breaking news
Wanaparthy
-
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో రూ.64.9కోట్ల మద్యం విక్రయాలు మహబూబ్నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగాయి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయాలు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధిలో రూ.39.9కోట్ల మద్యం, కొత్తకోట డిపో నుంచి రూ.25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు. -
పాలమూరు అస్త్రంగా..
నేడు మహబూబ్నగర్కు సీఎం రేవంత్రెడ్డి రాక సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలో ఏం మా ట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.883 కోట్లతో యూజీడీ, శాశ్వత తాగునీరు.. కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్ లైన్ కాల్వ ఏర్పాటు చేయనున్నారు. ● నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా క్యాంపస్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేఏడాది డిసెంబర్ ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.4,500 కోట్లతో చేపట్టనున్న కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. అనంతరం సభలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ మేరకు రెండు రోజులకే ఎన్నికల షెడ్యుల్ విడుదల అయింది. ఆ తర్వాత అదే నెల డిసెంబరు 24న తన సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి వచ్చారు. నూతనంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో పుర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై సైతం సీఎం స్పందించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా.. సుమారు రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ నగరంలోయూజీడీ, తాగునీటి పనులకు.. ఎంవీఎస్ మైదానంలో బహిరంగ సభ ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి -
ఎన్ఏటీఎస్ డైరెక్టర్గా సాయిప్రసాద్గౌడ్
వనపర్తిటౌన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్) డైరెక్టర్గా జిల్లాలోని ఏదుట్లకు చెందిన డా. పలుస సాయిప్రసాద్గౌడ్ ఎన్నికయ్యారని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ శుక్రవారం తెలిపారు. ఉత్తర అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను 2026–27 సంవత్సరానికిగాను ఎంపిక చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ విద్య, ఉద్యోగ నిమిత్తం వచ్చే తెలుగు వారికి తనవంతు చేయూతనిస్తూ సహకరిస్తున్నారని చెప్పారు. సాయిప్రసాద్గౌడ్ సేవలను గుర్తించిన అక్కడి తెలుగు సంఘం ఆయనను డైరెక్టర్గా ఎంపిక చేశారన్నారు. -
సంక్రాంతి సంబురం
వనపర్తినేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమై ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uవనపర్తిటౌన్: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. అందమైన రంగవల్లులతో ఇళ్ల లోగిళ్లు, డూడూ బసవన్నల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం పండుగ రోజున జిల్లాలోని ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత వేంకటేశ్వరస్వామివారి పల్లకీసేవ, ఆదిత్య హృదయ పారాయణం, మహా మంగళహారతి, నక్షత్ర హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతల హనుమాన్ ఆలయంలో శివదీక్షదారులు శివుడిని ప్రత్యేకంగా అలంకరించి తమ ఆటపాటలతో స్తుతించారు. ప్రతి ఇంటా తీపి వంటకాలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. పట్టణాలు, గ్రామాల్లో సాయంత్రం వేళ చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడం కనిపించింది. అలాగే గ్రామాల్లో శకటాల ఊరేగింపు ప్రత్యేకంగా నిర్వహించారు. వృషభాలతో పాటు బండ్లు, ట్రాక్టర్లను రంగురంగుల కాగితాలు, కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి వీధుల్లో తిప్పారు. శుక్రవారం కనుమ రోజున మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. రోజువారి కంటే రెండింతలు విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమంగా వేసిన వారికి గ్రామపెద్దలు బహుమతులు అందజేశారు. -
చింతలకుంట.. భక్తులతో కిటకిట
● మూడురోజుల పాటు ఘనంగా సాగిన ఉత్సవాలు ● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి ప్రత్యేక పూజలు ● బందోబస్తు నిర్వహించిన పోలీసులు వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం పాతపల్లి శివారు చింతలకుంట ఆంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి రోజుల్లో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అన్నం, మాంసం ముక్కలు, రొట్టెలు, పులుసు, కల్లు సీసా, గుగ్గిళ్లు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొనుగోలు చేసిన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పెబ్బేరు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారికేట్లు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి నంబి వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
గత పాలకులు అభివృద్ధిని మరిచారు
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి పనులు కొనసాగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం రాత్రి పుర పరిధిలోని పలు వార్డుల్లో రూ.15 కోట్లతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, ఇదే ఉత్సాహాన్ని పుర ఎన్నికల్లో చూపాలని కోరారు. అడిగిన వెంటనే నిధులిచ్చే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారని.. పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని, రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జాతీయ రహదారి.. జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన పనులు కొనసాగుతున్నాయని.. దీని అనుసంధానంగా మంత్రాలయం, ఎమ్మిగనూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ వచ్చిందని మంత్రి వాకిటి వెల్లడించారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ ప్రకటన రాబోతుందని, సీఎం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత పాలకుల చేతగానితనం, వైఫల్యాలను గడపగడపకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రహదారులు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్, చెరువుకట్ట అభివృద్ధి ఇలా ఎన్నో పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్గౌడ్, భాస్కర్, అనీల్గౌడ్, సుదర్శన్శెట్టి, షబ్బీర్, ఖలీం, రవికాంత్, రవీందర్, నాగేష్, దామోదర్, గంగ, సాయిరాఘవ, మహేష్, షాలాం, జుబేర్, కరణ్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన యూరియా కష్టాలు
● చెప్పులు, రాళ్లను వరుసలో పెట్టిన అన్నదాతలు ● పోలీసుల పర్యవేక్షణలో టోకన్ల పంపిణీ పాన్గల్: ప్రభుత్వం ఎన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చినా.. రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తాజాగా సోమవారం అన్నదాతలు మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం ఎదుట చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచడం కనిపించింది. 450 బస్తాల యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయాన్నే కార్యాలయానికి చేరుకొని క్యూలైన్లో నిలబడటం ఇబ్బందిగా ఉండటంతో చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచి వారు మాత్రం కార్యాలయం ఎదుట పడిగాపులు పడ్డారు. రైతులు ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొనగా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని వదిలి బయోమెట్రిక్ విధానంలో సరఫరా చేశారు. యూరియా కోసం వరుసలో ఉంచిన చెప్పులు, రాళ్లు -
ప్రజావాణికి 22 అర్జీలు
వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మొత్తం 22 అర్జీలు వచ్చాయని.. పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధితశాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 15 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 వినతులు వచ్చాయి. ఎస్పీ సునీతరెడ్డి పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో భూ తగాదాలకు సంబంధించి 9, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 3, పరస్పర ఘర్షణలకు సంబంధించి 3 ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ : ఎమ్మెల్యేవనపర్తిటౌన్: భారతదేశ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సోమవారం స్వామి వివేకానంద జయంతిని వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దేశ భవిష్యత్కు మూల స్తంభం యువతేనని వివేకానంద చెప్పారని గుర్తుచేశారు. ఆయన మాటలు యువతకు అమూల్య ప్రేరణని, సందేశాలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వర్రెడ్డి, భానుప్రసాద్, పిచ్చయ్య, రాజశేఖర్రెడ్డి, రామకృష్ణగౌడ్, జిల్లా మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, వైద్యుడు పగిడాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్ లిస్ట్ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజ యాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురుషులు 3,03,839.. మహిళలు 3,14,730 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్నగర్లో 1.33 శాతం, చివరగా నాగర్కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. కార్పొరేషన్ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 60 279 97,636 1,00,191 14 1,97,841 దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070 భూత్పూర్ 10 11 5,975 6,089 0 12,064 వనపర్తి 33 95 31,655 32,527 8 64,190 కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192 పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333 అమరచింత 10 18 4,364 4,783 0 9,147 ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637 గద్వాల 37 78 31,730 33,630 10 65,370 అయిజ 20 26 11,233 11,790 0 23,023 అలంపూర్ 10 20 4,681 4,940 1 9,622 వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604 నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460 మక్తల్ 16 35 11,407 11,938 0 23,345 కోస్గి 16 32 10,028 10,219 1 20,248 మద్దూర్ 16 20 6,171 6,530 0 12,701 నాగర్కర్నూల్ 24 48 17,460 17,918 0 35,378 కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023 కొల్లాపూర్ 19 38 9,593 9,763 0 19,356 జిల్లాలవారీగా పురపాలికల ఓటర్లు ఇలా.. మున్సిపాలిటీ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 82 302 1,08,520 1,11,441 14 2,19,975 వనపర్తి 80 187 57,541 59,950 08 1,17,499 జోగుళాంబ గద్వాల 77 143 52,900 55,707 12 1,08,619 నారాయణపేట 72 141 44,850 46,903 01 91,754 నాగర్కర్నూల్ 65 130 40,028 40,729 00 80,757 మొత్తం 376 903 3,03,839 3,14,730 35 6,18,604 పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు.. -
పకడ్బందీగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వనపర్తి: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చూడాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. అనంతరం డీఐఈఓ అంజయ్య మాట్లాడుతూ.. ప్రయోగ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5,639 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షలకుగాను జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పుర ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లాలో పురపాలికల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. సోమవారం వార్డుల వారీగా తుడి ఓటరు జాబితా ప్రదర్శించామన్నారు. వీసీ అనంతరం పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఓటరు జాబితాను అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు అందజేసి అక్విటెన్స్ తీసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. చనిపోయిన వారు, గ్రామీణ ఓటర్లను జాగ్రత్తగా అన్మ్యాప్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎంపిక చేసుకున్న భవనాల్లో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలను కమిషనర్లు ప్రత్యక్షంగా పరిశీలించి వసతులు తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే.. పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే పుర ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
పుర ఎన్నికల్లో పోటీకి సిద్ధం
● ప్రజా పోరాటాలే లక్ష్యం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అమరచింత: ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న పార్టీ సీపీఎం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవన్లో జరిగిన పార్టీ మండల నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్వరలో జరిగే పుర ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం అభ్యర్థులు తమ బలం ఉన్న చోట పోటీచేస్తే ప్రజలు ఆదరించి గెలిపించడం సంతోషకరమన్నారు. రాబోయే పుర ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని.. ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. దేశం, రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషించే రాజకీయ పార్టీలను ఓడించడమే తమ ధ్యేయ్యమని.. తమతో కలిసివచ్చే పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మూడేళ్ల కిందట పార్టీ గుడిసెల పోరుకు శ్రీకారం చుట్టి పేదల పక్షాన నిలిచిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీ వారి సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. పట్టణ పేదల ఇళ్ల స్థలాల విషయంలో మాట ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి నేటికీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. గతంలో జరిగిన పుర ఎన్నికల్లో సీపీఎం పోటీచేసి వైస్ చైర్మన్ పదవి కై వసం చేసుకుందని.. ప్రస్తుతం పేదల సమస్యలు తీరాలంటే పార్టీ అభ్యర్థులను పూర్తిస్థాయిలో గెలిపించి చైర్మన్ స్థానం ఇవ్వాలని పట్టణ ప్రజలను కోరారు. పూటకో పార్టీ, కండువాలు మార్చే వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ఎండీ మహమూద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాజు, రాఘవేంద్ర, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్పేట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ జాతీయస్థాయి అండర్–17 ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నల్గొండలో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చినందుకు జాతీయస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీ ల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ను ప్రధానోపాధ్యాయుడు రంగస్వా మి, ఉపాద్యాయ బృందం అభినందించారు. చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది : బీఆర్ఎస్ వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో బీఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి పనులే త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టి తీరుతుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పార్టీపై కన్నబిడ్డపై ఉన్న ప్రేమ ఉందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్పార్టీపై కసిగా ఉన్నారని, ఓట్ల రూపంలో ఒడిసిపట్టుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసే నాయకులకు తప్పక ఆదరణ లభిస్తుందని.. ప్రతి నాయకుడు, కార్యకర్త వారి వారి వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సూచించారు. పురపాలికలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని.. అవకాశమిస్తే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని.. సంఘటితంగా ఉండి పురపాలికపై గులాబీజెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా పని చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కేసీఆర్, బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని చె ప్పారు. పుర మాజీ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, నాయకులు కురుమూర్తి యాదవ్, గంధం బాలపీరు పాల్గొన్నారు. నేడు పాలమూరుకు కేటీఆర్ రాకజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాలమూరుకు రానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్లో సన్మాన కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. మరోవైపు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో గులాబీ తోరణాలతో అలంకరించి.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మ న్ యాదయ్య, నాయకులు శివరాజు, ప్రభాక ర్, మున్నూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అదృష్ట్రం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
వనపర్తిటౌన్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో 86 మంది లబ్ధిదారులకు రూ.21.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రమశిక్షణతో గాడిలో పెడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుస్థాయిలో సీఎం రిలీఫ్ఫండ్ అందిస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం కాంగ్రెస్ హయంలోనే అమలైందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీపీీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఏఐపీసీ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్జీటీయూ డైరీ ఆవిష్కరణ.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర 2026 డైరీని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్జీటీయూ జిల్లాశాఖ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జి.నరేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామ్మూర్తి, జిల్లా ప్రధానకార్యదర్శి భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
గోపాల్పేట: సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ఆదివారం పల్లెబాటలో భాగంగా మండలంలోని మున్ననూరులో ఆయన పర్యటించి గ్రామస్లుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీలకతీతంగా తాము పనిచేస్తున్నామని.. అందుకు నిదర్శనం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపేనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం, పల్లె దవాఖాన, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం నుంచి ఏదుట్ల, కాశీంనగర్ వెళ్లే రహదారి నిర్మాణం, శివాలయంలో కల్యాణ మండపం నిర్మించడంతో పాటు బస్సు సౌకర్యం కల్పనకు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ధీరమల్లు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వీధిదీపాలు ప్రారంభం.. వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో ఆదివారం రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వీధిదీపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.807 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇటీవల ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.2.50 కోట్లు విడుదల కావడంతో అధునాతన వీధిదీపాలకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా డీసీసీ కార్యాలయంలో లాల్ బహద్దూర్శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని నాగవరం మైసమ్మ, భూలక్ష్మీ మాత ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ, పుర మాజీ కౌన్సిలర్లు, మార్కెట్యార్డ్ డైరెక్టర్లు, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థి నులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
పరవశించే మది
ప్రకృతి ఒడి..● పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ● ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు ● జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు ● వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ ● రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ – సాక్షి, నాగర్కర్నూల్ -
ఆర్టీసీకి పండుగే..
● సంక్రాంతి వేళ.. పెరిగిన ప్రయాణికుల రద్దీ ● హైదరాబాద్కు 18.. కర్నూలుకు ఆరు అదనపు ట్రిప్పులు వనపర్తిటౌన్: సంక్రాంతి సెలవులు ఆరంభం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కొత్తకోట, ఆత్మకూర్తో పాటు హైదరాబాద్, కర్నూలుకు అదనపు ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది. సాధారణంగా హైదరాబాద్కు రోజు 50 ట్రిప్పులు నడిపేవారు. ఈ మార్గంలోనే అత్యధిక ఆదాయం రానున్నందున మరో 18 ట్రిప్పులు నడుపుతున్నారు. పండుగ రోజుల్లో ప్రతి పది నిమిషాలకు ఓ బస్సును అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలుకు రోజు ఆరు ట్రిప్పులు నడవనుండగా.. అదనంగా మరో ఆరు నడిపేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ ప్రతేక్యంగా సిబ్బందిని బస్టాండ్లో నియమించి సర్వీసుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. -
యాదవులు అన్నిరంగాల్లో రాణించాలి
కొత్తకోట రూరల్: యాదవులు రాజకీయంతో పాటు విద్య, వ్యాపారం, సామాజిక సేవ తదితర రంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర హౌసింగ్బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాములు యాదవ్ కోరారు. శనివారం పట్టణ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన జిల్లాలోని యాదవ సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడని, గ్రామస్థాయిలో సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రతి యాదవ సర్పంచ్ భవిష్యత్లో ఉన్నతస్థాయి పాలకులుగా ఎదగాలనే దిశగా పని చేయాలని సూచించారు. కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా గెలిచే శక్తిగా ఎదగాలన్నారు. జిల్లాలో యాదవ జనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో వారి పాత్ర మరింత బలపడాలని కోరారు. గతంలో అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. భవిష్యత్లోనూ అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు యాదవుల సంక్షేమానికి సహకరించాలన్నారు. సర్పంచులు, ఉపసర్పంచులు ఒకే వేదికపై కలిసి పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా మాజీ చైర్మన్ కురుమూర్తియాదవ్, కాంగ్రెస్పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్యాదవ్, యాదవ సంఘ నాయకులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హైలెవల్.. ముందడుగు
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం ● రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. ● తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు ● ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం ● ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రాంతవాసులు ●గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లేవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హై లేవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ -
గతంలో రెండు పంటలకు సాగునీరు..
గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. గతేడాది యాసంగిలోనూ నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుత యాసంగిలో ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిపినట్లు అధికారులు ప్రకటించడంతో వ్యవసాయ పనులు మానుకున్నాం. పంట సాగుకు దూరమై నష్టపోతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో పంటల సాగుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. సాగునీరు అందించాలని ఏఈలు, ఈఈలకు విన్నవించాం. జూరాలలో నిల్వ నీటిమట్టం తగ్గుతున్నందున వేసవిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జూరాలలో సమృద్ధిగా నీరు నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాస ంగిలో సాగునీరు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటించాం. ఈ విషయాన్ని సంబంధిత ఎత్తిపోతల నిర్వహణ కమిటీ సభ్యులకు వివరించాం. జూరాలలో ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా నిలిపివేశాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ● -
సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి: సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదని.. జాప్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రైస్మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2024–25 యాసంగి సీజన్న్ వరి ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కోరారు. 2014–15 నుంచి 2023–24 వరకు సీఎంఆర్ అప్పగింతలో విఫలమైన మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 శాతం బియ్యాన్ని తక్షణమే ప్రభుత్వానికి అందించాలన్నారు. బకాయిల చెల్లింపునకు ఇదే చివరి గడువని.. బియ్యం అప్పగించని పక్షంలో సదరు మిల్లర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఆర్అండ్ఆర్ చట్టం కింద రికవరీ చేపడతామని, మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బియ్యం నాణ్యతగా ఉండాలని, పౌరసరఫరాలశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ట్యాబ్ఎంట్రీలను నిర్లక్ష్యం చేయొద్దు.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత ట్యాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హెచ్చరించారు. ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీల నిర్వహణలో ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు చూపుతున్న జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన సమీక్షలో ధాన్యం కొనుగోలు ప్రగతిని పరిశీలించి ట్యాబ్ఎంట్రీలు మందకొడిగా సాగుతుండటంపై అధికారులను నిలదీశారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో రైతులకు చెల్లింపులు ఆగిపోతున్నాయని, ఏపీఎంలు, సీఈఓల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యానికి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులకు చేరిన ధాన్యం వివరాలను మిల్లర్ల ద్వారా తక్షణమే ఆన్లైనన్లో అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలని, రెండ్రోజుల్లో పెండింగ్లో ఉన్న ట్యాబ్ఎంట్రీలన్నీ పూర్తి కావాలని, రోజూ నివేదిక సమర్పించాలన్నారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
వనపర్తి: రోడ్డు భద్రత నియమాలు పాటించడంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ నుంచి నల్ల చెరువు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత జెండా ఊపి ప్రారంభించడమేగాక ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమేగాక సిబ్బంది కూడా పాటించేలా చూడాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని, ఇటీవల అధికంగా ప్రమాదాలు జరిగినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారోత్సవాలను మాసోత్సవాలుగా మార్చాయని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడమే గాకుండా ఎదుటి వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంతోనే అనర్థాలు.. రోడ్డు ప్రమాదాలతో నిత్యం ఎందరో మృతిచెందుతున్నారని.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఇతరులకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి.సునీతరెడ్డి కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధునిక వాహనాలు కొనివ్వడమే కాకుండా అధిక వేగంతో వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. యువత స్టైల్ కోసం హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం చేస్తారని.. ఆ పద్ధతి ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు. బైక్ ర్యాలీ సందర్భంగా నల్లచెరువు కట్టపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం పాల్గొన్నారు. -
డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
వీపనగండ్ల: స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ఆన్లైన్ నమోదు, వచ్చిన ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలు, పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్ఐ రాణి తదితరులు పాల్గొన్నారు. రూ.2.50 కోట్లతో ఆధునిక ఠాణా.. అమరచింత: మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో ఆధునిక వసతులతో పోలీస్స్టేషన్ నిర్మాణానికి మరో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరం అవసరం ఉండటంతో గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో 7 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారని, మిగిలిన 7 ఎకరాలు పేదల ఇంటి స్థలాలకు ఇచ్చారని నాయకులు డీఎస్పీకి వివరించారు. చర్చలు సఫలం కాకపోవడంతో సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి వనపర్తి టౌన్: విద్యార్థులు మహనీయుల స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీఐఈఓ ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. గురువారం పట్టణంలోని ఆయా కార్యాలయాల్లో ఎస్ఎఫ్ఐ క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, కుటుంబం భరోసాను కోల్పోతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరన్న నాయక్, నాయకులు హరీశ్, నరేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అంబాభవాని ఆలయంలో ఆంధ్రా ఎమ్మెల్సీ పూజలు కొత్తకోట రూరల్: పట్టణంలోని అంబాభవాని ఆలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎల్లారెడ్డిగారి శివరాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఎమ్మెల్సీ ఆలయాన్ని తరచూ దర్శించుకుంటారని.. హైదరాబాద్ నుంచి అనంతపూర్కు వెళ్తూ వచ్చినట్లు వర్గీయులు తెలిపారు. నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా నిలిచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
అమరచింత/ఆత్మకూర్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన అమరచింత, ఆత్మకూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పురపాలికల్లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రాలతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు. ఆయా పుర కమిషనర్లు నాగరాజు, చికినె శశిధర్తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా సవరణ కొనసాగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తూ తుడి ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆత్మకూర్లో 11 ఫిర్యాదులు అందగా వెంటనే పరిష్కరించామన్నారు. 10 వార్డులకుగాను 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. -
లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు
వనపర్తి: పని ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని.. నిర్భయంగా లోకల్ కంప్లయింట్ కమిటీలో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునేలా రక్షణ చట్టాలు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానికంగా ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, జిల్లాస్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాధితులు 90 రోజుల్లో కమిటీకి లేదా షీ బాక్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల విధానాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. 64 శాఖల్లో ఇంటర్నల్ కమిటీలు, లోకల్ కమిటీ సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాధ్యులను విచారించి ఆరోపణ నిర్ధారణ అయితే శిక్షలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్ కమిటీ సభ్యురాలు డా. శ్రీలేఖ, జీసీడీఓ సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, డీసీపీఓ రాంబాబు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని.. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు మూసివేసి ధ్యానం వచ్చే చోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరణ ప్రక్రియ కొనసాగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. బుధవారం వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. బంగ్లాదేశ్తో సమస్యలు ఉత్పన్నమైనందున జనపనార దిగుమతి తగ్గి గన్నీబ్యాగుల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. యాసంగి సీజన్లో సమస్యలు రాకుండా కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లుల నుంచి తిరిగి తీసుకొని గోదాముల్లో భద్రపర్చాలని ఆదేశించారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై ఒత్తిడి పెంచి త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేసేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
వనపర్తి రూరల్: వాహన చోదకులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పెబ్బేరులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు రహదారుల పక్కన బోర్డులపై సూచించిన గుర్తులను అనుసరిస్తూ వాహనాలు నడపడంతో ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్కాల వాహన చోదకులు సీట్బెల్ట్ కచ్చితంగా ధరించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ సైదులు, పీపీ రాజేష్, పుష్పలత, హెచ్ఎం విష్ణువర్ధన్రావు, న్యాయవాదులు బాలనాగయ్య, శిరీష్, చంద్ర, గిరిజ, వాలంటీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
మదనాపురం: పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3వ నంబర్ రేషన్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కొత్త రేషన్ దుకాణం ఏర్పాటుతో నిత్యావసర సరుకుల పంపిణీ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, మార్కెట్ ఛైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, తహసీల్దార్ మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు రాంచంద్రయ్య, డీలర్ రాజశేఖర్, టీసీ నాగన్నయాదవ్, వెంకట్నారాయణ, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని వివరించారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. ‘లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం’ వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లేబర్ కోడ్లలో 3 కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా అదే చెప్పిందన్నారు. వీటి ఫలితంగా సంఘం ఏర్పాటు, సమ్మె, వేతనాల పెంపునకు పోరాడే హక్కులు కోల్పోతామని వివరించారు. రోజకు 8 గంటల పనిదినం ఉండగా.. 12 గంటలకు పెంచిందన్నారు. కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు కోడ్లు తీసుకొచ్చారని.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు చేయడం లేదని వివరించారు. కనీస వేతనం, కార్మికుల హక్కుల కోసం సంఘం రాష్ట్రంలో అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందన్నారు. శ్రీహరి, శ్రీరాం, మోషా, భాస్కర్ పాల్గొన్నారు. -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
● 21న దివ్యాంగుల ప్రజావాణి ● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల్ల చిన్నారెడ్డి వనపర్తి: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకుగాను ఈ నెల 21న ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పాత మార్కెట్యార్డు ప్రాంగణంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్సింగ్, గ్రిడ్ కార్యనిర్వాహక సంచాలకుడు ఎంకే రమేష్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 730 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు బాగా చదువుకొని సకలాంగులతో సమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మిత్రుల్లో ఒకరు దివ్యాంగుడైతే ఇతర స్నేహితుల కంటే దివ్యాంగుడైన స్నేహితుడిపై ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపాలని సవ్యాంగులకు సూచించారు. కళ్లు లేని వారికి స్పర్శ ద్వారా చదువుకొనే అవకాశం కల్పించిన లూయిస్ బ్రెయిలీ, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రస్థాయి ప్రజావాణికి వచ్చే దివ్యాంగుల అర్జీలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది దివ్యాంగుల దినోత్సవం రోజున సంక్షేమ భవన నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించామని.. భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు రూ.70.73 లక్షల విలువగల ఉపకరణాలు అందజేస్తున్న యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు.. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేగాని లక్ష్య సాధనకు కాదని, అన్నిరంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బ్యాటరీ ట్రై సైకిల్ 97, వినికిడి యంత్రాలు 44, చంక కర్రలు 178, అడ్జస్టబుల్ వాకింగ్ స్టిక్స్ 108, ట్రై సైకిల్స్ 149, టీఎల్ఎం కిట్స్ 30 ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు. అలింకో సంస్థ గ్రామస్థాయికి చేరుకొని వారికి అవసరమైన ఉపకరణాలు అందిస్తుందన్నారు. గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక సంచాలకుడు రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందించే అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, దివ్యాంగురాలైన గాయత్రి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 20 మంది మైనార్టీలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీడబ్ల్యూఓ సుధారాణి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, దివ్యాంగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మీసాల మోహన్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం’
కొత్తకోట: రాజకీయాలు, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించుకొని ఇతరుల భూములు, ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే బీసీ పొలిటికల్ జేఏసీ చూస్తూ ఊరుకోదని సంఘం రాష్ట్ర చైర్మన్ డా. రాచాల యుగంధర్గౌడ్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లును కలిసి కబ్జాకు గురైన భూములపై విచారణ జరపాలని ఫిర్యాదు అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుర పరిధిలోని కుమ్మరికుంటను పరిశీలించడానికి వెళ్తుండగా.. కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగు చూశాయన్నారు. సర్వేనంబర్ 295, 296, 297, 302లోని 4 ఎకరాల భూమి 2009–10 వరకు హాజీ భద్రోద్దీన్ అనే వ్యక్తి పేరుపై ఉండగా.. 2010–11లో ఎలాంటి ఆధారం లేకుండా ఇతరుల పేరుపై మార్పిడి జరిగిందని, రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఈ భూమి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర పట్టా భూములు కూడా కబ్జాకు గురైనట్లు తెలుస్తోందని, నిగ్గు తేలుస్తామన్నారు. అక్రమాలకు రాజకీయ పలుకుబడి ఉపయోగించారా? లేక అధికారులకు లంచాలు ఎరవేసి మార్పిడి చేసుకున్నారా? అనే వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించి అక్రమార్కులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లోకాయుక్తను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజన్న యాదవ్, సయ్యద్ గూడూషా, వీవీ గౌడ్, మహేందర్, బత్తుల జితేందర్, శివ, ధర్మేంద్రసాగర్, రాఘవేందర్గౌడ్, రమేష్ పాల్గొన్నారు. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
● 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై నిందలా.. ● జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది ● సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
● సీఎం కప్ నిర్వహణకు సన్నాహాలు ● గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు ● 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు క్రీడల నిర్వహణ ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://sat. telangana.gov.in/cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు 9 బంగారు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సాధించారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
పాన్గల్: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల అల్పాహారానికి సంబంధించిన నిధులు త్వరలోనే విడుదల అవుతాయన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రైవేటుకు ధీటుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని.. కోడిగుడ్ల ధర పెరిగినందున వారంలో రెండుసార్లు అందించడంతో పాటు ఒకసారి అరటి పండు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు వర్గాలుగా ఏర్పడి విద్యార్థులకు నష్టం కలిగించే పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమష్టిగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధి, విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా గతంలో జరిగిందని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అలా కాకుండా చూస్తామని తెలిపారు. పీఎంశ్రీ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాలని హెచ్ఎంకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆనంద్, జీహెచ్ఎం నాగలీల, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు వనపర్తిటౌన్: ఆదిలాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని.. అండర్ 8 జట్టుకు 19.01.2018 నుంచి 18.01.2020 మధ్య, అండర్ 10 జట్టుకు 19.01.2016 నుంచి 18.01.2018 మధ్య, అండర్ 12 జట్టుకు 19.01.2014 నుంచి 18.01.2016 మధ్య, అండర్ 14 జట్టుకు 19.01.2012 నుంచి 18.01.2014 మధ్య, అండర్ 20 జట్టుకు 19.01.2006 నుంచి 18.01.2012 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని వివరించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు మైదానంలో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 80961 15222, 94413 53375 సంప్రదించాలని పేర్కొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
వనపర్తి టౌన్: రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని రవాణశాఖ అధికారులు సైదులు, శ్రీకాంత్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో చేసే తప్పిదంతో మన జీవితమే కాకుండా ఎదుటి వారి జీవితం, కుటుంబం రోడ్డున పడుతుందని.. అలసత్వం వీడి బాథ్యతగా నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు విధిగా సీట్బెల్ట్ ధరించాలన్నారు. యువత వేగంగా వాహనాలు నడిపే సమయంలో అమ్మ, నాన్నను గుర్తు చేసుకోవాలని, మన కొరకు ఎదురు చూస్తుంటారనే విషయాన్ని మరిచి పోవద్దని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, త్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎం ఉమాదేవి, సీఎంఓ ప్రతాపరెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతగా, వేగంగా ఔట్పోస్టు నిర్మాణం
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనుల్లో నాణ్యత పాటించడంతో పాటు అనుకున్న సమయంలోగా పూర్తి కావాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రాజెక్టు రహదారిలో సత్యసాయి తాగునీటి పంప్హౌజ్ వద్ద రూ.కోటితో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. పనుల్లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్ అలసత్వాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రతకు పునాది పోలీసు మౌలిక వసతులేనని వెల్లడించారు. ఔట్పోస్టు నిర్మాణంతో ప్రాజెక్టుకు రక్షణతో పాటు అంతర్రాష్ట్ర రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ట నిఘా ఉంటుందన్నారు. ప్రాజెక్టు సమీపంలో అల్లరిమూకలు, ఆకతాయిల బెడద ఉండదని.. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఠాణా నిర్మాణానికి స్థల పరిశీలన.. పట్టణంలోని దుంపాయికుంటలో పోలీస్స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఎస్పీ సునీతరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల స్థలం కేటాయించారని.. అదనంగా 1.20 ఎకరాలు రెవెన్యూ అధికారులు అప్పగిస్తే పోలీస్స్టేషన్తో పాటు సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఆధునిక వసతులతో నిర్మించే పోలీస్స్టేషన్కు మూడు ఎకరాల స్థలం అవసరమని.. సంబంధిత అధికారులకు నివేదిక అందించాలని సీఐ శివకుమార్ను ఆదేశించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి, ఆత్మకూర్ ఎస్ఐ జయన్న, సిబ్బంది ఉన్నారు. -
అభ్యంతరాల పరిష్కారానికి కృషి
వనపర్తి: పుర ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఫొటోలు లేకపోవడం, డబుల్ ఓట్లు, తప్పుగా వార్డుల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అభ్యంతరాలను ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాలో ఫొటోలు లేని విషయం వాస్తవమని, ఫొటోలతో కూడిన జాబితా ప్రచురించేలా ఎన్నికల సంఘానికి నివేదిస్తామని చెప్పారు. అదేవిధంగా డబుల్ ఓట్లు ఏవైనా ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని.. వార్డు మ్యాపింగ్లోని అభ్యంతరాల ఆధారంగా సరి చేస్తామని తెలిపారు. గ్రామీణ ఓటర్లు ఎక్కడైనా నమోదై ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని వివరించారు. అలాంటి ఓటర్లు ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే అధికారులకు తెలియజేయాలని సూచించారు. 10వ తేదీన చివరి డ్రాఫ్ట్ వెలువరిస్తామని, ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఓటరు జాబితా కాపీలను తప్పనిసరిగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు వేలకుపైగా ఓటర్లున్న వార్డుల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని.. మిగతా వార్డుల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచాలి.. ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తిచేసి ఫిబ్రవరి 15లోగా అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వైద్య కళాశాల భవనంతో పాటు, మెనస్, వసతిగృహం, పార్కింగ్ ఏరియాను పరిశీలించి ఆర్అండ్బీ, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు చివరి దశకు చేరుకున్నందున వేగం పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్అండ్బీ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఇతర అధికారులు ఉన్నారు. -
అభివృద్ధి వైపు అడుగులు
‘పుర’ ఎన్నికల వేళ పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు ఒక్కో వార్డుకు రూ.56 లక్షలకు పైగా.. ప్రాధాన్యత ఆధారంగా ఒక్కో వార్డుకు రూ.56 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు రూ.56 లక్షల చొప్పున ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అవసరాలు, అవకాశాల ఆధారంగా నిధులను పెంచే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు.. పురపాలికలో వీధిదీపాలు లేని ప్రతి కాలనీలో ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.10 లక్షలు వెచ్చించి 500కు పైగా ఎల్ఈడీ బల్బుబు తెప్పించాం. సిబ్బంది హైమాస్ట్ లైట్ల మరమ్మతుకు నిచ్చెన ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అలాగాకుండా క్రేన్ సాయంతోనే పనులు చేసేలా చూస్తాం. యూఐడీఎఫ్ నిధులు మంజూరైతే టెండర్లు పిలిచి ప్రతి వార్డులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – యూనుస్, డీఈ, వనపర్తి పురపాలిక వనపర్తి టౌన్: పుర ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక పురపాలికలో హస్తం పార్టీ పట్టు సాధించేందుకు ప్రకటన వెలువడక ముందే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శివారు ప్రాంత కాలనీల్లో ఎక్కడ వీధి దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఆయా కాలనీల్లో వెలుగులు నింపేందుకు సుమారు 500కు పైగా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మరో ఐదు రోజుల్లో రూ.10 లక్షలు వెచ్చించి ఆయా స్తంభాలకు వీధి దీపాలు బిగించనున్నారు. వీటికితోడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన 45కు పైగా హైమాస్ట్ లైట్లు వెలగడం లేదని సిబ్బంది గుర్తించారు. వీటి మరమ్మతులకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. ప్రమాదకరంగా మరమ్మతు.. 10 నుంచి 15 మీటర్ల ఎత్తున్న హైమాస్ట్ స్తంభాలకు సగం మేర నిచ్చెనలు వేసుకొని సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కిందపడే ప్రమాదం ఉంది. గతంలో క్రేన్ సాయంతో పనులు చేపట్టే వారు. అందుకు విరుద్ధంగా చేపడుతుండటంతో అధికార యంత్రాంగంపై పుర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రూ.18.70 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణానికి నిర్ణయం సాంకేతిక అనుమతులకు ఉన్నతాధికారులకు చేరిన దస్త్రం ఆమోదం లభించగానే టెండర్ ప్రక్రియ షురూ రూ.10 లక్షలతో వీధిదీపాల ఏర్పాటు -
పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్లో మండల స్థాయి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఫిజికల్ ఫైళ్లను రెండు రోజుల్లో పంపించాలని తహసీల్దార్లకు సూచించారు. వాటికి సంవత్సరం వారీగా పహాణీలను కూడా జత చేయాలన్నారు. కొత్త మండలాల్లో కార్యాలయాల భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. జనవరి 26న ప్రభుత్వ భవనాల్లోనే జెండా ఎగురవేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ప్రకటించిన ఓటరు ముసాయిదాపై ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, ఏఓ భానుప్రకాష్ పాల్గొన్నారు. వక్ఫ్ భూములు కాపాడాలి జిల్లాలో గెజిట్ ప్రకారం వక్ఫ్ భూములు 898.36 ఎకరాలు ఉండగా.. అక్కడక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదర్శ్సురభి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్ భూముల ఆక్రమణలపై కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించగా.. వాటికి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
వనపర్తిటౌన్: ఈ నెల 21 నుంచి జరగబోయే ఇంట ర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ కళాశాలలు సర్వం సిద్ధం చేసుకోవాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం డీఐఈఓ కార్యాలయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, 23న నైతికత – మానవ విలువల పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష జరగనుందన్నారు. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రాక్టికల్స్ నిర్వహణకు సీసీ కెమెరాలు, ల్యాబ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇంటర్ బోర్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన హాల్ టికెట్ల ప్రివ్యూను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలు సరి చూసుకునేలా అవగాహన కల్పించాలని, అభ్యంతరాలు ఉంటే ప్రిన్సిపాల్స్ వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారు. నామినల్ రోల్స్ చెక్ చేయడం, స్టాఫ్ డేటా మొదలైన వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
పాన్గల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దులలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో సీపీఎం ఒత్తిడి యూపీఏ ప్రభుత్వం సంవత్సరానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఈ పథకం కొనసాగిందన్నారు. ప్రజలందరూ 200 పని దినాలకు పెంచి రోజు, వారి వేతనం రూ.600 ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. వెనిజులాపై అమెరికా దాడులను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, నాయకులు వెంకటయ్య, భగత్, భాస్కర్, చంద్రశేఖర్, ఎండీ ఖాజా, మల్లేష్, కె.వెంకటయ్య, శివరాజు, రేవతిరెడ్డి, అంజనేయరెడ్డి, చిన్ననిరంజన్ పాల్గొన్నారు. -
వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్: పట్టు నిలుపుకొనేలా.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. -
భరోసా ఏది?
ఉపాధి కల్పించాలి మున్సిపాలిటీగా మారితే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఉన్న ఉపాధి పనులు తీసేస్తారని అనుకోలేదు. ఆరేళ్ల నుంచి ఉపాధి పనులు లేక ఇంట్లో బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి పనులు చేపట్టి తమలాంటి పేదలకు ఉపాధి చూపాలి. లేదా ఏడాదికి ఇస్తామన్నా రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆదుకోవాలి. – ఎస్.నర్సింహులు, అమరచింత పనులు లేక ఇబ్బంది వంద రోజుల పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు చేసిన పనికి తగ్గ కూలి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం కూలీ పనులు దొరకడం లేదు. వయస్సు భారమవ్వడంతో నాటు వేసే పనులు చేయలేకపోతున్నా. దీనికి తోడు కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా అందడం లేదు. దీంతో ఉపాధి లేక బతుకు భారంగా మారింది. – వెంకటమ్మ, అమరచింత ఆందోళన ఉధృతం చేస్తాం మున్సిపాలిటీల్లో తొలగించిన ఉపాధి హామీ పనులను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసాను వర్తింపచేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రవేశ పెట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాం. – అజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. పట్టణ ప్రాంతాలకు వర్తించదు 2023–24 సంవత్సరంలో ఏర్పడిన మున్సిపాలిటీ ప్రాంతాల్లోని కూలీలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అంతకు ముందు ఏర్పడిన మున్సిపాలిటీలో ఇది వర్తించదు. వీటిపై పట్టణ కూలీలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేసే వారిని గుర్తించే వీలుంది. – రఘపతిరెడ్డి, ఏపీఓ, అమరచింత మున్సిపాలిటీల్లో పేదలకు దూరంగానే ఉపాధి హామీ పథకం అమరచింత: నిరుపేద వ్యవసాయ కూలీలతో పాటు పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోనే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ.. అందుకు తగ్గ కూలి చెల్లించేది. అనంతరం ఏడాదికి 150 రోజుల పనిదినాలకు పెంచారు. దీంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవిలో పనులు దొరకడంతో కుటుంబ పోషణ సాఫీగా సాగేది. ప్రస్తుతం పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులను తొలగించడంతో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడిన పట్టణాలోల పేదలకు ఉపాధికి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తుండడంతో ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రాంత కూలీలు సైతం తమకు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 20 రోజుల పనిదినాలు చేసిన కూలీలు అర్హులంటూ నిబంధనలు ఉండడంతో.. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకమే అమలులో లేని కారణంగా వీరు ఆత్మీయ భరోసా అనర్హులుగా మిగిలారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 13,242 మంది జాబ్ కార్డు ఉండగా.. వారికి ఉపాధి హామీ, ఆత్మీయ భరోసా రెండు పథకాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుంది. జిల్లాలో ఇలా.. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మున్సిపాలిటీగా ఉన్న వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత పట్టణాలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఉపాధి పనులపై ఆధారపడి జీవిస్తున్న 13,242 మంది కూలీలు పనులు కోల్పోయారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రాజనగరంలో 479, నాగవరంలో 643 శ్రీనివాసపురంలో 1,020, నర్సింగాపురంలో 70 మంది ఉపాధి పనులకు దూరమయ్యారు. పెబ్బేరు మున్సిపాలిటీలో పెబ్బేరు పట్టణంలో 2,245, చెలిమిలలో 872 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 1,915 మంది, ఆత్మకూర్ మున్సిపాలిటీలో 1,975 విలీన గ్రామమైన ఖానాపురంలో 568 మంది, అమరచింత మున్సిపాలిటీలో 4,093 మంది కూలీలు జాబ్కార్డులు కలిగి ఉన్నా ఉపాధి పనులు చేసేందుకు అనర్హులుగా మిగిలారు. దీంతో అప్పటి నుంచి తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నా తమను పట్టించుకునే వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు. పట్టణ కూలీలకు అందని ‘ఆత్మీయ భరోసా’ భారమవుతున్న దినసరి జీవనం ఇందిరమ్మ రాజ్యంలోనూ ఉపాధి కలే.. మున్సిపాలిటీల ఏర్పాటుతో పేదల బతుకుల్లో చీకటి -
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
వనపర్తిటౌన్: హైదరాబాద్లోని సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ అండర్–19 పోటీల్లో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న కార్తీక్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడని ఎస్జీఎఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు. జయసూర్య ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, వనపర్తికి గౌరవం దక్కేలా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. గతేడాది జయసూర్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడన్నారు. కార్యక్రమంలో పీడీలు నవీన్ నందన్, నరేందర్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. 616 ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6, అమరచింత 4, ఆత్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. రామన్పాడులో 1,020 అడుగుల నీటి మట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,020 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
● ‘పాలమూరు’ వేదికగా ఎన్నికల శంఖారావం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’
కొత్తకోట రూరల్: మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (వీపనగండ్ల)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్, డ్రగ్స్ నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసినా, సహకరించినా శిక్షార్హులు అవుతారని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. సువర్ణ సారథ్యంలోని కళాబృందం ప్రదర్శన ఇచ్చారు. డిపో నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, డిపో మేనేజర్ దేవేందర్గౌడ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సైదులు, జి.సురేందర్ ఉన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
వనపర్తి: పోలీస్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహిరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎస్పీ సునీతారెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి 10 మందితో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా పోలీస్స్టేషన్లకు బదిలీ చేశామని తెలిపారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఉండాలి
ఖిల్లాఘనపురం: ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలా చూడాలని హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ మహబూబ్నగర్ జోనల్ అధికారి కృష్ణారావు, వనపర్తి, గద్వాల జోనల్ అధికారి లలిత కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం, 500 మీటర్లు, కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధ్యానం చేయడంతో ఉత్తేజం, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. 500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో నందు, స్రవంతి, నవ్య.. బాలుర విభాగంలో మహేష్, కార్తీక్, జగన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా కిలోమీటర్ పరుగు పందెంలో బాలుర విభాగంలో శివ, ప్రవీణ్, శ్రీరాం.. బాలికల విభాగంలో చందన, శిరీష, నందిని, రెండు కిలోమీటర్ల పరుగుపందెంలో శివ, రాజేష్, శ్రీనునాయక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం సర్పంచ్లు, ఉపసర్పంచ్లను శాలువాలతో సన్మానించడంతో పాటు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. -
అంతటా అంతేగా..!
● మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రఽదానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక ● మున్సిపాలిటీల్లో గ్రామాలకు సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం.. ● జాబితాలో ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడం.. తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా -
మత్స్యబీజ సంబురం
● లక్ష్యం 1.60 కోట్లు.. ఇప్పటి వరకు వదిలినవి 60 లక్షలు ● 10వ తేదీలోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు జిల్లాలో కొనసాగుతున్న రాయితీ చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేస్తే లబ్ధి చేకూరుతుంది. పెద్ద చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో చేప పిల్లలు ఎదిగే అవకాశం ఉంది. ఈ చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. – గోపి, మత్స్యకారుడు, అమరచింత ప్రభుత్వం ఈసారి రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తోంది. వానాకాలంలో వదలాల్సిన చేప పిల్లలు చలికాలం మధ్యలో చెరువులకు చేరుతున్నాయి. చేప పిల్లల ఎదుగుదలకు వాతావరణం సహకరించక కొన్ని చనిపోయినా.. మిగిలినవి పెరిగే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్గల్ రాయితీ చేప పిల్లల సరఫరాకు టెండరింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మరోమారు రీటెండరింగ్ నిర్వహించాం. ప్రస్తుతం నలుగురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 1.60 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 60 లక్షలు అందించాం. జనవరి 10 లోగా లక్ష్యం మేర పంపిణీ చేస్తాం. నీరు సమృద్ధిగా ఉన్న చెరువులు, కుంటలు గుర్తించి సొసైటీల అభ్యర్థన మేరకు చేప పిల్లలు వదులుతాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలో వారం రోజులుగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా.. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి చేప పిల్లలు చేరనున్నాయని మత్స్యకారులు సంబురపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.60 లక్షల చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఇప్పటి వరకు 60 లక్షలు పంపిణీ చేశారు. ఈ నెల 10లోగా పంపిణీ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా కేటాయించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచిత చేప పిల్లలు వదిలేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇది వరకే సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ చేప పిల్లలు సైతం వదిలితే మరింత లాభం చేకూరనుందని సంబురపడుతున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే పెరుగుదల నిలిచి బరువు తగ్గుతాయనే సందేహాలను సైతం వ్యక్తమవుతున్నాయి. గతేడాది 1.50 కోట్ల చేప పిల్లలను అందించాలనే లక్ష్యం ఉన్నా అనుకున్న మేర నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుత సంవత్సరం 1.60 కోట్ల మేర ఉచిత చేప పిల్లలను అందించేందుకు సిద్ధమయ్యారు. నీరున్న చెరువులకే ప్రాధాన్యం.. ప్రస్తుతం రాయితీ చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని మత్స్యకార సొసైటీల విన్నపం మేరకు చేప పిల్లలను అందించనున్నారు. చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే రాయితీ చేప పిల్లలు అందిస్తామని మత్స్యశాఖ ఏడీ వెల్లడించారు. వానాకాలం ప్రారంభంలో నీటితో నిండి ఉంటాయని.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఎదుగుదల ఉండదని, దీంతో నీరు సమృద్ధిగా ఉన్న చెరువులను గుర్తించి చేప పిల్లలను అందిస్తున్నామని చెబుతున్నారు. మత్స్య సహకార సంఘాలు 143 మత్స్యకారులు 13,600 గతేడాది పంపిణీ చేసిన చేప పిల్లలు 54.84 లక్షలు -
క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం
వనపర్తిటౌన్: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ లేకుండా ఎంత చదువు చదివినా ఉపయోగం ఉండదని తెలిపారు. కేవలం కలలుగని కూర్చుంటే విజయం వరించదని.. సాకారానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. రానున్న తరానికి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, కన్న నేలకు సేవలందించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం మరవొద్దని కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ప్రజా వైద్యశాల డైరెక్టర్ డా. మురళీధర్, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నతస్థాయికి ఎదుగుతారని, చదువు, ఆటలు, పాటలు ఏ రంగంపై ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకొని సత్తా చూపాలని కోరారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ఆశయాలకు అనుగుణంగా దారి చూపాలన్నారు. అనంతరం విజేతలకు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రతినిధి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కళావేదిక సభ్యులు, కవులు, ప్రజా ప్రతినిధులు రాములు, బైరోజు చంద్రశేఖర్, సత్తార్, గంధం నాగరాజు, రమాదేవి, ప్రవీణ్, భాస్కర్, రాజేంద్రప్రసాద్చారి, మద్దిలేటి, షఫీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘రైతుభరోసా’ అందేనా..?
● పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు మదనాపురం: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు భూములకే.. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొ ప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట ్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది. వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో జిల్లాలో సాగుచేసిన పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పు తీరకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వానాకాలంలో సుమారు రూ.205 కోట్ల నిధులు విడుదల కాగా.. యాసంగి సాగుకు రూపాయి కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాదికి రెండుసార్లు పంటసాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నామని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. పండుగ ముగిసిన వెంటనే నిధులు జమయ్యే అవకాశం ఉంది. – దామోదర్, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి -
భోజనం సరిగ్గా చేయలేదని తల్లి మందలించడంతో..
మహబూబ్ నగర్ జిల్లా: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది.శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్డీఏలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
ప్రారంభమైన పీఎంశ్రీ క్రీడాపోటీలు
గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పీఎంశ్రీ క్రీడాపోటీలను శనివారం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సర్పంచ్ స్వప్నభాస్కర్ ప్రారంభించారు. విద్యార్థులకు క్రీడలపై మక్కువ పెంచేందుకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ సురేందర్రెడ్డి తెలిపారు. అంతకుముందు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాద్యాయుడు రంగస్వామి, సీఆర్పీ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
వనపర్తి టౌన్: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్ 1, 2025 నాడు ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు, మృతిచెందిన ఓటర్లను పరిగణలోకి తీసుకోమని తెలిపారు. తుది ఓటరు జాబితా పార్ట్ల వారీగా వార్డుల మ్యాపింగ్ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, అదేవిధంగా కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల పేర్లు వారి సొంత వార్డులోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పుర కార్యాలయంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు ఉంటే 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని కోరారు. తుది ఓటరు జాబితా జనవరి 10న అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వార్డుల వారీగా తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, పుర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అమరచింత/ఆత్మకూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. అమరచింత మండలం చంద్రానాయక్తండాలో హైమాస్ట్ లైట్లతో పాటు అయ్యప్ప ఆలయంలో రూ.ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం, ఆత్మకూర్ మండలం మూలమళ్లలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని.. కేంద్ర నిధులను తమవంటూ ప్రచారం చేసుకోవడం అవివేకమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలమూర్–రంగారెడ్డి ఎప్పుడు పూర్తి చేస్తారో జిల్లా రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ మద్దతుతో గెలిచిన చంద్రనాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్తో పాటు కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డిని సన్మానించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, మేర్వరాజు, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, మంగ లావణ్య, మూలమళ్లలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు దేశాయి పద్మజారెడ్డి, కాంతారెడ్డి, రతంగ్పాండురెడ్డి, అశ్విన్కుమార్, అశోక్, లావణ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’కు పెద్దపీట హాస్యాస్పదం
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అంత ప్రాధాన్యమిస్తే పనులు ఎందుకు పూర్తి కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్లు వ్యయం కానుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 పనులు పూర్తి చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఇరుపార్టీల నాయకులు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని.. పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలి తీర్చే ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నీరుగార్చేందుకు వీబీజీ రాంజి పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని.. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయతీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, లక్ష్మి, జీఎన్ గోపి, పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, మహబూబ్ పాషా, బాల్యానాయక్, ఆర్ఎన్ రమేష్, కృష్ణయ్య, వెంకట్రాములు తదితరలు పాల్గొన్నారు. -
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు. -
మహిళల భద్రత, భరోసా షీటీం లక్ష్యం
వనపర్తి: మహిళలు షీటీం సేవలను వినియోగించుకోవాలని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ సూచించారు. మహిళలు, బాలికలకు భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఎస్పీ సునీతరెడ్డి ఆదేశాల మేరకు షీటీం, భరోసా కేంద్రం, ఏహెచ్టీయూ సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు భయంతో మౌనంగా ఉండకూడదని, బాలికలు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరారు. ఈవ్టీజింగ్, వేధింపులు, ఆన్లైన్ బెదిరింపులు ఎదురైతే సంప్రదించాలని సూచించారు. ఫేక్ ఐడీలు, మోసపూరిత లింకులు, బ్లాక్మెయిల్, మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. భరోసా కేంద్రంలో న్యాయం, కౌన్సెలింగ్, వైద్య సాయం, అవసరమైతే ఆశ్రయం కూడా లభిస్తుందని చెప్పారు. ఏహెచ్టీయూ, భరోసా కేంద్రం కలిసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో షీటీం ఎస్ఐ అంజద్, సిబ్బంది శ్రీనివాసులు, శ్రీశైలం చారి, యాదిరెడ్డి, భవిత, సతీష్, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
ఖరీఫ్లో రైస్ మిల్లర్ల అక్రమార్జన రూ.45 కోట్లు ● క్వింటాల్కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ● ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు ● తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. ● అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. ● మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు ●నాలుగు క్వింటాళ్ల ధాన్యం ఏమైందని డ్రైవర్ను నిలదీస్తే నాకేమీ తెలియదంటూ రైస్ మిల్లు యజమాని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగా.. వేబ్రిడ్జి తూకం అంతే వచ్చిందని చెప్పి.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలోన్నర పైన అదనంగా తూకం వేశారు. ఇప్పుడు మళ్లీ పది బస్తాల కోత పెట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. – ఆంజనేయరెడ్డి, శివాజీ, అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పుకోకుంటే.. అన్లోడ్ చేయకుండా ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా క్వింటాల్ ధాన్యంలో సుమారు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ దందాకు తెగబడ్డారు. రైతులు ఒప్పుకుంటేనే ట్రక్షీట్లు తిరిగి ఇస్తున్నారు. ట్రక్ షీట్లు తిరిగి ఇస్తేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసే అవకాశం ఉండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని కోతకు అంగీకరించని రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా తిరిగి సెంటర్లకు పంపిస్తున్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా వారికి విధి లేని పరిస్థితులు కల్పిస్తూ.. దారిలోకి తెచ్చుకుంటున్నారు. కిలోకు రూ.24 చొప్పున నష్టం.. వానాకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా కేంద్రాలు కొనుగోళ్ల లక్ష్యం కొన్నది మహబూబ్నగర్ 195 2,00,000 1,25,219 నాగర్కర్నూల్ 236 2,57,145 71,779 జోగుళాంబ గద్వాల 87 1,25,000 83,933 నారాయణపేట 117 3,12,000 1,29,467 వనపర్తి 414 4,30,000 2,06,000 తాలు పేరిట దోపిడీకి సంబంధించి ఇటు సెంటర్లు, అటు మిల్లుల నిర్వాహకులు కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. లేకుంటే తమకేం మిగులుతుందని పలు సెంటర్ల నిర్వాహకులు రైతులతో బాహాటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ కోత పెట్టడంపై పలువురు మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తే.. తాలు ఉంటే ఏంచేస్తారని మిల్లర్లను వెనుకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే.. అధికారులు చూస్తూ మిన్నంకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రక్షీట్ చూపిస్తూ ఆందోళన చేస్తున్న ఈ రైతులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందినవారు. గతేడాది నవంబర్ 25న ఈ గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తూకం చేశారు. మొత్తం 796 ధాన్యం బస్తాలకు 318.40 క్వింటాళ్లుగా లెక్క తేలింది. ధన్వాడ సొసైటీ నుంచి లారీ రాగా లోడ్ చేశారు. సొసైటీ కార్యదర్శి వెంకట్రాములు లోడ్ చేసిన లారీని నారాయణపేట మండలం కొల్లంపల్లి మిల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్కు ట్రక్షీట్ రాసిచ్చాడు. లారీ డ్రైవర్ ఒప్పుకోకుండా కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు రాయించుకుని తీసుకెళ్లాడు. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ 29న తిరిగి వచ్చి ట్రక్షీట్ రైతులకు ఇచ్చాడు. దాన్ని చూసి వారు కంగుతిన్నారు. 796 బస్తాలకు 786 బస్తాలు వచ్చినట్లు ఉంది. పది బస్తాలు.. సుమారు 4 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో రైతులు ఆందోళనకు దిగారు. -
స్వచ్ఛతకు పెద్దపీట : డీపీఓ
వనపర్తి రూరల్: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని డీపీఓ తరుణ్ చక్రవర్తి సర్పంచ్లకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామపంచాయతీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా పెద్దగూడెంలో సర్పంచ్ పుష్పలత, ఉపసర్పంచ్ భారతయ్య, వార్డుసభ్యులు డీపీఓను శాలువాతో సన్మానించారు. కడుకుంట్లలో సర్పంచ్ తిరుపతయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మొక్కలు వాడుముఖం పట్టకుండా నిత్యం నీరందించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు కోరారు. ఆయన వెంట కార్యదర్శులు మల్లికార్జున్, చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కురుమూర్తి, ఆయా గ్రామస్తులు శివకుమార్, కొండన్న, విష్ణు, బుచ్చిబాబు, రవిశెట్టి, నహీం పాషా, గ్రామ పెద్దలు ఉన్నారు. వ్యవసాయ కళాశాలకు పక్కా భవనం కరువు వనపర్తి రూరల్: ఎంజేపీ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం లేక జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెద్దగూడెం శివారులోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. 2022లో జిల్లాకు కళాశాల మంజూరుకాగా ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. కోళ్ల షెడ్డులో కొనసాగుతున్న కళాశాలలో విద్యార్థులు విషపు పురుగులకు భయపడుతూ చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో 336 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని.. కలెక్టర్, ఎమ్మెల్యే తక్షణమే కళాశాలను సందర్శించి పక్కా భవనం నిర్మించాలని కోరారు. లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దేవర శివ, అంజన్నయాదవ్, ధరేంద్రసాగర్, రాఘవేందర్గౌడ్, అస్కని రమేష్, రామన్గౌడ్, రమేష్గౌడ్, కురుమూర్తి, గౌతమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్ నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలోని పోలీసు, ఇరిగేషన్, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో అక్రమ మైనింగ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సూచన మేరకు సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు కీలక మార్గాలు గుర్తించాలని.. కీలక ప్రాంతాల నివేదిక ప్రభుత్వానికి అందించిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సీఐ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. రోవర్స్ పనితీరుపై శిక్షణ.. భూమి కొలతలు అత్యంత కచ్చితత్వంగా గుర్తించే రోవర్స్ పరికర పనితీరుపై శిక్షణ పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. భూ భారతి చట్టం ప్రకారం భూదార్ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 70 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించేందుకు మూడు రోవర్స్ యంత్రాలు పంపించినట్లు తెలిపారు. గురు, శుక్రవారం జిల్లాలోని 10 మంది సర్వేయర్లకు పోలీస్ పరేడ్ మైదానంలో శిక్షకుడు చంద్రకాంత్ శిక్షణ ఇవ్వగా శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోవర్స్ ఉపయోగించి భూ కొలతలు ఏ విధంగా చేపట్టాలి.. ఎలాంటి ప్రామాణికలు తీసుకోవాలనే అంశాలను బాగా నేర్చుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. తర్వాతి కాలంలో యంత్రాల వినియోగంపై లైసెన్స్డ్ సర్వేయర్లకు సైతం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి భూదార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సర్వే ల్యాండ్ పి.శ్రీనివాస్, ఎస్డీఎం శిల్ప, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘తప్పుల తడకగా ఓటరు జాబితా’
అమరచింత: పురపాలిక ఎన్నికల సందర్భంగా గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు , సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పుర, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై పది వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలను గురువారం ప్రదర్శించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదని.. ఇప్పుడు ఓటర్ల పేర్లు ఏకంగా వార్డుల వారీగా తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో పురుష ఓటర్లు 4,404, మహిళా ఓటర్లు 4,813, మొత్తం ఓటర్లు 9,217 మంది ఉన్నారని.. వీరంతా తమ తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటరు జాబితాను సవరించాలని కోరుతున్నారు. పుర కమిషనర్తో పాటు మేనేజర్, సిబ్బంది మద్య సఖ్యత లేక ఓటరు జాబితాలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. -
వేరుశనగకు డిమాండ్
● ప్రస్తుత యాసంగిలో సాగు విస్తీర్ణం 24,738 ఎకరాలే.. ● మినుము సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు ● మార్కెట్లో జోరుగా సాగుతున్న పల్లి విక్రయాలు ●వనపర్తి: జిల్లాలో వరుసగా రెండేళ్లు వేరుశనగ ధరలు ఆశాజనకంగా లేకపోవడం.. పంట సాగుకు రాత్రి, పగలు శ్రమించాల్సి రావడంతో రైతులు ప్రస్తుత యాసంగిలో మినుము సాగుకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్కు వేరుశనగ పంట ఉత్పత్తుల రాక తగ్గడంతో ప్రస్తుతం క్వింటా రూ.9,269కు చేరింది. కనిష్ట మద్దతు ధర రూ.7,263 ఉండగా.. జిల్లాకేంద్రంలోని మార్కెట్లో గరిష్టంగా 9,269.. కనిష్టంగా రూ.4,444 ధర పలుకుతోంది. నాణ్యమైన వేరుశనగకు గరిష్ట, సాధారణ ధరలు సైతం కనిష్ట మద్దతు ధర కంటే అధికంగా రూ.7,699 పలుకుతుండటంతో పంట సాగు చేయని రైతులు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన మినుము సాగు.. జిల్లా రైతులు ప్రస్తుత యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి తర్వాత అత్యధికంగా మినుము సాగునే ఎంచుకున్నారు. మార్కెట్లో ధరలు మాత్రం గతంతో పోలిస్తే ఆశాజనకంగా లేవనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో క్వింటా రూ.9 వేలకు పైగా ఉండగా.. ప్రస్తుతం రూ.7,600లకు మించడం లేదు. దీంతో రైతులు చేసేది లేక రవాణా ఖర్చులు మిగులుతాయని పొలం వద్దే దళారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏమిటీ మార్కెటింగ్ మాయ..? రాత్రింబవళ్లు కష్టపడే రైతులను మార్కెట్లో ఎప్పటికప్పుడు చిన్నబుచ్చుతూనే ఉన్నారు. ప్రతిసారి మార్కెట్లో ఎక్కువగా పండించిన పంటలకు ధర లభించకోవడం.. తక్కువగా సాగు చేసిన మెట్ట పంటల ధరలు పెరగడం మార్కెటింగ్ మాయనా, లేక వాస్తవంగా ధరలు అలాగే ఉంటాయా? అనే విషయం తేలాల్సి ఉంది. 8,500 క్వింటాళ్ల విక్రయాలు.. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో 40 రోజుల వ్యవధిలో 8,500 క్వింటాళ్ల వేరుశనగ విక్రయాలు జరిగాయి. క్వింటా గరిష్టంగా రూ.9,269, కనిష్టంగా రూ.4,444.. సాధారణ ధర రూ.7,499 పలికినట్లు అధికారుల రికార్డులతో స్పష్టమవుతోంది. జిల్లాలో క్వింటా గరిష్టంగా రూ.9,269 -
పుర ఎన్నికల్లో సత్తా చాటుదాం : బీజేపీ
ఆత్మకూర్: స్థానిక పురపాలికలోని 10 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేర్వ రాజు, పుర మాజీ ఫ్లోర్లీడర్ అశ్విన్కుమార్ కోరారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పుర ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పొత్తు పెట్టుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పుర ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరి, ఆంజనేయులు, తమ్మలి విజయ్, ఆనంద్, తమ్మలి వెంకటేష్, రాము, విష్ణువర్ధన్రెడ్డి, శివశంకర్, శ్యామ్, సమద్, అనీల్గౌడ్, కొండాపురం రాము తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
హరిత సంరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం
వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేషనల్ గ్రీన్ క్రాప్స్ డైరెక్టర్, హైదరాబాద్ ఆదేశాలనుసారం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లోని 8, 9వ తరగతి విద్యార్థుల కోసం వేస్ట్ టూ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపితే పచ్చదనం పదిలంగా ఉంటుందన్నారు. ఇందులో విద్యార్థులు భాగస్వాములవడంతో వారి కుటుంబం మొత్తం భాగమవుతారని, దీంతో పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు యధాస్థితికి వస్తాయని చెప్పారు. పరిసరాల్లోని వ్యర్థాలను అర్థవంతమైన వస్తువులుగా మార్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ఆకర్షణీయమైన కళారూపంగా తీర్చిదిద్దవచ్చని ప్రదర్శన ద్వారా విద్యార్థులు రుజువు చేశారని అభినందించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, కేతేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.2 వేలు, బాలుర ఉన్నత పాఠశాలకు మూడో బహుమతిగా రూ.వెయ్యి అందజేసినట్లు ఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.సుదర్శన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలి
వనపర్తిటౌన్: అధికారులు, సిబ్బంది నూతన సంవత్సర లక్ష్యాలను నిర్దేశించుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృత నిశ్చయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ను ఆయన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల వనపర్తిటౌన్: పుర ఎన్నికల కసరత్తులో భాగంగా గురువారం రాత్రి పుర కార్యాలయం ఎదుట అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను విడుదల చేసినట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉందని, ఓటరు జాబితాను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచమన్నారు. 10వ తేదీన ఫొటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ శంకర్, డీఈ యూనుస్, ఆర్వో సాయిలు, ఆర్ఐ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
వనపర్తిటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో 2025 సంవత్సరంలో అతి తక్కువ సెలవులు తీసుకున్న ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని ఆయన శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి మాట్లాడారు. సెలవులు ఉన్నా.. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతి కోసం తక్కువ వినియోగించుకొని తోటి వారికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్తమ సిబ్బందిని సన్మానించడంతో తోటివారు నూతనోత్తేజంతో పని చేస్తారని, తద్వారా ప్రభుత్వ కళాశాలలు మరింత మెరుగుపడి విద్యార్థులకు లాభం చేకూరుతుందని తెలిపారు. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున అధ్యాపకులు విద్యార్థులకు అందుబాటులో ఉండి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అతి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో ప్రిన్సిపాల్స్ హైమావతి, భీమసేన, అధ్యాపకులు రాజి, కవిత, శిరీష, శ్రీనివాస్, రవీందర్, బోధనేతర సిబ్బంది శ్రీరాములు, మహబూబున్నీసా బేగం ఉన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటు చోరీ..!
సవాయిగూడెంలో ● విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు ● జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ ● 8వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ● బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు. గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు. -
పక్కాగా రహదారి భద్రత మాసోత్సవాలు
వనపర్తి: జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా రోడ్డు రవాణాశాఖ అధికారులతో కలిసి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల వాల్పోస్టర్లు, కరదీపికలు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రోజుకు ఒకటి చొప్పున నెల రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, యువత, వాహనదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 8వ తేదీన కలెక్టరేట్ నుంచి ట్యాంక్బండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి లఘు నాటికలు ప్రదర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 9వ తేదీన జిల్లాలోని లారీడ్రైవర్లు, 13న ఆటోడ్రైవర్లు, 19న తుఫాన్, ఇతర లైట్ గూడ్స్ వెహికిల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలపై ఒకరోజు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, వెహికిల్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ సంబురం..
● నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ● ఇళ్ల ముంగిట కనిపించిన రంగురంగుల రంగవల్లులు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇళ్లతో పాటు కాలనీలలో కేక్లు కట్ చేయడంతో పాటు ఒకరికొకరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. యువత ‘విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. గురువారం ఉదయం మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలంటూ ప్రజలు ఉదయాన్నే ఆలయాలకు చేరడంతో కిక్కిరిశాయి. శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంతో పాటు జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, పాండురంగ విఠలేశ్వరస్వామి, చింతల హనుమాన్, బ్రహ్మంగారి ఆలయాలతో పాటు రామాలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలు, ఆత్మకూర్లోని సాయిబాబా, అయప్పస్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అలాగే జిల్లాకేంద్రంతో పాటు ఆత్మకూర్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి రూరల్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎంవీఐ వాసుదేవారావు కోరారు. గురువారం పెబ్బేరులోని ఎంవీఐ కార్యాలయంలో రెండో ఎస్ఐ దివ్యారెడ్డితో కలిసి రోడ్డు భద్రతా మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. అతి వేగంగా, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్గౌడ్, ఊశన్న, సిబ్బంది ఉమారాణి, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్, ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కె.జ్యోతి, బి.వెంకటేష్, కోశాధికారి తిమ్మప్ప, డీఎస్ఓ శ్రీనివాసులు, ఆనంద్, జిల్లా కార్యదర్శులు హమీద్, పి.శ్రీనివాస్గౌడ్, జి.మురళి, వెంకటేష్, నాయకులు ఎన్.చంద్రయ్య, మల్లేష్, కృష్ణ, లక్ష్మణ్గౌడ్, నాగరాజు, రాము, నర్సింహ, మధు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫ రా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు గోపాల్పేట: నూతన సంవత్సరం మొదటిరోజు గురువారం మండలంలోని బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు నుంచే వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయటి వరకు క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. -
ఆశయాలు.. ఆకాంక్షలు నెరవేరాలి
ఉన్నత చదువులతోనే అత్యున్నత శిఖరాలకు.. ‘కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. నిర్దేశించుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని 2025కు గుడ్బై చెబుతూ.. 2026కు స్వాగతం పలికేందుకు అన్నివర్గాల వారు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు తెలుసుకొనేందుకు బుధవారం జిల్లాలోని పెద్దగూడెం శివారు మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. మరికొన్ని నెలల్లో పీజీలోకి అడుగుపెట్టే విద్యార్థుల భవిష్యత్ ప్రణాళిక, సాగులో మార్పులు.. అందుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సమాజం.. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సేంద్రియ సాగు ప్రోత్సాహం, పద్ధతులపై వారితో చర్చించగా.. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2026 సంవత్సరంలో అందరూ బాగుండాలి.. విద్య, ఉద్యోగ అవకాశాలు ఆశించిన మేర లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతితో కలిసి విద్యార్థులు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. – వనపర్తి/వనపర్తి రూరల్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నా. మా అధ్యాపకుల సూచనల మేరకు ఎమ్మెస్సీ ఎంటమాలజీ, పీహెచ్డీ చేయాలని ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదువుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నా. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నా. – పద్మజ, విద్యార్థిని, మహబూబ్నగర్ నేను వనపర్తి ఎంజేపీ బాలికల అగ్రికల్చర్ కళాశాలలో బీఎసీ (అగ్రికల్చర్) చివరి సంవత్సరం చదువుతున్నా. తర్వాత ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) చదవాలని ఉంది. సొంత కాళ్లపై నిలబడి జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించుకున్నా. – నవ్యశ్రీ, విద్యార్థిని, నారాయణపేట గడిచిన ఏడాది మధుర స్మృతులను గుర్తు చేసుకొని, కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను నోట్ పుస్తకంలో రాసుకున్నా. మంచిగా చదివి ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ ఎంటమాలజి చేయాలని ఉంది. ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్పై పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు అందించాలనేదే లక్ష్యం. – లావణ్య, విద్యార్థిని, వికారాబాద్ అగ్రికల్చర్ బీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ అగ్రికల్చర్) చదవాలని ఉంది. ప్రజలకు కల్తీలేని ఆహారం అందించేందుకు సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తా. అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్పై రైతులకు కల్తీలేని ఎరువులు అందించేందుకు కృషి చేస్తా. ఇందుకోసం 2026 సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతా. – అలేఖ్య, నిజామాబాద్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ప్రస్తుత వార్షిక పరీక్షల్లోనూ ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడి చదువుతున్నా. ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం. – ఉషాశ్రీ, జనగామ ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) చదివి స్వశక్తితో జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా. మంచి వ్యాపారం ప్రారంభించి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉంది. వ్యాపారరంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే కోరిక ఉంది. – శివాని, విద్యార్థిని, నల్గొండ జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ చర్చాగోష్టి కొత్త సంవత్సరంలో తమ ఆశయాలు, అభిప్రాయాలు పంచుకున్న పలువురు విద్యార్థులు -
మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తూ వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని సరళాసాగర్ జలాశయంలో ఉచిత చేప పిల్లలను సంఘం నాయకులు, పార్టీ నేతలతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే ఆయన ఆశయమని.. కులవృత్తులపై ఆధారపడిన వారికి భరోసా కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా వందశాతం సబ్సిడీతో నాణ్యమైన చేప పిల్లలను అందిస్తున్నారని వివరించారు. చేపల విక్రయాల కోసం సంచార విక్రయ కేంద్రాలు, ఆధునిక మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. సరళాసాగర్ జలాశయంపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసరావు, నాగరాజుగౌడ్, మత్స్యశాఖ ఏడీ లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు రాజవర్ధన్రెడ్డి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
పురపోరు.. కసరత్తు జోరు
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు ● అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం ● మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ● ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల ● రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన రోజే మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత: డీఎస్పీ
ఖిల్లాఘనపురం: శాంతిభద్రతల పరిరక్షణ సమష్టి బాధ్యతని.. విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పరిసరాలు, స్టేషన్కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎస్ఐతో పాటు సిబ్బంది నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్స్టేషన్ అంటే భయపడేలా కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసేలా ఉ ండాలన్నారు. అందుకు స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు. అదేవిధంగా సిబ్బందికి పలు సూచన లు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట ఎస్ ఐ వెంకటేశ్తో పాటు సిబ్బంది ఉన్నారు. అమరచింతకు బస్సులు నడపండి వనపర్తిటౌన్: జిల్లాకేంద్రం నుంచి అమరచింతకు ఉదయం సమయంలో బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్లు చేసి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేయగా నమోదు చేసుకొని సమాధానం ఇచ్చారు. శ్రీరంగాపురం పుణ్య క్షేత్రానికి పెబ్బేరు మీదుగా, కేతేపల్లి, కల్వరాల మీదుగా వీపనగండ్లకు బస్సులు నడపాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నూతనోత్సాహం..
● వాడవాడలా యువత, చిన్నారుల సందడి ● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2025 సంవత్సరం గడిచిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి పట్టణాల్లోని మిఠాయి దుకాణాలు, బేకరీలు, మద్యం దుకాణా వద్ద రద్దీ కనిపించింది. అర్ధరాత్రి 12 దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఇళ్లు, రహదారులపై కేక్లు కట్ చేసి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. యువత ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం వేళ భక్తుల దర్శనార్థం గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, చర్చిలను ముస్తాబు చేశారు. – వనపర్తి టౌన్/ఆత్మకూర్ -
స్థానికం.. సంస్థాగతం!
వనపర్తిపాలమూరులో కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్నగర్లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట -
శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో..
వనపర్తి రూరల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామున 4.30 గంటలకు వైకుంఠద్వారం దగ్గర ద్వార పూజ నిర్వహించి రంగనాయకస్వామి, గోదాదేవి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీపై ఉత్తరద్వారం దాటించారు. మహా విష్ణువు అవతారంలో స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేడు డయల్ యువర్ డీఎం
వనపర్తిటౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని గ్రామస్తులు, ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను సెల్నంబర్ 99592 26289కు ఫోన్చేసి తెలియజేయాలని పేర్కొన్నారు. డిపో అభివృద్ధి, కండక్టర్లు, డ్రైవర్ల పనితీరుపై సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ ధర్నా గోపాల్పేట: ఏదుల రిజర్వాయర్ ఉండగా మళ్లీ గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకని.. రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని, వెంటనే పనులు నిలిపివేయాలని గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాల రైతులు, గ్రామస్తులు మంగళవారం గొల్లపల్లి గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిలోమీటర్ దూరంలోనే ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కేఎల్ఐ చేపట్టి నీటినిల్వకు రిజర్వాయర్ నిర్మించకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మిగిలిన కేఎల్ఐ పనులు పూర్తిచేసి ఐదు మండలాల్లోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందించారని వివరించారు. గతంలో కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు గొల్లపల్లి రిజర్వాయర్ ప్రస్తావన తెచ్చారని.. తర్వాత రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విరమించుకున్నారని చెప్పారు. కొల్లాపూర్, వనపర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఏదుల రిజర్వాయర్కు తూము ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అవసరం లేకున్నా గొల్లపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టి రైతుల భూములు లాక్కోవద్దని కోరారు. పనులు చేపడితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామనిహెచ్చరించారు. -
పకడ్బందీగా వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ
వనపర్తి: త్వరలో నిర్వహించే పుర ఎన్నికలకుగాను వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పుర కమిషనర్లు, మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 1న వార్డుల వారీగా ముసాయిదా ఎలక్ట్రోరల్ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా, వార్డులో అసెంబ్లీ ఉప విభాగాల వివరాల ఆధారంగా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను జనవరి 5 నుంచి స్వీకరించి పరిష్కరించిన, తప్పులు లేని తుది ఓటరు జాబితాను 10వ తేదీన ప్రకటించాలని ఆదేశించారు. 5వ తేదీన పుర కమిషనర్లు ప్రముఖ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి వార్డుల వివరాలు తెలిపి అభ్యంతరాలు తీసుకోవాలని, జనవరి 6న కలెక్టరేట్లో కలెక్టర్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. వార్డుల మ్యాపింగ్ తప్పులు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్లు, మేనేజర్లు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో యూరియా
● యాసంగిలో రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తాం ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: యాసంగి 2025–26 సీజన్కు సంబంధించి జిల్లా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని.. ప్రతి రైతుకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. యూరియా సరఫరాపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. వీసీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా, నేరుగా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రైవేటుతో పాటు ప్రభుత్వ, పీఏసీఎస్, మార్క్ఫెడ్ యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా పంపిణీ ప్రారంభం కావాలన్నారు. అదే విధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు దొడ్డురకం వైపు దృష్టిసారించకుండా సన్నరకాలే వేసే విధంగా మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వీసీలో ఇన్చార్జి డీఏఓ దామోదర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్రెడ్డి, డీసీఓ రాణి పాల్గొన్నారు. వైకల్యం శరీరానికే.. లక్ష్యసాధనకు కాదు వైకల్యం అనేది శరీరానికి మాత్రమే అని.. లక్ష్యసాధనకు కాదని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో సకలాంగులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. దివ్యాంగులందరూ తమ వైకల్యాన్ని అధిగమించి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం బాలానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అశ్విన్ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కేవలం రెండో తరగతి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థి అశ్విన్.. రాష్ట్రం పేరు చెబితే రాజధాని పేరు, రాజధాని పేరు చెబితే రాష్ట్రం పేరు వెంటనే చెప్పేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా జిల్లా సమాఖ్య సభ్యులతో పాటు క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులను కలెక్టర్ శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మానసిక వైద్యురాలు పుష్ప, తహసీల్దార్ రమేశ్రెడ్డి, దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు మీసాల మోహన్, మధు పాల్గొన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 30 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. -
సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంతటా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పంటలకే ప్రాధాన్యం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్నగర్లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్కర్నూల్లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. పాలమూరులో వినూత్నపంటల వైపు రైతుల మొగ్గు పలుచోట్ల ఆయిల్పాం, వాణిజ్య తోటల పెంపకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు యూరియా కోసం పాట్లు.. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి రైతులను యూరియా కష్టాలు వెంటాడాయి. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం రోజుల తరబడి పంపిణీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తెల్లవారుజామునే పీఏసీఎస్ల వద్దకు వచ్చి క్యూలో నిల్చోవడం, రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేయడం కనిపించింది. సరిపడా యూరియా తెప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది. -
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయంవనపర్తి రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినానికి ముస్తాబయ్యాయి. వైష్ణవాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఉత్తర ద్వారం వద్ద ద్వారపూజ, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈఓ శేఖర్గౌడ్ తెలిపారు. -
పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆయన సూచించారు. జాప్యం లేకుండాఅత్యవసర సేవలు పాన్గల్: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కోసం సంప్రదించే వారికి జాప్యం లేకుండా సేవలు అందించాలని 108 అంబులెన్స్ల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి సిబ్బందికి సూచించారు. సోమవారం పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జీవీకేఎంఆర్ఐ 108 వాహనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లోని వివిధ రకాల పరికరాలు, వాటి పనితీరు, మందులు, రికార్డులను పరిశీలించారు. 108 అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రజలు అత్యవసర వైద్యం కోసం ఏ సమయంలోనైనా 108ను సంప్రదించవచ్చని.. తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట జిల్లా ఈఎంఈ మహబూబ్, అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విష్ణు, పైలెట్ మురళి ఉన్నారు. ప్రతి కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి అమరచింత: ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అధికారుల అలసత్వం కారణంగానే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికై నా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమరచింత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఉపాధి హమీ 4వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపులను పరిశీలించారు. మండలంలో రూ. 5.50కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారని.. ఏపీఓ రఘుపతిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి డీఆర్పీలు సేకరించిన వివరాలను ఒక్కొక్క పంచాయతీ వారీగా వివరాలను వెల్లడించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పని కావా లని అడిగితే ప్రతి కూలీకి ఉపాధి హామీ పను లు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేసిన కూలీలకు క్రమం తప్పకుండా కూలి డబ్బులు చెల్లించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని.. రోజు మస్టర్లో కూ లీల వివరాలు నమోదు చేయాలన్నారు. కాగా, పక్కదారి పట్టిన రూ. 15,010 రికవరీ చేయా లని ఏపీఓను ఆదేశించారు. సమావేశంలో అంబుర్స్మెంట్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ రహీం, మల్లికార్జున, బాలరాజు పాల్గొన్నారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో సోమవారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగులకు గాను 1,020 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 600, కుడి, ఎడమ కాల్వలకు 35, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032
సోమవారం, సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు వనపర్తి: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డీఎంహెచ్ఓను ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
రాబంధుల పాలన వచ్చే
రైతుబంధు పాలన పోయి.. ● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
ఖిల్లాఘనపురం: ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన అండర్ 14 ఉమ్మడి జిల్లాస్థాయి 5 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలో శశిప్రియ, మీనాక్షి, అండర్ 17 విభాగంలో కె.పూజ, మేఘన చక్కటి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. సోమవారం మల్కాజ్గిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ఎస్ఓ, పీఈటీతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి జలాశయానికి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ఖిల్లాఘనపురం: యువత ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాల ఆర్ఎంఓ డా. శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఖిల్లా సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా ఆయనతో పాటు సేవాసమితి వ్యవస్థాపకుడు, ఏఎస్ఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సేవాసమితి ఏర్పాటుచేసి వైద్య శిబిరాలతో ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం సంతోషించదగిన విషయమన్నారు. ఇలాంటిి కార్యక్రమాల నిర్వహణతో సమాజంలో యువతపై సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిబిరంలో డా. కృష్ణమూర్తి, డా. రవిరాజు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 210 మందిని పరీక్షించగా.. కంటిచూపుతో బాధపడుతున్న 162 మందికి కంటి అద్దాలు తయారు చేయించి వచ్చే వారం అందిస్తామని సమితి వ్యవస్థాపకులు కొరిగెల గోపి, రాగిరి పెద్దరాజు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆగారం ప్రకాష్, గోనెల నాగేష్, గోవిందు, లింగస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గోపాల్, బీజేపీ నాయకులు బెన్నూరు ఆశన్న, రామచంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పోషకాల ఆహారం అందించాలి వనపర్తిటౌన్: విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ పాటిస్తూ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి ఒక బృందం పాల్గొని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. వీటిని జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి ఏదుల మండల సిబ్బంది మంజుల, శైలజ.. ద్వితీయ బహుమతి గోపాల్పేట సిబ్బంది పద్మ, ఎల్లమ్మ.. తృతీయ బహుమతి పెద్దమందడి మండలం మోజర్ల సిబ్బంది అందుకున్నారు. కార్యక్రమంలో ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాసులు, ఎంఈఓలు జయరాములు, మంజుల, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, మౌనిక, ఏపీఓ శ్రీధర్రెడ్డి, వరప్రసాదరావు, శాంతన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల అభ్యున్నతి
వనపర్తిటౌన్: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన కాంగ్రెస్పార్టీ దేశ ప్రజల మన్ననలు చిరకాలం పొందుతూనే ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని.. స్వాతంత్య్ర తొలినాళ్లలో తినడానికి సరైన తిండి లేని పరిస్థితుల నుంచి దేశ గౌరవాన్ని కాపాడుతూ అభివృద్ధి చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. టీపీ సీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ కమిటీ సభ్యుడు డెలిగేట్ శంకర్ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, టీఎస్ మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, జిల్లా నాయకులు కదిరె రాములు, కోళ్ల వెంకటేష్, మధుగౌడ్, ఎండీబాబా, గణేష్గౌడ్, నాగరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటమిని సమానంగా చూడటమే క్రీడాతత్వమని.. గెలిచినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, ఓడినప్పుడు నిరుత్సాహపడొద్దని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు.. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ప్రీమియం లీగ్ సీజన్–6 క్రికెట్ పోటీల చివరి మ్యాచ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బ్యాటింగ్ చేసి పోటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది ఉండదని.. క్రీడాకారులు తమ నైపుణ్యాలతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, లీగ్ నిర్వాహకులు మధు, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. -
కూల్పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం ● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ ● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు ● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ● ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ ● పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ● ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032
తేదీ : 29–12–2025 సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు వనపర్తి: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డీఎంహెచ్ఓను ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
నిర్వాహకులు నిర్లక్ష్యం వీడాలి : డీఆర్డీఓ
వీపనగండ్ల: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం వీడి బాధ్యతాయుతంగా పని చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి హెచ్చరించారు. శనివారం మండలంలోని కల్వరాలలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, వీఓఏలు, మహిళా సంఘం సభ్యులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్ బండారు రాములు, ఏపీఎం మద్దిలేటి, వీఓఏలు నాగయ్య, ప్రసాద్, పలువురు రైతులు, గ్రామస్తులు ఉన్నారు. -
స్పందించిన జిల్లా యంత్రాంగం
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం వై శాఖాపూర్ సర్పంచ్ నిఖిత ఈ నెల 23న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టరేట్లో కలిసి గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఎంపీఓ రోజ శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పాలకులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. -
విధేయులకే కార్యవర్గంలో చోటు
వనపర్తి: డీసీసీ కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న జిల్లా, నియోజకవర్గ, మండల కార్యవర్గాలన్నీ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్పార్టీ జిల్లా పరిశీలకుడు మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. త్వరలో అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో స్క్రీనింగ్ చేసి జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ విధేయులు, పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన వారి తర్వాతే మిగతా వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. పైరవీలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పార్టీ బలోపేతం, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కార్యవర్గాల ఎన్నిక ఉంటుందని వివరించారు. పార్టీ ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పని చేస్తుందని.. స్వ లాభాలు ఆశించదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ డేలిగేట్ శంకర్ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, నాయకులు పసుపుల తిరుపతయ్య, నాయకులు కదిరె రాములు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, బి.కృష్ణ, బాబా, దివాకర్, గణేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్పార్టీ జిల్లా పరిశీలకుడు మెట్టు సాయికుమార్ -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
కొత్తకోట/కొత్తకోట రూరల్: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థ పాలన అందించాలని, గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని, అందుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో కొత్తకోట, మదనాపురం మండలాల్లో కాంగ్రెస్పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. పాలమూరు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం తర్వాత దేవరకద్రలో అత్యధిక సంఖ్యలో పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పుర ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని, రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీ చేసి ఓడిన సర్పంచులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించి తిప్పికొట్టాలన్నారు. రానున్న ఏప్రిల్ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఎల్–1, ఎల్–2 అర్హత పొందిన 37 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. కొత్తకోట పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం పుర కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా సంతబజార్ అభివృద్ధి, పురపాలక భవనం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, ఆడిటోరియం, బస్తీ దవాఖానా ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, ఎన్జే బోయేజ్, శ్రీనివాస్రెడ్డి, రావుల కరుణాకర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, నరేందర్రెడ్డి, పెంటన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళన
వనపర్తి రూరల్: పల్స్పోలియో, కుష్టు సర్వే, ఎన్నికల విధుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని జిల్లా ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం కార్యదర్శి బుచ్చమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, జిల్లా కార్యదర్శి మండ్ల రాజు తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి రెండువారాల్లో కుష్టు సర్వే డబ్బులు చెల్లిస్తామని చెప్పారని.. వెంటనే విడుదల చేయాలన్నారు. ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే చలో హైదరాబాద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం జిల్లా నాయకులు గిరిజ, ఇందిర, లత, అలివేలు, శ్యామల, చెన్నమ్మ, భాగ్యమ్మ, లక్ష్మి, మహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
సైబర్.. టెర్రర్
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు అత్యధికంగా మహబూబ్నగర్లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ -
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
వనపర్తి: జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో సోమవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. జిల్లా లోని దివ్యాంగులు, వారి సంక్షేమానికి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదు వనపర్తి రూరల్: రైతులు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెబ్బేరు, మండలంలోని కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలం నాగరాలలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. పెబ్బేరులో సింగిల్విండో కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, సింగిల్విండో అధికారులతో ధాన్యం సేకరణపై చర్చించారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం లేకపోవడంపై సిబ్బందిని నిలదీశారు. కలెక్టర్ స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధర్మేంద్రసాగర్, దేవర శివ, అస్కాని రమేష్, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామన్పాడుకు నిలిచిన నీటి సరఫరా మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి శనివారం జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందని.. ఎన్టీఆర్ కాల్వకు 620 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ‘ఉపాధిహామీ’ కొనసాగించాలి గోపాల్పేట: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీజీ రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని వెంటనే రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీలతో కలిసి పట్టణంలోని రావిచెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పలు డిమాండ్ల వినతిపత్రాన్ని తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉత్సాహంగా హ్యాండ్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, ఎంఈఓ మద్దిలేటి బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పీడీ మన్యం, దాతలు తిరుమల్రెడ్డి, చీర్ల వెంకటసాగర్, మధుగౌడ్, చిన్నారెడ్డి, భాస్కర్, ,గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆద్యంతం.. అయ్యప్ప నామం
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ఉన్న వీరశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప మండలపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మొదలైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగగా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్ సిద్ధాంతశర్మ, గురుస్వాములు అన్నంతో అయ్యప్పను తయారుచేసి ఆవాహించి వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిగ్రహాన్ని అభిషేకించి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పల్లకీసేవ మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో జరిపించారు. మాలాధారులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. రాత్రి 7 గంటలకు గురుస్వాములు అయ్యప్ప ఆల యం ఎదుట గల ఏకశిల పదునెట్టాంబడి పడి పూజ వైభవంగా నిర్వహించారు. రాత్రి 11.30 వరకు పూజ లు అల్పాహారం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఏటా మండల పూజ నిర్వహించే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాలతో దర్శనమిచ్చిన స్వామివారు మార్మోగిన అయ్యప్ప నామస్మరణ -
సమస్యల సాధనకు పోరాటం : సీపీఐ
ఆత్మకూర్: దేశం, రాష్ట్రంలోని సమస్యల సాధనకు ప్రజలు, రైతులు సమష్టిగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు నర్సింహయ్యశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అధ్యక్షతన పట్టణంతో పాటు మండలంలోని మూలమళ్ల, పిన్నంచర్లలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. 1925, డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు అండగా నిలుస్తూ వలసవాదులైన బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాబర్ట్, మోషా, లింగన్న, బాలకృష్ణ, ఆంజనేయులు, భాస్కర్, కుతుబ్, నాగరాజు, కురుమన్న, భీమన్న, చంద్రశేఖర్, లక్ష్మన్న, దాసు, బాలస్వామి, మల్లేష్, గోవర్దన్, చెన్నప్ప, ఆదాం, హనుమంతు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో రూపొందించిన దృష్టి కార్యక్రమాన్ని మధమేహ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకొని సమస్య ఉన్న వారు జాప్యం చేయకుండా వైద్యుడితో మరోమారు పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలి. – డా. సాయినాథ్రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఒకేసారి మూడురకాల కంటి సమస్యలను గుర్తించే ఏఐ సాంకేతికతో రూపొందించిన ఆధునిక యంత్రాలను కలెక్టర్ కొనుగోలు చేశారు. జిల్లాలోని పీహెచ్సీల్లో నిర్వహిస్తున్న శిబిరాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒకే నిమిషంలో పరీక్ష పూర్తవుతుంది. సమస్య ఉంటేనే.. రెండోసారి వైద్యుడితో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. – డా. రాంచందర్రావు, కార్యక్రమ అధికారి, వనపర్తి ● -
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా జిల్లాలో అమలు
● ప్రజారోగ్యంపై కలెక్టర్ చొరవ ● అభినందించిన డబ్ల్యూహెచ్ఓ బృందం, గవర్నర్ ● కంటిచూపు నివారణకు ముందస్తు చర్యలు వనపర్తి: విద్య, వైద్యంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజారోగ్యంలో భాగంగా 2025లో రెండు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు. ఆయా కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం, గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 1న కొత్తకోట పీహెచ్సీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ బృందం జిల్లాలో కొనసాగుతున్న మిషన్ మధుమేహ, దృష్టి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ముందస్తు చర్యల్లో భాగంగా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం ఇతర ప్రాంతాలకు ఆదర్శమని డబ్ల్యూహెచ్ఓ బృందం ప్రతినిధులు కితాబునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారస్ చేయనున్నట్లు వారు రాష్ట్ర పర్యటనలో వెల్లడించారు. ఇటీవల జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటించిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఆయా కార్యక్రమాలపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ముందుజాగ్రత్త చర్యలు, శస్త్రచికిత్సల సిఫారస్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని కలెక్టర్, వైద్యబృందాన్ని అభినందించారు. ఆయా కార్యక్రమాలు త్రిపురలోనూ అమలు చేసేందుకు ఓసారి రాజ్భవన్కు రావాలంటూ గవర్నర్ స్వయంగా కలెక్టర్కు ఆహ్వానించడం గమనార్హం. కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం.. జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారు కంటిచూపు కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, సూచనలు చేయడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్లం (కాంటాక్) ఆపరేషన్తో పాటు కళ్లద్దాలు ఇవ్వడం, తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, ప్రతినెల వారికి అవసరమైన మాత్రలు, మందులు అందిస్తున్నారు. మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా పలు దఫాల్లో 40 ఏళ్లు నిండిన 3.06 లక్షల మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి.. 19,643 మంది వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. వీరికి భవిష్యత్లో తలెత్తే కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించారు. పీహెచ్సీల వారీగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో నవంబర్ 14 నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రెండు యంత్రాలను కొనుగోలు చేసి ఇప్పటి వరకు 2,904 మందిని పరీక్షించి 225 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆప్తమాలజిస్ట్లు మరోమారు పరీక్షలు చేయాలనే నిబంధన ఉండటంతో ఇప్పటి వరకు 116 మందిని వైద్యుడు పరీక్షించి 20 మందిని శస్త్రచికిత్సలకు సిఫారస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో మరో 109 మంది పరీక్షలు వాయిదా పడ్డాయి. -
అలివిలవిల..
కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హాకీ ఆడుతున్న క్రీడాకారులు జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వనపర్తి: అహంకారపూరిత అధికారం, మద్యం, డబ్బు ఏవీ నిబద్ధత ఎదుట నిలబడలేవని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని.. బీఆర్ఎస్ మద్దతుదారులు అధికార పార్టీకి ధీటుగా విజయం సాధించడం గర్వంగా ఉందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో కృష్ణానది జలాల హక్కుల సాధన, పార్టీ గ్రామపంచాయతీ పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి నివాసం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు గులాబీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు రెండేళ్లకే విరక్తి వచ్చిందని పంచాయతీ ఫలితాలతో స్పష్టమవుతోందన్నారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 45 రోజుల పాటు వచ్చిన జూరాల జలాలను సముద్రానికి వదిలేశారని.. వరద జలాలను ఒడిసి పట్టుకునే చేతగాని పాలకులని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలేక యాసంగి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారని విమర్శించారు. ఖిల్లాఘనపురం మండలం సోళీపురం, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామపంచాయతీ ఫలితాలపై అనుమానం ఉందని.. రీ కౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గోపాల్పేటలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతునిచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసి చూపండి.. విమర్శలు కాదు.. ఇచ్చిన హామీలు అమలుచేసి, అభివృద్ధి పనులు చేసి చూపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అధికార పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఊరూరా ట్యాప్లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించిందని ఆరోపించారు. గ్రామ పాలకులకు విశేష అధికారాలు ఉంటాయని, చట్టం తెలుసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని, కేంద్రం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వస్తాయని వివరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు మాణిక్యం, విజయ్, కురుమూర్తి యాదవ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవుల ప్రార్థనలు, గీతాలతో మార్మోగాయి. జిల్లాకేంద్రంలోని ఒలివా ఎంబీ చర్చిలో జరిగిన వేడుకలకు శంషాబాద్కు చెందిన ప్రముఖ దైవ ప్రసంగీకుడు డా. జయకర్ హాజరై సందేశమిచ్చారు. సర్వమానవాళిపై ప్రేమ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలని యేసు ఆచరణలో చూపారని, అలాంటి దేవుడిపై విశ్వాసంతో జీవించాలని కోరారు. సర్వ మానవాళి క్షేమానికి ప్రార్థఽనలు చేశారు. అదేవిధంగా మిగతా చర్చిల్లో కేక్లు కట్ చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో కల్వరి టౌన్ చర్చి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా న్యూయోరిషలేమ్ గాస్పాల్, బేతస్థ ప్రార్థన మందిరిం, హెబ్రోన్, సీయోనుకొండ, క్రీస్తు సాక్షుల సవాస మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో కల్వరి టౌన్ చర్చి నిర్వాహకులు గంధం రంగస్వామి, డి.యాకోబు, పరంజ్యోతి, ఎంబీ వోలీవా చర్చి పాస్టర్ జానప్ప, కల్వరి టౌన్ చర్చి పాస్టర్ జాన్రాజ్, వోలీవా చర్చి చైర్మన్ సుకన్య, యేసయ్య, రోనాల్డ్, కోశాధికారి అమృత సాగర్, సభ్యులు విద్యాసాగర్, కళానందం, పీడీ కమలమ్మ, వనజాశ్రీ, ఎర్నాల్డ్, స్వామిదాస్, జయనందం తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు, నాటికలు.. జిల్లాకేంద్రంలోని పలు చర్చిల్లో బుధవారం రాత్రి చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏసు పుట్టుక, ఇతివృత్తం తెలిపే నాటికలు, ఏసు ప్రభువు ప్రజలపై చూపే జాలి, కరుణ, దయ, క్షమాగుణాలు తెలియజేసే పలు నాటికలు అధ్యంతం అలరించాయి. -
రాష్ట్రస్థాయి క్రాస్కంట్రీ పోటీలకు జిల్లా జట్టు
వనపర్తి విద్యావిభాగం: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 2న జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేసినట్లు డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లా జట్టు ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. పోటీల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల అథ్లెట్లు పాల్గొని ప్రతిభ చాటారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని.. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు వనపర్తి టౌన్: శబరిమలలో అయ్యప్పస్వామికి మండలపూజ సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో అయ్యప్ప మాలధారులు గురువారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాజనగరంలోని అయ్యప్ప ఆలయం నుంచి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. మండలదీక్ష పూజలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప సేవాసమితి నిర్వాహకులు కోరారు. మాలధారులు ముత్తుకృష్ణ, కృష్ణసాగర్, స్వామి, పాపిరెడ్డి, నరేందర్శెట్టి పాల్గొన్నారు. ఆదిశిలా క్షేత్రంలో జడ్జీల ప్రత్యేక పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ విధేయులకు తగిన ప్రాధాన్యం
వనపర్తి: పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికై నా సముచిత స్థానం, ప్రాధాన్యం దక్కుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్పార్టీ చాలా బలంగా ఉందని.. పార్టీ కన్నతల్లి లాంటిదని శ్రేణులు గుర్తించాలని కోరారు. చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలను సంయుక్తంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారని గుర్తు చేశారు. ఉనికి కోల్పోతున్నామనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి తోలు తీస్తామని స్టేట్మెంట్ ఇచ్చి తిరిగి అక్కడికే చేరుకున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను త్వరలో ఎత్తివేస్తామని క్యాడర్లో ధైర్యాన్ని నింపారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ప్రభుత్వానికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. రాబోయేది కూడా కాంగ్రెస్ హయాంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. వలసల పాలమూరు అభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే.. రాహుల్గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ కలిసి ఉండేందుకు నాలుగు మెట్లు దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన లోపాలను గుర్తించేందుకు కమిటీ వేయాలని.. నిజాలను వెలికితీసి భవిష్యత్లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుందామన్నారు. పాత.. కొత్త అనే తేడాలు లేకుండా ఒక్కటే అన్న పేరును తీసుకొద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ ముగిసిన తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి డీసీసీ అధ్యక్షుడిని సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన కార్యాలయంలో పూజలు చేశారు. పని చేయకుంటే పక్కనబెట్టుడే.. పార్టీ పదవులు పొంది పని చేయకుండా సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైతే పక్కన పెడతామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు సిఫారస్ చేసినా ఉపేక్షించేది లేదని డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తకాపు శివసేనారెడ్డి తెలిపారు. పార్టీ బాగుంటేనే పదవులు పొంది ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యాధునిక హంగులతో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేస్తామని, మనస్పర్థలను చర్చలతో రూపుమాపి ఎదురులేని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు సంధ్య, మల్లయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శంకర్ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, ధనలక్ష్మి, యాదగిరి, బాబా తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల స్వీకారంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి -
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: మండలంలోని అంకూరులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలంటూ రైతులు గురువారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం కేంద్రంలో రెండు నెలలుగా ఆరబోసుకున్నామని, తూకం చేసిన సంచులను తరలించకపోవడంతో వరాహాల దాడి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లారీల ధాన్యం కేంద్రంలో నిల్వ ఉందని.. వెంటనే తరలించాలని వారు కోరారు. ఆందోళనతో రహదారిపై రాకపోకలు నలిచి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులు, రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
వనపర్తి రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, సర్పంచ్ తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీలను వారితో పాటు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పరిశీలకుడు పాండురంగారెడ్డి, మద్దిలేటి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 200 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారని, శుక్రవారం చివరి పోటీలు ఉంటాయని వివరించారు. రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొదటిరోజు విజేతలు వీరే.. మొదటి మ్యాచ్ మెదక్, ఖమ్మం జట్లు, రెండో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరగగా డ్రాగా ముగిశాయి. 3వ మ్యాచ్లో వరంగల్ జట్టుపై నల్లగొండ జట్టు 2–0 గోల్స్తో.. 4వ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై మహబూబ్నగర్ జట్టు 4–0 గోల్స్తో.. 5వ మ్యాచ్లో రంగారెడ్డి జట్టుపై నిజమాబాద్ జట్టు 5–0 గోల్స్తో.. 6వ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై మెదక్ జట్టు 1–0 గోల్స్తో.. 7వ మ్యాచ్లో వరంగల్ జట్టుపై హైదరాబాద్ జట్టు 2–0 గోల్స్తో 8వ మ్యాచ్ ఖమ్మం జట్టుపై మహబూబ్నగర్ జట్టు 2–0 గోల్స్తో విజయం సాధించాయి. 9వ మ్యాచ్లో హైదరాబాద్, నల్లగొండ జట్టుతో తలపడగా డ్రాగా ముగిసింది. 10వ మ్యాచ్లో ఖమ్మం జట్టుపై కరీంనగర్ జట్టు 1–0 గోల్స్తో.. 11వ మ్యాచ్లో వరంగల్ జట్టుపై నిజామాబాద్ జట్టు 4–0 గోల్స్తో.. 12వ మ్యాచ్లో మెదక్ జట్టుపై మహబూబ్నగర్ జట్టు 2–0 గోల్స్తో.. 13వ మ్యాచ్ వరంగల్ జట్టుపై రంగారెడ్డి జట్టు 2–0గోల్స్తో.. 14 మ్యాచ్ నల్గొండ జట్టుపై నిజమాబాద్ జట్టు 4–0 గోల్స్తో విజయం సాధించిందని టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నిరంజన్గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమస్యల ప్రాంగణం
జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన పాత బస్టాండ్ ● కనీస సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు లేని దుస్థితి ● వెలగని విద్యుద్దీపాలు.. అరకొరగా కుర్చీలు ● తిరుగు ప్రయాణంలో లోనికి రాని బస్సులు –8లో u●పాత బస్టాండ్లో ప్రయాణికులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరింగ్ లేకపోవడంతో పాటు ప్రాంగణమంతా కనిపించేలా లైట్లు లేవు. పెద్దమందడి బస్సులు యధావిధిగా బస్టాండ్లోకి రాకుండా వెళ్తున్నాయి. విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలి. – పవన్ కుమార్, వ్యాపారి పాత బస్టాండ్ను వినియోగంలోకి తీసుకురావాలని భావించి పునరుద్ధరించాం. ప్రహరీ, మూత్రశాలలు, ఫ్లోరింగ్ నిర్మాణాలకు రూ.28 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం లభిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – దేవేందర్గౌడ్, డిపో మేనేజర్, వనపర్తి ఆర్టీసీ వననపర్తిటౌన్: దశబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ను ఆర్టీసీ అధికారులు ఎట్టకేలకు వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రాంగణమంతా దుమ్ము, ధూళితో నిండటంతో లోనికి వచ్చే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు లోనికి, బయటకు వెళ్లేందుకు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ఆత్మకూర్, కొత్తకోట మీదుగా మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లే కొన్ని బస్సులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండగా.. తిరుగు ప్రయాణంలో లోనికి రాకుండా బయటే ప్రధాన రహదారిపైనే ప్రయాణికులను దించేస్తున్నారు. పాత బస్టాండ్కు అతి సమీపంలోనే ఉన్న రాజీవ్చౌక్ మినీ బస్టాండ్గా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లే పెద్దమందడి బస్సు అవతలి రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. 33 ఏళ్ల తర్వాత నెల కిందట ఆగమేఘాల మీద హడావుడిగా పాత బస్టాండ్ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏడాది కిందట రూ.9.50 లక్షలతో టెండర్ పిలిచి బేస్మెంట్, 15 గీ30 సైజులో రేకుల షెడ్ నిర్మించి కొన్ని కుర్చీలు ఏర్పాటుచేశారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మట్టిని చదునుచేసి ప్రారంభించారు. బస్సుల రాకపోకల సమయంలో దుమ్ము, ధూళితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
‘మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం’
అమరచింత: పూటకో పార్టీ మార్చిన మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్లో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అసభ్య పదజాలంతో ధూషించడం, అవహేళన చేస్తూ నోటి దురుసును ప్రదర్శించడం సరికాదన్నారు. పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడితే ఎందుకంత కడుపుమంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో వచ్చిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు కాంగ్రెస్ వారు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొనే మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ చెరువుల్లో 12 లక్షల చేప పిల్లలు వదిలానని.. ప్రస్తుత మంత్రి కేవలం 2 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసిన విషయం మత్స్యకారులకు తెలుసని చెప్పారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాదని.. తమ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావుతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నది నిజం కాదా అంటూ ఫొటోను చూపించారు. జూరాలకు సమృద్ధిగా వరద వస్తే రెండో పంటకు క్రాప్ హాలీడే ప్రకటించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, క్రాప్ హాలిడే విషయాన్ని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జూరాల ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, రమేష్ ముదిరాజ్, బీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేష్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్ఏ రాజు, మస్తీపురం సర్పంచ్ సాంబశివుడు, మాజీ వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, జింక రవి తదితరులు పాల్గొన్నారు. -
‘సైబర్’దే జోరు..!
వనపర్తి: జిల్లాలో సాధారణ చోరీలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టగా.. సైబర్ నేరాల సంఖ్య రెండింతలు పెరిగింది. అధికారులు నిత్యం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా.. నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారనేందుకు ఎస్పీ డి.సునీతరెడ్డి బుధవారం వెల్లడించిన వార్షిక నేర నివేదికతో స్పష్టమవుతోంది. 2024లో సైబర్ నేరాలు 64 నమోదు కాగా.. 2025 నవంబర్ వరకే 122కు చేరడం గమనార్హం. అఽధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో సైబర్ నేరాలను తగ్గించేందుకు 596 అవగాహన సదస్సులు నిర్వహించినా.. ప్రయోజనం ఆశాజనకంగా లేకపోవడం శోచనీయం. ఇకపోతే.. ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన హత్యలు గతేడాది ఒకటి నమోదుకాగా.. 2025లోనూ అదే సంఖ్య పునరావృతమైంది. స్వల్పంగా పెరిగిన రికవరీ.. జిల్లాలోని 15 పోలీస్స్టేషన్ల పరిధిలో గతేడాది 264 కేసులు.. 2025లో 211 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఛేదించిన కేసుల సంఖ్య తగ్గువగా ఉన్నా.. సొమ్ము రికవరీ మాత్రం గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. 2024లో 158 కేసులు ఛేదించి చోరీ సొమ్ములో 43.51 శాతం రికవరీ చేయగా.. 2025లో 148 కేసులు ఛేదించి 52 శాతం సొమ్ము రికవరీ చేసినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పోక్సో కేసులు రెండింతలు.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోక్సో కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు అధికారిక లెక్కలతో స్పష్టమవుతోంది. 2024లో 44 కేసులు నమోదు కాగా.. 2025లో ఇప్పటి వరకు ఆ సంఖ్య 80కి చేరడం గమనార్హం. వీటితోపాటు బలవన్మరణాలు సైతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అత్యాచారం కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది 10 నమోదు కాగా.. 2025 ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే ఉన్నాయి. 2,049 సీసీ కెమెరాలతో నిఘా.. జిల్లాలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,049 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వీటిలో కొన్ని సాంకేతిక సమస్యతో నిరుపయోగంగా మారగా మరమ్మతు చేయిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి శ్రీధర్రెడ్డి హత్య కేసు, జిల్లాకేంద్రంలో ఏటీఎం చోరీ కేసుపై ఎస్పీ మునుపటి పాత సమాధానం పరిశీలిస్తామని చెప్పడం కొసమెరుపు. కీలక కేసుల్లో జీవితఖైదు.. గోపాల్పేట, ఆత్మకూర్ పీఎస్ల పరిధిలోని హత్య కేసుల్లో నేరస్తులకు జీవిత ఖైదు, కొత్తకోట పీఎస్ పరిధిలోని అత్యాచారం కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. దీంతోపాటు లోక్ అదాలత్లో 708 సాధారణ కేసులకు పరిష్కారం లభించింది. పెరిగిన సైబర్ నేరాలు, పోక్సో కేసులు, బలవన్మరణాలు తగ్గిన చోరీలు.. 52 శాతం రికవరీ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. 2024తో పోలిస్తే 2025లో అధికారులు కొంత వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. గతేడాది 701 అర్జీలు దాఖలు కాగా.. 663 పరిష్కరించారు. 38 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 460 అర్జీలు దాఖలు కాగా.. వాటిలో 324 మాత్రమే పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న అర్జీల సంఖ్య 136గా పేర్కొన్నారు. దాఖలైన అర్జీల్లో 25 శాతం పరిష్కారానికి నోచుకోలేదు. -
నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, పుర ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరారు. ఇప్పటి వరకు స్థానిక పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని.. రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఇప్పటి వరకు 500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. అలాగే జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలేవల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. క్రాప్ హాలిడే అంటూ పుకార్లు.. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్ష నేతలు లేనిపోని పుకార్లు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని.. జూరాలకు క్రాప్ హాలిడే, వారబందీ అంటూ వదంతులు సృష్టిస్తున్నారని మంత్రి వాకిటి అసహనం వ్యక్తం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించారని, జూరాల కూలుతుందని గతంలో పుకార్లు సృష్టించారని.. అదేమీ కాళేశ్వరం కాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. ప్రస్తుతం వేల ఇళ్లు నిర్మించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులని.. అన్నీ గమనిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గాడి కృష్ణమూర్తి, పరమేశ్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, సుదర్శన్శెట్టి, షబ్బీర్, కలీం, రవికాంత్, రవీందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
అభివృద్ధి చేసుకుందాం
పార్టీలు, పంతాలు వద్దు.. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు.. పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మి చంద్రశేఖర్రావును ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు చేసింది శూన్యమని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతోనే గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో తెచ్చిన జీఓ 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే కమీషన్లు దండుకుందన్నారు. పాలమూరుపై చిన్నచూపుతోనే పదేళ్లలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీతో పాటు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే.. ముఖ్యమంత్రిగా నేను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందిందన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 96 శాతం మంది రైతులు భూములు ఇస్తున్నారన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘పోరాటాలకు సిద్ధం కావాలి’
వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్ఐ, టీఎస్టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్గౌడ్, అరుణ, ఆర్.రామన్గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు. నేటినుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు వనపర్తి రూరల్: కడుకుంట్లలో గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ నిరంజన్గౌడ్ తెలిపారు. క్రీడల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్భవన్ను లోక్భవన్గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్ను జ్ఞాపికగా అందజేశారు. -
జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు
● కృష్ణానది తీరాన 108 ఎకరాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. 1.50 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరితే కూలుతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూలేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని.. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశామన్నారు. కృష్ణానది సమీపంలో 108 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో పేదలకు ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, మహంకాళి, మార్కెట్ డైరెక్టర్ విష్ణు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ● అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఎం మండల నాయకులు జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రమేష్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. -
అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్తో పరిచయం చేసుకున్నారు. -
రహదారి భద్రతపై విస్తృత అవగాహన
● టోల్ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: రహదారి భద్రత వారోత్సవాలు జనవరిలో కొనసాగనున్నాయని.. గ్రామాల్లో రహదారి ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. పోలీస్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి జాతీయ రహదారి, ఆర్అండ్బీ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అంబులెనన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకొని ఉండాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారిపై గుర్తించిన వెల్టూరు, పాలెం, మదర్ థెరిస్సా కూడలి, అమడబాకుల, రంగాపూర్, ఆనందభవన్ తదితర బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కొనసాగడానికి కారణాలు ఏమిటనే విషయాలు అన్వేషించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, వేగం కొలిచే యంత్రాలు వంటివి సిద్ధం చేయాలన్నారు. -
క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరి : ఎస్పీ
వనపర్తి: నేర రికార్డులను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యాలయంలో వివిధ రికార్డులతో పాటు షీ టీం పనితీరు రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో అలసత్వం ఉండరాదని, ప్రతి నమోదు న్యాయ ప్రక్రియకు ఆధారంగా నిలుస్తుందని అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత డీఎస్పీతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, గ్రేవ్ కేసుల పురోగతి, విచారణ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రతి కేసు చట్టబద్ధంగా, బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సాగాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని.. ప్రతి కేసు చట్టబద్ధంగా, నిర్దిష్ట గడువులోగా పక్కా ఆధారాలతో ముందుకు సాగాలన్నారు. రికార్డుల నిర్వహణలో పొరపాట్లు ఉంటే న్యాయస్థానాల్లో కేసులు బలహీనపడతాయని బాధ్యతతో మెలగాలని, బాధితులకు భద్రత, గౌరవం, న్యాయం కల్పించడమే పోలీసుశాఖ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రతి విభాగంలో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆమె వెంట సీఐ కృష్ణయ్య, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి, గోపాల్పేట ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. నేడు కోస్గికి సీఎం రాక కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘ఉపాధి కల్పన’ను వినియోగించుకోవాలి పాన్గల్: గ్రామీణ ప్రాంత యువత, మహిళలు, రైతులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మహబూబ్నగర్ ప్రాంతీయ అధికారి సైదా, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అబ్బాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. సోమవారం మండలంలోని మల్లాయిపల్లిలో సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా అందే రుణాలకు 25 శాతం, 35 శాతం రాయితీ అందుతుందని వివరించారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
వనపర్తి: పోలీసు బాధ్యతను మానవీయ విలువలతో మేళవిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. సంబంధిత అధికారులతో ఎస్పీ మాట్లాడి బాధితుల సమస్యలు త్వరగా పరిష్కించేలా కృషిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగే వరకు పోలీసుశాఖ బాధ్యతగా పనిచేస్తుందని బాధితులకు భరోసానిచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల నమ్మకమే పోలీసు శాఖ బలమని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని అన్నారు. దివంగత పార్లమెంట్ సభ్యుడు, సామాజిక కార్యకర్త జి.వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికపై ధైర్యంగా ప్రస్తావించిన ప్రజాప్రతినిధి వెంకటస్మామి అని.. ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వు ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పల్లెల్లో నవశకం..
●అమరచింత/మదనాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన అభ్యర్థులు సోమవారం సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో మొత్తం 268 గ్రామ పంచాయతీలకు గాను 267 జీపీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సర్పంచులు తమ పేర్లను ప్రస్తావిస్తూ.. అందరి భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతామని, రాజకీయాలు, వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ సమాన దృష్టితో సంక్షేమ పథకాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాకుండా అక్షరాస్యతలో సైతం తమ గ్రామాలను ముందుంచుతామన్నారు. కాగా, మదనాపురం మండలం కొత్తపల్లిలో సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. పెబ్బేరు మండలం వై శాగాపూర్, తోమాలపల్లె, కంచిరావుపల్లి గ్రామాల్లో కొలువుదీరిన పాలకవర్గాలను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించారు. పండుగ వాతావరణంలో.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు పంచాయతీ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని భవనాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణల్లో టెంట్లు వేయడంతో పండుగ వాతావరణం కనిపించింది. కొన్ని జీపీలకు రంగే లేదు.. జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను నామమాత్రపు ముస్తాబు చేయడంతోనే సరిపెట్టారు. భవనాలకు కొత్తగా పెయింటింగ్ వేయకపోవడంతో పాలకవర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. కొందరు ఇదేం పద్ధతని పంచాయతీ కార్యదర్శులను అడిగితే డబ్బులు లేవని సమాధానం ఇచ్చినట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. జిల్లాలో పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలను పండుగ వాతావరణంలో పూర్తిచేశాం. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు ఆయా గ్రామ పంచాయతీలకు హాజరై సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణం చేయించారు. ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేశాం. – రఘనాథ్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ రెండేళ్ల తర్వాత పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు జిల్లాలో 268 గ్రామ పంచాయతీలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేశారు. చిన్నచిన్న పొరపాట్లకు సైతం తావివ్వకుండా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. -
రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్హాలిడేనా?
● చేతకాని పాలనకు ఇదే నిదర్శనం ● మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ ఉన్నారు. -
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పోలీసు గౌరవ వందనం సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలపై రూపొందించిన స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం, ఫొటో సెషన్లో గవర్నర్ పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన కవులు, కళాకారులతో గవర్నర్ పరిచయ కార్యక్రమం ఉంటుందని.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, తహసీల్దార్ రమేశ్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాశ్ ఉన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 20 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటివరకు 48.96 శాతమే పూర్తి చేశారని.. మరింత వేగవంతం చేసి వందశాతం లక్ష్యం సాధించాలన్నారు. రోజు ప్రతి మండలంలో 100 మందిని మ్యాపింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విషయంపై బూత్స్థాయి అధికారులకు సూచనలు చేయాలని.. 10 శాతం కన్నా తక్కువ ఉన్నవారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో బ్లర్గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్ఓలతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
మదనపురం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మండలంలోని సరళాసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు నిమిత్తం శనివారం సాయంత్రం జలాశయం ఎడమ కాల్వ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసాచారి, డైరెక్టర్ పావని, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, జగదీశ్, అక్కల మహదేవన్గౌడ్, రాజవర్ధన్రెడ్డి, సాయిబాబా, శ్రీధర్రెడ్డి, డీలర్ లక్ష్మయ్య, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
గోపాల్పేట: గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని ఎస్ఈ వెంకట్రామన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆయనతో పాటు శాఖ అధికారులు పర్యటించి నీటి సరఫరాపై ఆరా తీశారు. మిషన్ భగీరథ మంచినీరు సరిగా రావడం లేదని, బోరు నీటినే పైప్లైన్ ద్వారా వదులుతున్నారని రేవల్లిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అందరికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జీ రామ్జీ బిల్లు రద్దు చేయాలి : సీపీఎం కొత్తకోట: లోక్సభలో బలవంతంగా ఆమోదించిన జీ రామ్జీ బిల్లును వెంటనే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కొనసాగించాలని సీపీఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ పాలనలో వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా, అధికార దురహంకారంతో పేర్లు మార్చి కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు రోజువారి వేతనం రూ.600కు పెంచాలని, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నాయకులు వెంకటయ్య, గొల్ల రాములు, యాదయ్య, మల్లేష్, నాగన్న, కురుమయ్య, వెంకటేష్, గోపాల్, శ్రీను, రాములు, గోవర్దన్, మహేష్ పాల్గొన్నారు. ఎన్నికలను డబ్బు, మద్యం శాసిస్తున్నాయి : సీపీఐ అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను ప్రస్తుతం డబ్బు, మద్యం, కులమతాలు ప్రధానపాత్ర పోషిస్తూ శాసిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజకీయ నాయకులు తిలోదకాలు ఇచ్చారని.. యథేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే జంకే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని.. నల్ల చట్టాలు, ఉపాధిహామీ పథకం పేరు మార్పు ఇందులో ఉన్నాయన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని సత్కరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్, కళావతమ్మ, లక్ష్మీనారాయణశెట్టి, శ్రీహరి, శ్యాంసుందర్, కుతుబ్, నర్సింహశెట్టి పాల్గొన్నారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 975 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 60 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఈ నెల 23న జిల్లా పర్యటనకు రానున్నారని.. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ తేదీన 3.30 గంటలకు గవర్నర్ జిల్లాకేంద్రానికి చేరుకొని జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖుల ముఖాముఖిలో పాల్గొంటారని, వారందనీ ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రమణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, వేదిక, సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వ హణకు తగిన ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా విద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.వాహనదారులు రహదారి భద్రత నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని.. విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపార. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు రహదారి నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి మాసోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, డీటీఓ మానస, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, పంచాయత్రాజ్శాఖ ఈఈ మల్లయ్య, ఐఆర్ఏడీ డీఆర్ఎం మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెరుకు తరలింపునకు సహకరించాలని వినతి
ఆత్మకూర్: చెరుకు తరలింపునకు పోలీసుల ఆంక్షలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఎత్తివేసి సహకరించాలని కృష్ణవేణి చెరకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో రైతులు శనివారం ఎస్ఐ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత, ఆత్మకూర్ మండలాల నుంచి కృష్ణవేణి చెక్కర ఫ్యాక్టరీకి నిత్యం వందల సంఖ్యలో చెరుకు ట్రాక్టర్లు, లారీలు వెళ్తుంటాయన్నారు. ఆయా వాహనాల రాకపోకలతో మదనాపురం, ఆత్మకూర్లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని పోలీసులు రాత్రి వరకు నిలుపుతున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమయపాలన ఆంక్షలు ఎత్తివేసి నిరంతరం రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, సంజీవరెడ్డి, నారాయణ, వెంకటేష్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం యాసంగి సాగుకు ఆయకట్టును కుదించింది. ఎడమకాల్వ పరిధిలో రామన్పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే 15 వేల ఎకరాలకు వారబందీ విధానంలో సాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో యాసంగి సాగుకు నీరు ఇవ్వమంటూ ముందస్తుగా టాంటాం వేయించాం. పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వదులుతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ● -
రాజీమార్గం.. రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో 9,969 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు 1,701, ప్రీ లిటిగేషన్ కేసులు 8,268 ఉన్నాయన్నారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. 84 కేసులు పరిష్కారం.. ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరగడంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం 46 క్రిమినల్, 3 ఎకై ్సజ్, 2 ఎస్టీసీ, 10 సీసీ అడ్మీషన్ కేసులకుగాను రూ.43,500.. 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ. 22,500 జరిమానా విధించారు. మొత్తం 84 కేసులు పరిష్కరించి కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు. కార్యక్రమంలో లోక్అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. -
గాంధీజీ ఆశయ సాధనకు కృషి
● దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ● డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ● గాంధీచౌక్లో కాంగ్రెస్ నిరసన వనపర్తిటౌన్: గాంధీజీ ఆశయ సాధనకు దేశ ప్రజలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేశారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం అభాగ్యులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, గ్రామీణ ప్రజలు ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సామాన్య ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పేదల సంక్షేమానికి యత్నిస్తుండగా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధనవంతులను పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ సంపదంతా అదానీ, అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని.. ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల జరిగిన అక్రమ కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నందిమళ్ల యాదయ్య, శంకర్ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు కదిరె రాములు, బి.కృష్ణ, తిరుపతయ్య, బాబా, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు కుదింపు
యాసంగిలో చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవిస్తాం. 15 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతుకు గురికావడంతో వానాకాలంలో కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించా రు. ప్రస్తుతం యాసంగికి సైతం అందించాలి. – సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం, మిట్టనందిమళ్ల మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగిలో కేవలం రామన్పాడు వరకే సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించడం శోచనీయం. గతంలో సైతం యాసంగి సాగునీటిని కుదించిన ఆయకట్టుకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరుతడి పంటల సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం దారుణం. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి, వీపనగండ్ల అమరచింత: జూరాల ఆయకట్టులో యాసంగి సాగుకు వారబందీ విధానంలో నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు సమీపంలోని రామన్పాడు రిజర్వాయర్ వరకు అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 10 వేల నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించడం, గురువారం జరిగిన ఐఏబీ సమావేశంలో వారబందీని అమలు చేస్తూ తక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల కిందట ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో నాటి యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించిన అధికారులు.. ప్రస్తుతం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎందుకు నీటిని వదలడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎడమ కాల్వ కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించడం ఏమిటని అంటున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో విస్తరించి ఉండగా కేవలం అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల రైతులకే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రకటించడం సరికాదని అంటున్నారు. యాసంగి విస్తీర్ణం ఖరారు.. ప్రస్తుతం జలాశయం నుంచి 4.690 టీఎంసీల నీటిని వినియోగించేందుకు అవకాశం ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద రామన్పాడ్ జలాశయం వరకు మాత్రమే సాగునీటి సరఫరాకు ప్రణాళిక ఖరారు చేశారు. సాగు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న క్రమంలో ముందస్తుగా వారబందీ విధానం అమలు చేస్తున్నారు. గత గురువారం నుంచే వారబందీ అమలు చేస్తూ కాల్వలకు నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో టాంటాం.. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొత్తకోట, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల ఆయకట్టు గ్రామాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు యాసంగిలో సాగునీరు అందదని, దీనిని దృష్టిలో ఉంచుకొని నారుమడులు వేసుకోవాలని దండోరా వేయిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకే సాగునీరు యాసంగిలో వారబందీ విధానం అమలు చివరి ఆయకట్టు గ్రామాల్లో చాటింపు ఆందోళనలో అన్నదాతలు -
లోక్ అదాలత్లో సత్వర న్యాయం : ఎస్పీ
వనపర్తి: జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో ఈ నెల 21న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, బ్యాంకు, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలన్నారు. రాజీయే రాజ మార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయస్థానం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అవగాహన కల్పించాలన్నారు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికొస్తే అప్పుడే సమసిపోతాయని అన్నారు. లోక్ అదాలత్తో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి వనపర్తి: జిల్లాలోని రేషన్కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 1,80,294 కార్డులు, 6,09,645 మంది లబ్ధిదారులుండగా.. ఇప్పటి వరకు 4,23,466 లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన 1,86,179 మంది లబ్ధిదారులు సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి పూర్తి చేసుకోవాలని కోరారు. 5 ఏళ్లలోపు వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. రేషన్ డీలర్లు దుకాణాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు 100 ఈకేవైసీకి సహకరించాలని సూచించారు. తప్పుడు కేసులను సహించం : కాంగ్రెస్ వనపర్తి: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, పెద్దసంఖ్యలో కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్థానిక రాజీవ్గాంధీ చౌరస్తా నుంచి కొత్తకోట రోడ్లోని బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం స్థాపించబడిందని, స్వాతంత్య్రం అనంతరం ఆ పత్రికను ‘యంగ్ ఇండియా’ పేరుతో కొనసాగించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకపోయినా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని.. ఈ కుట్రను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, ఆమె కుటుంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక నెహ్రూ సొంత నిధులతో స్థాపించారని, నేడు సోనియాగాంధీ, రాహుల్గాంధీకి ఇల్లు కూడా లేదన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని, రాజీవ్గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అంతటి విషాదంలోనూ దేశాభివృద్ధి కోసమే సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రధానమంత్రి పదవికి అవకాశం ఉన్నప్పటికీ దేశ హితం కోసం దివంగత నాయకుడు డా. మన్మోహన్సింగ్ను ప్రధానమంత్రిగా నియమించారని తెలిపారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దపోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
ఆఽధిక్యం ఉన్నా.. అసంతృప్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ముందస్తు ప్రణాళికలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయనే చర్చ పల్లెసీమల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం 90 శాతం స్థానాలు తమవే అనుకున్న అఽధికార పార్టీ 54.85 శాతం స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్తో బీజేపీ లోపాయికారిగా జతకట్టి అవసరమైన వారికి మద్దతిస్తూ మరికొన్నిచోట్ల మద్దతు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోల్పోలేదనే అంశాన్ని చాటుకుంది. వనపర్తితో పాటు ఖిల్లాఘనపురం, గోపాల్పేట, దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందడం శోచనీయం. ఇందుకు నేతల ప్రసంగాలే కారణంగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పట్టు కోల్పోయిన అధికారపార్టీ.. జిల్లాలోని గోపాల్పేట, పాన్గల్, చిన్నంబావి మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు మినహా.. మిగతా ప్రాంతాల్లోని ప్రధాన గ్రామాల్లో అఽధికార పార్టీ పట్టు సడలినట్లు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. 12 మండలాల్లో కాంగ్రెస్.. మూడింటిలో బీఆర్ఎస్ ఆధిక్యం 3 మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో పట్టుకోల్పోయిన అధికార పక్షం -
ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి
వనపర్తి: వరి ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో డబ్బులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార సంఘం, పౌరసరఫరాలశాఖ అధికారులతో వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు.. ఇంకా ఎంత కేంద్రాలకు రావాల్సి ఉంది.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 50 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా 21 వేల మెట్రిక్ టన్నుల ట్యాబ్ ఎంట్రీలు పెండింగ్లో ఉందని, మిల్లర్లు దించుకున్న ధాన్యానికి సంబంధించి వెంటనే రసీదులు ఇవ్వకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని కలెక్టర్ తెలిపారు. మిల్లర్ల నుంచి రసీదు త్వరగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం చేసిన ధాన్యాన్ని తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు పంపించడానికి వీలు లేదని, అధికారి సూచించిన మిల్లుకు మాత్రమే పంపించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సహకార సంఘం అధికారి ఇందిరా, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు ఉన్నారు. జిల్లాలో అసైన్డ్ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాలు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను సర్వేనంబర్ల వారీగా గుర్తించి డేటాను అప్లోడ్ చేయాలన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు సుమారు 5 వేల ఎకరాలు, అసైన్డ్ భూములు 7 వేల ఎకరాలు గుర్తించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, హెచ్హెచ్ఓ శంకర్ తదితరులు ఉన్నారు. -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల


