breaking news
Wanaparthy
-
నందిమళ్లలో టెన్షన్.. టెన్షన్
మహబూబ్నగర్ క్రైం/ అమరచింత: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి జైలు నుంచి పరారై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్వగ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింత మండలంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించి.. గత నెల 2న పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అమరచింత పోలీస్స్టేషన్లో జూన్ 7న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జూన్ 10న పోలీసులు ఇద్దరిని ఆత్మకూర్ స్టేషన్కు తీసుకువచ్చారు. అమ్మాయి మైనర్ (మేజర్ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది) కావడంతో కిశోర్కుమార్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సదరు బాలికను వనపర్తి సఖి సెంటర్లో ఉంచారు. దాదాపు 25 రోజులపాటు జైలు జీవితం గడిపిన కిశోర్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటీ ఖైదీలతో చెస్ ఆడి.. జైలు నుంచి పరారైన కిశోర్కుమార్రెడ్డి అర్ధరాత్రి వరకు జైలులో తోటీ ఖైదీలతో చెస్ ఆడినట్లు తెలుస్తోంది. జైలు నుంచి తప్పించుకోవాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడా..? లేక అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకున్నాడా.. అనేది స్పష్టత లేదు. జనరల్ బ్యారక్లో అందరి మధ్య ఉన్న అతను ఒంటరిగా వెనక భాగం వైపు వెళ్లినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. జైలులో సాధారణంగా అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడంటే జైలులో భద్రతా లోపంపై విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘంగా విచారణ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైలుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఖైదీ పరారైన ఘటనపై సుదీర్ఘంగా విచారణ సాగించారు. మహబూబ్నగర్ జిల్లా జైలు జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకొని రావడంతో కలకలం తాను ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవ.. ఆత్మహత్యాయత్నం జిల్లా జైలులో బయటపడిన భద్రత డొల్లతనం.. జైళ్ల శాఖ డీఐజీ విచారణ స్వగ్రామంలో కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న కిశోర్కుమార్రెడ్డి నేరుగా స్వగ్రామానికి వచ్చాడన్న సమాచారంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిశోర్ తమ ప్రేమ పెళ్లిని కాదని విడదీసిన పంచాయతీ పెద్దలను దూషిస్తూ.. తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ నానో యూరియా తాగడంతో సర్వత్రా కలకలం రేగింది. తాను పేదవాడినని, ఖాళీగా తిరుగుతున్నాననే సాకుతో తమను విడదీశారని, అమ్మాయిని కలవకుండా మైనర్ అని సఖి కేంద్రంకు పంపారనే కారణాలతో కిశోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
ఎన్నికల బరిలో 20 మంది
అమరచింత: అమరచింత చేనేత సహకార సంఘం ఎన్నికల బరిలో 20 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా మిగిలిన వారు ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. పదోతేదీన ఎన్నికలు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలు జరిగితే సంఘం ద్వారా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉండటంతో మూడు రోజులుగా ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు 20 మంది బరిలో ఉండగా.. వీరిలో 16 మంది పురుషులు, నలుగుగురు మహిళలు ఉన్నారు. -
99.87 శాతం ఫారాల పంపిణీ పూర్తి
వనపర్తి: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని.. ప్రస్తుతం 99.87 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని రెవెన్యూ అదనపు టి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో 2,75,570 మంది ఓటర్లుండగా.. ఇప్పటి వరకు 2,75,214 మంది ఓటర్లకు బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారన్నారు. ప్రస్తుతం పూరించిన ఫారాలను తిరిగి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 17,411 దరఖాస్తులు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 ఓటర్లు మించకుండా, 2 కిలోమీటర్ల పరిధి దాటకుండా రేషనలైజేషన్ తయారు చేసే ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, శిక్షణ కలెక్టర్ శ్రావ్యతో కలిసి హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా.. మొత్తం 44 అర్జీలు దాఖలైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 11 వినతులు వచ్చినట్లు ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. -
ఎరువుల పిచికారీతో కాపాడుకోవచ్చు..
కొన్నిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన మెట్టపంట మొక్కల వేర్లు పోషకాలను సేకరించలేవు. కావున నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించి మొక్కల ఆకులపై పిచికారీ చేస్తే పంటను కాపాడుకోవచ్చు. 13–0–45 పొటాషియం నైట్రేట్ లీటర్ నీటిలో పది గ్రాములు కలపాలి. మరో రకం 19–19–19 నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే వడదెబ్బ తిన్న మొక్క త్వరగా కోలుకుంటుంది. ఈ పద్ధతితో పంట ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి ● -
రక్షణ చర్యలు చేపట్టాలి..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోల్ మధనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. – శివకృష్ణ యాదవ్, కొల్లాపూర్ మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన కాలభైరవ విగ్రహం, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోనే టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని పురాతన విగ్రహాల రక్షణ, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. – అశోక్నంద, మల్లేశ్వరం ● -
గడువులోగా వివరాల నమోదు
వనపర్తి: ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువు జూలై 24లోగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారాల్లోని వివరాలను యాప్లో నమోదు చేయాలని ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం పుర పరిధిలోని గాంధీనగర్, హరిజన్వాడ, నాగవరంలో ఉన్న 120, 122, 123, 160, 170 పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు, పర్యవేక్షకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూరించే విధానం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓటర్లతో ఫారాలను తప్పులు లేకుండా పూరించి నిర్ణీత గడువులోగా యాప్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారాలు నింపడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని అవగాహన కల్పించారు. -
ఆశించిన స్థాయిలో లేదు..
ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ ● -
విధేయులకు మినహాయింపులున్నాయా..?
● ఒకే కేంద్రం పరిధిలో రెండు ఘటనలు వెలుగులోకి.. ● జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ ● ఐదుగురిపై సస్పెనన్ వేటు.. పోలీస్ కేసులు నమోదు ● అధికార పార్టీ విధేయులకు మినహాయింపు ఇచ్చారా? వనపర్తి: జిల్లాలో ఎప్పటిలాగే యాసంగి సీజన్లోనూ వరి ధాన్యం కొనుగోళ్లు భారీగా చేపట్టారు. సుమారు 300కుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్న సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ పరిధిలోని పాన్గల్ మండలం మాందాపూర్లో కొందరు పాత ధాన్యం విక్రయించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఒకే గ్రామంలోని ఒకే కేంద్రం (ఐకేపీ) పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇందులో ఒకటి శ్రీరంగాపురం మండలంలోని గోదాంలో ధాన్యం నిల్వ చేసే సమయంలో అక్కడి గోదాం ఇన్చార్జ్లు గుర్తించగా.. మరో ఘటనలో వికయ్రానికి లారీలో తీసుకొచ్చిన ధాన్యం పాతదిగా అధికారులు గుర్తించి పౌరసరఫరాలశాఖ అఽధికారులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టి నిర్ధారించుకున్నారు. రెండు వేర్వేరు కేసులు పాన్గల్ పోలీస్స్టేషన్లో నమోదు కావడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లో అదే గ్రామానికి చెందిన రెండు మిల్లర్ల కుటుంబాలకు చెందిన వారిపై అభియోగాలు రావడం ఆలోచించాల్సిన అంశంగా చెప్పవచ్చు. మిల్లర్లు, అధికారుల వాదనలకు పొంతన లేకపోయినా.. మొదటి ఘటనపై స్వయంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఏఈఓ, ఏపీఎంల నిర్లక్ష్య ధోరణి ఉన్నట్లు గుర్తించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని సస్పెన్షన్ వేటు వేసినట్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులు ధ్రువీకరించారు. కేంద్రంలో గుర్తించకపోవడం ఏమిటి..? పాత ధాన్యం విక్రయానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటి..? ఒకవేళ కేంద్రంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుంటే మార్గమధ్యంలో ధాన్యం మార్చారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారా..? ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ లారీకి బదులు ప్రైవేట్ లారీలో ధాన్యం తరలించడంతో పాత ధాన్యం అందులోకి వచ్చిందా అనే కోణంలో విచారణ చేశారా అనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం. పాత ధాన్యం విక్రయానికి వ్యవసాయ విస్తరణ అధికారి టోకెన్ ఎలా జారీ చేశారనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకా ఎన్నెన్ని జరిగాయోనన్న చర్చలు లేకపోలేదు. ఇందిరాక్రాంతి పథం విభాగానికి వస్తే.. గ్రామ అధికారి లేకపోవడం, ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికై నా ఇచ్చారా.. ఇస్తే ఈ విషయంపై వారి పాత్ర ఏమిటనే విషయం ఈ సందర్భంగా చర్చకు రాకపోవడం ప్రశ్నించాల్సిన అంశమే. పాత వరి ధాన్యం విక్రయాల ఉదంతంలో కొందరు అధికార పార్టీకి విధేయులైన ఉద్యోగులు ఉన్నారు. వారిపై చిన్నపాటి కారణాలు చూపించి చర్యలను తప్పించారనే విమర్శలు పాన్గల్ మండలంతో పాటు డిపార్ట్మెంట్లో వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో సూత్రధారులైన మరికొందరిని అధికార పార్టీ నేతలు కాపాడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. వీఆర్ఏల సస్పెన్షన్లోనూ అధికార పార్టీ పెద్ద నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోసం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ను ఫోన్లో సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు
● దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం ● చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం ● టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ, వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయం నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయంలో ప్రతిఏటా నెల రోజులపాటు జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోవడంతో తర్వాతి కాలంలో జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగినా.. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆదరణ లేక.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. శాసనాలు, విగ్రహాల పరిస్థితి అంతే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. కొల్లాపూర్లోని ఆర్ఐడీ కళాశాల సమీపంతోపాటు పలు ప్రాంతాల్లో సురభిరాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోవడం లేదు. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. కొన్ని చెట్ల కిందే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. సాస్కీ నిధులపైనే ఆశలు.. సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను గతేడాది రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సోమశిల, అమరగిరి, జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతోనైనా పురాతన ఆలయాలు, విగ్రహాలకు పూర్వవైభవం తీసుకొచ్చే పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కాల్వలు ఇలా.. నీరు పారేదెలా..?
ఖిల్లాఘనపురం మండలం అల్లమాయపల్లి సమీపంలో కమాలొద్ధీన్పూర్ బ్రాంచ్ కెనాల్లో ఏపుగా పెరిగిన జమ్ము మద్దిగట్ల రోడ్ సమీపంలో పైపుల వద్ద ఇసుక మేటలు ఖిల్లాఘనపురం మండలంతో పాటు ముసాపేట, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కేఎల్ఐ కాల్వలు జమ్ము, ముళ్లపొదలతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైపుల్లో ఇసుక మేటలు వేయడంతో నీరు ముందుకు పారని పరిస్థితి నెలకొంది. బిజినేపల్లి మండలంలోని మంగనూరు శివారులో కేఎల్ఐ ప్రధాన కాల్వ నుంచి ఖిల్లాఘనపురం, కమాలొద్ధీన్పూర్ బ్రాంచ్ కెనాల్స్కు నీటిని వదులుతారు. అన్ని గ్రామాల చెరువులకు నీరు పారేలా చిన్న కాల్వలు తవ్వారు. చెరువులు నిండిన తర్వాత మిగిలిన నీరు పెద్ద వాగుకు చేరుతుంది. ప్రస్తుతం రెండు ప్రధాన కాల్వల్లో ఇసుక మేటలు వేయడంతో పాటు జమ్ము, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. వీటిని తొలగిస్తే తప్పా నీరు ముందుకు పారదు. అధికారులు స్పందించి త్వరితగతిన తొలగింపునకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ బాబుచంద్ను సంప్రదించగా.. త్వరలోనే ఖిల్లాఘనపురం, కమాలోద్ధీన్పూర్ బ్రాంచ్ కాల్వలను పరిశీలించి అవసరమైన చోట ఏజెన్సీ వారితో మాట్లాడి జమ్ము, ఇసుక మేటలు తొలగిస్తామని సమాధానమిచ్చారు. – ఖిల్లాఘనపురంపర్వతాపురం, మామిడిమాడ శివారులో ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్ ఇలా..అప్పారెడ్డిపల్లి మైనర్ కాల్వకు ఏర్పాటుచేసిన పైపులో నిండిన ఇసుక -
సమయానికి.. పూర్తయ్యేనా.. సర్!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు పంపిణీ చేసిన శాతం ఇ.డి.. ఫారాలు శాతం ఫారాలు మహబూబ్నగర్ 7,32,488 7,20,825 98.41 23,009 3.14 నాగర్కర్నూల్ 7,31,632 7,20,402 98.47 1,0257 1.40 జో.గద్వాల 5,03,859 4,90,142 97.28 25,645 5.09 నారాయణపేట 4,95,574 4,69,844 94.81 29,036 5.86 వనపర్తి 2,75,570 2,74,367 99.56 8,752 3.18 ఇ.డి.. ఫారాలు : ఇప్పటి వరకు డిజిటలైజేషన్ చేసిన ఫారాలు 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
ప్రజలకు పారదర్శక, నాణ్యమైన సేవలు
వనపర్తి: ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణ, సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ డి.సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డీసీఆర్బీ, కంట్రోల్ రూమ్, సైబర్ క్రైం, నార్కోటిక్, ఏఆర్, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా విధులు, బాధ్యతలు, సమన్వయం, సమాచార మార్పిడి, సాంకేతిక వ్యవస్థల వినియోగం, పెండింగ్ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. డీజీపీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలను వివరించి ప్రతి విభాగం విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన మార్గదర్శకాలను అందించారు. ప్రతి విభాగం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేసినప్పుడే ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించగలుగుతామని చెప్పారు. సమాచార సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత పనితీరే పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘సంచార లోక్ అదాలత్’ వినియోగించుకోవాలి వనపర్తి రూరల్: సంచార లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన కోరారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకోవడంతో సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. రాజీమార్గం ఎంచుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే సంచార లోక్అదాలత్ వాహనం ద్వారా గ్రామాలకే వచ్చి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వాహనంలో ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, డ్రగ్స్, సైబర్క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ శోభ , ఏస్ఐ హృశికేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి వనపర్తి రూరల్/వనపర్తి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల, దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్, నీటి సంపును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బోధన–అభ్యసన ప్రక్రియపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతగా అందించాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బొజ్జిబాబు, ఉపాధ్యాయ బృందం డీఈఓను శాలువాతో సన్మానించింది. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ రాములు, ఉపాధ్యాయులు బాలనాగయ్య, విష్ణు, మంజుల తదితరులు ఉన్నారు. -
గడువులోగా వివరాల నమోదు పూర్తిచేయాలి
వనపర్తి: ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లతో తప్పులు లేకుండా పూరించి గడువులోగా యాప్లో నమోదు చేయాలని రాష్ట్ర అదనపు ఓటరు నమోదు అధికారి చిన్నయ్య బీఎల్వోలకు సూచించారు. శనివారం పుర పరిధిలోని 117, 125, 158 పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఫారం పూరించే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారం నింపడంలో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి ఉన్నారు. -
ప్రజా అనుకూల పోలీసింగ్ విధానం అమలు
వనపర్తి: జిల్లాలో ప్రజా అనుకూల పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నామని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి ఎస్పీ పాల్గొని వివరాలు వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, కేసుల దర్యాప్తు, పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, గస్తీ వ్యవస్థ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం, అత్యవసర డయల్ 100 కాల్స్ స్పందన, బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసుల నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ పోలీసింగ్ విధానాలను సమగ్రంగా తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీతో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, సీఐలు రత్నం, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్లు ఇంతియాజ్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: రాష్ట్రంలోని క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు శనివారం నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుట్టుమిషన్లు, చిరు వ్యాపారాలకు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు.. ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్బైక్ యూనిట్లకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వార్షిక కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించరాదని.. ఆసక్తి, అర్హల కలిగిన వారు tso bmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని ప్రతులను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించా లని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్న ంబర్ 040–23391067 సంప్రదించాలన్నారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు 2025–26, 2026–27 విద్యాసంవత్సరానికిగాను ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి మజూహీద్ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేల ఉపకార వేతనం అందజేస్తామని.. విద్యార్థులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎస్ఎస్పీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ ఫేస్ ఐడి ద్వారా 14 అంకెల ఓటీఆర్ నంబర్ను పొందాలని సూచించారు. అనంతరం మీ సేవా కేంద్రాల్లో ఈ–పాస్ వెబ్సైట్లో ఫ్రెష్ లేదా రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్సైజ్ ఫొటో, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండోరోజు.. రెండు నామినేషన్లు అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. శనివారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని.. చివరిరోజు 9 డైరెక్టర్ స్థానాలకుగాను అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ మీడియా సదస్సుకు డీపీఆర్వోలు నారాయణపేట: జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఎంఏ రషీద్, వనపర్తి డీపీఆర్వో సీతారాం ఢిల్లీలో శుక్రవారం జరిగిన మీడియా కమ్యూనికేషన్ అధికారుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు. జాతీయ సదస్సుకు తెలంగాణ నుంచి ఎంపికై న కొద్దిమంది అధికారుల్లో ఇరు జిల్లాల అధికారులు ఉన్నారు. ఎన్నికల సమాచార వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సదస్సు అనుభవాలు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు. -
త్వరలోనే అల్పాహార పథకం అమలు
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం సైతం అమలు కానుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిణిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి కొత్తగా నిర్మించిన కిచెన్ షెడ్ను ప్రారంభించడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉందని, భవిష్యత్లో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించి వారి ఆరోగ్యంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కలెక్టర్ తన నిధుల నుంచి రూ.23.80 లక్షలు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, ఇందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధా (ఏఐ) విద్యను కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. రాయిణిపేట ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయ బృందం పనిచేస్తోందని.. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాస్, తహసీల్దార్ సుభాష్నాయుడు, ఎంపీడీఓ వినీత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి
వనపర్తి: నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ఇరిగేషన్ సీఈ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాల్వల నిర్మాణం, విస్తరణ పనుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. కేఎల్ఐ డీ–5, డీ–8 కాల్వల విస్తరణ పనులపై దృష్టి సారించాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించి వివరణాత్మక ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. గోపాల్పేట రిజర్వాయర్ ప్రతిపాదనల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బుద్ధారం స్టేజ్–2 ఆన్లైన్ రిజర్వాయర్కు సంబంధించిన అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే భవిష్యత్ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. ఖిల్లాఘనపురం గణపసముద్రం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, పెద్దమందడి మండలం గట్లఖానాపూర్లో నిర్మించనున్న రిజర్వాయర్కు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాన్ చెరువు అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేవల్లి మండలం తల్పునూరు, తల్పునూరు తండాలో సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. ఏదుల, అనంతపూర్ గ్రామాల ఆయకట్టు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. భీమా కెనాల్ విస్తరణ పనులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే రైతుల సాగునీటి అవసరాలను తీర్చేలా కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. కర్నెతండా ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను వెంటనే పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చాలని ఆదేశించారు. బుద్ధారం కుడి కాల్వ ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. కార్యక్రమంలో సీఈ రహీమోద్దీన్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. రూ.2.34 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ.. ఏదుల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన 47 మంది రైతులకు రూ. 2.34 కోట్ల పరిహారం చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లాకేంద్రంలోని క్యాంపు కాార్యాలయంలో అందజేశారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, గోపాల్పేట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి పాల్గొన్నారు. -
గ్రామాలకే న్యాయ సేవలు
వనపర్తిటౌన్: రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే వారి గ్రామానికే వచ్చి పరిష్కరిస్తామని.. జిల్లాలోని కక్షిదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో సంచార లోక్ అదాలత్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సంచార లోక్ అదాలత్ వాహనం నెలరోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందిస్తుందన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన లఘు చిత్రాలను వాహనంపై ఉన్న తెరపై ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు
ఆత్మకూర్/అమరచింత/నర్వ: సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, మక్తల్ నియోజకవర్గ ఈఆర్ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్ పురపాలికలోని ఖానాపూర్, అమరచింత మండలం కొంకన్వానిపల్లి, పాంరెడ్డిపల్లిలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసిన తర్వాత నేరుగా సేకరించి తుది జాబితాలో ఓటరు పేరు నమోదయ్యే వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. వలస వెళ్లిన కుటుంబాల ఓటర్ల ఫోన్నంబర్లకు తీసుకొని సమాచారం అందించాలని, గ్రామానికి వచ్చి ఫారాలు పూర్తిచేసి ఇవ్వమంటూ సందేశాలు పంపాలని సూచించారు. ఫారాలు నింపే సమయంలో తప్పొప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్, అమరచింత తహసీల్దార్లు జేకే మోహన్, రవికుమార్ యాదవ్ సూపర్వైజర్ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత ఉన్నారు. -
విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుముఖం పట్టకుండా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతి గ్రామంలో తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ హాజరును పక్కాగా నమోదు చేయాలని, ఈ ప్రక్రియపై ఎంఈఓలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీలో వంట గ్యాస్ వినియోగించాలని.. కట్టెల పొయ్యిపై వండుతున్నట్లు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే యూడైస్ పోర్టల్లో విద్యార్థుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచేలా నాణ్యమైన సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. గతేడాది గణితంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు రూపొందించిన పుస్తకం మాదిరి ఈ ఏడాది కూడా సైనన్స్, ఇంగ్లిష్లో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్లు రమేష్రెడ్డి, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు. -
వందనాలు ‘మిడ్జిల్’..
● 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన ● ఊర్కొండపేటలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ● ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. -
తరగతి గదిలో నాగుపాము
మదనాపురం: వనపర్తి జిల్లా మద నాపురం మండలంలోని తిర్మలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం భారీ ప్రమా దం తప్పింది. పాఠశాలలోని ఒకటో తరగతి గదిలో 30 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అదే సమయంలో నాలుగు అడుగుల పొడవైన నాగుపాము క్లాసులోకి వచ్చేసింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాగుపాము ప్రవేశించ డాన్ని గమనించిన ఉపాధ్యా యుడు కిరణ్కుమార్ వెంటనే హెచ్ఎంకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు పంపించి ప్రాణాపాయం తప్పించారు. వెంటనే కొత్తకోటలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన పాఠశాలకు చేరుకుని పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఉపాధ్యా యులని, కృష్ణసాగర్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. -
మొదటిరోజు నామినేషన్లు నిల్
అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ర్యాలంపాడుకు మోక్షం!
● సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు ● ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ ●గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మరమ్మతు కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. లోపభూయిష్ట నిర్మాణంతో.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయ్యాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతులు చేపట్టాలని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు. -
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. -
ఉత్సాహంగా వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
రంగనాథుడి సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని గురువారం తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆమెకు పూలమొక్క అందజేయగా.. అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయకస్వామిని కమిషనర్ కుటుంబం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రాలు అందించి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని తంజాపూర్ చిత్రాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తికావాలి
వనపర్తి: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ గడువులోగా పూర్తి కావాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, సూపర్వైజర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నేటితో పూర్తి చేయాలని.. వాటిని సక్రమంగా ఎలా నింపాలో ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని సూచించారు. బీఎల్వోలకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమయ పాలనతో పని చేయించేలా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిన వెంటనే బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సేకరణ ప్రారంభించాలని.. సేకరణ సమయంలో ఓటర్లు పూరించిన అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని ఎలాంటి తప్పులు లేకుండా ధ్రువీకరించాలన్నారు. డేటా ఆన్లైన్ ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
● గడువులోగా నిర్మాణాలు పూర్తికావాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపురం మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభం కాని వాటిని వెంటనే గ్రౌండింగ్ చేయించి ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తకోటలో 58, మదనాపురం మండలంలో 28 ఇళ్ల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. కొత్త ఇళ్ల మంజూరుకు సంబంధించి అర్హులను గుర్తించి వెంటనే తమ లాగిన్కు పంపాలని అధికారులను ఆదేశించారు. గుడిసెల్లో నివసించే వారికి ప్రథమ ప్రాధాన్యతగా ఇళ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దొడ్డురకం వరి సాగు వద్దు.. గ్రామాల్లో రైతులు దొడ్డురకం వరి సాగు చేయకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సన్నరకం వరి ధాన్యం మాత్రమే పండించేలా, పంటమార్పిడీపై వారికి అవగాహన కల్పించాలన్నారు. సన్నరకానికి మాత్రమే బోనస్ వస్తుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని.. ధాన్ రకం వరి వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తన సరఫరా డీలర్లతో సమావేశం నిర్వహించి అలాంటి రకాలను విక్రయించ వద్దని ఆదేశాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా నానో యూ రియా, డీఏపీ వినియోగంపై కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు కార్యాలయ సమీపంలో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించి లబ్ధిదారుతో మాట్లాడి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, తహసీల్దార్ సుభాష్నాయుడు, ఎంపీడీఓ వినీత్, పుర కమిషనర్ సైదయ్య, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ ప్రక్రియకు సహకరించండి
వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు నిర్మాణాత్మక సహకారం అందించాలని అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల నింపడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటరు అందుకున్న ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి తిరిగి బీఎల్ఓలకు అందజేస్తేనే ఓటరు జాబితాలో చోటు లభిస్తుందన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఫారం అందేలా సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
రాజోళి బండ..!
●ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. 45 వేల ఎకరాలకే అందుతోంది. యాసంగిలో నీళ్లు రాక క్రాప్ హాలిడే ప్రకటించడం ఏటా పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టింది. 2018లో నీటి పంపింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండగా.. 5.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క మోటారు ద్వారానే వరద వచ్చినప్పుడు తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూటరీ 23, 24 నుంచి డిస్టిబ్యూటరీ 35 వరకు తడులు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఆ తర్వాత నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ 40 వరకు నీరందడం లేదు. దీనికింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతీగతి లేదు. ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా జరిగే పనులను సాకుగా చూపి రైతులను మభ్యపెట్టొద్దు. కర్ణాటకలో జరుగుతున్న కొన్ని ప్యాకేజీ పనులు ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేవు. దాని కోసం ఎదురుచూడటం వృథా. ప్రస్తుతం వర్షాలు లేకపోయినప్పటికీ, తు మ్మిళ్ల లిఫ్టు ద్వారా విడుదల అవుతున్న నీటి తో ఆయకట్టుకు జీవం ఉంది. రిజ ర్వాయర్ నిర్మించి ఉంటే నీటి నిల్వ ఉంచుకుని మరో నెలరోజులు పాటు అందించుకునేవాళ్లం. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ.. ఈ మూడు రాష్ట్రాలతో ముడిపడిన రాజోళి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తుంగభద్రపై నిర్మించిన ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోగా.. ప్రస్తుతం దీని భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. నిజాం కాలం నాటి ఈ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఆనకట్ట, కాల్వలు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఈ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలోని నడిగడ్డ రైతులకు శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రాజెక్ట్ నేపథ్యం.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి తాలుకాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ 1958లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 143 కిలోమీటర్ల పొడవున (కర్ణాటకలో 43 కి.మీ.లు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 100 కి.మీ.లు) కాల్వ నిర్మించారు. ఆర్డీఎస్కు మొత్తం 17.1 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో కర్ణాటకకు 1.2 టీఎంసీలు.. తెలంగాణకు 15.9 టీఎంసీలు. తుంగభద్ర నది నుంచి 10 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 7.1 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంది. ఒకటి నుంచి 12 డిస్ట్రిబ్యూటరీలు కర్ణాటకలో.. 13 నుంచి 42 వరకు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట పొడవు 850 మీటర్లు. తెలంగాణకు వచ్చే కాల్వ ఎడమవైపు ఉండగా.. కుడి వైపున ఏపీ సరిహద్దు ఉంటుంది. 2006లో ఆధునికీకరణ ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఏళ్ల తరబడి ఏపీ, తెలంగాణ రైతుల మధ్య వివాదం కొనసాగింది. 2001లో ఇరు ప్రాంతాల రైతులు దాడులకు దిగడంతో ఆర్టీఎస్ శాశ్వత పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆనకట్ట వద్ద వివాదాలకు కారణంగా ఉన్న స్లూయిస్ను మూసివేయించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆర్టీఎస్ ఆధునికీకరణకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటకకు అందజేశారు. అయితే నాలుగు ప్యాకేజీల్లోనూ అరకొర పనులు చేసి అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకోగా.. ఆ తర్వాత ఆధునికీకరణ అటకెక్కింది. ఏడు దశాబ్దాల క్రితం గచ్చుతో నిర్మించిన ఆర్టీఎస్ ఆనకట్ట బలహీనపడింది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో ఇసుక, బురద పేరుకుపోయింది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ తెలంగాణలోని సింధనూరు ను ంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడి నుంచి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఎగువన కొత్త పథకాలు.. తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. అటకెక్కిన ఆధునికీకరణ.. అధ్వానంగా ఆనకట్ట, కాల్వలు కర్ణాటకలో మోటార్లతో యథేచ్ఛగా నీటి చౌర్యం జల విద్యుత్ ప్రాజెక్ట్లకు విచ్చలవిడిగా నీటి వినియోగం అక్రమంగా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నడిగడ్డకు పొంచి ఉన్న ముప్పు.. రైతుల్లో ఆందోళన -
జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
మాటల్లో కాదు.. చేతల్లో అభివృద్ధి
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసి.. ఆచరణలో చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 22కోట్లతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ టవర్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో ఐటీ టవర్ నిర్మించడంతో జిల్లాకేంద్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందన్నారు. అభివృద్ధిని మాటలతో కాకుండా.. చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. జిల్లాను సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు వనపర్తికి రావడానికి ఐటీ టవర్ కీలక వేదికగా మారనుందని.. ఉద్యోగాల కోసం ఇక్కడి యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న ఐటీ టవర్ ద్వారా డిజిటల్ సేవలు మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు జిల్లాకు ఆకర్షితమవుతాయని అన్నారు. అనంతరం నాగవరంలోని చెంచు ప్రాంత మహిళలకు ఎమ్మెల్యే ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, బ్రహ్మాచారి, బి.కృష్ణ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ స్థాయి సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని.. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత, సామాజిక శాంతిని పరిరక్షించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమన్నారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని.. ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమన్నారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. పాఠశాలల్లో సోషల్ ఆడిట్ వనపర్తిటౌన్: సర్వశిక్ష పథకం సోషల్ ఆడిట్కు 2026–27 విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 5,363 పాఠశాలలను ఎంపిక చేసినట్లు క్లస్టర్ సోషల్ ఆడిటర్ రామస్వామి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో పరిపాలన, ఆర్థికపరమైన అంశాలు, ఎస్ఎంసీకి సంబంధించిన రికార్డులు, బోధన సదుపాయాలు, మౌలిక వసతులు, గ్రంథాలయం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఏఏపీసీ చైర్మన్ సునీత, కౌన్సిలర్ మదన్, ఇన్చార్జి హెచ్ఎం రవికుమార్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిషన్ మెంబర్స్ వెంకటేశ్, విశ్వంబాబు, గంధం నాగరాజు ఉన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్ అన్నారు. అమరచింతలోని మార్క్స్ భవనంలో బుధవారం నిర్వహించిన మాస్లైన్ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాల అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. మళ్లీ నల్ల చట్టాలను అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. కార్మికులు జీతాల పెంపు కోసం, పనిగంటల కోసం పోరాటాలు చేస్తుంటే.. లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పనిగంటలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో జంజీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాస్లైన్ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంతు, వెంకటేశ్, ప్రసాద్, సాంబశివుడు, గణేశ్, కొండారెడ్డి, దేవదానం, రాజన్న, రాజు, కృష్ణవేణి, గీత పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.వీణ జోషి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ rktfhu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. మరిన్ని వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలని.. సర్వే పూర్తయిన వాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన నీటిపారుదలశాఖ, సర్వేశాఖ, ఎస్డీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, బుద్ధారం లెఫ్ట్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డీ–1, డీ–5, డీ–8 కాల్వల నిర్మాణాలకు ఇప్పటికే పెగ్ మార్కింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. సర్వే పూర్తయిన 269 ఎకరాల భూములకు వెంటనే సబ్ డివిజన్ రిపోర్ట్ పూర్తిచేసి.. రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అదే విధంగా ఎస్డీఆర్ పూర్తయిన వెంటనే ఆయా భూములకు ఈ నెల 10వ తేదీలోగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఇంకా పెగ్ మార్కింగ్ పూర్తికాని భూముల సేకరణపై సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం భూసేకరణ పూర్తిచేస్తేనే ప్రాజెక్టుల పురోగతి మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్కుమార్, నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, సర్వేశాఖ ఏడీ శ్రీనివాసులు ఉన్నారు. -
ప్లాస్టిక్ భూతం..!
జిల్లాలో ప్రకటనలకే పరిమితమైన నిషేధం ● విచ్చలవిడిగా పాలిథిన్ కవర్ల వినియోగం ● హెచ్చరికలను పట్టించుకోని వ్యాపారులు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ●పాలిథిన్ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులకు మరోమారు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. – కళాంపాషా, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు, అమరచింత అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అవగాహన రాహిత్యంతోనే ప్లాస్టిక్ వాడకం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్లాస్టిక్ను అడ్డగోలుగా వాడుతున్న వారు కూడా బాధ్యులే. అధికారులు రోజువారీగా దాడులు నిర్వహిస్తేనే పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. – మోష, సీపీఐ నాయకుడు, ఆత్మకూర్ పాలిథిన్ కవర్ల వినియోగాన్ని నిషేధించినా కొందరు దుకాణదారులు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ.. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. ప్లాస్టిక్త్ కలిగే అనర్థాలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాం. – నరేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్, ఆత్మకూర్ ఆత్మకూర్: జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ప్లాస్టిక్ వినియోగంతో తీవ్ర అనర్థాలు చోటు చేసుకుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంతో ఎక్కడబడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల్లోని వ్యాపార దుకాణాల్లో అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించే వారికి జరిమానాలు విధిస్తున్నారు తప్ప.. శాశ్వత చర్యలు చేపట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవగాహన కల్పిస్తున్నా.. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా 2022 జూలై 1 నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తోంది. ప్లాస్టిక్ పుల్లలతో ఉన్న ఇయర్బర్డ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండిస్టిక్స్, ఐస్క్రీం పుల్లలు, థర్మకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, ప్యాకింగ్ కవర్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే కవర్లు, బ్యానర్లు తదితర వస్తువులపై నిషేధం విధించారు. అలాగే 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పూర్తిగా నిషేధించబడ్డాయి. పాలిథిన్ కవర్ల స్థానంలో కాగితపు కవర్లు, జ్యూట్ బ్యాగులు, బట్ట సంచులు మాత్రమే వినియోగించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ప్రతి దుకాణంలో పాలిథిన్ కవర్లనే వినియోగిస్తుండటంతో డ్రెయినేజీలు, రోడ్లపై ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఏడాది కాలంలో 6 క్వింటాళ్లకు పైగా.. ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఏడాది వ్యవధిలోనే 6 క్వింటాళ్లకు పైగా ప్లాస్టిక్ కవర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 మంది వ్యాపారులకు రూ. 1,000 నుంచి రూ. 5వేల వరకు జరిమానాలు విధించారు. అమరచింత మున్సిపాలిటీలో 50 కేజీల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని ఆరుగురికి జరిమానాలు విధించినట్లు సమాచారం. పెబ్బేరులో 350 కేజీల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని 25 మందికి జరిమానా విధించారు. కొత్తకోటలో 70 కేజీల కవర్లు స్వాధీనం చేసుకున్నారు. వనపర్తిలో 65 కేజీల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని 26 మందికి జరిమానాలు విధించారు. జిల్లాకేంద్రమైన వనపర్తితో పాటు ఆత్మకూర్, కొత్తకోట, అమరచింత, పెబ్బేరు మున్సిపాలిటీల్లోని దుకాణాల్లో అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి.. జరిమానాలు విధిస్తున్నారు. అయితే పల్లెల్లో ప్లాస్టిక్ నిషేధం ఎవరికీ పట్టడం లేదు. గ్రామస్థాయిలో సైతం తనిఖీలు చేపట్టి.. ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని పలువురు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. మహబూబ్నగర్ 8 కల్వకుర్తి 18 నారాయణపేట 11 జడ్చర్ల 8 గద్వాల 9 వనపర్తి 3 నాగర్కర్నూల్ 17 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
మొదట నష్టపోయేది పాలమూరే
జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ
వనపర్తి: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం పుర పరిధిలోని పలు వార్డులతో పాటు పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలతో కలిసి పలు ఇళ్లకు తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రత్యక్షంగా తిలకించారు. వారితో మాట్లాడి ఫారాలు అందాయా లేదా అని ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేసి ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ఫారాల పంపిణీ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని, ప్రతి దశలో పారదర్శకతను పాటించాలని కోరారు. ఫారాల పంపిణీ సమయంలో ఓటర్లకు వాటిని సక్రమంగా ఎలా నింపాలో అవగాహన కల్పించాలని, అవసరమైన పత్రాలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట వనపర్తి, పెబ్బేరు తహసీల్దార్లు, సూపర్వైజర్లు, వార్డు అధికారులు, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
బాధితులకు భరోసా పెంచేలా సేవలు
పాన్గల్: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించగా.. సీఐ రత్నం, ఎస్ఐ కుర్మయ్య పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. రికార్డులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్, శిథిలావస్థకు చేరిన సిబ్బంది క్వార్టర్స్ను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కేసులు నమోదై నిలిపిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సమీపంలో ఉన్న కొందరు ఇళ్ల యజమానులు వారికి సంబంధించిన రాళ్లు, ఇతర సామగ్రి ఆవరణలో వేయడం ఏమిటని ఎస్ఐని ప్రశ్నించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసుశాఖ తనకు అండగా ఉందనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ప్రతి పోలీస్ అధికారి ప్రధాన బాధ్యతని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించాలని.. తమ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో ప్రదర్శించకూడదన్నారు. పోలీస్శాఖకు చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది తమ కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని, పిల్లలను బాగా చదివించాలని, ఏవైనా సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఆమె మొక్క నాటారు. -
‘నీరు’గారుతున్న లక్ష్యం
జూరాల సమాంతర కాల్వ షట్టర్లకు లీకేజీలు ● నిత్యం 150 క్యూసెక్కుల నీరు వృథా ● ఏడాది పొడవుగా పారుతున్న వైనం ● జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం ● నిధులున్నా.. మరమ్మతులు కరువు అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీలతో సాగునీరు నిత్యం వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయం వెనుక జలాలు కాల్వ వెంట వృథాగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు, ప్రాజెక్టుపై ఆధారపడిన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా చుక్కనీరు కూడా ముందుకు పారకుండా అడ్డుకట్ట వేసిన ప్రాజెక్టు అధికారులు సమాంతర కాల్వ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వెయ్యి, 1,500 క్యూసెక్కుల వరద వస్తుండటంతో సమాంతర కాల్వ నుంచి భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నా.. జూరాల ప్రాజెక్టు అధికారులు మాత్రం కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరమ్మతులు కరువు.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీ కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. 5 ఏళ్లుగా ఇదేతంతు కొనసాగుతున్నా.. మరమ్మతులు చేపట్టి నియంత్రణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి వేసవిలో వరదలు లేకపోయినా షట్టర్ల లీకేజీతో పాటు అధికారుల అత్యుత్సాహం కారణంగా 15 రోజులకోసారి మూడురోజుల పాటు షట్టర్లు తెరిచి ఉన్న నీటిని తరలించుకుంటున్నారని.. జూరాల అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 17 కిలోమీటర్ల పొడవు.. జూరాల జలాశయం ఎడమ కాల్వకు సమీపంలో సమాంతర కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు 17 కిలోమీటర్ల పొడవునా కాల్వ నిర్మించారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల మీదుగా కాల్వ రామన్పాడు రిజర్వాయర్కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి భీమా ఫేజ్–2, కొల్లాపూర్ వరకు పారుతూ అక్కడక్కడ నిర్మించిన రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటలు నింపి మళ్లించుకుంటారు. -
గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి : సీపీఎం
వనపర్తి రూరల్: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. పెబ్బేరులో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించి సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్పాషా, గోపాల్దిన్నె, తెల్లరాళ్లపల్లి సర్పంచులు దొడ్ల కవిత, జంబులయ్య, అమరచింత మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు అజయ్, సీపీఎం మండల నాయకులు జి.బాలయ్య, ఆర్.భాస్కర్, దేవన్న, జయరాం, ఊషన్న, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్, జీజీహెచ్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఎంసీహెచ్లో రికార్డులను పరిశీలించి రోజు ఎంతమంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణుల ఆరోగ్య నివేదికలను పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టిఫా స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎంతమంది గర్భిణులు వినియోగించుకున్నారో రికార్డులను పరిశీలించారు. పేద గర్భిణులు సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వైద్యులతో నిర్వహించిన సమీక్షలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి ప్రత్యేక చికిత్స, పోషకాహారం, మందులు అందించాలన్నారు. జిల్లాలో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. టిఫా స్కానింగ్ యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి రోజు కనీసం ఐదుగురు గర్భిణులకు స్కానింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డయాలసిస్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగుల వివరాలు తెలుసుకొని నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డయాలసిస్ వార్డును గ్రౌండ్ ఫ్లోర్కు మార్చాలని రోగులు కోరగా.. క్రిటికల్ కేర్ యూనిట్లో మరో డయాలసిస్ వార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల ప్రతిపాదనలు సమర్పించాలని, నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ శివప్రసాద్, ఇతర వైద్య అధికారులు ఉన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొత్తకోట రూరల్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమడబాకుల రైతువేదిక నుంచి రైతునేస్తం కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు, రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రైతుభరోసా ద్వారా సకాలంలో పెట్టుబడి సాయం అందించి ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తోందని తెలిపారు. రైతుభరోసా, ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యం, సన్నరకం వరికి బోనస్ వంటి కార్యక్రమాలతో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, బోయేజ్, రావుల కరుణాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, రంగారెడ్డి, సర్పంచ్ గాయత్రి, కొల్లంపల్లి అబ్దుల్లా, కావలి తిరుపతయ్య, ఉప సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టించుకోవడం లేదు..
జూరాల ప్రధాన ఎడమకాల్వకు వారాబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్న అధికారులు.. సమాంతర కాల్వలో ఏడాది పొడవునా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ముందుభాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సైతం సాగునీరు అందడం లేదు. కేవలం వరదలు వచ్చినప్పుడే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన కాల్వ ద్వారా ఏడాది పొడవునా నీరు పారుతోంది. – భాస్కర్రెడ్డి, రైతు, నందిమళ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మర్మతులకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో మరమ్మతులు పూర్తి చేయడానికి నీటిని నిలిపేందుకు రింగ్బండ్ వేశాం. అది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. త్వరగా మరమ్మతులు పూర్తిచేసి నీటివృథాకు అడ్డుకట్ట వేస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2 ● -
సమన్వయంతోనే సమర్థ సేవలు
వనపర్తి: జిల్లాలో న్యాయవ్యవస్థ, పోలీసుశాఖ, జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావును సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి కోర్టు సముదాయంలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా పోక్సో కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. న్యాయమూర్తులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి ఈ–ఆఫీస్ అమలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ మధ్య జరిగే అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు జూలై 1 నుంచి ఈ–ఆఫీస్ ద్వారా మాత్రమే జరగాలని.. అందుకు తగినట్లు అధికారులు, సిబ్బంది తగిన శిక్షణ తీసుకొని సమాయత్తం కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి మందిరంలో ఈ–ఆఫీస్పై అధికారులకు అవగాహన కల్పించారు. ఫైళ్ల సత్వర పరిష్కారం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ–ఆఫీస్ ఉపయోగకరమైందని.. అంతేగాకుండా పర్యావరణ హితమని వివరించారు. ఏ ఫైల్ ఏ అధికారి, సిబ్బంది దగ్గర పెండింగ్లో ఉంది.. ఎన్నిరోజుల నుంచి ఉంది అనే విషయాలు సులువుగా తెలుస్తాయని చెప్పారు. జూలై 1 నుంచి తన వద్దకు ఫిజికల్గా వచ్చే ఏ ఫైల్ ఆమోదించబడదని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భూ తగాదాలు కోర్టుల్లో పరిష్కరించుకోవాలి..
వనపర్తి: భూ వివాదాలను న్యాయస్థానాల్లోనే పరిష్కరించుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు వచ్చి ఎస్పీని కలిసి వినతులు అందజేశారు. ఎస్పీ వాటిని నిషితంగా పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్చేసి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించడం పోలీసుశాఖ బాధ్యతన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. పోలీసు ప్రజావాణికి మొత్తం 22 వినతు లు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
‘బుద్దారం’ నిర్వాసితుల రాస్తారోకో
గోపాల్పేట: బుద్దారం గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకొని డబ్బులు రాని గ్రామస్తులు సర్పంచ్ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ చెరువును రిజర్వాయర్గా మార్చే క్రమంలో ఇప్పటికే 101 ఎకరాలు కోల్పోయామని.. రెండో విడతలో మరో 101 ఎకరాలు సర్వే చేశారన్నారు. ప్రస్తుతం సర్వే చేసిన భూమిలో ఎకరా, అర ఎకరాలోపు ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఆ భూములు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే భూమికి బదులు వేరేచోట రెండింతల భూమి, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. అలాగే నిర్వాసితులకు బ్యాంకుల్లో రాయితీ రుణాలిప్పించి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే గ్రామంలో గతంలో నిర్మించుకున్న 40 డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని, ఇందుకోసం రెండేళ్లుగా అధికారులకు మొర పెట్టుకున్నా రావడం లేదని వాపోయారు. వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరగా అంగీకరించలేదు. అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వాహనాన్ని ఆపి గ్రామస్తులతో మాట్లాడారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు పంపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిష్కార మార్గం చూపకుండా అర్జీని తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దన్నారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 63 అర్జీలు దాఖలైనట్లు సిబ్బంది తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభి -
నల్లమలలో వేట!
ప్రజల సహకారం అవసరం.. అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మన్ననూర్, లింగాల, కొల్లాపూర్లో సర్వేలెన్స్ టవర్స్ ఏర్పాటుచేశాం. సిస్టమ్ ద్వారా లైవ్లో పరిశీలించి మానిటరింగ్ చేపడుతాం. కెమెరా ట్రాప్ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి అచ్చంపేట: నల్లమలలో వేటగాళ్ల దాడులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. అడవిలో నీరు దొరక్క బయటకొస్తున్న వాటిని కొందరు వేటాడి చంపేస్తున్నారు. మరికొందరు ఉచ్చులు బిగించి మరీ ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా అటవీ సంపదకు నిలయంగా ఉన్న అనేక అరుదైన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల అమ్రాబాద్ అభయారణ్యంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వేటగాళ్లను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నలుగురిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. 2024–25 సంవత్సరంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన 1,076 ఉచ్చులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తొలగించారు. దీన్ని బట్టి నల్లమలలో వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిఘా ఉన్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్లు, ప్రత్యేక నిఘా బృందాలున్నా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. అభయారణ్యంలో నిత్యం ఏదో ఒకచోట వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసంతో పచ్చళ్లు తయారుచేసి.. రహస్య మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా 15 నుంచి 20 వరకు వన్యప్రాణుల వేటపైనే అటవీశాఖ కేసులు నమోదు చేస్తోంది. నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కి అటవీ ప్రాంతంలో ట్యాంకర్లు వెళ్లే ప్రాంతంలోనే నీటి వసతిని ఏర్పాటుచేశారు. కోర్ ఏరియాలో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అడవి నుంచి బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో దారితప్పి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాలైన సిద్ధాపూర్, మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు ఉడిమిళ్ల, మద్దిమడుగు, తిర్మలాపూర్ (బీకే) తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉండే బోరుబావుల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో కొద్దిపాటి నీరు ఉంది. వన్యప్రాణులు అక్కడికి అధికంగా వస్తుంటాయి. ఏటీఆర్లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు నిత్యం ఏదో ఒకచోట వేటాడుతున్న వైనం కెమెరా ట్రాప్ల్లో చిక్కుతున్న వేటగాళ్లు నీటి కోసం బయటికొచ్చి బలవుతున్న వన్యప్రాణులు -
మోగిన చేనేత ఎన్నికల నగరా
అమరచింత: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చేనేత సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. రిటర్నింగ్ అధికారులు చేనేత కార్మికుల సమక్షంలో విడుదల చేశారు. అమరచింత చేనేత సహకార సంఘంలో చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటర్నింగ్ అధికారి ప్రకాశ్రావు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 5వ తేదీన పరిశీలన, 6న ఉపసంహరణ అనంతరం గుర్తులను కేటాయించనున్నట్లు చెప్పారు. 10వ తేదీన ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లు ఉండగా.. అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరి అని తెలిపారు. నామినేషన్ ఫీజు బీసీ సర్టిఫికేట్ సమర్పిస్తే రూ.750, సర్టిఫికేట్ లేకుంటే రూ.వెయ్యి.. ఎస్టీ, ఎస్సీలకు రూ.250 ఉంటుందన్నారు. మొదలైన ఎన్నికల వేడి.. చేనేత సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఆయా చేనేత సొసైటీలలో ఎన్నికల వేడి మొదలైంది. సభ్యులు అధికంగా ఉన్న సొసైటీల్లో మాజీ పాలకవర్గం మరోమారు కై వసం చేసుకునేందుకు నేతన్నల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం పాన్గల్: పేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ అన్నారు. సోమవారం మండలంలోని మాందాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధిహామీ నిధులు రూ.3.40 లక్షలతో నిర్మించిన కిచెన్ షెడ్ను ఆయన సర్పంచ్ సుగుణమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆనంద్, మాజీ సర్పంచ్ జయరాములుసాగర్, కృష్ణయ్యసాగర్, ఉప సర్పంచ్ శ్యాంసుందర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
చేనేత.. ఎన్నిక
చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ● జూన్ 29న నోటిఫికేషన్ జారీ ● జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ ● జూలై 5న పరిశీలన ● జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ● జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా జిల్లా సంఘాలు ఓటర్లు జో.గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 ఎన్నికల షెడ్యూల్.. నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు -
ట్రామా కేర్ కలేనా?
ఉన్నవి వినియోగించరూ.. కొత్తవి నిర్మించరూగోల్డెన్ అవర్లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు 600కి.మీ. మేర జాతీయ రహదారుల విస్తరణ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సకు అవస్థ ● వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ముందుకు కదలని వైనం మహబూబ్నగర్ క్రైం: జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరుగుతోంది.. కానీ అదే వేగంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడాల్సిన ’గోల్డెన్ అవర్’ (తొలి గంట)లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందకపోవడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రెండున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4,231 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,109 మంది మృత్యవాతపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. 13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లా మీదుగా 44, 167, 167ఏ, 765 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. దాదాపు 600 కి.మీ.మేర విస్తరించి ఉంది. కనీసం 12 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు హడావుడి చేయడం మినహా దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అత్యవసర చికిత్స అందకపోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం, గోల్డెన్ అవర్లో చికిత్స అందకపోవడం, జనరల్ ఆస్పత్రిలో సరైన వసతులు లేక ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎన్హెచ్–44పై 2013లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా బాలానగర్–రాజాపూర్ మధ్యలో, జానంపేట, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి, అలంపూర్ ఎక్స్రోడ్ దగ్గర ట్రామా కేర్ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే పరికరాలు, సౌకర్యాలు, వైద్యులు కూడా అందుబాటులో లేరు. అత్యవసరంలో స్కానింగ్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక అత్యవసర వైద్య సేవల కోసం నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్లలో మూడేళ్ల క్రితం 50 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతావి పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కోస్గి, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, మక్తల్, కొత్తకోట, తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మహబూబ్నగర్, హైదరాబాద్ లేదా కర్నూలుకు తరలించాల్సి వస్తుంది. ప్రయాణానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. –9లో u -
ముగిసిన పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్ష
వనపర్తి విద్యావిభాగం: పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ నియామక శిక్షణ ప్రవేశ పరీక్ష ఆదివారం ముగిసింది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి.మధుకర్స్వామి, డీసీపీ సారథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణనిచ్చేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 47 కేంద్రాలు, ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో పరీక్ష జరగగా.. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పరీక్షకు 242 మంది అభ్యర్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నాలుగు నెలల పాటు ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ ఇవ్వనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షుడు శంకర్గౌడ్, సత్తార్, శివలింగం, రమేష్, ఉప్పరి తిరుమ లేష్, కండ్రెని వెంకటేష్, బి.రాము, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోటిలింగేశ్వరస్వామికి లక్ష పుష్పార్చన కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండోరోజు జరిగిన పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పాలు, బిల్వ దళాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఉత్సాహంగా ఫుట్బాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్లు రాములు, నరేష్, రాజ్కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ిసీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి ఎన్ని నిధులు అవసరమో, తక్షణం కేటాయించి పూర్తిచేసి ఈ రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. కేసీఆర్ హయాంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కానీ దానికి రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేస్తే అల్లంపూర్ రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కేఎల్ఐ, భీమా ఫేస్ 1, 2, నెట్టెంపాడ్, కోయిల్సాగర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాంతం, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణాడెల్టాలో వాళ్ల నీటివాటా కంటే అధికంగా నీళ్లను తరలించకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరంటినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. -
ప్రతిపాదనలు పంపించాం
ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ ● -
చుక్కల మందుకు చక్కటి స్పందన
● తొలిరోజు 98.5 శాతం లక్ష్యం చేరుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ● పల్స్ పోలియో ప్రారంభించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ ● పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారి వనపర్తిటౌన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మొత్తం 46,150 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా.. ఒక్కరోజే 45,848 మంది చిన్నారులకు వేసి 98.5 శాతం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 367 కేంద్రాలు, ఒక మొబైల్ బృందం ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, అంగన్వాడీ, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేశారు. జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆర్టీసీ బస్టాండ్లోని మొబైల్ పాయింట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, పీర్ల గుట్టలోని కేంద్రంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, నాగవరంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ ప్రారంభించారు. మదనాపురం మండలంలోని రైల్వేస్టేషన్ రోడ్ హైరిస్క్ ప్రాంతాల్లో పరిస్థితిని జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. విధిగా వేయించాలి.. ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి చిన్నారికి వ్యాక్సిన్ వేయాలని, అందుకు తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఖీమ్యానాయక్, డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, పోలియో బారిన పడకుండా ఉండేందుకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్నారిని వదలకుండా పోలియో చుక్కలు వేసేలా ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాలకు రాలేని చిన్నారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి వేయాలని ఆదేశించారు. -
జూలై 4న మిడ్జిల్కు సీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
మోదీ పాలన ప్రపంచానికే ఆదర్శం
వనపర్తిటౌన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన ప్రపంచానికే ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్ణం పర్ణిత అన్నారు. జిల్లాకేంద్రంలోని నాగవరంలో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం హైదరాబాద్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్గా ప్రారంభించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని ఆయన సందేశాన్ని ఎల్ఈడీ స్క్రీన్పై తిలకించారు. అనంతరం కర్ణం పర్ణిత కార్యాలయాన్ని రిబ్బన్ కట్చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ సామాన్యుల మొదలు దేశ భద్రత వరకు అన్నిరంగాల్లో సుస్తీర దేశంగా భారత్ను మలిచారని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే బీజేపీ లక్ష్యమని, పశ్చిమ బెంగాల్ మాదిరిగానే తెలంగాణలో సైతం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీఎల్ఏ–2గా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణతో బాధ్యతలు నిర్వర్తించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో బూత్స్థాయి కార్యకర్తలు, శక్తికేంద్రం ఇన్చార్జీలను మరింత బలోపేతం చేస్తూ పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి ఊహించని స్థాయిలో జరిగి ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, రాష్ట్ర నాయకులు ప్రభాకర్రెడ్డి, సబ్బిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తం, కేతూరి బుడ్డన్న, రాష్ట్ర కిసాన్మోర్చా ఉపాధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, మహిళామోర్చా అలివేలు, మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, కుమారస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ భాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
హిందూ సమాజం ఏకం కావాలి
గద్వాలన్యూటౌన్: హిందూ సమాజం ఏకమై సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించాలని తెలంగాణ సాదు పరిషత్ అద్యక్షుడు శంకర్ స్వామీజీ సూచించారు. ఆదివారం స్థానిక జములమ్మ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మహాజన శక్తి కార్యక్రమం నిర్వహించగా.. పలువురు సాధువులు, హిందూ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధార్మిక విలువలు, సామాజిక ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. హిందూ దేవాలయాల్లో దర్శనం చేసుకునే హక్కు భక్తులందరికీ ఉందన్నారు. ఇటీవల మల్దకల్ మండలం మద్దెలబండలో పోలీసులు త నను నిర్బంధించిన ఘటనపై అధికారులు చట్టబద్ధంగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు. జములమ్మ అమ్మవారిపై భక్తులకు ఉన్న విశ్వాసాలను గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలని సూచించారు. అంతకుమందు శంకర్ స్వామీజీ, ఇతర సాధువులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్ కుమార్, వేదయోగి మహారాజ్, ఆత్మ రామస్వామి, సీవీఆర్ ప్రసాద్, డా.పురుషోత్తం, కీర లింగేశ్వరస్వామి, ప్రియా చౌదరి, స్థానిక వీహెచ్పీ, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందాలి
వనపర్తి: బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభికి బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయగా ఆయన స్వయంగా స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు ఫారాన్ని పూర్తిగా, స్పష్టంగా నింపే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఓటరు అవసరమైన వివరాలు సక్రమంగా నమోదు చేసి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోగా సమర్పించేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఓటరుకు ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని.. ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లతోనే గిరిజనుల అభ్యున్నతి
పాన్గల్/వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం 1976లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంతో అభ్యున్నతి సాధ్యమైందని.. ఇప్పటికీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని కాంగ్రెస్పార్టీయేనని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. శనివారం లంబాడి, ఎరుకల, యానాది కులాల ఎస్టీ రిజర్వేషన్ 50 ఏళ్ల స్వర్ణోత్సవ బస్సుయాత్ర జిల్లాకేంద్రంతో పాటు పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లితండాకు చేరుకోవడంతో పార్టీ శ్రేణులు, తండావాసులు ఘన స్వాగతం పలికారు. జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎంపీ మాట్లాడుతూ.. నాడు ఇందిరమ్మ కేటాయించిన రిజర్వేషన్ల ఫలాలతో గిరిజనులు పార్లమెంట్ వరకు, కిందిస్థాయి నుంచి కలెక్టర్ దాకా ఎదిగారన్నారు. సెప్టెంబర్లో హైదరాబాద్లో ఆశీర్వాద సభ ఉంటుందని.. లక్షలాది మంది గిరిజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో గిరిజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే తండాల అభివృద్ధి జరిగిందని, రెండున్నరేళ్లలో వనపర్తి నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి తండాలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. గిరిజనుల సామాజిక, రాజకీయ సాధికారతకు పునాది వేసింది కాంగ్రెస్పార్టీ అన్నారు. గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి మార్గం సుగమం చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్పార్టీ లక్ష్యమన్నారు. బస్సుయాత్రలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ప్రభుత్వ విప్ రామచందర్నాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, మాజీ మంత్రి రవీందర్నాయక్, మాజీ ఎమ్మెల్యే రాములునాయక్, టైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ ఉన్నారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, తెల్లరాళ్లపల్లి తండాలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంతునాయక్, గిరిజన సంఘం జిల్లా నాయకులు బాల్యానాయక్, మాజీ సర్పంచ్ రాజునాయక్ పాల్గొన్నారు. ఎంపీ బలరాంనాయక్ -
పులుల ఖిల్లా.. నల్లమల
అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అఖిలభారత పులుల అంచనా–2026 ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో వాటి సంఖ్య 36 నుంచి 42కు చేరిందని అటవీశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఇక్కడ 36 పులులు ఉండగా.. ఏడాది కాలంలో ఆరు పెరిగాయి. మొత్తం 18 ఆడ పులులు, 14 మగ, 2 ఉప–వయోజన, 8 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. తల్లి పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పునరుత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. 2017లో జాతీయ పులుల గణాంక అథారిటీ అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ ఆరు పులులుండగా.. ప్రస్తుతం 42కు చేరడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో మనుషుల సంచారం, ప్రవేశం తగ్గుతుందనేందుకు సూచన అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో నాలుగు, ఐదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గణన ఇలా.. ఏటీఆర్ పరిధిలో గత నవంబర్ నుంచి జూన్ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్లను నాలుగు బ్లాక్లుగా విభజించారు. ప్రతి బ్లాక్లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్ను 2 చ.కి.మీ. గ్రిడ్లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది. 2,611.39 చ.కి.మీ. విస్తీర్ణంలో అభయారణ్యం.. నల్లమల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ. అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ. బఫర్ జోన్గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. ఈ అడవిలో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల రక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200 పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది. సాధారణంగా పులులు రెండున్నరేళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఏటీఆర్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఆర్లో పరహా, భౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19, ఎఫ్–6, ఎఫ్–7, ఎఫ్–26 పేర్లతో ఆడ పులులకు నామకరణం చేశారు. ఒక్కో ఆడపులి సంవత్సరంలో నాలుగు పిల్లలను కంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పులులు ఏకాంతాన్ని కోరుకుంటాయని.. ఇదే సమయంలో ప్రసవిస్తాయని.. మూడు నెలలపాటు పర్యాటకుల రాకపోకలను నిలిపివేస్తుంటారు. ● పెద్దపులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్ల డేటాటేస్తో పాటు పులుల చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు. ● మగ, ఆడ పులులను వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు. ● పులులను గుర్తించాక, వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు. ● ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు. ● మనుషుల వేలిముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతి పులికి ప్రత్యేకంగా ఉంటుంది. 2024–25తో పోల్చితే ఆరు అధికం గణనీయంగా పెరిగిన ఆడ పులుల సంతతి సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా ముగిసింది. ఏటీఆర్లో మొత్తం 42 పులులు నమోదయ్యాయి. ఇక్కడ పులుల సంతానోత్పత్తి ఏటేటా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని ఇది సూచిస్తోంది. అటవీ అధికారులు, ఫ్రంట్లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఏటీఆర్లో పులుల సంరక్షణ, శాసీ్త్రయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఏటీఆర్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పులులకు ఆహారంగా శాఖాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు గాను అటవీ ప్రాంతంలో 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ పంపుసెట్లతో నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అక్రమ చొరబాట్లను నియంత్రించడం, వన్యప్రాణుల కదలికలపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. దీంతో చుక్కల దుప్పులు, సాంబర్, నీల్గాయి, జింకల సంఖ్య పెరిగింది. అడవిలో శాఖాహార జంతువులు పెరగడం.. పులులకు సరిపడా ఆహారం లభిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 180 చిరుతలు, 42 పెద్ద పులులు, 300 ఎలుగుబండ్లు, 12 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. -
మత్తుకు బానిసైతే భవిష్యత్ అంధకారం
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మత్తుకు బానిసైతే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు భవిష్యత్ దెబ్బతింటుందని తెలిపారు. డ్రగ్స్ విక్రయించడం, కొనుగోలు చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ నాటిక ప్రదర్శించారు. నాటికలో మాదక ద్రవ్యాలతో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దివ్యతేజ, మహాలక్ష్మి, ఏఓ బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బతుకు.. భారం!
ఉమ్మడి జిల్లాలో 73 మంది టీసీసీఓల ఉద్వాసన ● తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ● గ్రూప్–3, 4 ఉద్యోగుల చేరికలు, జీపీఓల నియామకంతోనే.. ● నడి వయసులో ఉద్యోగ వెతలు –8లో u●ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లు కొందరి వార్షిక రెన్యూవల్స్ను నిలిపివేశాం. ఇప్పటికే.. ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో రెగ్యూలర్ టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లను నియమించినందుకు వీరి అవసరం లేదని ప్రభుత్వం తొలగించినట్లుంది. – భానుప్రకాష్, ఏఓ, వనపర్తి కలెక్టరేట్ వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా టీసీసీఓ(టైపీస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)ల తొలగింపుతో వందలాది కుటుంబాల్లో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని సైతం తొలగించడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 73 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ.. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా వీరు సేవలందిస్తుండేవారు. ధరణి ప్రవేశపెట్టి భూ రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయాల్లో చేయడం ప్రారంభించాగా కొత్తగా రిజిస్ట్రేషన్ విభాగంలో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నారు. ఇటీవల గ్రూప్– 3 ,4 ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి నలుగురి కంటే ఎక్కువ మంది టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు వచ్చారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖలకు పంపించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జీపీఓలుగా తిరిగి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, స్థానిక, ఇతర ధ్రువపత్రాలు, రిపోర్టులు తయారు చేసేందుకు సరిపడా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారి ఆవశ్యత అవసరం లేదని భావించిన ప్రభుత్వం వారిని మార్చి 31 తర్వాత పునరుద్ధరించవద్దని ఆదేశాలిచ్చింది. మూడు నెలలు శ్రమ దోపిడీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 73 మందిని తొలగించే ఆలోచనతో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఏ ఉద్దేశంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఇటీవల తాత్కాలికంగా సేవలు అవసరం లేదన్నట్లుగా టర్మినేట్ ఉత్తర్వులు జారీ చేసి ఆయా తహసీల్దార్లతో అందజేయించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు చేసిన పనికి ఎవరు డబ్బులు ఇస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. పెండింగ్లో ఏడు నెలల వేతనాలు.. ఉమ్మడి జిల్లాలో టీసీసీఓల విధుల పునరుద్ధరణను నిలిపివేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఏడునెలల వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కోసమో తమను బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీసీఎల్ఏ ఉత్తర్వుల మేరకు టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 73 మంది టీసీసీఓలను మార్చి 31 తర్వాత రెన్యువర్ నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2026, మార్చి 31న జారీ చేసినట్లు వెలువరించడం శోచనీయం. -
పల్స్ పోలియో విజయవంతం చేయాలి
వనపర్తి: తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆదివారం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన పల్స్పోలియో ర్యాలీని అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో చాలా ఏళ్ల క్రితమే పోలియో నిర్మూలన అయినప్పటికీ, పొరుగు దేశాల నుంచి వచ్చే వలసదారులతో మళ్లీ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ప్రభుత్వం ముందస్తుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, దీంతో ఎలాంటి హాని ఉండదని వివరించారు. జిల్లాలో గుర్తించిన 46,150 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 343 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 1,300 మంది వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్రెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
గుడిమాన్ కుంటను దున్నేశారంటూ ఫిర్యాదు
అమరచింత:మండలంలోని కొంకన్వానిపల్లి గ్రామంలో ఉన్న గుడిమాన్ కుంట కట్టతో పాటు కుంటను రైతులు ధ్వంసం చేశారంటూ ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం తమదేనని.. తప్పుడు కేసు ఎలా పెడతారంటూ రైతులు అంకె వెంకటన్న, దండు శ్రీను, అంకె శ్రీను ఏఈ ఆంజనేయులు, వర్క్ ఇన్స్పెక్టర్ దామోదర్తో పోలీస్స్టేషన్ ఆవరణలోనే వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. కొంకన్వానిపల్లికి చెందిన ముగ్గురు రైతులు గుడి మాన్ కుంటను అక్రమించుకునే యత్నం చేస్తూ కుంట కట్టను జేసీబీతో ధ్వంసం చేశారని ఏఈ తెలిపారు. కుంట పరిధిలో 18 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇది తమ రికార్డులో ఏళ్ల తరబడి ఉండటంతో వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న సమక్షంలో ఈ వ్యవహారం మూడు రోజుల కిందట తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కుంటను ధ్వంసం చేయడ మే కాకుండా తమపై పరుష పదజాలంతో దూషించడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్కు వెల్లి జరిగిన విషయాన్ని వెల్లడించామన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ స్వాతి మాట్లాడుతూ.. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్స్టేషన్లోనే ఇరిగేషన్ అధికారులతో రైతుల వాగ్వాదం -
దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి
కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యార్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవ వేడుకలను గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి సత్కరించారు. అంతకుముందు ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ పాల్గొన్నారు. -
అల్విదా..
● కనులపండువగా ఇమామే హుస్సేన్ సవారీ ● వేలాదిగా తరలివచ్చిన జనం అమరచింత: మొహర్రం సందర్భంగా 10 రోజుల పాటు పీర్ల చావిడీల్లో కొలువుదీరిన ఆలంలను శనివారం నిమజ్జనానికి తరలించారు. అమరచింతలో ఇమామే హుస్సేన్ ఆలం సవారీ శుక్ర, శనివారం కొనసాగాయి. శుక్రవారం రాత్రి ఇమామే హుస్సేన్ సవారీకి వేలాదిమంది దివిటీలను చేతబట్టి ఆలంకు వెలుతురునిస్తూ తమ మొక్కులు తీర్చుకోగా.. శుక్రవారం చివరిరోజు ఇమామే హుస్సేన్ ఆలం నిమజ్జనోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో పట్టణ ప్రధాన రహదారులన్ని జనంతో కిక్కిరిసిపోగా ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే.. పట్టణంలోని పెద్దపీర్ల మసీదులో కొలువుదీరిన ఇమామే హుస్సేన్ ఆలంను శుక్రవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలంకు చాదర్, పూలమాల సమర్పించారు. నాయకులు ఎస్ఎ రాజు, నర్సింహులుగౌడ్, నాగభూషణంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ● ఇమామే ఉస్సేన్ ఆలంను శుక్రవారం కాంగ్రెస్పార్టీ నాయకులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధఅరుణ్ పూలమాలలు, చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్ల నిమజ్జనోత్సవానికి కులమతాలకు అతీతంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆలంలను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా జరిగే ఇమామే హుస్సేన్ ఆలం సవారీకి ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటకలోని రాయచూర్ నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. -
షట్టర్ల బిగింపు సంతోషకరం..
భూత్పూర్ ప్రధాన ఎడమ కాల్వకు షట్టర్లను బిగించడం చాలా సంతోషంగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని తూముల ద్వారా ఎవరికి ఎంతమేర అవసరమో అంతేస్థాయిలో పొందే అవకాశం ఉంది. చివరిన ఉన్న అమరచింత పెద్ద చెరువు సైతం త్వరగా నీటితో నిండే వీలుంది. – వాటర్ వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత నీటి వృథాను అరికట్టేందుకే.. రైతులకు పంటల సాగుకు సరిపడా సాగునీరు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నీటి వృథాను అరికట్టేందుకుగాను రూ.20 లక్షలు మంజూరు చేయడంతో డి–1 నుంచి డి–25 వరకు ఉన్న తూములకు షట్టర్లను బిగించాం. ఇకపై రైతులు తమకు సరిపడా నీటిని మళ్లించుకొని తిరిగి తూములను మూసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – బాలకృష్ణ, ఏఈ, భీమా ఎత్తిపోతల -
3 మోటార్లతోనే అద్భుతం
● గత సీజన్లో 50.72 టీఎంసీలు.. ఈసారి 43.5 టీఎంసీల నీటి ఎత్తిపోత ● 2016 నుంచి భారీగాపెరిగిన పంపింగ్ భారం పడుతున్నా తగ్గేదేలే.. రికార్డు స్థాయిలో కేఎల్ఐ నీటి పంపింగ్ కొల్లాపూర్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి కూడా నీటి పంపింగ్ పెద్దమొత్తంలో జరిగింది. గత సీజన్లో 50.72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రికార్డు సృష్టించగా.. ఈసారి మాత్రం వేర్వేరు కారణాలతో 43.5 టీఎంసీలను ఎత్తిపోశారు. కానీ ఇది కూడా ప్రాజెక్టు స్థాయికి మించిన ఎత్తిపోతలే. సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఎంజీకేఎల్ఐ మీదనే ఆధారపడటం.. ప్రాజెక్టులోని మూడు మోటార్లతోనే ఈస్థాయి ఎత్తిపోతలు జరగడం అద్భుతమని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ స్కీంకు కూడా కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారానే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు రోజువారీగా ఎత్తిపోస్తున్నాం.. వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్హౌజ్లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాల మూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గుతుంది. 2024 –25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్నాయక్, డీఈఈ ఒక్కో మోటారుతో 800 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పరిధిలో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం కాగా.. 1 మోటార్ స్పేర్లో ఉంచుతారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. -
సాగునీటి వృథాకు అడ్డుకట్ట
●అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ నుంచి అమరచింత పెద్ద చెరువుతో పాటు ఆత్మకూర్, మదనాపురం మండలాలకు సాగునీరు అందించే ప్రధాన ఎడమ కాల్వ డి–1 నుంచి డి–25 వరకు షట్టర్లను బిగించారు. దీంతో ఈసారి వానాకాలంలో కాల్వ ద్వార పారుతున్న సాగునీరు ఎక్కడా వృథా కాకుండా నేరుగా ఆయకట్టుతో పాటు అనుబంధ చెరువులను నింపేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరు వృథా కావడంతో చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు వరకు పారక ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అదేవిధంగా కాల్వలో ముళ్లపొదలు, పూడిక పేరుకుపోవడంతో ఎగువ నుంచి వచ్చే నీరు దిగువకు పారక కాల్వకు గండ్లు పడేవని ఆయకట్టు రైతులు తెలిపారు. ఏటా చివరన ఉన్న గ్రామాల రైతులు నీటికోసం కాల్వలో పొక్లెయిన్ సాయంతో ముళ్ల పొదలు తొలగించే వారు. ఈసారి తూముల వద్ద కొత్తగా షట్టర్లను బిగించడంతో చివరి ఆయకట్టు వరకు సకాలంలో నీరు చేరి సాగుకు ఉపయోగపడుతాయని అధికారులు అంటున్నారు. డి–1 నుంచి డి–25 వరకు.. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి అమరచింత పెద్ద చెరువు వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడవున 42 గ్రామాలకు సాగునీరు అందించే విధంగా కాల్వ నిర్మించారు. కాల్వ వెంట నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా రూ.20 లక్షలతో డి–1 నుంచి డి–25 వరకు ఉన్న తూములకు 25 చోట్ల షట్టర్లను బిగించారు. వర్షాకాలం, చలికాలంలో సైతం కాల్వ వెంట నీరు వృథాగా పారుతుండటంతో ఈసారి వేసవిలోనే షట్టర్ల ఏర్పాటు పనులు పూర్తి చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. భూత్పూర్ ప్రధాన ఎడమకాల్వకు షట్టర్ల బిగింపు రూ.20 లక్షలతో పూర్తయిన పనులు 32 కిలోమీటర్ల ప్రవాహం.. 32 వేల ఎకరాల ఆయకట్టు 32 వేల ఎకరాలకు సాగునీరు.. 32 కిలోమీటర్ల పొడవున్న భూత్పూర్ రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా 32 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ మండలంలోని 4 గ్రామాలు, నర్వలోని 14, అమరచింతలోని 12, ఆత్మకూర్లోని 7, మదనాపురం మండలంలోని రెండు, చిన్నచింతకుంట మండలంలోని ఒక గ్రామానికి సాగునీరు అందిస్తున్నారు. 12 ఏళ్లుగా సాగునీటిని పొందుతున్న ఆయకట్టు రైతులు నేరుగా తమ గ్రామాల చెరువులను నీటితో నింపుతూ పంటలు పండించుకుంటున్నారు. మరికొందరు నేరుగాా పిల్ల కాల్వలు తవ్వి వాటి ద్వారా సాగునీటిని మళ్లించుకొని వ్యవసాయం చేస్తున్నారు. -
గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట
వనపర్తి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తోంది కేవలం కాంగ్రెస్పార్టీయేనని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఆశీర్వాదం స్వర్ణోత్సవ వేడుకల బస్సుయాత్ర సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 1976లోనే గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పించడంతో గిరిజన కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని గిరిజనులు ఉండే ప్రతి ఆవాస ప్రాంతంలో సేవాలాల్ ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా రాయితీపై అనేక పథకాలను గిరిజనులకు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. శనివారం జిల్లాకేంద్రానికి ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవ వేడుకల బస్సు యాత్ర వస్తుందని.. పెద్దఎత్తున గిరిజన సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజన నాయకులతో కలిసి బస్సుయాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. నేడు పల్స్పోలియో అవగాహన ర్యాలీ వనపర్తి విద్యావిభాగం: పల్స్ పోలి యో–2026పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం 8 గంటలకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, శాట్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్మన్, డీఎంహెచ్వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొననున్నారని చెప్పారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని.. ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
3.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా..
ఎంజీకేఎల్ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట డిజైన్లు రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించేలా డిజైన్లు చేశారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, మహిమూద్, జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రాఘవేంద్ర, కౌన్సిలర్ డీసీ మాధవి, పాంరెడ్డిపల్లి ఉపసర్పంచ్ వెన్నెల, చంటి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ఎకై ్సజ్ డీసీగా విజయ్భాస్కర్రెడ్డి
● వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్కు కొత్త ఈఎస్లు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కారీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్భాస్కర్రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్గా డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. నాగర్కర్నూల్ ఈఎస్గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్కర్నూల్ ఈఎస్గా వి.వేణుగోపాల్రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చారు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్గా ఉన్న పి.కరమ్చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్గా వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏఈఎస్గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్గా వెళ్లారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ మాగనూర్: మండలంలోని గురువాలింగంపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్న వినోద్కుమార్ను గురువారం సస్పెండ్ చేసినట్లు ఎంఈఓ గణేష్సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినోద్కుమార్ నారాయణపేటకు చెందిన సింధు అనే యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో ఆమె ఏప్రిల్ 21న బలవన్మరణానికి పాల్పడిందని.. సదరు యువతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు కావడంతో పాటు 48 గంటలు జ్యుడీషీయల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. దీంతో జిల్లా విద్యాధికారి గోవిందరా జు ఆదేశాల మేరకు వినోద్కుమార్ను గురువా రం సస్పెండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
క్రేజీబీవీలు..
ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ఆరోతరగతిలో ప్రవేశానికి.. జిల్లావ్యాప్తంగా ఉన్న 15 కేజీబీవీల్లో ఆరోతరగతిలో చేరేందుకు 600 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు 827 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్ఓలు వెల్లడిస్తున్నారు. దరఖాస్తునకు నెలాఖరు వరకు గడువు ఉండగా.. తల్లిదండ్రులు లేని పిల్లలు, వలస కార్మికుల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సర్కారు బడుల్లో బోధన సరిగా అందడం లేదని భావిస్తున్న గ్రామీణ ప్రజలు కేజీబీవీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడువు ముగిసే సమయానికి 1,200 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు నివేదిస్తూ తుది నిర్ణయం వారిపైనే వదిలేస్తున్నారు. ఇంటర్మీడియట్లోనూ.. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్లో తమకు నచ్చిన కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమం ఉండగా.. మరికొన్ని కేజీబీవీల్లో తెలుగు మీడియం కొనసాగుతున్నాయి. విద్యార్థినులు అధికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు వృత్తివిద్య కోర్సు సీఈజీలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఆయా కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఇప్పటి వరకు 923 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అమరచింత: జిల్లావ్యాప్తంగా 15 కేజీబీవీలు.. మూడు వేల సీట్లు ఉంటే ప్రస్తుతం 3,730 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారంటే ప్రవేశాలకు ఎంత మేర ఆసక్తి కనబరుస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన, వసతుల కల్పన, పౌష్టికాహారం అందుతుండటంతో విద్యార్థినులు చక్కగా చదువుకుంటూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న బాలి కలకు ఇంటర్ విద్యను అభ్యసించే సదుపాయం కూడా ఆయా కేజీబీవీల్లో అందుబాటులో ఉంది. 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థినులు ఇంటర్ విద్య పూర్తి చేసుకొని బయటకు వచ్చే అవకాశం ఉండటం.. తల్లిదండ్రులు కూ డా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కేజీబీవీలకు మునుపెన్నడూ లేనంతగా డిమాండ్ పెరిగింది. ‘ఒకప్పుడు అధ్యాపకులతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ కేజీబీవీల్లో చేర్చాలంటూ విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రవేశాలకు ప్రయత్నించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ప్రవేశాలకు ఆసక్తి చూపుతుండటంతో దరఖాస్తుల సంఖ్య ఆశించిన దానికన్న అధికంగా వస్తుండటమే ఇందుకు నిదర్శనం.’ జిల్లాలో 15 పాఠశాలలు.. 3,730 మంది విద్యార్థులు అధిక ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాలే కారణం ఆరోతరగతిలో ప్రవేశాలకు 827 దరఖాస్తులు -
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జరిగిన ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. రాజీవ్ కూడలిలో మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు దూరం ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ ఫొటో పాయింట్, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. వారం రోజులుగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని, ఒకసారి వ్యసనానికి బానిసైతే జీవిత లక్ష్యాలు, విలువలు, కుటుంబ బంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ’నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని విజయవంతం చేయగలమన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని.. స మాజం మొత్తం ఒక్కటిగా ముందుకొస్తేనే డ్రగ్స్ రహిత, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించగలమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, డీఐఈఓ నరేందర్కుమార్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీఐ రత్నం, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, షీటీం నార్కోటిక్ ఎస్ఐ అంజద్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, జి ల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సూపరింటెండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు, వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాప కులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సర్.. విజయవంతం కావాలి
● ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందించడంతో పాటు ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం వనపర్తి పుర పరిధిలోని ఆర్టీసీ కాలనీ, పెబ్బేరులోని రెండోవార్డులో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్వోలు అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 1లోపు జిల్లాలో ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారాల పంపిణీ సమయంలో ఓటర్లకు వాటిని పూరించే విధానాన్ని కూడా వివరించాలన్నారు. అలాగే ఫారాల సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, బూత్స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, పెబ్బేరు మార్కెట్యార్డ్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, తహసీల్దార్లు రమేష్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో.. కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కృష్ణాబేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ రివర్స్ పంపింగ్ విధానం.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనేప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక రూ.6 వేల కోట్లతో.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి. త్వరలోనే డీపీఆర్.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు అసవరమైన సర్వే పనులు పూర్తిచేశాం. ఇందుకోసం రూ.16 లక్షలు నిధులు విడుదలయ్యాయి. ప్రస్తుతం డీపీఆర్ను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ -
కాంగ్రెస్తోనే పేదల కల సాకారం : ఎమ్మెల్యే
వనపర్తి రూరల్: కాంగ్రెస్పార్టీ ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం రాంపురం గ్రామంలో జరిగిన 10 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ఆయన హాజరై కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన జములమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను చాటుతాయన్నారు. అనంతరం పెబ్బేరు 12 వార్డులో రూ.7.50 లక్షలు ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన చిన్న పీర్ల చావిడిని పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. పీర్ల పండుగతో పాటు స్థానిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చావిడి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ సుమిత్ర, కౌన్సిలర్ సౌజన్య, కౌన్సిలర్లు జములమ్మ, పర్వీన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు దయాకర్రెడ్డి, రాంరెడ్డి, నాయకులు సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, రామన్గౌడ్, షకీల్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్వోలకు సహకరించాలి.. కొత్తకోట రూరల్: అర్హులైన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా పూరించి బీఎల్వోలకు అందజేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో బీఎల్వో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయగా స్వీకరించి మాట్లాడారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల పాత్ర కీలకం
వనపర్తి: నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి వైద్య విద్యార్థి ఒక చైతన్య దూతగా ముందుకు రావాలని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి వైద్య విద్యార్థులకు డ్రగ్స్తో కలిగే అనర్థాలు, నివారణలో యువత, వైద్యుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య విద్యార్థులు ‘మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం.. ఇతరులను కూడా దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాం‘ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ ఫొటో పాయింట్ వద్ద ఎస్పీ, అదనపు ఎస్పీ, అధ్యాపకులు, విద్యార్థులు సందేశాత్మక ఫొటోలు దిగడంతో పాటు యాంటీ డ్రగ్స్ సంతకాల కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని, గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిస కాకుండా వైద్య విద్యను పూర్తిచేసి నైపుణ్యం కలిగిన వైద్యులుగా ఎదగాలని కోరారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అతడి ఆశయాలు, కుటుంబం, భవిష్యత్ను నాశనం చేస్తాయని తెలిపారు. మంచి వైద్యుడు వ్యాధులను మాత్రమే కాదు.. సమాజంలోని చెడు వ్యసనాలను కూడా నిర్మూలించే దిశగా పని చేయాలన్నారు. విద్య కేవలం డిగ్రీ కోసమే కాదు.. సమాజ ఆరోగ్యాన్ని కాపాడే మహత్తర బాధ్యత కోసం అన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, వైద్య కళాశాల ఆర్గనైజర్ డా. హరికృష్ణ, సీఐ రత్నం, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, నార్కోటిక్ ఎస్ఐ అంజద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కొత్తకో రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెద్దమందడిలోని బీసీ బాలుర సంక్షేమ వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇటీవల చేపట్టిన మరమ్మతులను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, వసతిగృహ నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వంటశాలను పరిశీలించి వంట గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్కు ప్రహరీ నిర్మాణం అవసరమని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ భవనాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలకు అవసరమైన ఇతర మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పెద్దమందడిలో చేపట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ పరిశీలించి, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన.. మండలకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు సుజాత షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న గృహాన్ని సందర్శించి నిర్మాణ వ్యయం, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తక్కువ వ్యయంతో వేగంగా నిర్మాణం చేపట్టేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సాంకేతికతను మరింత మంది లబ్ధిదారులకు చేరవేసి ప్రోత్సహించాలని ఎంపీడీఓను ఆదేశించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో షేర్వాల్ టెక్నాలజీకి అవసరమైన అల్యూమినియం మెటీరియల్ను కొనుగోలు చేసి జిల్లాలో ఈ నిర్మాణ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు. మరో ఇద్దరు లబ్ధిదారులు నాగమ్మ, కృష్ణయ్య ఇళ్లను సందర్శించి నిర్మాణ వ్యయం గురించి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులున్న లబ్ధిదారులను గుర్తించి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ విఠోభా, తహసీల్దార్ మల్లికార్జున, ఎంపీడీఓ పరిణత, ఎంఈఓ మంజులత, సర్పంచ్ నాగమ్మ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళిక
వనపర్తి: జిల్లాకేంద్రంలో వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం, ప్రజలకు సులభమైన రాకపోకలు కల్పించడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆయన డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్తో కలిసి అంబేడ్కర్ చౌరస్తా, ఓల్డ్ యూకోబ్యాంక్ టర్నింగ్, గాంధీచౌక్, పాలిటెక్నిక్ కూడలి తదితర రద్దీ ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ సమస్యలకు కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల విస్తరణ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణలో అవసరమైన మార్పులు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, ట్రాఫిక్ సిబ్బంది వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా రహదారి నియమాలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ విధిగా ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొన్నారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, రాంగ్ రూట్లో ప్రయాణించకూడదని సూచించారు. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన ఉపాధ్యాయ/అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి విద్యుల్లత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర పాఠశాలలు/ కళాశాలలో జేఎల్ రసాయన శాస్త్రం–1, టీజీటీ హిందీ–2, టీజీటీ గణితం–1, పీజీటీ బయోసైన్న్స్–1, టీజీటీ బయోసైన్న్స్–1, పీజీటీ ఫిజికల్ సైన్న్స–1, టీజీటీ ఫిజికల్ సైన్స్–1, సోషల్ స్టడీస్–1.. అలాగే బాలికల పాఠశాలలు/కళాశాలలో పీజీటీ ఇంగ్లీష్–1, డిగ్రీ కళాశాలలో ఆంగ్లం–2, జంతుశాస్త్రం–1, రసాయన శాస్త్రం–1, మైక్రో బయోలజీ–1, కంప్యూటర్ సైన్న్స్–2, కామర్స్–1 ఖాళీలున్నాయని పేర్కొన్నారు. బాలికల పాఠశాల/ కళాశాలలో బోధించుటకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 27వ తేదీలోగా జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరంలో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్, జిరాక్స్ విద్యార్హత ధ్రువపత్రాలతో డెమోకు హాజరుకావాలని సూచించారు. పీజీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్సైట్ను చూడాలని కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు. -
ఎస్పీని కలిసిన డీటీఓ
వనపర్తి: జిల్లా రవాణా అధికారి (డీటీఓ) సురేష్కుమార్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణరక్షణే పోలీసు, రవాణాశాఖల ప్రధాన బాధ్యతన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని.. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండటం, అధిక వేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై నిరంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలుగుతామని తెలిపారు. -
దరఖాస్తు చేసుకోవచ్చు..
ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6తోపాటు డిక్లరేషన్ ఫారం కూడా స్వీకరిస్తారు. ఓటర్లు స్వయంగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించే అవకాశం ఉంది. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ ● -
సర్.. వస్తున్నారు!
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ఉమ్మడి జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ఇలా.. జిల్లా 2025లో ఓటరు మ్యాపింగ్ మ్యాప్ చేయని తప్పులు/అక్రమాలు మొత్తం ఓటర్లు ఓటర్లు ఉన్న ఓటర్లు మహబూబ్నగర్ 7,32,488 5,65,466 1,67,022 2,36,691 నాగర్కర్నూల్ 7,31,632 5,79,632 1,52,000 2,38,506 వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926 జో. గద్వాల 5,03,859 4,00,793 1,03,066 1,55,659 నారాయణపేట 4,95,574 4,23,725 71,849 1,87,277 అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్ల ను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు. -
‘భవిష్యత్ తరాలపై నిర్లక్ష్య ధోరణి తగదు’
వనపర్తి: భవిష్యత్ తరాలపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్ కంటే మూడురెట్లు ఎక్కువగా ఉన్నత విద్య పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నా.. ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు, ఆలయాలు, గోపురాలు కట్టడం తప్పా.. గడిచిన దశాబ్ద కాలంలో విద్యాభివృద్ధికి చేసిన ఒక్క ఉన్నత నిర్ణయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యావ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలపై విద్యార్థులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని.. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల కష్టాన్ని వృథా చేయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు, నాణ్యమైన విద్యవంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నీట్ రద్దు.. రీ–నీట్ నిర్వహణపై ఇప్పటికే పార్టీలకు అతీతంగా విద్యార్థులు దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో భవిష్యత్ తరాల కోసం కృషి చేసిన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ అని.. ఆయన పాలనలో ఎన్నో ఉన్నత విద్యాలయాలు, యూనివర్సిటీలు నెలకొల్పారన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు భారత్లోని ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్నవారేనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక విద్య అవసరమని ముఽఖ్యమంత్రి ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ స్కూల్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అనంతరం పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్ధేశ్వర్తో కలిసి బీఎల్ఓ–2లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్పై అవగాహన కల్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డి, తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, నాయకులు బి.కృష్ణ, ధనలక్ష్మి, సుఖేందర్రెడ్డి, వాల్యానాయక్, శరవంద, పాండుసాగర్, నందిమళ్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
భూమి డబ్బులు వచ్చాయి..
గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో నా భూమి 2.03 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పరిహారం చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. ఇటీవల రూ.26 లక్షలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. సంతోషంగా ఉంది. మాకు పరిహారం డబ్బులు త్వరగా అందడంతో మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. – బైని కొండయ్య, రైతు, ఖిల్లాఘనపురం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మొదట పరిహారం సకాలంలో అందకపోవడంతో తరుచూ పనులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఒకసారి 18 ఎకరాలకు, ఇటీవల 388 ఎకరాలకు రూ.44 కోట్లు విడుదల చేసింది. మొత్తం 647 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 406 ఎకరాలకు పరిహారం అందింది. మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నా రు. ఆయా భూముల సర్వే కొనసాగుతోంది. ఇక నుంచి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – నరేందర్రెడ్డి, డీఈ, నీటిపారుదలశాఖ -
విత్తనమేళాను సద్వినియోగం చేసుకోవాలి
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మదనాపురం: వానాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు నేరుగా రైతులకే అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విత్తనమేళాలు నిర్వహిస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేధికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనమేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలను ఒకేచోట అందుబాటులో ఉంచాలనే ఉద్ధేశంతోనే విత్తనమేళాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆమోదించిన 7 రకాల సన్నరకం వరి విత్తనాలను రైతులకు అందజేశారు. వరితో పాటు ఉద్యాన పంటల సాగుపైనా రైతులు దృష్టి సారించాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి పంపిస్తే ఇంటి పన్ను చెల్లిస్తా
నవాబుపేట: ప్రభుత్వ బడికి తమ పిల్లను పంపిస్తే వారి ఇంటి పన్నును పూర్తిగా తానే భరిస్తానని సర్పంచ్ రవీందర్ ప్రకటించారు. బుధవారంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ బడికి మరింత చేయూతనిచ్చి బడిని అభివృద్ధి చేద్దామని ఆయన వివరించారు. అందుకు ప్రైవేట్ పాఠశాలకు గ్రామంలో 55మంది పిల్లలు వెళ్తున్నారని.. వారి తలిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడికి పిల్లలను పంపిస్తే వారికి చెందిన ఇంటి పన్నులు 5ఏళ్లపాటు తానే భరిస్తానని ప్రకటించారు. దీంతో సర్పంచ్ ప్రకటించిన పన్నుల చెల్లింపు పథకంపై గ్రామంలో విశేషస్పందన వచ్చి వెంటనే 16మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. అలాగే మిగతా కూడా రెండు రోజుల్లో ప్రభుత్వ పడిలో చేరుతారని వివరించారు. కాగా మన ఊరు–మన బడి కార్యక్రమాల్లో రుద్రారం సర్పంచ్ తీసుకున్న పన్నుల పథకం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ నాగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో పనులు పూర్తి చేయిస్తాం
అనేక కారణాల వల్ల ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, బెంచీలు ఏర్పాటు చేయాలి. అలుగును కాంక్రీట్ చేయాలి. ఫీడర్ చానల్ను అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం. – నాగరాజు, ఇరిగేషన్ డీఈ సగం కూడా పూర్తికాలే.. ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లవుతోంది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు చొరువ తీసుకొని పనుల్లో వేగం పెంచాలి. – జగన్నాథరెడ్డి, అయిజ ఆధునిక హంగులతో నిర్మించాలి మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడడంతో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ వంటివి సమకూర్చితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేసుకునే అవకాశం ఉంటుంది. – గోవిందు, అయిజ ● -
ధాన్యం లారీ పట్టివేత
పాన్గల్: పాత ధాన్యం తరలిస్తున్నారనే అనుమానంపై ధాన్యం లారీని పోలీసులు సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కార్తీక్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్రెడ్డి తన మీనాక్షి రైస్ మిల్లులో సీజ్ చేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున ఎస్ఐ కుర్మయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బీపీ ప్రసాద్తో కలిసి మిల్లుకు వెళ్లి ధాన్యం లోడ్తో ఉన్న లారీని సీజ్ చేశారు. అనంతరం లారీలో లోడ్ చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల టెక్నికల్ అధికారులు నిర్ధారణ కోసం శాంపిల్ తీసుకెళ్లారని, నిర్ధారణ చేసిన తర్వాత లారీల్ లోడ్ చేసిన ధాన్యం పాతదా, కొత్తదా అనే విషయాలు తెలుస్తాయన్నారు. తాను పండించిన ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు ఇచ్చిన టోకెన్ ఆధారంగా విక్రయించేందుకు తీసుకెళ్తుంటే అధికారులు సీజ్ చేశారని ఓ రైతు పేర్కొన్నాడు. -
పాలమూరుకు కబడ్డీ అకాడమీ
● రూ.22.87 లక్షల నిధులు మంజూరు ● మెయిన్ స్టేడియంలో ఏర్పాటుకు చర్యలు ● 20 మంది బాలుర చేరికకు అవకాశం మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరుకు మరో క్రీడా అకాడమీ మంజూరైంది. నగరంలోని మెయిన్ స్టేడియంలో బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటు కానుంది. ఇప్పటికే మెయిన్ స్టేడియంలో బాల, బాలికల వాలీబాల్ అకాడమీ కొనసాగుతుండగా.. ఇప్పుడు అండర్–16 బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2026– 27 విద్యాసంవత్సరంలో అకాడమీ ప్రారంభించాలని క్రీడాప్రాధికార సంస్థ శాట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే రాష్ట్రంలోనే మొదటి కబడ్డీ అకాడమీ మహబూబ్నగర్లో ఏర్పాటు అవుతుండడం విశేషం. అదనపు విభాగంగా.. డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేయనున్నారు. కబడ్డీ అకాడమీలో 20 మంది బాలురకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీ కోసం రూ.22,87,680 నిధులు మంజూరు చేశారు. కబడ్డీ అకాడమీల 2026– 27 ప్రవేశాల కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులతోపాటు షూస్లు, మంచి పౌష్టికాహారం అందించడంతోపాటు వారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో చదువుకునేలా అవకాశం కల్పిస్తారు. మెరుగైన క్రీడా శిక్షణ కబడ్డీ అకాడమీకి ఎంపికయ్యే క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. అకాడమీలో ప్రత్యేక శిక్షణ కోసం కబడ్డీ మ్యాట్లు ఏర్పాటు చేసి నిష్ణాతులైన కోచ్ల ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ అందనుంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. ప్రతి ఏడాది క్రీడాకారులకు సబ్ జూనియర్, జూనియర్, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. మెయిన్ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు అవుతుండడంపై సీనియర్ క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. -
త్వరలో రాష్ట్రస్థాయి ఎంపికలు
మెయిన్ స్టేడియంలో క బడ్డీ అకాడమీ ఏర్పా టు కానుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు కబడ్డీ అకా డమీలో బాలుర ప్రవేశాల కోసం త్వరలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచి మెరిట్ సాధించిన క్రీడాకారులకు అకాడమీలో ప్రవేశాలు కల్పిస్తాం. – రాజశేఖర్రెడ్డి, డీవైఎస్ఓ సంతోషంగా ఉంది.. ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్నగర్ కబడ్డీ అకాడమీ ఏర్పాటు కావాలన్న కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవతోనే పాలమూరుకు కబడ్డీ అకాడమీ మంజూరైంది. అకాడమీ ఏర్పాటుతో నైపుణ్యంగల కబడ్డీ క్రీడాకారులను వెలికితీయవచ్చు. – కురుమూర్తిగౌడ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ సంఘం, మహబూబ్నగర్ ● -
గండేడ్ కేజీబీవీ ఎస్ఓకు షోకాజ్ నోటీస్
● విధులకు గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం ● నోటీసులు జారీ చేయాలని డీఈఓకు ఆదేశాలు గండేడ్: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఖుష్భూగుప్తా షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా కేజీబీవీకి చేరుకున్న కలెక్టర్ హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఎస్ఓ శివలీల పాఠశాలకు రాలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు పొందలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విధులకు సకాలంలో హాజరవ్వాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని తేల్చిచెప్పారు. కొందరు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా వరండాలో ఉండడంతో గమనించిన కలెక్టర్ తరగతులోకి వెళ్లాలని సూచించారు. వసతులను పరిశీలించారు. వంటగది, స్టోర్ రూంను పరిశీలించిన కలెక్టర్ అంసతృప్తి వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలు అందించడంపై ఆరా తీశారు. విద్యార్థినులకు అలాంటివి ఎలా పెడతారని సిబ్బంది, ఉపాధ్యాయులను ప్రశ్నిచారు. విద్యార్థినులకు ఇచ్చే పండ్లు గురువారం సరిపోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాభోదన, కల్పిస్తున్న సదుపాయాలపై ఆరాతీశారు. అలాగే కాంట్రాక్టర్తో మాట్లాడి కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ గండేడ్ మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న ఓపీ వివరాలను మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లికార్జున్రావు, ఎంఈఓ జనార్దన్ ఉన్నారు. -
కారు, బైక్ ఢీ: యువకుడు దుర్మరణం
మరికల్: కారు, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తీలేర్ స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల మేర కు మరికల్ మండలం రా కొండకు చెందిన భరత్ కుమార్రెడ్డి(32) బైక్పై మంగళవారం అర్ధ రాత్రి కన్మనూర్ నుంచి రాకొండకు బయలుదేరాడు. తీలేర్ స్టేజీ దగ్గరకు రాగానే హైదరాబాద్ నుంచి నారాయణపేటకు వెళ్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, కుమారుడు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. వివాహిత మృతిపై కేసు నమోదు ఎర్రవల్లి: వివాహిత మృతిపై కేసు నమోదైన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలోని చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని కొండేరు గ్రామానికి చెందిన బోయ నాగవేణి కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త ఈరన్న తో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం కృష్ణా: షార్ట్ సర్క్యూట్తో ఓ గుడిసె దగ్ధమై ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయ హన్మంతు రాత్రి భోజనం చేసి గుడిసెలో నిద్రపోయాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో గుడిసెకు నిప్పంటుకుంది. నిద్రిస్తున్న హన్మంతుకు ఇది వరకే పక్షపాతం రావడంతో ఆయన కదల్లేని పరిస్థితుల్లో మంటల్లోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వృద్ధుడిని ప్రాణాలతో కాపాడి మక్తల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గుడిసెలోని రూ.4.70 లక్షలతో పాటు 4 తులాల బంగారం, 18 తులాల వెండి, సామగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పాడైపె పెట్టే ముందు పసిగట్టారు తిమ్మాజిపేట: మృతదేహాన్ని పాడైపె పెట్టె ముందు ఒంటిపై గాయాలు గుర్తించి అంత్యక్రియలు ఆగిన ఘటన మండలం ఆవంచలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన అలివేల, యాదయ్య దంపతులు మంగళవారం మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఇంతలోనే యాదయ్య పడుకున్న చోటే చనిపోయాడని అంత్యక్రియలకు రావాలని అలివేల బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. బుధవారం మృతదేహానికి స్నానం చేయించి బట్టలు మారుస్తున్న సమయంలో మెడ, భుజంపైన గాయాలు ఉండడం గుర్తించిన మృతుడి అన్న కుమారుడు అనుమానం వ్యక్తం చేయడంతో అంత్యక్రియలు ఆగాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శ్రీనివాస్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పోలీసు విధులకు ఆటంకం.. కేసు నమోదు
తెలకపల్లి: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బాలశంకర్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు.. మండల కేంద్రంలో ఈ నెల 23 రాత్రి 9గంటల సమయంలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు బ్లూకోర్టు కానిస్టేబుల్ బాలకృష్ణ, శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని గొడవ పరిష్కరించారు. తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చే క్రమంలో గ్రామానికి చెందిన మోకురాల రాజేష్గౌడ్ అనే వ్యక్తి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతూ వారి విధులకు ఆటంకం కలిగించాడు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదు మేరకు రాజేష్గౌడ్పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం మహమ్మదాబాద్: మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతు కొమ్మూరి చిన్నయ్య(54) బుధవారం తెల్లవారు జామున రోడ్డుపై నడుచుకుంటూ పాత పెట్రోల్బంక్ సమీపంలోని సర్వీస్రోడ్డు వద్దకు రాగానే, వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన చిన్నయ్యను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని జింకలపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేశ్(24) గతవారం జాతీయ రహదారిపై ధర్మవరం స్టేజీలో జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కర్నూలు జిల్లాలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య రాజోళి: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోకారి తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఖలీల్(30)కు ఇటిక్యాల మండలం ఉదండాపురానికి చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఖలీల్ మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గత రెండేళ్ల క్రితం భార్య భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనస్థాపం చెందిన ఖలీల్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రఫి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పత్తికి బదులు సోయాబిన్
● తక్కువ పెట్టుబడి...ఎక్కువ లాభాలు ● యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి అలంపూర్: వానాకాలం పంట సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వానాకాలం పంట ప్రారంభం కావడంతో అధికారులు ఏ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చో అవగాహన క ల్పిస్తున్నారు. మూసపద్ధతికి స్వస్తి పలకాలని పంట మార్పిడి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలలకు పత్తి సాగుకు ప్రత్యామ్నాయంగా సోయాబిన్ పంటను సాగు చేసుకోవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. కందిలో సహాయ పంటగా, పండ్ల తోటలో అంతర్ పంటగాను సోయాబిన్ సాగు చేసుకోవచ్చని వివరించారు. పంట సాగు యాజమాన్య పద్ధతులతో పాటు అంశాలను వివరించారు. నేలలు: మురుగు నీరు పోయే వసతి ఉండి, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. రకాలు: జేఎస్–335, ఎల్ఎస్బీ–1, పీకే–472 ఇందులో జేఎస్ 335 రకం ప్రసిద్ది చెందింది. పంటకాలం: సోయాబిన్ పంట కాలం 100 నుంచి 110 రోజులు పంట వేసే పద్ధతి: సోయాను పత్తిలో, కందిలో అంతర్, మిశ్రమ పంటగా వేయవచ్చును. వానాకాలంలో సోయా సాగు తర్వత రబీలో శనగ, మినుములు వేసుకోవచ్చు. విత్తనం: విత్తనం ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరం. విత్తనాన్ని 45 ఇంటూ 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకు వరసలోని మొక్కల మధ్య 3 సెంటిమీటర్ల లోతులో మెత్తటి దుక్కిలో నాటు వేసుకోవాలి. విత్తే కాలం: జూన్ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తడానికి అనుకూలం కలుపు నివారణ: సోయాలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి 250 మి.లీ ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని కలుపును నివారించుకోవాలి. ఎరువులు: ఎకరానికి 25 కిలోల యూరియా, 150 కేజీల సూపర్, 25 కిలోల పోటాష్ అవసరం. విత్తేటప్పుడు ఫోరేట్ 10 జీ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడితే కాండపు ఈగలాంటి పురుగును నివారించుకోవచ్చు. పంట కోత: ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి, రాలిపోవడం మొదలైనప్పుడు లేదా కాయలు ఆకుపచ్చ నుంచి బూడిద రంగులోకి మారినప్పుడు కోయాలి. కోత ఆలస్యం అయితే కాయలు చిట్లి గింజలు రాలిపోతాయి. పంట కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆరనిచ్చి గింజలోని తేమ శాతం 14 వరకు చూసి నూర్పిడి చేయాలి. దిగుబడి: సోయా సాగుకు ఎకరానికి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. పాడి–పంట -
‘సర్’కు రాజకీయ పార్టీలు సహకరించాలి
రుణాలు మంజూరు చేయాలి ఉపాధి కల్పనకు దోహదపడే పీఎంఈజీపీ, విశ్వకర్మ పథకాలకు సంబంధించి అర్హులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన, పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్, తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్ బ్యాంకర్లు, దరఖాస్తుదారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంఈజీపీ పథకం కింద 28 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. 51 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 76 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. 105 దరఖాస్తులు తిరస్కరించినట్లు వెల్లడించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అధికారి శశికుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి కోరారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికీ పంపిణీ చేస్తారన్నారు. రాజకీయ పార్టీల తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఓటరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు కావడం చట్టరీత్యా నేరమని, అలాంటి నమోదులను గుర్తించి తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, సెప్టెంబర్ 28 వరకు వాటిని పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, కొత్తగొల్ల శంకర్ (టీడీపీ), ఎ.గట్టుయాదవ్ (బీఆర్ఎస్), ఎంఏ రహీం (ఏఐఎంఐఎం), పుట్టా ఆంజనేయులు (సీపీఐ(ఎం)), పి.తిరుపతయ్య (ఐఎన్సీ), శ్రీనివాస్గౌడ్ (బీజేపీ), ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2కే రన్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఓ హరికృష్ణ, డీఎస్పీ గిరిబాబు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపాలి
వనపర్తిటౌన్: రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం కాకుండా ప్రకృతి సాగుకు మొగ్గు చూపాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులతో కార్యశాల నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూజుల అనుజ్ఞారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. రసాయన వ్యవసాయంతో భూసారం క్షీణిస్తోందని, రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవామృతం, ఘన జీవామృతం తయారీ, సేంద్రియ ఎరువుల వినియోగం, నేల సారం పెంపు, పంటల దిగుబడి తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకాసి అరవింద్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు దాబా శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, రాష్ట్ర నాయకుడు వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్నగారి వెంకటేశ్వర రెడ్డి, కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, వారణాసి కల్పన, నాయకులు బండారు కుమారస్వామి, సుమిత్రమ్మ, తిరుమలేష్, మహేష్ ,26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ విజయ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ప్రసాద్ వర్ధంతి .. మాతృక భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జి బలిదాన్ దివస్ వర్ధంతి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు అధ్యక్షతన మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్రెడ్డి, రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకటేశ్వర్ రెడ్డి, కేతురి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గోర్ల బాబురావు పాల్గొన్నారు. -
‘మిగులు’తో సర్దుబాటు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్కర్నూల్ 0 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు.. ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
‘కో–ఆప్షన్’.. కలేనా..!
నారాయణపేట/మరికల్: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురికి.. పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవజ్ఞుడైన సీనియర్ సిటిజన్స్, గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, గ్రామాభివృద్ధికి దోహదపడిన ఎన్ఆర్ఐ, దాత లేదా స్థలం ఇచ్చిన వ్యక్తి. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్, సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు. ఎందుకు కీలకం..? గ్రామాల్లో చాలామంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ నిపుణులు ఉన్నారు. వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని రూపొందించారు. గ్రామాల్లో నిధుల వినియోగం, చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యరంగాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నియామకాలు జరగకపోవడంతో ఆ అవకాశం వృథా అవుతోంది. ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం. – వెంకట్రాములు, డీపీఓ, నారాయణపేట ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది.. -
విచారణ చేస్తాం..
కార్యాలయంలో బ్యాంకు గ్యారెంటీ బాండ్ మిస్సింగ్ అయినట్లుగా నాకు సమాచారం లేదు. వెంటనే పరిశీలించి ఎలా మిస్సింగ్ అయ్యిందో విచారణ చేస్తాం. టెక్నికల్ అసిస్టెంట్లపై ఆరోపణలు శాఖలో ఇదివరకు పని చేసిన వారు ఇచ్చిన లీకేజీలతో సమస్య నెలకొంది. ఫోన్పే స్క్రీన్షాట్లపై విచారణ చేస్తే.. అప్పుగా తీసుకున్నట్లు తెలియవచ్చింది. అట్టి మొత్తాన్ని తిరిగి ఇచ్చారు. వాటికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయి. – ఆంజనేయులు, డీఎం, జిల్లా పౌరసరఫరాలసంస్థ ● -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వాంతులు విరేచనాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గురుకులాలు, కళాశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు, భోజనం వడ్డించే వారికి ఐడల్ (టైఫాయిడ్) పరీక్షలు నిర్వహించాలని, ఎవరికై నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రెండు వారాల పాటు క్వారంటైన్ చేసి వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారికి సూచించారు. మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మంగళ, శుక్రవారం క్రమం తప్పకుండా డ్రై డే నిర్వహించాలని కోరారు. అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫ్రై డే – డ్రై డే పాటించాలన్నారు. గతంలో డెంగీ కేసులు నమోదైన వార్డులు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వకుండా చూసుకోవాలని పుర కమిషనర్లు, డీపీఓలను ఆదేశించారు. ప్రతి నెల 11, 21, 31 తేదీల్లో మంచి నీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, శుభ్రం చేస్తున్న ఫొటోలు తీసుకోవడంతో పాటు రిజిస్టర్లో నమోదు జరగాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఆర్వో సూర్యప్రకాష్, ఎస్డీసీ తిరుపతయ్య, జిల్లా అధికారులు ఉన్నారు. మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవం.... సోమవారం నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో పెద్దఎత్తున మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆయా రోజుల్లో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని.. 26వ తేదీన 2కె రన్ ఉంటుందని చెప్పారు. వారం పాటు కొనసాగే మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మత్తు బారిన పడకుండా కమిటీలు చురుగ్గా పని చేయాలని, ఎక్కడైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పాన్, గుట్కా తదితర దుకాణాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే తక్షణమే సమాచారమిచ్చి డి–అడిక్షన్ సెంటర్కు పంపించాలన్నారు. అనంతరం డీఎస్పీ బాలాజీనాయక్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఫ్లెక్సీపై అధికారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. -
క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
వనపర్తి: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగంగా మార్చుకొని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 40వ ఒలింపిక్ డే రన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయనతో పాటు అదనపు ఎస్పీ రాజేష్ మీనా ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేడ్కర్ చౌక్, రాజీవ్గాంధీ చౌరస్తా, బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడా సంస్కృతి పెంపొందితేనే భవిష్యత్ ఒలింపియన్లు తయారవుతారని తెలిపారు. యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా, సామాజికంగా బాధ్యతాయుతంగా ఎదగాలంటే క్రీడలే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఒలింపిక్ డే రన్తో ప్రజలందరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఫిట్ ఇండియా–హెల్తీ ఇండియా లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యకరమైన జీవన విధానానికి, క్రమశిక్షణకు, దేశభక్తి భావన పెంపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనమన్నారు. క్రీడా స్ఫూర్తి, ఐక్యత, గౌరవం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలన్నారు. రోజూ కనీసం ఒక గంట పాటు నడక, పరుగు, యోగా లేదా ఏదైనా క్రీడలో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టు భావనను పెంపొందిస్తాయని చెప్పారు. నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్య మాలపై ఎక్కువ సమయం గడపకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి, యువకుడు రోజూ వ్యాయామం చేయా లని సూచించారు. పుర చైర్పర్సన్ మాధవి, ఒలింపిక్ డే కన్వీనర్లు సురేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, కుమార్, కౌన్సిలర్ బ్రహ్మచారి, డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, హెచ్ ఎం శివాజీ, పీడీలు మన్యం యాదవ్, శ్రీనివాసులు, నిరంజన్గౌడ్, మధు, శ్రీదేవి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
ఎస్పీ ప్రజావాణికి 25 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నేరుగా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను కలిసి వినతులు అందజేశారు. ఏఎస్పీ ఫిర్యాదును స్వయంగా పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేడు 2కే రన్ వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో ఎస్ఐఆర్పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉదయం 6 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు రన్ కొనసాగుతోందని.. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరూ ఎస్ఐఆర్లో భాగస్వాములై తమ ఓటును జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని, అందులో భాగంగా 2కే రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఎల్వోలు జూన్ 25 నుంచి జులై 31 వరకు ఇల్లిల్లూ తిరిగి ఓటరు నమోదు చేపడతారని.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 1–10–2026 నాటికి 18 ఏళ్లు నిండిన యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈఓ వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు గణేష్కుమార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకా లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతను గుర్తించి సమయపాలన పాటిస్తూ విధులకు హాజరై విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ శేఖర్, ఉపాధ్యాయులు సంజీవయ్య, గిరిరాజాచారి, రుద్రమదేవి, సాయిప్రకా ష్, రవి, జ్యోతిలక్ష్మి, మహ్మద్ షఫీ, శ్రీనివాసులు, స్వరూప, సీఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల మధ్య భగ్గుమంటున్న విభేదాలు
● అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలు, అంతర్గత విషయాలు బయటకు.. ● ఇటీవల ఏసీబీకి చిక్కిన జిల్లాస్థాయి అధికారి ● దుమారం రేపుతున్న టీఏల ఆన్లైన్ లావాదేవీలు రూ.95 లక్షల బ్యాంకు గ్యారెంటీ బాండ్ ఎక్కడా? గత సీజన్లో జిల్లాలోని పెద్దమందడి మండలానికి చెందిన ఓ మిల్లర్ తనకు ధాన్యం కేటాయించాలని ఇచ్చిన రూ.95 లక్షల బ్యాంకు గ్యారంటీ బాండ్ కనిపించడం లేదంటూ.. ఇదేశాఖకు చెందిన ఓ అధికారి కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైతం సదరు కార్యాలయ ఉద్యోగులు బాహాటంగా కలెక్టరేట్లో చర్చించుకోవడం గమనార్హం. ఎంతో విలువైన బ్యాంకు గ్యారెంటీలకే కార్యాలయాల్లో భద్రత లేకుంటే.. సామాన్య కార్యాలయ పరిపాలన వివరాల ప్రతులకు ఎంతమేర జాగ్రత్త చేస్తారో చెప్పనవసరం లేదనే అసహనం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు ఉపక్రమించకుంటే రాష్ట్రస్థాయిలో జిల్లా అప్రతిష్టపాలు కావడం ఖాయమనే వాదనలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే జిల్లాగా వనపర్తి పేరును కాపాడాల్సిన అవసరం ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాలశాఖవనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ పరిధిలోకి వచ్చే రెండు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో కొన్ని నెలలుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా కలహాలు చోటు చేసుకోవడం జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఇదే కారణంతో 2026, జనవరి 9న జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఏసీబీకి పట్టుబడ్డాడనే వాదనలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత వరుస టాస్క్ఫోర్స్ దాడులు, శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్రస్థాయి అఽధికారులకు సైతం ఫిర్యాదులు అందడం లాంటి ఘటనలు తరుచూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. తోటి ఉద్యోగులను టార్గెట్ చేయడం, అనుచరులతో రహస్యంగా ఫిర్యాదులు చేయించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
పేదలకు పక్కా ఇళ్లే ప్రభుత్వ లక్ష్యం
● ‘ఇందిరమ్మ’ పథకంలో తొలి ప్రాధాన్యం ● ‘ప్రజాపాలన’ ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వనపర్తి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ, ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంతో పాటు ఖిల్లాఘనపురంలో పర్యటించి డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన ఆయన సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జిల్లాలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్లాక్స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వంటగ్యాస్ కనెక్షన్ల వినియోగాన్ని నిర్ధారించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్పాం వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా పరిష్కరించడం తప్పనిసరన్నారు. గృహజ్యోతి, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై ఆరా తీశారు. మంజూరైన, గ్రౌండింగ్ జరిగిన, పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5,982 ఇళ్లు మంజూరు కాగా, 5,173 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, 1,300 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కలెక్టర్ వివరించారు. నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమేనని పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే తదుపరి విడతలో బేస్మెంట్ స్థాయి, పైకప్పు స్థాయి వరకు నిర్మాణం చేపట్టిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ద్వారా రుణాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి మించి ఎత్తైన బేస్మెంట్లు, అధిక వ్యయంతో కూడిన నిర్మాణాలు చేపట్టవద్దని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్లో రేవంత్రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని విమర్శించాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు. రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని అన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే కేసీఆర్ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి సర్ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం -
జూరాలకు నిలిచిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
మొదటి విడత ముమ్మరం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో 86.59 శాతం పురోగతి ●అమరచింత: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు లబ్ధిదారులకు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అధికారుల గణాంకాల ప్రకారం తెలుస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పురపాలికల్లో పుర కమిషనర్లు పనులను నిత్యం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సలహాలు సూచనలిస్తున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు కూడా నిరంతరం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు అదనంగా మరో రూ.రెండు, రూ.మూడు లక్షలు కలిపి తమ సొంతింటి కలను సాకాలం చేసేందుకు లబ్ధిదారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. నిబంధనల మేరకు .. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్నారు. పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించుకునే వారితో పాటు ఖాళీ స్థలాల్లో ఇంటిని నిర్మించుకునే వారు అన్నివైపులా రెండు ఫీట్ల స్థలం వదిలి నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వంటగది, హాలు, బెడ్రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చకచకా పనులు చేపడుతున్నారు. విడతల వారీగా బిల్లులు.. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్ వరకు పూర్తిచేస్తే మొదటి విడతగా రూ.లక్ష, రూఫ్ లేవల్ వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు వేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తయితే మిగిలిన రూ.లక్ష చెల్లిస్తున్నామని హౌసింగ్ అధికారులు వివరించారు. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 255 గ్రామాలు, 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొత్తం 6,538 మంది లబ్ధిదారులను గుర్తించిన అధికారులు పూర్తి నివేదికను కలెక్టర్కు అందించగా.. అందులో 5,951 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలని.. లేకుంటే ఇంటి మంజూరు రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,153 లబ్ధిదారులకు అధికారులు మార్కింగ్ ఇవ్వగా.. 880 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేశారు. 1,824 మంది ఇంటి పైకప్పు నిర్మాణం పూర్తికాగా.. 482 మంది పైకప్పు వరకు గోడలు నిర్మించారు. కాగా ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు హౌసింగ్ అధికారులు వివరించారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో 6,538 మంది లబ్ధిదారుల గుర్తింపు.. 5,951 మందికి మంజూరు పత్రాలు పంపిణీ వివిధ దశల్లో కొనసాగుతున్న పనులు 1,264 ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి నిత్య పర్యవేక్షణతోనే సాధ్యమైందంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు -
భారత్ అందించిన ఆరోగ్య సంపద..
వనపర్తి: సమస్త మానవాళికి భారత్ అందించిన అద్భుతమైన ఆరోగ్య సంపద యోగా అని ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎస్పీ కార్యాలయ పరేడ్ మైదానంలో కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 180 మంది పోలీసులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి యోగా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయం వెచ్చించి యోగా చేయాలని సూచించారు. విధి నిర్వాహణ, ఇతర మానసిక వత్తిడి నుంచి చాలా ఉపశమనం కలిగిస్తోందన్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, వాటిని దూరం చేయాలంటే యోగా ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ
వనపర్తి: యోగాతో శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలమని.. నిత్యం సాధన చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంటలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు సాధన చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, రోజూ యోగా సాధన చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ.. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా రవాణాశాఖ అధికారి, ఆయుష్శాఖ అధికారులు వసుంధర, విశ్వశాంతి, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
పురపాలికలోని 10 వార్డుల్లో 100 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 79 మందికి ప్రొసీడింగ్స్ అందించాం. వీరిలో 60 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పనులు చేపడుతుండగా.. 12 మంది ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం. – నూరుల్ నదీం, పుర కమిషనర్, అమరచింత జిల్లాలో 5,951 మంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. 1,824 మంది లబ్ధిదారుల ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న వారందరికి ఇంటి నిర్మాణం కోసం మార్కింగ్ ఇచ్చాం. నిత్యం లబ్ధిదారుల వద్దకు వెళ్లి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పిస్తూ విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. – విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి -
యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
ఖిల్లాఘనపురం: సమాజంలోని యువత ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వాల్మీకి సంఘం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ నాగేష్, ఖిల్లాఘనపురం ఎస్ఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం మండలంలోని రుక్కన్నపల్లిలో వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో యువశక్తి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం ప్రారం భోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామ వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించడం సంతోషించదగిన విషయమని.. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సేకరించిన 30 యూనిట్ల రక్తాన్ని వనపర్తి ప్రభుత్వ రక్తనిధికి తరలించినట్లు యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కాగితాల మధు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతావత్ నరేష్, వాల్మీకి సంఘం అధ్యక్షుడు కుమార్నాయుడు, కుర్మయ్య, పలువురు వాల్మీకి, బోయ యువకులు, పెద్దలు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా నెట్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ అమెచ్యూర్ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫాస్ట్–5 పురుష, మహిళా నెట్బాల్ ఎంపికలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి సయ్యద్ అంజద్అలీ తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపికయ్యే జట్లు పుదుచ్చేరిలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే సీనియర్ ఫాస్ట్–5 జాతీయ స్థాయి నెట్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు హబీబ్ఖాన్, మహ్మద్ ఖాజా అక్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేడు నాగర్కర్నూల్కు మంత్రి సీతక్క రాక కందనూలు: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సోమవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు జిల్లాలోని తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుండుభీ వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ ప్రణాళికలు పరిశీలించనున్నారు. అలాగే తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. మైసమ్మ చెంత.. తాగునీటికి చింత పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ సన్నిధిలో ఆదివారం భక్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మృగశిర కార్తె చివరి వారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. కానీ భక్తులకు అవసరమైన తాగునీటి అందించడంలో నిర్వాహకులు, ఎండోన్మెంట్ అధికారులు విఫలమయ్యారు. దీంతో మినీ ట్యాంకు వద్ద ట్రాక్టర్ను ఉంచి భక్తులు ట్యాంక్పై నుంచి బిందెలతో నీటిని తోడుకున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులకు లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జాతరలో ఉన్న అన్ని ట్యాంకుల్లో నీటిని నింపి ఇబ్బందులు రాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా నీట్
● జిల్లాలోని 13 కేంద్రాల్లో 3,862 మంది విద్యార్థులు హాజరు ● పరీక్ష సరళిని పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులందరికీ మహబూబ్నగర్లోనే కేంద్రాలు ఏర్పాటు చేయగా.. చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే చేరుకున్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఇందులో 3,862 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,291 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 429 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు ధరించిన ఆభరణాలను తొలగించిన తర్వాత అనుమతించారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను కేంద్రాల వద్దకు తమ వాహనాలపై విద్యార్థులను చేర్చారు. నగరంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ జానకి పాలమూరు యూనివర్సిటీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల,ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. -
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఐఏఎస్ ఎంపికై ప్రస్తుతం చత్తీస్ఘడ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్నాయక్, ఐఏఎస్ నాపై నాన్న ఎంతో నమ్మకంతో ఉన్నత విద్య చదివించారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం. -
అమ్మ పేరుతో మొక్కలు నాటి పెంచుదాం
కొత్తకోట/మదనాపురం: చెట్లు తల్లివంటివని.. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్లో భాగంగా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించి.. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నానాటికీ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో అతివృష్టి, అనావృష్టి నెలకొని తీవ్ర నష్టం చేకూరుతోందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కోరారు. స్వచ్ఛభారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. ప్రస్తుతం యువత, విద్యార్థులు సెల్ఫోన్కు బానిసగా మారుతున్నారని.. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ● పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి.. సేంద్రియం సాగు దిశగా అడుగులు వేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. మదనపురం కృషివిజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూములు నిస్సారం కావడానికి మితిమీరిన రసాయనాల వాడకమే కారణమన్నారు. పంట పొలాలు సారవంతంగా ఉండేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల వ్యవసాయ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, డోకూర్ పవన్కుమార్రెడ్డి, లోకనాథ్రెడ్డి, కొండ ప్రశాంత్రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, దాబా శ్రీను, శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి సత్యంసాగర్, నారాయణమ్మ, వెంకట్రెడ్డి, నరేందర్గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు వంగూరు రామకృష్ణారెడ్డి, పద్మజారెడ్డి, అనుజ్ఞారెడ్డి, నారాయణమ్మ, నవీన్కుమార్రెడ్డి, రాములుయాదవ్, మాధవరెడ్డి, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
భూములను అమ్మి మమ్మల్ని చదివించారు
‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. తన తండ్రి గంగన్నతో నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి
● సెప్టెంబర్ 15లోగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష కందనూలు: రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జి ల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించా లని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షి స్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ● నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, సీఈ విజయభాస్కర్రెడ్డి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి జిల్లాలోని రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి.. ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా, చట్టబద్ధంగా, పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
లోక్అదాలత్లో 5,264 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి జి.కళార్చన అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుతో పాటు ఆత్మకూరు కోర్టులో లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల్లో సైతం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉండొచ్చన్నారు. అదే విధంగా ఇరు వర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. లోక్అదాలత్లో సివిల్ కేసులు 11, క్రిమినల్ 1,527, ప్రీ లిటిగేషన్ కేసులు 3,726తో కలిపి మొత్తం 5,264 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి బి. శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, డీఎస్పీ గిరిధర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. మోదీ హయాంలోనే దేశం సమగ్రాభివృద్ధి వనపర్తిటౌన్: ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తోందని యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రగాని సందీప్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎన్.అరవింద్ ఆధ్వర్యంలో నమో జెన్జీ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028లోగా భారత్ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 2014లో స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 15వేల కోట్లతో ప్రారంభమైన రుణాలు.. 2026 వరకు రూ.61వేల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. వైద్య కళాశాలల సంఖ్య 842 నుంచి 2,100 చేరిందని.. ఏంబీబీఎస్ సీట్లు 2.5 రేట్లకు పైగా పెరిగి 1.30 లక్షలకు, పీజీ సీట్లు 31వేల నుంచి 86 వేలకు, ఎయిమ్స్ హాస్పిటల్స్ 8 నుంచి 23కు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, కొమ్ము శ్రీనివాసులు, రవి నాయక్, చింతకాయల శివ, వెంకటేశ్ నాయక్, చంద్రశేఖర్, రాము, రాజు నాయక్ పాల్గొన్నారు. ‘గణపసముద్రం’లో బోరుబావుల సర్వే ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో శనివారం బోరుబావులు, చెట్లు, పైపులైన్లు, బావుల సర్వే ప్రారంభమైంది. ఇరిగేషన్శాఖ ఏఈ అనిల్, ఫారెస్టు బీట్ ఆఫీసర్, ఎస్డీసీ డిప్యూటీ తహసీల్దార్ ఆసీఫ్ సమక్షంలో సర్వే నిర్వహించినట్లు మండల సర్వేయర్ ఆనంద్ తెలిపారు. సుమారు 10 సర్వేనంబర్లలో సర్వే నిర్వహించడం జరిగిందని.. సోమవారం మిగతా సర్వే నంబర్లలో సర్వే పూర్తిచేసి, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్ఎం సంతోష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు ఎక్కేముందు కండక్టర్ లేదా డ్రైవర్కు తమ హాల్టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ సదుపాయం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఏసీ సహా అన్ని బస్సు సర్వీసులకు వర్తిస్తుందని తెలిపారు. ఆయా మార్గాలలో అదనపు బస్సులు నడుపుతామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని డిపోల మేనేజర్లను ఆదేశించామని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–2345 0033, 6815 3333, 99592 26295, 99592 26296 లకు సంప్రదించవచ్చని సూచించారు. -
పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించగా.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కూడా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను పెద్దఎత్తున గెలిపించారని.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, మదనాపురం మార్కెట్ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, పి.కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీను, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, పట్టణ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, నాయకులు డా. పీజే బాబు, ఎన్జే బోయేజ్, సంద వెంకటేష్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసమే కాంగ్రెస్పార్టీ ఆవిర్భావం.. మదనాపురం: పేదల సంక్షేమం, వారి హక్కుల రక్షణ కోసమే కాంగ్రెస్పార్టీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన రాహుల్గాంధీ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాహుల్గాంధీ కృషి చేస్తున్నారని కొనియాడారు. వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు వెంకట నారాయణ, వేమన్న, రవీందర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, అంజాద్అలీ, హసన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మోజర్ల–మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులత, గెజిటెడ్ హెచ్ఎం వరప్రసాదరావుతో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటి నీరు పోశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, కంప్యూటర్ గది, ప్రయోగశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయనశాస్త్ర విభాగాల్లో నిర్వహిస్తున్న ప్రయోగాలపై ఆరా తీశారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పూర్తిస్థాయిలో అందాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బడి తోటలో పండించిన కూరగాయలతోనే వంటలు తయారు చేస్తున్నట్లు కార్మికురాలు కృష్ణమ్మ వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆయన వెంట మద్దిగట్ల, అమ్మపల్లి, మోజర్ల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, శశివర్ధన్, యుగంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని టీజేఎంయూ రీజినల్ సెక్రటరీ నాగేందర్ అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబ్నగర్ బస్డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘాల ఎన్నికలకు ముందే విలీనం ప్రక్రియ ఆరంభించాలన్నారు. ఇదే విషయమై ఈనెల 24 నుంచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు నిరాహార దీక్షలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాములు, ఎన్.ఎం.రావు, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు. -
‘ఉపాధిహామీ’కి తూట్లు పొడుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పాన్గల్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దుకు స్వస్తి పలికి పాత చట్టాన్నే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రేమద్దులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 శాతం పేదల పొట్ట నింపే ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్ను తగ్గించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనుందని.. దీంతో సామాన్య కూలీలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. గతంలో ఉన్న పాత చట్టాన్నే కొనసాగిస్తూ పనిదినాలు 200 రోజులకు పెంచాలని, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి ఉపాధి కూలి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, కోదండరాములు, పార్టీ గ్రామ కార్యదర్శి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటమార్పిడి అవసరం..
జిల్లా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం పంటమార్పిడి చాలా అత్యవసరం. వరి మాత్రమే పండిస్తే.. భవి ష్యత్లో ఇతర ధా న్యాల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కావాల్సిన ఆహార ధాన్యాల ధరలు ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా నేలల్లో అన్నిరకాల పంటలు పండుతాయి. పంటమార్పిడితో భూమి ఆరోగ్యం కాపాడటంతో పాటు మన ప్రాంత ప్రజలకు కావాల్సిన అన్నిరకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు ఇక్కడే పండించుకొని వినియోగించుకోవచ్చు. రైతులు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
మార్పు ఎందుకో..?
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం మొదట్లో ఇక్కడే యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
‘ఎస్ఐఆర్’ విజయవంతం చేస్తాం
వనపర్తి: జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ విజయవంతం చేయడానికి బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పకడ్బందీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని బీఎల్వోలు, రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన బీఎల్ఏలకు మండలాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కొన్ని మండలాల్లో ఇప్పటికే పూర్తికాగా.. మిగిలిన మండలాల్లో త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. బీఎల్ఏలకు గుర్తింపు కార్డులు జారీ చేశామని, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్, డీఆర్ఓ సూర్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మత్తు మహమ్మారిపై సమష్టి పోరాటం
వనపర్తి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాదక ద్రవ్యాలను నిర్మూలించి యువతను సరైన మార్గంలో నడిపించాలని, అందరి సహకారంతో జిల్లాను మత్తురహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.సుధారాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సూపరింటెండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీకే రావాలి..
యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్ సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి. – రవికిషోర్, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ ● -
పచ్చదనానికి సన్నద్ధం
జిల్లాలో ప్రారంభమైన వన మహోత్సవంఅమరచింత: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే పలు గ్రామాల్లో వర్షాల అదును చూసి మొక్కలు నాటుతుండగా.. మరికొన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలతో గుంతలు తవ్వించే పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామాలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్రార్థన మందిరాలు, దేవాలయాల వద్ద ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాల్లో గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నారు. ఎనిమిది విడతల్లో నాటిన మొక్కలతో పాటు ఈసారి కొత్తగా ప్రధాన రహదారులకు ఇరువైపులా మూడు వరుసల్లో నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వన మహోత్సవం లక్ష్యాన్ని 20.55 లక్షలుగా ఉన్నతాధికారులు విధించారు. మండలం గ్రామాలు లక్ష్యం పాన్గల్ 28 2,93,000 ఖిల్లాఘనపురం 27 2,82,600 వనపర్తి 26 2,55,000 కొత్తకోట 22 2,26,400 పెద్దమందడి 22 2,30,690 పెబ్బేరు 20 2,20,000 మదనాపురం 17 1,74400 చిన్నంబావి 17 1,73,400 గోపాల్పేట 15 1,58,200 అమరచింత 14 1,45000 వీపనగండ్ల 14 1,42,200 ఆత్మకూర్ 13 1,34000 రేవల్లి 12 1,24600 శ్రీరంగాపురం 8 82,400 గుంతలు తవ్విస్తున్నాం.. వన మహోత్సవంలో భాగంగా వానాకాలంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా ఇప్పటి నుంచే గుంతలు తవ్విస్తున్నాం. మండలానికి ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయడానికి గ్రామాల్లోని క్షేత్ర సహాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకుంటున్నాం. వానాకాలం ప్రారంభం కాగానే అనుకున్న విధంగా మొక్కల నాటే కార్యక్రమం పూర్తి చేస్తాం. – బాలయ్య, ఏపీఓ, మదనాపురం లక్ష్యాన్ని చేరుకుంటాం.. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లాలోని 14 మండలాల్లో ఇప్పటి నుంచే గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. వాడిపోతున్న మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటుతాం. – ఉమాదేవి, డీఆర్డీఓ మండలాల వారీగా లక్ష్యం ఇలా.. పచ్చదనం పెంపొందించేందుకే.. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోంది. గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్కడే ఏర్పాటు చేసిన వన నర్సరీల నుంచి మొక్కలు తీసుకొని ఎప్పుడుపడితే అప్పుడు విరివిగా నాటుకునే విధంగా చర్యలు చేపట్టింది. గతంలో నాటిన మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరిగితే అప్పటికప్పుడే తొలగించి ఆ ప్రదేశంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 10 వేల మొక్కల సామర్థ్యం గల వన నర్సరీని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి అప్పగించడంతో ఈసారి మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకొనే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లా లక్ష్యం 20.55 లక్షలు గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో గుంతల తవ్వకాలు వర్షాకాలం సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తి: ప్రకృతి సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమని.. బాగా వర్షాలు కురవాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎకో పార్క్లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని, అదే స్ఫూర్తితో జిల్లాకేంద్రంలోని ఎకో పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 24 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని.. 33 శాతానికి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించామని, ముఖ్యఅతిథులతో పాటు విద్యార్థులు తమ పేర్లపై మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, కౌన్సిలర్ మహేశ్వరి, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’.. ఉన్నారా.. లేరా?
మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. తప్పుల సవరణ.. పకడ్బందీగా ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హులను జాబితాలోంచి తొలగిస్తారు. రెండు, మూడు చోట్ల ఓటు హక్కున్న వాటిని తొలగించి.. ఒక్క చోట మాత్రమే ఉండేలా జాబితా రూపొందిస్తారు. జిల్లాలో చాలామందికి తమ సొంతూరుతోపాటు ప్రస్తుతం నివశిస్తున్న పట్టణంలోనూ ఓటు హక్కు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటికి చెక్ పడనుంది. అలాగే మరణించిన వారిని, ఊరు వదిలి వెళ్లిపోయిన వారి పేర్లను కూడా తొలగిస్తారు. మొత్తంగా తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఓటరు పేరు, చిరునామా, తండ్రి/ భర్త పేరులో తప్పుగా నమోదైతే సరిదిద్దడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికే మండల స్థాయిలో ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలను రూపొందించారు. ఇందుకోసం బూత్స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. నియోజకవర్గం 2025లో ఓటరు మ్యాప్ చేయని తప్పులు/అక్రమాలు మొత్తం ఓటర్లు మ్యాపింగ్ ఓటర్లు ఉన్న ఓటర్లు నాగర్కర్నూల్ 2,40,571 1,83,129 57,442 72,073 అచ్చంపేట 2,48,362 2,04,770 43,592 86,532 కొల్లాపూర్ 2,42,699 1,91,733 50,966 79,901 కల్వకుర్తి 2,45,355 1,89,868 55,487 66,347 వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926 గద్వాల 2,61,810 1,98,304 63,506 79,677 అలంపూర్ 2,42,049 2,02,489 39,560 75,982 మహబూబ్నగర్ 2,64,235 1,80,078 84,157 84,090 జడ్చర్ల 2,25,911 1,83,253 42,658 72,068 దేవరకద్ర 2,42,342 2,02,135 40,207 80,533 నారాయణపేట 2,42,773 2,04,230 38,543 87,396 మక్తల్ 2,52,801 2,19,495 33,306 99,881 కొడంగల్ 2,51,255 2,00,361 50,894 79,299 అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం.. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. 2026, అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిట్, కలెక్టర్ 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటరు మ్యాపింగ్ ఇలా.. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. -
బాధితుల్లో భరోసా పెంచేలా సేవలు
కొత్తకోట రూరల్: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసులు తనకు అండగా ఉన్నారనే నమ్మకంతో తిరిగి వెళ్లాలని.. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యతని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పెద్దమందడి పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించారు. ముందుగా పోలీసు అధికారులు ఆమెకు పూలమొక్క అందజేసి స్వాగతం పలకగా.. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశం, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్హెచ్ఓ, మెన్ రెస్ట్రూమ్, లాకప్ రూమ్ను తనిఖీ చేసి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి.. పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్ఐ జలంధర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిబ్బంది విధులు, పని తీరు, సమస్యలు అడిగి తెలుసుకొని ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులైన పార్ట్–1 నుంచి పార్ట్–5 వరకు పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్–2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్నిరకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అభిప్రాయ సేకరణకే చర్చల కమిటీ సమావేశం
వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని.. విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరగగా.. రిజర్వాయర్ పరిధిలోని 164 ఎకరాల భూముల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారులకు వెల్లడించారు. తామంతా కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. భూములు కోల్పోతే ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలు పండక వలసలు వెళ్లిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు నీటి సౌకర్యం ఏర్పడి పంటలు బాగా పండుతున్నాయని, ఈ సమయంలో భూ సేకరణ పేరుతో తమకు అన్యాయం చేయవద్దని కోరారు. ప్రభుత్వం ఎకరానికి నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాలని విన్నవించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం నిర్ణయిస్తుందని, రైతులు ఎవరూ కంగారు పడొద్దని, న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామన్నారు. సాటిల్ బండ్ విషయంలో సీఈల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఎంత ఇవ్వొచ్చు అనేది త్వరలోనే నిర్ణయిస్తామని.. అధికారులు గ్రామానికి వచ్చి తెలియజేస్తారని వివరించారు. రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, నాయకులు సాయిచరణ్రెడ్డి, సర్పంచి, నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు ఒకేసారి అవార్డు చేయండి
ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న తమకు ఒకేసారి అవార్డు చేయాలని భూ నిర్వాసితులు భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యకు విన్నవించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేధికలో గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్లో 647 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని.. ఇప్పటి వరకు మొదట 18 ఎకరాలు, ఇటీవల 388 ఎకరాలకు అవార్డు చేసి 10 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఏడాది తర్వాత చెల్లించారని.. అదికూడా నిరసనలు, ఖిల్లాఘనపురం బంద్ చేపట్టిన తర్వాత ఇచ్చారన్నారు. ప్రస్తుతం మరో 163 ఎకరాలకు అవార్డు చేసుకోవాలని నోటీసులు ఇచ్చారని.. ఇంకా అంతాయపల్లి శివారుకు చెందిన 55 ఎకరాలు, వెంకటాంపల్లికి చెందిన 19 ఎకరాలు, మహ్మద్హుస్సేన్పల్లికి చెందిన 4 ఎకరాలు మిగిలిందని తెలిపారు. మిగిలిన 241 ఎకరాలకు ఒకేసారి అవార్డు చేసి వెంటనే పరిహారం డబ్బులు వేయాలని రైతులు డిమాండ్ చేశారు. గణపసముద్రం చెరువు పూర్తిస్థాయిలో నిండితే గ్రామానికి ఆనుకుని ఉన్న రోడ్డుకు చేరేవని.. ఇప్పుడు అలుగు ఎత్తు 3 ఫీట్లు పెంచితే గ్రామంలోకి నీళ్లు వస్తాయని, పెంచకుండా చూడాలని కోరారు. రిజర్వాయర్ నిండిన సమయంలో గ్రామంలోకి నీళ్లు రాకుండా చివరిలో బండు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అలుగు ఎత్త పెంచి గ్రామం నుంచి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని కొందరు రైతులు హెచ్చరించారు. భూములు కోల్పోయిన రైతులకు రిజర్వాయర్ వెనక ఉన్న ఏడు కోట్లలోని భూమిని ఒక్కొక్కరికి కనీసం మూడు గుంటలు పట్టా చేయాలని, కనీసం 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. అనంతరం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు చెప్పిన విషయాలు, సందేహాలు నమోదు చేసుకున్నామని.. ఈ నెల 18న కలెక్టరేట్లో రైతులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏమైన సమస్యలుంటే వివరించాలని కోరారు. సమావేశంలో ఐబీ డీఈ బాబుచంద్, తహసీల్దార్ సుగుణ, సర్పంచ్ పద్మమ్మ, వివిధ శాఖల ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు మొరపెట్టుకున్న రైతులు -
ఐదు దశాబ్దాలుగా.. అన్యాయమే
గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్వర్క్స్ నిర్మాణం చేపట్టారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేల లోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ● తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్తో కూడిన అధికారుల బృందం మంగళవారం కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను సందర్శించింది. ఆనకట్ట, స్లూయిస్ నిర్మాణాలు, ప్యాకేజీ–1, 2 పరిధిలో అసంపూర్తి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆయకట్టుదారులతో కలిసి కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ను కలిసి.. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా వివరించారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ ప్రాంతంలో 30 టీఎంసీల రిజర్వాయర్, అలాగే రాజోళి వద్ద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ‘‘ఆర్డీఎస్కు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. దీనిపై తాను రైతులతో కలిసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చూపాలంటే 30 టీఎంసీల హెడ్వర్క్స్ వద్ద రిజర్వాయర్, మల్లమ్మకుంట రిజర్వాయర్, సుమారు 75 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టను పునర్నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.’’ అని సీతారామిరెడ్డి పేర్కొన్నారు. ‘డైవర్షన్’లోనే రాజోళి బండ ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ఏళ్ల తరబడి తేలని నడిగడ్డ రైతుల నీటివాటా తాజాగా హెడ్వర్క్స్నుసందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వరి ధాన్యం తేమ శాతం పరిశీలించి త్వరగా తూకం చేసి కేటాయించిన మిల్లులకు లారీల్లో తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం లక్ష్మీవారాహి రైస్మిల్లును తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా అన్లోడ్ చేయాలని, కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్లో పీసీసీ ఇన్చార్జ్లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్ఎంట్రీలు త్వరగా పూర్తయి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. తహసీల్దార్ వరలక్ష్మి ఉన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి వనపర్తి రూరల్: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగమ్మతండాలో గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలతో పాటు వన నర్సరీని ఆయన పరిశీలించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని పీఆర్ ఏఈ భాస్కర్కు సూచించారు. నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శిని ఆదేశించారు. వర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన వెంట డీపీఓ రఘునాథ్రెడ్డి ,ఎంపీడీఓ ఎండీ అజార్ మొహినోద్దీన్, ఎంపీఓ రాజవర్ధన్రెడ్డి, కార్యదర్శి వెంకటస్వామి పాల్గొన్నారు. భూసార పరీక్షలతో అధిక దిగుబడులు అమరచింత: భూసార పరీక్షలతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని మదనాపురం కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. అనిత, డా. భవాని అన్నారు. మంగళవారం మండలంలోని ఈర్లదిన్నెలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. పచ్చిరొట్ట పెంపకం, జీవన ఎరువుల వినియోగంతో రసాయన ఎరువులను నియంత్రించుకునే అవకాశం ఉందన్నారు. వానాకాలంలో రైతులు వరితో పాటు పత్తి అధికంగా సాగు చేస్తుంటారని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఈఓలతో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి పౌష్టికాహారం, కుటుంబ పోషణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఓ అరవింద్, సర్పంచ్ చుక్క వెంకటమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమ్మ పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య, రాత పుస్తకాలు తనిఖీ చేసి కొందరు విద్యార్థులకు స్వయంగా అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలపై ఆరా తీయగా.. ప్రస్తుతం 702 మంది విద్యార్థులు ఉన్నారని, ఇప్పటి వరకు 65 మంది విద్యార్థులు కొత్తగా చేరారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటుతుందని భావిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా చూడాలన్నారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రవేశ సమయంలోనే అపార్ ఐడీలను రూపొందించాలని, యూ డైస్ పోర్టల్లో విద్యార్థుల వివరాలను సకాలంలో నమోదు చేసి నవీకరించాలన్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీ, ఇతర మౌలిక వసతులు అవసరమైతే జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపించాలని, అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థుల డ్రాప్బాక్స్లో ఎలాంటి అంశాలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ యాదయ్య, ప్రిన్సిపాల్స్ ఉమాదేవి, చంద్రశేఖర్, ఇతర విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
గ్రామాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలి
వనపర్తి: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం అన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా, మానవీయ దక్పథంతో వ్యవహరించడంతో పోలీసు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయనతో పాటు జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తనిఖీ చేసి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ సునీతారెడ్డి వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ చేపడుతున్న చర్యలపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ● ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతికి రూ.35 వేల నుంచి 50 వేల వరకు.. ● స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం ● టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, బూట్ల పేరుతో నిలువు దోపిడీ ● పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకో వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు నిబంధనలకు విరుద్ధం.. ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుంటే వాటిని పట్టుకున్నాం. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేశాం. ఎంఈఓకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే నాకు మీటింగ్ ఉందని చెప్పి రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలను తనిఖీ చేయాలి. – శివసాగర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో దోపిడీ ఇలా.. ● మహబూబ్నగర్తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి విద్యార్థులకు రూ.35– 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, అక్కడే కొనాలి. దీంతో ఒక్కొక్కరిపై కనీసం రూ.8 వేల వరకు అదనపు భారం పడుతుంది. నగరంలోని ఏనుగొండ సమీపంలో ఇటీవల ప్రారంభించిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. 6, 7 తరగతి విద్యార్థులకే రూ.70–95 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు యూనిఫాం, పుస్తకాలు అదనం. ● వనపర్తి జిల్లాకేంద్రంలోని చిట్యాల రోడ్డులో గల ఓ కార్పొరేట్ స్కూల్లో నర్సరీకే రూ.45వేలు వసూలు చేస్తున్నారు. బుక్స్, యూనిఫామ్స్ కూడా అక్కడే కొనాలి. ఏడో తరగతికి రూ.90 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా.. ఒక్కరూ కూడా ఫీజుల వివరాలు డిస్ప్లే చేయడం లేదు. -
ప్రభుత్వ పుస్తకాలకు మంగళం..
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పు న రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: భూ నిర్వాసితులు వాస్తవ పరిస్థితుల ఆధారంగా తమ విన్నపాలు తెలియజేయాలని.. వాటిని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుద్ధారం పెద్దచెరువు రిజర్వాయర్ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రిజర్వాయర్ పరిధిలోని 101 ఎకరాల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారుల ముందుంచారు. గ్రామానికి చెందిన 200కు పైగా చిన్న, సన్నకారు రైతులమే రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎకరాకు రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోనున్న రైతుల అభిప్రాయ సేకరణకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేట్లకు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందని.. రైతులు ఆమోదయోగ్యం కాని పరిహారాన్ని కోరడం సరైన విధానం కాదని సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు. అదేవిధంగా భూములు కోల్పోయే వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు. -
25 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం
సమావేశానికి హాజరైన బుద్ధారం గ్రామస్తులు వనపర్తి: జిల్లాలోని ఓటర్లు 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో పాల్గొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు బూత్ లెవల్ అధికారులు ఇచ్చే ఫారం పూరించి ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో కోరారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950లోని సెక్షన్ 17, 18, 31 అమలులో ఉన్నందున తప్పులు చేయకుండా జాగ్రత్తగా వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారని హెచ్చరించారు. -
సాగు భారమవుతోంది..
రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వ్యవసాయం భారంగా మారుతోంది. పెట్టిన పెట్టుబడి చేతికందితే చాలు అనే పరిస్థితిలో పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి అనుకూలిస్తేనే పంట, పెట్టుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. లేదంటే అప్పులే శరణ్యం. – విష్ణువర్ధన్, రైతు, అమరచింత ఆరుగాలం పొలాల్లో ఉంటూ పంట పండించే రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలి. పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే సాగు ఖర్చులతో పాటు రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది. – నర్సింహులు, రైతు, అమరచింత రైతులు రసాయన ఎరువులు వినియోగించడంతో భూమి సారం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరుగుతున్నందున సేంద్రియ ఎరువులు వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వరి పండించే రైతులు పచ్చిరొట్ట సాగుచేస్తే ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. – అరవింద్, ఏఓ, అమరచింత -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్ పనులు వేగంగా జరగాలంటే భూ సేకరణకు రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆర్అండ్ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ కె.శివకుమార్నాయుడు కోరారు. బుధవారం మండల కేంద్రం శివారులోని గణపసముద్రం రిజర్వాయర్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్ అలుగు మూడు ఫీట్లు పెంచడంతో గ్రామంలోకి నీళ్లు వస్తాయని.. అరికట్టేందుకు గ్రామం దగ్గర కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన భూముల ధరలకు అనుగుణంగా ఇక నుంచి రైతులకు ఇచ్చే పరిహారం రూ.20 లక్షలకు పెంచాలన్నారు. పూర్తిస్థాయిలో భూములు కోల్పోతున్న రైతులకు ఏడు కోట్ల భూమిలో ఒక్కొక్కరికి కనీసం 3 గుంటలు పట్టా చేయాలని కోరారు. భూమి ఉండటంతో ప్రభుత్వం ఇచ్చే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గురువారం కలెక్టరేట్లో రైతులతో సమావేశం ఉంటుందని.. ప్రతి సమస్యను అక్కడ తెలియజేయాలని సూచించారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. రైతులందరు త్వరగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తే రెండు నెలల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి 164 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, నీటిపారుదలశాఖ అధికారులు లక్ష్మీనర్సింహారెడ్డి, తహసీల్దార్ సుగుణ, వివిధ శాఖల అధికారులు, రైతులు ఉన్నారు. ఆర్అండ్ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ శివకుమార్నాయుడు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గోపల్దిన్నెలో 33/11 కేవీ సబ్స్టేషన్, మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఎక్స్రే ల్యాబ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో పాటు కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపల్దిన్నెలోని సర్వేనంబర్ 357 ప్రభుత్వ భూమిలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు సన్నరకం వరికి బోనస్, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్భాటాలకు పోయి ప్రజలు అప్పులపాలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఓ అరుణ, సర్పంచ్లు శివకుమార్, కవిత, మీసాల పార్వతమ్మ, సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కేంద్రం కుట్రలను తిప్పికొడదాం
వనపర్తి రూరల్: దేశంలో కార్మిక సంఘాలను రూపుమాపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. కార్మికులంతా సంఘటితంగా ఉండి తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి నర్సింహ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీహరి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. గతంలో ఏడుగురు సభ్యులతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే వీలుండేదని.. ఇప్పుడు 100 మంది సభ్యులు ఉండాలని నిబంధన విధించిందని తెలిపారు. ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచి సంపన్నులకు పెట్టడమే ధ్యేయంగా పని చేస్తోందని తెలిపారు. కార్మికులను సంఘటితం చేసి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల 30, 31న పెబ్బేరులో నిర్వహించాలని, 23న సన్నాహక సమావేశం ఉంటుందని తెలిపారు. మహాసభలకు కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. జిల్లాలో కార్మిక సంఘాల ఏర్పాటు, బలోపేతానికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి మోషా, గోపాలకృష్ణ, భాస్కర్, శ్యామ్, రఘు, సుందర్, ఖయ్యూం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వానిదే’ ఖిల్లాఘనపురం: వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డా. మాధవి జెండా ఆవిష్కరించగా.. ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని.. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యసిబ్బంది డా. సందేశ్, వెంకటలక్ష్మి, ప్రభావతి, వెంక టేష్, భీమయ్య, మునీందర్, నజ్మా, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్లోనే.. ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్నగర్కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్నగర్లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్గా మారింది. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్


