breaking news
Wanaparthy
-
భూమిని వెనక్కి తీసుకుంటాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు 500 గజాల భూమి కేటాయించడం, ట్రాన్స్కో అధికారులు కేటాయించిన దాని కంటే ఎక్కువ భూమిని చదును చేయడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై ‘సాక్షిశ్రీలో మంగళవారం ‘పీయూలో సబ్స్టేషన్ వివాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు పీయూ ముఖద్వారం వద్ద గంటసేపు నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్కో అధికారులు కట్టిన ప్రహరీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కేటాయించిన భూమి కంటే ఎక్కువ వినియోగించుకుంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వైస్ చాన్స్లర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. రిజిస్ట్రార్ రమేష్బాబు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వినిపించుకోలేదు. దీంతో వీసీ శ్రీనివాస్ బయటకు వచ్చి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. కేటాయించిన భూమికంటే ఎక్కువ భూమిని వారు చదును చేశారని తెలిసిన వెంటనే నోటీసులు ఇచ్చామని, దీనికి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా వినియోగించిన భూమిని తిరిగి తీసుకుంటామని, కేటాయించిన భూమి వరకు హద్దులు నిర్ణయిస్తామని వీసీ పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎక్కడి వరకు భూమి కేటాయించారు.. ఎక్కడి వరకు చదును చేశారు.. అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఆయా సంఘాల నాయకులు కార్తిక్, రాము, గణేష్, తాయప్ప, రాజేష్, శ్రీను, ఆంజనేయులు, శివ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
రోజువారీగా యూరియా వివరాలు ఇవ్వండి
● ప్రైవేటు డీలర్లతో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లాలో యూరియా విక్రయాలకు సంబంధించి రోజువారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం యూరియా విక్రయాలపై వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా విక్రయాల విషయంలో మండల వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద భారీగా యూరియా స్టాక్ ఉందని.. విక్రయాలను పర్యవేక్షించేందుకు ఒక ఏఈఓను కేటాయించాలని సూచించారు. ప్రైవేటు డీలర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఏసీఎస్ల్లో స్టాక్ అందుబాటులో లేకపోతే, స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ● త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించాలని.. జిల్లా స్థాయిలో 29న, మండల స్థాయిలో 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు స్వీకరించాలని తెలిపారు. ● జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. శ్యామ్, మ్యామ్ పిల్లల సంఖ్య జీరో ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో 25 మంది బాలికలకు వివాహాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని.. వాటిని ముందుగానే తెలుసుకొని నివారించి కొందరిపై కేసులు నమోదు చేయించినట్లు డీసీపీఓ రాంబాబు తెలిపారు. కాగా, వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను ఎన్ఆర్సీ సెంటర్కు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ● ప్రభుత్వ ఆస్పత్రులకు ఏ విధమైన జ్వరం కేసు వచ్చినా డెంగీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో డెంగీ సహా సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లో టీబీ స్క్రీనింగ్ పెంచాలన్నారు. మిషన్ మధుమేహలో భాగంగా డయాబెటీస్ తేలిన వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అప్డేట్ చేయాలన్నారు. మెరుగైన వైద్యం అందించాలి కొత్తకోట: రపభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్రెడ్డి ఉన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు యూరియా సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టిసారించి నిశితంగా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో జిల్లాల వారీగా యూరియా లభ్యత, సరఫరా, ఇండెంట్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సదరు డీలర్లపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవంగా కేంద్రం నుంచి 9 లక్షల మె.ట., యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.72 మె.ట., మాత్రమే వచ్చిందని ఇంకా సుమారు 3 లక్షల మె.ట., రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఇతర అనవసరమైన ఎరువులు అంటగడుతున్నారని, అలాంటి వాటిని సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్, పీఏసీఎస్, ఆగ్రో సేవా కేంద్రాలు, ఒక్కొక్క షాప్ వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. నానో యూరి యా వాడకం– ప్రయోజనాల గురించి కూడా వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు విజయేందిర, సిక్తాపట్నాయక్, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, ఆయా జిల్లాల ఎస్పీలు జానకి, ఎస్పీ యోగేష్ గౌతమ్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రావుల గిరిధర్, శ్రీనివాస్రావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు అమ్మినా డీలర్పై కేసుల నమోదు విక్రయాలపై కలెక్టర్లు, ఎస్పీలు నిశితంగా పర్యవేక్షించాలి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం మహబూబ్నగర్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం -
జై జై గణేశా..
నేటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ● వాడవాడలా ముస్తాబైన మండపాలు ● గ్రామాలకు తరలుతున్న లంబోదరుడు ● సందడిగా మారిన పూజాసామగ్రి దుకాణాలు బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025–10లో uసీజనల్ వ్యాధులతో జాగ్రత్త వనపర్తి రూరల్: సీజనల్ వ్యాధుల బారినపడకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో జరిగిన ప్రసవాలు, సిబ్బంది పనితీరు, మందుల నిల్వ, ఓపీ రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్పై ప్రత్యేక దృష్టిసారించాలని.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. డీఎంహెచ్ఓ వెంట డా.చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, సిబ్బంది రాజేశ్గౌడ్, కృష్ణ, విజయలక్ష్మి, కుమారి, రాజు ఉన్నారు. జెన్కోలో ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు ఆత్మకూర్: ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జెన్కో రాష్ట్రస్థాయి క్యారం, చెస్ పోటీలు మంగళవారం ముగిశాయి. క్యారమ్స్లో మొదటి బహుమతిని యాదాద్రి జట్టు కై వసం చేసుకోగా, చెస్లో కాకతీయ థర్మల్ కేంద్రం జట్టు కై వసం చేసుకుంది. విజేతలకు జెన్కో ఎస్ఈలు శ్రీధర్, సురేష్ బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో కొత్తగూడెం తర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్సౌథ, యాదాద్రి, పులిచింతల, కాకతీయ ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పథకాల పేరుతో కాంగ్రెస్ మోసం వనపర్తిటౌన్: పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లు పెంచాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్ రూ. 6వేలకు పెంచాలని, యూత్ డిక్లరేషన్ ప్రకారం రూ. 4,016 నిరుద్యోగ భృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్రెడ్డి, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, పెద్ది రాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన, బాబురావు, మురారి నాయక్, సరోజ పాల్గొన్నారు. పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ గణేశ్ ఉత్సవ కమిటీల సభ్యులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేశ్ మండపాలను విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల్లో ఈఎల్సీబీ, అవసరమైన చోట ఎంసీబీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వైరింగ్ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషన్తోనే చేయించుకోవాలని తెలిపారు. వైరింగ్లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదన్నారు. వైర్లు నేలపై వేయరాదని.. సరైన ఎర్తింగ్తో 3 పిన్ ప్లగ్లు ఉపయోగించాలని సూచించారు. మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే.. వాటిని తప్పక ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలన్నారు. సర్వీస్ వైరు విద్యుత్ స్తంభానికి అమర్చిన తర్వాత సంబంధిత లైన్మేన్ లేదా జేఎల్ఎం అనుమతి లేకుండా మార్పులు చేయరాదన్నారు. ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వనపర్తిటౌన్: విఘ్నేశ్వరుడి పూజకు వేళైంది. వాడవాడలా లంబోదరుడిని కొలువుదీర్చేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని బుధవారం గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఇప్పటికే మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి వినాయక మండపం నుంచి 20–60 అడుగుల వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ముఖద్వారం వద్ద గణేశ్ మండపాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అదే విధంగా చింతల హనుమాన్, కన్యకా పరమేశ్వరి, రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ప్రతిష్ఠించే గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీచర్స్ కాలనీ, వెంగళ్రావునగర్, శాంతినగర్, పీర్లగుట్ట, బ్రాహ్మణవీధి, బ్రహ్మంగారి వీధి, పాతబజార్, జమ్మిచెట్టు, 40 ఫీట్ల రోడ్డు, రాంనగర్, చందాపూర్ రోడ్డు, వల్లబ్నగర్, బండారునగర్, శ్వేతానగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో 3–4 గణనాథులను కొలువుదీర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలను నిర్వాహకుల అనుకూలత మేరకు ఉదయం నుంచి రాత్రి పది గంటలలోగా పూర్తిచేస్తారు. మార్కెట్ కిటకిట వినాయక చవితి సందర్భంగా మంగళవారం మార్కెట్ కిటకిటలాడింది. వినాయకుడి పూజకు అవసరమైన సామగ్రి, పూలు, పండ్ల కొనుగోలుతో పాటు అలంకరణ వస్తువుల కోసం ఉత్సవ కమిటీల సభ్యులు సంబంధిత దుకాణాలకు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. లంబోధరుడు కొలువుదీరేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో స్టేజ్ నిర్మాణం, మండపాల అలంకరణ తదితర ఏర్పాట్లలో నిర్వాహకులు తలమునకలయ్యారు. జిల్లా కేంద్రంలోని గ్రీన్ పార్కులో సుందరంగా ముస్తాబైన గణనాథుడి మండపం మట్టి గణపతులతో పర్యావరణాన్ని కాపాడుదాం వనపర్తి: పర్యావరణ హితమై ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన విగ్రహాలతో నీరు కాలుష్యమై పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నారు. మట్టి విగ్రహాలను నెలకొల్పి పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారవుతారన్నారు. బీసీ సంక్షేమశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు 2వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఏఈఎస్ సురేశ్, ఏఓ భానుప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ సూపరింటెండెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు. వేకువజామున 5గంటలకే క్యూ.. యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మంగళవారం అమరచింతలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు వేకువజామున 5 గంటల నుంచే క్యూ కట్టారు. మస్తీపురం, పాంరెడ్డిపల్లె, అమరచింత గ్రామాలకు చెందిన రైతులు రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు 300 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. – అమరచింత -
కేజీబీవీల్లో వైద్యశిబిరాలు
ఖిల్లాఘనపురం: మండలంలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్టీ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లతో పాటు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థులు విషజ్వరాల బారినపడి ఇంటిబాట పట్టారు. ఇందుకు సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హాస్టళ్లలో ఫీవర్రీ’ కథనానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. డీఎంహెచ్ఓ డా.శ్రీనివాసులు ఆదేశాల మేరకు సోమవారం రెండు కేజీబీవీల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో అనారోగ్యంతో బాధపడుతున్న 50మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు అందజేసినట్లు మండల వైద్యాధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. అదే విధంగా తెలుగు మీడియం కేజీబీవీలో ఆర్బీఎస్కే వైద్యులు స్వప్న, రఘు 60మంది విద్యార్థినులకు చికిత్స అందించారు. 30మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వైద్యపరీక్షల అనంతరం విద్యార్థినులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫార్మసిస్టు శ్రీవిద్య, ఏఎన్ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పీయూలో ‘సబ్స్టేషన్’ వివాదం..!
పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క గజం ఎక్కువ తీసుకోం.. పీయూలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుదీర్రెడ్డి, ఈఈ, ట్రాన్స్కో లేఖ రాశాం పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్చాన్స్లర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో మరింత భూమి.. పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. 500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం ఎకరా కేటాయించారని విద్యుత్ అధికారుల వాదన అధిక భూసేకరణపై వీసీ లేఖ.. నేటికీ స్పందించని ట్రాన్స్కో పీయూ భూమి కాపాడాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన -
ఏఐ నిఘా.!
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలపై నజర్ ● అధునాతన సాంకేతికత వినియోగిస్తున్న గృహనిర్మాణశాఖ ● అక్రమార్కులపై కలెక్టర్ కఠిన చర్యలు ● అనర్హులకు ఇళ్ల మంజూరు, పాత నిర్మాణాలకు బిల్లులు చేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు ●జిల్లాకు 6,004 ఇళ్లు మంజూరు.. జిల్లావ్యాప్తంగా 6,004 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజాపాలన దరఖాస్తుల పూర్తిస్థాయి పరిశీలన, ఇంటింటి సర్వే అనంతరం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో 3,285 ఇళ్లు గ్రౌండింగ్ కాగా.. 2,130 ఇళ్లు మార్కింగ్, 908 బేస్మెట్, 152 ఆర్సీ, 91 రూఫ్ లేవెల్లో ఉన్నాయి. రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అత్యధికంగా జిల్లా కేంద్రంలోనే సుమారు 580 ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారిక నివేదికల్లో పేర్కొన్నారు. వనపర్తి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు గృహనిర్మాణశాఖ అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇటీవల ఏఐ టెక్నాలజీతో వనపర్తి మండలం అప్పాయిపల్లిలో పాత బేస్మెట్కు బిల్లు చేయించినట్లు గుర్తించి.. పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ఇంజినీర్పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాకు రెండు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఏఐ నిఘా పటిష్టంగా పనిచేస్తోందనేందుకు అధికారుల సస్పెన్షన్ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. భవిష్యత్లో అన్ని ఇంజినీరింగ్ శాఖలకు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా తర్ఫీదు.. ఏఐ సాంకేతికతపై ఇటీవల పలువురు కలెక్టర్లకు కేంద్ర సర్వీసులశాఖ ముస్సోరిలో చాంపియన్ ఫర్ డిజిటల్ ఫార్మెషన్పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం వెళ్లిన విషయం విదితమే. అయితే ట్రైనింగ్కు వెళ్లకముందే.. ఏఐ సాంకేతికత ఆధారంగా ఇద్దరు అధికారులపై ఈ నెల 14న కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. -
ముఖ గుర్తింపుతో సామాజిక పింఛన్లు
● 165 జీపీల్లో పోస్టల్ సిబ్బందిచే పంపిణీ ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అందించే సామాజిక పింఛన్లు ఇక నుంచి లబ్ధిదారుల ముఖ గుర్తింపుతో ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో పోస్టల్ సిబ్బందికి 74 సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత తదితర సామాజిక పింఛన్లు 71వేల మందికి పైగా లబ్ధిదారులు పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో దాదాపు 50శాతం మందికి ప్రతినెలా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. మిగతా 32వేల మంది పింఛన్దారులు 165 జీపీల్లో పోస్టాల్ సిబ్బందిచే పింఛన్లు పొందుతున్నారన్నారు. ఆయా జీపీల్లో కొందరు పింఛన్దారులకు ఆధార్ కార్డు ప్రకారం వెలిముద్రల గుర్తింపు జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇక నుంచి సెల్ఫోన్లో ముఖచిత్ర గుర్తింపు ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట వద్ద రూ. 1.25 కోట్లతో చేపట్టిన కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. వసతిగృహ నిర్మాణ పనులను నవంబర్లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మొత్తం 120మంది విద్యార్థులు వసతి ఉండే విధంగా భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసులు, ఆర్ఐ మధు ఉన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి.. వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. -
హాస్టళ్లలో ఫీవర్రీ .!
ఇంటిబాట పట్టిన కేజీబీవీ, వసతిగృహాల విద్యార్థులు ● పాఠశాలల్లో మచ్చుకై నా కనిపించని వైద్యశిబిరాలు ● ఎవరైనా అనారోగ్యం బారినపడితే మందు గోళీలతోనే సరిపెడుతున్న వైనం ● ఇటీవల అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ఎవరికీ పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాల, కేజీబీవీలు, ఎస్సీ హాస్టల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లి మందులు ఇప్పించడం తప్ప.. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించడం లేదని విద్యార్థులే బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల ఖిల్లాఘనపురం కస్తూర్బాగాంధీ తెలుగు మీడియం పాఠశాలలో 11మంది విద్యార్థినులు అనారోగ్యం బారిన పడితే సిబ్బంది స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వైద్యసిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. జ్వరం వచ్చిందని చెప్పి గ్లూకోస్ పెట్టి, కొన్ని మందులు ఇచ్చి పంపారు. అయితే వీరిలో 9వ తరగతి విద్యార్థిని కేతావత్ జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహబూబ్నగర్, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. తెల్లపసిరికల కారణంగా ఈ నెల 17న మృతిచెందింది. అయితే సదరు విద్యార్థిని తెల్లపసిరికలకు గురైనట్లు ముందుగానే గుర్తించి.. సరైన చికిత్స అందించి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖిల్లాఘనపురం: జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు తమ పిల్లలను ఎలాగైనా చదివించాలనే సంకల్పంతో ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను సైతం కుటుంబ సభ్యులు కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఇళ్లకు చేరుకోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా మంది విద్యార్థులు విషజ్వరాలకు గురై ఇంటిబాట పడుతున్నారు. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడం.. ఇతర కుటుంబ సభ్యులు వారిని ఆర్ఎంపీల వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో వారాల పాటు విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎక్కడా లేనివిదంగా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండటంతో పాటు ఎస్టీ ఆశ్రమ పాఠశాల, ఎస్సీ వసతిగృహాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో ఈ సంవత్సరం ఇంటర్ తరగతులను ప్రారంభించారు. రెండు కేజీబీవీలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థినులు చదువుకోవడానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆయా పాఠశాలలు, ఎస్సీ వసతిగృహంలో మొత్తం 919 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. ఇప్పటి వరకు 269 మంది పలు అనారోగ్య కారణాలతో ఇళ్లకు వెళ్లారు. వారు మళ్లీ ఎప్పుడు పాఠశాలకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాల విద్యార్థుల ఇళ్లకు సంఖ్య వెళ్లిన వారు కేజీబీవీ తెలుగు మీడియం 207 117 కేజీబీవీ ఇంగ్లిష్ మీడియం 226 36 ఎస్టీ ఆశ్రమ 366 66 ఎస్సీ హాస్టల్ 120 50 మొత్తం 919 269 -
ప్రజల దీవెనలతో ప్రజా పాలన
● ‘పనుల జాతర’లో రూ.20,200 కోట్లు ఖర్చు ● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచించారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో 3,900 మె.ట. యూరియా రాక
ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి.. రైతులకు యూరియా పంపిణీపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం నాటికి జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని.. 27న మరో 1,300 మెట్రి క్ టన్నుల యూరియా వస్తుందని వివరించారు. జిల్లాలోని 15 సొసైటీల పరిధిలో గతేడాది 11వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. ఈఏడాది ఇదివరకే 13వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. పీఏసీఎస్ కార్యాలయా ల్లో యూరియా ధర తక్కువగా ఉండటంతో రైతు లు అధికంగా తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని.. వర్షాలు సమృద్ధిగా కురియడంతో యూరియా అవసరం పెరిగిందన్నారు. ఒక ఎకరా కు ఒక బస్తా యూరియా వేసినా 1.20 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందన్నారు. కొన్ని పంటలకు రెండు లేదా మూడు బస్తాలు వేయాల్సి రావడంతోనే కొరత కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి 8.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇదివకు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే కొరత సమస్యే ఉండదన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా ఉన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. ఐదేళ్లుగా సా..గదీత ప్రమాదం జరిగినప్పటి నుంచి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులను చేపట్టినా ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను పునరుద్ధరణ పనులు రెండేళ్ల కిందట పూర్తిచేసినా, సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. గతేడాది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల సామర్థ్యంతోనే విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. నాలుగో యూనిట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తేనే గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సీఈ సత్యనారాయణను సంప్రదించగా నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు 24 గంటల పాటు కొనసాగుతున్నాయని, మరో నెల రోజుల్లో విద్యుదుత్పత్తి చేపట్టేలా కృషిచేస్తామన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం కాని నాలుగో యూనిట్ 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి -
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
● ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పొరపాట్లు జరిగితే అధికారులదే బాధ్యత ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు బొల్లారంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా రూ. 3.90లక్షలతో చేపట్టనున్న వీపనగండ్ల–బెక్కెం బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీపనగండ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు 19 కుట్టు మిషన్లు అందజేశారు. ఆ తర్వాత బొల్లారంలో రూ. 20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పొరపాట్లు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. గతంలో తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో రూ. 300కోట్లతో సీసీరోడ్లు, రూ. 600కోట్లతో బీటీరోడ్లు నిర్మించినట్లు తెలిపారు. పలు గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్నంబావి మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు వైద్య, విద్యరంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. వీపనగండ్లలో తన పేరున ఉన్న నాలుగెకరాల భూమిని మినీ స్టేడియం ఏర్పాటు కోసం ఉచితంగా అందజేయడంతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రూ. 3కోట్లతో స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, పీఆర్ ఈఈ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరయ్యయాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, సుదర్శన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, రవీందర్రెడ్డి, గోపి, మహేశ్, బాల్రెడ్డి, గోపాల్నాయక్, రాంరెడ్డి, భరత్రెడ్డి పాల్గొన్నారు. -
యూరియా ఇక్కట్లు
సోమశిల వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.68.10 కోట్లు సోమశిలవీఐపీ ఘాట్ రూ.1.60 కోట్లు అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ వ్యయం రూ.45.84 కోట్లు ఈగలపెంట రివర్ క్రూయిజ్ నోడ్ రూ.7.69 కోట్లు ఈగలపెంట అరైవల్ జోన్, ప్రోమోనోడ్ రూ.8.36 కోట్లు ఈగలపెంట చెంచు మ్యూజియం రూ.3.60 కోట్లు అమరచింత/ఖిల్లాఘనపురం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. శనివారం అమరచింత ఆగ్రో రైతు సేవాకేంద్రం వద్ద ఉదయం 6 నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. 300 బస్తాల యూరియా రాగా మస్తీపురం, పాంరెడ్డిపల్లి, అమరచింత రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు చేతబట్టుకొని గంటల తరబడి వేచి ఉండి అతి కష్టం మీద రెండు సంచులు తీసుకెళ్లడం కనిపించింది. బస్తాకు రూ. 265 ఉండగా.. హమాలీ చార్జీలతో కలిపి రూ.285 తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ● ఖిల్లాఘనపురం సింగిల్విండోకు శుక్రవారం రెండు లారీల్లో మొత్తం 600 బస్తాలు, హాకా–1, హాకా–2 దుకాణాలకు 600 బస్తాలు మొత్తం 1,200 బస్తాలు వచ్చింది. శనివారం ఉదయం నుంచే రైతులు బారులు తీరగా.. అంతకుముందే టోకన్లు ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మండలంలో సాగైన పంటలకు 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటి వరకు 1,600 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య వివరించారు. -
సాగులో మెళకువలు చెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యు వతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు ●సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. -
కథ కంచికేనా..?
ఏడురోజుల తర్వాత ధాన్యం లారీని వదిలేసిన అధికారులు ● సింగిల్లైన్ నివేదిక ఇచ్చిన టీఏ ● మిల్లులో లెక్కకు మించి నిల్వల మాటేమిటి? ● నామమాత్రపు జరిమానా విధింపు●వనపర్తి: పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం లారీని విచారణ పేరుతో ఏడురోజుల కాలయాపన తర్వాత క్లీన్చిట్ ఇచ్చి నామమాత్రపు జరిమానా విధించి అధికారులు రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక్కో లోపానికి ఒక్కో కారణం చెబుతూ అన్ని సక్రమంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతృప్తి చెందడంతో వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో ధాన్యం తరలిస్తున్నారనే విషయంపై ఇదే అధికారులు సీరియస్గా స్పందించి కేసునమోదు చేసిందేలా.. ప్రస్తుతం రేషన్ డీలర్లతో సంచులు కొనుగోలు చేసినట్లు సాకు చూపుతూ సమర్థించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14 సాయంత్రం అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల హడావుడిలో ఉన్న సమయంలో జిల్లాకేంద్రం నుంచి కర్ణాటకకు ధాన్యం లారీలో తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం పౌరసరఫరాలశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణ పేరుతో ఏడురోజుల పాటు కాలయాపన చేసి తుదకు కథను సుఖాంతం చేశారు. సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం ప్రభుత్వానిదేనా? ఏ రకం? ఏ సీజన్కు సంబంధించి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల టీఏ, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించి అనాలసిస్ చేయించాల్సి ఉండింది. కాగా స్థానిక టీఏ మాత్రం పట్టుబడిన ధాన్యం బీపీటీ రకమని, సన్నరకం వరి ధాన్యమని సింగిల్లైన్ నివేదిక ఇచ్చి వదిలేశారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు ఈ అంశంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విముఖత చూపడం గమనార్హం. పట్టుబడిన ధాన్యానికి సంబంధించిన రైస్మిల్లు యజమాని సీఎంఆర్ 99 శాతం పూర్తిచేశారు. బయటి మార్కెట్ నుంచి ధాన్యం తీసుకొచ్చి మర ఆడించినట్లు రికార్డుల్లో చూపించినా.. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఉండాల్సిన ధాన్యం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ కోణంలో విచారణ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ, బీ రిజిస్టర్లలో వివరాలు సరిపోలకపోయినా.. ఎందుకు మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
వనపర్తి: సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారం నిర్ణీత గడువులోగా అందించడం అధికారుల బాధ్యతని స.హ. చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యారెడ్డి, వైష్ణవి మెర్ల అన్నారు. శనివారం కలెక్టరేట్లో పీఐఓలకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం, పారదర్శక పాలన అందించడమే సమాచార హక్కు చట్టం (స.హ. చట్టం) ముఖ్య ఉద్దేశమన్నారు. పీఐఓలు, ప్రభుత్వ అధికారులు చాలామంది సమాచారం ఇచ్చేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని.. విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, అప్పీలేటు అధికారులు చట్టాన్ని పూర్తిగా చదివి ఆకలింపు చేసుకుంటేనే అర్జీదారులు కోరిన సమాచారం ఎలా ఇవ్వాలి.. తమ దగ్గర లేని సమాచారం ఇతర శాఖల అధికారులకు ఎలా పంపించాలనే విషయంపై అవగాహన వస్తుందని చెప్పారు. ప్రభుత్వ అధికారిక సమాచారం ఏది కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రపంచంలో ఆర్టీఐ చట్టం సుమారు 130 దేశాల్లో అమలవుతుండగా.. అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు. అధికారులకు చట్టంపై అవగాహన లేకపోవడంతోనే అప్పీలేటు అధికారి, కమిషనరేట్ వరకు అర్జీలు వస్తున్నాయని.. పీఐఓలు ఎప్పటికప్పుడు స్పందించి 30 రోజుల గడువులోగా అర్జీదారుకు సమాచారం ఇవ్వాలని, పౌరుల చేతిలో ఈ చట్టం ఓ ఆయుధంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అధికారులు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటేనే అర్జీలు ప్రాథమిక దశలోనే పరిష్కారమవుతాయన్నారు. రెండేళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో పేరుకుపోయిన అర్జీలను పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు వివరించారు. పీఐఓలు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు. ప్రతి కార్యాలయంలో స.హ. చట్టం బోర్డు, అందులో పీఐఓ, ఏపీఐఓ వివరాలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల బాధ్యతను తెలియజేసే 4(1)(బి) తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 83 అప్పీళ్లు పెండింగ్లో ఉండగా.. అందరిని పిలిపించి సంబంధిత శాఖల అధికారులతో సమాచారం ఇప్పించారు. ఇంకా సంతృప్తి చెందని అర్జీదారులకు కోరిన విధంగా 15 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. అర్జీదారులకు ఈ విచారణ సంతృప్తినివ్వలేదనే మాటలు వినిపించాయి. అఫిడవిట్ దాఖలు రాకపోవటం శోచనీయం.. విచారణ సమయంలో అందజేయాల్సిన అఫిడవిట్లు సైతం పీఐఓలకు రాయడం రాకపోవడం ఏమిటని కమిషనర్లు విస్మయం వ్యక్తం చేశారు. తమవెంట వచ్చిన సీసీలతో ఎలా రాయాలంటూ గుసగుసలాడుకోవడం పరిశీలించామన్నారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే అఫిడవిట్లతో పాటు పౌరులు కోరిన ప్రతి అర్జీకి సమాచారం నిర్ణీత సమయంలో ఇచ్చేస్తారని తెలిపారు. 18 వేల అప్పీళ్లు పెండింగ్... రాష్ట్రంలో సమాచార హక్కు చట్టానికి మూడున్నర ఏళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో 18 వేల అప్పీళ్లు పెండింగ్లో ఉండగా.. జిల్లాల పర్యటనలు చేపడుతూ ఇప్పటి వరకు 3,500 పరిష్కరించినట్లు తెలిపారు. విచారణలో విభిన్న అంశాలు వెలుగుచూస్తున్నాయని వారు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సమాచారం కోరుతూ కొందరు.. అధికారులను ఇరకాటంలో పెట్టేందుకు మరికొందరు అర్జీలు దాఖలు చేసినట్లు గుర్తిస్తున్నామని చెప్పారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సమాచారం ఇవ్వని కేసులు సైతం మా దృష్టికి వచ్చాయన్నారు. పారదర్శకంగా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. -
అధికారుల్లో ‘ఆర్టీఐ’ వణుకు..
వనపర్తి: సుదీర్ఘకాలంగా సమాచార కమిషనర్ లేక పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించేందుకు శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమాచారం ఇచ్చే విషయంలో అర్జీలను నిర్లక్ష్యం చేసిన కొన్ని శాఖల అధికారులు ప్రత్యేక విచారణలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనే భయంతో అర్జీదారులతో రాజీ పత్రాలు రాయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా సమాచార హక్కు చట్టం–2005ను నిర్లక్ష్యం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన అధికారుల్లో కనిపించింది. జిల్లాలో మొత్తం 90 అర్జీలు పెండింగ్లో ఉండగా.. మున్సిపాల్టీలు, రెవెన్యూశాఖకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అమృత్ 2.0’ నీటి ట్యాంకుల పరిశీలన అమరచింత: అమృత్ 2.0 పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంటర్నల్ రిపోర్టింగ్, మానిటరింగ్ ఏజెన్సీ బృందం పరిశీలించింది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కొనసాగుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను నిషితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలకు ఓసారి ఇర్మా ఆధ్వర్యంలో పనులను పరిశీలించి నాణ్యత వివరాలను కేంద్రానికి నివేదిస్తున్నట్లు వెల్లడించారు. డీఈ చంద్రశేఖర్, కంపెని మేనేజర్ ఎన్.శ్రీనివాసులు, ఇర్మా కో–ఆర్డినేటర్ నవీన్ పాల్గొన్నారు. నేటి ధర్నాను విజయవంతం చేయండి వనపర్తిటౌన్: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడంతో పాటు ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వెంకటేష్, కె.జ్యోతి, హమీద్, శ్రీనివాస్గౌడ్, రామన్గౌడ్, జి.మురళి, అరుణ, వెంకటేశ్వర్లు, సూరయ్య, మల్లికార్జున్, డి.రాముడు, మద్దిలేటి, రాములు యాదవ్ పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరా నిలిపివేత వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని బాలానగర్లో ఉన్న 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 55 హెపీ ట్రాన్స్ఫార్మర్ బిగింపు సందర్భంగా శనివారం ఉదయం 9 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలానగర్, నర్సింగాయపల్లిరోడ్లోని డిగ్రీ కళాశాల, మెటర్నిటీ, చిల్డ్రన్ ఆస్పత్రి, అప్పాయపల్లిరోడ్, నందిమళ్లగడ్డ, వశ్యానాయక్తండా, పాతబజార్, కుమ్మరిగేరి, సవరం స్ట్రీట్, కమలానగర్, గాంధీనగర్, రాయిగడ్డకాలనీ, రాంనగర్కాలనీ, బ్రహ్మంగారి వీధి, శారదనగర్, చిట్యాలరోడ్, శ్వేతానగర్, తిరుమలకాలనీ, వల్లభ్నగర్, పీర్లగుట్ట, బంగారునగర్, పాన్గల్ రోడ్, గాంధీచౌక్, భగత్సింగ్నగర్, మెంటేపల్లితో పాటు చిన్నగుంటపల్లి, గోపాల్పేట, రాజపేట ఫీడర్లోని ప్రాంతాలకు ఆయా సమయంలో విద్యుత్ సరఫరా ఉండదని.. గృహ, వ్యాపార, పరిశ్రమలు, వ్యవసాయ వినియోగదారులు అంతరాయా న్ని గమనించి సహకరించాలని పేర్కొన్నారు. -
కథ ముగిసిందా..?
ఏడురోజుల తర్వాత ధాన్యం లారీని వదిలేసిన అధికారులు ● సింగిల్లైన్ నివేదిక ఇచ్చిన టీఏ ● మిల్లులో లెక్కకు మించి నిల్వల మాటేమిటి? ● నామమాత్రపు జరిమానా విధింపు●వనపర్తి: పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం లారీని విచారణ పేరుతో ఏడురోజుల కాలయాపన తర్వాత క్లీన్చిట్ ఇచ్చి నామమాత్రపు జరిమానా విధించి అధికారులు రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక్కో లోపానికి ఒక్కో కారణం చెబుతూ అన్ని సక్రమంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతృప్తి చెందడంతో వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో ధాన్యం తరలిస్తున్నారనే విషయంపై ఇదే అధికారులు సీరియస్గా స్పందించి కేసునమోదు చేసిందేలా.. ప్రస్తుతం రేషన్ డీలర్లతో సంచులు కొనుగోలు చేసినట్లు సాకు చూపుతూ సమర్థించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14 సాయంత్రం అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల హడావుడిలో ఉన్న సమయంలో జిల్లాకేంద్రం నుంచి కర్ణాటకకు ధాన్యం లారీలో తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం పౌరసరఫరాలశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణ పేరుతో ఏడురోజుల పాటు కాలయాపన చేసి తుదకు కథను సుఖాంతం చేశారు. సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం ప్రభుత్వానిదేనా? ఏ రకం? ఏ సీజన్కు సంబంధించి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల టీఏ, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించి అనాలసిస్ చేయించాల్సి ఉండింది. కాగా స్థానిక టీఏ మాత్రం పట్టుబడిన ధాన్యం బీపీటీ రకమని, సన్నరకం వరి ధాన్యమని సింగిల్లైన్ నివేదిక ఇచ్చి వదిలేశారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు ఈ అంశంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విముఖత చూపడం గమనార్హం. పట్టుబడిన ధాన్యానికి సంబంధించిన రైస్మిల్లు యజమాని సీఎంఆర్ 99 శాతం పూర్తిచేశారు. బయటి మార్కెట్ నుంచి ధాన్యం తీసుకొచ్చి మర ఆడించినట్లు రికార్డుల్లో చూపించినా.. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఉండాల్సిన ధాన్యం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ కోణంలో విచారణ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ, బీ రిజిస్టర్లలో వివరాలు సరిపోలకపోయినా.. ఎందుకు మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండా
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కొత్తకోట రూరల్: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పనుల జాతర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం ఉపాధి పనులకు సంబంధించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అధికారులతో కలిసి ఆయన అందజేశారు. అనంతరం మండలంలోని నాటవెల్లిలో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న యూపీఎస్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, మౌలిక వసతులు, ఉపాధి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షే, అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, రావుల కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజా బహదూర్ వెంకట రామరెడ్డికి నివాళి.. రాజా బహదూర్ వెంకట రామరెడ్డి జయంతి సందర్భంగా రాయిణిపేట శివారులో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహనీయుడు, గొప్ప సంఘసంస్కర్త అయిన వెంకట రామరెడ్డి ఈ గడ్డపై జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రెడ్డి సేవాసమితి సభ్యులు, కాంగ్రెస్పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో రూ.3.50 కోట్ల రుణాలిచ్చాం : డీసీసీబీ
వనపర్తి: జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకు పరిధిలోని ఆరు పీఏసీఎస్ల పరిధిలో ఉన్న రైతులకు ఆగస్టులో వివిధ రకాల రుణాలు రూ.3.50 కోట్లు అందజేసినట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పలువురు లబ్ధిదారులకు కర్షకమిత్ర చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పాడి పశువుల పోషణ, ఇతర వ్యాపారాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రెండు ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కర్షక మిత్ర పథకంలో భాగంగా రుణ చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నాగవరం పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రాజనగరం పీఏసీఎస్ చైర్మన్ రఘువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమ ఫలాలు
ఖిల్లాఘనపురం: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఆయన రాత్రి తన స్వగ్రామం సల్కెలాపురంలో బసచేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలో మార్నింగ్వాక్ నిర్వహించారు. వీధుల్లో తిరిగి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఇళ్లు, రేషన్కార్డులు, సన్నబియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రూ.20 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత తొలగిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పారెడ్డిపల్లికి చెందిన కొత్తగొల్ల అంజమ్మ ఉపాధి నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన నాటుకోళ్ల ఫాంను ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖిల్లాఘనపురం–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించిన హైలేవల్ వంతెనను ప్రారంభించడంతో పాటు రూ.45 లక్షలతో నిర్మించే మత్య్సకారుల సామూహిక భవనానికి భూమి పూజ చేశారు. సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, నాయకులు సాయిచరణ్రెడ్డి, ఆగారం ప్రకాష్, వెంకటేశ్వర్రావు, విజయ్కుమార్, గంజాయి రమేష్, నాగేశ్వర్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గోపాల్పేట: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం గోపాల్పేట, రేవల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంలో కాంగ్రెస్పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నాగశేషు మరణించిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించాడు. అనంతరం బుద్దారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని, చాకల్పల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. రేవల్లి మండలంలోని తల్పునూరుతండాలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త బండరావిపాకులలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఏదుల, చెన్నారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు, కేశంపేట గేట్వద్ద హై లేవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
విహారం.. కావొద్దు విషాదం
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ పుష్కరఘాట్ వద్ద నది సమీపంలోకి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసి ఉంచినా.. పర్యాటకులు మాత్రం ఉధృతంగా పారుతున్న ప్రవాహం సమీపానికి వెళ్లి సెల్ఫీలకు ఫోజులివ్వడంతో పాటు జలకాలాడుతున్నారు. ఆదమరిస్తే ప్రమాదమని తెలిసినా.. ఎగిసి పడుతున్న వరద ముందు ఫొటోలు దిగుతున్నారు. గస్తీ నిర్వహిస్తున్నామంటున్న పోలీసులు వీటిని గమనించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. – అమరచింత -
వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే చర్యలు
వనపర్తిటౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను పిల్లలు తీర్చకపోతే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై చట్టాల గురించి వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అత్యధికంగా రూ.10 వేల వరకు మెయింటనెన్స్ కోరవచ్చన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోయిన, గృహంలో స్థానం కల్పించకపోయినా వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007 ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులను నిరాశ్రయులను చేస్తే టోల్ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని, న్యాయ సలహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. అనంతరం వృద్ధుల హక్కులకు సంబంధించిన లఘు చిత్రాన్ని వృద్ధులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించేనా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మంజూరైన జీపీ భవన నిర్మాణ పనులు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పూర్తయ్యేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ● పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తి పనులు పూర్తిచేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. ప్రస్తుతం సిమెంట్, ఇసుక, ఇనుము తదితర వస్తు సామగ్రి ధర పెరగడంతో నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 25 గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా.. కొన్నిచోట్ల స్థలాలు లేక, మరికొన్ని చోట్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. అమరచింత మండలం నాగల్కడ్మూర్లో పిల్లర్లకే పరిమితమైన గ్రామపంచాయతీ భవనం -
ఉజ్వల భవిష్యత్..
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు సాధ్యపడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఇంజినీరింగ్ కళాశాలలు రావడంతో భవిష్యత్లో వేల సంఖ్యలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తద్వారా కార్పొరేట్ కంపెనీలు జిల్లాకు వచ్చి.. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు మొదలు, హాస్టల్ ఇతర వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ● -
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
● ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ● ఇంటర్మీడియట్తో పాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు ● బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు ● టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. ఆన్లైన్ విధానంలోనే.. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఘనంగా పోచమ్మ బోనాలు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోచమ్మ బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యంతో ఆలయానికి బారులు తీరారు. గొర్రె పొటేళ్లతో తయారు చేసిన రథంలో అమ్మవారిని ఉంచి గుట్టపైకి తీసుకొచ్చారు. అమ్మవారి పెద్ద బోనాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన జోగురాలు తలపై పెట్టుకొని నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకుంది. పోతురాజుల సయ్యాట, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి కోడిపుంజులు, గొర్రె పొటేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే .. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉత్సవాలకు హాజరై పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, నాయకులు సాయిచరణ్రెడ్డి, వెంకటేశ్వర్రావు, విజయ్కుమార్, ఆగారం ప్రకాష్, శ్యాంసుందర్, రవినాయక్, కృష్ణయ్య, శంకర్, మదు, నవీన్, డాక్టర్ నరేందర్గౌడ్, శ్రీను వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
సీఎంఆర్ సకాలంలో అందించాలి
● మిల్లులను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్ పాన్గల్: వానాకాలం సీజన్లో ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి సరిపడా సీఎంఆర్ వచ్చే నెల 12వ తేదీలోగా అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని కేతేపల్లి, మాందాపూర్లోని రైస్మిల్లులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కేతేపల్లి రైస్మిల్లు సీఎంఆర్ చెల్లింపుల్లో జిల్లాలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లుల యజమానులు అలసత్వం వహించడం సరికాదని.. ప్రభుత్వ నిబంధనల మేరకు గడువులోగా అందించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెంట డీఎస్ఓ విశ్వనాథం, డీఎం జగన్మోహన్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఆర్ఐ తిరుపతయ్య పాల్గొన్నారు. -
ఫౌండేషన్ శిక్షణ పేద విద్యార్థులకు వరం
వనపర్తిటౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేని, ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ లభించడం వరమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.వేలు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం లభించడం శుభపరిణామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రధానోపాధ్యాయుడు గురురాజు యాదవ్ శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం గురురాజుయాదవ్, మండల విద్యాధికారి మద్దిలేటి, ఉపాధ్యాయ బృందం, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎరువు.. కరువు...
రైతులకు తీరని యూరియా కష్టాలు ● క్యూలైన్లలో నిలుచున్న వారికి టోకన్లు పంపిణీ ఖిల్లాఘనపురం: మండల రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. బుధవారం సాయంత్రం 450 బస్తాలు సింగిల్విండో కార్యాలయానికి చేరింది. గురువారం ఉదయం యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా రైతులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బంది చేసేదిలేక బుధవారం టోకన్లు ఇచ్చిన ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. వచ్చిన రైతులకు యూరియా సరిపోకపోవడంతో మిగిలిన వారికి టోకన్లు ఇచ్చి పంపారు. 243 టోకన్లు పెండింగ్లో ఉన్నాయని.. యూరియా వచ్చిన వెంటనే ముందుగా వారికి పంపిణీ చేస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఖిల్లాఘనపురం సింగిల్విండో కార్యాలయం వద్ద అన్నదాతలు ఆత్మకూర్: స్థానిక పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం మండల రైతులు గురువారం తెల్లవారుజామున ఐదు నుంచి పడిగాపులు పడ్డారు. సాయంత్రం వరకు లారీ రాకపోవడంతో సిబ్బంది చేసేది లేక నో–స్టాక్ బోర్డును ఏర్పాటు చేయడంతో రైతులు కంగుతిన్నారు. పొలం పనులు వదిలి రైతులు పొద్దంతా నిలుచుంటే యూరియా లేదంటూ బోర్డు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని.. రైతులంటే అలుసుగా ఉందా అంటూ పలువురు రైతుసంఘం నాయకులు అధికారులను నిలదీశారు. ఒకానొక దశలో రైతులు, పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీఐ శివకుమార్ అక్కడకు చేరుకుని క్యూలో నిలుచున్న రైతులకు టోకన్లు ఇప్పించారు. శుక్రవారం యూరియా రాగానే మొదట టోకన్లు ఇచ్చిన వారికి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. మొత్తం 72 మంది రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు రైతులు వివరించారు. -
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం
వనపర్తి రూరల్: పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన శ్రీరంగాపురం పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాలు, సీజ్చేసిన వాహనాలు, రిసెప్షన్, రికార్డు గదిని పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నేరాల అదుపునకు కృషి చేయాలని, నిరంతరం గస్తీ నిర్వహిస్తూ గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. వీపీఓలు రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా చూడాలని, బ్లూకోర్ట్, పెట్రోకార్ విధులు నిర్వర్తించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నరేష్, ఎస్ఐలు రామకృష్ణ, యుగంధర్రెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
పేదరిక నిర్మూలనకు రాజీవ్గాంధీ కృషి
వనపర్తిటౌన్: పేదరికం రూపుమాపేందుకు కృషి చేసిన మహానేత దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని రాజీవ్విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, బాలల పోషణకు కేంద్ర సహాయ పథకాలు రాజీవ్గాంధీ కృషితోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. గ్రామీణ టెలిఫోన్ నెట్వర్క్, టెలివిజన్ ప్రసారాలను విస్తరించి సమాచార విప్లవానికి బీజం వేశారని కొనియాడారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ అక్తర్, కమర్మియా, నాయకులు కిరణ్కుమార్, బాబా, జానకిరాములు, నారాయణ, సి.పెంటన్న, రోహిత్, నాగార్జున, రాగి అక్షయ్, ఇర్ఫాన్, సురేష్గౌడ్, జానకమ్మ పాల్గొన్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కోల్పోకుండా అర్హత గల వారిని చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. రేపు జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు వనపర్తిటౌన్: మహబూబ్నగర్లోని పాల మూరు యూనివర్సిటీలో ఈ నెల 30, 31న జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఉదయం 9 గంటల వరకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ (సెల్నంబర్ 80961 15222) సంప్రదించాలని సూచించారు. ‘నీట్’ పీజీలో ప్రతిభ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన స్వప్న, భాస్కర్రెడ్డి దంపతుల కుమారుడు రిత్విక్రెడ్డి ఇటీవల వెలువడిన నీట్ పీజీ ఫలితాల్లో ఆలిండియాలో 16వ ర్యాంక్ సాధించారు. 2019 నీట్ యూజీలోనూ 430 ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్లోని భూపాల్ ఎయిమ్స్లో మెడిసిన్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంట్లోనే చదివి 684 మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఏటా ఇబ్బందులే..
● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది. ప్రతి ఏటా పలు కాలనీలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నా.. అధికారులు శాశ్వత చర్యల దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● దేవరకద్రలోని దళితవాడ వద్ద ఆర్యూబీ గుండా రైతులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. భారీ వర్షం వస్తే అండర్ పాస్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలుస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ● జడ్చర్ల నుంచి ఆలూరు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్యూబీలో నీళ్లు నిలుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నీరు సాఫీగా వెళ్లేందుకు పైపులైన్ వేసే పనులు కొనసాగుతున్నాయి. -
యూరియాకు పడిగాపులు
ఆత్మకూర్: యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవార్లు పడిగాపులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం ఉదయం రాగా మధ్యాహ్నం 3.30కి 700 బస్తాలు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుస క్రమంలో నిలబెట్టి సాయంత్రం వరకు పంపిణీ చేశారు. చాలామంది రైతులకు దొరకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద బుధవారం పోలీసుల గస్తీ నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఒక లారీ యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి టోకన్ ప్రకారం పంపారు. యూరియా తక్కువగా ఉండటంతో ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరిపోకపోవడంతో చేసేది లేక కార్యాలయ సిబ్బంది మిగిలిన రైతులకు టోకన్లు ఇచ్చి పంపారు. గురువారం ఉదయం వస్తుందని.. వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. ఏఓ మల్లయ్య పర్యవేక్షణ చేపట్టారు. ఖిల్లాఘనపురం సింగిల్విండో వద్ద ఇలా.. అన్నదాతలకు తప్పని తిప్పలు అందక నిరుత్సాహంతో వెనుదిరిగిన రైతులు -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు ● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి ● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు ● భారీ వర్షాలతో అండర్ పాస్లకు పోటెత్తుతున్న వరద ● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును పట్టించుకోని రైల్వే శాఖ ● డ్రెయినేజీల విస్తరణ, అనుసంధానంపై నిర్లక్ష్యం2022 జూలై 08: ఇది మహబూబ్నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటిలో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది. 2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా -
చేనేత ఉత్పత్తులను ఆదరిద్దాం
అమరచింత: చేనేత ఉత్పత్తులను ఆదరించి కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకుందామని నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలో చేనేత ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూరల్ మార్ట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాబార్డ్ సహకారంతో నెలకొల్పిన ఈ మార్ట్లో చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెడీమేడ్ దుకాణాన్ని కంపెనీ డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత చేనేత ఉత్పత్తుల కంపెనీ ఐదేళ్లుగా నేత కార్మికుల భాగస్వామ్యంతో కొనసాగుతూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని వివరించారు. మగ్గాలపై నేసిన జరీ చీరలను ఇతర ప్రాంతాలతో పాటు ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు కొత్తగా రూరల్ మార్ట్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ అధికారులతో పాటు కంపెనీ సీఈఓ శేఖర్, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. నాబార్డ్ డీడీఎం మనోహర్ -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
వనపర్తిటౌన్: బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్య నేరమని.. నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహం జరిగిన రెండేళ్లలోపు రద్దు చేసుకునేందుకు జిల్లా న్యాయస్థానంలో పిటీషన్ వేసుకోవచ్చని సూచించారు. మోటారు వెహికల్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రఘు, సూర్యనారాయణ, పాఠశాల అధ్యక్షుడు మందడి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఇక సాగనంపడమే..
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న ఐదు చెంచుపెంటల రీలొకేషన్కు కేంద్ర పర్యావరణ శాఖ సలహాకమిటీ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో ఐదు చెంచుపెంటల్లోని స్థానికులను అడవి నుంచి బయటకు తరలించి అక్కడ పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ సలహా కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించడంతో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల పెంటల్లోని 417 కుటుంబాలతో పాటు రెండోవిడతలో వటవర్లపల్లి, సార్లపల్లి గ్రామాల్లోని 836 కుటుంబాలను అడవి నుంచి బయటకు తరలించి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వన్యప్రాణులు– మనుషులకు మధ్య ఘర్షణ నివారించేందుకు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో నివసిస్తున్న స్థానిక చెంచులను ఇక్కడి నుంచి తరలించి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాసం కల్పించనున్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాలకు ఆటంకాలను నిర్మూలించడం, మనుషులకు – వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను నివారించేందుకు, పర్యావరణ సంరక్షణలో భాగంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) నిర్వాసితులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తోంది. స్వచ్ఛందంగా అడవి నుంచి బయట నివసించాలనుకునే వారికి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా ఇల్లు, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రీలొకేషన్ సర్వే, గ్రామసభలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తుల నుంచి అంగీకారపత్రాలను తీసుకున్నారు. సార్లపల్లి గ్రామంలోని 30 కుటుంబాలు మినహా, కొల్లంపెంట, కుడిచింతల్ బైల్, తాటిగుండాల, వటవర్లపల్లి గ్రామాల్లోని స్థానికులు రీలొకేషన్కు అంగీకారం తెలిపారు. ఎంఓయూ తర్వాత.. గ్రామసభలు, జిల్లాస్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) కమిటీల ఆమోదం మంగళవారం కేంద్రం పర్యావరణశాఖ సలహా కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో నిర్వాసితుల నుంచి మెమొరెండమ్ ఆఫ్ అండర్ స్టాడింగ్(ఎంఓయూ) పత్రాలపై సంతకాలను తీసుకున్న తర్వాత గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మరో రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని చెంచుపెంటల తరలింపునకు కేంద్రం ఆమోదం నల్లమల అడవి నుంచి రెండు దశల్లో 5 గ్రామాల రీలొకేషన్ నిర్వాసితుల నుంచి ఎంఓయూ అనంతరంప్రారంభం కానున్న తరలింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే పంపించాలంటున్న చెంచులు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద పునరావాస కేంద్రం జీవనోపాధిపై నమ్మకం కల్పించాకే..తమకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పూర్తిస్థాయిలో పునరావాసం పూర్తయిన తర్వాతే అడవి నుంచి తరలించాలని చెంచులు కోరుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకున్న తమకు బయటకు తీసుకెళ్లాక జీవనోపాధి కరువవుతుందని ఆందోళన చెందుతున్నారు. పునరావాసం తర్వాత ఉపాధి లేక ఇబ్బందులు పడతామని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించడంతో పాటు జీవనోపాధిపై నమ్మకం కలిగించాకే తమను అడవి నుంచి బయటకు తరలించాలని కోరుతున్నారు. మానవీయ కోణంలో తరలింపు చేపడతాంఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ అడవిలో తప్ప బయట బతకలేం.. మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటు న్నాం. అడవిలో ఉన్న ఆధా రం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాంమేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ -
డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి: డ్రైవర్లు రహదారి భద్రత నిబంధనలు విధిగా పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఆపాలన్నారు. మద్యం తాగి, సెల్ఫోన్లలో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని.. సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని కోరారు. బస్సును రోజూ తనిఖీ చేయాలని, టైర్లు, బ్రేకులు, ఇతర భాగాలను పరిశీలించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే, యాజమాన్యానికి చెప్పి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సిగ్నల్స్, మలుపులు, ప్రధాన కూడళ్లలో వేగాన్ని నియంత్రించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని.. సమయపాలన పాటిస్తూ విద్యార్థులతో ఓపిక, సహనంగా, మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్ఎస్సై సురేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
ఇబ్బందులు పడుతున్నాం..
నేను ఐదురోజులుగా యూరియా కోసం వస్తు న్నా దొరకడం లేదు. దొరకుతుందో లేదోనని తెల్లవారుజామున పీఏసీఎస్ వద్దకు వస్తున్నాం. అప్పటికే పెద్దసంఖ్యలో రైతులు ఉండటంతో వర్షంలోనూ చెప్పులను వరుసలో పెడుతున్నాం. పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. – చెన్నమ్మ, రైతు, మోట్లంపల్లి రైతులంటే లెక్కలేదు.. రైతులంటే అధికారులు, పాలకులకు లెక్కలేకుండా పోయింది.. పంటల సాగంటేనే నరకప్రాయంగా మారుతోంది. నాలు గు రోజులుగా పీఏసీఎస్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నా. నా చె ప్పుల వరుస వచ్చే సరికి అయిపోయిందని అంటున్నారు. ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు మా బాధలను పట్టించుకొని న్యాయం చేయాలి. – చిన్న హన్మంతు, రైతు, బాలకిష్టాపూర్ ఆరు వేల బస్తాలు పంపిణీ చేశాం.. పీఏసీఎస్ పరిధిలో ఇప్పటి వరకు ఆరువేల బస్తాల యూరియా పంపిణీ చేశాం. తీసుకున్న రైతులే మళ్లీ తీసుకొని వారి బంధువులకు పంపిస్తున్నారు. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో పంపిణీలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. రోజుకు 700 సంచుల యూరియా వస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – గాడి కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు, ఆత్మకూర్ ● -
యూరియా పక్కదారి పట్టొద్దు
వనపర్తి: యూరియా వ్యవసాయానికి మినహా ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో తరలడానికి వీలు లేదని, పక్కదారి పట్టకుండా రైతులకు అవసరం మేరకు అందేలా చూడాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్ ఎరువులు ఉన్నాయని, క్రమం తప్పకుండా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్ముందు దొరకదనే ఆలోచనతో ఎగబడి కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ప్రతి వారం వస్తూనే ఉంటుందని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించి ప్రస్తుతం ఉన్న అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో దుకాణాలు, సొసైటీ గోదాములను తనిఖీ చేయాలని.. బ్లాక్మార్కెట్పై టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, కో–ఆపరేటివ్శాఖ అధికారి ప్రసాదరావు, ఏడీఏలు, మార్కెటింగ్శాఖ అధికారి స్వరణ్సింగ్, రవాణాశాఖ అధికారి మానస తదితరులు పాల్గొన్నారు. రైతులు అవసరం మేరకే కొనుగోలు చేయాలి ఇన్చార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి -
అన్నదాత.. ఆందోళన
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు ఆత్మకూర్: యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షంలోనూ తెల్లవార్లు పడిగాపులు పడుతూ చెప్పులతో క్యూలైన్లు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. చేసేది లేక చివరకు మంగళవారం రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. ● మండలంలోని వివిధ గ్రామాల రైతులు స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమకు యూరియా సరఫరా చేసే వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించుకు కూర్చున్నారు. పీఏసీఎస్ కార్యాలయానికి ఐదురోజులుగా తిరుగుతున్నా.. కొంతమందికి ఇచ్చి చేతులెత్తేస్తున్నారని రైతులు మండిపడ్డారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మనోహర్గౌడ్, పార్టీ మండల అద్యక్షుడు అశోక్భూపాల్, ప్రధానకార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే తిరగబడతామని హెచ్చరించారు. ఒకానొక సమయంలో రైతులు, నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐ నరేందర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పీఏసీఎస్ అధికారులను పిలిపించి సరిపడా యూరియా అందుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పించడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతులు మల్లేష్, రాము, వెంకటన్న, చంద్రయ్య, పార్వతమ్మ, రాజు, వెంకటన్న, నర్సింహులు పాల్గొన్నారు. అపోహలతోనే ఇబ్బందులు.. రోజుకు 25 టన్నుల చొప్పున యూరియా పీఏసీఎస్కు వస్తుంది. రెండోవిడత దొరుకుతుందో లేదోనని తీసుకున్న రైతులే మళ్లీ తీసుకుంటున్నారు. పీఏసీఎస్తో పాటు రైతు ఆగ్రో సేవాకేంద్రం, హాకా కేంద్రాల వద్ద యూరియా అందుబాటులో ఉంది. అలాగే రేచింతల, ఆరేపల్లి, వీరరాఘవపూర్లో కావాల్సినంత యూరియా ఇస్తున్నారు. రైతులు ఆందోళనలకు గురికాకుండా అపోహలను నమ్మకుండా తమకు కావాల్సిన మేర యూరియా మాత్రమే తీసుకెళ్లాలి. – నరేష్, సీఈఓ, సింగల్విండో వర్షంలోనూ తెల్లవార్లు పడిగాపులు ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద చెప్పుల వరుస అధికంగా తీసుకోవడంతోనే ఇబ్బందులు అంటున్న అధికారులు -
విచారణలో జాప్యమెందుకో..?
వనపర్తి: ఇటీవల అక్రమంగా సుమారు 450 బస్తాల సన్నరకం వరి ధాన్యం లారీలో కర్ణాటకకు తరలిస్తుండగా సీసీఎస్ పోలీసులు పెబ్బేరులో పట్టుకున్న అంశంపై అఽధికారులు స్పష్టతనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరి ధాన్యం ఏ సీజన్కు చెందినది.. ఎక్కడికి వెళ్తుంది.. ప్రభుత్వ ముద్రణతో ఉన్న గన్నీ బస్తాల్లో ఎందుకు తరలించాల్సి వస్తుందనే విషయాలపై పౌరసరఫరాలశాఖ అధికారుల విచారణ ఇప్పటి వరకు ఎందుకు ముందుకు సాగడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2023లో అదే పెబ్బేరులోనే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంటే.. అప్పటి అధికారులు ఒక్కరోజులోనే కేసునమోదు చేశారు. విచారణలో మిగతా విషయాలు తేల్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. మునుపు అధికారులు ఇలాంటి నిబంధనలనే పాటించేవారు. తాజా ఘటనపై ముందుగా అనాలసిస్కు సిఫారస్ చేసి నివేదిక వచ్చిన తర్వాతే కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధాన్యం అక్రమ రవాణా చేస్తున్న లారీని సీసీఎస్ పోలీసులు పట్టుకున్న తర్వాత సైతం కేసునమోదు చేసేందుకు సిఫారస్ చేయడంలో పౌరసరఫరాలశాఖ అధికారులు నాన్చుడు ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న విషయంపై సమాధానం లేకపోవడం గమనార్హం. టీఏలకు అనాలసిస్ బాధ్యతలు.. ఇలాంటి ఘటనల్లో బియ్యానికి ఓ రకమైన పరీక్షలు, ధాన్యానికి మరో రకమైన పరీక్షలు చేయడం ఆనవాయితి. ధాన్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు అది ఏ సీజన్లో పండించిందనే విషయాన్ని ల్యాబ్లోగాని, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లుగాని సులువుగా పరీక్షించి చెప్పగలరు. కానీ ఇలాంటి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా వారి ఆధీనంలో పనిచేసే టీఏలకే అనాలసిస్ బాధ్యతలు అప్పగించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేసింది. ● ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని ఇదివరకే అదనపు కలెక్టర్కు అందజేశామని చెప్పిన డీఎస్ఓ సోమవారం మాటమార్చి అనాలసిస్ రిపోర్ట్ వచ్చాక నివేదిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సిద్ధం చేసి అందజేశామని చెప్పారు కదా అని అడుగగా.. వరుస సెలవులు, వర్షాలు, ఇతర పనుల వత్తిడితో ఫైల్ అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లలేదని చెప్పడం గమనార్హం. విచారణ నివేదిక తర్వాతే చర్యలు.. ఇప్పటి వరకు విచారణ నివేదిక నా వద్దకు రాలేదు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రాథమిక విచారణ నివేదిక, టెక్నికల్ అసిస్టెంట్లతో డీఎస్ఓ సేకరించిన అనాలసిస్, ఇతర నివేదికల దస్త్రం వచ్చాక పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై స్పష్టతనిస్తాం. ప్రభుత్వ గన్నీబ్యాగు లు ఎందుకు ఉపయోగించారనే విషయంతో పాటు ధాన్యం ఏజ్ను అనాలసిస్ చేయిస్తాం. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ నాలుగు రోజులు గడుస్తున్నా.. కలెక్టరేట్కు చేరని దస్త్రం పరీక్షల పేరుతో తాత్సారం చేస్తున్న అధికారులు -
యూరియా కొరత లేదు
వనపర్తి: జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. పంటల సాగు, యూరియా లభ్యతపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. గతేడాది వానాకాలంలో జిల్లాకు 16,780 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా ఆగస్టు వరకు 10,209 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించినట్లు వివరించారు. ఈ ఏడాది 19 వేల మెట్రిక్ టన్నులు కేటాయించగా.. నేటి వరకు 12,845 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 2,538 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇందులో అత్యధికంగా డీలర్ల వద్ద 1,526 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మరో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని.. జిల్లాలో యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్, డీఏపీ తదితర ఎరువులు సరిపడా ఉన్నాయని చెప్పారు. యూరియాతో పాటు ఫర్టిలైజర్ కొనాలని ఎవరైనా డీలర్లు రైతును వత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో యూరియా సమస్యలపై వెంటనే స్పందించేందుకు కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశామని.. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సెల్నంబర్ 89777 56114 ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, ఏడీఏలు, మార్కెటింగ్ అధికారి, కో–ఆపరేటివ్ అధికారి పాల్గొన్నారు. -
వేగంగా ‘రెవెన్యూ’ దరఖాస్తుల పరిష్కారం
వనపర్తి: భూ భారతి – 2025 ప్రకారం రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వారం రోజుల్లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించారు. వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని, ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్కు పంపించే వాటికి తగిన ఆధారాలను జత చేయాలని ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్, సక్షేషన్ దరఖాస్తులు నిబంధనల ప్రకారం రుసుం తీసుకొని ఆమోదం తెలపాలని సూచించారు. తిరస్కరించాల్సిన దరఖాస్తులకు తగిన కారణాలతో నివేదిక సిద్ధం చేసుకోవాలని, కలెక్టర్ ఆమోదం తర్వాతే సీసీఎల్ఏకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులు ఆమోదించాల్సినవి.. తిరస్కరించాల్సినవి సరైన కారణాలతో సిద్ధంగా ఉంచాలన్నారు. దరఖాస్తులను ఆమోదించడంగాని, తగిన కారణాలతో తిరస్కరించడంగాని జరగాలని.. పెండింగ్లో ఉంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ -
జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 2.05 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా... 31 క్రస్టు గేట్లు ఎత్తి 2,13,311 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నుంచి 28,734 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.512 టీఎంసీల నీరు నిల్వ ఉంది. – ధరూర్ కోయిల్సాగర్లో జలసిరి కోయిల్సాగర్కు భారీగా వరద వస్తుండటంతో ఐదు గేట్లను అడుగు మేర ఎత్తి.. 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. – దేవరకద్ర సరళాసాగర్ కళకళ.. సరళాసాగర్ జలాశయానికి సోమవారం ఎగువ నుంచి భారీగా వరద చేరింది. దీంతో 3 వుడ్, 2 ప్రైమరీ సైఫన్ల నుంచి 11,350 క్యూసెక్కుల వరద దిగువకు పారినట్లు అధికారులు వివరించారు. – మదనాపురం రామన్పాడు 3 గేట్లు పైకెత్తి.. సరళాసాగర్, శంకరసముద్రం, ఊకచెట్టు వాగు నుంచి రామన్పాడు జలాశయానికి వరద రావడంతో సోమవారం జలాశయం 3 గేట్లు పైకెత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. – మదనాపురం సుంకేసులకు వరద.. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం సుంకేసుల జలాశయానికి భారీగా వరద చేరింది.92 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 17 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 87,158 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్కు 2,180 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ తెలిపారు. – రాజోళి సంగంబండ.. నిండుకుండ... సంగంబండలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎగువ కర్ణాటకలోని ఇడ్లూర్, నందేపల్లి వాగుల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో సోమవారం 7 గేట్లు పైకెత్తి 5,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. – మక్తల్ -
వర్షం.. హర్షం
వనపర్తి/పాన్గల్: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మట్టిమిద్దెలు, శిథిల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, ఉప్పరిపల్లిలో ఒక్కో ఇల్లు కూలిపోయాయి. వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో ఒకటి, పెద్దగూడెం గ్రామంలో ఒకటి, అంకూరులో రెండు, పెబ్బేరు మండలంలోని సూగూరులో ఒకటి, శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో రెండు ఇళ్లు కూలగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాన్గల్ మండలంలో..మండలంలోని రేమద్దుల సమీపంలోని నల్లచెరువు కుంట అలుగు ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. దీంతో కొల్లాపూర్, మైలారం, సింగాయిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలను పాన్గల్–శాగాపూర్ మీదుగా మళ్లించారు. కోతకు గురైన రహదారిపై రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. మండలంలోని కిష్టాపూర్తండా సమీపంలో కేఎల్ఐ డీ–8, ఎంజే–4 కాల్వ రెండు ప్రాంతాల్లో కోతకు గురై పంటలు నీట మునిగాయి. కిష్టాపూర్తండాకు చెందిన రైతు వశురాంనాయక్ 3 ఎకరాల వేరుశనగ పంట నీట మునిగి మొలకెత్తి నష్టం వాటిల్లింది. భూత్పూర్ రిజర్వాయర్ ఎడమ కాల్వ వరదతో అమరచింత పెద్ద చెరువు సోమవారం అలుగు పారింది. ● ఉమ్మడి గోపాల్పేట మండలంలోని పొలికెపాడులో వాగు నీటి ఉధృతికి సమీపంలోని వరి పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. అలాగే తాడిపర్తిలో మట్టిమిద్దె కూలింది. ● జిల్లాలో సోమవారం నాటికి 505 చెరువులు అలుగు పారుతుండగా.. మరో 309 చెరువులు వందశాతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. రామన్పాడు, సరళాసాగర్, గోపాల్దిన్నె ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సాయం అందించేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఏ సమయంలోనైనా కాల్చేస్తే స్పందించేలా మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖిల్లాఘనపురం 64.3 మదనాపురం 58,3 అమరచింత 37.5 వీపనగండ్ల 4.3 ఆత్మకూరు 42.3 జిల్లావ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వానలు నిండుకుండను తలపిస్తున్న చెరువులు, కుంటలు కూలిన పలు శిథిల నివాసాలు రహదారులపై నీరు పారి రాకపోకలకు అంతరాయం -
పల్లెగడ్డను వదులుకోం
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన నాటి నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు ఊరిని కాపాడుకుంటూ వస్తున్నారని.. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో పల్లెగడ్డ గ్రామం ఉందని ఫిర్యాదు చేయడంతో తమకు సమస్యలు మొదలయ్యాయని వాపోతున్నారు. అప్పటి నుంచి ఎండోమెంట్ అధికారులు తమకు దశల వారీగా కోర్టు నుంచి నోటీసులు జారీచేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,624 మందికిపైగా జనాభా.. నాలుగు కుటుంబాలతో మొదలైన పల్లెగడ్డ గ్రామంలో 250కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. 20 ఎకరాల గ్రామకంఠం ఉంది. మొత్తం 1,624 జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 254 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 40 మంది, అంగన్వాడీ కేంద్రంలో 25మంది చదువుకుంటున్నారు. 250 ఇళ్లకు పైగా విద్యుత్ మీటర్లు ఉండగా.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఆంజనేయస్వామి, శివాలయాలు, నలుదిక్కులా గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 2 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్షాపు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి. కొత్త పంచాయతీగానూ ఏర్పాటు చేశారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని 2018 నుంచి కోర్టు చుట్టూ తిప్పడం సరికాదు. ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలి. – కుర్మయ్య, పల్లెగడ్డ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మొదటి విడతగా 66 ఇళ్లు మంజూరయ్యాయి. 1980లో కూడా అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఎండోమెంట్ అధికారులకు కనిపించడం లేదా.. కోర్టులో న్యాయ పోరాటం చేసి గ్రామాన్ని కాపాడుకుంటాం. – విజయ్, పల్లెగడ్డ పల్లెగడ్డ గ్రామం విషయం దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే మరికొంత మందికి కోర్టు నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సమర్పించాలి. – కవిత, దేవాదాయశాఖ ఈఓ, మహబూబ్నగర్ ముక్తకంఠంతో నినదిస్తున్న గ్రామస్తులు నేడు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకానున్న 25మంది పుట్టిన ఊరి కోసం తమ వాదన వినిపిస్తామని వెల్లడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిని విడిచి వెళ్లమని శపథం స్పందించని ప్రజాప్రతినిధులు చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయ భూమిలో నిర్మితమైన పల్లెగడ్డ గ్రామం మొదట్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మరికల్ పంచాయతీ పరిధిలో ఉండటంతో కనీస వసతులకు నోచుకోక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. కాలక్రమేణా గ్రామ జనాభా పెరగడంతో 1980లో అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చింది. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలు, పబ్లిక్ కొళాయిలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ నిధులతో ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక గత ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చూట్టింది. అప్పటి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చొరవతో మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లెగడ్డను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు వంటివి నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. మొదటి విడతలో 66 ఇళ్లు మంజూరుచేయగా.. లబ్ధిదారులు పనులు సైతం ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే పల్లెగడ్డ గ్రామస్తుల సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టనట్టుగా ఉండటం గమనార్హం. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
కొత్తకోట రూరల్: పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి.కోమల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, పీడీ మన్యంయాదవ్ ఆదివారం, తెలిపారు. ఈ నెల 16న జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి అండర్–15 వాలీబాల్ బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని.. సోమ, మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననున్నట్టు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ చక్కటి ప్రతిభ కనబర్చి పాఠశాల, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు. -
ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని వల్లభ్నగర్లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా కమిటీ సంయుక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. ఆదివారం శ్రీకృష్ణుడి ప్రతిమను అందంగా ముస్తాబుచేసి పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించగా మహిళలు గోపికల వేషధారణలో డీజే పాటలకు కోలాటాలు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకట్రాములు, ప్రతినిధులు పద్మ, కృష్ణయ్య, నాగరత్నం, లలిత, కొత్తకోట, మద్దిగట్ల, జిల్లా, మండల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని అక్రమ దందా?!
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం అక్రమ దందా ఆగడం లేదు. పౌరసరఫరాలశాఖ అధికారుల నామమాత్రపు పర్యవేక్షణతో కొందరు మిల్లర్లు ఇష్టారీతిన సీఎంఆర్ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని ఓ మిల్లర్ ప్రభుత్వ అందించిన సంచుల్లోనే పెద్దమొత్తంలో ధాన్యాన్ని కర్ణాటకకు తరలిస్తుండగా పెబ్బేరులో సీసీఎస్ అధికారులు దారికాచి పట్టుకున్నారు. ఈ ఘటనతో జిల్లా అధికార వర్గం దృష్టి ఒక్కసారిగా సీఎంఆర్ దందా వైపు మళ్లినట్లయింది. ● డీఫాల్టర్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపులు చేయకుండా రికవరీ కోసం ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఎక్కువ మొత్తంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం, సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులను బ్లాక్ లిస్ట్లో ఉంచడంతో అక్రమ దందా తగ్గిందనే భావన జిల్లాలో నెలకొన్న సమయంలో సుమారు 450 బస్తాల ధాన్యం అక్రమంగా ఇతర రాష్ట్రానికి ఓ మిల్లర్ తరలించే ప్రయత్నం చేస్తూ విఫలం కావడంతో సీఎంఆర్ దందా ఆగలేదు.. రహస్యంగా కొనసాగుతుందనే ఆరోపణలు జిల్లావ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల్లో బిజీగా ఉంటారనే భావనలో సదరు మిల్లర్ సాయంత్రం వేళ భారీ మొత్తంలో ధాన్యం అక్రమ తరలింపునకు ప్రణాళిక రచించినా.. సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో లారీని పట్టుకోవడంతో మిల్లర్ ప్రణాళిక బెడిసికొట్టినట్లయింది. కొందరు మిల్లర్లు ప్రభుత్వం సీఎంఆర్ కోసం మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు విక్రయించుకొని స్థానికంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యాన్ని వారు నియమించుకున్న ఏజెంట్ల ద్వారా సేకరించి సైక్లింగ్ చేస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సైతం రాజకీయ నేతల అండదండలతో రేషన్ దందా కొనసాగిస్తూ డబ్బు సంపాదనకు వెంపర్లాడుతున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు నామమాత్రపు పర్యవేక్షణ చేసేలా డబ్బుతో లొంగదీసుకున్నారన్న ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లు కచ్చితంగా వ్యవహరిస్తే ఒక్క బస్తా రేషన్ బియ్యం కూడా రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి ఉండదు. సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపుల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం చేరడం.. తిరిగి అవే బియ్యం సీఎస్సీ గోదాంకు చేరడం, సీఎంఆర్ ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించడం లాంటి అన్ని ప్రక్రియల్లో అఽధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న లారీలోని ధాన్యం నమూనాలను సేకరించాం. సదరు మిల్లులోనూ ధాన్యం బస్తాల వివరాలను స్వయంగా వెళ్లి పరిశీలిస్తాం. పూర్తి వివరాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెల్లడిస్తారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గోనెసంచుల్లోనే ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. కాగా సీఎంఆర్ కోసం మిల్లర్లుకు కేటాయించిన ధాన్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇతర అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ పెంచుతాం. కఠిన చర్యలకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సిఫారస్ చేస్తాం. – కాశీవిశ్వనాథం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా వరి ధాన్యం తరలింపు తాజాగా పెబ్బేరులో ధాన్యం లారీని పట్టుకున్న అధికారులు నామమాత్రపు కేసుల నమోదుతో జంకని మిల్లర్లు నేతల అండదండలతోనే అక్రమాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు -
అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు
పాన్గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో 16 మంది, వెంగళాయిపల్లిలో నలుగురికి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్న వివరాలు ఆరా తీశారు. తెల్లరాళ్లపల్లితండాలో ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ఇల్లు మంజూరు కావడంతో రద్దు చేసి అర్హులైన వేరే కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు గ్యాస్ సిలిండర్, పంట రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలు నెరవేర్చినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేసినా, ఇళ్ల మంజూరుకు డబ్బులు వసూలు చేసిన అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని.. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని, పిల్లలను బాగా చదివించాలని కోరారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారికి రెండోవిడతలో మంజూరవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు రవికుమార్, వెంకటేష్నాయుడు, పుల్లారావు, భాస్కర్యాదవ్, రవినాయక్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. తెల్లరాళ్లపల్లితండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు మంత్రి జూపల్లికి వినతిపత్రం అందజేశారు. తండా సమీపంలోని కేఎల్ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్లు అధికంగా కేటాయించాలని, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని, ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, మహిళ సమాఖ్య భవనాల మంజూరు, ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వంటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆయా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.బీఆర్ఎస్ నేతల నిరసన అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదని రాష్ట్ర పశుసంవర్దకశాఖ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లాతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని.. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఘాటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రేస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్లు పాలించి ఏమీ చేయని వారు ప్రస్తుతం విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. జూరాల వద్ద రూ.122 కోట్లతో వంతెన, ఆత్మకూర్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తామని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, పరమేశ్వరస్వామి చెరువుకట్ట విస్తరణ, ఆలయానికి దారి, డయాలసిస్ కేంద్రం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పరమేష్, తులసీరాజ్, బంగారు భాస్కర్, మశ్చందర్గౌడ్, అజ్మతుల్లా, షాలం, రఫీఖ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరు.. కొత్తకోట రూరల్: పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం కానాయపల్లి శివారులోని శ్రీకృష్ణ ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక యాదవ సంఘం సభ్యులు, స్థానికులు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రధాన వీధుల్లో ఊరేగించి ఆలయం వద్ద ఉట్లు కొట్టే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, రావుల కరుణాకర్రెడ్డి, డా. పీజే బాబు, వేముల శ్రీనివాస్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, రాములు యాదవ్, సంద వెంకటేష్, యాదవ్ కమిటీ సభ్యులు, పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోడేరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి సంబంధించి మైనార్టీలకు 34 కట్టు మిషన్లు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా సాతాపూర్, గంట్రావుపల్లి, ఖానాపూర్, కోడేరు వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.13కోట్లు నిధుల కేటాయించినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా పస్పుల వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కోడేరుకు 76 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500 వందలకే గ్యాస్, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్కుమార్, ఆర్ఐ జంబులయ్య, పంచాయతీ కార్యదర్శి రవితేజ, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ మహేష్రెడ్డి, రంగినేని జగదీశ్వరావు, మాజీ వార్డు సభ్యులు రాజు, సురేష్ యాదవ్, కురుమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు . -
రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
గోపాల్పేట: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలతో కడుపు నింపే పార్టీలని.. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి ఒక్కసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని మహబూబ్నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె ఏదులలోని పెద్దగుట్టపై ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని.. తెలంగాణ ఏర్పడకముందు గొప్పలు చెప్పిన బీఆర్ఎస్, అమలుకాని ఆరు గ్యారెంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని.. త్వరలోనే తెలంగాణలో బీజేపీ పాగా వేయనుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర నిధులు వినియోగిస్తూ కాంగ్రెస్ పథకాలుగా పేర్లు మార్చి అమలు చేస్తూ పొంగిపోతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఏమయ్యాయని, సగం మంది రైతులకు పంట రుణమాఫీ వర్తించలేదని, నిరోద్యోగభృతి రాలేదని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబ్బిరెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణగౌడ్, మణివర్ధన్సాగర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలతో కడుపు నింపే పార్టీలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి
వనపర్తి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం పెబ్బేరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అష్టోత్తరం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత పఠనం చేశారు. అనంతరం పట్టణ వీధుల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆర్యవైశ్య మహిళలు భారీగా ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో కోలాటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం ఆలయంలో మహిళలు శ్రీకృష్ణుడి తులాభారం నిర్వహించి ఉట్టికొట్టి, మహా మంగళహారతి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయనతో పాటు సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సాంబ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కిందట ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పురుడు పోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాసీ్త్రయ విద్య సాధనే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు పోరాడుతోందన్నారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ సమాజంలో ఉన్న వివక్షపై జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగిన పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జిల్లాకేంద్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని.. ప్రభుత్వ విద్యారంగంపై పాలకులు కనీస దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని.. పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్ఛలవిడిగా అనుమతులిస్తూ వాటి అభివృద్ధికి ప్రభుత్వం పరోక్షంగా మద్దతునిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, రియింబర్స్మెంట్ నాలుగేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పా పరిష్కార చర్యలు ఏమీ లేవని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిందన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినా ఆయా కళాశాలపై అధికారుల చర్యలు శూన్యమేనని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, రంజిత్, సహాయ కార్యదర్శులు గణేష్, పవన్, రాష్ట్ర నాయకులు గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా, గుట్ట కింద దాతలు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్లో ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడి రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి సిబ్బందితో చేరుకొని రాకపోకలను పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు. గుట్టపైన భక్తులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గుట్టపై భక్తుల రద్దీ -
యూరియా కష్టాలు..!
అమరచింత: వానాకాలం పంటలు సాగుచేసిన రైతులు పొలాల్లో చల్లేందుకు యూరియా కావాలంటూ ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట పడిగాపులు పడుతూ అందినకాడికి తీసుకెళ్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. యూరియా సరిపడా అందడం లేదంటూ రైతులు రెడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులు మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన వద్దంటూ ప్రకటనలిస్తున్నారు. కాగా సరైన సమయానికి యూరియాను సరఫరా చేయలేక పోతున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానకాలం వరిసాగు 2.75 లక్షల ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసి 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ ప్రభుత్వం జిల్లాకు కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నామని చెప్పడంతో జిల్లా వ్యవసాయ ఆధికారులు మిగిలిన యూరియా కోసం మరోమారు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సకాలంలో యూరియా పంటలకు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని.. ఎకరాకు రెండు బస్తాల చొప్పున సరఫరా చేయాలంటున్నారు రైతు సంఘాల నాయకులు. సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు కేటాయింపు.. యూరియాను జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాలకు కేటాయించకుండా కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తుండటంతో రైతులు నిత్యం ఆయా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ధరలకు విక్రయిస్తే ఆయా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. ప్రస్తుతం వీటికి మాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మండలానికి కేవలం రెండు, మూడు కేంద్రాల్లోనే యూరియా లభిస్తుండటంతో అన్ని గ్రామాల రైతులు అక్కడికే తరలిరావడంతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన నిల్వలు సరిపోక పలువురు రైతులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో యూరియా పంటలకు అందుతుందని.. అందుకే యూరియా బస్తాల కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. 2020 గణాంకాల ప్రకారం.. జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున అధికారులు ప్రతి సంవత్సరం పంటలకు సరిపడా యూరియా తెప్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఈసారి 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఎంత మేర యూరియా దిగుమతి చేసుకున్నారనే గణాంకాలను పరిశీలించి సరఫరాకు సిద్ధమయ్యారు. 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదనలు పంపితే కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. పట్టణ శివారులో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. ఎకరాకు రెండు బస్తాల యూరియా చల్లాలని.. 8 బస్తాలు ఇవ్వమని ఆగ్రో రైతు సేవాకేంద్రానికి వెళ్తే పట్టాదారు పాసు పుస్తకానికి రెండు మాత్రమే ఇచ్చారు. యూరి యా అందక ఇబ్బందులు పడుతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ప్రభుత్వ వైఫల్యం.. యూరియా సకాలంలో సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల తరబడి వరుసలో నిలబడే పరిస్థితి నెలకొంది. అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 14 ఎకరాల్లో వరి సాగు చేసిన నాకు రెండు బస్తాల యూరియా ఏ మేరకు సరిపోతుంది. – మల్లారెడ్డి, రైతు, కిష్టంపల్లి సరిపడా సరఫరా చేయాలి.. నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. కానీ యూరియాకు వెళ్తే రెండు బస్తాలు ఇస్తామంటున్నారు. పంటలకు సరిపడా ఇవ్వాలని అడిగినా సంబంధిత ఫర్టిలైజర్ దుకాణ యాజమానులు పట్టించుకోవడం లేదు. ఎకరాకు రెండు బస్తాల లెక్కన యూరియా అందించి పంట కాపాడాలి. – ఆంజనేయులు, రైతు, కిష్టంపల్లి అధైర్యపడొద్దు.. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిపాదనలు పంపించారు. కాగా 19 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించి ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగతాది కూడా త్వరలోనే వస్తుంది.. రైతులకు సరిపడా సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – దామోదర్, ఏడీఏ ధరల నియంత్రణపై పర్యవేక్షణేది? అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, సొసైటీలను తనిఖీ చేస్తున్నారు. యూరియా బస్తా ధర రూ.265 ఉండగా.. హమాలీ ఛార్జీలతో కలిపి కొందరు రూ.270, మరికొందరు రూ.285 తీసుకుంటున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. దుకాణాల వద్ద అన్నదాతల పడిగాపులు ఎకరాకు రెండు బస్తాలు అంటున్న అధికారులు పట్టాదారు పాసు పుస్తకానికి రెండు ఇస్తామంటున్న దుకాణదారులు వానాకాలం సాగుకు 26 వేల మె.ట. అవసరమని అధికారుల నివేదిక 19 వేల మెట్రిక్ టన్నులే అందిస్తామంటున్న ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 13 వేల మె.ట. మాత్రమే.. జిల్లాలో వానకాలం సాగు అంచనా 2.75 లక్షల ఎకరాలు -
ఉత్తమ సేవలకు పురస్కారం
79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎస్టీ గురుకులం, వనపర్తి కేజీబీవీ విద్యార్థినులు సాంప్రదాయ దుస్తువుల్లో దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ జనసందడితో కళకలలాడింది. నృత్యాలు చేసిన విద్యార్థినులను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు అభినందించారు. – వనపర్తిడి. సుబ్రమణ్యం భూపాల్రెడ్డి, సీపీఓ టి.మేఘారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ విఠోభ, హౌసింగ్, వనపర్తి అంజయ్య, డీఐఈఓ, వనపర్తి మల్లయ్య, ఈఈ పీఆర్, వనపర్తి ఎ. శ్రీనివాసులు, డీఎంఅండ్హెచ్ఓ నరేష్, సీఐ, ఎస్బీ వెంకటేశ్వర్రావు, డీఎస్పీ కృష్ణయ్య, సీఐ అంజాద్, ఎస్ఐ ఎస్. సురేందర్బాబు, ఆర్ఎస్ఐ ఎస్. రాజగౌడ్, పీఆర్ఓ, ఎస్పీ ప్రవీణ్, డ్రైవర్, కలెక్టరేట్ అప్పలనాయుడు, ఆర్ఐ, అడ్మిన్వి.నరేందర్, ఎస్ఐ శివపార్వతి, ఏఎస్ఐ -
చదువుతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యం
గద్వాలటౌన్: యువతకు చదువుతో పాటు పలు ఉపాధి కోర్సులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీఐలను ఇటీవల ప్రభుత్వం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏజీసీ)గా ఉన్నతీకరించి పలు అధునాతన కోర్సులను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని, అక్కడ కొనసాగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి జితేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థల సహకారంతో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్, విద్యుత్ వాహనాల మరమ్మతులు, అడ్వాన్స్డ్ సీఎన్సీ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పోటీ ప్రపంచంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, సహాయ లేబర్ కమిషనర్ మహేష్కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
సుస్థిర అభివృద్ధే లక్ష్యం
● చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ● ఘనంగా 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ● హాజరైన కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి వనపర్తి: జిల్లాలో సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అధికా రులు, పాలకులు పనిచేస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. వేదికపై కలెక్టర్ ఆదర్శ్సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి, దేవరకద్ర శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య హాజరయ్యారు. 60,545 రైతులకు రుణ విముక్తి గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ కాగా.. జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల 91 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొన్నారు కొత్తగా 17,490 రేషన్ కార్డుల జారీ.. జిల్లాలో కొత్తగా 17,490 రేషన్ కార్డులను జారీచేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు. గత విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు టెన్త్, ఇంటర్ విద్యార్థులను సత్కరించి, ఒక్కక్కరికి రూ.10వేల చెక్కు అందజేశారు. స్పీడ్ బోట్ ప్రారంభం కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల గ్రామ శివారు కృష్ణానదిలో పర్యాటకుల సౌకర్యార్థం జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ శుక్రవారం స్పీడ్ బోటు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం కార్పొరేషన్ నిధుల నుంచి 6 స్పీడ్ బోట్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు సోమశిల దగ్గర నదిలో స్పీడ్ బోటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిలో పర్యాటకుల కోసం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించడానికి క్రూయిజ్ లాంచీని మంగళవారం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీశైలం వెళ్లాలనులకునే ప్రయాణికులు తెలంగాణ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మద్దిలేటి, నాయకులు రంగస్వామి, రమేష్గౌడ్, మహే ష్, టూరిజం శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ జిల్లాలో మెరుగైన శాంతిభద్రతల కల్పనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి నిత్య పర్యవేక్షణ చేయడం ద్వారా నేరాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిసూ టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు, ఇతర రద్దీ గల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు, వనపర్తి, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, ప్రమోదిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
180 పసుపు చీరలతో అమ్మవారికి అలంకరణ
వనపర్తి రూరల్: శ్రావణ మాసం నాల్గో శుక్రవారం సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యాకాపరమేశక్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కిట్టుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, మహామంగళ హారతి నీరాజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారు 180 పసుపు రంగు చీరల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో లలితాసహస్ర పారాయణం, కుంకుమార్చన, పల్లకీసేవా తదితర పూజలు చేశారు.‘ఓట్లు చోరీ చేసి నీతులు చెప్పడం హాస్యాస్పదం’అమరచింత: ఓట్లు చోరీ చేస్తూ గద్దెనెక్కాలనుకున్న బీజేపీ ఇతర పార్టీలను విమర్శించడం ఎంత వరకు సమంజసమని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ఖాన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓట్కి చోర్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలను అడ్డుపెట్టుకొని కేంద్రంలో మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఓట్లను తొలగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. పూటకో రాజకీయ పార్టీలో చేరుతూ ప్రజా సమస్యలను గాలికొదిలిన బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం మానుకోవాలని హితువు పలికారు. అమరచింత పట్టణంలో రూ.13 కోట్లతో ఎంపీ డీకే అరుణ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారని చెప్పిన నాయకులు వీటిలో 40 శాతం నిధులు రాష్ట్రానివి అన్న విషయం మరిచిపోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యాం, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, తౌఫిక్, ప్రకాశం, హనుమంతునాయక్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు మరువలేనివి
వనపర్తి: స్వాతంత్య్ర పోరాటంలో అసువులుబాసిన మహనీయుల సేవలు మరువలేనివని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించి నేటితో 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అందరూ గుర్తుచేసుకుంటూ.. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను గుర్తించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మన స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి చదరంగం, క్యారమ్స్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఎస్పీ రావుల గిరిధర్ ఎస్పీ రావుల గిరిధర్ -
ఆ ఊళ్లో 2 కుటుంబాలే..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం పాత బండరాయిపాకులలో గతంలో 480 కుటుంబాలు నివసించేవి. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉండగా.. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుండగా.. 2021లో ప్రజలను ఖాళీ చేయించారు. పునరవాసం కింద కొత్తగా నిర్మించిన బండరాయిపాకులకు తరలించారు. అందరూ వెళ్లగా ప్రస్తుతం పాత గ్రామంలో రెండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అన్నాదమ్ములైన మిద్దె పెద్ద లక్ష్మయ్య (మృతుడు హరిబాబు తండ్రి), మిద్దె చిన్న లక్ష్మయ్య కుటుంబాలు పక్కపక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఊరంతా నిర్మానుష్యం కాగా.. ప్రస్తుతం అడవిలా తయారైన ఈ పాత ఊళ్లో దొరికే ఆకులు, అలుములతోనే ఆ రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. -
ప్రభుత్వ చీఫ్ విప్కు పతాకావిష్కరణ బాధ్యతలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ముఖఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. బుధవారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాలో ఎవరెవరు జెండా ఆవిష్కరణ చేయాలనే వివరాలతో ప్రత్యేకంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా నుంచి ఆయన పేరును ప్రకటించింది. పోలీసుల తీరు సరికాదు : బీజేపీ వనపర్తిటౌన్: ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్చౌక్ వరకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నేతలు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ అధ్యక్షతన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలతో నాయకులు కార్యకర్తలు శవయాత్ర నిర్వహించబోగా పోలీసులు అడ్డుకొని కార్యాలయానికి తాళం వేసి చెల్లాచెదురు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తే అడ్డుకోని పోలీస్ యంత్రాంగం, సీఎం శవయాత్రను ఆదిలోనే అడ్డుకోవడం ఏమిటని, ఇదేం వివక్ష అని మండిపడ్డారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కల రామన్గౌడ్, కోశాధికారి భాసెట్టి శ్రీను, మోర్చాల రాష్ట్ర నాయకులు కదిరె మధు, అలివేలమ్మ, మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ, అధికార ప్రతినిధి పెద్ది రాజు పాల్గొన్నారు. ఓట్ల చోరీపై విస్తృత చర్చ జరగాలి : కాంగ్రెస్ వనపర్తిటౌన్: ప్రజాస్వామ్యానికి వెలుగునిచ్చే ఎన్నికల వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని, ఓ కుటుంబంలో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం ఆధారాలతో బయటపెడుతుంటే రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఎన్నికల సంఘం వ్యవస్థలో లోపాలు, పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎల్సీడీ స్క్రీన్పై అవగాహన కల్పించారు. పేపర్ బ్యాలెట్ విధానంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్య పాలనకు అడుగులు పడతాయన్నారు. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉదంతాలపై సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని అంబులెన్స్ వాహనాలపై సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఉంటే మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తప్పుపట్టడం సరైంది కాదన్నారు. గతంలో సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్ వాహనాలపై జాయన ఫొటోలు ముద్రించినప్పుడు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. డీసీసీ ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్మియా, పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సేవాదళ్ అధ్యక్షుడు జానకిరాములు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం వినోద్ పాల్గొన్నారు. 16న ఎస్జీఎఫ్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్–15 బాల, బాలికల వాలీబాల్ ఎంపికలను స్థానిక మెయిన్ స్టేడియంలో ఈనెల 16న ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ కాపీలతో రిపోర్టు చేయాలని ఆమె కోరారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపికలకు రావాలని సూచించారు. -
వర్షాలకు ప్రాణనష్టం జరగొద్దు
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు ● కలెక్టర్ ఆదర్శ్ సురభివనపర్తి: జిల్లాలో రానున్న మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి జిల్లా, మండల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఇప్పటి వరకు ఎల్లో జోన్లో ఉండగా.. ప్రస్తుతం రెడ్ జోన్లోకి మారినట్లు వాతావరణశాఖ హెచ్చరించిందన్నారు. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని.. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలు, నది పరీవాహక ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పునరావాస కేంద్రాలను గుర్తించి నివేదికను గురువారం కలెక్టరేట్కు అందజేయాలని ఆదేశించారు. విపత్కర పరిస్థితిలో బాధ్యతల నుంచి ఏ ఒక్క అధికారి తప్పించుకోవడానికి వీలులేదని.. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మూడు రోజుల వరకు ఎలాంటి సెలవులు లేవని.. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్యుత్ అధికారులు, స్టేషన్ హౌజ్ అధికారులు తమ కేంద్రాల్లో ఉంటూ పరిస్థితులను గమనించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు, పశువుల కాపరులు మేపునకు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది వాహనాలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా స్తంభాలు విరగడం, తీగలు తెగటం వంటి సమస్యలు తలెత్తితే సరఫరా నిలిపివేసి ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేయాలన్నారు. పోలీసు సిబ్బందికి ఆదేశాలిచ్చాం.. రానున్న మూడురోజులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ రావుల గిరిధర్ వివరించారు. సరళాసాగర్ జలాశయం సైఫన్లు తెరుచుకుని నీరు పారుతుందని.. పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలు రోడ్డు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ప్రజలు ప్రవహిస్తున్న వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఎన్.కీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. వర్షాల విపత్తును ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే వెంటనే 08545-220351/233525 కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని.. రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. -
రెడ్ అలర్ట్
జిల్లాకు మూడురోజుల పాటు భారీ వర్షసూచన అలుగుపారుతున్న గోపాల్దిన్నె రిజర్వాయర్ తేదీ నమోదైన వర్షపాతం 3 0.1 6 1.8 7 7.4 8 42.6 9 36.7 10 7.0 11 18.2 12 36.4 13 8.9 వనపర్తి: జిల్లావ్యాప్తంగా రానున్న మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎల్లో అలర్ట్లో ఉన్న జిల్లాను బుధవారం సాయంత్రం వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరళాసాగర్, గోపల్దిన్నె రిజర్వాయర్లతో పాటు సుమారు 250 చెరువులు, కుంటలు సైతం నిండుకుండగా మారి అలుగు పారుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉకచెట్టువాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వీపనగండ్లలో 23.4 మి.మీ. వర్షపాతం.. జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వీపనగండ్ల, శ్రీరంగాపురం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీపనగండ్ల మండలంలో 23.4 మి.మీ., శ్రీరంగాపురంలో 21.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లా సరాసరి వర్షపాతం 8.9 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క అమరచింత మినహా.. మిగతా అన్ని మండలాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్లో అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్లోకి మార్చిన వాతావరణశాఖ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లు ఆత్మకూర్–మదనాపురం మధ్య నిలిచిన రాకపోకలు 250కిపైగా అలుగు పారుతున్న చెరువులు వానాకాలం ప్రారంభం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవగా.. ఆగస్టులో ఇప్పటి వరకు సాధారణం కంటే 202 శాతం అధిక వర్షపాతం నమోదు కావటం గమనార్హం. మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూ రాల, భీమా ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీ టి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
పాన్గల్: రైతులు ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలని, ఇష్టానుసారంగా వాడితే నేల సారం దెబ్బతినడంతో పాటు డబ్బులు వృథా అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ రైతులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఈశ్వరయ్య సాగు చేసిన వరి పంటను అధికారులతో కలిసి పరిశీలించి ఎరువుల వినియోగం, తెగుళ్లు ఆశిస్తే వాడాల్సిన పురుగు మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియాను అవసరం మేరకు వాడాలని, ఎక్కువ మోతాదులో వినియోగించొద్దని సూచించారు. ఆయన వెంట ఏడీఏ తిప్పేస్వామి, ఇన్చార్జ్ ఏఓ డాకేశ్వర్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్ అందిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్–2025లో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందితో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) అమలు చేస్తోందన్నారు. అవగాహన ప్రచారం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిధిలో మాదకద్రవ్య వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజలను భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి రవాణా చేసినా, సాగుచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ సునందన, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, కార్యాలయ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కానరాని పురోగతి!
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. కొనసా..గుతున్న ‘పాలమూరు’.. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన ● వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే.. ● ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు ● అమాత్యుల సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితం ● నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న ఆమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. -
ప్రతిభను గుర్తించి వెలికితీయాలి
వనపర్తి: జిల్లాలో విభిన్న రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు ఎందరో ఉన్నారని.. అలాంటి వారు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళా రంగంలో ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లాకు చెందిన శిల్పి బైరోజు చంద్రశేఖర్ను ఎస్పీ ఘనంగా సన్మానించి మాట్లాడారు. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను చంద్రశేఖర్ చిన్ననాటి నుంచి నేర్చుకొని ఎన్నో ఆలయాలకు వందలాది విగ్రహాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. శిల్పిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా బహుముఖ ప్రతిభకనబర్చిన బైరోజు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి జిల్లా విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, బి.యాదగిరి పాల్గొన్నారు. ● ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తిచేసి ఆరు బంగారు పతకాలు సాధించిన జిల్లాకేంద్రానికి చెందిన గుండోజు భార్గవిని ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. చదువులో రాణించి పలువురికి స్ఫూర్తిగా నిలిచిన భార్గవితో ఎస్పీ మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి యాదగిరి ఆచారి స్వర్ణకార వృత్తి చేస్తూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. -
కదిలిస్తే కన్నీరే..
..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ఎవరైనా పెడితేనే తింటున్న.. నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా. – భగవంతు, బాధితుడుక్యాన్సర్ పేషంట్ను..గోలీలకూ డబ్బుల్లేవు..పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తిఅతికష్టం మీద బతుకుతున్నాం..నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలునాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడుకిరాయి ఇంట్లో ఉంటున్నాం.. తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు -
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్/అమరచింత: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చుదిద్దుతున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించామని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం అమరచింత జెడ్పీ పాఠశాల ఆవరణలో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం నిర్మాణాలకు శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాల దేవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థల పరిశీలన చేశారు. 4 తరగతి గదులను తొలగించి వాటి స్థానంలో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. అలాగే పాఠశాలకు 4 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆత్మకూర్లో మినీ స్టేడియాన్ని సందర్శించి ఈ నెల 25న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పాలకులు పదేళ్ల పాటు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆత్మకూర్లో రూ.5 కోట్లు, అమరచింతలో రూ.2 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం, షటిల్, కబడ్డీ క్రీడాకారులతో పాటు వాకర్స్కు సకల సౌకర్యాలు కల్పించేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని.. అందులో భాగంగానే పట్టణంలోని సమ్మిళిత ఫౌండేషన్ అంధ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు రూ.4.80 లక్షలు అందించామని వెల్లడించారు. జూరాల గ్రామం వద్ద రూ.122 కోట్లతో వంతెన నిర్మిస్తామని.. ఆత్మకూర్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఘాటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రేస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తాం.. నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సీఎం ఆదేశాలతో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, శాట్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపు స్థాయిలో చేపడతామని వెల్లడించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, పోసిరిగారి విష్ణు, డి.మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, తౌఫిక్, హన్మంతు నాయక్, మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్కుమార్రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్గౌడ్, పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, మశ్ఛందర్గౌడ్, నాగేష్, అజ్మతుల్లా, షాలం, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి -
ముగిసిన విద్యార్థుల ఎంపిక
వనపర్తి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో 2025–26 విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశాలకుగాను గిరిజన బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరించగా మంగళవారం కలెక్టరేట్లో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడు బాలుర, 3 బాలికలకుగాను బాలుర నుంచి 5 దరఖాస్తులు రాగా ముగ్గురిని పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా గిరిజన, సంక్షేమ అభివృద్ధిశాఖ అధికారి తెలిపారు. కార్యక్రమంలో డీటీడీఓ సభ్యురాలు ఉమాదేవి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.‘పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్’వనపర్తి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారీ దవాఖానాలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటంతో వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీ–హబ్, క్రిటికల్ కేర్ సెంటర్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలందించడంలో రాష్ట్రంలోనే రెండోస్థానం ఉండేదని.. ప్రస్తుతం 12వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. 134 రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 95 మాత్రమే నిర్వహిస్తున్నారని, వైద్యులు లేక హృద్రోగులను పరీక్షించే 2డి ఎకో యంత్రం వృథాగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉందని, రేడియాలజిస్ట్ సైతం అందుబాటులో లేకపోవటం శోచనీయమన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్త పరీక్షలకు వాడే రీ ఏజెంట్స్ లేక నాగర్కర్నూల్ నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. గర్భిణులకు మూడు రకాల థైరాయిడ్ పరీక్షలు చేయాల్సి ఉండగా.. యంత్రం మరమ్మతులో ఉందని పరీక్షలు చేయడం లేదన్నారు. అన్నిరకాల వైద్యపరీక్షలు, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని.. సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, గంధం పరంజ్యోతి, విజయ్కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, హేమంత్ ముదిరాజ్, చిట్యాల రాము పాల్గొన్నారు.విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలివనపర్తిటౌన్: విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని వనపర్తి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్వీఎస్ రాజు అన్నారు. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న చరణ్కుమార్ ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగిన తెలంగాణ 11వ జూనియర్, సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని బంగారు, రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ చరణ్కుమార్కు పూల మొక్క అందజేసి అభినందించారు. ట్రిపుల్ జంప్లో 13.14 మీటర్లు దూకి బంగారు, లాంగ్ జంప్లో 6.40 మీటర్లు దూకి రజత పతకం సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాం నరేష్ యాదవ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.రైతుబీమా దరఖాస్తునకు నేడు చివరి గడువుకొత్తకోట రూరల్: రైతుబీమాకు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, బుధవారంతో గడువు ముగియనుందని.. సద్వినియోగం చేసుకోవాలని కొత్తకోట ఏడీఏ దామోదర్ కోరారు. క్లస్టర్ పరిధిలోని రైతులు సంబంధిత ఏఈఓలను కలిసి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్కార్డు జిరాక్స్ను దరఖాస్తునకు జతచేసి అందజేయాలని సూచించారు. -
పిల్లల్లో నులిపురుగులను నిర్మూలిద్దాం
వనపర్తి: చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులిపురుగులను నిర్మూలించడం ముఖ్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమ వారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అపరిశుభ్రతతో భోజనం చేయడం వల్ల క్రిములు శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారై అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. కేజీబీవీ నుంచి ఎవరైనా ఐఐటీలో సీటు సంపాదిస్తే వారిని తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేస్తానని కలెక్టర్ చెప్పారు. సీపీఆర్పై అవగాహన ఉండాలి.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ విధానంపై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వ ర్యంలో అధికారులకు సీపీఆర్ విధానంపై డాక్టర్ రఘు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల చనిపోతున్నారన్నా రు. అలాంటి వారికి కొన్ని క్షణాలలోపు సీపీఆర్ చే యడం వల్ల 85శాతం బతికే అవకాశం ఉందన్నారు. సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులును కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లాలో ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతకోటలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వకు సంబంధించిన బోర్డుతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు అవసరం మేరకే యూరియా విక్రయించాలని సూచించారు. ● ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 45 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ● పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో ఆయన స మీక్షించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్ల బాధ్యతలను ఆయా శా ఖల అధికారులకు అప్పగించారు. అదనపు కలెక్టర్లు కీమ్యనాయక్, యాదయ్య ఏఎస్పీ ఆర్.వీరారెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీజీసీఓ సుబ్బలక్ష్మి, ప్రోగ్రాం అధికారి రామచంద్రరావు పాల్గొన్నారు. 1–19ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కలెక్టర్ ఆదర్శ్ సురభి -
కోతలే కోతలు!
●చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ● కనీస సమాచారం లేకుండా కోతలు విధిస్తున్న వైనం ● ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నాం.. గ్రామాలతో పాటు పట్టణాల్లో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం కలుగుతుంది. విద్యుత్పై ఆధారపడి జీవనం సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలి. – రవి, మోటారు మెకానిక్, కొత్తకోట చెట్లకొమ్మల తొలగింపుతోనే.. విద్యుత్ లైన్ల కింద ఏపుగా పెరిగే చెట్ల కొమ్మల తొలగింపు పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే ఆయా ఫీడర్ల పరిధిలో అవసరం మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటాం. దీనికి తోడు విద్యుత్ సబ్స్టేషన్లో సమస్యలు తలెత్తినప్పుడు, ఎక్కడైనా విద్యుత్ ట్రిప్ అయినప్పుడు మాత్రమే సరఫరాను నిలిపివేస్తాం. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నాం. – రాజశేఖరం, విద్యుత్ ఎస్ఈ వనపర్తిటౌన్: జిల్లాలో అధికారిక విద్యుత్ కోతలు అధికమవుతున్నాయి. చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో 33కేవీ పరిధిలో 29 ఫీడర్లు, 11కేవీ పరిధిలో 241 ఫీడర్లు ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు మొత్తం 270 ఫీడర్ల పరిధిలో అధికారికంగా 2,839 గంటలు కోత విధించారు. దీంతో సగటున ఒక్కొక్క ఫీడర్ పరిధిలో సగటున 10.51 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెట్టారు. 11 కేవీ ఫీడర్ల కింద అత్యధికంగా 2,141.32 గంటలు, 33 కేవీ ఫీడర్ల పరిధిలో 698.39 గంటలు విద్యుత్ కోతలు విధించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలైలో వేసవికి పోటీగా 3నుంచి 5గంటల తేడాతో విద్యుత్ అంతరాయం ఏర్పడటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 220కేవీ, 132/33కేవీ సబ్స్టేషన్లు ప్రధానమైనవి. 33కేవీ ఒక్కొక్కఫీడర్ పరిధిలో 2 నుంచి 4 సబ్స్టేషన్లు ఉన్నాయి. 11కేవీ పరిధిలోని 241 ఫీడర్ల ద్వారా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే ప్రధాన సబ్స్టేషన్ నుంచి 33కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా సమయంలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఫీడర్ పరిధిలో ఒక్కోలా విద్యుత్ కోతలు నమోదవుతున్నాయి. ● జిల్లాలోని 11కేవీ సబ్స్టేషన్ల నుంచి 241 ఫీడర్ల ద్వారా వ్యవసాయం, గృహ, ఇతర అవసరాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఒక్కొక్క ఫీడర్ పరిధిలో వ్యవసాయ, సాధారణ ట్రాన్స్ఫార్మర్లు 50 నుంచి 100 వరకు ఉంటాయి. అయితే వీటి పరిధిలో సాధారణంగా వేసవిలో అధికంగా విద్యుత్ కోతలు ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలై నెలల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఏప్రిల్లో 545.30 గంటల పాటు విద్యుత్ కోతలు విధించగా.. గతనెల (జూలై)లో 534.56 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం విస్మయం కలిగిస్తుంది. మేలో 532.28 గంటలు కాగా.. జూన్లో 529.18 గంటల విద్యుత్ కోత విధించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక నెలకొన్న అంధకారం ఫీడర్ పేరు ఫీడర్ల సంఖ్య ఏప్రిల్ మే జూన్ జూలై 33కేవీ 29 182.48 174.25 169.42 172.24 11కేవీ 241 545.30 532.28 529.18 534.56 -
క్రీడలతో నూతనోత్తేజం
వనపర్తి: విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు నూతనోత్తేజం నింపుతాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గతనెలలో అమెరికాలో నిర్వహించిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్లో వనపర్తి జిల్లా ఏఆర్ హెడ్కానిస్టేబుల్ పసుపుల కృష్ణారావు బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ఆయనను పూలమాలతో సత్కరించి అభినందించారు. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ అండర్–50 విభాగంలో 80 దేశాల నుంచి 8,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు అత్యంత ప్రతిభకనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అంతర్జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని మరి న్ని విజయాలు సాధించి, దేశం, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వు సీఐ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరే శ్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నిర్వాసితులను ఆదుకుంటాం : జూపల్లి కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితులను ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్తో ఆయన సమావేశమై.. ముంపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్రకారం ప్యాకేజీ చెల్లింపు అంశంపై చర్చించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సమాన పరిహారం అందేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను అఽధికారులు మంత్రికి అందజేశారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు మంత్రిని కలిసి సత్కరించారు. సమావేశంలో ఆర్డీఓ భన్సీలాల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. -
భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: ఆరుగాలం కష్టించి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ భూములతో పాటు ఉంటున్న ఇళ్లు, జ్ఞాపకాలన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలో పోయాయి. ఆ తర్వాత వచ్చిన అరకొర పరిహారంతోనైనా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న వారి ఆశలను బోగస్ ఫైనాన్స్ కంపెనీ గండి కొట్టింది. అధిక వడ్డీ చెల్లిస్తామనే పేరిట నిర్వాసితుల నుంచి భారీగా డబ్బులు సేకరించి.. చివరకు బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రైతులు అంతకుముందు నుంచే అంటే నాలుగేళ్లుగా వారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు పలువురు ఆత్మహత్య చేసుకోగా.. హార్ట్ అటాక్తో సుమారు 20 మంది.. కిడ్నీ ఇతర ఆరోగ్య కారణాలతో మరో 120 మంది వరకు మృత్యు కౌగిలికి చేరారు. ఇంకా కొందరు చికిత్సకు డబ్బులు లేక మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. 14 మందిపై కేసు.. రూ.50 కోట్ల ఆస్తి జప్తు డిపాజిట్ల అనంతరం కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు సక్రమంగా వడ్డీ చెల్లించకపోవడంతో నిర్వాసితులు నాగర్కర్నూల్ మార్కెట్ సెంటర్లోని ఫైనాన్స్ కార్యాలయం వద్దకు క్యూకట్టారు. ఇలా 2020 నుంచి 2023 వరకు చక్కర్లు కొట్టారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబు, అతడి కుటుంబ సభ్యులు మాయమాటలు చెబుతూ చివరకు కంపెనీని ఎత్తివేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇందులో ఇత్యాల సాయిబాబు (ఏ–1)తో పాటు ధనుంజయ్ (ఏ–2), బాలేశ్వర్ (ఏ–3), ఇత్యాల రజిత (ఏ–4), యామిని (ఏ–5), శారద (ఏ–6), సాయిదివ్య (ఏ–7), సాయి దీక్షిత్ (ఏ–8) అనుపటి శ్రీనివాసులు, తాడూరు మాజీ సర్పంచ్(ఏ–9), ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి (ఏ–10), జానకీ రాంరెడ్డి (ఏ–11), కరుణాకర్రెడ్డి (ఏ–12), గువ్వ వెంకటేశ్వర్లు (ఏ–13), ఉర్సు హుస్సేన్ (ఏ–14)పై కేసు నమోదైంది. వీరిలో సాయిబాబు, సాయిదీక్షిత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, హుస్సేన్ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొందారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేయాలని.. ఈ ఏడాది జూన్ 17న జీఓ నంబర్ 562ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మార్కెట్ వాల్యు ప్రకారం ఇప్పటివరకు సదరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి రూ.50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. 2 వేల మంది.. సుమారు రూ.180 కోట్ల డిపాజిట్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం అందజేసింది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురి కాగా.. నిర్వాసితులకు సంబంధించి ఎకరా పట్టా భూమికి రూ.5.50 లక్షలు, లావణి పట్టా భూమికి రూ.3.50 లక్షలు.. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.12.50లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. అయితే ముంపు గ్రామమైన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్కు చెందిన సాయిబాబా తన కుటుంబసభ్యులతో కలిసి నాగర్కర్నూల్ మార్కెట్ యార్డు సమీపంలో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ను నడిపిస్తున్నాడు. మొదట రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో రైతులకు ఒక్కసారిగా వచ్చిన నష్ట పరిహారంపై అతడి కన్ను పడింది. రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్త్తామని.. మీరు భూములు, ప్లాట్లు కొన్నప్పుడు 15 రోజుల ముందు చెబితే మీ డబ్బులు మీకు ఇస్తామని నమ్మబలికి 2018 నుంచి 2020 వరకు డిపాజిట్ చేయించుకున్నాడు. తొలుత వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ రాగా.. సుమారు 2,500 మంది దాదాపు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు సదరు ఫైనాన్స్ కంపెనీలో నిర్వాసితులు పరిహారం డబ్బులను జమ చేశారు. ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత వడ్డీ ఆశతో వచ్చిన పరిహారం డబ్బులుఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో జమ వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులు రూ.180 కోట్ల మేర కంపెనీలో డిపాజిట్.. బోర్డు తిప్పేయడంతో రైతుల గగ్గోలు మోసంతో చితికిన కుటుంబాలు.. అనారోగ్యంతో మంచం పాలు ఇప్పటికే ఒకరు ఆత్మహత్య.. హార్ట్ ఎటాక్తో 20 మంది వరకు మృతి వివిధ ఆరోగ్య కారణాలతో మరో 120 మంది కూడా.. -
బుద్దారం చరిత్ర గొప్పది
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని.. ఎప్పుడు ఎలా ఏర్పడింది, అలాగే గండి ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర తదితర వివరాలను పుస్తక రూపంలోకి మార్చడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుద్ధారం చరిత్ర–సంస్కృతి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి వారి చరిత్ర తెలుసుకోవడంతో ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అవగాహన కలుగుతుందని తెలిపారు. గ్రామ చరిత్రను పుస్తక రూపంలోకి మార్చిన రచయిత రమేష్బాబును, అలాగే గ్రామానికి చెందిన డా. లగిశెట్టి శ్రీనివాసులు ఎనిమిది డిగ్రీలు పూర్తిచేసినందుకుగాను అభినందించారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, సంఘం అధ్యక్షుడు పూల్యానాయక్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, అచ్యుతరామారావు, ఓంకార్, శివకుమార్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
నులి పురుగును నిర్మూలిద్దాం
● జిల్లాలో నేడు, 18 తేదీల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ పాన్గల్: ఆరోగ్య సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కడుపులో నులి పురుగులు ఉండటంతో పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వీటి నివారణే లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఏటా ఫిబ్రవరి 10న మొదటి విడత, ఆగస్టు 10న రెండో విడత ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన మాత్రల పంపిణీ కార్యక్రమం వివిధ కారణాలతో వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ నెల 11, 18 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు బయట ఉండే 1 నుంచి 19 ఏళ్లలోపు వారిని ఇప్పటికే గుర్తించారు. వ్యాధి లక్షణాలు.. నులి పురుగులున్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం పడటం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరియైన సమయంలో చికిత్స..... పురుగుల పునరుత్పత్తి, ఎదుగుదల మొత్తం కడుపులోనే జరగడంతో మనం తీసుకునే ఆహారాన్ని అవే లాగేసుకుంటాయి. దీని ఫలితంగా పదేళ్ల వయసున్న వారిలో ఎక్కువగా రక్తహీనత, ఆకలి లేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించి చి కిత్స చేయించుకోవాలి. ఆల్బెండజోల్ మాత్రలను ఏటా రెండు పర్యాయాలు వేయించడంతో నులి పు రుగుల సమస్యను నివారించే అవకాశం ఉంటుంది. మాత్రల మోతాదు.. రెండేళ్లలోపు పిల్లలకు ఆర మాత్ర (200 ఎంజీ), 2 నుంచి 3 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) పొడి రూపంలో అందించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) చప్పరించాలి. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఈ మాత్ర వేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఏదేని కారణంతో 11వ తేదీన మాత్ర వేసుకోని వారు 18వ తేదీన వేసుకునే అవకాశం కల్పించారు. అపోహలు వద్దు .. ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్పరిణామాలు, అపోహలు అవసరం లేదు. 19 ఏళ్లలోపు వారంతా మాత్రలు వేసుకునేలా ప్రోత్సహించాలి. మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 100 శాతం పంపిణీకి కృషి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం తర్వాత మాత్ర వేసుకొని గంటపాటు నీరు తాగకుండా ఉండాలి. వైద్యసిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమన్వయంతో పూర్తి చేస్తాం. మాత్రల వినియోగం, చేతుల శుభ్రత, ఆరుబయట మల, మూత్ర విసర్జన తదితర అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. – డా. పరిమళ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాత్రల పంపిణీ విధులు నిర్వర్తించే సిబ్బంది సూపర్వైజర్లు 36 ఏఎన్ఎంలు 154 అంగన్వాడీ టీచర్లు 577 ఆశా కార్యకర్తలు 559 -
ఎట్టకేలకు..!
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ను జెన్కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లది కాదని.. జెన్కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటికి సంబంధించిన గేట్ల రోప్లు అప్పుడప్పుడు మొరాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని జెన్కో సిబ్బంది వెల్లడిస్తున్నారు. రెండేళ్ల కిందట.. జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు. జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్ను పైకెత్తే సమయంలో జెన్కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు. జూరాల జలాశయం క్రస్ట్గేట్ల రోప్లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్గేట్ల రోప్లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు. – ఖాజా జుబేర్ అహ్మద్, ప్రాజెక్టు ఈఈ, గద్వాల రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్లు తెగిపోయాయనే మాటాల్లో వాస్తవం లేదు. – పవన్కుమార్, డీఈ, జెన్కో జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి.. రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన వైనం బాగు చేసి ఆదివారం క్రేన్ల సాయంతో బ్లాక్ను పైకెత్తి నీటి సరఫరా ప్రాజెక్టుపై మూడుగంటల పాటు నిలిచిన వాహనాలు -
‘పోడు’ రైతుల ఆందోళన
పాన్గల్: తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకపోగా అటవీ అధికారులు భూములను అక్రమించి అక్రమ కేసులు నమోదు చేశారంటూ జిల్లాలోని పాన్గల్ మండలం కిష్టాపూర్తండా గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి కథనం మేరకు.. గ్రామశివారులోని సర్వేనంబర్ 34లో 12 ఎకరాల పోడు భూమి ఉండగా సుమారు 50 ఏళ్లుగా 25 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పనికిరాని భూములను సైతం చదును చేసి యోగ్యంగా మలుచుకోవడంతో పాటు ఆయా భూముల్లో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చినా ఇక్కడి రైతులకు మాత్రం పంపిణీ చేయలేదు. కాగా కొందరు రైతులు బతుకుదెరువు కోసం భూములు వదిలి ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లగా అటవీశాఖ అధికారులు వారికి తెలియకుండా మొక్కలు నాటి ఆక్రమించే చర్యలు పూనుకున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో చేసేది లేక భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేయడంతో ఈ నెల 5న అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మంది గిరిజన రైతులపై కేసులు నమోదయ్యాయి. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ రైతులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న పోడు భూములపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని.. లేనిచో ఆత్మహత్యే శరణ్యమని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ పరిధిలోని భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం గిరిజన రైతులపై కేసులు నమోదు చేశాం. రైతులు సాగు చేయని అటవీ భూముల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కలను కూడా తొలగించారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా అధికారులను కలిసి భూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అటవీ భూమిలోని చెట్లను ధ్వంసం చేయడం, అక్రమించడం నేరమే అవుతుంది. – బాలకిష్టమ్మ, డిప్యూటీ రేంజ్ అధికారి, ఖాసీంనగర్ సెక్షన్, వనపర్తి ఓ పక్క ప్రభుత్వం సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతుండగా.. మరోపక్క గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్న కిష్టాపూర్తండా గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. వారిపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. – బాల్యానాయక్, జిల్లా కార్యదర్శి, గిరిజన సంఘం, తెల్లరాళ్లపల్లితండా తండా శివారులో ఉన్న పోడు భూమిని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. వీటికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. మేము కొంతకాలం పాటు వలస వెళ్తే అటవీ అధికారులు మొక్కలు నాటారు. వచ్చిన తర్వాత పెరిగిన చెట్లను ధ్వంసం చేయడంతో కేసులు నమోదు చేశారు. జైలుకై నా వెళ్తాం.. కానీ సాగుచేసిన భూములను వదులుకోం. – మంగమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్తండా మేము ఎన్నో సంవత్సరాల క్రితం బీడు భూములను మంచిగా చేసి సాగుకు అనువుగా మార్చుకున్నాం. అందులో బోర్లు కూడా వేసుకున్నాం. మాకు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు, ఇదే అధారం. కొంత కాలం పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళితే అందులో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి అవి అటవీశాఖకు చెందినవిగా చిత్రీకరిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. భూమి దక్కే వరకు పోరాడుతాం. – బొజ్జమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్తండా సాగు భూమిని లాక్కున్నారని పోరుబాట అటవీశాఖ స్థలంలో చెట్లు తొలగించారని కేసుల నమోదు పాన్గల్ మండలం కిష్టాపూర్తండాలో ఘటన విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకోలు -
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ప్రాజెక్టు ప్రారంభం నుంచి నీటి ఎత్తిపోతలు ఇలా.. ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్ ● గత సీజన్లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు ● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్ ● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు. పనితీరు ఇలా.. కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మోటార్లపై భారం.. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ శాతం భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కోతిగుండు వద్ద నుంచి కృష్ణా బ్యాక్వాటర్ను వినియోగించుకునేలా కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు. 1998లో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేపట్టారు. 2003లో పనులు ప్రారంభమయ్యాయి. 2.50లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో ఈ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తున్నారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. రెగ్యులర్గా పంపింగ్.. వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్ నాయక్, డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం కేఎల్ఐ ఎత్తిపోతల పథకం సీజన్ ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) 2011–12 0.00864 2012–13 1.9062432 2013–14 1.351552 2014–15 1.7842464 2015–16 2.5099632 2016–17 14.01715 2017–18 27.35148 2018–19 35.97796 2019–20 49.99874 2020–21 30.29203 2021–22 31.71288 2022–23 37.50358 2023–24 30.38209 2024–25 50.72208 2025 జూన్ 1నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీలు ఎత్తిపోశారు. -
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శి ంచుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. -
చెరువులకు జలకళ
భూత్పూర్ రిజర్వాయర్ కాల్వకు నీటి విడుదల ●ఆయకట్టుకు సాగునీటి సరఫరా.. రిజర్వాయర్ పరిధిలోని 22,700 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. కాల్వలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపు ఉపాధిహామీ పనుల్లో చేపట్టాం. మరికొన్ని చోట్ల దేశాయి ప్రకాష్రెడ్డి సహకారంతో పూడిక తొలగింపు పనులు చేపట్టడంతో ప్రస్తుతం నీరు చెరువులకు చేరుతోంది. – సతీష్కుమార్, డీఈ, భూత్పూర్ రిజర్వాయర్ అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాలతో పాటు మక్తల్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. నెలరోజులుగా కాల్వకు నీటిని వదులుతుండటంతో ఆయా గ్రామాల్లోని రైతులు తమ పొలాలకు నీటిని మళ్లించుకొని పంటలు సాగు చేస్తుండటంతో పాటు 28 చెరువులు నీటితో నింపారు. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరు అందించేందుకు భూత్పూర్ రిజర్వాయర్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కాల్వ పరిధిలోని ఆయా మండలాల్లో 22,700 ఎకరాల ఆయకట్టులో ఈసారి వానాకాలం వరితో పాటు ఆరుతడి పంటలైన పత్తి, ఆముదం, కంది తదితర పంటలు సైతం సాగుచేస్తున్నారు. అలాగే ఆయకట్టు రైతులు కాల్వ వెంట ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుతో పాటు ముళ్లపొదలు, పూడికతీత పనులు సైతం చేపడుతూ నీటిని తమ పొలాలకు తరలించుకుపోతున్నారు. 32 కిలోమీటర్ల పొడవున్న కాల్వకు లైనింగ్ చేపట్టినా అంచుల వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నీటిపారుదలశాఖ అధికారులు వేసవిలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా తొలగిచడంతో వానకాలంలో కాల్వలో నీటిని పొందగలుగుతున్నారు. దాత సహకారంతో.. రిజర్వాయర్ ఎడమ కాల్వలో ఈసారి భారీగా మట్టి పేరుకుపోవడం, ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో నీరు ముందుకు పారడం లేదని ఆయా గ్రామాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు విన్నవించారు. వారు స్పందించకపోవడంతో నాగిరెడ్డిపల్లి, పాంరెడ్డిపల్లి, మస్తీపురం, పిన్నంచర్ల, అమరచింత రైతులు మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలను వివరించారు. కాల్వ పూడికతీతకు అవసరమైన ఖర్చు స్వయంగా భరిస్తానని అధికారులకు హామీ ఇవ్వడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత, ముళ్లపొదల తొలగింపు పనులు చేపట్టారు. ప్రస్తుతం కాల్వ ద్వారా ఆయా గ్రామాల చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 32.2 కిలోమీటర్ల పొడవున విస్తరించిన కాల్వ నిండుకుండను తలపిస్తున్న 28 చెరువులు మూడు మండలాలు.. 22,700 ఎకరాల ఆయకట్టు -
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. – ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్నగర్ రెండేళ్ల నుంచి సాధన మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్గా శిక్షణ తీసుకుంటున్న. – నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
ఖిల్లాఘనపురం: కాంగ్రెస్ పాలనలోనే పేదల సొంతింట కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన మహిళ రాజేశ్వరికి మొదటి చెక్కు రూ.లక్ష అందజేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలు ఇంటి మంజూరుకుగాను నాయకులు, అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. పండుగలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి.. పండుగలు, ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి సన్మార్గంలో పయనించేందుకు ఉయోగపడుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో భక్త మార్కండేయ ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని గ్రామంలోని దేవాలయం నుంచి గుట్ట పై ఉన్న నర్సింహస్వామి ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, డైరెక్టర్ సాయిచరణ్రెడ్డి, గంజాయి రమేష్, ఆగారం ప్రకాష్, నాయకులు బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, రవినాయక్, జయకర్, నవీన్కుమార్రెడ్డి, యాదగిరి, శ్రీరాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునికీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం శనివారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో స్వామివారి కల్యాణ క్రతువు జరిపించారు. దంపతులకు అర్చకులు తలంబ్రాలు పోయగా ఆడపడుచులు అమ్మవారికి వడి బియ్యం పోశారు. వేడుకకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరాచార్యులుతో పాటు ఆలయ నిర్వాహకులు వేముల శ్రీనివాస్రెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, మొద్దు దామోదర్రెడ్డి, సంద వెంకటేష్, జలంధర్గౌడ్, తిరుపతయ్య, నీలేష్కుమార్, వెంకటేశ్వర్రెడ్డి, గురుస్వామి, కృష్ణారెడ్డి ఉన్నారు. తిరుమలయ్యగుట్ట భక్తజన సంద్రం.. వనపర్తి రూరల్: శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్ట భక్తజన సంద్రంగా మారింది. ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అంకురార్పణ పూజలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు దాతలు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వీపనగండ్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని.. అనారోగ్యం బారిన పడిన వారికి కార్పొరేట్ వైద్యం అందుతుందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని కల్వరాలలో బత్తుల ఈశ్వరమ్మకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసి మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే గాకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం గ్రామంలో 220 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ నాయకులు చింత దయాకర్, తిరుపతయ్య, ఆంజనేయులు, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాల్పేటలో భారీ వర్షం గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగు పారాయి. గోపాల్పేట పెద్దచెరువు, కత్వ, తాడిపర్తి చెరువు, రేవల్లి మండలంలోని చెరువులు, కుంటలు నిండాయి. కేశంపేట గేట్వద్ద నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోపాల్పేట మండలంలో 96.2 మి.మీ., రేవల్లి మండలంలో 65.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపారు. గిరిజన రైతుల నిరసన ప్రదర్శన పాన్గల్: మండలంలోని కిష్టాపూర్తండాకు చెందిన 12 మంది గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలంటూ శనివారం మండల కేంద్రంలో గిరిజనులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తండాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉండి సాగు చేసుకుంటున్న భూముల్లో చెట్లు నరికివేశారని అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో గిరిజనులపై కేసుల నమోదు ప్రజాపాలనా అని ప్రశ్నించారు. ఇప్పటికై న అధికారులు, అధికార పార్టీ నేతలు స్పందించి గిరిజన రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సోంనాథ్నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలఉపాధ్యక్షుడు తిలకేశ్వర్గౌడ్, నాయకులు భాస్కర్రెడ్డి, సరోజమ్మ, చంద్రూనాయక్, సుధాకర్యాదవ్, సుధాకర్నాయక్, బాలస్వామి, కృష్ణ, శాంతన్న, రాంచందర్రావు, ఈశ్వర్లాల్జీ, రవికుమార్రెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
రామన్పాడుకు వరద
మదనాపురం: జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి శంకరసముద్రం ద్వారా 1200 క్యూసెక్కులు, ఊకచెట్టు వాగు ద్వారా 300 క్యూసెక్కులు, జూరాల ఎడమ కాల్వ నుంచి 185 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 83 క్యూసెక్కుల వరద మండలంలోని రామన్పాడు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం రెండు గేట్లు పైకెత్తి 1,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 1,021 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 97 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ వివరించారు. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
జూరాల వెనక జలాల నుంచి..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెనక జలాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్కు సాగునీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలో రిజర్వాయర్కు నీటిని తరలించడంతో పాటు కాల్వల ద్వారా ఆయా గ్రామాల్లోని చెరువులు నింపుతున్నారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. పదేళ్లుగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వానాకాలంలో నీటిని వదులుతుండటంతో అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లోని సుమారు 50 గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నారు. దింతో సాగునీరు లేక గత కొన్ని సంవత్సరాలుగా బీళ్ళుగా మారిన పంట పోలాలు పది సంవత్సరాలుగా పంట పోలాలు పచ్చని పంటలతో కళకళ లాడుతున్నాయి. భూత్పూర్ రిజర్వాయర్ ఎడమ కాల్వ అమరచింత పెద్ద చెరవు వరకు విస్తరించి ఉండటంతో చివరగా అమరచింత పెద్ద చెరువు నిండి అక్కడి నుంచి ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, ఆత్మకూర్ చెరువులకు నీటిని తరలిస్తున్నారు. -
సాగు సంబురం
జూరాల ఆయకట్టులో చివరి అంకానికి వరి నాట్లు ●ఐదెకరాల్లో వరి సాగు.. జూరాల కాల్వలకు సాగునీటిని వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. సకాలంలో నీటిని అందించడంతో నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు త్వరగా నాట్లు పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. వరి సాగుకు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోంది. – రఘురాంరెడ్డి, అమరచింత అమరచింత ఎత్తిపోతల కింద.. అమరచింత ఎత్తిపోతల కాల్వ కింద నాలుగు ఎకరాల పంట పొలం ఉంది. ఏటా వరి పంట సాగుచేస్తున్నా. వానాకాలం వరిసాగుకు నారుమడిని సిద్ధం చేసుకున్నా. సకాలంలో నీటిని వదలడంతో సాగు పనులు ప్రారంభించా. పుష్కలంగా నీరు పారుతుండటంతో సకాలంలో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత ముందస్తుగానే నీటి విడుదల.. ప్రభుత్వ ఆదేశాలతో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని వదులుతున్నాం. ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాగునీటిని నిరంతరం అందిస్తాం. చివరి ఆయకట్టు అయిన వీపనగండ్ల వరకు అంతరాయం లేకుండా కాల్వ ద్వారా సాగునీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి 85 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని సిబ్బంది తెలిపారు. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగులో బిజీగా ఉన్నారు. ఆయకట్టుకు కేవలం ఆరుతడి పంటలకే సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించినా.. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది రైతులు ఆయకట్టు పరిధిలోని 85 వేల ఎకరాల్లో వరి పండించేందుకు సిద్ధమవగా.. ఇప్పటికే వరి నాట్లు వేసే ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ఈసారి వరి నాట్లకు కూలీల కొరతతో పాటు కూలి అధికంగా డిమాండ్ చేస్తుండటంతో యంత్రాలతో సైతం నాట్లు వేసుకోవడం కనిపించింది. ఏడేళ్లుగా ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని అందించి పంటలను కాపాడుతున్న అధికారులు ఈ ఏడాది ఎత్తేశారు. ఐఏబీ సమావేశంలో చర్చించిన అధికారులు ఏడమ కాల్వ పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో 97 కిలోమీటర్ల పొడవున జూరాల ప్రధాన ఎడమ కాల్వ విస్తరించి ఉంది. ఆయా మండలాల్లోని పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకుగాను అధికారులు ముందస్తుగా కాల్వలకు నీటిని వదులుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు.. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు జలాశయం ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని వదులుతున్నారు. దీంతో అమరచింత, చంద్రగడ్, కోయిల్సాగర్, భీమా ఎత్తిపోతలు, రంగసముద్రంతో పాటు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే ఆయా ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో సైతం సాగు పనులు కొనసాగుతున్నాయి. సన్నరకాలకే ఆసక్తి.. ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నరకం వరికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు ఈసారి కూడా సన్నరకం వరి పండించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా సోనామసూరితో పాటు ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేయడం కనిపించింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల సాగు వరికే అన్నదాతల మక్కువ వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదల -
‘రక్షా’నుబంధం
అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేదే రాఖీ పండుగ. సోదరి తన సోదరుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే.. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు చెదిరిపోతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధాలను బలోపేతం చేస్తుంది. సోదర, సోదరీమణుల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు సైతం కొరియర్లోనూ తమవారికి రాఖీలు పంపిస్తూ.. అనుబంధాలను చాటి చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్ట్రాగాంలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. – స్టేషన్ మహబూబ్నగర్/అచ్చంపేట/వనపర్తి టౌన్ -
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
ఖిల్లాఘనపురం: యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని ఎరువులు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కమాలోద్ధీన్పూర్ రైతువేధికలో ఎరువుల యాజమాన్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని.. ఖిల్లాఘనపురం మండలంలోనే 124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. దొరుకుతుందో లేదోనని తొందరపడి ఎక్కువ కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయని.. అవసరం మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపి కూడా మార్కెట్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏఈఓ సునీల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. పొంగిపొర్లిన వాగులు.. నిలిచిన రాకపోకలు వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కిష్టారెడ్డిపేట, వెంకటాపురం శివారులో ఉన్న వాగులు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా వాగులపై వంతెన నిర్మాణాలు పూర్తిగాకపోవడం.. పక్కన ఏర్పాటుచేసిన మట్టిరోడ్డుపై నీరు పారుతుండటంతో శుక్రవారం ఉదయం పెబ్బేరు– కొలాపూర్ రహదారిపై పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేసి ఉధృతి తగ్గిన తర్వాత పునరుద్ధరించారు. జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి -
అవసరం మేరకే ఎరువుల విక్రయం
వనపర్తి: రైతులకు అవసరం మేరకే ఎరువులు విక్రయించాలని.. ఎక్కువగా అమ్మి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్తో కలిసి ఎంఏఓలు, ఏఈఓలతో వెబెక్స్లో సమావేశం సమావేశమయ్యారు. అనంతరం జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల విక్రయ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఒక్కో రైతుకు ఎన్ని బస్తాల యూరియా విక్రయిస్తున్నారనే విషయాన్ని పరిశీలించి ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని.. మండల వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎకరా సాగుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఎరువుల నిల్వలకు సంబంధించిన బోర్డును పరిశీలించి ఎప్పటికప్పుడు వివరాలను సరి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల వ్యవసాయ అధికారి, సింగిల్ విండో చైర్మన్ రఘు, ఇతర అధికారులు ఉన్నారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.. రాజనగరం సమీపంలో శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల శిబిరాన్ని సందర్శించి గోర్రెలు, మేకలకు టీకాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పెంపకందారులకు సూచించారు. ప్రస్తుతం నీలి నాలుక వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. టీకాల పంపిణీకి ముందురోజు పెంపకందారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నట్టల నివారణ మందులు, శునకాల బారిన పడకుండా జాలీలు పంపిణీ చేయాలని పెంపకందారులు కలెక్టర్ను కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, పశు వైద్యులు, ఇతర అధికారులు, స్థానికులు కురుమూర్తి, గోపాల్ తదితరులు ఉన్నారు. -
28 ఏళ్ల నుంచి..
జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు. -
‘రెవెన్యూ’ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం
వనపర్తి రూరల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ సకాలంలో కార్యాలయానికి రావాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రికార్డు గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం పెబ్బేరులోని సత్యసాయి రైస్మిల్లును తనిఖీచేసి సీఎంఆర్ను త్వరగా అందించాలని.. రోజు ఒక ఏసీకే ధాన్యం ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, డిప్యూటీ తహసీల్దార్ నందకిషోర్, ఆర్ఐ రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయాలు,రైస్మిల్లు తనిఖీ రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ -
సోదరభావానికి ప్రతీక ‘రక్షాబంధన్’
వనపర్తి: రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థినులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ, కార్యాలయ అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ముల చేతికి అనురాగంతో రాఖీ కట్టడం గొప్ప సాంప్రదాయమన్నారు. 15న అరుణాచలానికి ప్రత్యేక బస్సు వనపర్తిటౌన్: వనపర్తి డిపో నుంచి ఈ నెల 15న సాయంత్రం 8 గంటలకు అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలంతో పాటు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం తిరిగి 18వ తేదీన ఉదయం 4 గంటలకు జిల్లాకేంద్రానికి చేరుతుందని పేర్కొన్నారు. రాను, పోను టికెట్ ధర రూ.3,600గా నిర్ణయించామని.. భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీట్ల రిజర్వేషన్, పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99592 26289, 79957 01851, 73828 29379 సంప్రదించాలని తెలిపారు. 108 వాహనం తనిఖీ పాన్గల్: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఉన్న 108 వాహనాన్ని శుక్రవారం జిల్లా ఈఈఎం (ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్) మహబూబ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య పరికరాలు, ఆక్సిజన్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫోన్కాల్ వచ్చిన వెంటనే త్వరగా ఘటనా స్థలానికి చేరుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించేలా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? : బీజేపీ వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి రియింబర్స్మెంట్ చెల్లిస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధతతో కూడిన కమిషన్ వేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలు, బీసీ యువతకు వడ్డీ లేని రూ.10 లక్షల రుణాలు, కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, బి.కుమారస్వామి, భాశెట్టి శ్రీను, పెద్దిరాజు, ఆగుపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 729 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. -
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. నార్లాపూర్లో నీటి నిల్వ ఇలా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు జలాశయంలో ఇప్పటికే నాలుగు టీఎంసీల నీటి నిల్వ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు -
చేనేతల ఆర్థిక సాధికారతకు కృషి
వనపర్తి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు వ్యాపార పరంగా నిలదొక్కుకుని ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై నేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ నేత కార్మికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నేతన్నకు బీమా, రూ.లక్ష రుణమాఫీ, నేతన్న పొదుపు వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఇటీవలే రూ.లక్ష వరకున్న చేనేత రుణాలను మాఫీ చేసిందని.. చేనేత భరోసా పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారని గుర్తుచేశారు. కార్మికులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ సైతం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకంలో కూడా రుణాలు ఇస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు అందిస్తే డబ్బులు చెల్లించడమేగాకుండా ప్రచార నిమిత్తం కలెక్టరేట్లో నమూనాగా ప్రదర్శిస్తామని తెలిపారు. అధికారులు ప్రతి సోమవారం నేత దుస్తులు ధరించి విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇన్ఛార్స్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు సైతం ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన కొత్తరకం దుస్తులు తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 590 మంది కార్మికులకు చేనేత పింఛన్లు అందిస్తున్నామని.. బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాధవి, హితస్విని, ఫజియా సుల్తానా, ఉపన్యాస పోటీలో సత్తా చాటిన ఎస్.నవ్య, సౌమ్య, గౌతమికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్, అధికాారులు చేనేత స్టాళ్లను తిలకించారు. కార్యక్రమంలో చేనేతశాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ అధికారి ప్రియాంక, వెల్టూరు చేనేత సొసైటీ అధ్యక్షుడు వెంకటయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలకం
వనపర్తి రూరల్: విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ చదువు కీలకమైందని.. భావి భవిష్యత్కు బీజం ఇక్కడే పడుతుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం పెబ్బేరులోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ డా. టి.నరేష్కుమార్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ విద్యార్థుల స్వాగతోత్సవానికి ఆయనతో పాటు జీసీడీఓ శుభలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఐఓ మాట్లాడుతూ.. కళాశాలలో బాలికలు క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చిన్న గోపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా అభియాన్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని.. పంద్రాగస్ట్కి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో అభియాన్ కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హర్ ఘర్ తిరంగా అనేది త్రివర్ణ పతాక వైభవాన్ని చాటే ప్రత్యేక పండుగగా మారిందన్నారు. ప్రధాని మోదీ ధృడ సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వం, సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, కేతూరి బుడ్డన్న, మోర్చాల రాష్ట్ర నాయకులు జ్యోతి రమణ, అలివేలమ్మ, సహా కన్వీనర్లు కదిరె మధు, బాసెట్టి శ్రీను, అశ్విని రాధా, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, అధికార ప్రతినిధులు తిరుమల్లేష్, మణివర్ధన్ సాగర్, గొర్ల బాబురావు, కార్యదర్శి రామ్మోహన్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, మోర్చాల జిల్లా అధ్యక్షులు రాఘవేందర్గౌడ్, ఎండీ ఖలీల్, గంధం ప్రవీణ్, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం.. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, పథకాల అమలు ప్రతి ఇంటికి తెలియజేయాలనే లక్ష్యంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట, బండార్నగర్ కాలనీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం, నాయకులు కేతూరి బుడ్డన్న, శ్రీనివాస్గౌడ్, తిరుమల్లేష్, సుమిత్రమ్మ, రాములు, దంతోజి నవీన్కుమార్ పాల్గొన్నారు. -
పౌర సేవలకు అధిక ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: పౌర సేవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను శ్రద్ధగా ఆలకించి త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. మొదట మోజర్లలో నిర్మిస్తున్న పారాబాయిల్డ్ రైస్మిల్లును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే మిల్లుల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేస్తామని యజమానికి సూచించారు. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడంలో ఇలాంటి మిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని.. అయితే పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భూ భారతి రెవెన్యూ సదస్సుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంతో ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపర్చవచ్చని తెలిపారు. అనంతరం రికార్డు గదిని సందర్శించి నిర్వహణను పరిశీలించారు. అన్ని రికార్డులను సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు ఉన్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
గోపాల్పేట: విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా చదివితేనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆంగ్లం, గణితంలో నిర్వహించిన మండలస్థాయి పోటీ పరీక్షల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు బహుమతుల దాత సుఖేందర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్, ఏదుల, గోపాల్పేట మండలాల ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయ విక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబులో పెట్టుకున్న కాసేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియాలో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేదని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కరించాలి
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో భాగంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రం, ఏదులలోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయానికి వచ్చే రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం కాని వాటిని మరోమారు పరిశీలించాలన్నారు. ఆయన వెంట గోపాల్పేట, ఏదుల తహసీల్దార్లు పాండునాయక్, మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు. -
నేడు చేనేత సంబురాలు
అమరచింత: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో గురువారం చేనేత సంబురాలు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య తెలిపారు. కలెక్టరేట్ నుంచి చేనేత కార్మికులతో ర్యాలీ ఉంటుందని.. జిల్లాలోని నేత కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే చేనేతలో రాణిస్తున్న సీనియర్ కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం ఉంటుందన్నారు. విద్యార్థులకు చేనేతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు.రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టంమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 646 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 569 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాలి : సీపీఎంమదనాపురం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విధ్వేషాలతో రెచ్చిపోతోందని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్ ఆవరణలో నిర్వహించిన మండలశాఖ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతూ సంబరపడుతున్నారని.. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రజాభివృద్ధిని భ్రష్టు పట్టిస్తున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సీపీఎం శాఖ సమావేశాలు ఏర్పాటు చేసుకొని బలోపేతం కావాలన్నారు. అంతకుముందు అమరులకు సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మండ్ల రాజు, మండల కార్యదర్శి వెంకట్రాములు, అజ్జకొల్లు గ్రామ కార్యదర్శి మనివర్ధన్, నాయకులు బడికి విష్ణుప్రసాద్, చిరంజీవి, చెన్నయ్య, వెంకటేష్, మొగిలి, ఆంజనేయులు, మాసన్న. వెంకటన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.‘ఎస్సీ, ఎస్టీ టీచర్లకు న్యాయం చేయాలి’వనపర్తిటౌన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్ని క్యాడర్లలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంటే నిరంజనయ్య కోరారు. బుధవారం డీఈఓ అబ్దుల్ ఘనీని కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలవుతున్న గ్రూప్ 1, 2, 3లకు అడక్వేసి వర్తించదని, కొత్త జీఓ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా బ్యాక్లాగ్ ఎస్సీ, ఎస్టీ పోస్టుల వివరాలు, గతంలో అన్ని సబ్జెక్టుల్లో ఏ రోస్టర్ వరకు పదోన్నతులు కల్పించారో ఆ వివరాలు సైతం వెల్లడించాలని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బి.వెంకటయ్య, గగనం సీనయ్య, బౌద్దారెడ్డి, సూర చంద్రశేఖర్, మహిపాల్రెడ్డి, హమీద్, డి.కృష్ణయ్య, సుధాకర్ ఆచారి, కృష్ణయ్య, విష్ణువర్ధన్, అమరేందర్, బాలరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంస్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నేడు (గురువారం) స్థానిక తెలంగాణ చౌరస్తాలోని రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుదల, నూతన కార్యవర్గం ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
అమరచింత: విద్యార్థినులకు ఇబ్బందులు కలిగితే సహించమని.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి ఉన్నతాధికారులకు విన్నవించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని కేజీబీవీని జీసీడీఓ శుభలక్ష్మితో కలిసి తనిఖీ చేసి విద్యార్థినులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 15 మరుగుదొడ్లకుగాను కేవలం 3 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, తాగునీటి సమస్య ఉందని, రాత్రిళ్లు విషపు పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థినులు అధికారులకు వివరించారు. మరుగుదొడ్ల సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఎస్ఓను ప్రశ్నించగా.. విషయాన్ని జిల్లా అధికారులకు విన్నవించామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరించాలని జీసీడీఓకు సూచించారు. అదేవిధంగా రోజువారీగా అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ విధిగా పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలోని వంట గదిని పరిశీలించి ఎప్పడూ శుభ్రంగా ఉంచాలని, వంట కార్మికులు శుచి, శుభ్రత పాటించాలన్నారు. విద్యార్థినులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన అందించాలని కోరారు. అనంతరం పాంరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంఈఓ భాస్కర్సింగ్, ఎంపీఓ నర్సింహులు ఉన్నారు. -
ప్రొ. జయశంకర్ ఆశయ సాధనకు కృషి..
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలకు ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య ముఖ్యఅతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అహర్నిశలు శ్రమించిన గొప్పవ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటే ఏకై క లక్ష్యంగా తెలంగాణ భావాజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా నిర్మాణాలు
ఇందిరమ్మ ఇళ్లలో 63 శాతం పురోగతి●అవగాహన కల్పిస్తున్నాం.. పురపాలికలోని 10 వార్డుల్లో 56 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్లు అందించాం. వీరిలో 26 మంది మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పనులు చేపడుతున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం. – నాగరాజు, పుర కమిషనర్, అమరచింత పురోగతి సాధిస్తున్నాం.. కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు నిర్మాణాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 3,084 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకోగా.. 488 మంది బేస్మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లావ్యాప్తంగా 63 శాతం పురోగతిలో సాధించాం. – విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి అమరచింత: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తుండటంతో ప్రస్తుతం జిల్లాలో 63 శాతం పురోగతిలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,538 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా.. 5,938 మందికి ప్రొసీడింగ్లు అందజేశారు. ఇప్పటి వరకు 3,048 మంది మార్కింగ్ వేసుకొని బేస్మెంట్ పనులు ప్రారంభించగా.. 488 మంది లబ్ధిదారులు బేస్మెంట్ నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వం నుంచి మొదటి విడతగా రూ.లక్ష అందుకున్నారు. నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలకు తోడుగా అదనంగా మరో రూ.రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు జోడించి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు వంట గది, హాలు, బెడ్రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నారు. పాత ఇంటిని పడగొట్టి కొత్తగా నిర్మాణం చేపట్టే వారితో పాటు ఖాళీ ప్లాట్లలో ఇంటిని నిర్మించుకునే వారు చుట్టూ రెండు ఫీట్ల స్థలం వదలాలని అధికారులు సూచిస్తుండటంతో అలాగే చేపడుతున్నారు. విడతల వారీగా చెల్లింపులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విడతల వారీగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. బేస్మెంట్ నిర్మాణం పూర్తయితే రూ.లక్ష, పైకప్పు వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు నిర్మాణం పూర్తిచేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తిచేస్తే రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని హౌసింగ్ అధికారులు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న 488 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 కోట్లు జమ చేసినట్లు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ మార్కింగ్ ఇచ్చిన 3 వేల నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 255 గ్రామాలతో పాటు 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,048 లబ్ధిదారులు ఖాళీ స్థలాల్లో మార్కింగ్ పూర్తిచేయగా.. 488 మంది బేస్మెంట్ వరకు, 141 మంది గోడల వరకు, 78 మంది పైకప్పు వరకు నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కరు మాత్రమే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 63 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో 6,538 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు రూ.ఆరు కోట్ల చెల్లింపులు అధికారుల పర్యవేక్షణతోనే పనుల్లో వేగం -
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
వీపనగండ్ల: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సరికాదని.. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యాలయ ఆవరణలో పదుల సంఖ్యలో జనాలు ఉన్నారంటే వారి పనులు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోందని, వచ్చిన వారు పని ముగించుకొని త్వరగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. త్వరలో జీపీఓలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుందని.. వారి సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి, ఆర్ఐ కురుమూర్తి తదితరులు ఉన్నారు. -
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్ఎస్తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం. గువ్వల వెంట వెళ్లేందుకు కేడర్ విముఖత.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కక కమలం గూటికెళ్లిన మాజీ ఎంపీ బీజేపీలోకి గువ్వల రాక నేపథ్యంలో మళ్లీ అలజడి కుమారుడి భవితవ్యంపై ఆందోళన గువ్వల బాటలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు -
కలెక్టర్ను కలిసిన రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: కొత్తగా విధుల్లో చేరిన రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.కీమ్యానాయక్ మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆ రోజు కలెక్టర్ లేకపోవడంతో మంగళవారం కలిశారు. ఇద్దరు పుర అధికారుల సస్పెన్షన్ వనపర్తి టౌన్: వనపర్తి పురపాలికలోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను గుర్తించారని కొన్నిరోజుల కిందట 12 మంది వార్డు అధికారులు, ఓ కీలక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా వార్డు అధికారి శివమ్మ, వార్డు అధికారులకు ఇన్చార్జ్గా ఉన్న శంకర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఇరువురిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు వద్ద ప్రస్తావించగా దాటవేట వైఖరి ప్రదర్శించారు. ఐటీఐలో వాక్–ఇన్ అడ్మిషన్లు వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు వాక్–ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రమేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సీటు పొందని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని.. కొత్త విద్యార్థులు విధిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉండాలని పేర్కొన్నారు. పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తునకు ఈ నెల 28 వరకు గడువు ఉందని.. విద్యార్థులు ఏదేని ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీతో పాటు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 94902 02037, 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. ‘అత్యాచార ఘటనలను అరికట్టడంలో విఫలం’ వీపనగండ్ల: మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్రా మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 30, 31న నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అవసరమైన నిధుల కోసం మంగళవారం మండల కేంద్రంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల దురాహంకార హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు పలుకుతూ సామాన్య ప్రజలు, మహిళల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, జిల్లా కార్యవర్గసభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. -
తప్పెవరిది..?!
● విచారణ చేపడతాం.. మర్రికుంట ఎఫ్టీఎల్ పరిఽధిలోని ప్లాట్ల విషయంపై సోమవారం ప్రజావాణిలో అర్జీ దాఖలైంది. సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. 2012లో ఆయా భూములకు నాలా అనుమతులు ఎలా మంజూరు చేశారనే విషయాన్ని సైతం పరిశీలిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్ల ఏర్పాటుకు అనుమతి లభించదు. – రమేష్రెడ్డి, తహసీల్దార్, వనపర్తి ఎఫ్టీఎల్ పరిధిలోని భూములకు నాలా ధ్రువపత్రాలు జారీ చేసిన అధికారులు వనపర్తి: డబ్బు సంపాదనే ధ్యేయంగా రియల్ వ్యాపారులు.. నజనారాలకు తలొగ్గి అధికారులు అనుమతులు ఇవ్వడంతో చెరువులు, కుంటల్లో విచ్ఛలవిడిగా ప్లాట్లు వెలిశాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంలో ఎఫ్టీఎల్ పరిధి అంటూ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారం కావడం లేదని గతనెల 28న కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లాకేంద్రంలోని మర్రికుంట చెరువు బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తప్పు ఎఫ్టీఎల్ పరిధిలోని పట్టాభూములని తెలిసి ప్లాట్లు చేసిన రియల్ వ్యాపారులదా.. లేక ప్లాట్లు చేస్తున్న సమయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన నీటిపారుదలశాఖ అధికారులదా.. లేక నాన్ అగ్రికల్చర్ భూమిగా ధ్రువీకరించిన రెవెన్యూ అధికారులదా.. ఎవరిదనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. రూ.వేలు, రూ.లక్షలు ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణ లోపంతో జిల్లాలో ఎంతోమంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మర్రికుంట చెరువు బాధితులేగాక తాళ్ల చెరువు, నల్ల చెరువు, ఈదుల చెరువు, అమ్మచెరువుతో పాటు పలు కుంటల ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిలో వెలిసిన వెంచర్లు కోకొల్లలని చెప్పవచ్చు. రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే జిల్లాకేంద్రంలోనూ ఓ అధికార బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాకు గురైన చెరువులు, కుంటల్లోని ఆక్రమణలను తొలగించే ప్రయత్నం ఒకసారి నల్లచెరువు సమీపంలో చేసి వదిలేశారు. ఎఫ్టీఎల్ భూముల్లో ప్లాట్లు చేస్తున్న సమయంలో నిమ్మకుండా ఉండి ఏళ్ల తర్వాత ఆక్రమణలంటూ అధికారులు చర్యలకు ఉ పక్రమించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన అనుమతులు రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు నిర్మాణాలకు అనుమతి లభించక లబోదిబోమంటున్న బాధితులు -
పవిత్రోత్సవాలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ప్రతిష్ఠ, చతుస్థానార్చన, ద్వారాతోరణ పూజ, హోమశాలలో హోమం, ఆలయంలోని అన్ని మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆలయానికి పట్టు పవిత్రమాల అలంకరణ, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలు మూడురోజుల పాటు కొనసాగనుండగా.. గురువారం మహా పూర్ణాహుతి అనంతరం పవిత్రమాలలను తొలగించి 108 కలశాలతో అమ్మ, స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. తదుపరి కై ంకర్యపరులకు పవిత్రమాలల బహూకరణ, ఆచార్య సన్మాన కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కొత్తకోట రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులతో పాటు తగిన వైద్యసిబ్బంది ఉన్నందున ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణుల ఈడీడీ, ప్రసవాల నమోదు, రక్త పరీక్షల రికార్డులను పరిశీలించారు. గత నెలలో పీహెచ్సీలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రైవేట్లో ఎన్ని జరిగాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జులైలో కేవలం ఒక ప్రసవం జరిగినట్లు తెలుపడంతో కేంద్రంలో ఉన్న వసతులు, సిబ్బందిపై గర్భిణులకు అవగాహన కల్పించి వారికి నమ్మకం కలిగించి ప్రసవాలకు వచ్చేలా చూడాలన్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో వచ్చే రోగులకు రక్త పరీక్షలు విధిగా నిర్వహించాలని, డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. డెంగీ కేసులు నమోదైన చుట్టుపక్కన ప్రదేశాల్లో ఉన్న ఇళ్లలోని వారి రక్త నమూనాలు సేకరించాలన్నారు. కుక్క, పాము కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిల్వలు, ధరల పట్టిక ప్రదర్శించాలి.. పెద్దమందడిలోని హాకా ఫార్మర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, ధర వివరాల పట్టికను దుకాణం బయట ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అధికారులను అడిగి తెలుసున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, తహసీల్దార్ సరస్వతి, ప్రోగ్రాం అధికారి డా. మంజుల, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
నేరాల అదుపే ప్రధాన కర్తవ్యం
వనపర్తి: జిల్లాలో నేరాలను అదుపు చేయడమే ప్రధాన కర్తవ్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సందర్శిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఏ నేరాలు పెరిగాయి.. వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్ఛయంతో పని చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తమ పరిధిలోని పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎస్సైలకు తగిన సూచనలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐలను ఆదేశించారు. మహిళల భద్రతే లక్ష్యంగా పని చేయాలని, మహిళలు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని.. డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని.. నిర్వాహకులతో ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలని ఎస్ఐ, సీఐలకు సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ముందుగానే చెప్పాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని.. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలుపై నిఘా ఉంచాలని, జిల్లా, రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి మూలాలు, కీలక వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించారు. నేర సమీక్షలో డీఎస్పీ జె.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, శివకుమార్, సీసీఎస్ సీఐ రవిపాల్, కొత్తకోట ఇన్చార్జ్ సీఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేర సమీక్షలో ఎస్పీ రావుల గిరిధర్ -
సాగునీరు అందించే వరకు పోరాడుతాం
పాన్గల్: ప్రాజెక్టుల్లో నీరు నిండుగా ఉన్నా.. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో రైతులకు సాగునీరు అందించలేని దుస్థితి నెలకొందని, నీటి సరఫరా జరిగే వరకు అన్నదాతల పక్షాన నిలబడి పోరాడుతామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులు, రైతులతో కలిసి మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్, రాయినిపల్లిలో ఉన్న కేఎల్ఐ డీ–8 ఎంజే–4, భీమా డీ–18, డీ–19 కాల్వలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాల్వల్లో పేరుకుపోయిన జమ్మును తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. గతంలో కాల్వలో పేరుకుపోయిన జమ్మును సొంత ఖర్చులతో తొలగించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా గ్రామాల్లో రైతులే స్వయంగా జమ్ము తొలగించుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. సాగునీరు అందని గ్రామాల రైతులు అధికారులకు ఫోన్లు చేసి ప్రశ్నిస్తే నీరు పారేంత వరకు పంటలు సాగు చేసుకోవాలని వింత జవాబులు ఇస్తున్నారని చెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి జమ్ము, అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించి సాగునీరు సాఫీగా ముందుకు పారేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, మండల అధ్యక్షుడు వీరసాగర్, ఉపాధ్యక్షుడు తిలకేశ్వర్గౌడ్, కార్యదర్శి భాస్కర్ర్రెడ్డి, సుధాకర్యాదవ్, దశరథనాయుడు, రాజేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, రమణయ్య, శేఖర్నాయుడు, కృష్ణయ్యగౌడ్, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
వనపర్తి: భూ భారతి చట్టం–2025 రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సెక్రటరీ లోకేష్కుమార్ అదరపు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సెక్రెటరీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 15న ఎల్బీ స్టేడియంలో గ్రామ పరిపాలన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేస్తారని, అందుకు అవసరమైన ఖాళీలు, రోస్టర్ తదితర ప్రక్రియ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 7,648 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి ఇప్పటి వరకు 8,837 నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 696 దరఖాస్తులను ఆమోదించి అప్డేట్ చేశామన్నారు. నిబంధనలు పాటిస్తూ మిగిలిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచుతామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు. -
వ్యవసాయ భూమి వేలానికి చర్యలు
అమరచింత: ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ కార్మిక సంఘంలో వ్యవసాయ భూములపై రుణాలు పొంది తిరిగి చెల్లించని రైతుల పొలాలను వేలం వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అమరచింత మండలంలోని దీప్లానాయక్తండాకు చెందిన దీప్లానాయక్ ఎల్టీ రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ సదరు వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలాన్ని ఈ నెల 12న వేలం వేస్తున్నామంటూ సోమవారం పట్టణంలో టాంటాం వెయించారు. సహకార సంఘం సీఈఓ నరేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని ప్రధాన వీధులతోపాటు యూనియన్ బ్యాంక్ పరిసరాలు, దీప్లానాయక్తండాలో కరపత్రాలను పంచుతూ సరైన గడువులో డబ్బులు చెల్లించకుంటే పొలం వేలం వేస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలంలో పాల్గొనాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ నరేష్ మాట్లాడుతూ తమ సొసైటీలో 61 మంది రైతులు ఎల్టీ రుణాలు తీసుకుని మొండిబకాయి దారులుగా ఉన్నారని, వీరి ద్వారా సుమారు రూ.90 లక్షలు రావాల్సి ఉందన్నారు. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు పంపామని, సదరు రైతుల ఇళ్లకు వెళ్లి చెల్లించాలని కోరినా ఫలితం లేదన్నారు. దీంతో మొండిబకాయిదారుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వారి ఆదేశాల మేరకు రికవరీలో భాగంగా దీప్లానాయక్ ద్వారా రూ.16 లక్షలు వసూలు చేసుకునేందుకు సదరు వ్యక్తికి చెందిన సర్వే నంబర్ 203, 201, 221లో 13.26 ఎకరాల పొలాన్ని వేలం వేస్తున్నామని పేర్కొన్నారు. -
అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలపై దృష్టిసారించండి
కొత్తకోట రూరల్: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా.దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధనల కోసం ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా దూసుకొస్తున్న పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్యాన పంటలను విరివిగా పెంచాల్సిన అవసరముందన్నారు. మెట్ట ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, జాము, సపోట, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ తదితర తోటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. పండ్ల తోటల సాగుతో పాటు అంతర పంటలు తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. అదే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు. సకాలంలో కత్తిరింపులు చేయడం, నీటి సంరక్షణ పద్ధతులు పాటించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.భగవాన్, డీన్ చీనా, కన్సల్టెంట్ కె.వీరాంజనేయులు, అసోసియేట్ డీన్ పిడిగం సైదయ్య, ప్రొఫెసర్లు షహనాజ్, శ్రీనివాస్, శంకర్ స్వామి, గౌతమి, విద్య, భాస్కర్, నవ్య, శ్వేత పాల్గొన్నారు. -
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ● కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత తేలదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. అయోమయంలో పార్టీశ్రేణులు.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. -
పోలీసుల సేవలను వినియోగించుకోండి
వనపర్తి: జిల్లాలో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని నేరుగా పోలీసులకు తెలియజేయాలని, పోలీసుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ నేరుగా బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మందితో అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మొత్తం 14 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ వనపర్తి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎన్.కీమ్యానాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు అదనపు కలెక్టర్ పనిచేసిన వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీకి బదిలీ అయినందున ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన ఎన్.కీమ్యానాయక్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్కు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పకడ్బందీగా ‘వందరోజుల’ కార్యాచరణ అమలు వనపర్తి టౌన్: వనపర్తి మున్సిపాలిటీలో ‘వందరోజుల’ కార్యాచరణ అమలు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సోమవారం జిల్లాకేంద్రంల్లోని 2, 20, 6, 15, 25, 32, 23, 1, 8, 29, 27 వార్డుల్లో 100 రోజుల కార్యాచరణ నిర్వహించారు. ఈ సందర్భంగా తడి, పొడి వ్యర్థాల విభజన, డెంగ్యూ, మలేరియాపై అవగాహన, వీధి, పెంపుడు కుక్కలపై ఏబీసీ ప్రచారం, వాణిజ్య లైసెన్స్, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల్లోని డెస్టిల్ తొలగించే పనులను కమిషనర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో నిల్వ నీటిని వాడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, డీఎంసీ బాలరాజు, సూపర్వైజర్, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి కొల్లాపూర్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎస్ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్లోని కేఎల్ఐ అతిథి గృహంలో నిర్వహించిన సీపీఐ పార్టీ మండల స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవలే సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడంతో ఆయనను పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాగర్కర్నూల్ జిల్లాలో వేలాదిగా లంబాడీలు, చెంచులు ఉన్నారన్నారు. వారి జనాభా ఆధారంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు చేయాలన్నారు. నల్లమలలోని వనరులను వినియోగించుకునే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. నల్లమల పరిసర ప్రాంతాల ను ఏజెన్సీ కారిడార్గా ప్రకటించాలని కోరా రు. కొల్లాపూర్లో మామిడి మార్కెట్, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ స్థాపించాలన్నారు. మొలచింతలపల్లి, అసద్పూర్ శివార్లలో రాజవంశస్థుల భూములను సీలింగ్ యాక్టు ప్రకారం పే దలకు పంచాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శివుడు, ఇందిర, యూసుఫ్, కుర్మయ్య, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
నేతన్నకు.. భరోసా
నూతన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ●రూ.18 వేలు ఇస్తామన్నారు.. నేతన్నకు భరోసా పథ కం ద్వారా ప్రతి సంవత్సరానికి రూ.18 వేలను ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు తె లిపారు. మగ్గానికి ఇద్దరికి అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో నాతోపాటు సహాయ కార్మికురాలిగా ఉన్న నా భార్యతో కలిసి ఇరువురం దరఖాస్తు చేసుకున్నాం. – చిన్ని ప్రకాష్, నేత కార్మికుడు, అమరచింత అవసరాలకు ఉపయోగం.. ప్రభుత్వం కొత్తగా నేతన్నకు భరోసా పథకం తీసుకొచ్చిందని సొసైటీ వాళ్లు చెప్పారు. సహాయ కార్మికులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇస్తామన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్నా. ఏడాదికి వస్తున్న రూ.6 వేలు కుటుంబ అవసరాలకు ఉపయోగపడనున్నాయి. – గాజుల సంధ్య, చేనేత సహాయ కార్మికురాలు, అమరచింత సద్వినియోగం చేసుకోండి.. నేతన్నకు భరోసా పథకం ద్వారా చేనేత కార్మికుల నుంచి మంగళవారం దరఖాస్తులు స్వీకరిస్తాం. జిల్లా మొత్తంలో 641 మంది కార్మికులు ఉండగా వీరందరికీ పథకం వర్తిస్తుంది. అయితే ఇప్పటి వరకు 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు కూడా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆదుకోనేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. ఈ క్రమంలో కొత్తగా నేతన్నకు భరోసా పథకం ప్రవేశపెట్టి ఏడాదికి ప్రధాన కార్మికుడికి రూ.18 వేలు, సహాయ కార్మికుడికి రూ.6 వేల చొప్పున అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి గాను విధివిధానాలు సైతం రూపొందించడంతో సంబంధిత చేనేత జౌళీశాఖ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గత నెల 30 వరకే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం తాజాగా మంగళవారం వరకు పొడిగింది. దీంతో ఇప్పటికీ నేతన్న భరోసాకు దరఖాస్తు చేసుకోలేని కార్మికులు త్వరితగతిన దరఖాస్తులను సంబంధిత చేనేత జౌళిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు, సొసైటీ సభ్యులకు తెలియపరుస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేనేత వృత్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిరుపేద కార్మికులకు అందిస్తూ.. వారి అభ్యున్నతికి తమవంతు కృషిచేస్తుండటంతో అందివచ్చిన అవకాశాలను కార్మికులను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా.. జిల్లాలో జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు 641 మంది ఉండగా.. నేతన్నకు భరోసా పథకం కోసం ఇప్పటి వరకు కేవలం 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు జౌళీశాఖ అధికారులు వెల్లడించారు. మిగతా వారంతా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు 641 మంది నేతన్నకు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు 346 మంది సహాయ కార్మికుడికి అందించే సహాయం రూ.6,000 ప్రధాన కార్మికుడికి అందించే సహాయం రూ.18,000 ఇద్దరు కార్మికులకు అవకాశం.. ప్రభుత్వం తీసుకోచ్చిన నేతన్నకు భరోసా పథకం కార్మికుడి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని జౌళిశాఖ అధికారులు తెలిపారు. భరోసా పథకం ద్వారా జియో ట్యాగ్ కలిగిన మగ్గానికి ఇద్దరు కార్మికులకు అవకాశం కల్పించారు. వీరిలో ప్రధాన కార్మికుడికి ఏడాదికి రూ.18 వేలు ఇస్తుండగా.. సహాయ కార్మికుడికి రూ.6 వేలు అందిస్తుంది. వీటిని ఏడాదిలో రెండు పర్యాయాలు (6 నెలలకు ఒకసారి) భరోసా డబ్బులను అందించనున్నట్లు వెల్లడిస్తున్నారు. కార్మికుల పిల్లల చదువులతోపాటు ఇతర అవసరాలకు భరోసా ద్వారా వచ్చే డబ్బులు ఆదుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. త్రిఫ్ట్ ఫండ్తోపాటు అదనపు ఆదాయం అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ నేటి వరకు గడువు పొడిగింపు జిల్లా అర్హులైన కార్మికులు 600 మందికిపైనే.. ఇంకో చేసుకోవాల్సిన వారు 295 -
చదరంగం క్రీడా నైపుణ్యానికి నిదర్శనం
వనపర్తి: బుద్ధిబలం ప్రదర్శించే చదరంగం భారతీయుల ప్రాచీన క్రీడల్లో ఒకటని.. ఇందులో భారతీయులకు అత్యంత నైపుణ్యం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్పోర్ట్ కార్యాలయంలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా ఓపెన్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చదరంగంతో ఆలోచన శక్తి పెంపొందడమేగాక బుద్ధిబలం పెరుగుతుందన్నారు. చదరంగం క్రీడపై చిన్నారులు ప్రాథమిక దశ నుంచే ఆసక్తి కనబర్చేలా ప్రోత్సహించాలని సూచించారు. పోటీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, నిర్వాహకులు యాదగిరి, టీపీ కృష్ణయ్య, గణేష్ కుమార్, నర్సింహ, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో రజత పతకం
వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ మైదానంలో కొనసాగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లాకు చెందిన బద్దూనాయక్ ఐదు వేల మీటర్ల పరుగు పందెం పోటీలో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాలిన్ పతకాన్ని అందజేశారు. జిల్లా క్రీడాకారులు రజత పతకం సాధించడంతో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రతినిధులు నర్సింహ, ఆంజనేయులు, సంఘం కార్యదర్శి సారంగపాణి, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ సెక్రెటరీ నందిమళ్ల శ్రీకాంత్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భార్గవికి 6 బంగారు పతకాలు వనపర్తిటౌన్: ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టణానికి చెందిన యాదగిరిచారి, విజయ హైమావతి దంపతుల కుమార్తె భార్గవిచారి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. ఆదివారం యూనివర్సిటీలో జరిగిన 55వ స్నాతకోత్సవంలో ఓవరాల్ క్యాటగిరిలో 4, ఫామ్ మిషనరీ, ఫుడ్ ప్రాసెసింగ్లో రెండు 2 మొత్తం 6 బంగారు పతకాలు సాధించింది. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ భార్గవికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఐసీఏఆర్ ఢిల్లీ డా. మంగిలాల్ జాట్, వైస్ ఛాన్స్లర్ ప్రొ. అల్డాస్ జానయ్య, యూనివర్సిటీ ప్రముఖులు పాల్గొన్నారు. బీచుపల్లి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎంపీ రాములు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఈఓ రామన్గౌడ్ వారిని శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చకుడు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. వారి వెంట ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సమాజ మార్గదర్శి గురువు : ఎమ్మెల్సీ వనపర్తి విద్యావిభాగం: తరతరాలుగా సమాజానికి మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి గురువని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కొనియాడారు. తపస్ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జిల్లాలోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి మాట్లాడారు. గురువులు అందించిన విద్యే తన అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైందన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు, జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కరుణ, మండల విద్యాధికారి మద్దిలేటి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వరప్రసాద్గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ దామోదర్రెడ్డి, శశివర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకత వెలికితీయొచ్చు..
పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయొచ్చు. ఇప్పటికే పాఠశాలకు నాలుగు రకాల వాయిద్య పరికరాలు అందాయి. త్వరగా శిక్షకులను నియ మిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడ లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – గోపాల్, హెచ్ఎం, అచ్చంపేట ఉన్నత పాఠశాల మార్గదర్శకాలు రాలే.. జిల్లాలో ఎంపికై న ఎనిమిది పీఎంశ్రీ పాఠశాలలకు వాయిద్య పరికరాలు చేరాయి. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. ఆదేశాలు అందగానే జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. త్వరలోనే ప్రత్యేక టీచర్ల నియామకం జరగనుంది. – షర్పొద్దీన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ● -
పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
సరిగమలు
చదువులమ్మ ఒడిలో.. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు ● ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● వారానికి ఒక తరగతి చొప్పున నిర్వహణ ● పీఎంశ్రీ స్కూల్స్కు వాయిద్య పరికరాలు అందజేత ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్చికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది. తాజాగా సంగీత పాటలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన బడులకు ముందు అవకాశం కల్పించనుంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను ఆ బడులకు పంపిణీ చేశారు. ఈమేరకు విద్యార్థులు రోజు పాఠ్యాంశాల బోధనకు పరిమితం కాకుండా వారంలో ఒక రోజు సంగీత పాఠాలు నేర్చుకోకున్నారు. దీంతో పిల్లలకు శ్రావణానందంతో పాటు ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయా వృత్తులలో సైతం స్థిరపడేందుకు ఉపకరిస్తుంది. 36 పాఠశాలలకు పరికరాల పంపిణీ ఉమ్మడి జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికై న 36 పాఠశాలలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబలా, హార్మోనియం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు సైతం నేర్పించనున్నారు. జిల్లాలో ఎంపికై న పాఠశాలల వివరాలు.. శిక్షకులు వస్తే ప్రయోజనం పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు అంది నెల రోజులు అవుతుంది. కానీ, విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను మాత్రం ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసినవారు అరుదుగా ఉంటారు. సాధారణంగా ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే కానీ అన్ని తెలిసిన వారికి రూ.10వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. భిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పాటలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాటలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది. -
ముఖ గుర్తింపుతో హాజరు!
వనపర్తి: జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారుల పాలన కొనసాగుతున్న ఏడాది కాలంగా కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయా కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ మాదిరిగా జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నేషన్) హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గత నెల 16నే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. యంత్రాల కొనుగోలుకు నిధులు లేవని ఎంపీడీఓలు చేతులు ఎత్తేశారు. దీంతో జిల్లా పరిషత్తో పాటు 15 మండలాలకు జెడ్పీ నిధులతో యంత్రాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను కలెక్టర్ అనుమతి కోసం నోట్ఫైల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ● ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల హోదా, ఇతర వివరాలు సేకరించి యంత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం యంత్రంలో నిక్షిప్తమైన ముఖ హాజరును లెక్కించి ఉద్యోగులకు ప్రతి నెల వేతనం చెల్లించే పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం సమీకృత కలెక్టరేట్లో అమలవుతోంది. అదే తరహాలో నాణ్యమైన యంత్రాలు కొనుగోలు చేసేందుకు జెడ్పీ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జెడ్పీ, ఎంపీడీవో కార్యాలయాల్లో అమలుకు ఏర్పాట్లు గత నెల 16నే ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల కొనుగోలు జాప్యం అధికారులు, సిబ్బంది విధుల డుమ్మాలకు చెక్ పంద్రాగస్టు వరకు పూర్తిచేస్తాం.. పంద్రాగస్టు వరకు జెడ్పీతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖగుర్తింపు యంత్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరలు ఎక్కువగా ఉన్నందున తక్కువ ధరకు యంత్రాలు సరఫరా చేసే ఏజెన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నించటంతో కొంత ఆలస్యమైంది. ఉద్యోగుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. – యాదయ్య, జెడ్పీ సీఈఓ, వనపర్తి -
హరిత.. హరం
జిల్లాకేంద్రంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత ●అటవీశాఖ నిర్లక్ష్యం.. వృక్షాల తొలగింపులో అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. భారీ చెట్లను సంరక్షించేందుకు కృషి చేయాలే తప్పా అడ్డగోలుగా నరికివేయడం సరికాదు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. – తిరుమల్, మాజీ కౌన్సిలర్ భారీ వృక్షాలను తొలగించారు.. మున్సిపాలిటీ పార్క్ను సొంత పార్క్లా భావించి అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు పచ్చదనం కూడా అదేస్థాయిలో పెంపొందించాం. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నఫలంగా చెట్లను నరికివేశారు. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా నరికివేయడం సరికాదు. – డా. ఎల్.మురళీధర్, వనపర్తి మౌఖిక ఆదేశాలతోనే.. చెట్ల తొలగింపునకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలని సిబ్బందికి సూచించాం. కొన్ని చెట్ల తొలగింపులో మౌఖిక ఆదేశాలతో ముందుకెళ్లాం. జిల్లాకేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి ఎక్కడెక్కడ తొలగించారు.. చెట్లు ఎక్కడెక్కడ తొలగించారో ఫొటోలు ఉంటే అందించండి.. కొన్ని నా దృష్టికి వచ్చాయి. చలానా చెల్లిస్తే ఆన్లైన్లో అనుమతి లభిస్తుంది. ప్రతినెల ఎన్ని అనుమతులు తీసుకున్నారని సమీక్షిస్తుంటాం. రెండు, మూడు నెలల్లో ఎన్ని వచ్చాయో గుర్తుకు లేదు. – అరవింద్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంపొందించాలంటూ ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతూ రూ.కోట్లు వెచ్చిస్తుండగా.. మరోవైపు ఏపుగా పెరిగిన వృక్షాలను అక్రమంగా తొలగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అంతర్గత, ప్రధాన రహదారుల పరిసరాలు, పార్క్ల్లో 3 నెలలుగా వృక్షాల తొలగింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 చలానా తీసి అటవీ అధికారులను సంప్రదించి వృక్షాలను తొలగించాలి. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ (పునర్జీవం) ద్వారా ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చెట్లను తరలించి రసాయనాల ద్వారా నాటి సంరక్షిస్తారు. దీంతో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వృక్షసంపదను కాపాడినట్లు అవుతుంది. పట్టణాభివృద్ధి దృష్ట్యా ఐదేళ్ల కిందట ఇలాంటి సమస్య ఎదురైతే చెట్లను ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా నాగవరం ప్రాంతంలో పరిరక్షించారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నా.. రాజకీయ పార్టీల నేతల ప్రోద్భలంతో యథేచ్ఛగా చెట్లను కొట్టేస్తున్నారు. మూడు నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నా అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు తూట్లు.. ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ రహదారి నిర్మాణంలో రహదారికి ఇరువైపులా మొక్కల పెంపకానికి స్థలం వదలాల్సి ఉంటుంది. పుర కేంద్రంలో అంతర్గత రహదారులను సీసీగా మారుస్తుండగా ఆ నిబంధనలను పూర్తిగా విస్మరించారు. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, స్థానికుల ప్రోద్భలంతో వీధులన్నీ సిమెంట్మయంగా మారాయి. కొన్నిచోట్ల వృక్షాలను సైతం తొలగించి రోడ్డు నిర్మించారు. దీంతో కాలనీల్లో పచ్చదనం కరువైంది. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్, బాలానగర్, పానగల్ రోడ్, వేంకటేశ్వరస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో మూడునెలల కాలంలో పెద్ద సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. 25 ఏళ్ల కిందట ప్రజా వైద్యశాల పార్క్లో మొక్కలు నాటగా అవి ఏపుగా పెరిగాయి. పార్క్ నిర్వహణను పుర అధికారులు పట్టించుకోకపోవడంతో వైద్యులు డా. మురళీధర్, శారద పరిరక్షించారు. పార్క్ ప్రహరీ వెలుపల ఉన్న నివాసాలు దెబ్బతింటున్నాయని కలెక్టర్ను తప్పుదోవ పట్టించి చెట్లను విచ్ఛలవిడిగా తొలగించారు. రోడ్డుకు అడ్డుగా లేకపోయినా తొలగింపు నాయకుల ఒత్తిళ్లతో మిన్నకుంటున్న అధికారులు కన్నెత్తి చూడని అటవీ అధికారులు -
అమ్మ.. నాన్న.. ఫ్రెండ్
స్నేహమంటే ఇదేరా !ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025● తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే ప్రాధాన్యం ● మధురమైన జీవితంలో స్నేహబంధం మరుపురానిదని కితాబు ● మంచి స్నేహితులు ఒక్కరు చాలంటున్న యువత ● మారుతున్న పరిస్థితుల్లో విలువలు దిగజారుతున్నాయని ఆవేదన ‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. కడదాక నీడ లాగ నిను వీడిపోదునురా.. నీ గుండెలో పూచేటిదీ, నీ శ్వాసగా నిలిచేటిదీ ఈ స్నేహమొకటేనురా..’ ..స్నేహం గురించి తెలిపేలా ఓ కవి రాసిన మధుర గీతమిది. చిన్ననాటి నుంచి మొదలు చరమాంకం వరకు తీపి గుర్తులుగా మదిలో నిలిచేది స్నేహ బంధం. అందుకే జీవితంలో మధురమైనది, మరపురానిది అంటే స్నేహమేనని చెబుతారు. కాలంతో పాటు మారిన జీవన పరిస్థితుల్లో సైతం ఫ్రెండ్షిప్ అనేది యువత ఉన్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు వారు ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి నేస్తం కావాలి.. వారికి మీరిచ్చే స్థానం ఏమిటి ? వంటి తదితర అంశాలపై ‘సాక్షి’ ఒక చిన్న ప్రయత్నం చేసింది. నేడు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే ప్రాధాన్యం అంటూ యువతీ యువకులు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ న్యూస్రీల్సర్వే ఇలా.. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తిటౌన్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో 2025–26 విద్యాసంవత్సరం ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు గడుపు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు గడువు ఉందని.. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు అమరచింత: యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏడీఏ దామోదర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా, ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో అన్నిరకాల ఎరువులతో పాటు యూరియాను అందుబాటులో ఉంచుతుందన్నారు. కొందరు డీలర్లు అవసరం మేరకు యూరియా తెప్పించుకోలేకపోతున్నారని.. దీంతో రైతులు యూ రియా కోసం ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ అరవింద్, ఇతర సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: హైదరాబాద్ రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని ఎస్సీ కుల బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా జిల్లాకేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో పనివేళల్లో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు జిల్లా క్రీడాకారులు వనపర్తి రూరల్: పెబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థులు గణేష్, శిరీష లాంగ్జంప్ సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల అసోసియేట్ డీన్ డా. దుర్గం సకారం తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి శాలువాలతో సన్మానించారు. ఓఎస్ఏ డా. భానుప్రకాష్, ిపీడీ దామోదర్ పాల్గొన్నారు. కల్వరాల విద్యార్థిని.. వీపనగండ్ల: మండలంలోని కల్వరాల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మీనాక్షి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లాస్థాయి రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. అదనపు కలెక్టర్కు డిప్యూటేషన్ వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఫారెన్ సర్వీసు కింద హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి డిప్యూటేషన్పై వెళ్తున్నట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్టీఓ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయినట్లు పేర్కొన్నారు. -
టీచర్లకు తీపికబురు
●నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే.. ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫైల్ ప్రాసెస్ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 -
అర్హులందరికీ రేషన్ కార్డులు
వనపర్తి రూరల్: అర్హులందరికీ రేషన్కార్డు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెబ్బేరు మండలంలో 2,014, శ్రీరంగాపురం మండలంలో 345 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయిందని.. పాలకులే లబ్ధి పొందారు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. పార్టీలకతీతంగా పారదర్శకంగా అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. మహిళలకు రూ.360 కోట్లు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని.. రంగసముద్రం దగ్గర టూరిజంశాఖ ఆధ్వర్యంలో పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేవాలయం వద్ద రథోత్సవ సమయంలో ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ ఎద్దుల విజవర్ధన్రెడ్డి, తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, నాయకులు అక్కి శ్రీనివాసులుగౌడ్, సురేందర్గౌడ్, దయాకర్రెడ్డి, వెంకట్రాములు, రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
ఎరువుల విక్రయాలపై నజర్
మదనాపురం: ఎరువుల విక్రయాలపై నెలకొన్న సందిగ్ధతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎరువుల కొరత తలెత్తకుండా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టర్ సారథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు సరఫరా, విక్రయాల ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువుల విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాకుండా ప్రతి విక్రయ కేంద్రంలో నోటీసు బోర్డులు ఏర్పాటుచేసి వాటిపై ఎరువుల ధరలతో పాటు నిల్వల వివరాలు పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియా కొరత లేదు.. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించగా.. ఈసారి జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు అధికారులు పంపించారు. గతేడాది మాదిరిగా 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా.. 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, మిగతాది త్వరలో రానుందని చెబుతున్నారు. పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. జిల్లాలో ఎరువులు, యూరియా కొరత లేదు. వానాకాలం సీజన్కుగాను 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా.. ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. రైతులు మూస పద్ధతిలో ఎరువులను అధికంగా వాడకుండా మండల వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి నిరంతర పర్యవేక్షణ.. వారం రోజులుగా జిల్లాలోని ఎరువుల దుకాణాలను జిల్లా, మండల అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. దుకాణదారులు వచ్చిన ఎరువులను అధిక ధరలకు విక్రయించకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధరలు, నిల్వల పట్టిక దుకాణంలో రైతులకు కనబడేలా విధిగా ఏర్పాటు చేయాలని వత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను వాడవద్దని, అధికారుల సలహాలు లేకుండా పొలాల్లో మందులు వేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూర్, వీపనగండ్ల, శ్రీరంగాపురం, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో వరి అధికంగా సాగు చేస్తారు. -
తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన
వనపర్తి రూరల్: తల్లిపాల ప్రయోజనాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో పర్యటించారు. మొదట పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడివెల్నెస్ సెంటర్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం బలంగా, ఆరోగ్యంగా ఉంటారని.. శిశువు జన్మించిన 6 నెలల వరకు కచ్చితంగా తల్లిపాలు పట్టించాలన్నారు. అనంతరం కిసాన్ జంక్షన్ ఫర్టిలైజర్ దుకాణం, శ్రీరంగాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, గోదాంను తనిఖీ చేశారు. దుకాణాల బయట ప్రదర్శించిన సమాచార బోర్డులు, దుకాణం, గోదాంలో ఎరువులు, యూరియా నిల్వలను పరిశీలించారు. యూరియా, డీఏపీ నిల్వలు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చి చూశారు. జిల్లాల్లో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. అవసరం మేరకు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. ఎరువులకు ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఆవసరమైన మేరకు ఎరువులు ఇవ్వాలని.. కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా పోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, వైద్యాధికారి డా. ప్రవళిక, డా. పరిమళ, వ్యవసాయ అధికారులు షేక్ మున్నా, హైమావతి తదిరులు ఉన్నారు. -
నిర్వాసితుల అరిగోస
‘ఏదుల’ నిర్మాణంలో ముంపునకు గురైన రెండు గ్రామాలు పరిహారం రాలేదు.. అధికారులు విచారణకు వచ్చిన సమయాల్లో నేను ఇంటివద్దే ఉన్నా. కానీ నేటికీ నాకు రావాల్సిన పరిహారం రూ.12.54 లక్షలు, ఇతర బెనిఫిట్స్ రాలేదు. నాలాగే డబ్బులు రానివారు ఏడెనిమిది మంది ఉన్నారు. సారోళ్లు ఇప్పటికై నా గుర్తించి డబ్బులు అందేలా చూడాలి. – మిరిగిళ్ల శాంతమ్మ, కొంకలపల్లి విద్యుత్ సమస్య పరిష్కరించాలి.. ఎస్సీకాలనీలో విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు పాతి అలాగే వదిలేశారు. రాత్రివేళల్లో చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం కావడంతో విషపు పురుగులు సంచరిస్తున్నాయి. విద్యుత్, మురుగు సమస్య వెంటనే పరిష్కరించాలి. – మిద్దె మహేష్, బండరావిపాకుల (రేవల్లి) ఉన్నతాధికారులకు నివేదించాం కొత్త బండరావిపాకులలో ప్లాట్లు రానివారు బాధపడాల్సిన అవసరం లేదు. భూ సేకరణకు సంబంధించి గతంలో ప్రైమరీ నోటిఫికేషన్, పబ్లిక్ డిక్లరేషన్ ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు ముందుకుసాగుతాం. బండరావిపాకులలో మురుగు, విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమే. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. – లక్ష్మీదేవి, తహసీల్దార్, రేవల్లి గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2016లో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో మండలంలోని బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాలు ముంపునకు గురికాగా.. పునరావాసం క ల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయా గ్రామస్తులకు అధికారులు నచ్చజెప్పి భూ సేకరణ చేపట్టారు. ప్రస్తుతం రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతుండగా.. నేటికీ ఇచ్చిన హామీ మేరకు పునరావాసం, నష్ట పరిహారం, ప్లాట్ల కే టాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. నాటి పాలకులు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పి గ్రామాలు ఖాళీ చేయించారని, వారి మాటలు నమ్మి మోసపోయామని.. ప్రస్తుత పాలకులైనా తమను ఆదుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి.. బండరావిపాకులలో మొత్తం 987 మందిని నిర్వాసితులుగా గుర్తించిన అధికారులు.. పునరావాసం కోసం శానాయిపల్లి సమీపంలో 52 ఎకరాల్లో 520 ప్లాట్లు కేటాయించారు. మరో 467 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇందుకోసం అదే గ్రామ సమీపంలో స్థలాలు పరిశీలించగా గ్రామస్తులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. తమకు ఎక్కడ, ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారంటూ బాధితులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఖాళీ స్థలాలకు సంబంధించిన విచారణ కూడా పూర్తయినా నేటికీ డబ్బులు రాలేదు. అలాగే స్టాటిస్టికల్ ఎకనామికల్ సర్వే (ఎస్ఈఎస్) చేసినప్పుడు గ్రామంలోనే ఉండి డబ్బులు రానివారు సుమారు 20 మంది వరకు ఉన్నారని.. వారికి కూడా న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ● కొంకలపల్లి గ్రామస్తులకు 382 ప్లాట్లు ఇచ్చారు. ఈ గ్రామంలో సైతం ఎస్ఈఎస్ చేసినప్పుడు గ్రామంలోనే ఉండి నేటికీ డబ్బులు రాని వృద్ధులు ఏడుగురు ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు సైతం తక్కువ సంఖ్యలో కేటాయించారని.. ఇంటి నిర్మాణం చేపట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారని, అర్హులందరికీ మంజూరు చేయాలని ముంపు బాధితులు అధికారులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని నమ్మించి మోసం చేశారని నిర్వాసితులు బోరుమంటున్నారు. అరకొరగా పరిహారం పంపిణీ పునరావాస గ్రామంలో సమస్యల వెల్లువ వేధిస్తున్న విద్యుత్, మురుగు సమస్య 450 మందికి లభించని ప్లాట్లు -
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్: సమగ్ర తెలంగాణ క్రీడా విధానం–2025ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్యార్డులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి స్పోర్ట్స్ కాంక్లెవ్ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్ సమావేషంలోనే నూతన క్రీడా విధానం ఆమోదింపబడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగ నిష్ణాతులు, క్రీడాసమాఖ్యల ప్రతినిధులతో కలిసి విస్తృతస్థాయిలో స్పోర్ట్స్ కాంక్లెవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు, మట్టిలోని మాణిక్యాలను ప్రపంచ ఛాంపియన్లుగా అందించేందుకు నూతన క్రీడావిధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సాట్ బాధ్యతలు మరింత విస్తృతం.. నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్) బాధ్యతలు మరింత విస్తరించనున్నాయని.. రాష్ట్రం నుండి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఏడాది కాలంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపుస్థాయిలో చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్కుమార్రెడ్డి, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, మాజీ ఎంపీపీ డా. శ్రీధర్గౌడ్, నాయకులు పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, భాస్కర్, మశ్ఛందర్గౌడ్, అజ్మతుల్లా, షాలం, రఫీక్, దామోదర్, సాయిరాఘవ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలి
వీపనగండ్ల: సిబ్బంది పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని.. అప్పుడే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, గ్రామానికి ఒక పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడించారు. నేరాల నియంత్రణకు రాత్రిళ్లు పటిష్టంగా గస్తీ నిర్వహిస్తామని, ఏవైనా ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మెలుగుతూ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించినప్పుడే ఆ స్టేషన్కు మంచి పేరు వస్తుందన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్రావు, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ రాణి, మంజునాథరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ.. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం మండలంలోని పుర్గర్చర్లలో గ్రామ రైతు సంఘం, మహిళా సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని.. గ్రామాల్లో ఏర్పాటు చేసుకుంటే శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ రావుల గిరిధర్ -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు.. మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
మాధవరెడ్డి ఎత్తిపోతలకు గ్రీన్సిగ్నల్
వనపర్తిటౌన్: ఖాసీంనగర్ (మాధవరెడ్డి) ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారని.. దీంతో 6 గ్రామాలు, 13 తండాల్లోని 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖాసీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాలతో పాటు మరో 13 గిరిజన తండాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఖాసీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్గా నామకరణం హర్షణీయమని, ఆయన వైద్యసేవలను గుర్తిస్తూ సీఎం పేరు పెట్టారని వివరించారు. రామన్నగట్టు రిజర్వాయర్కి నీరు తెచ్చి మూడు లిఫ్ట్ట్ల ద్వారా సాగునీరు అందిస్తామని, మొదటి లిఫ్ట్ ద్వారా ఖాసీంనగర్లోని వెయ్యి ఎకరాలకు, రెండో లిఫ్ట్ ద్వారా దత్తాయపల్లి, అంజనగిరిలోని వెయ్యి ఎకరాలకు, మూడో లిఫ్ట్ ద్వారా జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లిలోని రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగునీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్మియా, సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్రెడ్డి, మెంటెపల్లి రాములు, అబ్దుల్లా, కమర్ రహమాన్, గడ్డం వినోద్, రాగి అక్షయ్, నాగార్జున, ఇర్ఫాన్, చరణ్, రాంబాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
నేడు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఈ ఎంపికలు నిర్వహిసున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు సాయంత్రం 4 నుంచి ప్రారంభించే ఎంపికల్లో పాల్గొనాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 85001 65900 సంప్రదించాలని సూచించారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు గోపాల్పేట: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కొండలు, ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేశారని ఆరోపించారు. తాను కేవలం ప్రజల కోసం పని చేస్తున్నానని.. ఎన్నికల ముందు ప్రకటించిన ఆస్తులు, ఎన్నికల తర్వాత తన ఆస్తులు చూపిస్తానని తెలిపారు. మూడు మండలాల్లో మొత్తం 3,500 రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తున్నామని.. పెట్రోల్బంకు నిర్వహణ సైతం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పనిని గుర్తించి ఓట్లు వేయాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని.. ప్రతి మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఇన్చార్జ్స సత్యశిలారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రఘు, మూడు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికిస్థల పరిశీలన పాన్గల్: మండలానికి మంజూరైన 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్లో ఆర్డీఓ సుబ్రమణ్యం మండలస్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోప్లాపూర్ శివారు సర్వేనంబర్ 61, కిష్టాపూర్ శివారులోని సర్వే నంబర్ 32ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 10 ఎకరాల స్థలం అవసరమవుతుందని.. పక్కపక్కనే ఉన్న ఈ రెండు సర్వేనంబర్లలో నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంట ఇన్చార్జ్ తహసీల్దార్ అబ్రహంలింకన్, ఆర్ఐ మహేష్, సర్వేయర్ ఇలాయత్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, మల్లేష్ తదితరులు ఉన్నారు. బుద్దారం చెరువుకు గండి గోపాల్పేట: మండలంలోని బుద్దారం పెద్ద చెరువు (మినీ రిజర్వాయర్) అలుగు వద్ద గురువారం కట్ట తెగింది. రైతులు వెంటనే నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పొక్లెయిన్తో మట్టి వేసి మూసివేశారు. ఈ విషయాన్ని కేఎల్ఐ డీఈ గఫార్ వద్ద ప్రస్తావించగా.. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ ఎక్కువ తెరవడంతో కొంత కట్ట తెగిందన్నారు. సిబ్బంది వెంటనే స్పందించి కట్టను పునరుద్ధరించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.