Wanaparthy
-
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
వనపర్తి రూరల్: గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సుధారాణి అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల రైతువేదికలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు సీడీపీఓ హజీరాబేగం, సర్పంచ్ జి.శోభ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోషక విలువలు, బాలింతలు, గర్భిణులు, నవజాత శిశుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. సీడీపీఓ హజీరాబేగం మాట్లాడుతూ.. రోజు తీసుకునే ఆహారంలో పోషక విలువలున్న ఆకు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని.. అందులో భాగంగానే పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాంబాబు, అంగన్వాడీ సూపర్వైజర్లు బాలీశ్వరి, రాణి, సంహిత, భారతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పారదర్శకంగా దుకాణాల కేటాయింపు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత మార్కెట్లో ఉన్న 32 దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, ఒక బాంకెట్ హాల్ను లాటరీ పద్ధతిన అత్యంత పారదర్శకంగా కేటాయించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వెల్లడించారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని దుకాణాల కేటాయింపును మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 32 దుకాణాలు, సూపర్ మార్కె ట్, బాంకెట్హాల్కు 318 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిన కేటాయించినట్లు చెప్పారు. మార్కెటింగ్శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, డీఎం స్వరణ్సింగ్, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఇతర అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. -
క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మర్రికుంట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్, హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించడంతో పాటు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందన్నారు. వేసవి శిబిరం మే నెల 29 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల వంట గదిని పరిశీలించి స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీ విద్యార్థులు సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ‘పరిషత్’ సందడి!
ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ● ఓటరు జాబితా, ఉద్యోగుల గుర్తింపు, శిక్షణలు ఇప్పటికే పూర్తి ● ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు ● పెరగనున్న స్థానాలు మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రియ తప్పదా..? అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు.. గత పరిషత్ ఎన్నికల సమయంలో జిల్లాలో 128 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఈసారి ఐదు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం పెరిగింది. నాగర్కర్నూల్ జిల్లా నుంచి కొన్ని గ్రామాలను వనపర్తి జిల్లాలో విలీనం చేయడంతో మాచుపల్లి, గుండ్యావాల్యానాయక్తండా, సింగాయపల్లి, ముతిరెడ్డిపల్లి, గొల్లపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పాటు కావడంతో పాటు ఏదులను మండలం చేసి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని పెంచారు. ప్రస్తుతం 133 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పెరిగిన ఐదు ఎంపీటీసీ స్థానాలు, ఒక మండలం వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. వనపర్తి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి ఒకరోజు అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన చిక్కుముడితో వాయిదా పడిన విషయం పాఠకులకు విధితమే. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం మరోసారి మే నెలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించడంతో పల్లెల్లో మళ్లీ ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో బుజ్జగింపులతో రాజీపడి పోటీ నుంచి తప్పుకున్న వారు, ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనుకున్నవారు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబినేట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు గ్రామీణ నాయకులు ముమ్మరం చేస్తున్నారు. 2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఓటరు జాబితా సవరణ.. -
హిందూధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ కృషి
కొత్తకోట రూరల్: హిందూ సమాజ ఐక్యత, దేశ సమగ్రతకు రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించబడిందని అంబత్రయ క్షేత్రం వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అమడబాకులలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఐక్యతను కాపాడటం, హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశభక్తిని పెంపొందిస్తూ సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి హిందువు తన ధర్మ సూత్రాలను పాటిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని.. మతమార్పిడి వంటి చర్యలతో సమాజంలో విభేదాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని, హిందువులు ఐక్యంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంపర్క్ ప్రముఖ్ గుర్రం సంజీవ, సర్పంచ్ గాయత్రి, ఖండ సంఘచాలక్ మురళీధర్, నిర్వాహకులు సురేంద్రనాథ్, ప్రకాష్, శ్రీనివాసులు, జ్ఞానేశ్వర్, పవన్, అమరేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ను కలిసి సమస్యలు విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వేసవి జాగ్రత్తలు వివరించాలి వీపనగండ్ల: వేసవిలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యాలయను వారు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తోందని.. ఉత్తమంగా రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ‘మిషన్ భగీరథ’తో సంపూర్ణ ఆరోగ్యం ఖిల్లాఘనపురం: మిషన్ భగీరథ నీటితో ఆరోగ్యంగా ఉంటారని మిషన్ భగీరథ డీఈ హరీశ్ అన్నారు. సోమవారం మండలంలోని ఆగారం గ్రామంలో హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఏఈ నరేష్, సర్పంచ్ బొక్కెన నర్సమ్మ, ఉప సర్పంచ్ మున్నూరు రవి, మహిళా సంఘాల సభ్యులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటిలో మనిషికి అవసరమైన లవణాలు ఉంటాయని చెప్పారు. గ్రామంలో 40 కేఎల్, 30 కేఎల్ ట్యాంకులు రెండు ఉన్నాయని.. మొత్తం 198 ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతంలో కొంతమేర పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవితేజ, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి ఆత్మకూర్: పుర పరిధిలోని నివాస గృహాలు, దుకాణాలు, కొళాయి బిల్లులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ శశిధర్ కోరారు. సోమవారం వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కో–ఆప్షన్కు 12 దరఖాస్తులు.. స్థానిక పురపాలికలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకుగాను సోమవారం వరకు 12 దరఖాస్తులు వచ్చాయని పుర కమిషనర్ చికినె శశిధర్ తెలిపారు. మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 23న స్కూృటినీ, అభ్యర్థుల ప్రకటన, 24న ఎన్నిక జరగనుందని వివరించారు. -
విద్యార్థి దశ జీవితానికి పునాది
వనపర్తి రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని, తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. సోమవారం పెబ్బేరు మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన చివరి సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయనతో పాటు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, సాంకేతిక విద్యలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పుర చైర్మన్ మాట్లాడుతూ.. పుర పరిధిలోని విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల కనీస సౌకర్యాల కల్పనకు తమవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పంపిన క్రీడా కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్స్పాల్ జయచంద్ర, ఎస్ఐ దివ్యారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
ఖిల్లాఘనపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జెడ్పీ సీఈఓ యాదయ్య విద్యార్థులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహయ్యతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని ఉపాధ్యాయులు ఆయనకు తెలిపారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఆహార పదార్థాలు, బియ్యం, పప్పులు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఖిల్లాఘనపురంలో ఇంగ్లిష్, తెలుగు మీడియం కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయని, ఇంటర్ తరగతులను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒకేషనల్ కోర్సులో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
వరి కోతలు షురూ!
● జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు ● జూరాల ఆయకట్టులో ముమ్మరం యాసంగిలో వరి సాగుకు పెట్టుబడి బాగా పెరిగింది. యూరియా, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు కూలీల కొరతతో ఖర్చులు గతానికన్నా ఎకరాకు రూ.10 వేల మేర పెరిగింది. మొత్తంగా ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు అయింది. – మైను, రైతు, నందిమళ్ల అన్ని గ్రామాల్లో వరి కోతలు ఒకేసారి ప్రారంభం కావడంతో యంత్రాల కొరత అధికమైంది. యంత్రాలకు ఽడిమాండ్ పెరిగి యజమానులు అద్దె సైతం పెంచారు. గంటకు రూ.2,600, ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వతో పాటు బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు సకాలంలో చేతికందుతున్నాయి. దీంతో రైతులు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. యాసంగిలో సాగు చేసిన వరి పంటలకు తెగుళ్లు విపరీతంగా సోకడంతో వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సకాలంలో మందులు పిచికారీ చేయడంతో పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి కోతలకు కూలీల కొరత తలెత్తడంతో యంత్రాలను వినియోగించి నూర్పిళ్లు చేపట్టి మార్కెట్కు తరలించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వారం నుంచి వరి కోతలు ముమ్మరం కావడంతో యంత్రాలకు డిమాండ్ పెరిగింది. – జిల్లాలోని 14 మండలాల్లో ఈసారి యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఈసారి పంట నష్టాన్ని అధిగమించినా.. వ్యవసాయ కూలీల కొరత కారణంగా మరోమారు వరి కోతలకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా ఉండటంతో గ్రామాల్లో ఒక్కో కూలీకి రోజువారి 450 నుండి రూ.500 వరకు చెల్లిస్తున్న పరిస్థితులు దాపురించాయి. జూరాల ఆయకట్టులో.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో పంట కోతల పండుగ మొదలైంది. వారబందీ విధానంలో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే నీరు వదలడంతో వరి సాగు చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో అధికారులు వేసవిలో తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎడమ కాల్వ ఆయకట్టు 85 వేల ఎకరాలు ఉండగా.. కేవలం 20 వేల ఎకరాలు అదికూడా రామన్పాడ్ ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో వదలడంతో తక్కువ ఆయకట్టులో వరి సాగైంది. -
రక్తశుద్ధికి అభయాలసిస్
● ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు ● నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట ● మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు ● పాలమూరువ్యాప్తంగా 908 మంది బాధితులు ●వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు కొత్తగా మంజూరైన డయాలసిస్ కేంద్రాలు ఇలా.. జిల్లా యూనిట్ పడకలు గద్వాల వడ్డేపల్లి 5 గద్వాల గట్టు 5 గద్వాల అయిజ 5 వనపర్తి ఖిల్లాఘనపురం 5 వనపర్తి రేవల్లి 5 వనపర్తి వీపనగండ్ల 5 నారాయణపేట కోస్గి 5 నారాయణపేట మద్దూరు 5 నాగర్కర్నూల్ లింగాల 5 నాగర్కర్నూల్ అమ్రాబాద్ 5 నాగర్కర్నూల్ తిమ్మాజిపేట 5 పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. మహబూబ్నగర్లో 10, బాలానగర్లో 5, నారాయణపేటలో 10, మక్తల్లో 5, ఆత్మకూర్లో 5, వనపర్తిలో 10, నాగర్కర్నూల్లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. 5 పడకల చొప్పున.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీలు లేదా సివిల్ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. -
సంక్షేమ వారోత్సవాలు ఘనంగా చేయాలి
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు అన్ని సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో నిర్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేసి వంటగది శుభ్రత, ఇతర స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మెస్ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలని, స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా చూడాలని సూచించారు. అదేవిధంగా వంట సరుకుల గడువు ముగింపు తేదీని పరిశీలించాలన్నారు. సూపర్వైజర్ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. భవనాల మరమ్మతులు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంపించిన గూగుల్ ఫామ్లో నమోదు చేయాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగోరోజు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ప్రభుత్వం అమలు చేస్తున్న సౌకర్యాలపై వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీంకు సంబంధించిన వాల్పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, హౌసింగ్ పీడీ విఠోబా, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోరాటయోధుడు బసవేశ్వరుడు.. సమాజంలో మూఢ నమ్మకాలు బలంగా ఉన్న రోజుల్లో తన బోధనలతో ప్రజలను కాపాడిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. లింగాయత ధర్మం స్థాపించి చిరుప్రాయంలోనే శివపురాణం గాధలను అవగతం చేసుకున్న మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
పాన్గల్: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.42.12 లక్షలతో అదనపు మౌలిక వసతులు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ, రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్రీడా మైదానం తదితర సమస్యలున్నాయని మంత్రికి వివరించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సర్వేచేసి నివేదిక అందించాలని తహసీల్దార్ను మంత్రి ఆదేశించారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని.. ఆరోగ్యంగా ఉంటేనే చదవడం, ఆటలు ఆడటం సాధ్యమని చెప్పారు. చదువు సమాజాన్ని సంస్కరించేదిగా ఉండాలని.. రోజు విద్యార్థులకు మహనీయుల చరిత్రను వివరిస్తూ వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. బాలికలు పొడువుకు తగిన బరువు ఉండేలా చూడాలని.. అందుకు తగిన ఆహారం అందించాలన్నారు. మూడు నెలల తర్వాత విద్యాలయాన్ని సందర్శించినప్పుడు మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి బలోపేతానికి తోడ్పాటునందించాలని కోరారు. చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యమే.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
రైతుల సంక్షేమానికే కేంద్రాల ఏర్పాటు
కొత్తకోట రూరల్/మదనాపురం: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి కొత్తకోట, మదనాపురం మండలం రామన్పాడ్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర లభించి లాభపడతారని.. దళారులను ఆశ్రయిస్తే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడంతోనే అధికారానికి దూరమైందని విమర్శించారు. అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్ష నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో పుర చైర్పర్సన్ పి.అరుణ, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు మేస్త్రి శ్రీనివాసులు, కౌన్సిలర్లు ఎన్జే బోయేజ్, అబ్దుల్ నబీ, చంద్రకాంత్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, మోహన్రెడ్డి, సుభాష్, ముజీబ్, చీర్ల యాదయ్యసాగర్, రామన్పాడులో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ అఫ్రీన్బేగం అంజాద్అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ రాజవర్దన్రెడ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
తాగునీటికి ఢోకా లేనట్టే!
కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదో తరగతికి సంబంధించి 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,389 మంది పరీక్ష రాయనున్నారు. అలాగే ఇంటర్కు సంబంధించి 29 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,782 మంది విద్యార్థులు ఇంటర్ 29 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరీక్ష కేంద్రాల్లో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లతోపాటు ఏఎన్ఎంలను కూడా పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. ‘మిషన్ భగీరథశ్రీకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు రోజూ 0.02 టీఎంసీలు అవసరం మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాపీయింగ్ను అరికట్టేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ -
నేడు మంత్రి వాకిటి శ్రీహరి రాక
ఆత్మకూర్: తెలంగాణ పశువర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈఓ వాకిటి నరేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక మార్కెట్యార్డు, 10.30 గంటలకు మూలమళ్ల, 11 గంటలకు జూరాల, 11.30 గంటలకు దేవరపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు తిప్పడంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వివరించారు. ప్రశాంతంగా ‘ఆదర్శ’ ప్రవేశ పరీక్ష కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకులలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్గౌడ్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12 వరకు పరీక్ష నిర్వహించగా 364 మంది విద్యార్థులకుగాను 275 మంది హాజరుకాగా, 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షలో 217 మంది విద్యార్థులకుగాను 159 మంది హాజరుకాగా 58 మంది విద్యార్థులు రాలేదు. చేనేత ఓటరు జాబితా ప్రదర్శన అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం అమరచింత చేనేత సహకార సంఘంలో ఓటరు జాబితాను ప్రదర్శించారు. సంఘంలో మొత్తం 766 మంది ఓటర్లు ఉన్నట్లు అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్ తెలిపారు. ఓటరు జాబితాను డైరెక్టర్లతో కలిసి నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రదర్శించి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం మరోమారు జాబితాను రూపొందించి ఏడీ కార్యాలయంలో సమర్పిస్తామని వివరించారు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో ఓటరు జాబితా ప్రదర్శన పూర్తిచేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని చేనేత జౌళిశాఖ ఏడీ పద్మ తెలిపారు. వచ్చే నెల 15 వరకు పూర్తిస్థాయి ఓటరు జాబితా సిద్ధం చేసి పంపనున్నట్లు వివరించారు. -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
కొత్తకోట రూరల్: ప్రజలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని కొత్తకోట అగ్నిమాపక అధికారి దేవేందర్రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సినిమా థియేటర్లు, జన సంచార ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడుడు ప్రజలు నేలకు దగ్గరగా వంగి లేదా మోకాళ్లపై పాకుతూ బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్లను వాడకుండా మెట్ల మార్గం వినియోగించాలన్నారు. పొగ నుంచి బయటకు రావాల్సిన సమయంలో ముక్కు, నోరు కప్పుకోవడానికి తడి గుడ్డ లేదా రుమాలు ఉపయోగిస్తే శ్వాస ఇబ్బంది తగ్గుతుందన్నారు. అలాగే సినిమా ప్రదర్శన మధ్యలో ఫైర్ అలారం మోగితే వెంటనే బయటకు రావాలని, వ్యక్తిగత వస్తువుల కోసం వెదకకుండా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. థియేటర్ యాజమాన్యం ప్రమాదం సంభవించిన వెంటనే అత్యవసర ద్వారాలను తెరవడం, లైట్లు వెలిగించడం, ప్రేక్షకులు ప్రశాంతంగా బయటకు పంపే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, సూచనలు పాటిస్తే అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించవచ్చని వివరించారు. కరపత్రాలు పంపిణీ.. ఆత్మకూర్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మార్ట్లు, ఇతర ప్రాంతాల్లో ఆదివారం సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విన్యాసాలతో క్లుప్తంగా వివరించారు. అగ్నిమాపక అధికారి సంజీవరెడ్డి బహుళ అంతస్తుల్లో ప్రజలు ప్రమాదాల బారినపడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. చివరిరోజు సోమవారం ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది రాముడు, నాగార్జున, వెంకట నర్సింహయ్య, భీమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
సైబర్.. ఫీవర్!
అమాయకులను చిత్తు చేస్తున్న మోసగాళ్లు ●అవగాహనతోనే నేరాల నియంత్రణ.. జిల్లాలో కొంతకాలంగా సైబర్ క్రైం విభాగం డీఎస్పీ, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్హెచ్ఓల సాయంతో విచారణ చేపడుతున్నాం. ఎక్కడా ఇబ్బందులు కలుగలేదు. సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కొత్త పంథాల్లో వల పన్ని అమాయకులను మోసం చేస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే కాల్స్కు ఎవరూ స్పందించొద్దు. బ్యాంకర్లు రుణాలు ఇస్తామంటూ ఫోన్లు చేయరు. ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్పీ పేరుతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తే సమాచారం ఇవ్వండి. – రవిప్రకాష్, ఎస్ఐ, సైబర్క్రైం విభాగం, వనపర్తి వనపర్తి: పోలీసు అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న డిజిటలైజేషన్తో సైబర్ నేరాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. పోలీసులు ఓ వైపు సాంకేతికతను వినియోగించి సైబర్ నేరాలను ఛేదిస్తున్నా.. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ నెల నాలుగో తేదీన గోపాల్పేటకు చెందిన వి.నర్సింహకు బజాజ్ ఫైనాన్స్లో రూ.5 లక్షల రుణం మంజూరైందని.. ప్రాసెసింగ్ ఫీజు, అప్రూవల్ ఫీజు, జీఎస్టీ పేరుతో సుమారు రూ.77,400 స్వాహా చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కొత్త పంథాలతో మోసగిస్తున్న వైనం జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు తాజాగా గోపాల్పేటలో రుణం ఇప్పిస్తామంటూ రూ.77,400 స్వాహా -
మట్టితో కోట నిర్మాణం..
గద్వాల: గద్వాల కోట 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గద్వాల సంస్థానం 17వ శతాబ్దం (1663– 1670)లో నల్లసోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) పూడూరు కేంద్రంగా గద్వాల కోట నిర్మించారు. కర్ణాటక సరిహద్దులోని రాయచూరు, రాయలసీమలోని నందికొట్కూరు వరకు పాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. దీని లోపల అద్భుతమైన శిల్పకళతో కూడిన చెన్నకేశవస్వామి ఆలయం, ఆలయం ఎదుట 90 అడుగుల గాలిగోపురం నిర్మించారు. కృష్ణానది, తుంగభద్ర నదుల మ ధ్య గద్వాలలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మి ంచిన కోట చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం ఉంది. ఈ కోట వలయాకారంలో నిర్మించగా.. లోపలి వైపు రాతి తో కూడిన గోడ కట్టారు. కోటలోపల కందకం, బావి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోటలో ప్రముఖ నటుడు చిరంజీవి కొండవీటిరాజా సినిమాను నిర్మించారు. -
డబ్బులు అడుగుతున్నారు..
నాకు మూడు ట్రిప్పుల ఇసుక అవసరం ఉంది. మీ–సేవా కేంద్రంలో ఈ నెల 2న బుక్ చేసుకుంటే బుధవారం వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు రూ.500 అదనంగా ఇవ్వలేదని పంచాయితీ పెట్టుకున్నారు. ఒకరు మొత్తం ఇసుక పోసిపోగా.. మరొకరు కొంత ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. గురువారం ఒకతను ఫోన్చేసి ట్రిప్పు ఇసుక వస్తుంది.. రూ.500 ఇస్తావా అని డిమాండ్ చేస్తున్నారు. ఇస్తానన్నా తీసుకురాలేదు. – గాజులపేట నాగయ్య, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వారు ట్రాక్టర్ల వారికి తిరిగి డబ్బులు ఇవ్వరాదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ట్రాక్టర్ నంబర్, బుక్ చేసుకున్న ఐడీ ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సుగుణ, తహసీల్దార్, ఖిల్లాఘనపురం ఖిల్లాఘనపురం మండలం అంతాయపల్లి శివారులో ఇసుక రీచ్ ఏర్పాటు చేశాం. ఇసుక అవసరమైన వారు మీ–సేవా కేంద్రాల్లో చూపిన ప్రకారం డబ్బులు చెల్లించాలి. ట్రాక్టర్ల వారు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు ఇస్తే ట్రాక్టర్ను ఇసుర తరలించకుండా రద్దు చేస్తాం. ఎవరికి కూడా అదనంగా డబ్బులు ఇవ్వకూడదు. – సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి ● -
ఇష్టారాజ్యం!
● ట్రిప్పునకు రూ.500 డిమాండ్ చేస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులు.. తనకేమీ సంబంధం లేదంటున్న ఎస్ఆర్ఓ ఖిల్లాఘనపురం: మండలంలోని అంతాయపల్లి శివారులో ఉన్న రీచ్ నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను వివిధ ప్రాంతాలకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి తరలిస్తుంటారు. ఈ ఇసుక తరలింపునకు గతంలో కొందరు ట్రాక్టర్ల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వేసవి కావడంతో చాలామంది ఇళ్లు, ప్రహరీల నిర్మాణాలకు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుంటున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక తరలింపునకు ప్రభుత్వం రీచ్లో ఓ అఽధికారిని నియమించింది. ఆయన నిత్యం వరుస క్రమంలో ఇసుక బుక్ చేసుకున్న వారికి పంపిస్తున్నారు. కిలోమీటర్ల ఆధారంగా ధర.. అంతాయపల్లి రీచ్ నుంచి మండలంతో పాటు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు ఇసుక తరలింపునకుగాను ప్రభుత్వం కిలోమీటర్ల ఆధారంగా ధర నిర్ణయించింది. ఇసుక అవసరం ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న వారికి వరుస క్రమంలో ఇళ్ల దగ్గరకు ఇసుక వస్తోంది. డబ్బులు డిమాండ్.. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల నిర్వాహకులు మాత్రమే రీచ్ నుంచి ఇసుక తరలింపునకు అవకాశం ఉంది. తమను కాదని ఎవరి ట్రాక్లర్లు వస్తాయిలే అనుకున్న యజమానులు ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రీచ్ నుంచి అప్పారెడ్డిపల్లికి ఇసుకతో వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు ఒక్కో ట్రాక్టర్కు రూ.500 చొప్పున రూ.వెయ్యి అదనంగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించామని.. తిరిగి ఎందుకివ్వాలని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డబ్బులు ఇవ్వనందుకు ఓ ట్రాక్టర్ యజమాని 25 శాతం ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్లో ఉండే ఎస్ఆర్ఓ తనకేమీ తెలియదని.. ట్రాక్టర్ల వారికి అద్దె పడితే వస్తారు లేదంటే రారుంటూ జవాబిచ్చారు. ఎప్పట్నుంచో ఇస్తున్నారంట కదా... ఇప్పుడిస్తే ఏమైతుందని మాట్లాడటం విస్మయానికి గురిచేస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పక్కాగా వివరాల నమోదు
కొత్తకోట రూరల్: జనగణన ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి చేరుకొని వివరాలను పక్కాగా డిజిటల్ యాప్లో నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. 2027 జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి పనులను డీఆర్డీఓ, డీపీఓతో కలిసి పరిశీలించారు. గ్రామంలోని సీఎస్సీ కేంద్రం, గ్రామపంచాయతీ నర్సరీలు, కోళ్ల షెడ్ను సందర్శించి నిర్వహణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుద్ధారం గ్రామపంచాయతీలో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును పరిశీలించారు. కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని, ప్రజలకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీగా రాజేష్ మీనా వనపర్తి: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా రాజేష్ మీనాను నియమిస్తూ శనివారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పోస్టు కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. రైస్మిల్పై కేసునమోదు ఖిల్లాఘనపురం: మండల పరిధిలోని సోళీపురం గ్రామంలో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ ఇండస్ట్రీస్ రైస్మిల్లుపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగమైనట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎన్.ఆంజనేయులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 2022–23 వానాకాలం, 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం సీజన్లలో ప్రభుత్వం నుంచి వరి ధాన్యం కేటాయించగా.. ఇందుకు సంబంధించిన సీఎంఆర్ అప్పగించలేదని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గణనీయమైన ధాన్యం లోటు కనిపించిందని.. ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్మార్కెట్కు మళ్లించినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
డీలిమిటేషన్ను మహిళా బిల్లుతో లింక్ పెట్టడం సరికాదు
● రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేషన్ మహబూబ్నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో లింక్పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా జనగణన నిర్వహణ
వనపర్తి: ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లే ముందు తమకు ఇచ్చిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరి పరిధిలో వారే జనగణన చేపట్టాలని, కిచెన్ ఆధారంగా హౌస్హోల్డ్ని నిర్ణయించాలని సూచించారు. ప్రజలు సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తే, వారి వ్యక్తిగత సమాచారం ఎక్కడా వినియోగించడం జరగదని.. కేవలం జనగణన కోసం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలన్నారు. డబుల్ ఎన్యూమరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. సీపీఓ హరికృష్ణ, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, శిక్షకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సంక్షేమ వారోత్సవాలను పక్కాగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజు ఏప్రిల్ 20న అన్ని సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్, రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో మరమ్మతులు చేపట్టాలని, నాలుగో రోజున విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సౌకర్యాలను వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజసానికి చిహ్నం
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. -
అమ్మాపురంలో మకాం..
గోపాల్పేట: గోపాల్పేట సంస్థానం 19వ శతాబ్దంలో ఏర్పాటైంది. ఈ సంస్థానం రాణి రంగనాయకమ్మ తన భర్త గోపాల్రావు పేరిట గోపాల్పేట అనే పేరు పెట్టారు. ఇక్కడి సంస్థానంతో వనపర్తి సంస్థానాధీశులకు సంబంధాలు ఉండేవని చరిత్రచెబుతోంది. ఈ సంస్థానం పరిధిలో 12 గ్రామాలుండగా.. రాణి రంగనాయకమ్మ గ్రామంలో వేలాది మందికి అన్నదానం చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి కోట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు ముక్కెర వంశీయులు పాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పాలన సాగింది. 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
మామిడి రైతులకు ప్రోత్సాహం
వనపర్తి: మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం ‘అమ్మకందారులు.. కొనుగోలుదారులు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మామిడి పంటకు సంబంధించి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఉద్యానశాఖ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల అభివృద్ధి సంస్థ, ఎన్హెచ్బీ, ప్రసాద్ సీడ్స్ సంస్థ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన 140 మంది రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రదర్శించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పరిశీలించి రైతులతో మాట్లాడి పండ్ల ప్రత్యేకతను తెలుసుకోవడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వ్యాపారులు మామిడి రైతుల వద్దకే వచ్చి మంచి ధరకు పండ్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి చక్కటి అవకాశమని.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. మామిడి రైతులకు కవర్లు అందజేయడం గొప్ప విషయమని, ఇంకా ఎవరికై నా ఇవ్వకపోతే వెంటనే అందజేయాలని సూచించారు. మొత్తం 12 మంది వ్యాపారులు పాల్గొని 40 మంది రైతుల నుంచి 250 టన్నుల మామిడిపండ్ల ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఉద్యానశాఖ జేడీ బాబు, డీహెచ్ఎస్ఓ విజయభాస్కర్, ఏపీ ఎగుమతిదారుల అభివృద్ధి సంస్థ ఏపీఎం ఆర్బీ నాయుడు, ప్రసాద్ సీడ్స్ సీఈఓ విజయభాస్కర్, శాస్త్రవేత్త వెంకటలక్ష్మి, రవి, లక్ష్మి, ఏడీలు పద్మనాభం, జయరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్ తప్పనిసరి.. మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే 10 శాతం బ్యాంకు గ్యారెంటీతో పాటు అగ్రిమెంట్ తప్పనిసరి అని కలెక్టర్ ఆదర్శ సురభి మిల్లర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూ.కోట్ల వరి ధాన్యం మిల్లులకు అడ్వాన్సుగా ఇస్తుందని.. కేటాయించిన ధాన్యంలో 10 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకు గ్యారెంటీ లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరగవని స్పష్టం చేశారు. యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయని.. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించి బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్లకు సరిపడా ధాన్యం మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. డిఫాల్ట్ మిల్లర్లు త్వరగా క్లియర్ చేసుకొని ధాన్యం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మరింత గడువు ఇచ్చిందని.. గత సీజన్కు సంబంధించి పెండింగ్ బియ్యం త్వరగా ఎఫ్సీఐకి అప్పగించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు, మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్రెడ్డి, మిల్లర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చాలి : బీజేపీ
వనపర్తిటౌన్: ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో వనపర్తి డివిజన్ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు సందర్శించి వారికి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధర్నాలు, సమ్మెలు చేస్తున్న వారిని ఉద్దేశించి వీటిని పరిష్కరించడం టీ తాగిన సమయం కాదని గొప్పగా చెప్పారని.. ఇప్పటిదాకా ఆ సమయం రాలేదా అని ప్రశ్నించారు. ఆర్టిజన్లు తమ డిమాండ్లు పూర్తిగా సాధించే వరకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆదేశాల మేరకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఎద్దుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ నిరసన
వనపర్తిటౌన్: రెండో పీఆర్సీని జూన్ 2లోగా ప్రకటించాలని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.అశోక్కుమార్, ప్రధానకార్యదర్శి ఎస్.వరప్రసాద్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక అండ్ పింఛన్ల కార్యాచరణ సమితి) ఆధ్వర్యంలో రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, మేనిఫెస్టోలో ప్రకటించినట్లు సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 61 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు విడతల కరువు భత్యం చెల్లించి న్యాయం చేయాలన్నారు. ముఖ్యమైన 64 డిమాండ్లలో కేవలం నాలుగింటినే పరిష్కరించాలని కోరుతున్నామని, స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బౌద్ధారెడ్డి, ఎస్.చంద్రశేఖర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ స్టాఫ్ ప్రధానకార్యదర్శి రషీద్, డీటీఎఫ్ తరఫున మద్దిలేటి, శివారెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, టీజీహెచ్ఎంఏ జిల్లా ప్రధానకార్యదర్శి బాణం విష్ణు, టీఎన్జీఓ జిల్లా ప్రధానకార్యదర్శి రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజనయ్య, నర్సింహులుగౌడ్, కార్యదర్శి జగపతిరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బీసీలు 54.82%
వనపర్తి● కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు ● ఇందులో బీసీలు 20,29,001 మంది ● బీసీల్లో ముదిరాజ్లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం ● గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు ● కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం ● రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్లో వెల్లడి తుది సమావేశం.. జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గానికి మే నెల 6న గడువు ముగియనుండగా చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్కర్నూల్లో 61.06 శాతం, మహబూబ్నగర్లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా.. సామాజికవర్గం జనాభా మాదిగ (ఎస్సీ) 1,04,613 మాల (ఎస్సీ) 16,873 బంజార(ఎస్టీ) 1,12,127 ముదిరాజ్ (బీసీ) 1,34,794 యాదవ(బీసీ) 94,144 రెడ్డి(ఓసీ) 44,825 నాగర్కర్నూల్ జిల్లా మాదిగ (ఎస్సీ) 1,26,990 మాల (ఎస్సీ) 56,426 బంజార(ఎస్టీ) 96,053 ఎరుకల(ఎస్టీ) 8,073 చెంచు(ఎస్టీ) 8,739 ముదిరాజ్(బీసీ) 95,079 రెడ్డి(ఓసీ) 47,021 వైశ్య(ఓసీ) 12,083 వనపర్తి జిల్లా మాదిగ(ఎస్సీ) 91,157 మదాసికురువ(ఎస్సీ) 8,076 మాల(ఎస్సీ) 5,703 బంజార(ఎస్టీ) 48,978 ఎరుకల (ఎస్టీ) 5,373 వాల్మీకిబోయ(బీసీ) 79,364 ముదిరాజ్(బీసీ) 65,605 యాదవ(బీసీ) 79,140 రెడ్డి(ఓసీ) 34,319 వైశ్య(ఓసీ) 7,114 ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే.. ఉమ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్నగర్లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్కర్నూల్లో 62.41 శాతం ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది. బీసీల్లో ముది‘రాజులు’.. ఉమ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 22.92 శాతం, నాగర్కర్నూల్లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా.. జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం మహబూబ్నగర్ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82 నాగర్కర్నూల్ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30 వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33 జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51 నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94 మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తేలిన లెక్కలు -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
వనపర్తిటౌన్: వేసవిలో పుర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు పుర చైర్పర్సన్ ఎం.మాధవి తెలిపారు. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే బుగ్గపల్లి, కానాయపల్లి పంప్హౌస్, రామన్పాడు సమీపంలో, రాజాపేటలో పగిలిన తాగునీటి పైప్లైన్ను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామన్పాడు రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందించేందుకు 85 హెచ్పీ, 155 హెచ్పీ మోటార్లు అవసరమని పుర అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా.. కౌన్సిల్ ఆమోదంతో కొనుగోలు చేద్దామని చెప్పారు. తాగునీటి సరఫరా విషయంలో ఇంజనీరింగ్ అధికారులు లైన్మెన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సరఫరా అయ్యే నీటికి ప్రత్యామ్నాయంగా రామన్పాడు సమీపంలో మోటార్ల ఏర్పాటుతో ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. అధికారులు తక్షణం స్పందించాలని సూచించారు. లైన్మెన్లు, అధికారులతో పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, డీఈ యూనూస్, ఏఈ, అధికారులు, కౌన్సిలర్లు, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్ర ప్రారంభం.. పుర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్పర్సన్ ఎం.మాధవి శుక్రవారం ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపాలిటీ తరుఫున కలెక్టరేట్, పుర కార్యాలయం, గాంధీచౌక్, రాజీవ్చౌక్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటేష్, డీఈ యూనూస్, మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎల్ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుదాం
● గోల్డెన్ హవర్ సాయంపై అవగాహన కలిగి ఉండాలి ● ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) డా. గజరావు భూపాల్ కొత్తకోట రూరల్: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించడమే ’అరైవ్–అలైవ్’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) డా. గజరావు భూపాల్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చేయాల్సిన గోల్డెన్ హవర్ రెస్పాన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, నారాయణపేట ఎస్పీ వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్లు, విద్యార్థులు, ప్రజలు హాజరుకాగా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గోల్డెన్ హవర్లో స్పందించాల్సిన తీరు, సీపీఆర్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శించి రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం మత్యువాత చెందుతున్న వారు ద్విచక్ర వాహనదారులేననని, అందులో 18 నుంచి 40 ఏళ్లలోపు వారేనని తెలిపారు. కాబట్టి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్బెల్ట్ ధరించాలని సూచించారు. అత్యధిక దూరం ప్రయాణించేవారు బైక్లు వినియోగించకుండా ఇతర మార్గాలు ఎంచుకోవాలని, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు నెలల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి పైగా దుర్మరణం చెందారని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం సరైన పద్ధతి కాదని, సరైన మార్గంలో ప్రయాణించి క్రమశిక్షణగా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రికి తరలించే మొదటి క్షణాల్లో క్షతగాత్రులకు అందించాల్సిన సాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలా చేసిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందిస్తుందని వివరించారు. ● నారాయణపేట ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, అందులో 1.20 లక్షల మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సరైన చికిత్స అందిస్తే మృతుల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, కొత్తకోట పుర చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీఐ రాంబాబు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
చిన్నారి చైత్రికను కాపాడండి
● సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి మదనాపురం: అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1తో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి చైత్రికను కాపాడాలని మదనాపురం మండలవాసులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో చిన్నారి దీనగాథను తెలియజేస్తున్నారు. ఇందుకు ఇటీవల ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన ‘సీఎం సారూ.. ప్రాణం పోయరూ’ కథనాన్ని సీఎం అధికారిక ఇన్స్ట్రాగామ్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. మండలంలోని నెలివిడికి చెందిన రమేశ్, సాత్విక దంపతుల ఏకై క కుమార్తె చైత్రిక ఎస్ఎంఏ టైప్–1 వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారి చికిత్సకు అవసరమైన ఖర్చు ను భరించలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి చిన్నారి చైత్రిక వైద్యానికి అవసరమైన ఆర్థికసాయం అందించాలని మాజీ ఎంపీటీసీ కుర్మయ్య, రమేశ్, ఈశ్వర్, దశరథ్ విజ్ఞప్తి చేశారు. -
దాహం తీర్చేలా..!
● వన్యప్రాణులకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు ● మండుతున్న ఎండలతో అడుగంటుతన్న జలాలు ● అభయారణ్యంలో ఎండుతున్న వాగులు, చెక్డ్యాంలు, కుంటలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి సౌకర్యం అచ్చంపేట: వేసవిలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్డ్యాంలు, నీటి గుంటలు, సోలార్ కుంటలు, సాసర్ పిట్లు నిర్మించారు. సోలార్ పిట్లలో ప్రతి నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో సమస్య జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, నీటి ఆవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాహం తీర్చడంతో పాటు వాటి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం 2,611.39 చ.కి.మీ., విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చ.కి.మీ., బఫర్జోన్గా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 42 పులులు, 250కిపైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్లపందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, వంటి ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. నీటి సమస్య తీవ్రతతో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణణాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జలవనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసులచెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉండటంతో అత్యధికంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తుంటాయి. నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఆర్(అమ్రాబాద్ టైగర్రిజర్వ్)లో 75 సోలార్ విద్యుత్తో నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటీఆర్ పరిధిలో 80 వరకు నీటికుంటలు, చెక్డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్లు, పాంపాండ్లు ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా రెండువైపుల ర్యాంపు తయారు చేస్తారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. వీటిని 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండురోజులకోసారి బేస్ క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు పర్యవేక్షిస్తారు. నల్లమలలో వన్యప్రాణులకు ఆహారంతోపాటు దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అడవిలో పారే వాగులు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. నీటి ఆనకట్టలు, ర్యాంపు వెల్స్, చెలిమెల ద్వారా సహజసిద్ధమైన నీటిని వన్యప్రాణులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. సీసీ సాసర్ల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన నీరిందించేందుకు చూస్తున్నాం. కెమెరాల పర్యవేక్షణలో నీరు అయిపోయినట్లు గుర్తించి వెంటనే నింపుతున్నాం. వన్యప్రాణులు పొలాల వైపు వస్తే సమాచారం ఇవ్వాలి. వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ -
ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గోపాల్పేట: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజలకు ఇంకా ఏ పథకాలు అమలుచేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎంపీఓ భవాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళికను అమలుచేస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ రావడం లేదని.. ప్రస్తుతం నేరుగా గ్రామ పంచాయతీల్లోనే నిధులు జమ అవుతున్నాయన్నారు. సర్పంచులు నిజాయతీగా పనిచేసి.. గ్రామాలను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభివృద్ధి పనులకు నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూరాల సమీపంలోని పంటపొలాలకు సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పట్టుబట్టి కేఎల్ఐ కాల్వలు తవ్వించినట్లు చెప్పారు. కేఎల్ఐ నీటి రాకతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులు ముందస్తుగా రైతులకు తెలియజేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గతంలో తాను పనిచేసిన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రాజకీయ నాయకుడు మరణించాడని గుర్తుచేశారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం డీటీఓ మానస ప్రతిజ్ఞ చేయించారు. ఉమ్మడి మండలంలో మొదటిసారిగా బెల్టుషాపులను బంద్ చేయించిన పొలికెపాడు సర్పంచ్ నక్కా బంగారయ్యను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మండల అధికారులు పాల్గొన్నారు. వనపర్తి: యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరిపంట కోత దశకు చేరుకుందని, రైతులు పంట కోసిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్లో దాదాపు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా కోతకు వచ్చే మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. తూకం కాంటాలు, తేమ యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా వరిధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు కేంద్రాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేసే విధంగా నిర్వాహకులకు సూచనలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏమైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇక ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. మిల్లర్లకు సంబంధించి వరిధాన్యం కేటాయింపులు కచ్చితంగా బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన వారికి మాత్రమే ధాన్యం కేటాయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీసీఓ రాణి ఉన్నారు. -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బెక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ అవగాహన సదస్సులో డీజీపీ శివధర్రెడ్డి -
నిధుల గండం..!
● కేంద్రం నుంచి వచ్చే నిధులపై నీలినీడలు ● గతేడాది వసూలైన ఆస్తిపన్ను రూ.5.72కోట్లు ● ఈ సారి రూ.5.53 కోట్లు మాత్రమే.. ● మరో 12శాతం వసూలుకాక ఫర్ఫామెన్స్ గ్రాంట్లకు గండి వనపర్తి పురపాలికలో గతేడాదికి మించి వసూలుకాని ఆస్తిపన్ను వనపర్తిటౌన్: కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను వనపర్తి మున్సిపాలిటీ చేజారవిడుచుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మార్చి 29 నాటికి మున్సిపాలిటీలో వసూలుచేసిన ఆస్తిపన్ను కంటే మరో 12శాతం అదనంగా వసూలుచేస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. ఈ మేరకు ప్రభుత్వం ముందస్తుగానే సూచనలు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలులో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 5.72కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన మున్సిపాలిటీలో.. ఈసారి 42.87 శాతంతో రూ. 5.53కోట్ల ఆస్తిపన్ను వసూలయ్యాయి. అదనంగా మరో రూ. 63లక్షలు వసూలైతే కేంద్రం నిధులకు అర్హత సాధించేది. ఆస్తిపన్ను వసూలు లక్ష్యం నెరవేరకపోవడంతో నిధులు రాక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. సవాల్గా మారిన నిబంధన.. ఆస్తిపన్ను వసూళ్లలో గతేడాది కంటే రాష్ట్ర జీఎస్డీపీ ప్రకారం నిధుల లక్ష్యానికి చేరువైతేనే కేంద్ర ప్రభుత్వం విడుదలచేసే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఇదే నిబంధన ప్రతిసారీ పురపాలిక సంఘాలకు సవాల్గా మారుతోంది. చివరి నిమిషంలోనూ దీనికోసం హడావుడి చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పన్ను వసూళ్లు చేపట్టడం లేదు. వాస్తవానికి నివాసగృహాలు, వాణిజ్య నిర్మాణాలు, పరిశ్రమలు.. ఇలా ఎలాంటి ఆస్తులున్నా ఆరు నెలలకొకసారి పన్ను వసూలు చేస్తారు. అనుకున్న మేరకు సక్రమంగా వసూలుచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు. ప్రతిసారి ఆర్ధిక సంవత్సరం ముగిసే మార్చిలోనే సిబ్బంది ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దీంతో పన్నుల లక్ష్యం నెరవేరడం లేదు. వనపర్తి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో నివాసాలు, దుకాణాలు కోల్పోయిన వాటికి కూడా ఆస్తిపన్ను వస్తుంది. ఆ వివరాలను అదనపు కలెక్టర్కు అందించాం. మనుగడలో లేని వాటికి కూడా సుమారు రూ. 1.20కోట్ల పన్ను చూయిస్తుంది. వాటిని ఆన్లైన్లో పూర్తిగా తొలగిస్తే కేంద్రం నిధులకు అర్హత సాధించవచ్చు. – శంకర్, ఇన్చార్జి ఆర్ఓ, వనపర్తి మున్సిపాలిటీ ఆస్తిపన్ను వసూళ్లకు కమిషనర్, ఆర్ఓతో మొదలుకొని వార్డు అధికారుల వరకు హడావుడే తప్పితే.. ప్రణాళికాబద్ధంగా ఎక్కడా ముందడుగు వేసినట్లు కనిపించ లేదు. దీనికి తోడు ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టడంతో ఆస్తిపన్ను లక్ష్యానికి గండిపడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎం.మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తదితరులు ఆస్తిపన్ను వసూలుపై సమీక్షలు జరిపినా పెద్దగ ప్రభావం చూపలేదు. ఉమ్మడి జిల్లాలోనే పేరున్న వనపర్తి మున్సిపాలిటీలో రెండు, మూడేళ్లుగా ఆస్తిపన్ను వసూళ్లలో మందగమనం చోటుచేసుకుంటుంది. మున్సిపాలిటీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రూ. 20.77 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 5.53 కోట్ల వసూళ్లకే పరిమితమై కేంద్ర నిధులను కోల్పోయింది. మొత్తం లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నా 50శాతం పన్నులు కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. -
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ మూడేళ్ల కిందట పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతులు -
‘జనగణన’ వేగవంతం చేయాలి
వనపర్తి: జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్లిస్టింగ్ బ్లాక్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, హెచ్ఎల్బీ డీమార్కేషన్ పనులను గురువారంలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జనగణనలో భాగమైన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఏర్పాటు ప్రక్రియపై తహసీల్దార్లు, పుర కమిషనర్లు, ఎంపీఎస్ఓలతో టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు నిర్దేశిత గడువులోగా డీమార్కేషన్ పూర్తి చేయాలని, హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్కు సంబంధించిన ప్రింట్ కాపీలను ఎన్యూమరేటర్లకు అందజేయాల్సి ఉంటుందన్నారు. పనులు సమర్థవంతంగా, సమయపాలనతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సీపీఓ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోపాల్పేట: జిల్లాలో జరుగుతున్న అబార్షన్ కేసుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి కేసు వెనక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసవాల రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న ప్రసవాలు, అబార్షన్లపై ఆరా తీశారు. అబార్షన్లకు కారణాలు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్యసేవల కోసం అవసరమైన సదుపాయాలతో నివేదిక సమర్పించాలన్నారు. మహిళలకు హెపీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి అనంతరం మండలంలోని పొలికెపాడులో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 35 ఇళ్లు మంజూరకాగా.. 34 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. అర్హులైన వారికి రెండోవిడతలో తప్పనిసరిగా మంజూరవుతాయని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ ఇంటిని హౌసింగ్ కార్యాలయానికి వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై జనగణనపై సమీక్షించారు. గురువారం వరకు హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, డీ–మార్కేషన్ పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. 18 నుంచి ఆయా బృందాలకు శిక్షణ ఉంటుందని.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ విఠోబా, సీపీఓ హరికృష్ణ, వైద్య అధికారులు ఉన్నారు. -
రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
వనపర్తి రూరల్: రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ప్రాణం అమూల్యమైందని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని రాజపేట శివారు పోలీస్ పెట్రోల్బంక్ ఆవరణలో గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి వారితో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నియమాల ప్రాముఖ్యతను వివరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. హెల్మెట్, సీట్బెల్ట్ వంటి చిన్న జాగ్రతలు మన ప్రాణాలను రక్షించే పెద్ద ఆయుధాలని, ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రతగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ హృషికేష్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
సాదాబైనామాకు మోక్షం
జిల్లాలో 8,120 దరఖాస్తులు పెండింగ్ వనపర్తి: సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2020, నవంబర్ 10 నుంచి అఫిడవిట్ దాఖలు విషయంలో భూమి విక్రయించిన వారితో సైతం తీసుకోవాలని నిబంధనలను సడలించే డిమాండ్ ఉండటం, ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో జాప్యం జరిగింది. ఇటీవల భూమి కొనుగోలు చేసిన వారితో మాత్రమే అఫిడవిట్ తీసుకుంటే సరిపోతుందనే నిబంధనతో ప్రభుత్వం జీఓ నంబర్ 76, 77 జారీ చేయడంతో ఎట్టకేలకు సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించినట్లు అయింది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 8,120 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీఓల ఆధారంగా అధికారులు విచారణకు నోటీసులు జారీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వేలాది మంది రైతుల నిరీక్షణ ఫలించనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సాదాబైనామా అర్జీల పరిష్కారానికి అప్పటీ జీఓ 112పై వచ్చిన అభ్యంతరాలు, విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దీంతో కోర్టులో సాదాబైనామాపై ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అమలులోకి వచ్చిన సాదాబైనామాల అమలు ప్రక్రియ ఆగుతూ.. సాగుతూ.. అన్నట్లుగా ఉంటోంది. 2016లో జీఓనంబర్ 153తో కొన్నింటిని అమలు చేశారు. ధరణి చట్టం అమలులోకి వచ్చాక మరో జీఓను నాటి ప్రభుత్వం జారీ చేయడం, ఈ జీఓను సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలు కావడంతో ప్రక్రియకు బ్రేక్ పడినట్లైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు కావాల్సిన వివరాలను సమర్పించడంతో దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 2020, నవంబర్కు ముందే కొన్ని దరఖాస్తులను పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. మిగిలిన వాటిని పరిష్కరించేందుకు అధికారులు కొత్త జీఓలతో సమాయత్తమవుతున్నారు. మండలం పెండింగ్ దరఖాస్తులు పెబ్బేరు 1,788 పాన్గల్ 919 వీపనగండ్ల 822 వనపర్తి 707 ఏదుల 618 గోపాల్పేట 575 కొత్తకోట 480 చిన్నంబావి 448 శ్రీరంగాపురం 387 పెద్దమందడి 354 ఆత్మకూర్ 257 రేవల్లి 252 ఖిల్లాఘనపురం 225 మదనాపురం 172 అమరచింత 86 ప్రభుత్వం మార్గదర్శకాలతో పరిష్కార మార్గం ఏళ్ల నిరీక్షణకు తెర భూమి విక్రయించిన వారి అఫిడవిట్ అక్కర్లేదని జీఓ జారీతో వీడిన చిక్కుముడి -
పేదల హక్కుల సాధనకు పోరాటం
ఖిల్లాఘనపురం: దేశంలో పేదలు ఉన్నంత కాలం వారి హక్కులు, దోపిడీ వ్యవస్థ నిర్మూలన, పేదల జీవన పరిస్థితులు మెరుగుపర్చడానికి ఎర్ర జెండా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. మండల కేంద్రంలోని ఓ సంఘం కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలకు ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా సీనియర్ నాయకుడు వేణుగోపాల్, మహాసభ అధ్యక్షుడు ఎస్.అజయ్, భూ పోరాటాల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ సక్రూనాయక్, ఉపాధి కూలీల సంఘం నాయకులు లక్ష్మి హాజరుకాగా వారితో కలిసి సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందని, అందులోని నిబంధనలు వ్యవసాయ కూలీల కడుపుకొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. శ్రమకు తగిన వేతనం లేనందున కొత్త చట్టాన్ని రద్దు చేసి పాతది కొనసాగించాలని కోరారు. సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కూలీల కడుపుకొట్టి పెద్దల కడుపులు నింపే విధంగా ఉన్నాయని ఆరోపించారు. సమగ్ర కూలీ చట్టం తీసుకురాకుండా కూలీల బతుకుల్లో మార్పు తెస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. మండలంలోని కర్నెతండాలో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. భవిష్యత్లో కూలీలు, భూ పోరాటాలకై వ్యవసాయ కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు రామచంద్రయ్యగౌడ్, జీఎంపీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బాలపీరు, మండల నాయకులు పొయ్యికాటి పెంటయ్య, వ్యవసాయ సంఘం నాయకులు ఆర్.మౌలాలి, మహబూబ్పాషా, నిరంజన్, వెంకటయ్య, ముత్యా లు, దేవన్న, సత్యనారాయణ, భరత్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
కొత్తకోట రూరల్: వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారి దేవేందర్ సూచించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కొత్తకోట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుదాఘాతాలు, నిర్లక్ష్యంగా గ్యాస్ వినియోగం, చెత్త దహనం వంటి కారణాలతో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. గ్యాస్ సిలిండర్లు సురక్షితంగా వినియోగించడం, విద్యుత్ పరికరాలను సరిగా నిర్వహించడం, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే స్పందించి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో అగ్ని ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో మహిళలతో కలిసి ఎంపీ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాష్ట్రంలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారు 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చి మహిళా బిల్లుకు మద్దతు తెలపండి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
వనపర్తిటౌన్: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏడు రోజులుగా విద్యుత్ ఆర్టిజన్, కార్మికులు దీక్ష చేస్తుండగా.. మంగళవారం శిబిరాన్ని మాజీ మంత్రి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టిజన్ కార్మికులను విద్యుత్శాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమైన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో దీక్షా శిబిరాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని మోసం చేసి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ విద్యార్థులకు సన్మానం.. ఉత్తమ మార్కులు సాధించిన జాగృతి, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల విద్యార్థులను మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఉన్నతస్థాయికి చేరే సమయంలో ఎన్నో అటంకాలు ఎదురవుతాయని.. వాటన్నింటిని అధిగమించి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులను ఎన్నటికీ మరువొద్దని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పుర మాజీ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు ప్రేమనాథ్రెడ్డి, సూర్యవంశం గిరి, హేమంత్, భాగ్యరాజు, ఇమ్రాన్, సయ్యద్ జమీల్, చిట్యాల రాము, అస్లం, అలీమ్, శివగౌడ్, లక్ష్మణ్గౌడ్, వంశీ, ముదసార్, రాహుల్, తోట శ్రీను, మునికుమార్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని.. అందరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి.చిన్నారెడ్డితో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే అంటరానితనం, అస్ప్రశ్యతను దూరం చేయవచ్చని అంబ్కేడర్ నమ్మారన్నారు. ఆ రోజుల్లోనే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివిన ఘనత సాధించారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రిగా పని చేశారని, ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశంలో అమలవుతోందని తెలిపారు. ఆయన కృషి ఫలితమే నేడు సమాజంలో సమానత్వం విరాజిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని.. రెసిడెన్షియల్, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఉన్నత విద్యాలయాలు నెలకొల్పుతోందని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించాలని.. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని గుర్తు చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. అంబేడ్కర్ జీవితం సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడమే కాకుండా సమాజానికి సేవ చేయడం కూడా ముఖ్యమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నత విద్యతో ఏదైనా సాధించగలరని తెలిపారు. ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇంటి మొత్తానికి జ్ఞానాన్ని పంచుతుందని.. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే జ్ఞానం లభిస్తుందని, అంబేడ్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ బాగా చదువుకోవాలని సూచించారు. ఆయన జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆయన ఘనతను చాటి చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అంబేడ్కర్ జీవితంపై పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, ఉపాధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు. -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
‘గరళ’కంఠుడే రావాలేమో..!
‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ విచారణలో తేలినా.. జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కాగితాలకే పరిమితం.. విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్నగర్ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ‘పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు, పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’ ...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్ వెంకట్రావ్కు అందజేసిన నివేదికలోని అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సెజ్లోని ఓ పరిశ్రమ బయటికి వదిలిన కాలుష్యం జలాలు ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట.. పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమారైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు సమాచారం. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకు రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అయినా తమ గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్తో బతుకులు ఛిద్రం తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ? ప్రస్తుత కలెక్టర్ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవి లత, మహిళా రైతు -
వరి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో 414 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ● 1.25 లక్షల ఎకరాల్లో సాగు ● సేకరణ లక్ష్యం 3.75 లక్షల మెట్రిక్ టన్నులు ● గ్రేడ్–1కు మద్దతు ధర రూ.2,389 ● సన్నరకానికి రూ.500 బోనస్ అవగాహన కల్పిస్తున్నాం.. మండలంలోని నందిమళ్ల, ఈర్లదిన్నె, క్రాస్రోడ్లో ఐకేపీ ఆధ్వర్యంలో, అమరచింతలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందనే విషయాన్ని రైతులకు వివరిస్తున్నాం. వానాకాలం పంటకు సంబంధించిన బోనస్ చెల్లించడంతో ఈసారి కూడా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. – అరవింద్, ఏఓ, అమరచింత పక్కా ప్రణాళికతో ముందుకు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వపరంగా వరి ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లావ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పంట విక్రయించే రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా గ్రామాల్లో ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈసారి యాసంగిలో 3.75 లక్షల మె.ట. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి అమరచింత: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత వారం కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు జిల్లావ్యాప్తంగా 414 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. బోరుబావుల కింద సాగుచేసిన పంట కోతలు ప్రారంభం కావడంతో మండలాల వారీగా కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సన్న రకాలకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. మొదలైన పంట కోతలు.. జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంటలు కోత దశకు చేరాయి. బోరుబావులు, చెరువుల కింద సాగు చేసిన పంటల కోతలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కోతలు ఎక్కడెక్కడ ప్రారంభించారో తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో సన్న, దొడ్డురకం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఇలా.. -
బాధ్యతలు చేపట్టిన రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్గా వినోద్కుమార్ సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగంలో పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ విభాగానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. ఎస్పీ ప్రజావాణికి ఆరు వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరుగురు వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అర్జీదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పని చేస్తోందన్నారు. ప్రజలు పోలీసుశాఖపై నమ్మ కం ఉంచి సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు వీపనగండ్ల: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి వరి ధాన్యం సేకరించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, డీపీఎం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాల సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వారు హాజరై పలు సూచనలు చేశారు. దొడ్డు, సన్నరకం ధాన్యం గుర్తించే విధానాన్ని వివరించారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే సమయంలోనే పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, డాకేశ్వర్గౌడ్, ఏపీఎం మద్దిలేటి, అనిల్కుమార్, సింగిల్విండో ఏఓ రాము, పలువురు ఏఈఓలు పాల్గొన్నారు. -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
వనపర్తి: జిల్లాలో రానున్న వారం రోజులు భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఎండాకాలం వడగాలులపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. అన్ని పుర, మండల కేంద్రాల్లో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వడగాలులపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ వెంట తాగునీటి సీసాను వెంటబెట్టుకొని వెళ్లాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, నీడ కోసం టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా సదుపాయాలు కల్పించలేదని తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా మధ్యాహ్నం వేళలో వ్యవసాయ పనులకు వెళ్లరాదన్నారు. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రజలందరికీ సకాలంలో నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీనాయక్, డీటీఓ మానస, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోషణ్ పక్వాడ్ వాల్పోస్టర్ ఆవిష్కరణ.. పోషకాహార లోపం నివారణే లక్ష్యంగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన పోషకాహారం అవసరమని, వాటిపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని వైద్యశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఆయుష్ విభాగం అధికారులు, డీడబ్ల్యూఓ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ దరఖాస్తులను కూడా పరిశీలించి వారంలోగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 30 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ విఠోబా, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఇంకెన్నాళ్లు.. సాగదీత..?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
ఉద్రిక్తంగా కో-ఆప్షన్ ఎన్నిక
పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. కమిషనర్ ఫిర్యాదుతో కౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
ఖిల్లాఘనపురం: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ జయశంకర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాలల్లోని పరిస్థితులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 14న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. ఒకేషనల్, సంస్కృతం మినహా ప్రధాన పరీక్షలు సోమవారంతో ముగిశాయని చెప్పారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఖిల్లాఘనపురంలోని రెండు కేంద్రాలకు 496 మంది విద్యార్థులను కేటాయించగా సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 493 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఒకేషనల్, గురువారం సంస్కృతం పరీక్ష నిర్వహిస్తే మొత్తం పరీక్షలు ముగుస్తాయని డీఈఓ చెప్పారు. ఆయన వెంట కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కొత్తకోట రూరల్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజిని అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర ఐటీఐ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఐటిఐ విద్యార్థులకు మోటారు వాహనాల వినియోగం, వాటి నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చట్టాలు, మైనర్ డ్రైవింగ్తో కలిగే ప్రమాదాలు, వాటి పరిణామాల గురించి తెలిసి ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు పోక్సో–2012, బాల్య వివాహాల నిషేధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ వంటి అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ ఎం.రఘు, ఐటీఐ కళాశాల చైర్మన్ విశ్వనాథం గంగాధర్శెట్టి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మున్సిపల్ కో–ఆప్షన్ ఎన్నిక
● హాజరుకానున్న మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: పుర కార్యాలయంలో సోమవారం జరిగే కో–ఆప్షన్ ఎన్నికలో పాల్గొని ఎక్స్–అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం రానున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలకు అధికార కాంగ్రెస్పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం తమ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కో–ఆప్షన్ ఎన్నిక జరుగుతుందని పుర కమిషనర్ నూరుల్ నదీం తెలిపారు. ● పుర ఎన్నికల్లో కాంగ్రెస్–3, బీఆర్ఎస్–3, బీజేపీ–3, సీపీఎం–1 వార్డులను దక్కించుకున్నాయి. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ సంఖ్యకు నాలుగుకు చేరింది. కాంగ్రెస్పార్టీ సీపీఎం మద్దతు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటుతో పుర చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. కో–ఆప్షన్ ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెరో ఐదుగురు కౌన్సిలర్లు ఉంటే డిప్ సిస్టంలో ఎన్నిక జరిగేది. అలాగాకుండా అవగాహనతో అందరూ ఒక్కో కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. తీరా కో–ఆప్షన్ ఎన్నికకు కూడా మంత్రి హాజరవుతున్నట్లు మున్సిపల్ కమిషనర్కు షెడ్యూల్ రావడంతో ఇక ఎన్నిక లాంచనమే. ఇక అన్ని కో–ఆప్షన్ స్థానాలు అధికార పార్టీ కై వసం కానున్నాయి. -
బాలికలదే పైచేయి..
ఇంటర్మీడియట్లో 66 శాతం ఉత్తీర్ణత ● ప్రథమంలో రెగ్యులర్ 23, ఒకేషనల్ 6.. ద్వితీయం రెగ్యులర్లో 21, ఒకేషనల్లో 11 స్థానంలో నిలిచిన జిల్లా ● గతేడాది కంటే కంటే కాస్త మెరుగుపడిన ఫలితాలు ఉత్తీర్ణులు కావడంతో 72.58 శాతం, బాలురు 3,053 మంది పరీక్షలు రాయగా 1,464 ఉత్తీర్ణులు కావడంతో 47.95 శాతం నమోదైంది. రెండో సంవత్సరం.. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 5,625 మంది పరీక్షలు రాయగా.. 4,047 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,055 మంది పరీక్షలకు హాజరుకాగా.. 2,488 మంది ఉత్తీర్ణులై 81.44 శాతం, బాలురు 2,570 మంది పరీక్షలు రాయగా 1,559 మంది ఉత్తీర్ణులై 61 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 6,221 మంది, బాలురు 5,623 మంది పరీక్షలు రాయగా.. బాలికలు 4,786 మంది, బాలురు 3,023 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 559 మంది అధికంగా ఉన్నారు. వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లావ్యాప్తంగా 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని 12 ప్రభుత్వ, 26 రెసిడెన్షియల్ కళాశాలలు, 19 ప్రైవేట్ కళాశాలల నుంచి మొత్తం 11,844 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,809 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 60.49, రెండో సంవత్సరంలో 70.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2024–25 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 59 శాతానికి పరిమితం కాగా.. 2025–26లో కేవలం ఒక శాతం పెరుగుదల కనిపించంది. రెండో సంవత్సరంలో 2024–25లో 67 శాతంతో సరి పెట్టుకోగా 2025–26 ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,221 మంది బాలికలు హాజరుకాగా.. 4,786 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలుర కంటే బాలికలు 1,763 మంది అధికంగా ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రెగ్యులర్ 23, ఒకేషనల్లో 6.. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్లో 21, ఒకేషనల్లో 11 స్థానంలో జిల్లా నిలిచింది. మొదటి సంవత్సరం.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,219 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,762 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,166 మంది పరీక్షలు రాయగా 2,298 మంది -
వారబంది కుదింపు..
యాసంగిలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. వారంలో 4 రోజుల పాటు పంట కాల్వలకు సాగునీటిని అందించి మిగిలిన 3 రోజులు నిలిపివేసేవారు. అయితే ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా తగ్గడంతో వారంలో కేవలం 3 రోజులు.. అది కూడా రోజుకు 650 క్యూసెక్కుల నీటిని కాల్వకు వదులుతుండటంతో ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాలైన రేచింతల, వీరరాఘవాపురం రైతులకు సాగునీరు అందడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా వారబంది విధానంలో కూడా కోత విధించి సాగునీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. కాల్వ వెంట ఉన్న గ్రామాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో అమరచింత మండలంలోని ఎత్తిపోతల పథకాలు క్రాప్ హలీడేను ప్రకటించాయి. -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. వసతుల కల్పనకు కృషి.. వైద్య విద్యార్థులు భవిష్యత్లో సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక పరికరాలు, మెరుగైన బోధన విధానాలు, క్లినికల్ ట్రైనింగ్ వంటివి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అవసరమైన వసతుల కల్పనకు కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్ల నిధులు అందుబాటులో ఉంచామని, వీటితో అవసరమైన వైద్య పరికరాలు నేరుగా కలెక్టర్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, క్లినికల్ ట్రయల్స్ కోసం విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఎంహెచ్ఓ రవినాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పాల్గొన్నారు. -
మెనూ విధిగా అమలుచేయాలి
వనపర్తి: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ కచ్చితంగా అమలు చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదులు, వంటశాల (కిచెన్), స్టాక్రూమ్, హాస్టల్లోని వసతులను పరిశీలించారు. ఎల్పీజీ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విచారించి సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని, పరిష్కరిస్తారని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం సరఫరా అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘డబుల్’ కాలనీలో వసతులు కల్పించాలి.. రాజపేట శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారికి అనుసంధానం, డ్రైనేజీ సమస్యలను స్థానికులు వివరించగా.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
బెదిరింపులకు భయపడేది లేదు
● కేంద్ర నిధులు వాడుకుంటూ విమర్శలా? ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎస్ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హూందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ప్రజల పన్నులతో చేసే ప్రతి అభివృద్ధి పనికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించాలని సూచించారు. భూమిపూజ కోసం వస్తే కొందరు గుండాలకు మద్యం తాగించి అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. పోలీసుల వైఫల్యమే.. ఇక్కడ జరిగిన ఘటనకు పోలీసులే నైతికంగా బాధ్యత వహించాలని, వారి అసమర్థతతోనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారని ఎంపీ ఆరోపించారు. ముందస్తు షెడ్యూల్ ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తనను అడ్డుకొనేందుకే పోలీసులు కాంగ్రెస్ వారికి సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దచెరువు కట్ట వద్ద కాంగ్రెస్ శ్రేణులను నిలువరిస్తున్న ఎస్ఐ స్వాతి, సిబ్బంది అమరచింత పెద్దచెరువు కట్టపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ తమ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, మహకాళి శ్రీనివాసులు, మేర్వ రాజు, మంగ లావణ్య. మల్లారెడ్డి, విష్ణు, ఊషన్న, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, నరాల నారాయణ, దుబాయి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్మీడియట్లో కొత్త కోర్సు
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ విద్యలో 2026–27 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సు అందుబాటులోకి రానుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూప్ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అందుబాటులో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏసీఈ గ్రూప్ను నిర్వహించాలనుకునే కళాశాలల యాజమాన్యాలు వెంటనే ఇంటర్బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కొత్త గ్రూప్ గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రవేశాల సమయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రెండు సెషన్లలో కొనసాగుతుందని.. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికార వెబ్సైట్ www.tfmr. telangana.gov.in నుంచి తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతుల సహకారం అభినందనీయం కొత్తకోట రూరల్: మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్, రాంకీ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. కార్యక్రమంలో నాబార్డ్ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ పాల్గొన్నారు. -
ఏడు ఎకరాలు సాగుచేశా..
యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి. – మైను, రైతు, నందిమళ్ల ఐదు తడులు అవసరం.. జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) నీటి చౌర్యంతోనే.. జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నా లుగు రోజులు సాగు నీ రు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగు వకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది. – బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) ఇబ్బంది లేదు.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ ● -
కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలి
ఖిల్లాఘనపురం: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం చేసిన తర్వాత కేటాయించిన మిల్లులకే లారీల్లో తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అఽఽధికారి విశ్వనాథం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో 2025–26 యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి మండలస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డీఎం ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఎత్తు ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. తేమశాతం, ధాన్యంలో చెత్తా, మట్టి లేకుండా చూసుకోవాలని.. ప్రజాప్రతినిధులు, బంధువులు చెప్పారని తప్పుడు తూకాలు, తేమశాతం పంపితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రక్షీట్ రాయడం, గన్నీ బ్యాగులు అందించడం సకాలంలో జరిగేలా చూడాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు అవసరమైన రైతులకు టోకన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఆనంద్, ఏపీఎం నాగరాజు, సీఈఓ కృష్ణ, వివిధ గ్రామాల ఏఈఓలు, కేంద్రాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. జాగ్రత్తలు పాటించాలి.. గోపాల్పేట: యాసంగి సీజన్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో అన్ని గ్రామాల పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్నరకం గుర్తింపు, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కొనుగోలు, రవాణా, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అడుగంటిన జూరాల
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే.. ● కుడి, ఎడమ కాల్వల పరిధి 35 వేల ఎకరాల వరి సాగు ● ఈ నెల 15 వరకు నీటి సరఫరా ● వేసవిలో తాగునీటి అవసరాలకు అర టీఎంసీ అవసరం ● మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి –8లో uఅమరచింత/గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25 వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. మార్చి చివరి నుంచే.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులకు మరో రెండు తడులు మాత్రమే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాల రైతులు మాత్రం తమకు 5 తడులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రస్తుతం వారబంధి విధానంలో నాలుగు రోజులకుగాను కేవలం 3 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నాం. – చెన్నకేశవరెడ్డి, డీఈ, నందిమళ్ల డివిజన్, జూరాల ప్రాజెక్లు సీఎం దృష్టికి తీసుకెళ్తా.. జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఖిల్లాఘనపురం: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని మల్క్మియాన్పల్లిలో వైకుంఠధామం, నర్సరీ, ఉపాధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో మొక్కలు ఎండిపోవడానికి అవకాశం ఉందని, నిత్యం నీరు అందించడంతో పాటు వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. బెడ్ల నడుమ కలుపు తొలగించాలని, మొక్కలు పెరిగేందుకు అవసరమైన ఎరువులు అందించాలని సూచించారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు సకాలంలో కూలి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ చెన్నయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ సునీత, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ వేడుకలు వనపర్తిటౌన్: పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార పోరాటంలో సంఘం ఎన్నడూ వెనకడుగు వేయలేదని, నిజాయితీగా పని చేస్తోందన్నారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొనకుండా అడ్డుకొని చీలిక తేవడంతో 2011, ఏప్రిల్ 9న పీఆర్టీయూ టీఎస్ అనే ఉపాధ్యాయ సంఘాన్ని గాల్రెడ్డి హర్షవర్షన్రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయినిపల్లి శ్రీనివాసులు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు కరుణాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నారాయణరావు, రామచంద్రయ్య, నర్సింహ, జైపాల్రెడ్డి, ఆంజనేయులు, విజయ్కుమార్, శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, విష్ణువర్ధన్, రమేష్, స్వామి పాల్గొన్నారు. -
రూటు మారింది..
అటకెక్కిన దశాబ్దాల నాటి ప్రతిపాదన ● జిల్లాలోని గోపాల్పేట, వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్ మీదుగారైల్వే లైన్ ఏర్పాటు ● సరుకు రవాణా దృష్ట్యా మార్పులు వనపర్తి: కేంద్ర రైల్వేశాఖ ఇటీవల చేసిన సర్వే ఆధారంగా డోర్నకల్–గద్వాల రైల్వే లైన్ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. దీంతో నిజాం కాలం నాటి మాచర్ల–రాయచూరు రైల్వే లైన్ ప్రతిపాదన పక్కనబెట్టినట్లు అయింది. జిల్లా విషయానికొస్తే.. మునుపు దేవరకొండ, అచ్చంపేట, నాగర్కర్నూల్, వనపర్తి, కడుకుంట్ల, పెబ్బేరు, ఇటిక్యాల మీదుగా గద్వాల జంక్షన్ను కలిపేలా ప్రతిపాదన ఉండింది. నాటి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు హయాంలో ఈ ప్రతిపాదనపై గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం దక్కలేదు. తాజాగా మారిన పరిణామాలు కృష్ణానదిపై మరో రైల్వే వంతెన నిర్మాణం చేయాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న దానిని అనుసంధానిస్తూ, సరుకు రవాణాను దృష్టిలో ఉంచుకొని డోర్నకల్–గద్వాల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైతేనేం ఎట్టకేలకు వనపర్తి ప్రాంతానికి రైల్వే సౌకర్యం వస్తుందనే వారు కొందరైతే.. మునుపటి ప్రతిపాదన ప్రకారమే రైల్వే లైన్ నిర్మాణం చేపడితే బాగుంటుందనే భావన మరికొందరి నుంచి వినిపిస్తోంది. జిల్లాలో ఐదు స్టేషన్లేనా..? ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని తాకుతూ నాగర్కర్నూల్ మీదుగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని చెన్నూరు, చిట్యాల శివారులోని చేయూత అనాథ ఆశ్రమం సమీపం నుంచి అచ్యుతాపురం శివారు రాజపేట, కొత్తకోట మీదుగా అజ్జకొల్లు, శ్రీరాంనగర్ స్టేషన్ను అనుసంధానిస్తూ గద్వాలకు చేరుకోనున్నట్లు ప్రస్తుతం రైల్వేశాఖ విడుదల చేసిన మ్యాపింగ్ సర్వే ఆధారంగా తెలుస్తోంది. మరికొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తున్న తరుణంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ప్రస్తుత ఎంపీ మల్లు రవి ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా సోమవారం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ను కలిసి డోర్లకల్–గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ మ్యాప్ను అధికారికంగా స్వీకరించారు. సమీప భవిష్యత్తులో ఈ రైల్వే లైన్ ప్రాముఖ్యతను నాగర్కర్నూల్, వనపర్తి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలు వివరించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం.. డోర్నకల్–గద్వాల రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. త్వరలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. కేంద్రం రైల్వేశాఖకు బడ్జెట్లో రూ.2.93 లక్షల కోట్లు కేటాయించగా.. ఇందులో 296 కిలోమీటర్ల డోర్నకల్–గద్వాల రైల్వే లైన్ నిర్మాణానికి రూ.5,330 కోట్లు కేటాయించింది. తొలి విడత ప్రాధాన్యతగా నిధులు విడుదల చేయించి పనులు పూర్తి చేయించేందుకు ప్రయత్నం చేస్తాం. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
ఏదుల ఉండగా..గొల్లపల్లి అనవసరం
కమీషన్ల కోసమే రిజర్వాయర్ నిర్మాణానికి ఆసక్తి లగచర్ల పునరావృతం అవుతుంది.. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచార యత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎత్తైన ప్రాంతాలకు నీరందించేలా మినీ లిఫ్టులు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. కేవలం రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా డిజైన్ చేసిన కేఎల్ఐ ప్రాజెక్టును నాలుగు లక్షల ఎకరాలకు నీరందించేలా ఆధునికీకరించామన్నారు. వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. వలసల జిల్లా సస్యశ్యామలం.. 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఏదుల, వట్టెం, ఉదండాపూర్ వినియోగంలోకి వస్తే..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. -
‘అరైవ్.. అలైవ్’ విజయవంతం చేయాలి
వనపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీఅరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 13వ తేదీన గ్రామాల్లో రోడ్డు భద్రతకు కమిటీలు వేసి గ్రామసభలు నిర్వహించి రహదారి నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గుర్తించి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వారం పాటు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేలా విద్యార్థులతో ర్యాలీలు, మండలస్థాయి కార్యక్రమాలు, వాహన చోదకులు, డ్రైవర్లకు కంటి పరీక్షలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగ్యస్వాములను చేయాలన్నారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 14న స్థానిక అంబేడ్కర్ విగ్రహం దగ్గర ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. 16వ తేదీన మండలస్థాయిలో కార్యక్రమాలు, జిల్లాలో ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించని వారికి చలానాలు కఠినంగా విధించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే వారిని ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, ఆర్అండ్బీ డీఈ దేశ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీటీఓ మానస, డీపీఓ రఘునాథ్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
వైభవం యోగానందస్వామి రథోత్సవం
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి శ్రీలక్ష్మీనర్సింహ యోగానందస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి నామస్మరణల నడుమ పోటాపోటీగా రథాన్ని ముందుకు లాగారు. తేరుగడ్డ వరకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేసి తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు, తీర్థావళిలో భాగంగా స్వామివారి పాదుకలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఆలయం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. ఆలయం దగ్గర అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్వామివారి ఉత్సవాలు గురువారంతో ముగిసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. తీర్థావళితో ముగిసిన ఉత్సవాలు -
హే..కృష్ణా.!
శ్రీశైలం డ్యాంలో శరవేగంగా తగ్గుతున్న నీటిమట్టం ● ప్రస్తుతం మిగిలింది 42 టీఎంసీలే ● మరో వారం, పది రోజుల్లో కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ● జూరాలలోనూ అడుగంటిన జలాలు ● వేసవిలో ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు శూన్యం అడుగంటిన జూరాల.. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.074 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో తాగునీటి అవసరాలకు సైతం కటకట ఏర్పడనుంది. గతేడాది సైతం జూరాలలో నీటినిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకోగా.. ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని సరఫరా చేశారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తేనే తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి.సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పెరగడంతో, ఈ సారి వేసవి ప్రారంభంలోనే నీటినిల్వ అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.408 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తితో పాటు సాగునీటి ప్రాజెక్ట్ల కోసం వినియోగిస్తుండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి చివరి నాటికి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరువగా.. శ్రీశైలం డ్యాంలో 20 రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు, మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి విడుదల కొనసాగడం.. గత నెల 22 వరకు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో నీటిమట్టం వేగంగా తగ్గింది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గతనెల 15వ తేదీ వరకు 75 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 42 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలం ముగిసేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటం.. జూలై వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పోటాపోటీగా నీటి వినియోగంతో.. గత మార్చి ప్రారంభానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్లో 92 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా.. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటి తరలింపు చేపట్టారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి నెలలో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఏపీలోని విద్యుదుత్పత్తి కేంద్రానికి నిత్యం సగటున 10వేల క్యూసెక్కులతో పాటు హంద్రీనీవా సుజలాస్రవంతి, కేసీసీ, పీఆర్పీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేశారు. అలాగే తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి సగటున 8 వేల క్యూసెక్కులతో పాటు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి సరఫరా కొనసాగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో కనిష్ట నీటిమట్టానికి ముందే కేఎల్ఐ కింద రిజర్వాయర్లను నింపుతున్నాం. అవసరం మేరకు నీటినిల్వ చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్శాఖ ఈఈ, నాగర్కర్నూల్ -
ప్రభుత్వ వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు
వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్–1లో రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు తమ తమ విభాగాల్లో సాధించిన ఫలితాలకు గుర్తింపుగా ప్రిన్సిపాళ్లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డా. పి.మల్లికార్జున్, సూపరింటెండెంట్ డా.అరుణ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్–1లో ఉత్తమ ఫలితాలు -
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా..
ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లకు పుర కమిషనర్లు వార్డు అధికారులు, సిబ్బందితో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగినా 50 శాతానికి కూడా చేరుకోలేదు. సెలవు రోజుల్లో సైతం బకాయిల వసూళ్లకు ఇల్లిల్లూ తిరిగినా ఆశించిన మేర ఫలితం రాలేదనే చెప్పవచ్చు. సిబ్బంది కొరత.. మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా పన్ను వసూళ్లలో వెనకబాటుకు కారణంగా చెప్పవచ్చు. పుర అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులను సైతం పన్ను వసూళ్లకు తీసుకెళ్లినా సరైన స్పందన రాలేక పోయింది. దీనికితోడు పుర ఎన్నికలు రావడం, పనిభారం అధికం అవడం కూడా కారణమంటున్నారు. -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాప్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. అవకాశాలు మెరుగు.. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ విద్యార్థులకు సువర్ణావకాశం... పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్.. విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు -
నేడు విద్యార్థుల ఎంపిక
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని నాగవరం శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయలో బాలవాటిక–1, 2, 3 ప్రవేశాలకుగాను బుధవారం ఉదయం 9.30కు కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని ఇన్చార్జ్ ప్రిన్సిపల్ దశరథరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో ప్రవేశాలకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సైతం లాటరీ విధానంలో ఈ నెల 9న ఉదయం 9.30 గంటలకు, 2వ తరగతికి 11 గంటలకు, 3వ తరగతికి మధ్యాహ్నం 12 గంటలకు, 4వ తరగతికి ఒంటిగంటకు, 5వ తరగతికి 2 గంటలకు ఉంటుందని.. కేంద్రీయ విద్యాలయ వారి మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ nagavaram.kvs.ac.inను లేదా సెల్నంబర్ 96528 07273 సంప్రదించాలని సూచించారు. పరిసరాల శుభ్రతతోసంపూర్ణ ఆరోగ్యం వనపర్తి రూరల్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పెద్దగూడెంతండాలో గ్రామపంచాయతీ కార్యాలయంలో తండావాసులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. అలాగే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం, గృహహింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి మాట్లాడుతూ.. రోజు వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. మద్యపానం, ధూమపానంతో రోగ నిరోధకశక్తి తగ్గి అనారోగ్యం బారినపడే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వాల్యానాయక్, మండల వైద్యాధికారి డా.రాకేశ్రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, శ్రీదేవి, కార్యదర్శి రేణుక, గ్రామస్తులు టీక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి సమాజసేవ చేయాలి వనపర్తిటౌన్: ప్రతి విద్యార్థి తన పరిజ్ఞానం, నైతిక విలువలతో సమాజానికి సేవ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుడు అంటే కేవలం వైద్యం అందించే వారే కాదని.. సమాజాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచే బాధ్యత గల వ్యక్తులన్నారు. తోటి వారికి, వృద్ధులకు శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రతి విద్యార్థి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు సాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తోడుగా ఉండటం కూడా ఒక విధమైన సేవేనని వివరించారు. అనంతరం ఇంటర్న్షిప్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా టీఎస్కేసీ మెంటర్ నాగేంద్రాచారి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. ఉద్యోగానికి ఎలా సన్నద్ధం అవ్వాలి, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సమాజానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా మెరుగుపర్చుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.ఉమా, అకాడమిక్ కో–ఆర్డినేటర్ డా. యాదగిరిగౌడ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధాంసింగ్, డా. రాఘవేంద్ర, డా. రామకృష్ణమూర్తి, అధ్యాపకులు వెంకటస్వామి, నాగేంద్రాచారి, ఇమ్రాన్ పాల్గొన్నారు. వరి (ఆర్ఎన్ఆర్) క్వింటా రూ.2,243 దేవరకద్ర: దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029 ధర పలికింది. అలాగే హంస రకం వరి ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089 ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
లక్ష్యం చేరలే..!
జిల్లాలోని పురపాలికల్లో 42.59 శాతమే పన్ను వసూలు ● లక్ష్యం రూ.19.20 కోట్లు.. వసూలు చేసింది రూ.9.47 కోట్లు ● బకాయిలు రూ.10.47 కోట్లు అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగాయి. మార్చిలో ఇంటి, కొళాయి పన్ను వసూళ్లలో అధికారులు వేగం పెంచినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. రూ.19.20 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. మార్చి 31వ తేదీ నాటికి రూ.9.47 కోట్లు (42.59 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. బకాయిలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని పూర్తిచేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని ఆయా పుర కమిషనర్లు చెప్పడం గమనార్హం. అమరచింత పుర కార్యాలయం -
జనగణనలో హెచ్ఎల్బీలే కీలకం
వనపర్తి: జనగణన–2027 ప్రక్రియలో హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ)ల గుర్తింపే అత్యంత కీలకమని.. జాగ్రత్తగా తయారు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో త్వరలో ప్రారంభం కానున్న జనగణనపై సంబంధిత చార్జ్, అదనపు ఛార్జ్ అధికారులు, స్టాటిస్టికల్ అధికారులు, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. మే నెల 11 నుంచి జనగణన ప్రారంభమవుతుందని.. హెచ్ఎల్బీలను రూపొందించే క్రమంలో ఏ ఒక్క ప్రాంతం తప్పిపోకుండా చూడాలని కోరారు. అన్ని ప్రాంతాలు నమోదయ్యాయా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. అదేవిధంగా జనగణన నిర్వహించే ఎన్యుమరేటర్లకి 18వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వాలన్నారు. మూడురోజుల పాటు కొనసాగే శిక్షణకు ఎన్యుమరేటర్లు అందరూ హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని.. ఈ నెల 17లోగా అందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. శిక్షణ కోసం సంబంధిత ఛార్జ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి.. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. తప్పనిసరిగా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని.. ఉపాధిహామీ పథకానికి సంబంధించి లేబర్ పని దినాలతో పాటు ఇతర లక్ష్యాలను సకాలంలో సాధించాలని ఎంపీడీఓలకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి రూరల్: నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంకూర్లో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని యజమానులు భాగ్యలక్ష్మి– బీష్ముడు, కొండమీది శారద –శేఖర్రెడ్డి, కావేరి–వెంకటేశ్వరెడ్డి, నిర్మల–శేఖర్రెడ్డి, మాధవి–ముత్యాలు దంపతులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కల సహకారం చేసిన ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతుల కళావతి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాలశాఖ అఽధికారుల తనిఖీ
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం ఎస్ఎల్ఎన్ఎస్ ఇండస్ట్రీస్లో మంగళవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న ధాన్యం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. 2022–23 వానాకాలం, యాసంగితో పాటు 2023–24 వానాకాలం మొత్తం 7,303.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా.. ఇప్పటి వరకు 3,874.478 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం మాత్రమే అప్పగించారన్నారు. ప్రస్తుతం మిల్లులో 13.32 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉందని.. ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన ధాన్యంలో 3,415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ఉన్నట్లు తనిఖీలో గుర్తించామని వివరించారు. ఈ విషయమై పంచనామా నిర్వహించామని.. తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట డీటీ పరమేశ్వర్ ఉన్నారు. -
వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలి
కొత్తకోట రూరల్: పుర పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన పుర పరిధిలో పర్యటించి నర్సరీలు, సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను పరిశీలించారు. జూన్ నెలలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని.. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట పుర కమిషనర్ సైదయ్య, ఇతర అధికారులు ఉన్నారు. -
అత్యవసర వైద్యసేవలు ఆపొద్దు
వనపర్తి: ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే నెపంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు ఆపొద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్లో ప్రస్తుతం అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏడాది కాలంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదైన ఓపీడీ, ఐపీడీ, రెఫరల్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2025, జనవరి నుంచి 2025, డిసెంబర్ వరకు మొత్తం 3.65 లక్షల ఓపీడీ, 33 వేల ఐపీడీ కేసులు నమోదైనట్లు సూపరింటెండెంట్ వివరించారు. నెలకు సగటున 90 నుంచి 150 కేసులను మహబూబ్నగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర కేసులను ఇతర ప్రాంతాలకు పంపించకుండా ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకోసం ఏమేం అవసరం ఉన్నాయో నివేదిక అందించాలని అధికారులను కోరారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆస్పత్రులకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే పేరుతో రోగులకు అత్యవసర వైద్యసేవలు నిలపొద్దని.. రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెబ్బేరులో ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. రాత్రిళ్లు ఆస్పత్రుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉందని, చిన్నపిల్లల వైద్యం, కంటి చికిత్సకు సంబంధించిన విభాగాల్లో వైద్యశాఖ పనితీరు బాగుందని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జీజీహెచ్, ఎంసీహెచ్లో సౌకర్యాల కల్పనకు సంబంధిత విభాగాల హెచ్ఓడీలు కలిసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని అధికారులు ప్రస్తావించగా ఔట్సోర్సింగ్ వారితో సర్దుబాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ రెడ్డి కుమారి, ఐఎంఏ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
20 నుంచి కేంద్రీయ విద్యాలయ తరగతులు
వనపర్తిటౌన్: కేంద్రీయ విద్యాలయ (కేవీ స్కూల్) తరగతులు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సోమవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈఓ అబ్దుల్ ఘనీ అధ్యక్షతన కేవీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దశరథరామ్తో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని, బాలవాటిక విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.40 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. అన్ని తరగతి గదులు ఉన్నాయని.. తాగునీరు, టాయిలెట్ల ఏర్పాటును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. బాలవాటిక–1 నుంచి 1వ తరగతి వరకు మొత్తం 4 నాలుగు తరగతులకు ఆన్లైన్లో 5,188 దరఖాస్తులు, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రత్యక్ష దరఖాస్తు విధానంలో 1,029 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. విద్యార్థుల ఎంపిక ఆన్లైన్, లాటరీ పద్ధతిలో కొనసాగనుందని.. 8వ తేదీన బాలవాటిక–1 నుంచి బాలవాటిక–3 వరకు, 9వ తేదీన 1వ తరగతి, 10న 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ అటానమస్ పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని, 2వ దశలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, 3వ దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 4వ దశలో ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల పిల్లలు, 5వ దశలో ఇతరులకు అవకాశం ఉంటుందన్నారు. లాటరీ విధానంలో ఎంపికలు కేవీ స్కూల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియమించిన కమిటీ ఉంటుందని, ఈ కమిటీలో వీఎంసీ సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలితో కలిపి ఐదుగురు సభ్యులు ఉంటారని వివరించారు. సమీక్షలో ఏఎంఓ మహానంది, డీఎస్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
వనపర్తిటౌన్: హిందూ వ్యతిరేక విధానాలు, కమ్యూనిస్టుల విదేశీ వాదానికి వ్యతిరేకంగా ఏర్పడింది బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని నాగవరంలో కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీకి నేడు 17 కోట్ల మంది కార్యకర్తల బలం, దేశంలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని చెప్పారు. 23 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉందని, త్వరలో రాష్ట్రంలోనూ పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తునందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, కేతూరి బుడ్డ న్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, వారణాసి కల్పన, ఉ పాధ్యక్షుడు గొర్ల బాబు రావు, కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, కౌన్సిలర్ విజయసాగర్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, రాము, కొమ్ము శ్రీనివాసులు, ప్రవీణ్, ద్వారపోగు నారాయణ, రాజశేఖర్గౌడ్, అరవింద్, నవీన్, చిన్నరాయుడు, కోన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
బీమాతో కుటుంబానికి దీమా
కొత్తకోట రూరల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేసుకుంటే ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి భరోసా ఉంటుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉండే పేదలకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలను అమలు చేస్తుందని, సంవత్సరానికి కేవలం రూ.20 కడితే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందుతుందని వివరించారు. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, చిన్నారుల కోసం ఎన్పీసీ వాత్సల్య లాంటి దీర్థకాలిక పథకాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్లో వారి చదువులకు, పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులపై ఆర్థికభారం పడదన్నారు. డీఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళాల సంఘాల సభ్యులందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, రైతుల స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫార్మేషన్ రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి యువత డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ జలంధర్రెడ్డి సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సహకరించాలని కోరారు. అందుకు ముఖ్యంగా మహిళలే చొరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైం బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
‘రామన్నగట్టు’తోనే శాశ్వత పరిష్కారం
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాన్గల్: గోపల్దిన్నె, సింగోటం లింక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొల్లాపూర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టాపూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ.150 కోట్ల లింక్ కెనాల్ పనులకు గుత్తేదారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కావడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని.. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తిచేస్తే 25 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మండలంలోని కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను రద్దు చేసిందని చెప్పారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడితే మండలంతో పాటు వనపర్తి మండలంలోని పలు గ్రామాలకు శాశ్వతంగా సాగునీరు అందేదని తెలిపారు. దీంతోపాటు పాన్గల్కు 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయిస్తే పనులు ప్రారంభించడం లేదన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్లప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించేలా నాయకుల పనితీరు ఉండాలన్నారు. జల విద్యుత్ పేరిట శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. నీటిపారుదలశాఖ మంత్రి, జిల్లా మంత్రి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఇరిగేషన్శాఖ సలహాదారు ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టే సాగునీటిని దోచుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్నాయక్, జ్యోతినందన్రెడ్డి, అడ్వకేట్ రవి, రాజేశ్వర్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, దశరథనాయుడు, భాస్కర్రెడ్డి, చంద్రూనాయక్, సర్పంచ్ కృష్ణనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంచందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల ముంగిట
●అగ్ని ప్రమాదాలు 112 మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేరుకుంటేనే.. వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. జిల్లా ఫైర్స్టేషన్లు వాహనాలు మహబూబ్నగర్ 2 5 నారాయణపేట 2 2 గద్వాల 2 2 నాగర్కర్నూల్ 4 5 వనపర్తి 3 3 ఉమ్మడి జిల్లాలో అగ్గి రాజుకుంటే బుగ్గిపాలే ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ -
బడుగుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వనపర్తి: రైతుల సంక్షేమం, దేశ రక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. డా. జగ్జీవన్రామ్ బాల్యం నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే కేంద్రమంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. గ్రీన్ రివల్యూషన్లో ఆయన పాత్ర కీలకమని, రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆయన నాయకత్వం ఎంతో గొప్పదని వివరించారు. ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భారత తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని.. స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సుమారు 30 ఏళ్లు అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యతోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోందని.. స్వయం ఉపాధి పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జగ్జీవన్రామ్ జీవితంపై పాడిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి రాంజీరావు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, చిరంజీవి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వెంకటేష్, మాదారి భోజరాజు, గంధం గట్టయ్య, కృష్ణయ్య, వెంకట్గౌడ్, వెంకటేష్, విశ్వంబాబు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కౌన్సిలర్లు, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థం
వనపర్తి: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థమని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని 97 రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్రావు వస్తున్నారని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పర్యటనతో బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం అన్నారు. మాజీమంత్రి నిరంజన్రెడ్డి -
పుర ప్రక్షాళన జరిగేనా?
● ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే వ్యూహాత్మక అడుగులు ● అధికార యంత్రాంగంలో వణుకు వనపర్తిటౌన్: నియోజకవర్గంలోని వనపర్తి, పెబ్బేరు పురపాలికలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రక్షాళన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయా పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగిరినప్పటికీ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు గడవకముందే బడ్జెట్ సమావేశాలతో కలుపుకొని రెండు దఫాలు సమావేశాలు జరిగాయి. పురపాలికల్లో చోటు చేసుకున్న తప్పిదాలు, లోప భూయిష్టతను ఎండగట్టేందుకు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసింది. పురపాలికల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. పుర పాలనలో కాంగ్రెస్ పెద్దలున్నా.. ఏం జరుగుతుందోననే అంశంపై దృష్టి సారించారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి వీడకపోతే సెలవుపై వెళ్లాలంటూ పుర సమవేశంలో బాహాటంగా హెచ్చరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత పాలకుల హయాంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.. ఏ దశలో ఉన్నాయని తెలుసుకునేందుకు కౌన్సిలర్లు 45 రోజులుగా అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా స్పందన కరువైంది. దీనికితోడు పాలకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల గురించి అనుకూలంగా, ప్రతికూలంగా ఎమ్మెల్యేకు చేర వేస్తున్నారు. తీసుకొచ్చిన రూ.18 కోట్ల పైచిలుకు పనులు ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎందుకు ఆగాయి.. అసలే ప్రారంభం కాని పనులేమిటి? తాగునీటి సరఫరా కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏయే ప్రదేశాల్లో ఎప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి వార్డులో ఎన్ని వీధిదీపాలు ఉన్నాయి.. ఇంకా ఎన్ని కావాలి. వార్డుల వారీగా ఉన్న బోరుమోటార్లు.. ఎన్ని పని చేస్తున్నాయి. మరమ్మతుకు గురైనవి ఎన్ని? కాంగ్రెస్ పాలనలో ఏ నిధులతో భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎక్కడెక్కడ పూర్తి చేశారు. ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి. తాగునీటి పైప్లైన్ లీకేజీలు ఎక్కడ ఉన్నాయి. మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది. అమృత్ 2.0 పథకం ఏ దశలో ఉంది. తాగునీటి పథకాల మోటర్లు ఎక్కడెక్కడ మరమ్మతుకు గురయ్యాయి. బాగున్నవి ఎన్ని. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవకుండా ఏం చేయాలి. పుర ట్రాక్టర్ల డీజిల్ ఖర్చు ఎంత పార్కులు ఉన్న వార్డులు ఎన్ని. లేని వార్డులు ఎన్ని. బోరుబావులు ఎక్కడెక్కడ వేశారు. వేసిన వాటి పరిస్థితి ఏమిటి. ఆయా ప్రశ్నలకు పుర అధికారులు సమాధానం చెప్పకపోవడం పాలకవర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ నెల 6వ తేదీలోగా పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని ఎమ్మెల్యే కోరగా.. అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేగాకుండా ఆస్తి పన్నుల్లో రివైజ్డ్ పేరుతో హెచ్చుతగ్గులు, ట్రేడ్ లైసెన్స్ కొలతల్లో వ్యత్యాసాలు, ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, మెప్మా విభాగంలోని మహిళా సంఘాల రుణాల రికవరీలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు కూడా పుర అధికారులపై ఉన్నాయి.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారదర్శక పాలన అందించాలి. పాలనలో తప్పిదాలు, లోపాలు చోటుచేసుకుంటే, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ హయంలో ప్రజలకు మేలు జరగాలనేదే మా పంతం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
క్రీడాభివృద్ధికి తొలి ప్రాధాన్యం
వనపర్తి రూరల్: జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు, యువతను ప్రోత్సహించి క్రీడలను అభివృద్ధి చేయడమే తొలి ప్రాధాన్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం వారు పెబ్బేరులో పర్యటించి పీజేపీ క్యాంపు ఆవరణలోని ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానం, క్రీడాకారుల సౌకర్యార్థం కలెక్టర్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కలెక్టర్ చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. పీజేపీ క్యాంపు ఆవరణలో ఉన్న పురపాలికకు చెందిన పది ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థ పేరున బదిలీ చేస్తూ తీర్మానిస్తే రూ.2.50 కోట్లతో మైదానం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారి జర్మన్ సాంకేతికతతో ఫుట్బాల్, హాకీ మైదానాలను టర్ప్తో పాటు 400 మీటర్ల ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థలాన్ని వెంటనే సర్వేచేసి హద్దులు నిర్ధారించి పురపాలిక ద్వారా తీర్మానం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పుర అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వారి వెంట పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, కృష్ణకుమార్రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ రోజారెడ్డి తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇంటి పరిశీలన.. పెబ్బేరులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణంలో పురోగతి, చెల్లింపుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో 143 ఇళ్లకుగాను 83 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని.. పనులు త్వరితగతిన ప్రారంభించి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట 108 వాహనంలో టెక్నీ షియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట ● -
సద్వినియోగం చేసుకోండి..
108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, మహబూబ్నగర్ రాష్ట్రంలో 108 వాహ నాలు విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. 108, 102 అనే హెల్ప్లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి -
త్వరలోనే పట్టణ, మండల కార్యవర్గాల ఎంపిక
వనపర్తిటౌన్: కాంగ్రెస్పార్టీ మండల, పట్టణ కార్యవర్గాలను త్వరలోనే ప్రకటిస్తామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజలు, పార్టీ కోసం పని చేయాలని సూచించారు. గతంలో ఉన్న కార్యవర్గం, ప్రస్తుత కార్యవర్గం పనితీరులో మార్పు కనిపించాలని, నిబద్ధత, ఐక్యతతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని మండలాలకు ఇన్చార్జ్లను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అవకాశం దక్కుతుందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించలేదని నిరాశ చెందొద్దని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ధనలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ‘కష్టపడిన వారికే పదవులు’ ఆత్మకూర్: కాంగ్రెస్పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని.. పదవులు లభిస్తాయని పార్టీ జిల్లా ఇన్చార్జ్లు కోళ్ల వెంకటేష్, రమేష్గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ అధ్యక్షతన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మండల, పట్టణ కార్యవర్గాల ఏర్పాటులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాస్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్ యాదవ్ వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈ ఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
పంటలు పండడం లేదు..
కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి వ్యవసాయం వదులుకున్నా.. మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయి కాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్ రైతు కాల్వ తీస్తే ఊరుకోం.. మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి ● -
కాంగ్రెస్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
అమరచింత: కాంగ్రెస్ను నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్సాగర్ అన్నారు. నూతన మండల, పట్టణ కమిటీ ఎన్నికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో 300 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. శరవంద, మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, రమేష్, రవి,శ్యామ్, సర్పంచ్లు రాజేందర్రెడ్డి, శివకుమార్ ఉన్నారు. -
ఐక్యంగా ఉందాం.. నియోజకవర్గం సాధించుకుందాం
అమరచింత: మనమంతా ఐక్యంగా ఉండి కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకుందామని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి అన్నారు. పట్టణంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరచింతను నియోజకవర్గాన్ని చూడాలనే లక్ష్యంతో పోరాడదామని పిలుపునిచ్చారు. 52 ఏళ్లు నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లిన అమరచింత అప్పట్లో జరిగిన డీలిమిటేషన్లో కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన దేశవ్యాప్తంగా నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి అమరచింతకు తీసుకొచ్చే అవకాశం కలిగిందన్నారు. అమరచింత మండల ప్రజలే కాకుండా ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట మండలాల ప్రజలను, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి కొత్త నియోజకవర్గ అవశ్యకత గురించి వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలిసి నియోజకవర్గ ఏర్పాటుకు తన వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ, బీజేపీ రాష్ట్ర నాయకడు మహాంకాళి శ్రీనివాస్, కౌన్సిలర్లు మేర్వరాజు, విష్ణు, పారుపల్లి ఊషన్న, తిరుమలేష్, రాములు, రవి, అరుణ్, ఎస్ఏ రాజు పాల్గొన్నారు. -
గుట్టుగా సాగుతోంది!
పేకాట, బెట్టింగ్ సరదా నుంచి వ్యసనంగా మారుతున్న వైనం ● పట్టపగలు నివాస గృహాల మధ్య స్థావరాలు ● ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు ● దృష్టి సారిస్తే మరిన్ని వెలుగు చూసే అవకాశం అనుమానం రాకుండా.. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా జూదమాడేందుకు పేకాయరాయళ్లు నివాస గృహాల మధ్యలోనే గదుల్లో గుట్టుగా పదుల సంఖ్యలో చేరి పేకాట ఆడుతున్నారు. ఏప్రిల్ 1న జిల్లా కేంద్రంలోని నివాస గృహాల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని పట్టణ పోలీసులు అరెస్టు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటనలో పది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు 9 సెల్ఫోన్లు, రూ. 24 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నివాస గృహాల మధ్య ఇళ్లను కిరాయికి తీసుకొని కొందరు గుట్టుగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పేకాటరాయుళ్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. తమ టీంలతో ఆయా పరిసరాల్లో నిఘా ఉంచి, పోలీసుల కదలికలలు ఉంటే వెంటనే అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల పేకాట స్థావరాలు ఉన్నట్లు పోలీస్శాఖలోని నిఘా విభాగాలకు సమాచారం ఉన్నా.. చూసిచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వనపర్తి: సరదాగా ప్రారంభించిన అలవాటే.. క్రమంగా వ్యవసంగా మారుతూ పేకాట యువతను పెడదారిపట్టిస్తోంది. కుటుంబ పెద్దలు పిల్లల నడవడికపై దృష్టి సారించకపోవటం.. సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను ప్రజలు మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జూదం జోరుగా సాగుతోంది. పేకాటకు తోడు క్రికెట్ మ్యాట్లపై బెట్టింగ్ వ్యవహారం తారాస్థాయికి చేరుతోంది. ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఫోన్లలోనే బెట్టింగ్ల రాయబారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల వరుసగా పోలీసులకు చిక్కుతున్న పేకాయరాయళ్లు. బెట్టింగ్పై వస్తున్న ప్రచారాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇంకా పోలీసుల దృష్టికి రాని ఘటనలు చాలానే ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. -
మురుగు సమస్య తొలగేనా..
దోచుకునేందుకే ‘కాళేశ్వరం’ మదనాపురం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకునే లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని పక్కకు నెట్టి కాళేశ్వరం ఎత్తిపోథలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దుయ్యబట్టారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావు అవినీతికి కుంగిన కాళేశ్వరం సాక్షిగా మిగిలిందని ఎద్దేవాచేశారు. దైవ దర్శనానికి వచ్చిన హరీశ్రావు సంబంధం లేకుండా రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి నిర్లక్ష్యానికి నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు ప్రధాన దోషి అని మండిపడారు. సీఎం రేవంత్రెడ్డి రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నారని కొనియాడారు. నూతన కమిటీల ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు మండల నూతన కమిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పర్యవేక్షించారు. వివిధ పదవుల కోసం ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పి.ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి, మదనాపురం ఇన్చార్జ్ తులసీరాజుయాదవ్, కురుమూర్తిరాయ లిఫ్ట్ చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు కృష్ణవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా కళాశాలలో డ్రెయినేజీ లేక ఇబ్బంది పట్టించుకోని పాలకులు, అధికారులు పరిష్కరించాలని వేడుకుంటున్న స్థానికులు -
నిఘా పెంచుతాం
నివాసగృహాల మధ్య పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి, యువతను జూదంపై ఆకర్షితులను చేసేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. క్లబ్లు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా ఇలాంటి ముఠాలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే సంబంధిత పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. రెండేళ్లుగా పేకాట కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరింతగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, వనపర్తి ● -
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
చిన్నంబావి: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. దగడపల్లి – తూంకుంట, దగడపల్లి – పెద్దదగడ మధ్య బీటీ రహదారి, దగడపల్లి – వీపనగండ్ల మధ్య ఉన్న బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.కోటి మంజూరు, ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని సర్పంచ్ గంగాధర్ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అత్యధికంగా సీసీ రహదారులకు నిధులు మంజూరు చేశామని, గ్రామస్థాయిలో రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలపై ఆగ్రహం.. మండలంలోని దగడపల్లిలో జరిగిన ముఖాముఖిలో సర్పంచ్ గంగధార్ పాల్గొన్నారు. పార్టీకి మద్దతు ఇవ్వని వ్యక్తికి ఎలా మాట్లాడే అవకాశం ఇస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అంతిమ లక్ష్యం గ్రామాభివృద్ధి అని మంత్రి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిన చింతల వెంకటేష్ను హెచ్చరిస్తూ ఇది మంచి పద్ధతి కాదని.. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు.. మహిళలమని చూడకుండా వార్డుసభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమ్మాయిపల్లి సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ మాధవి మంత్రికి వివరించారు. మహిళలను గౌరవించాలని, మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయాలు మానుకోవాలని.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, సర్పంచ్లు కవిత ప్రభంజన్గౌడ్, గంగాధర్, ఉపసర్పంచ్ మాధవి మాధవరెడ్డి, కిరణ్కుమార్గౌడ్, చింతల శ్రీనివాసులు, శంకర్, బాలకృష్ణ, రాజకుమార్, ఉమేష్ నాయుడు, సుధాకర్ నాయుడు, జ్యోతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
వనపర్తి: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010 ప్రకారం ధరల చార్ట్లను ప్రదర్శించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి పలు దరఖాస్తులను సమీక్షించారు. 3 ఆస్పత్రులు, 3 క్లినిక్లు, ఒక డయాగ్నొస్టిక్ సెంటర్, 4 స్కానింగ్ కేంద్రాలకు దరఖాస్తులురాగా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని, సకాలంలో పునరుద్ధరించుకోవాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సాయినాథ్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డా. బాబు, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ వనపర్తి: జిల్లాలో ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకై నా చోటు లేదన్నారు. ‘30 పోలీస్ యాక్ట్‘ ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని, అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు నిలుస్తాయని, పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని వివరించారు. చట్టాలపై అవగాహన అవసరం వనపర్తిటౌన్: కాబోయే ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడపగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం స్థానిక గాయత్రి బీఈడీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచి చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్లో ఎలాంటి తప్పులు చేయకుండా సమాజాభివృద్ధికి పాటుపడతారని వివరించారు. పోక్సో, ఎన్డీపీఎస్, బాల్య వివాహాలు, వినియోగదారుల రక్షణ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, కళాశాల అధ్యాపకులు మల్లికార్జున్, మోహన్, సురేష్, వీరభద్రయ్య, నిరంజన్ వలి, నాగేంద్రం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ విజేత పల్నాడు జట్టు ఆత్మకూర్: మండలంలోని మూలమళ్లలో దివంగత దేశాయి సరళాదేవి జ్ఞాపకార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిగిన పోటీల్లో మొత్తం 10 జట్లు తలపడ్డాయి. చివరిరోజు మంగళవారం రాత్రి జరిగిన తుది పోరులో పల్నాడు జట్టు, హైదరాబాద్ జట్టు తలపడగా పల్నాడు జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ దేశాయి పద్మజారెడ్డి విజేత జట్టుకు రూ.50 వేలు, హైదరాబాద్ జట్టుకు రూ. 40 వేలు నగదుతో పాటు జ్ఞాపిక అందజేశారు. మూడోస్థానంలో నిలిచిన మహబూబ్నగర్ జట్టుకు రూ.30 వేలు, నాలుగో బహుమతిగా బాపట్ల జట్టుకు రూ.20 వేలు, ఐదో బహుమతి కర్ణాటకకు రూ.15 వేలు, ఆరో బహుమతి మూలమళ్ల జట్టుకు రూ.10 వేలు, ఏడో బహుమతి గద్వాలకు రూ.6 వేలు, 8వ బహుమతి రంగారెడ్డి జిల్లా జట్టుకు రూ.5 వేలు, జ్ఞాపిక అందజేశారు. -
సలేశ్వరం.. జనసంద్రం
తెలంగాణ అమర్నాథ్ సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ భక్తిపారవశ్యంతో ముందుకు కదిలారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. శివనామస్మరణతో నల్లమల అభయారణ్యం పులకరించింది. సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా.. మొదటి రోజు వేలాది భక్తులు తరలివచ్చారు. – అచ్చంపేట/అచ్చంపేటరూరల్ – వివరాలు 8లో.. -
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. ●– మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
పండుగ వాతావరణంలో గ్రామసభలు
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామ, పుర వార్డుసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఇచ్చిన రైతుభరోసా, పంట రుణమాఫీ, ధాన్యం సేకరణ, రైతులకు రూ.500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, రూ.500 సిలిండర్ తదితర వివరాలతో కూడిన కరదీపికలు తయారు చేయించి గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేసి, లబ్ధిదారుల పేర్లు సైతం చదివి వినిపించాలని ఆదేశించారు. ఎవరైనా అర్జీలు ఇచ్చేవారు ఉంటే తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామసభకు ప్రజలు అత్యధికంగా వచ్చేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి సౌకర్యం, ముఖ్యమంత్రి సందేశం చూసేందుకు టీవీ తదితర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమించామని.. ఉదయం 10 గంటలకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, సభ ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పుర కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
నాగర్కర్నూల్వనపర్తిగద్వాలగతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఏప్రిల్ 7 వరకు అవకాశం..
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటించాం. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో అధికారుల సమక్షంలో సభ్యుల ఎన్నికకు ప్రణాళిక సిద్ధం చేశాం. – నూరుల్నదీం, పుర కమిషనర్, అమరచింత ఏప్రిల్ 16 నాటికి కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీక రిస్తాం. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ -
ముగిసిన జిల్లాస్థాయి ఎంపికలు
వనపర్తిటౌన్: క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారని డీవైఎస్ఓ టి.సుధీర్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకుగాను జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంతో దోహదపడుతుందన్నారు. వనపర్తిని క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. క్రీడల్లో సత్తా చాటడంతో ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. ఎంపికలకు వివిధ మండలాలకు చెందిన 60 మంది బాలురు పాల్గొన్నారని.. జిల్లాస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులు ఏప్రిల్ 30, మే నెల 1న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్లో ప్రవేశాలు పెంచాలి : డీఐఈఓ ఆత్మకూర్: రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాల్లో ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, రాఘవేందర్రావు, లలితమ్మ, వీణ, చైతణ్యరాణి, స్వాతి, సునయన, విశ్వాస్, నారాయణ, దేవదాసు, సునీల్కుమార్, పావని, ఏకే కురుమూర్తి, రాఘవేంద్ర, రామన్గౌడ్ పాల్గొన్నారు. హుండీ లెక్కింపు అడ్డాకుల: కందూర్ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి హుండీ లెక్కించారు. బ్రహోత్సవాలు, జాతరకు భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. రూ.5,17,591ల నగదు స్వామివారి హుండీ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది. -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా కురియాల జంక్షన్ రాంపూర్పెంట పుల్లాయిపల్లిమోకాల కుర్వ చెప్పుల కుర్వ -
లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి
ఆత్మకూర్: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో సాధించే దిశగా శ్రమిస్తూ ముందుకుసాగాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంవీ రామన్ పాఠశాలలో నిర్వహించిన సమగ్ర విద్యా విజ్ఞాన ప్రదర్శన–2026ను మంత్రితో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. మొత్తం 51 స్టాళ్లలో ప్రదర్శించిన 741 ప్రదర్శనలు, ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్మేళాలు ఎంతోగానో దోహదపడతాయన్నారు. కష్టపడేతత్వం ఉంటే అనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధించవచ్చని, తల్లిదండ్రులే నిజమైన హీరోలని, గురువులను గౌరవించిన వారు జీవితంలో ఏదైనా సాధిస్తారని వివరించారు. పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ అన్సీ శ్రీధర్, డైరెక్టర్ శ్రీధర్గౌడ్ను అభినందించారు. ఉన్నతంగా రాణించాలి.. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో చదివితే అనుకున్నది సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా అత్యత్తమంగా రాణించాలని, జిల్లా విద్యారంగానికి నిలయమని.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా కు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆత్మకూర్: పుర అభివృద్ధికి రూ.5.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని.. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కమిషనర్ చికినె శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రూ.5.10 కోట్లతో బడ్జెట్ రూపొందించామని.. ఇందులో రూ.2.50 కోట్లు పన్ను రాబడి, పన్నేతర రాబడి రూ.2.25 కోట్లు, అసైన్డ్ ఆదాయం రూ.35 లక్షలుగా అంచనా వేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నామన్నారు. అన్నివార్డుల్లో సమానంగా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిధులను పారదర్శకరంగా వినియోగించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుపతయ్య, లలితరాజు, శంకరమ్మ బాలరాజు, దండు శ్రీను, భరత్, జిందె జ్యోతి శ్రీనివాస్, తులసి వెంకట్రాములు, జుబేదాబేగం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రామసభల నిర్వహణ
పాన్గల్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పండుగ వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల వివరాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామసభల్లో ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కరదీపికలను గ్రామసభలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అందజేయాలని సూచించారు. గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి వసతి కల్పించాలని, నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయి అధికారులు గ్రామసభల నిర్వహణపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, ఏపీఎం వెంకటేష్, ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
లింగమయ్య దర్శనానికి వేళాయె
సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ – -
ఉత్సాహంగా కొనసాగుతున్న కబడ్డీ పోటీలు
ఆత్మకూర్: మండలంలోని మూలమళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఆంధ్రాకు చెందిన పల్నాడు, తెలంగాణకు చెందిన హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. విజేత జట్టుకు రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో విజేతకు రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలతో పాటు జ్ఞాపికలు అందించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ దేశాయి పద్మజారెడ్డి తెలిపారు. పోటీలను తిలకించేందుకు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు తరలివచ్చారు. -
అంచనా బడ్జెట్ రూ.63.74 కోట్లు
వనపర్తి టౌన్: స్థానిక పుర కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.63.74 కోట్ల వార్షిక అంచనా పద్దును ఎలాంటి కనీస చర్చ లేకుండానే కౌన్సిల్ ఆమోదించింది. మిగులు బడ్జెట్ను పరిగణలోకి తీసుకోకుండా రూ.55.31 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2027, మార్చి 31 నాటికి ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మిగులు నిధులు రూ.3.04 లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం బడ్జెట్లో సొంత రాబడిని రూ.25.90 కోట్లుగా చూయించగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పన్నేతర ఆదాయాలు కలుపుకొని రూ.29.26 కోట్లుగా ప్రతిపాదించారు. ఆస్తి పన్ను రూ.12.23 కోట్లు, కొళాయి బిల్లు రూ.7.50 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.85 లక్షలుగా.. పన్నేతర ఆదాయాన్ని రూ.13.67 కోట్లుగా పొందుపర్చారు. రూ.60.79 కోట్లు ఏడాది కాలంలో ఖర్చు కానున్నాయని.. 2027, మార్చి 31 నాటికి మిగులు నిధులు రూ.3.04 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఖర్చుల్లో అత్యధికంగా జీతభత్యాలకు రూ.6.30 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.2.70 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.3.20 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.2.59 కోట్లు, విలీన గ్రామాల అభివృద్ధికి రూ.2 కోట్ల చొప్పున అంచనాలు రూపొందించారు. పలువురు సభ్యుల అభ్యంతరం.. బడ్జెట్ వివరాలను అకౌంటెంట్ జానకిరాములు చదవగా.. ఎంపీ నిధులను గత బడ్జెట్ కంటే తక్కువగా చూపారని 23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్గౌడ్ అభ్యంతరం తెలిపారు. గత బడ్జెట్లో పన్నుల ద్వారా చూపించిన ఆదాయానికి, ప్రస్తుతం చూయిస్తున్న ఆదాయానికి పొంతన లేదని 18వ వార్డు సీపీఎం కౌన్సిలర్ గంధం మదన్ ప్రశ్న లేవనెత్తారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు బదులిచ్చారు. గాంధీచౌక్లో శౌచాలయాలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లుగా అధికారులు ఎందుకు స్పందించడం లేదని అధికార పార్టీ సీనియర్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. వేలం నిర్వహణలో పదేళ్లుగా అవకతవకతలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో నష్టం వాటిల్లుతుందని మండిపడటంతో నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. సీఓ సరస్వతి ఆర్పీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని 15వ వార్డు కౌన్సిలర్ సౌమ్య కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ చర్యలకు కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం కోరగా పూర్తిస్థాయిలో పరిశీలించిన చేసిన తర్వాతే ముందుకెళ్దామని 21వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి అడ్డుచెప్పడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మురళీసాగర్ మాట్లాడుతూ.. కొత్త కౌన్సిలర్లకు బడ్జెట్పై అవగాహన కల్పించకుండా సమావేశం నిర్వహించడం సరైంది కాదన్నారు. బడ్జెట్ సమావేశంలో పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా పనిచేస్తే కుదరదని.. పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో చేపట్టే రహదారి విస్తరణకు కౌన్సిల్ సభ్యులందరూ సహకరించాలని సూచించారు. ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్నామని.. లక్ష్యం చేరుకునేందుకు యత్నించాలన్నారు. ఈ ప్రాంత ప్రజలే తనకు ప్రాణపదమని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇక్కడి వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఖరారు కానుందన్నారు. మున్సిపాలిటీకి తాను తీసుకొచ్చిన రూ.18 కోట్ల అభివృద్ధి పనులు ఏయే దశలో ఉన్నాయో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, లేకపోతే కేంద్ర నిధులు రావన్నారు. రహదారి విస్తరణకు సహకరించాలి.. కనీస చర్చ లేకుండానే పద్దులకు ఆమోదం -
ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కొత్తకోట రూరల్: పురపాలక సంఘాలు తమ సొంత ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. పుర కమిషనర్ సైదయ్య బడ్జెట్ ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ సొంత ఆదాయం రూ.483.80 లక్షలు కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు రూ.588.00 లక్షలుగా అంచనా వేశారు. మొత్తం అంచనా ఆదాయం రూ.1071.80 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. ఇందులో వేతనాలకు రూ.180.00 లక్షలు, పారిశుద్ధ్యానికి రూ.77.10 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.130 లక్షలు, హరిత నిధికి రూ.60 లక్షలు, ఇంజినీరింగ్ విభాగానికి రూ.125 లక్షలు, సాధారణ పరిపాలనకు రూ.55.70 లక్షలు, టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.6 లక్షలు కేటాయించినట్లు వివరించారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం 1/3 బడ్జెట్ నిబంధన ప్రకారం అభివృద్ధి చెందని ప్రాంతాలకు రూ. 23.00 లక్షలు, ప్రజా అభివృద్ధి పనులకు రూ.11.50 లక్షలు, వార్డుల వారీగా అభివృద్ధి పనులకు రూ.80.00 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 68.80 లక్షల మిగులు నిధి ఉండనున్నట్లు అంచనా వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం, ఫాగింగ్, అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పుర వైస్ చైర్పర్సన్ పల్లవి, కౌన్సిల్ సభ్యులు, పుర అధికారులు పాల్గొన్నారు. -
పండుగలా గ్రామసభల నిర్వహణ
–8లో uవనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు, మున్సిపల్ సభల నిర్వహణపై సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి ఏర్పాట్లు, సభ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. గ్రామసభల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, సోమవారమే ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందించడంతో పాటు గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు తదితర విషయాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల కరదీపికలను గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు. ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించాలని.. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం వీక్షించేలా టీవీ సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు ముందస్తు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని.. ప్రస్తుత, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన వాటిని సైతం వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి 35 వినతులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సునీతరెడ్డి స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఎస్పీ చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
హామీల సాధనకు రోడ్డెక్కిన ఆశాలు
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సోమవారం ఆశా కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాలు మారినా ఆశా కార్యకర్తల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా.. ఆశాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పని భారం అధికంగా ఉందని.. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆశాలు చలో అసెంబ్లీ నిర్వహిస్తే ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం సరికాదన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసులతో ఆశా కార్యకర్తలను నిర్బంధించడం మానుకోవాలన్నారు. కుష్టు సర్వే బకాయి డబ్బులు, రెండు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శులు సూర్యవంశం రాము, రాజు, ప్రసాద్, మద్దిలేటి, ఆశా కార్యకర్తలు భాగ్య, గిరిజ, దేవమ్మ, అనిత, రాణి, అనసూయ, పుష్ప, సంతోష, స్వాతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలి
వనపర్తిటౌన్: జిల్లాలోని నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు అక్షరాలు నేర్పి సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు డీఆర్డీఓ, సెర్ప్, మెప్మా, విద్యాశాఖ సంయుక్తంగా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకు దూరమైన నిరక్షరాస్య మహిళలు అక్షరాస్యులు అవుతారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని చిట్యాల, అంకూరు, చీమనగుంటపల్లి, తూర్పుతండాలో సైతం పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, ఏపీఎం బుచ్చన్న, డీఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వసతులు కల్పించాలి..
జూరాల ప్రాజెక్టు వద్ద కనీస వసతులు లేక పర్యాటకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద జలాశయంలో బొటానికల్ పార్క్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. – రాజు, మస్తీపురం పర్యాటక ంగా తీర్చిదిద్దాలి.. చారిత్రక చంద్రగఢ్ కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం గ్రామపంచాయతీ నిధులు, అధికారుల చొరవతో కోట పరిసరాల్లో మెగా ప్రకృతివనం ఏర్పాటు చేయిస్తున్నాం. – నాగేశ్వర్రెడ్డి,మాజీ సర్పంచ్, చంద్రగఢ్ ప్రతిపాదనలు పంపాం.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పార్క్ల ఏర్పాటుకు గతంలోనే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే విధంగా మారోమారు ప్రతిపాదనలు పంపిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ● -
దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : బీజేపీ
వనపర్తి రూరల్: ప్రధాని మోదీ నీతివంత పాలనతో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పెబ్బేరులోని బీఈడీ కళాశాలలో జరిగిన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యవక్తగా హాజరై ‘చరిత్ర.. వికాసం’ అనే అంశంపై మాట్లాడారు. 1984లో బీజేపీ కేవలం రెండు సీట్లతో గెలిచి.. ప్రస్తుతం మూడోసారి స్పష్టమైన మెజార్టీతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. యుద్ధ సమయంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి దేశ ప్రజలకు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రంగస్వామి, నారాయణ, వెంకట్రామారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రాంతినాయడు, మండలాల అధ్యక్షులు నాగరాజు యాదవ్, విష్ణువర్ధన్, మొగిలి రఘు, గోవింద్నాయుడు, సరేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
పర్యాటకం.. పరిహాసం!
జూరాల, చంధ్రగడ్ వద్ద కనీస సౌకర్యాలు కరువు ● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత కృష్ణా పుష్కరాల సమయంలో ప్రాజెక్టు దిగువ భాగంలో పుష్కరఘాట్లను నాసిరకంగా నిర్మించడంతో వరదలకు కొట్టుకుపోయి బండరాళ్లు తేలాయి. దీంతో ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసేపు సేద తీరడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఇక్కడి ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు రహదారిలో అమరచింత మండలంలో ఉన్న చారిత్రక కట్టడం చంద్రగఢ్ కోట అభివృద్ధిని సైతం పాలకులు విస్మరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కళకళా.. వెలవెల... జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కుడి కాల్వ ఉండటం, ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు సైతం అటువైపే ఉండటంతో ఆ ప్రాంతంలో పార్క్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ● ఆయకట్టు సాగుతో పాటు దిగువ ప్రాజెక్టు పరిధిలో విశాలమైన ప్రదేశం, రుచికరమైన చేప వంటకాలు లభిస్తుండటంతో పర్యాటకులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. ఈ ప్రాంతంలో పట్టదనం -
నిబంధనల మేరకే యూడీఐడీ కార్డులు జారీ
వనపర్తి: దివ్యాంగులకు యూనిక్ డిజబుల్ ఐడి కార్డులను పారదర్శకంగా జారీ చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలతో యూనిక్ డిజబుల్ ఐడీ కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేయమని.. అర్హులందరికి అందేలా చూస్తామని చెప్పారు. అలాగే శిబిరాలకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. యూడీఐడీ దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం
అమరచింత: జాతీయ ఉపాధిహమీ పథకం పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించిందని.. ప్రజాప్రతినిధులు త్వరగా పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్సెంటియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.56 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకంగా మార్చి కూలీలకు పని దినాల పెంపుతో పాటు గ్రామాలకు అదనంగా నిధులు మంజూరు చేసేలా రూపొందించిందన్నారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన ఉపాధి పనులు నేటికీ అసంపూర్తిగా ఉండటంతో నిధులు వెనక్కి వెళ్తాయని భావించి కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని కలిసి గడువు పొడిగించాలని కోరామని చెప్పారు. ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. సమాజంలో మనుగడ సాగించాలంటే చదువుతోనే సాధ్యమని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణానికి చెందిన పంజాబ్, చత్తీస్ఘడ్ బీజేపీ సంఘటన ఇన్చార్జ మంత్రి శ్రీనివాస్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి అభయ ఫౌండేషన్ ద్వారా నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి.. అమరచింతలో జూనియర్ కళాశాల లేకపోవడం బాధాకరమని.. త్వరలో ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్బీఐ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి, అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, దేవకి వాసుదేవరావు, మహంకాళి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు శారదమ్మ, కౌన్సిలర్లు మేర్వ రాజు, ఊషన్న, విష్ణు, తిరుమల్లేష్, మీనుగ లక్ష్మి, జిందె శ్రీనివాస్, చంద్రానాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య, మరాఠి అశోక్, క్యామ భాస్కర్, దుబాయి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే సమాజంలో గౌరవం
వనపర్తిటౌన్: చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని.. చదువు లేదంటే రాజకీయాల్లో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డా. కదిరె కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జిల్లాలోని మాదిగ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. మాదిగలు చరిత్రలో మొదటి కళాకారులని.. జాతి అభివృద్ధే లక్ష్యమని, విద్యావంతులు, జ్ఞానవంతులు మాదిగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మాదిగలు ఎదగాలని.. పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులుగా తయారు చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలరని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుతోనే ఏదైన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు పదవి కాలంలో సమస్యల పరిష్కారానికి శ్రమించి అభివృద్ధి చేయాలని సూచించా రు. మాదిగల ఐక్యవేదిక సభ్యులు పెద్దింటి వెంకటేష్, గంధం పరంజ్యోతి, మంద రాములు, మీసాల రాము, చిట్యాల తిరుపతి, వడ్డేమాన్ రవి, ద్యారపోగు నాగరాజు, రాజనగరం రాజేష్, గంధం ప్రవీణ్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 5,625 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: జాతీయ లోక్ అదాలత్లో రాజీపడి కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులు ఇరువురు గెలిచినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజీ పడదగిన కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజీయే రాజ మార్గమని.. కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని.. అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్ బౌన్స్, ఇన్స్యూరెన్స్, సైబర్ క్రైమ్, డ్రంకెన్ డ్రైవ్ తదిత కేసులు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా రెండు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ కల్పిస్తుందని.. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 5,625 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్, కార్యదర్శి వెంకటరమణ, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్, కోర్టు సిబ్బంది, లోక్అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రాములోరి పట్టాభిషేకం
గోపాల్పేట: మండల కేంద్రంలోని పురాతన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, భక్తుల సమక్షంలో అర్చకులు రాములోరి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు.. మధ్యాహ్నం 12 నుంచి పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. చాలామంది భక్తులు పంచెలు, చీరలు ధరించి సాంప్రదాయ పద్ధతిలో ఆలయానికి చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు సీతారామలక్ష్మణులతో నాణేలను తయారు చేయించి ప్రత్యేక పూజల అనంతరం దంపతులకు అందజేశారు. అలాగే రాత్రి 8.30 గంటలకు రామాలయం నుంచి కేశవాలయం వరకు పల్లకీసేవ నిర్వహించారు. ఆదివారం ఉదయం నిత్యహోమం, సుందరకాండ హోమం, రాత్రి 11 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: జిల్లాలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్, ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుత తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జయంతి వేడుకల నిర్వహణపై దళిత, ప్రజాసంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయా రోజుల్లో మహనీయుల జీవితగాథలను అందరికీ తెలియజేసేలా కళాజాతా నిర్వహించాలని, కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాంజీరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, దళిత, ప్రజాసంఘాల నాయకులు గంధం గట్టయ్య, గంధం నాగరాజు, మాదారి భోజరాజు, విశ్వం, వీరప్ప, రమేష్, భరత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 2వ విడత రాయితీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు https://tgobmms. cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసానికి సైతం ఆసక్తిగల అభ్యర్థులు ఎస్సీ కార్పొరేషన్కు దరఖా స్తు చేసుకోవచ్చని సూచించారు. వేలం వాయిదా వనపర్తి టౌన్: స్థానిక పురపాలికలో 2026–2027 సంవత్సరానికిగాను గురువారం జరగాల్సిన తైబజార్, పశువుల సంత, జంతువధశాల బహిరంగ వేలానికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానందున వాయిదా వేసినట్లు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన బహిరంగ వేలాన్ని ఎప్పుడు నిర్ణయించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఇళ్ల మంజూరులో తేడాలొస్తే కఠిన చర్యలు
గోపాల్పేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని బుద్దారం గ్రామంలో పర్యటించి గతంలో మంజూరైన 40 డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ తిలక్కుమార్ అధ్యక్షతన ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అర్హులెవరు అనే వివరాలతో పూర్తి నివేదికను పదిరోజుల్లో తనకు అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోలేని పరిస్థితిలో ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ విఠోభా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయులు ఐక్యంగా ఉంటూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు, పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చిన్నారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, మాజీ డిప్యూటీ డీఈఓ విశ్వనాథం, సర్పంచ్ బాలరాజు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ప్రతి ఓటరు 3 ఫారం పూరించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి బూత్కు ప్రతి పార్టీ నుంచి ఏజెంట్ను నియమించి వారి జాబితా సమర్పిస్తే గుర్తింపుకార్డు జారీ చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ నిబంధనలు వివరిస్తూ ఓటరు 1987 కంటే ముందు దేశంలో జన్మించి ఉంటే అందుకు సంబంధించిన ఆధారం (గుర్తింపు కార్డు) సమర్పించాల్సి ఉంటుందన్నారు. 1987 తర్వాత జన్మిస్తే అతడితో పాటు అతడి తండ్రి ఆధారం ఉండాలని సూచించారు. పుట్టిన తేదీ లేదా స్థలం ఆధారానికి ఎన్నికల సంఘం 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పటి వరకున్న ఓటరు జాబితాను పూర్తిగా జీరోచేసి మొదటి నుంచి కొత్త ఓటరు జాబితా రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్గౌడ్, కుమారస్వామి, పెద్దిరాజు, కొత్తగొల్ల శంకర్, వేణాచారి తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంఐడీసీ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాతా శిశు సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్తో కలిసి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.కోటి నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సిటీ స్కాన్ సెంటర్, సదరం క్యాంపు కేంద్రాల్లో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. వీటితో పాటు ఆస్పత్రికి అవసరమైన వీల్ చైర్లు, బీపీ కొలిచే మిషన్లు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసుకునే విధంగా సిటీ స్కాన్, సదరం క్యాంపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి, యంత్ర సామగ్రికి వెంటనే ఆర్డరు పెట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అంతకముందు కలెక్టర్ సీబీపీ, హెచ్బీ 1 రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ పరిమళ, ఇతర వైద్య సిబ్బంది తదితరులున్నారు. క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే క్షయ వ్యాధి పూర్తిగా నయమైపోతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీబీ నివారణ కేంద్రంలో కలెక్టర్ వంద రోజుల క్యాంపెయిన్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు -
గుడిపర్తి రిజర్వాయర్ను పరిశీలించిన మాజీ మంత్రి
గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ అని, తెలంగాణ సాకారమయ్యకే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రేవల్లి మండలంలోని గుడిపల్లి రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్వకుర్తి పరిధిలో రైతులకు మరో 40 రోజులు నీరు ఇవ్వాల్సి ఉంటుందని, శ్రీశైలంలోని ప్రతిచుక్కను వినియోగించుకోవాలన్నారు. కల్వకుర్తికి మోటార్లతో 240 రోజులు సాగునీరు ఇవ్వవచ్చన్నారు. అసంపూర్తిగా ఉన్న కేఎల్ఐ కాల్వకు రూ.3వేల కోట్లతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, టన్నెల్, కాల్వలు, పవర్లైన్స్, సర్జిపూల్, మోటార్లు పూర్తి చేసి 4 లక్షల ఎకరాకలు సాగునీరు అందించామన్నారు. అలాగే భూగర్భ జలాల ద్వారా మరో లక్ష ఎకరాలకు నీరందించామని మొత్తం ఐదు లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారన్నారు. 90 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయనతో వెంట గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రామాల్లో కాషాయ జెండా ఎగరాలి’
మదనాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అజ్జకొల్లు పర్యటనలో భాగంగా మదనాపురం చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడికి స్థానిక బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారత్ మాతా కీ జై నినాదాలతో మండల కేంద్రంలోని వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు. జిల్లాలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అనంతరం ఇటివల అజ్జకొల్లులో అడ్వకేట్ రాజవర్ధన్రెడ్డి మాతృమూర్తి మరణించడంతో రాంచందర్రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ, వనపర్తి శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు ఎద్దుల రాజవర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, కొత్తకపు మాధవరెడ్డి, వంగూరు రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, అమర్నాథ్ శెట్టి, బాబుగౌడ్, అంజన్నయాదవ్, బాలవర్ధన్, కావలి శివ తదితరులు పాల్గొన్నారు. -
‘ఐరాడ్’తో ప్రమాదాల నివారణకు చర్యలు
వనపర్తి: ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డాటా బేస్) అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్ఐలకు, రైటర్లకు ఐరాడ్ అప్లికేషన్పై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఐరాడ్ అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం, ప్రమాద స్థలాలను ఖచ్చితంగా గుర్తించడం, డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టే విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న కారణాలను సాంకేతికత ద్వారా గుర్తించడం అత్యంత అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఖచ్చితమైన సమాచారం సేకరణలో ఐరాడ్ అప్లికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ప్రమాదాన్ని సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో ప్రమాదాలు తగ్గించే చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. బాధితులకు ప్రభుత్వం అందించే బీమా ప్రయోజనాలు, చికిత్స అవకాశాలు గురించి పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఐఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, పోలీస్స్టేషన్ల సీసీటీ ఎన్ఎస్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను నిరాశపర్చిన బడ్జెట్
● అంకెల గారడీతో మభ్యపెట్టే ప్రయత్నం ● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న పద్దులు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి మూడు సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితిలో రేవంత్రెడ్డి సర్కారు కొనసాగుతుందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు పూర్తిగా మోసపూరితమేనని.. దేశ చరిత్రలో ప్రజలను ఇంతగా మోసం చేసే బడ్జెట్ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కనీసం కొన్నింటిని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. దివ్యాంగులు, విద్యార్థినులు, రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలు, హరిజన, గిరిజన, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను మోసం చేసి చరిత్రకెక్కిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. -
ఆదాయం అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ● నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం ● జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
హైలెవల్ వంతెన నిర్మించి తీరుతాం
ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ.. మండలంలోని తిప్పడంపల్లిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి శనివారం ఆవిష్కరించారు. అలాగే ఆత్మకూర్లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. మేడేపల్లిలో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాస్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ పాల్గొన్నారు. పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం... అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
● ఈద్గాల వద్ద ముస్లింల సామూహిక ప్రార్థనలు ● శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు వనపర్తిటౌన్: భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తూ దైవ ప్రార్థన, ఉపవాసాలు, దానధర్మాలు, మక్కా యాత్ర పంచసూత్రలపై ఆధారపడి ఉండటమే రంజాన్ మాసం ప్రత్యేకత అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నెలరోజుల ఉపవాసాల అనంతరం శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో జిల్లాలోని ముస్లింలు శనివారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని ఈద్గాలు, మసీద్ల వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం రాజకీయ ప్రముఖులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని గోపాల్పేట రోడ్లో ఉన్న ఈద్గా, శ్రీనివాసపురంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, నందిమళ్ల అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు ముస్లింల నివాసాలకు చిన్నారెడ్డి, మేఘారెడ్డి, ఆలిండియా మెడికల్ విభాగం రాష్ట్ర సమన్వయకర్త జిల్లెల్ల ఆదిత్యరెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలుపగా, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో కలిసిన ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ ఎం.మాధవి, పీసీసీ సభ్యుడు శంకర్ప్రసాద్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, నాయకులు చరణ్రెడ్డి, ఆదిత్య పాల్గొన్నారు. ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి ఆత్మకూర్ ఈద్గా వద్ద ము స్లింలకు పండుగ శుభా కాంక్షలు తెలిపారు. పోలీస్ బందోబస్తు.. జిల్లాకేంద్రంలోని ఈద్గాలు, మజీద్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం రహదారులపై ముస్లింలు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు కోత విధించేలా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ ఆరోపించారు. శనివారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సరిపడా బడ్జెట్ కాదని విమర్శించారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి ఒకసారి మాత్రమే రూ.6 వేలు చెల్లించి, మిగతా రూ.18 వేలు బకాయి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమాపై స్పష్టత ఇవ్వాలని.. కుటుంబానికి కాకుండా రైతు బీమా తరహాలో రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేయూత పింఛన్ రెట్టింపునకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 నగదు ఊసే లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ మరిచారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సరిపడా బడ్జెట్ కేటాయించాలన్నారు. శంకర్, మోహన్, అశోక్, మణెమ్మ, చెన్నప్ప, షేక్ అహ్మద్, అనంతరెడ్డి పాల్గొన్నారు.


