదే ప్రాంతంలో ఫ్యాక్టరీ పక్కనే తమ పొలాలు ఉన్న వారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. వారు కూడా తమపై ఏదైనా చర్యలుంటాయనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ సాటి రైతులపై కేసులు నమోదయ్యాయని తెలిసి భయబ్రాంతులకు గురవుతున్న రైతులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మానుష్యంగా మారిన పెద్ద ధన్వాడ గ్రామం బిక్కుబిక్కుమంటూ... ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై దాడి చేయడం తగదని.. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమంగా కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాఽథమిక హక్కు అని.. ఓ మైనర్పై కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. ఇథనాల కంపెనీ ఏర్పాటుతో పర్యావరణ ప్రభావం అంచనాను తాజాగా చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని, రాజోళి ఎస్సై జగదీశ్వర్తో పాటు గాయత్రి ఇండస్ట్రీస్ అండ్ రెన్యువేబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా పోలీస్ హింసలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన కమిషన్ 13030/ఐఎన్/2025 నంబర్తో కేసు నమోదు చేసింది. కాగా.. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం వల్ల తాము గాయపడ్డామని పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ, కుర్వ క్రిష్ణ, కుర్వ లింగన్న గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు.