breaking news
Wanaparthy
-
‘కో–ఆప్షన్’.. కలేనా..!
నారాయణపేట/మరికల్: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురికి.. పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవజ్ఞుడైన సీనియర్ సిటిజన్స్, గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, గ్రామాభివృద్ధికి దోహదపడిన ఎన్ఆర్ఐ, దాత లేదా స్థలం ఇచ్చిన వ్యక్తి. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్, సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు. ఎందుకు కీలకం..? గ్రామాల్లో చాలామంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ నిపుణులు ఉన్నారు. వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని రూపొందించారు. గ్రామాల్లో నిధుల వినియోగం, చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యరంగాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నియామకాలు జరగకపోవడంతో ఆ అవకాశం వృథా అవుతోంది. ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం. – వెంకట్రాములు, డీపీఓ, నారాయణపేట ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది.. -
విచారణ చేస్తాం..
కార్యాలయంలో బ్యాంకు గ్యారెంటీ బాండ్ మిస్సింగ్ అయినట్లుగా నాకు సమాచారం లేదు. వెంటనే పరిశీలించి ఎలా మిస్సింగ్ అయ్యిందో విచారణ చేస్తాం. టెక్నికల్ అసిస్టెంట్లపై ఆరోపణలు శాఖలో ఇదివరకు పని చేసిన వారు ఇచ్చిన లీకేజీలతో సమస్య నెలకొంది. ఫోన్పే స్క్రీన్షాట్లపై విచారణ చేస్తే.. అప్పుగా తీసుకున్నట్లు తెలియవచ్చింది. అట్టి మొత్తాన్ని తిరిగి ఇచ్చారు. వాటికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయి. – ఆంజనేయులు, డీఎం, జిల్లా పౌరసరఫరాలసంస్థ ● -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వాంతులు విరేచనాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గురుకులాలు, కళాశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు, భోజనం వడ్డించే వారికి ఐడల్ (టైఫాయిడ్) పరీక్షలు నిర్వహించాలని, ఎవరికై నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రెండు వారాల పాటు క్వారంటైన్ చేసి వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారికి సూచించారు. మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మంగళ, శుక్రవారం క్రమం తప్పకుండా డ్రై డే నిర్వహించాలని కోరారు. అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫ్రై డే – డ్రై డే పాటించాలన్నారు. గతంలో డెంగీ కేసులు నమోదైన వార్డులు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వకుండా చూసుకోవాలని పుర కమిషనర్లు, డీపీఓలను ఆదేశించారు. ప్రతి నెల 11, 21, 31 తేదీల్లో మంచి నీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, శుభ్రం చేస్తున్న ఫొటోలు తీసుకోవడంతో పాటు రిజిస్టర్లో నమోదు జరగాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఆర్వో సూర్యప్రకాష్, ఎస్డీసీ తిరుపతయ్య, జిల్లా అధికారులు ఉన్నారు. మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవం.... సోమవారం నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో పెద్దఎత్తున మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆయా రోజుల్లో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని.. 26వ తేదీన 2కె రన్ ఉంటుందని చెప్పారు. వారం పాటు కొనసాగే మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మత్తు బారిన పడకుండా కమిటీలు చురుగ్గా పని చేయాలని, ఎక్కడైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పాన్, గుట్కా తదితర దుకాణాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే తక్షణమే సమాచారమిచ్చి డి–అడిక్షన్ సెంటర్కు పంపించాలన్నారు. అనంతరం డీఎస్పీ బాలాజీనాయక్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఫ్లెక్సీపై అధికారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. -
క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
వనపర్తి: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగంగా మార్చుకొని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 40వ ఒలింపిక్ డే రన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయనతో పాటు అదనపు ఎస్పీ రాజేష్ మీనా ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేడ్కర్ చౌక్, రాజీవ్గాంధీ చౌరస్తా, బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడా సంస్కృతి పెంపొందితేనే భవిష్యత్ ఒలింపియన్లు తయారవుతారని తెలిపారు. యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా, సామాజికంగా బాధ్యతాయుతంగా ఎదగాలంటే క్రీడలే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఒలింపిక్ డే రన్తో ప్రజలందరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఫిట్ ఇండియా–హెల్తీ ఇండియా లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యకరమైన జీవన విధానానికి, క్రమశిక్షణకు, దేశభక్తి భావన పెంపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనమన్నారు. క్రీడా స్ఫూర్తి, ఐక్యత, గౌరవం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలన్నారు. రోజూ కనీసం ఒక గంట పాటు నడక, పరుగు, యోగా లేదా ఏదైనా క్రీడలో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టు భావనను పెంపొందిస్తాయని చెప్పారు. నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్య మాలపై ఎక్కువ సమయం గడపకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి, యువకుడు రోజూ వ్యాయామం చేయా లని సూచించారు. పుర చైర్పర్సన్ మాధవి, ఒలింపిక్ డే కన్వీనర్లు సురేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, కుమార్, కౌన్సిలర్ బ్రహ్మచారి, డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, హెచ్ ఎం శివాజీ, పీడీలు మన్యం యాదవ్, శ్రీనివాసులు, నిరంజన్గౌడ్, మధు, శ్రీదేవి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
ఎస్పీ ప్రజావాణికి 25 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నేరుగా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను కలిసి వినతులు అందజేశారు. ఏఎస్పీ ఫిర్యాదును స్వయంగా పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేడు 2కే రన్ వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో ఎస్ఐఆర్పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉదయం 6 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు రన్ కొనసాగుతోందని.. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరూ ఎస్ఐఆర్లో భాగస్వాములై తమ ఓటును జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని, అందులో భాగంగా 2కే రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఎల్వోలు జూన్ 25 నుంచి జులై 31 వరకు ఇల్లిల్లూ తిరిగి ఓటరు నమోదు చేపడతారని.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 1–10–2026 నాటికి 18 ఏళ్లు నిండిన యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈఓ వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు గణేష్కుమార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకా లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతను గుర్తించి సమయపాలన పాటిస్తూ విధులకు హాజరై విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ శేఖర్, ఉపాధ్యాయులు సంజీవయ్య, గిరిరాజాచారి, రుద్రమదేవి, సాయిప్రకా ష్, రవి, జ్యోతిలక్ష్మి, మహ్మద్ షఫీ, శ్రీనివాసులు, స్వరూప, సీఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల మధ్య భగ్గుమంటున్న విభేదాలు
● అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలు, అంతర్గత విషయాలు బయటకు.. ● ఇటీవల ఏసీబీకి చిక్కిన జిల్లాస్థాయి అధికారి ● దుమారం రేపుతున్న టీఏల ఆన్లైన్ లావాదేవీలు రూ.95 లక్షల బ్యాంకు గ్యారెంటీ బాండ్ ఎక్కడా? గత సీజన్లో జిల్లాలోని పెద్దమందడి మండలానికి చెందిన ఓ మిల్లర్ తనకు ధాన్యం కేటాయించాలని ఇచ్చిన రూ.95 లక్షల బ్యాంకు గ్యారంటీ బాండ్ కనిపించడం లేదంటూ.. ఇదేశాఖకు చెందిన ఓ అధికారి కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైతం సదరు కార్యాలయ ఉద్యోగులు బాహాటంగా కలెక్టరేట్లో చర్చించుకోవడం గమనార్హం. ఎంతో విలువైన బ్యాంకు గ్యారెంటీలకే కార్యాలయాల్లో భద్రత లేకుంటే.. సామాన్య కార్యాలయ పరిపాలన వివరాల ప్రతులకు ఎంతమేర జాగ్రత్త చేస్తారో చెప్పనవసరం లేదనే అసహనం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు ఉపక్రమించకుంటే రాష్ట్రస్థాయిలో జిల్లా అప్రతిష్టపాలు కావడం ఖాయమనే వాదనలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే జిల్లాగా వనపర్తి పేరును కాపాడాల్సిన అవసరం ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాలశాఖవనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ పరిధిలోకి వచ్చే రెండు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో కొన్ని నెలలుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా కలహాలు చోటు చేసుకోవడం జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఇదే కారణంతో 2026, జనవరి 9న జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఏసీబీకి పట్టుబడ్డాడనే వాదనలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత వరుస టాస్క్ఫోర్స్ దాడులు, శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్రస్థాయి అఽధికారులకు సైతం ఫిర్యాదులు అందడం లాంటి ఘటనలు తరుచూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. తోటి ఉద్యోగులను టార్గెట్ చేయడం, అనుచరులతో రహస్యంగా ఫిర్యాదులు చేయించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
పేదలకు పక్కా ఇళ్లే ప్రభుత్వ లక్ష్యం
● ‘ఇందిరమ్మ’ పథకంలో తొలి ప్రాధాన్యం ● ‘ప్రజాపాలన’ ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వనపర్తి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ, ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంతో పాటు ఖిల్లాఘనపురంలో పర్యటించి డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన ఆయన సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జిల్లాలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలని, జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్లాక్స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వంటగ్యాస్ కనెక్షన్ల వినియోగాన్ని నిర్ధారించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్పాం వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా పరిష్కరించడం తప్పనిసరన్నారు. గృహజ్యోతి, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై ఆరా తీశారు. మంజూరైన, గ్రౌండింగ్ జరిగిన, పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5,982 ఇళ్లు మంజూరు కాగా, 5,173 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, 1,300 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కలెక్టర్ వివరించారు. నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమేనని పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే తదుపరి విడతలో బేస్మెంట్ స్థాయి, పైకప్పు స్థాయి వరకు నిర్మాణం చేపట్టిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ద్వారా రుణాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి మించి ఎత్తైన బేస్మెంట్లు, అధిక వ్యయంతో కూడిన నిర్మాణాలు చేపట్టవద్దని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్లో రేవంత్రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని విమర్శించాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు. రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని అన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే కేసీఆర్ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి సర్ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం -
జూరాలకు నిలిచిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
మొదటి విడత ముమ్మరం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో 86.59 శాతం పురోగతి ●అమరచింత: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు లబ్ధిదారులకు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అధికారుల గణాంకాల ప్రకారం తెలుస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పురపాలికల్లో పుర కమిషనర్లు పనులను నిత్యం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సలహాలు సూచనలిస్తున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు కూడా నిరంతరం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు అదనంగా మరో రూ.రెండు, రూ.మూడు లక్షలు కలిపి తమ సొంతింటి కలను సాకాలం చేసేందుకు లబ్ధిదారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. నిబంధనల మేరకు .. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్నారు. పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించుకునే వారితో పాటు ఖాళీ స్థలాల్లో ఇంటిని నిర్మించుకునే వారు అన్నివైపులా రెండు ఫీట్ల స్థలం వదిలి నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వంటగది, హాలు, బెడ్రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చకచకా పనులు చేపడుతున్నారు. విడతల వారీగా బిల్లులు.. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్ వరకు పూర్తిచేస్తే మొదటి విడతగా రూ.లక్ష, రూఫ్ లేవల్ వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు వేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తయితే మిగిలిన రూ.లక్ష చెల్లిస్తున్నామని హౌసింగ్ అధికారులు వివరించారు. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 255 గ్రామాలు, 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొత్తం 6,538 మంది లబ్ధిదారులను గుర్తించిన అధికారులు పూర్తి నివేదికను కలెక్టర్కు అందించగా.. అందులో 5,951 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలని.. లేకుంటే ఇంటి మంజూరు రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,153 లబ్ధిదారులకు అధికారులు మార్కింగ్ ఇవ్వగా.. 880 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేశారు. 1,824 మంది ఇంటి పైకప్పు నిర్మాణం పూర్తికాగా.. 482 మంది పైకప్పు వరకు గోడలు నిర్మించారు. కాగా ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు హౌసింగ్ అధికారులు వివరించారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో 6,538 మంది లబ్ధిదారుల గుర్తింపు.. 5,951 మందికి మంజూరు పత్రాలు పంపిణీ వివిధ దశల్లో కొనసాగుతున్న పనులు 1,264 ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి నిత్య పర్యవేక్షణతోనే సాధ్యమైందంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు -
భారత్ అందించిన ఆరోగ్య సంపద..
వనపర్తి: సమస్త మానవాళికి భారత్ అందించిన అద్భుతమైన ఆరోగ్య సంపద యోగా అని ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎస్పీ కార్యాలయ పరేడ్ మైదానంలో కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 180 మంది పోలీసులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి యోగా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయం వెచ్చించి యోగా చేయాలని సూచించారు. విధి నిర్వాహణ, ఇతర మానసిక వత్తిడి నుంచి చాలా ఉపశమనం కలిగిస్తోందన్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, వాటిని దూరం చేయాలంటే యోగా ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ
వనపర్తి: యోగాతో శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలమని.. నిత్యం సాధన చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంటలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు సాధన చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, రోజూ యోగా సాధన చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ.. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా రవాణాశాఖ అధికారి, ఆయుష్శాఖ అధికారులు వసుంధర, విశ్వశాంతి, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
పురపాలికలోని 10 వార్డుల్లో 100 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 79 మందికి ప్రొసీడింగ్స్ అందించాం. వీరిలో 60 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పనులు చేపడుతుండగా.. 12 మంది ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం. – నూరుల్ నదీం, పుర కమిషనర్, అమరచింత జిల్లాలో 5,951 మంది ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. 1,824 మంది లబ్ధిదారుల ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న వారందరికి ఇంటి నిర్మాణం కోసం మార్కింగ్ ఇచ్చాం. నిత్యం లబ్ధిదారుల వద్దకు వెళ్లి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పిస్తూ విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. – విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి -
యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
ఖిల్లాఘనపురం: సమాజంలోని యువత ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వాల్మీకి సంఘం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ నాగేష్, ఖిల్లాఘనపురం ఎస్ఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం మండలంలోని రుక్కన్నపల్లిలో వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో యువశక్తి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం ప్రారం భోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామ వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించడం సంతోషించదగిన విషయమని.. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సేకరించిన 30 యూనిట్ల రక్తాన్ని వనపర్తి ప్రభుత్వ రక్తనిధికి తరలించినట్లు యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కాగితాల మధు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతావత్ నరేష్, వాల్మీకి సంఘం అధ్యక్షుడు కుమార్నాయుడు, కుర్మయ్య, పలువురు వాల్మీకి, బోయ యువకులు, పెద్దలు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా నెట్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ అమెచ్యూర్ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫాస్ట్–5 పురుష, మహిళా నెట్బాల్ ఎంపికలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి సయ్యద్ అంజద్అలీ తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపికయ్యే జట్లు పుదుచ్చేరిలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే సీనియర్ ఫాస్ట్–5 జాతీయ స్థాయి నెట్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు హబీబ్ఖాన్, మహ్మద్ ఖాజా అక్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేడు నాగర్కర్నూల్కు మంత్రి సీతక్క రాక కందనూలు: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సోమవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు జిల్లాలోని తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుండుభీ వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ ప్రణాళికలు పరిశీలించనున్నారు. అలాగే తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. మైసమ్మ చెంత.. తాగునీటికి చింత పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ సన్నిధిలో ఆదివారం భక్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మృగశిర కార్తె చివరి వారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. కానీ భక్తులకు అవసరమైన తాగునీటి అందించడంలో నిర్వాహకులు, ఎండోన్మెంట్ అధికారులు విఫలమయ్యారు. దీంతో మినీ ట్యాంకు వద్ద ట్రాక్టర్ను ఉంచి భక్తులు ట్యాంక్పై నుంచి బిందెలతో నీటిని తోడుకున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులకు లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జాతరలో ఉన్న అన్ని ట్యాంకుల్లో నీటిని నింపి ఇబ్బందులు రాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా నీట్
● జిల్లాలోని 13 కేంద్రాల్లో 3,862 మంది విద్యార్థులు హాజరు ● పరీక్ష సరళిని పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులందరికీ మహబూబ్నగర్లోనే కేంద్రాలు ఏర్పాటు చేయగా.. చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే చేరుకున్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఇందులో 3,862 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,291 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 429 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు ధరించిన ఆభరణాలను తొలగించిన తర్వాత అనుమతించారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను కేంద్రాల వద్దకు తమ వాహనాలపై విద్యార్థులను చేర్చారు. నగరంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ జానకి పాలమూరు యూనివర్సిటీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల,ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. -
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఐఏఎస్ ఎంపికై ప్రస్తుతం చత్తీస్ఘడ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్నాయక్, ఐఏఎస్ నాపై నాన్న ఎంతో నమ్మకంతో ఉన్నత విద్య చదివించారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం. -
అమ్మ పేరుతో మొక్కలు నాటి పెంచుదాం
కొత్తకోట/మదనాపురం: చెట్లు తల్లివంటివని.. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్లో భాగంగా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించి.. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నానాటికీ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో అతివృష్టి, అనావృష్టి నెలకొని తీవ్ర నష్టం చేకూరుతోందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కోరారు. స్వచ్ఛభారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. ప్రస్తుతం యువత, విద్యార్థులు సెల్ఫోన్కు బానిసగా మారుతున్నారని.. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ● పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి.. సేంద్రియం సాగు దిశగా అడుగులు వేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. మదనపురం కృషివిజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూములు నిస్సారం కావడానికి మితిమీరిన రసాయనాల వాడకమే కారణమన్నారు. పంట పొలాలు సారవంతంగా ఉండేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల వ్యవసాయ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, డోకూర్ పవన్కుమార్రెడ్డి, లోకనాథ్రెడ్డి, కొండ ప్రశాంత్రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, దాబా శ్రీను, శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి సత్యంసాగర్, నారాయణమ్మ, వెంకట్రెడ్డి, నరేందర్గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు వంగూరు రామకృష్ణారెడ్డి, పద్మజారెడ్డి, అనుజ్ఞారెడ్డి, నారాయణమ్మ, నవీన్కుమార్రెడ్డి, రాములుయాదవ్, మాధవరెడ్డి, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
భూములను అమ్మి మమ్మల్ని చదివించారు
‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. తన తండ్రి గంగన్నతో నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి
● సెప్టెంబర్ 15లోగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష కందనూలు: రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జి ల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించా లని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షి స్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ● నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, సీఈ విజయభాస్కర్రెడ్డి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి జిల్లాలోని రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి.. ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా, చట్టబద్ధంగా, పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
లోక్అదాలత్లో 5,264 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి జి.కళార్చన అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుతో పాటు ఆత్మకూరు కోర్టులో లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల్లో సైతం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉండొచ్చన్నారు. అదే విధంగా ఇరు వర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. లోక్అదాలత్లో సివిల్ కేసులు 11, క్రిమినల్ 1,527, ప్రీ లిటిగేషన్ కేసులు 3,726తో కలిపి మొత్తం 5,264 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి బి. శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, డీఎస్పీ గిరిధర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. మోదీ హయాంలోనే దేశం సమగ్రాభివృద్ధి వనపర్తిటౌన్: ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తోందని యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రగాని సందీప్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎన్.అరవింద్ ఆధ్వర్యంలో నమో జెన్జీ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028లోగా భారత్ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 2014లో స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 15వేల కోట్లతో ప్రారంభమైన రుణాలు.. 2026 వరకు రూ.61వేల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. వైద్య కళాశాలల సంఖ్య 842 నుంచి 2,100 చేరిందని.. ఏంబీబీఎస్ సీట్లు 2.5 రేట్లకు పైగా పెరిగి 1.30 లక్షలకు, పీజీ సీట్లు 31వేల నుంచి 86 వేలకు, ఎయిమ్స్ హాస్పిటల్స్ 8 నుంచి 23కు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, కొమ్ము శ్రీనివాసులు, రవి నాయక్, చింతకాయల శివ, వెంకటేశ్ నాయక్, చంద్రశేఖర్, రాము, రాజు నాయక్ పాల్గొన్నారు. ‘గణపసముద్రం’లో బోరుబావుల సర్వే ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో శనివారం బోరుబావులు, చెట్లు, పైపులైన్లు, బావుల సర్వే ప్రారంభమైంది. ఇరిగేషన్శాఖ ఏఈ అనిల్, ఫారెస్టు బీట్ ఆఫీసర్, ఎస్డీసీ డిప్యూటీ తహసీల్దార్ ఆసీఫ్ సమక్షంలో సర్వే నిర్వహించినట్లు మండల సర్వేయర్ ఆనంద్ తెలిపారు. సుమారు 10 సర్వేనంబర్లలో సర్వే నిర్వహించడం జరిగిందని.. సోమవారం మిగతా సర్వే నంబర్లలో సర్వే పూర్తిచేసి, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్ఎం సంతోష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు ఎక్కేముందు కండక్టర్ లేదా డ్రైవర్కు తమ హాల్టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ సదుపాయం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఏసీ సహా అన్ని బస్సు సర్వీసులకు వర్తిస్తుందని తెలిపారు. ఆయా మార్గాలలో అదనపు బస్సులు నడుపుతామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని డిపోల మేనేజర్లను ఆదేశించామని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–2345 0033, 6815 3333, 99592 26295, 99592 26296 లకు సంప్రదించవచ్చని సూచించారు. -
పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: పేదల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించగా.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కూడా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను పెద్దఎత్తున గెలిపించారని.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, మదనాపురం మార్కెట్ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, పి.కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీను, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, పట్టణ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, నాయకులు డా. పీజే బాబు, ఎన్జే బోయేజ్, సంద వెంకటేష్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసమే కాంగ్రెస్పార్టీ ఆవిర్భావం.. మదనాపురం: పేదల సంక్షేమం, వారి హక్కుల రక్షణ కోసమే కాంగ్రెస్పార్టీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన రాహుల్గాంధీ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాహుల్గాంధీ కృషి చేస్తున్నారని కొనియాడారు. వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు వెంకట నారాయణ, వేమన్న, రవీందర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, అంజాద్అలీ, హసన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మోజర్ల–మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులత, గెజిటెడ్ హెచ్ఎం వరప్రసాదరావుతో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటి నీరు పోశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, కంప్యూటర్ గది, ప్రయోగశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయనశాస్త్ర విభాగాల్లో నిర్వహిస్తున్న ప్రయోగాలపై ఆరా తీశారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పూర్తిస్థాయిలో అందాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బడి తోటలో పండించిన కూరగాయలతోనే వంటలు తయారు చేస్తున్నట్లు కార్మికురాలు కృష్ణమ్మ వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆయన వెంట మద్దిగట్ల, అమ్మపల్లి, మోజర్ల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, శశివర్ధన్, యుగంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని టీజేఎంయూ రీజినల్ సెక్రటరీ నాగేందర్ అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబ్నగర్ బస్డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘాల ఎన్నికలకు ముందే విలీనం ప్రక్రియ ఆరంభించాలన్నారు. ఇదే విషయమై ఈనెల 24 నుంచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు నిరాహార దీక్షలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాములు, ఎన్.ఎం.రావు, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు. -
‘ఉపాధిహామీ’కి తూట్లు పొడుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పాన్గల్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దుకు స్వస్తి పలికి పాత చట్టాన్నే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రేమద్దులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 శాతం పేదల పొట్ట నింపే ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్ను తగ్గించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనుందని.. దీంతో సామాన్య కూలీలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. గతంలో ఉన్న పాత చట్టాన్నే కొనసాగిస్తూ పనిదినాలు 200 రోజులకు పెంచాలని, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి ఉపాధి కూలి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, కోదండరాములు, పార్టీ గ్రామ కార్యదర్శి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటమార్పిడి అవసరం..
జిల్లా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం పంటమార్పిడి చాలా అత్యవసరం. వరి మాత్రమే పండిస్తే.. భవి ష్యత్లో ఇతర ధా న్యాల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కావాల్సిన ఆహార ధాన్యాల ధరలు ఊహించని విధంగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా నేలల్లో అన్నిరకాల పంటలు పండుతాయి. పంటమార్పిడితో భూమి ఆరోగ్యం కాపాడటంతో పాటు మన ప్రాంత ప్రజలకు కావాల్సిన అన్నిరకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు ఇక్కడే పండించుకొని వినియోగించుకోవచ్చు. రైతులు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
మార్పు ఎందుకో..?
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం మొదట్లో ఇక్కడే యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
‘ఎస్ఐఆర్’ విజయవంతం చేస్తాం
వనపర్తి: జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ విజయవంతం చేయడానికి బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పకడ్బందీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని బీఎల్వోలు, రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన బీఎల్ఏలకు మండలాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కొన్ని మండలాల్లో ఇప్పటికే పూర్తికాగా.. మిగిలిన మండలాల్లో త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. బీఎల్ఏలకు గుర్తింపు కార్డులు జారీ చేశామని, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్, డీఆర్ఓ సూర్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మత్తు మహమ్మారిపై సమష్టి పోరాటం
వనపర్తి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాదక ద్రవ్యాలను నిర్మూలించి యువతను సరైన మార్గంలో నడిపించాలని, అందరి సహకారంతో జిల్లాను మత్తురహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.సుధారాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సూపరింటెండెంట్ అరుంధతి, చైల్డ్ ప్రొటెక్షన్ డీసీపీయూ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీకే రావాలి..
యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్ సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి. – రవికిషోర్, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ ● -
పచ్చదనానికి సన్నద్ధం
జిల్లాలో ప్రారంభమైన వన మహోత్సవంఅమరచింత: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే పలు గ్రామాల్లో వర్షాల అదును చూసి మొక్కలు నాటుతుండగా.. మరికొన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలతో గుంతలు తవ్వించే పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామాలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్రార్థన మందిరాలు, దేవాలయాల వద్ద ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాల్లో గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నారు. ఎనిమిది విడతల్లో నాటిన మొక్కలతో పాటు ఈసారి కొత్తగా ప్రధాన రహదారులకు ఇరువైపులా మూడు వరుసల్లో నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వన మహోత్సవం లక్ష్యాన్ని 20.55 లక్షలుగా ఉన్నతాధికారులు విధించారు. మండలం గ్రామాలు లక్ష్యం పాన్గల్ 28 2,93,000 ఖిల్లాఘనపురం 27 2,82,600 వనపర్తి 26 2,55,000 కొత్తకోట 22 2,26,400 పెద్దమందడి 22 2,30,690 పెబ్బేరు 20 2,20,000 మదనాపురం 17 1,74400 చిన్నంబావి 17 1,73,400 గోపాల్పేట 15 1,58,200 అమరచింత 14 1,45000 వీపనగండ్ల 14 1,42,200 ఆత్మకూర్ 13 1,34000 రేవల్లి 12 1,24600 శ్రీరంగాపురం 8 82,400 గుంతలు తవ్విస్తున్నాం.. వన మహోత్సవంలో భాగంగా వానాకాలంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా ఇప్పటి నుంచే గుంతలు తవ్విస్తున్నాం. మండలానికి ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయడానికి గ్రామాల్లోని క్షేత్ర సహాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకుంటున్నాం. వానాకాలం ప్రారంభం కాగానే అనుకున్న విధంగా మొక్కల నాటే కార్యక్రమం పూర్తి చేస్తాం. – బాలయ్య, ఏపీఓ, మదనాపురం లక్ష్యాన్ని చేరుకుంటాం.. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లాలోని 14 మండలాల్లో ఇప్పటి నుంచే గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. వాడిపోతున్న మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటుతాం. – ఉమాదేవి, డీఆర్డీఓ మండలాల వారీగా లక్ష్యం ఇలా.. పచ్చదనం పెంపొందించేందుకే.. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోంది. గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్కడే ఏర్పాటు చేసిన వన నర్సరీల నుంచి మొక్కలు తీసుకొని ఎప్పుడుపడితే అప్పుడు విరివిగా నాటుకునే విధంగా చర్యలు చేపట్టింది. గతంలో నాటిన మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరిగితే అప్పటికప్పుడే తొలగించి ఆ ప్రదేశంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 10 వేల మొక్కల సామర్థ్యం గల వన నర్సరీని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి అప్పగించడంతో ఈసారి మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకొనే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లా లక్ష్యం 20.55 లక్షలు గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో గుంతల తవ్వకాలు వర్షాకాలం సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తి: ప్రకృతి సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమని.. బాగా వర్షాలు కురవాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎకో పార్క్లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించగా.. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని, అదే స్ఫూర్తితో జిల్లాకేంద్రంలోని ఎకో పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 24 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని.. 33 శాతానికి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించామని, ముఖ్యఅతిథులతో పాటు విద్యార్థులు తమ పేర్లపై మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, కౌన్సిలర్ మహేశ్వరి, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’.. ఉన్నారా.. లేరా?
మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. తప్పుల సవరణ.. పకడ్బందీగా ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హులను జాబితాలోంచి తొలగిస్తారు. రెండు, మూడు చోట్ల ఓటు హక్కున్న వాటిని తొలగించి.. ఒక్క చోట మాత్రమే ఉండేలా జాబితా రూపొందిస్తారు. జిల్లాలో చాలామందికి తమ సొంతూరుతోపాటు ప్రస్తుతం నివశిస్తున్న పట్టణంలోనూ ఓటు హక్కు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటికి చెక్ పడనుంది. అలాగే మరణించిన వారిని, ఊరు వదిలి వెళ్లిపోయిన వారి పేర్లను కూడా తొలగిస్తారు. మొత్తంగా తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఓటరు పేరు, చిరునామా, తండ్రి/ భర్త పేరులో తప్పుగా నమోదైతే సరిదిద్దడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికే మండల స్థాయిలో ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలను రూపొందించారు. ఇందుకోసం బూత్స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. నియోజకవర్గం 2025లో ఓటరు మ్యాప్ చేయని తప్పులు/అక్రమాలు మొత్తం ఓటర్లు మ్యాపింగ్ ఓటర్లు ఉన్న ఓటర్లు నాగర్కర్నూల్ 2,40,571 1,83,129 57,442 72,073 అచ్చంపేట 2,48,362 2,04,770 43,592 86,532 కొల్లాపూర్ 2,42,699 1,91,733 50,966 79,901 కల్వకుర్తి 2,45,355 1,89,868 55,487 66,347 వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926 గద్వాల 2,61,810 1,98,304 63,506 79,677 అలంపూర్ 2,42,049 2,02,489 39,560 75,982 మహబూబ్నగర్ 2,64,235 1,80,078 84,157 84,090 జడ్చర్ల 2,25,911 1,83,253 42,658 72,068 దేవరకద్ర 2,42,342 2,02,135 40,207 80,533 నారాయణపేట 2,42,773 2,04,230 38,543 87,396 మక్తల్ 2,52,801 2,19,495 33,306 99,881 కొడంగల్ 2,51,255 2,00,361 50,894 79,299 అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం.. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. 2026, అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిట్, కలెక్టర్ 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటరు మ్యాపింగ్ ఇలా.. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. -
బాధితుల్లో భరోసా పెంచేలా సేవలు
కొత్తకోట రూరల్: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు పోలీసులు తనకు అండగా ఉన్నారనే నమ్మకంతో తిరిగి వెళ్లాలని.. బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యతని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పెద్దమందడి పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించారు. ముందుగా పోలీసు అధికారులు ఆమెకు పూలమొక్క అందజేసి స్వాగతం పలకగా.. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశం, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్హెచ్ఓ, మెన్ రెస్ట్రూమ్, లాకప్ రూమ్ను తనిఖీ చేసి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి.. పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్ఐ జలంధర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిబ్బంది విధులు, పని తీరు, సమస్యలు అడిగి తెలుసుకొని ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులైన పార్ట్–1 నుంచి పార్ట్–5 వరకు పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్–2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్నిరకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
అభిప్రాయ సేకరణకే చర్చల కమిటీ సమావేశం
వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికే జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని.. విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరగగా.. రిజర్వాయర్ పరిధిలోని 164 ఎకరాల భూముల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారులకు వెల్లడించారు. తామంతా కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. భూములు కోల్పోతే ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలు పండక వలసలు వెళ్లిన పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు నీటి సౌకర్యం ఏర్పడి పంటలు బాగా పండుతున్నాయని, ఈ సమయంలో భూ సేకరణ పేరుతో తమకు అన్యాయం చేయవద్దని కోరారు. ప్రభుత్వం ఎకరానికి నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాలని విన్నవించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం నిర్ణయిస్తుందని, రైతులు ఎవరూ కంగారు పడొద్దని, న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామన్నారు. సాటిల్ బండ్ విషయంలో సీఈల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఎంత ఇవ్వొచ్చు అనేది త్వరలోనే నిర్ణయిస్తామని.. అధికారులు గ్రామానికి వచ్చి తెలియజేస్తారని వివరించారు. రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, నాయకులు సాయిచరణ్రెడ్డి, సర్పంచి, నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు ఒకేసారి అవార్డు చేయండి
ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న తమకు ఒకేసారి అవార్డు చేయాలని భూ నిర్వాసితులు భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యకు విన్నవించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేధికలో గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్లో 647 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని.. ఇప్పటి వరకు మొదట 18 ఎకరాలు, ఇటీవల 388 ఎకరాలకు అవార్డు చేసి 10 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఏడాది తర్వాత చెల్లించారని.. అదికూడా నిరసనలు, ఖిల్లాఘనపురం బంద్ చేపట్టిన తర్వాత ఇచ్చారన్నారు. ప్రస్తుతం మరో 163 ఎకరాలకు అవార్డు చేసుకోవాలని నోటీసులు ఇచ్చారని.. ఇంకా అంతాయపల్లి శివారుకు చెందిన 55 ఎకరాలు, వెంకటాంపల్లికి చెందిన 19 ఎకరాలు, మహ్మద్హుస్సేన్పల్లికి చెందిన 4 ఎకరాలు మిగిలిందని తెలిపారు. మిగిలిన 241 ఎకరాలకు ఒకేసారి అవార్డు చేసి వెంటనే పరిహారం డబ్బులు వేయాలని రైతులు డిమాండ్ చేశారు. గణపసముద్రం చెరువు పూర్తిస్థాయిలో నిండితే గ్రామానికి ఆనుకుని ఉన్న రోడ్డుకు చేరేవని.. ఇప్పుడు అలుగు ఎత్తు 3 ఫీట్లు పెంచితే గ్రామంలోకి నీళ్లు వస్తాయని, పెంచకుండా చూడాలని కోరారు. రిజర్వాయర్ నిండిన సమయంలో గ్రామంలోకి నీళ్లు రాకుండా చివరిలో బండు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అలుగు ఎత్త పెంచి గ్రామం నుంచి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని కొందరు రైతులు హెచ్చరించారు. భూములు కోల్పోయిన రైతులకు రిజర్వాయర్ వెనక ఉన్న ఏడు కోట్లలోని భూమిని ఒక్కొక్కరికి కనీసం మూడు గుంటలు పట్టా చేయాలని, కనీసం 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. అనంతరం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు చెప్పిన విషయాలు, సందేహాలు నమోదు చేసుకున్నామని.. ఈ నెల 18న కలెక్టరేట్లో రైతులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏమైన సమస్యలుంటే వివరించాలని కోరారు. సమావేశంలో ఐబీ డీఈ బాబుచంద్, తహసీల్దార్ సుగుణ, సర్పంచ్ పద్మమ్మ, వివిధ శాఖల ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు మొరపెట్టుకున్న రైతులు -
ఐదు దశాబ్దాలుగా.. అన్యాయమే
గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్వర్క్స్ నిర్మాణం చేపట్టారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేల లోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ● తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్తో కూడిన అధికారుల బృందం మంగళవారం కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను సందర్శించింది. ఆనకట్ట, స్లూయిస్ నిర్మాణాలు, ప్యాకేజీ–1, 2 పరిధిలో అసంపూర్తి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆయకట్టుదారులతో కలిసి కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ను కలిసి.. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా వివరించారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ ప్రాంతంలో 30 టీఎంసీల రిజర్వాయర్, అలాగే రాజోళి వద్ద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ‘‘ఆర్డీఎస్కు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. దీనిపై తాను రైతులతో కలిసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చూపాలంటే 30 టీఎంసీల హెడ్వర్క్స్ వద్ద రిజర్వాయర్, మల్లమ్మకుంట రిజర్వాయర్, సుమారు 75 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టను పునర్నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.’’ అని సీతారామిరెడ్డి పేర్కొన్నారు. ‘డైవర్షన్’లోనే రాజోళి బండ ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ఏళ్ల తరబడి తేలని నడిగడ్డ రైతుల నీటివాటా తాజాగా హెడ్వర్క్స్నుసందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వరి ధాన్యం తేమ శాతం పరిశీలించి త్వరగా తూకం చేసి కేటాయించిన మిల్లులకు లారీల్లో తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం లక్ష్మీవారాహి రైస్మిల్లును తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడారు. ధాన్యం లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా అన్లోడ్ చేయాలని, కోతలు విధించవద్దని స్పష్టం చేశారు. ట్రక్ షీట్లను వెంటనే వాట్సాప్లో పీసీసీ ఇన్చార్జ్లకు పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో ట్యాబ్ఎంట్రీలు త్వరగా పూర్తయి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. తహసీల్దార్ వరలక్ష్మి ఉన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి వనపర్తి రూరల్: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగమ్మతండాలో గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలతో పాటు వన నర్సరీని ఆయన పరిశీలించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని పీఆర్ ఏఈ భాస్కర్కు సూచించారు. నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపర్చాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శిని ఆదేశించారు. వర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన వెంట డీపీఓ రఘునాథ్రెడ్డి ,ఎంపీడీఓ ఎండీ అజార్ మొహినోద్దీన్, ఎంపీఓ రాజవర్ధన్రెడ్డి, కార్యదర్శి వెంకటస్వామి పాల్గొన్నారు. భూసార పరీక్షలతో అధిక దిగుబడులు అమరచింత: భూసార పరీక్షలతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని మదనాపురం కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. అనిత, డా. భవాని అన్నారు. మంగళవారం మండలంలోని ఈర్లదిన్నెలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. పచ్చిరొట్ట పెంపకం, జీవన ఎరువుల వినియోగంతో రసాయన ఎరువులను నియంత్రించుకునే అవకాశం ఉందన్నారు. వానాకాలంలో రైతులు వరితో పాటు పత్తి అధికంగా సాగు చేస్తుంటారని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఈఓలతో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి పౌష్టికాహారం, కుటుంబ పోషణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఓ అరవింద్, సర్పంచ్ చుక్క వెంకటమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమ్మ పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య, రాత పుస్తకాలు తనిఖీ చేసి కొందరు విద్యార్థులకు స్వయంగా అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలపై ఆరా తీయగా.. ప్రస్తుతం 702 మంది విద్యార్థులు ఉన్నారని, ఇప్పటి వరకు 65 మంది విద్యార్థులు కొత్తగా చేరారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటుతుందని భావిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా చూడాలన్నారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రవేశ సమయంలోనే అపార్ ఐడీలను రూపొందించాలని, యూ డైస్ పోర్టల్లో విద్యార్థుల వివరాలను సకాలంలో నమోదు చేసి నవీకరించాలన్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీ, ఇతర మౌలిక వసతులు అవసరమైతే జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపించాలని, అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థుల డ్రాప్బాక్స్లో ఎలాంటి అంశాలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ యాదయ్య, ప్రిన్సిపాల్స్ ఉమాదేవి, చంద్రశేఖర్, ఇతర విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
గ్రామాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలి
వనపర్తి: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం అన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా, మానవీయ దక్పథంతో వ్యవహరించడంతో పోలీసు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయనతో పాటు జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తనిఖీ చేసి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ సునీతారెడ్డి వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ చేపడుతున్న చర్యలపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ● ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతికి రూ.35 వేల నుంచి 50 వేల వరకు.. ● స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం ● టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం, బూట్ల పేరుతో నిలువు దోపిడీ ● పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకో వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు నిబంధనలకు విరుద్ధం.. ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుంటే వాటిని పట్టుకున్నాం. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేశాం. ఎంఈఓకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే నాకు మీటింగ్ ఉందని చెప్పి రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలను తనిఖీ చేయాలి. – శివసాగర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో దోపిడీ ఇలా.. ● మహబూబ్నగర్తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి విద్యార్థులకు రూ.35– 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, అక్కడే కొనాలి. దీంతో ఒక్కొక్కరిపై కనీసం రూ.8 వేల వరకు అదనపు భారం పడుతుంది. నగరంలోని ఏనుగొండ సమీపంలో ఇటీవల ప్రారంభించిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లాలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. 6, 7 తరగతి విద్యార్థులకే రూ.70–95 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు యూనిఫాం, పుస్తకాలు అదనం. ● వనపర్తి జిల్లాకేంద్రంలోని చిట్యాల రోడ్డులో గల ఓ కార్పొరేట్ స్కూల్లో నర్సరీకే రూ.45వేలు వసూలు చేస్తున్నారు. బుక్స్, యూనిఫామ్స్ కూడా అక్కడే కొనాలి. ఏడో తరగతికి రూ.90 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా.. ఒక్కరూ కూడా ఫీజుల వివరాలు డిస్ప్లే చేయడం లేదు. -
ప్రభుత్వ పుస్తకాలకు మంగళం..
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పు న రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: భూ నిర్వాసితులు వాస్తవ పరిస్థితుల ఆధారంగా తమ విన్నపాలు తెలియజేయాలని.. వాటిని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుద్ధారం పెద్దచెరువు రిజర్వాయర్ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రిజర్వాయర్ పరిధిలోని 101 ఎకరాల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారుల ముందుంచారు. గ్రామానికి చెందిన 200కు పైగా చిన్న, సన్నకారు రైతులమే రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఉపాధి లేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎకరాకు రూ.12.50 లక్షలు కాకుండా పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోనున్న రైతుల అభిప్రాయ సేకరణకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేట్లకు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందని.. రైతులు ఆమోదయోగ్యం కాని పరిహారాన్ని కోరడం సరైన విధానం కాదని సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు. అదేవిధంగా భూములు కోల్పోయే వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు. -
25 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం
సమావేశానికి హాజరైన బుద్ధారం గ్రామస్తులు వనపర్తి: జిల్లాలోని ఓటర్లు 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో పాల్గొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు బూత్ లెవల్ అధికారులు ఇచ్చే ఫారం పూరించి ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో కోరారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950లోని సెక్షన్ 17, 18, 31 అమలులో ఉన్నందున తప్పులు చేయకుండా జాగ్రత్తగా వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారని హెచ్చరించారు. -
సాగు భారమవుతోంది..
రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వ్యవసాయం భారంగా మారుతోంది. పెట్టిన పెట్టుబడి చేతికందితే చాలు అనే పరిస్థితిలో పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి అనుకూలిస్తేనే పంట, పెట్టుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. లేదంటే అప్పులే శరణ్యం. – విష్ణువర్ధన్, రైతు, అమరచింత ఆరుగాలం పొలాల్లో ఉంటూ పంట పండించే రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలి. పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే సాగు ఖర్చులతో పాటు రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది. – నర్సింహులు, రైతు, అమరచింత రైతులు రసాయన ఎరువులు వినియోగించడంతో భూమి సారం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరుగుతున్నందున సేంద్రియ ఎరువులు వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వరి పండించే రైతులు పచ్చిరొట్ట సాగుచేస్తే ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. – అరవింద్, ఏఓ, అమరచింత -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్ పనులు వేగంగా జరగాలంటే భూ సేకరణకు రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆర్అండ్ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ కె.శివకుమార్నాయుడు కోరారు. బుధవారం మండల కేంద్రం శివారులోని గణపసముద్రం రిజర్వాయర్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్ అలుగు మూడు ఫీట్లు పెంచడంతో గ్రామంలోకి నీళ్లు వస్తాయని.. అరికట్టేందుకు గ్రామం దగ్గర కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన భూముల ధరలకు అనుగుణంగా ఇక నుంచి రైతులకు ఇచ్చే పరిహారం రూ.20 లక్షలకు పెంచాలన్నారు. పూర్తిస్థాయిలో భూములు కోల్పోతున్న రైతులకు ఏడు కోట్ల భూమిలో ఒక్కొక్కరికి కనీసం 3 గుంటలు పట్టా చేయాలని కోరారు. భూమి ఉండటంతో ప్రభుత్వం ఇచ్చే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గురువారం కలెక్టరేట్లో రైతులతో సమావేశం ఉంటుందని.. ప్రతి సమస్యను అక్కడ తెలియజేయాలని సూచించారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. రైతులందరు త్వరగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తే రెండు నెలల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి 164 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, నీటిపారుదలశాఖ అధికారులు లక్ష్మీనర్సింహారెడ్డి, తహసీల్దార్ సుగుణ, వివిధ శాఖల అధికారులు, రైతులు ఉన్నారు. ఆర్అండ్ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ శివకుమార్నాయుడు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గోపల్దిన్నెలో 33/11 కేవీ సబ్స్టేషన్, మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఎక్స్రే ల్యాబ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో పాటు కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపల్దిన్నెలోని సర్వేనంబర్ 357 ప్రభుత్వ భూమిలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు సన్నరకం వరికి బోనస్, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్భాటాలకు పోయి ప్రజలు అప్పులపాలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఓ అరుణ, సర్పంచ్లు శివకుమార్, కవిత, మీసాల పార్వతమ్మ, సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కేంద్రం కుట్రలను తిప్పికొడదాం
వనపర్తి రూరల్: దేశంలో కార్మిక సంఘాలను రూపుమాపేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. కార్మికులంతా సంఘటితంగా ఉండి తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి నర్సింహ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీహరి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. గతంలో ఏడుగురు సభ్యులతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే వీలుండేదని.. ఇప్పుడు 100 మంది సభ్యులు ఉండాలని నిబంధన విధించిందని తెలిపారు. ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచి సంపన్నులకు పెట్టడమే ధ్యేయంగా పని చేస్తోందని తెలిపారు. కార్మికులను సంఘటితం చేసి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల 30, 31న పెబ్బేరులో నిర్వహించాలని, 23న సన్నాహక సమావేశం ఉంటుందని తెలిపారు. మహాసభలకు కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. జిల్లాలో కార్మిక సంఘాల ఏర్పాటు, బలోపేతానికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి మోషా, గోపాలకృష్ణ, భాస్కర్, శ్యామ్, రఘు, సుందర్, ఖయ్యూం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వానిదే’ ఖిల్లాఘనపురం: వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డా. మాధవి జెండా ఆవిష్కరించగా.. ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని.. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యసిబ్బంది డా. సందేశ్, వెంకటలక్ష్మి, ప్రభావతి, వెంక టేష్, భీమయ్య, మునీందర్, నజ్మా, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్లోనే.. ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్నగర్కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్నగర్లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్గా మారింది. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్ -
సాగు.. సందిగ్ధం
ఏటా పెరుగుతున్న పంట పెట్టుబడులు ●అమరచింత: వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు ఏటా పెరుగుతున్న పెట్టుబడులు భారంగా మారుతున్నాయి. ట్రాక్టర్లు, యంత్రాలు, కూలీలు, ఎరువులు, విత్తనాలు ధరలు తడిసి మోపెడవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్నా.. అదనపు ఖర్చులకే సరిపోతోంది. ఎకరాకు సాగు ఖర్చు గతేడాది కంటే ఈసారి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోందని రైతన్నలు వెల్లడిస్తున్నారు. జిల్లాలో అత్యధిక రైతులు వర్షంపై ఆధారపడి పత్తి సాగు చేస్తున్నారు. అలాగే జూరాల ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు వివిధ ఎత్తిపోతల కింద సాగునీరు విడుదల చేస్తారనే ఆశతో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సుమారు 80 వేల ఎకరాల్లో మెట్ట పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ఎడమకాల్వ ఆయకట్టులోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో అత్యదికంగా వరి సాగు చేస్తుండగా.. మిగిలిన మండలాల్లో మెట్ట పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. వర్షాధారంగా పత్తి, వేరుశనగ, ఆముదం, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు. ఎరువుల ధరలు ఇలా (రూ.లలో..) ట్రాక్టర్, నాగళ్ల అద్దె పెంపు ఎరువులు, విత్తనాల ధరలది అదే పరిస్థితి అధికమవుతున్న వ్యవసాయ కూలీల కూలి సతమతమవుతున్న అన్నదాతలు -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
పాన్గల్: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయ చీఫ్ మొబిలైజేషన్ అధికారి (సీఎంఓ) ప్రతాప్రెడ్డి సూచించారు. బడిబాట కార్యక్రమలో భాగంగా సోమవారం మండల కేంద్రంతో పాటు రాయినిపల్లి, కొత్తపేట ప్రాథమిక, పాన్గల్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించి విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో మొదటిరోజు ఆరుగురు విద్యార్థులు బడిలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీధర్రెడ్డి, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీసులు కందనూలు: జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో నాగర్కర్నూల్ బస్ డిపో మేనేజర్ యాదయ్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను సోమవారం ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదని సూచించారు. -
భూసేకరణలో చలనం
● నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ● ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ● ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి మౌలిసదుపాయాల కల్పనకు చర్యలు ●ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రిజ్వాన్బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
అధికారులూ.. స్పందించరూ...!
● 60 రోజులుగా కేంద్రంలోనే వరి ధాన్యం ● మొలకెత్తినా స్పందించని అధికారులు పాన్గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రానికి తెల్లరాళ్లపల్లితండాకు చెందిన గిరిజన రైతులు లక్ష్మి, గోరి, పట్టెమ్మ, తొలియానాయక్, నర్సింహానాయక్ వరి ధాన్యం తీసుకొచ్చి 60 రోజులు కావస్తుంది. నేటికీ ధాన్యం తూకం చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసి మొలకెత్తింది. సోమవారం కేంద్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం కాంటా చేయడం లేదనే విషయాన్ని మండలస్థాయి అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. కేంద్రంలోనే రోజుల తరబడి పడిగాపులు పడుతూ ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం తూకం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. హమాలీల కొరతతో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని, వారి సంఖ్య పెంచి తూకం చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. -
లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి
గోపాల్పేట: విద్యార్థులు చిన్ననాటి నుంచే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. సోమవారం ఉమ్మడి గోపాల్పేట మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులకు ఆయన పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తగిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. -
ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలి
పాన్గల్: కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. సోమవారం మండలంలోని శాగాపూర్, జమ్మాపూర్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, బస్తాల తరలింపు, ఇంకా సేకరించాల్సిన ధాన్యం తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లోని రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని.. అకాల వర్షాలతో తడిసిపోయే ప్రమాదం ఉందని చాలా మంది రైతులు ఆయనకు వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ, బస్తాల తరలింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు ఎఫ్ఏక్యూ నిబంధనలకు లోబడి జరగాలని, హమాలీల సంఖ్య పెంచి ధాన్యం ఆన్లోడింగ్, బస్తాల తరలింపు వేగవంతం చేయాలన్నారు. లారీల సంఖ్య పెంచి కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను తరలించాలని అధికారులకు సూచించారు. అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం సేకరణలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ కార్తీక్రావు, ఏపీఎం శ్రీనివాసులు, ఆర్ఐ మహేష్, సర్పంచ్ మైబూషమ్మ, రైతులు తదితరులు ఉన్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏ–2లే కీలకం
వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో బీఎల్ఏ–2లే కీలకమని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా, పట్టణ, మండల అధ్యక్ష, కార్యవర్గసభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని క్షేత్రస్థాయిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. గ్రామాల్లోని ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్లో వచ్చే ఏ ఎన్నికలైనా ఫలితాలు కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా ఉండేలా పని చేయాలని, ప్రత్యర్థి నేతలను కంగు తినిపించే వ్యూహాలతో ముందుకు సాగాలని కోరారు. అప్పుడే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృత్తం అవుతాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలిపారు. కార్యకర్తల నుంచి అధిష్టానం వరకు ప్రతిపక్షక్ష నాయకులు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు విమర్శలను ఖండించాలని సూచించారు. అనంతరం కొత్తకోట పట్టణ, మండల, మదనాపురం మండలాల అధ్యక్షులుగా ఎన్నికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, జిల్లా కార్యవర్గసభ్యులు ఐ.సత్యారెడ్డి, కోళ్ల వెంకటేష్, శరవంద, మన్యం, బి.కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, నాయకులు సహదేవుడు, దయాకర్రెడ్డి, రాంరెడ్డి, సుఖేందర్రెడ్డి, విష్ణు ముదిరాజ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలియో మహమ్మారిని రూపుమాపుదాం
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పనిచేసి జిల్లాలో పోలియో మహమ్మారిని రూపుమాపేందుకు ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి బంగారు భవిష్యత్ ఇవ్వాలన్నారు. జులై 13న నులిపురుగుల నివారణ దినం.. పల్స్ పోలియోతో పాటు జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్నపిల్లలకు వచ్చే అనీమియా, జీర్ణవ్యవస్థ సమస్యలు, పిల్లలు శారీరకంగా ఎదగకపోవడం వంటి సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్ర తినిపించి అనీమియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని చిన్నారులకు సరిపడా పోలియో వాయిల్స్, ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయని చెప్పారు. జూన్ 28న ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేసే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినం రోజున ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్ఓ సూర్యప్రకాష్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని అర్జీదారుడికి పంపించడమే కాకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమశాఖ పరిధిలో లేకుంటే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. పరిష్కరించలేని అర్జీ ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం కాదో ఫిర్యాదుదారుకి తెలియజేయాలని, పెండింగ్లో ఉంచవచ్చన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలు సైతం వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 77 వినతులు వచ్చినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రజావాణికి 25 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 వినతులు వచ్చాయి. ఎస్పీ సునీతారెడ్డి ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారితో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
తొలిరోజు నామమాత్రమే
జిల్లాలో పునః ప్రారంభమైన పాఠశాలలు ● అమావాస్య సెంటిమెంట్తో మొదటి రోజు తరగతులకు రాని విద్యార్థులు ● ఎఫ్ఆర్ఎస్లో పదిశాతం కంటే తక్కవగానే హాజరు నమోదు ● మామిడి తోరణాలు, పూలతో పలు పాఠశాలల అలంకరణ మారుమూల తండాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలలు మూతబడవద్దని విద్యాశాఖ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపిస్తూ కొనసాగించారు. ప్రభుత్వం ఈసారి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా.. చాలాచోట్ల కొత్త ప్రవే శాలు రాకపోవడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం కష్టమేననిపిస్తోంది. గురుకులాలు, కేజీబీవీల్లో ప్రవేశాల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఎగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారస్ చేయిస్తూ ప్రవేశాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డేస్కాలర్స్ కేటగిరిలో ఉన్న సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆసక్తి చూపిస్తున్న వారు చాలా తక్కువేనని చెప్పవచ్చు. వీపనగండ్ల మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. మరికొన్ని గ్రామాల్లో విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని.. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు అందించడంతో పాటు నాణ్యత బోధన అందిస్తున్నామని కల్వరాల జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘పాన్గల్ మండలం మల్లాయపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో సోమవారం మొదటిరోజు రెండో తరగతి చదువుతున్న విద్యార్థి సంతోష్ ఒక్కరే హాజరయ్యారు. ఆ పాఠశాలలో ఉన్న ఏకోపాధ్యాయుడు శేఖర్గౌడ్ పాఠాలు బోధిస్తూ కనిపించారు. పాఠశాల మూతబడే అవకాశం ఉందని గతేడాది నుంచి ఒకే విద్యార్థితో నిర్వహణ సాగిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం రోజున ఉన్న ఒకేఒక్క విద్యార్థి హాజరుకాగా.. ఉపాధ్యాయుడు స్వాగతించి బోధించడం కనిపించింది.’ వనపర్తి: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి 2026–27 విద్యాసంవత్సరం ఆరంభమైంది. తొలిరోజు అమావాస్య కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతగా కనిపించలేదు. జిల్లావ్యాప్తంగా అతి తక్కువగా పది నుంచి 15 హాజరు శాతం దాటలేదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఆన్లైన్ హాజరు నమోదు చేసుకున్నారు. ఇక కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులు ఎవరూ హాజరుకాలేదు. మంగళవారం సైతం పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రవేశాల కోసం వచ్చిన వారితో పాఠశాల ఆవరణలు రద్దీగా కనిపించాయి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల ప్రధాన ద్వారాలను మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు ఆహ్వానం పలికారు. పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందించాల్సి ఉండగా.. విద్యార్థులు సంఖ్యలో హాజరుకావడంతో పంపిణీ జరగలేదు. యూనిఫామ్స్ ఇప్పటి వరకు ఇంకా రాలేదు. విద్యార్థుల కొలతలు తీసుకొని స్థానిక మహిళా సంఘాల సభ్యులతో కుట్టించేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూనిఫామ్కు కావాల్సిన వస్త్రం జిల్లాలు, మండలాలకు తెప్పించాల్సి ఉంది. -
సవాళ్లను అధిగమించి ధాన్యం సేకరణ
● మొదటిసారి 42 గోదాంలలో నిల్వ ● జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ వనపర్తి: జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా ముగింపు దశకు చేరుకుందని, అన్నిరకాల సవాళ్లను అధిగమిస్తూ రికార్డుస్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేశామని జిల్లా పౌరసరఫరాలశాఖ కాశీవిశ్వనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని.. రెండు, మూడురోజుల్లో వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 12వ స్థానంలో నిలిచిందని వివరించారు. మొదటిసారి 42 గోదాములను నిల్వ కేంద్రాలుగా వినియోగించుకున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని 62 మిల్లుల్లో ధాన్యం దించామని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గోదాములకు కూడా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. ట్యాబ్ఎంట్రీ ప్రక్రియ ప్రస్తుతం 77 శాతానికి చేరిందని, ఇప్పటి వరకు రూ.358 కోట్లను రైతుల ఖాతాలో జమచేసినట్లు వివరించారు. వ్యవసాయశాఖ వేదికల ఆధారంగానే కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. ఒకే వెహికల్ నంబర్పై రెండు, మూడుచోట్ల టెండర్లు వేశారనే ఆరోపణలపై డీటీఓతో పూర్తి విచారణ జరిపించామని తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కజొన్న కొనుగోళ్ల కోసం లారీలు, గన్నీ బ్యాగులు తరలింపుతోనే కొంత గందరగోళం నెలకొందని, దానికి పౌరసరఫరాలశాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణంగా 100 కిలోల ధాన్యానికి 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుందని, తాలు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడే మిల్లర్లు తరుగు డిమాండ్ చేస్తారని వివరించారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాగానే ఎన్ఫోర్స్మెంట్ అధికారులను క్షేత్రస్థాయికి పంపి మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
పాన్గల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ కోరారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో భీమయ్య అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, రైతులు, కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో పాలమూరులో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలకు ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం సేకరణ పూర్తి చేయాలి.. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్తో కలిసి సందర్శించారు. ధాన్యం సేకరణలో జాప్యం, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో అలసత్వం కారణంగా అకాల వర్షాలకు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంబులయ్య, కృష్ణయ్య, భీమయ్య, సాయిలు, శ్రీరాములు, శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం దారిలో..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ● రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ● తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి ● కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు ● మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు ● 188 మంది విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్పేటలో స్కాలర్షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు. ‘ఈ రోజు రష్మిక దేవరకొండలా మీతో.. మీ ముందు మాట్లాడుతున్నా.. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ, ప్రతి అనుభవం నుంచీ నేర్చుకుంటూనే ఉంటాం’.. అని పేర్కొన్నారు. విద్యార్థులంతా మంచి విషయాలు నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని రష్మిక సూచించారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ తాను ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేశానన్నారు. విద్యార్థులు చేడు మార్గం వైపు చూడకుండా తల్లిదండ్రులు, గురువులు వారిని కనిపెట్టుకొని ఉండాలని కోరారు. -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేద్దాం
అమరచింత: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. శనివారం పట్టణంలోని జీఎస్ భవన్లో రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లు, కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. 20న జరిగే బహిరంగసభకు ముఖ్యఅతిథిగా త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి బి.వెంకట్, దాసన్, ఎంపీలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. మొదటిరోజు భారీ ప్రదర్శన, జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగసభ జరుగుతుందన్నారు. 21, 22 తేదీల్లో జరిగే మహాసభలకు 33 జిల్లాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మహాసభలకు వ్యవసాయ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శంకర్, ఆర్ఎన్ నాగరాజు, ఆంజనేయులు, బెక్కెం కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
అదనపు భారం..!
● గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకే ఇన్చార్జ్ బాధ్యతలు ● ఖాళీగా 20 జీహెచ్ఎం పోస్టులు ● గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ ● పట్టించుకోని పాలకులు, అధికారులు జీహెచ్ఎంలు కరువు.. జిల్లాలోని 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కరువుయ్యారు. దీంతో ఆయా పాఠశాలల్లోని సీనియర్లకే బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇందులో సుమారు 10 ఉన్నత పాఠశాలల పరిధిలో స్కూల్ కాంప్లెక్స్ సముదాయాలు ఉన్నాయి. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్లో 10 నుంచి 20 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉంటాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడం, వారితో సమావేశాలు నిర్వహించడం, పాఠశాల పురోగతిపై స్కూల్కాంప్లెక్స్ హెడ్మాస్టర్ (హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు) నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కొరవడటంతో గతేడాది కొత్తకోట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో బినామీ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించడం కలకలం రేపింది. పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న తరుణంలో ఉపాధ్యాయవర్గాల్లో ఈ అంశం జోరుగా చర్చ జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా ఖాళీగా మండల విద్యాధికారి పోస్టులు డీఈఓ కార్యాలయం వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం, ప్రైవేట్ పాఠశాలలు ఏ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నాయో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాలో మండల విద్యాధికారులు కరువయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఈఓ ప్రతి వారానికి రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఒక ప్రైవేట్ పాఠశాల తనిఖీ చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పాటుగాకముందు నుంచి ఇప్పటి వరకు ఎంఈఓల నియామకం చేపట్టకపోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ఒక్క మండలానికి కూడా రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడంతో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కనీసం జిల్లాకేంద్రమైన వనపర్తి మండలానికి సైతం ఎంఈఓ లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలో రెగ్యులర్ ఎంఈఓల కొరత ఉంది. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలతో ముందుకు సాగుతాను. ఈ అంశాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఇన్చార్జ్ ఎంఈఓలు మరింత మెరుగ్గా పని చేసేలా చేస్తాం. – యాదయ్య, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి ● జిల్లాలో 335 ప్రాథమిక పాఠశాలలు, 60 ప్రాథమికోన్నత పాఠశాలలు, 101 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 55 వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు ఏటా విద్యనభ్యసిస్తున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రతి మండలానికి మండల విద్యాధికారి పోస్టు ఉండగా, ఖాళీగా ఉండటంతో పర్యవేక్షించే వారు కరువయ్యారు. ఎంఈఓలుగా బాధ్యతలు చేపడుతున్న ప్రధానోపాధ్యాయుల పాఠశాలలు హైస్కూల్స్ కావడంతో అక్కడ అంతా చూసుకోవడం, ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో పాఠశాలలను పర్యవేక్షించే ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో మారుమూల గ్రామాల్లో బడుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారనుంది. ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తే ఎస్ఏలుగా.. ప్రధానోపాధ్యాయులు పదోన్నతి పొందితే ఎంఈఓలుగా భర్తీ కానున్నారు. పదోన్నతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఎంఈఓల పోస్టుల కొరత వేధిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తోందని, తెలంగాణలో అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటల ను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. మాకు పరిహారం అందే వరకూ మా పొలంలో పనులు చేయొద్దని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం చేయాలి. – వైజునాధ్, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి.. కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవరూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట ● -
ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు సరికాదు
వనపర్తి: వరి ధాన్యం కేటాయింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతున్న జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్ఓ) కాశీవిశ్వనాథ్పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని రాజనగరం శివారులో ఉన్న బసవేశ్వర రైస్మిల్లును జేఏసీ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో డీఎస్ఓ అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. కస్టోడియన్గా ఉన్న మిల్లులో రూ.కోట్ల విలువైన ధాన్యం మాయమవడం, మరో రైస్మిల్లుకు భారీగా ధాన్యం కేటాయించి అందులోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తాజాగా బసవేశ్వర రైస్మిల్లు విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీ మాత్రమే సమర్పించిన మిల్లుకు ఏకంగా రూ.7 కోట్లకుపైగా ధాన్యం కేటాయించడం వెనుక కారణాలు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక మంది మిల్లర్లు ధాన్యం కేటాయింపుల కోసం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక మిల్లర్లను పక్కనబెట్టి ఇతర జిల్లాలకు ధాన్యం కేటాయించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎస్ఓ వ్యవహార శైలిపై కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జిల్లాలో చోటు చేసుకున్న ధాన్యం కేటాయింపుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను రక్షించకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కృష్ణప్రసాద్, మోహన్రెడ్డి, శేఖర్గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఇదీ ప్రాజెక్ట్ స్వరూపం..
నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని పది మండలాల పరిధిలో రూ.4,885 కోట్ల వ్యయంతో లక్ష ఎకరాలకు పైగా సాగు, 123 గ్రామాలకు తాగు నీరందించే లక్ష్యంగా ఎంఎన్కేఎల్ఐ పథకం పనులు చేపట్టారు. మొత్తం మూడు విడతలు కాగా.. మొదటి దఫా పనులు ఊపందుకున్నాయి. స్టేజీ–1లో మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కచ్చార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు కాల్వల పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా భూ పరిహారంలో దామరగిద్ద మండలం కానుకుర్తిలో గందరగోళం నెలకొంది. పరిహార జాబితాలో పలువురు రైతుల పేర్లు లేకపోవడం వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కొడంగల్ ప్రాజెక్ట్లో ఆ గ్రామంలోని సర్వే నంబర్ 393, 401/1లో దాదాపు 10.4 ఎకరాల భూమికి సంబంధించి చిక్కుముడులు నెలకొన్నాయి. ఇనాం భూమిలని సదరు రైతులు చెబుతుండగా.. రికార్డుల్లో దేవుడి మాన్యం కింద ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరిహారం జాబితాలో ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు గల్లంతు కావడం సమస్యగా మారింది. దీంతో పలువురు రైతులు ఇటు అధికారులు, అటు ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతుల్లో ఆందోళన, పరిహారం చిక్కుముడులపై రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. చిక్కుముడులతో గందరగోళం.. అందని పరిహారం.. చాటింపుతో ఆందోళన కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి మొత్తం 2,736.10 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 1,346.04 ఎకరాలకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రైతులకు మొత్తంగా రూ.269 కోట్లు అందజేశారు. ఇంకా 975 ఎకరాలకు పరిహారం అందించాల్సి ఉంది. అయితే నారాయణపేట మండలం పేరుపళ్ల గ్రామంలోని జాయమ్మ చెరువు వద్ద పంప్ హౌస్ నిర్మాణంలో 345 మంది రైతులకు చెందిన దాదాపు 400 ఎకరాలు భూసేకరణలోకి వెళ్లనున్నాయి. ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. ఆ డబ్బులు రైతులకు అందలేదు. నష్టపరిహారం చెల్లించకుండానే.. ఆయా భూముల్లో రైతులు పంటలు వేయొద్దంటూ అధికారులు ఇటీవల గ్రామంలో చాటింపు వేయించడంతో దుమారం చెలరేగింది. పరిహారం ఇవ్వకుండా ఎలా స్వాదీనం చేసుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.పరిహారం పూర్తిగా ఇచ్చే వరకూ భూములను వదులుకునేది లేదని.. అప్పటివరకు సాగు చేస్తామని చెబుతున్నారు. పేరుపళ్లలో చాటింపు వేసిన క్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన భూ నిర్వాసితుల్లోనూ ఆందోళన నెలకొంది. పంటలు వేయాలా.. వేయొద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. -
‘పరిహార’ కిరికిరి..!
ఆందోళనలో ‘కొడంగల్’ భూ నిర్వాసితులు ● ప్యాకేజీ చెల్లించకుండానే భూ స్వాధీనానికి అధికారుల యత్నాలు ● పంటలు వేయొద్దని ఎత్తిపోతల పరిధిలోని పలు గ్రామాల్లో చాటింపు ● మరోవైపు జాబితాలో పేర్ల గల్లంతుతో అన్నదాతల్లో ఆగ్రహం ● పూర్తిస్థాయిలో పరిహారం అందిన తర్వాతే భూములు వదిలేస్తాం.. ● అప్పటివరకు సాగు చేస్తామని తేల్చిచెబుతున్న రైతులు -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
ఆధ్యాతిక, పర్యాటక కేంద్రంగా మార్చాలి
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల వైరాల గుట్టను ఆధ్మాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్ అన్నారు. బుధవారం వైరాల గుట్టలో వెలసిన శివాలయాన్ని దర్శించిన ఆయన డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్ట చుట్టూ వేలాది మొక్కలు నాటి ప్రకృతి రమణీయంగా మార్చాలని డీఆర్డీఓకు సూచించారు. గుట్టకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత నిధులతో గుట్ట చుట్టూ రోడ్డు పనులు పూర్తి చేశారని, త్వరలో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ పరిణతి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సర్పంచ్ మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ హన్మంత్, గ్రామస్తులు కిరణ్కుమార్ రెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన
పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీలు రాక తూకం చేసిన వరి ధాన్యం బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి బస్తాల్లోని ధాన్యం మొలకెత్తడంతో గురువారం రైతులు నిరసన తెలిపారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ మాట్లాడారు. కేంద్రంలో 60 మంది రైతులకు చెందిన 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు లారీలు రాక 50 రోజులుగా నిల్వ ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 100కు పైగా బస్తాల్లోని ధాన్యం మొలకెత్తినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్తో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం చేస్తామని, ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా.. చాలా కేంద్రాల్లో నేటికీ ధాన్యం, బస్తాల నిల్వలు పేరుకుపోయాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం బస్తాలను తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
ఉపాధి పనుల్లో వేగం పెంచాలి
కొత్తకోట రూరల్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు వేగంగా, నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలం జంగమాయపల్లి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కందకాల తవ్వకం పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, తవ్వకాలను చూసి కూలీలతో మాట్లాడి పని వేళలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, నీడ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పామిరెడ్డిపల్లి–బలిజపల్లి రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు కార్మికుల సంఖ్య పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా పనులు ఇతర మండలాల్లో కూడా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మండలస్థాయి అధికారులు ఉన్నారు. ధ్యానం త్వరగా దించుకోవాలి.. వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తీసుకొచ్చిన లారీలు గోదాముల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా దించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం మండలంలోని చిట్యాల శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ రైస్మిల్లు గోదామును ఆయన సందర్శించి అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. లారీలు ఎక్కువ సంఖ్యలో వేచి ఉంటే కొన్నింటిని ఇతర గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. అవసరమైన హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రమేష్రెడ్డి, తదితర అధికారులు ఉన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
వనపర్తి: బాలకార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని.. ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, స్వేచ్ఛాయుత బాల్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. అంతర్జాతీయ బాలకార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవాసంస్థ, మహిళా, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా రూపొందించిన వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారికి విద్యనందించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు. బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే నిజమైన అభివృద్ధికి నాంది అని.. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, సఖి కేంద్రం నిర్వాహకురాలు కవిత తదితరులు ఉన్నారు. పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం.. పాన్గల్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తించే రాందాస్ జనవరిలో బ్రెయిస్ స్ట్రోక్తో మృతిచెందాడు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన భార్య లావణ్యకు ఎస్పీ సునీతారెడ్డి పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాలుగా అండగా నిలుసుందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అందాల్సిన అన్నిరకాల ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా లావణ్యతో మాట్లాడి కుటుంబ సభ్యుల స్థితిగతులు, పిల్లల చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏఓ సునందన, సూపరింటెండెంట్ ఇంతియాజ్ , రాందాస్ కుమార్తె నిఖిత తదితరులు ఉన్నారు. -
ధాన్యం పంచాయితీ
రాజధానికి చేరిన రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని రాజారాం ఏజెన్సీస్, మన రైతుబజార్, రాఘవేంద్ర ఫర్టిలైజర్, మండలంలోని చిమనగుంటపల్లిలో ఉన్న వేంకటేశ్వర ట్రేడర్స్ను తహసీల్దార్ రమేష్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఇచ్చిన రసీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. వారి వెంట వ్యవసాయ అధికారి కురుమయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. 2,972 మంది విద్యార్థులు పాస్ వనపర్తిటౌన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 2,972 మంది ఉత్తీర్ణులయ్యారని డీఐఈఓ నరేంద్రకుమార్ గురువారం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు 3,482 మంది విద్యార్థులు రాయగా 2,155 మంది పాస్ కావడంతో 61.88 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఇందులో బాలురు 1,864 మందికిగాను 985 మంది.. బాలికల్లో 1,618 మందికిగాను 1,170 మంది పాసయ్యారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు 1,696 మంది విద్యార్థులు రాయగా 817 మంది విద్యార్థులు పాసై 48.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇందులో బాలురు 1,112 మంది పరీక్షలు రాయగా 529, బాలికలు 584 మంది పరీక్షలు రాయగా 288 మంది పాసయ్యారని వివరించారు. -
పాప బతకాలంటేరూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి
సాక్షి, హైదరాబాద్ : కూతురు పుట్టిందని సంతోషం ఆ కుటుంబానికి ఎక్కువ కాలం నిలవలేదు. పసికందుకు పట్టుమని నాలుగు నెలలు నిండకుండానే భయంకరమైన వ్యాధి సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించగా పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. బతుకుదెరువుకోసం ఆటో నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తమకు రూ.కోట్లు చెల్లించి వైద్యం చేయించడం సాధ్యం కాదని, దాతల సాయం కోరుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడికి చెందిన బేరి రమేష్ స్థానికంగా ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొదటి కుమార్తె చైత్రికకు స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1 అనే జన్యుపరమైన నరాల జబ్బు సోకిందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా కండరాలు పూర్తిగా బలహీనపడి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. పాపను ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే రెండేళ్ల వయసు లోపు ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్ అనే ఇంజక్షన్ తీసుకోవాలని నిమ్స్ వైద్యులు సైతం సూచించారు. అయితే దీని ఖరీదు సుమారు రూ.16 కోట్లు ఉండటంతో రమేష్ కుటుంబం పాపను బతికించుకోవడం కోసం తల్లడిల్లుతోంది. పెద్దమనసుతో ముందుకొచ్చి పాపను ఆదుకోవడానికి సాయం చేయాలని రమేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు 8985801524, 9553267573 నెంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
ఇన్చార్జి డీఈఓగా యాదయ్య
వనపర్తిటౌన్: ఇన్చార్జి జిల్లా విద్యాధికారిగా యాదయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ అబ్దుల్ ఘనీ ఈ నెల 1న వికారాబాద్కు బదిలీ కావడంతో ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న వెంకటేశ్వర్రెడ్డికి వనపర్తి డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వెంకటేశ్వర్రెడ్డి బాధ్యతలు తీసుకోకపోవడం, మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి జెడ్పీ సీఈఓ యాదయ్యకు అదనంగా డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు యాదయ్యను సన్మానించారు. ఓటరు జాబితా సవరణకు సహకరించాలి వనపర్తి రూరల్: ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పెబ్బేరు మండలంలోని రంగాపురం, పెబ్బేరు పురపాలికలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు నాటడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. పర్యావరణ సమతుల్యతతో రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్ లభిస్తుందని వివరించారు. ప్రతి ఇంటా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, ఎంపీడీఓ వెంకటేష్, ఏఓ షేక్ మున్నా, ఎస్ఐ వెంకటేష్గౌడ్, కమిషనర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి పాన్గల్: ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సర్పంచ్ ఉషా లింగానాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. చెత్తను ఇష్టానుసారంగా కాలనీలో పారబోయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త తరలింపు ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతను విధిగా నిర్మించుకోవాలని సూచించారు. ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలని.. ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరుకావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి కుర్మన్న, తండావాసులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదిక అందజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, కాంగ్రెస్ నుంచి వేణాచారి, సీపీఎం నుంచి పరమేశ్వరాచారి, బీజేపీ నుంచి కొమ్ము శ్రీనివాస్, పెద్దిరాజు, బీఆర్ఎస్ నుంచి జమీల్, ఎంఐఎం నుంచి అప్సర్, టీడీపీ నుంచి శంకర్ తదితరులు ఉన్నారు. -
ఒక్క క్షణం.. అంతా శూన్యం!
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన నర్సింహులు ఇంటి నిర్మాణం కోసం అప్పులు పెరిగిపోయి నిండా మునిగిపోవడం... అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో తాను కౌలుకు తీసుకున్న మామిడి తోటలో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య కాళ్లూ చేతులు కట్టేసి సంపులో పడేశాడు. ఈ సంఘటన గత నెల 27వ తేదీన చోటు చేసుకుంది.. అప్పుల బాధ తట్టుకోలేక ఇలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగిలిస్తుంది. మహబూబ్నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ● ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. ● చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కులు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని.. ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్ తిట్టారని.. ఇంట్లో అమ్మానాన్న మందలించారని.. ఫోన్ చూడొద్దంటున్నారని.. ప్రేమలో విఫలమయ్యామని.. ఇలా చిన్నపాటి కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 28 నుంచి 30 శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో 14– 20 ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలు బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు జిల్లాలోనూ ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ఇవీ కారణాలు.. బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు కుటుంబంలో వచ్చే విభేదాలే కారణంఅంటున్న నిపుణులు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన -
సుస్థిర వ్యవసాయంతోనే రైతులకు భరోసా
మదనాపురం: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేతి బచావో అభియాన్.. షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ప్రధానశాస్త్రవేత్త డా. ఆర్డీ ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. సురేష్కుమార్, కేవీకే హెడ్ డా. వి.రాజేంద్రకుమార్ హాజరై జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకోవాలని సూచించారు. పంటల సంరక్షణ, సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణతో పాటు సహజ వనరులను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో రైతులకు సమగ్రంగా వివరించారు. శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్, డా. సురేష్కుమార్ మాట్లాడుతూ.. పంట మార్పిడీతో భూమి ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఆముదం, కుసుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటల్లో మెరుగైన రకాలను ఎంచుకోవాలని, విత్తనశుద్ధి, భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీఎస్పీ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉన్న వివిధ ప్రయోజనాలు, అవకాశాలను వివరించారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు తిప్పస్వామి ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, విత్తనాల పంపిణీ, పంటల బీమా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అర్హులైన రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుకు హాజరైన రైతులకు ఆముదం, కంది, రాగులు, జొన్న విత్తనాలను శాస్త్ర వేత్తలు ఉచితంగా పంపిణీ చేశారు. తక్కువ పెట్టు బడి, వాతావరణ ఒడిదొడుకులను తట్టుకొని అధిక ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేయడమే ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆర్.అనిత, డా. జి.భవాని, కేవీకే సిబ్బ ంది, పరిసర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. -
పంటమార్పిడితో అధిక లాభాలు
గోపాల్పేట: రైతులు పంటమార్పిడి పద్ధతి అవలంబిస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్ నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటా విధిగా నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు జిల్లాలో రెండ్రోజులు పర్యటించి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. గ్రామంలో గత ఐదేళ్లలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారు మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకొని రూ.20 వేలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాల ని కోరారు. గ్రామంలో రూ.పది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిగోపాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముజాహిద్, నాయకుడు యాదయ్య, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి రంగాలను ప్రోత్సహించాలి
● రూ.5,990 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక పుస్తకం విడుదల ● రుణాల మంజూరులో లక్ష్యాలను అధిగమించిన అధికారులకుకలెక్టర్ అభినందన వనపర్తి: రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాల రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందరింలో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ), డీఎల్ఆర్సీ (డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ) సమావేశం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, విద్య, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు వారీగా సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,990 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణాల మంజూరులో సిబిల్ స్కోర్ను ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారుల రుణాలు తిరస్కరణకు గురికాకుండా సానుకూల దక్పథంతో వ్యవహరించాలన్నారు. కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, తమ పనితీరు మెరుగుపర్చుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ పథకాలను సమీక్షించిన కలెక్టర్ లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఆలస్యం కాకుండా కారణాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. బ్యాంకులు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఖాతాదారులు, ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకున్న లబ్ధిదారుకు బీమా పథకాలు వర్తింపజేయాలని సూచించారు. అవసరమైన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యా రుణాలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేసిన యూబీఐ, ఎస్బీఐ, యూకో బ్యాంక్ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలు అందజేశారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలోని కోర్సుల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,339 కోట్ల వార్షిక రుణ లక్ష్యాలకుగాను రూ.4,943 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నాబార్డ్ డీడీఎం మాట్లాడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక రూపొందించడానికి కావాల్సిన సమాచారాన్ని అందించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్బీఐ ఎల్డీఓ డా. ప్రదీప్చంద్ర, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, యూబీఐ ఏజీఎం మురళీకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం శ్రీచరణ్, ఇతర బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి
వనపర్తి(గోపాల్పేట): కేసుల సమాచారాన్ని పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని అదనపు ఎస్పీ రాజేష్మీనా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎస్ఐ శశిధర్తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుశాఖలో సీసీటీఎన్ఎస్ ప్రత్యేకమైన కీలక వ్యవస్థ అని.. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, చార్జ్షీట్ దాఖలు వరకు ప్రతి దశను సాంకేతికంగా పర్యవేక్షించేందుకు వ్యవస్థ పని చేస్తుందని, సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీసీటీఎన్ఎస్లో వివరాలు నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి తప్పిదాలకు తావివ్వకూడదని, పెండెన్సీ లేకుండా చూసుకోవాలని చెప్పారు. డేటా ఎంట్రీలో అత్యుత్తమ పనితీరు కనబర్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. -
రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం తనిఖీ
● రూ.2.50 కోట్ల వరి ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు కొత్తకోట: మండలంలోని మిరాసిపల్లి శివారులో ఉన్న సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లులో మంగళవారం రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 25,426 బస్తాల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అధికారులు వేశారు. పంచనామా నిర్వహించి మిల్లులో ఉన్న మిగులు ధాన్యాన్ని రాయిణిపేట శివారులోని ఏకేఆర్ ఇండస్ట్రీస్కు తరలించారు. పూర్తి నివేదికను అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు) సమర్పిస్తామని.. తదుపరి ఆదేశాల మేరకు సంబంధిత మిల్లర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఫిజికల్ పత్రాలు అడగొద్దు : ఈడీఎం వనపర్తి: మీ సేవా దరఖాస్తుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ పత్రాలు అడగొద్దని.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే పరిశీలించి మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని ఈడీఎం వెంకటేశ్ సూచించారు. మంగళవారం ఆయన అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోటలో పర్యటించి తహసీల్దార్లు, జీపీఓలు, ఆర్ఐలతో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలను సక్రమంగా స్కాన్ చేసి మండల సిబ్బందికి సమయానుకూలంగా అందజేయాలని ఆదేశించారు. 25 మంది డీటీలకు పదోన్నతులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లాలకు కేటాయించారు. ఇందులో నాగర్కర్నూల్ జిల్లాకు రాజీవ్రెడ్డి, రామకృష్ణ, రవి, పుష్పలత, మహబూబ్నగర్ జిల్లాకు సుజాతమ్మ, హరిందర్రెడ్డి, శ్రీను, సుదర్శన్రెడ్డి, బాలరాజు, నారాయణపేట జిల్లాకు గాయత్రి, రాజ్గోపాల్, కిషోర్కుమార్, దీపిక, వియోచన, వనపర్తి జిల్లాకు వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, విజయ్కుమార్, కరుణాకర్, నదీమ్, గద్వాల జిల్లాకు రాఘవేందర్, తిలక్రెడ్డి, లక్ష్మీకాంత్, శ్రీనివాస్, వాసుదేవరావులను కేటాయించారు. వీరికి ఆయా జిల్లాలోని మండలాలను కలెక్టర్లు కేటాయిస్తారు. అయితే మహబూబ్నగర్లో చాలామంది డీటీలు ప్రమోషన్ను తీసుకోవడానికి ఇష్టంగా లేరని సమాచారం. మహబూబ్నగర్ను విడిచి ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. -
ప్రతి ఇంటా సోలార్ వెలుగులు : మంత్రి
వనపర్తి(చిన్నంబావి): ప్రతి ఇంటా సోలార్ వెలుగులు నింపాలన్న ప్రభుత్వ ఆశయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని.. ఇంటి మిద్దెలపై సొలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. మంగళవారం తన స్వంత గ్రామం మండలంలోని పెద్దదగడలో ఆయన పర్యటించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ ప్రాజెక్టులో పెద్దదగడను పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని.. ప్రభుత్వం రాయితీ అందిస్తుందని వివరించారు. ఆయన వెంట విద్యుత్శాఖ అధికారి అప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, సర్పంచ్ ఉడుతల భాస్కర్, వడ్డెమాన్ బిచ్చన్న, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత ఎన్నికలు
ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ●ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగర్కర్నూల్ 3 96 జిల్లాల వారీగా సంఘాలు. ఓటర్లు ఓటర్లు సంఘాలు మొదటివిడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు నారాయణపేట 10 739 వనపర్తి 8 2,014 -
నారాయణపేటపై వనపర్తి విజయం
గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రామీణ క్రీడాకారులకు భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తామని భారత జట్టు మాజీ క్రికెటర్, హెచ్సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు అన్నారు. జిల్లాకేంద్రం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా అండర్–14, 16 వన్ డే క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్సీఏ నుంచి భారత జట్టుకు అధిక సంఖ్యలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలన్నదే హెచ్సీఏ లక్ష్యం అన్నారు. హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టీ–20 క్రికెట్ ప్రారంభం కానుందన్నారు. ప్రతి జట్టులో నలుగురు గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ టీ–20 లీగ్ నుంచి రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు భారత జట్టుతోపాటు ఐపీఎల్ తరపున ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. ఎండీసీఏ మైదానంలో ఫ్లడ్ లైట్లు, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీ అండర్–14లో విజేతగా మహబూబ్నగర్, రన్నర్గా జడ్చర్ల, అండర్–16లో విజేతగా జడ్చర్ల, రన్నర్గా నిలిచిన మహబూబ్నగర్ బాలుర జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, న్యాయవాది మనోహర్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ప్రతినిధులు సురేష్కుమార్, వెంకటరామారావు, గోపాలకృష్ణ, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బాలాజీ ఐటీఐ కళాశాల మైదానంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంట్రో డిస్ట్రిక్ అండర్–16 క్రికెట్ మ్యాచ్లో నారాయణపేట జట్టుపై వనపర్తి జట్టు విజయం సాధించింది. మంగళవారం వనపర్తి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 25 ఓవర్లలో 163 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన నారాయణపేట జట్టు 23 ఓవర్లు మాత్రమే ఆడి 99 పరుగులకే ఆలౌట్ అయింది. వనపర్తి జట్టులో పవన్ 52 బంతుల్లో 40 పరుగులు, మనోజ్ 28 బంతుల్లో 25 పరుగులు చేశారు. అదేవిధంగా బౌలింగ్లో 3 వికెట్లు తీసి వనపర్తి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మనోజ్కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. సమ్మర్ క్రికెట్ క్యాంపు ఇన్చార్జ్ రమణ, హెచ్సీఏ పరిశీలకుడు ముక్తార్, జహీర్, చెన్నారెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్యశాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
అర్హత ఇలా...
బాలలకు సంబంధించి పునరావాసం, దత్తత, పునరేకీకరణ, పోషణ వంటి తదితర అంశాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్టు 2015 ప్రకారం జరిగి తీరాలి. దత్తత నియమావళి 2017ను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. దత్తత కావాలనుకునే భార్యాభర్తలిద్దరి అంగీకారం ఎంతో ముఖ్యం. నియమాల ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చిన తరువాత ఒంటరి లేదా విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివవించే మగ వ్యక్తి బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు. శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచండి
వనపర్తి: జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ కె.శివకుమార్నాయుడు ఆదేశించారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో ఆయన సమావేశమై భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి, నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని గణపసముద్రం ప్రాజెక్టులో పెండింగ్ ఉన్న 197 ఎకరాల భూసేకరణకు గాను 164 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. రైతులను ఒప్పించి అవార్డు కూడా త్వరగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 17 ఎకరాల భూసేకరణకు సోమవారంలోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎంజీకేఎల్ఐ ప్యాకేజీ–29 మైనర్ కెనాల్స్కు సంబంధించి 77 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా పూర్తిచేసి.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఘణపూర్ బ్రాంచ్ కెనాల్కు 30 ఎకరాల భూమి పెగ్ మార్కింగ్ పూర్తిచేయడంతో పాటు ఎస్డీఆర్ స్టేజీలో ఉన్న 60 ఎకరాలకు కూడా త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన 101 ఎకరాల భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడి అవార్డు వేగంగా జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాన్ చెరువుకు సంబంధించి చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాల పరిధిలో అటవీ భూమి అంశంపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా అనుమతులు పొందే విధంగా చూసుకోవాలన్నారు. భూ సేకరణలో భాగంగా ఇప్పటికే అవార్డ్స్ జారీ చేసిన వాటికి సంబంధించి టొకెన్స్ రైస్చేస్తే త్వరగా నగదు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ రహీముద్దీన్, ఎస్ఈ చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. పెండింగ్ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు -
అనాథలుగా మారుతున్న అభాగ్యులు
నవ మాసాలు మోసి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను ఆ తల్లులకు మనసేలా ఒప్పుతుందో తెలియదు కానీ తమ పిల్లలను పెంట కుప్పలు, రోడ్లపై పాడేసి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో శిశుగృహకు చేర్చుతున్నారు. వీరితో పాటు కొందరు తల్లిదండ్రులు తాము సంతనాన్ని పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. ఆడపిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. దత్తత సలహా, సహాయ కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అనాథలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారితో వెళ్లే చిన్నారుల యోగక్షేమాలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. ఎక్కడైనా లోపం తలెత్తితే తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటుంది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
అమరచింత/ఆత్మకూర్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో హకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అమరచింత మండలంలోని కిష్టంపల్లి హకా సెంటర్ –3, ఈర్లదిన్నెలోని వెంకటేశ్వర ట్రేడర్స్లో స్టాక్ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా విత్తనాల స్టాక్ వివరాలను నోటీస్ బోర్డుపై లిఖించకపోవడంతో సదరు డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా విత్తనాలు కొనుగోలుచేసే రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని ఆయన సూచించారు. డీఏఓ వెంట ఏఓలు రమేశ్, అరవింద్ ఉన్నారు. -
రేపటి ప్రజావాణి రద్దు
వనపర్తి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక గ్రామసభల కార్యక్రమం కారణంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి.. ఫిర్యాదులు, అర్జీలు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. 15వ తేదీన యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కొత్తకోట: తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవికాంత్రెడ్డి, కార్యదర్శి మన్నె శశికుమార్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎస్పీఎం కార్మికుల సర్వసభ్య సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్పీఎం కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ముందుండి పోరాడుతోందన్నారు. ఎస్పీఎం కార్మికులందరినీ బేషరతుగా సంస్థలో విలీనం చేయడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. ఎం.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీజీఎన్డీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు రాందాస్ నాయక్, రమణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎద్దుల సత్యం, ఎస్పీఎం కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి ఇల్లందుల రాజయ్య, వరదరాజు, మురళీధర్రావు, సాయి ప్రకాశ్గౌడ్, కవికుమార్రెడ్డి, కురుమూర్తి, సురేంద్ర ప్రసాద్, కొండయ్య ఉన్నారు. జలదోపిడీపై విచారణ జరపాలి వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని లిక్కర్ కంపెనీ జలదోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేంధర్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం లిక్కర్ కంపెనీ సమీపంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏబీడీ లిక్కర్ కంపెనీ నిర్వాహకులు కృష్ణాజలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపుల ద్వారా నదిలో కలుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం నదీ జలాలను మొదటగా తాగడానికి, సాగుకు వాడుకోవాలని.. ఆ తర్వాతే ఇతర అవసరాలకు ప్రభుత్వ అనుమతులతో వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. లిక్కర్ కంపెనీ జలదోపిడీ చేస్తున్నా ఇరిగేషన్శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి.. కృష్ణాజలాల అక్రమ వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, దేవర శివ, జితేందర్, రామన్గౌడ్, బీచుపల్లి సర్పంచ్ బీసీ రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, అదామ్, రాజశేఖర్గౌడ్, వీరేష్, నరేష్గౌడ్ పాల్గొన్నారు. ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్లోని హయత్నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్ఆఫీస్లోని ఏటీఎం కార్గో ఇన్చార్జి డీఎన్ రాజన్ను కేటాయించారు. అలాగే షాద్నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్గౌడ్ను ఐటీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. -
ఎకరం @ రూ.2కోట్లు
రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా భూముల ధరలు ●వనపర్తి: రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా జిల్లాలోని భూముల విలువ పెరిగింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను ప్రభుత్వం సవరించడంతో వాటి రెక్కలొచ్చాయి. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న మండలాల్లో ఎకరా భూమి రూ. కోటి ఉన్న ధర.. ప్రస్తుతం రూ. 2కోట్లకు చేరింది. జిల్లాలోని భూముల విలువ, మార్కెట్ విలువ వ్యత్యాస్యాన్ని సేకరించిన ప్రభుత్వం.. స్వలంగా తేడాలు ఉన్నచోట 25 నుంచి 75 శాతం, డబుల్ కంటే ఎక్కువ తేడా ఉన్నచోట 100శాతం పెంచింది. భవనాల విలువ పెంపు విషయంలో 50 కంటే ఎక్కువగా జిల్లావ్యాప్తంగా ఎక్కడా పెంచలేదని తాజాగా అమల్లోకి వచ్చిన నూతన మార్కెట్ విలువల ధరల మేరకు తెలుస్తోంది. కొత్తకోట మండలంలో అత్యధికంగా.. జిల్లాలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న కొత్తకోట, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లోని భూముల ధరలు అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తోంది. కొత్తకోట మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఎకరం భూమి గతంలో రూ.కోటి ధర ఉండగా, మార్కెట్ విలువ అంతకు మించి ఉందని తెలుసుకున్న ప్రభుత్వం.. జిల్లావ్యాప్తంగా మరెక్కడా లేనంతగా ఎకరం భూమి విలువను రూ. 2కోట్లకు పెంచింది. దీంతో జిల్లాలోని భూముల విలువ రాష్ట్ర రాజధాని భూములతో పోటీ పడుతున్నాయని చర్చ సాగుతోంది. ఆ తర్వాత పెబ్బేరు, పెద్దమందడి శివారు ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల విలువ రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్లకు పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పక్కనపెడితే.. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. స్వల్పంగా పెరిగిన భవనాల విలువ.. రోజురోజుకూ ధరలు తగ్గిపోయే ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ భవనాల ధరలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పోల్చితే కేవలం 25శాతమే పెంచారు. రేకుల, పెంకులతో పైకప్పు ఉన్న నిర్మాణాలను అతి స్వల్పంగా పెంచారు. వాటి విక్రయాల సమయంలో చెల్లించాల్సిన రిజిస్టేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ తదితర చార్జీలు అన్నింటిని చెల్లించినా గతంలో కంటే అతి స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచే ప్రభుత్వం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్ల ప్రకారం స్టాంఫ్, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలుచేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. ప్రశాంతంగా పెరిగిన ధరల ప్రకారం ప్లాట్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. వెంటనే నిర్మాణపు ఆస్తుల వివరాలు మున్సిపల్ రికార్డుల్లోనూ మారిపోతాయి. – చంద్రశేఖర్, సబ్ రిజిస్టార్, వనపర్తి వ్యవసాయ, వ్యవసాయేతర భూమి రేట్లు రెట్టింపు జిల్లాకేంద్రంలో గజం స్థలం గరిష్టంగా రూ.30,900 పెంపు మార్కెట్ విలువల సవరణతో భూముల ధరలకు రెక్కలు జిల్లావ్యాప్తంగా పెంచిన ధరల ప్రకారం అత్యధికంగా జిల్లా కేంద్రంలోని రామాలయం, మెట్టుపల్లి, శ్రీనివాసాపురం, మర్రికుంట, నాగవరం తదితర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు ధరలు విపరీతంగా పెరిగాయి. స్థానిక రామాలయం ప్రాంతంలో గజం ధర రూ. 24,800 ఉండగా.. ప్రస్తుతం పెంచిన విలువతో రూ. 30,900 ధర పెరిగినట్లు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. దీంతో సాధారణ 30/40 సైజు ప్లాటు సైతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం రూ. 41లక్షలకు పైబడి ధర నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో ఒక చిన్న ప్లాటు రిజిస్టేషన్ చేసుకోవాలన్నా రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఈ నెల 5 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు, ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల విలువలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు అధికారులు నెలరోజులపాటు కసరత్తు చేశారు. అయినప్పటికీ వనపర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనుకున్న మేరకు రిజిస్ట్రేషన్ల సందడి కనిపించలేదు. సాధానంగా నెలవారీగా అయ్యే రిజిస్ట్రేషన్లతో పోల్చితే 10శాతం ఎక్కువగా అయినట్లు అధికారులు వెల్లడించారు. -
భూగర్భ జలాల వృద్ధికి..
భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి కుటుంబం తమ ఇళ్ల ఆవరణలో నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో 100 నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యం విధించారు. పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకులకు సూచిస్తున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత కొండలు, గుట్టల ప్రాంతంలోని వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకేవిధంగా జిల్లావ్యాప్తంగా 40 వేల కందకాలు పూర్తి చేశాం. దీంతోపాటు ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంతతో పాటు ఆలయాలు, బస్టాండ్, పాఠశాల ఆవరణలో సామూహిక ఇంకుడు గుంతలను తవ్వించాలని నిర్ణయం తీసుకున్నాం. వీటిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – ఉమాదేవీ, డీఆర్డీఓ ● -
అన్లోడింగ్లో ఆలస్యంతో సమస్యలు
ఖిల్లాఘనపురం: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నందున మిల్లులు, గోదాముల దగ్గర అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి తండా దగ్గర ఉన్న ఇన్వెస్టర్ గోదాం, మండల కేంద్రం సమీపంలోని శ్రీరామ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదాములు, రైస్మిల్లుల దగ్గర ధాన్యం తీసుకొచ్చిన లారీలు, డీసీఎంలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయని.. హమాలీల సంఖ్య పెంచి త్వరగా అన్లోడింగ్ చేయించాలని చెప్పారు. ఆలస్యం కావడంతో చాలా సమస్యలు వస్తున్నాయని.. రోజుల తరబడి ఉండటంతో తూకంలో తేడాలు వస్తున్నట్లు పలు గ్రామాల రైతులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. మిల్లులో కేవలం సన్నరకం మాత్రమే కాకుండా దొడ్డురకం వరి ధాన్యం కూడా దించుకోవాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున మండలస్థాయి అధికారులు తరుచూ మిల్లుల దగ్గరకు వెళ్లి పరిశీలించి కొనుగోళ్లు, అన్లోడింగ్ త్వరగా పూర్తి చేసేందుకు సూచనలు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డీటీ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. -
ట్యాబ్ ఎంట్రీల్లో వేగం పెంచాలి
వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీల్లో వేగం పెంచి రైతుల ఖాతాల్లో వీలైనంత త్వరగా నగదు జమ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో ఇప్పటికే తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను సమకూర్చాలని, లేకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జిల్లాలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కుప్పలు, వాహనాల్లో లోడ్ చేసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఆంజనేయులు, డీఆ ర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
వనపర్తిటౌన్: ప్రచారం, హంగుల కోసం కాకుండా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులత కోసం మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటి చేతులు దులుపుకొంటే కుదరదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ప్రకృతిని అందించాలంటే పర్యావరణాన్ని నాశనం చేయొద్దన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యమై ఉష్ణోగ్రతల్లో సమతుల్యత కొరవడటానికి అధిక వాహనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకమని.. వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటితే పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు 500 నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుందని, భవిష్యత్లో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవడం, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, ప్రకృతి సమతుల్యతను కాపాడటం భవిష్యత్ తరాలకు ఇచ్చే కోట్ల ఆస్తి అని వివరించారు. రాబోవు తరాలకు ఆరోగ్యకర, సురక్షిత, నివాసయోగ్యమైన భూమి అందించాలంటే ప్రస్తుతం మనం నాశనం చేయకుండా ఉంటే చాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు శ్రీలత, అశ్విని, కార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కార్యదర్శి వెంకటరమణ, అటవీశాఖ అధికారులు విజయ్, రాజుకుమార్, బాలకిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో 100 ఇంకుడు గుంతలు..
ప్రతి గ్రామంలో కనీసం 100 ఇంకుడు గుంతలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో డీఆర్డీఓ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంకుడుగుంతల అవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుగా గ్రామ సర్పంచ్ ఇంటి ఆవరణలో మొట్టమొదటగా ఇంకుడుగుంత నిర్మించి కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేర ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. అమరచింత: కేంద్ర జలసంరక్షణ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కందకాల నిర్మాణాలతో పాటు ఇంకుడు గుంతల ఏర్పాటును వేగవంతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 40 వేల కందకాలు పూర్తిచేసి జల సంరక్షణలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టు నేరుగా భూమిలోకి చేరేలా ఉపాధి కూలీలతో కందకాల తవ్వకం చేపడుతూ.. ప్రతి ఇంటా తప్పనిసరిగా ఇంకుడుగుంత తవ్వుకోవాలని అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎండలు ముదిరి వర్షాలు తగ్గే ప్రమాదం ఉందనే విషయాలను వివరిస్తూ వర్షపు నీరు నేరుగా భూమిలో ఇంకేందుకు వీలుగా ప్రత్యామ్నాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. వేసవిలోనే వీటి లక్ష్యాలను పూర్తి చేసుకుంటూ వర్షాకాలంలో మొక్కలు నాటి సంరక్షించేందుకు వీలైనన్ని గుంతలను రహదారులకు ఇరువైపులా తవ్వేందుకు సిద్ధం చేస్తున్నారు. కందకాల నిర్మాణాలు.. గ్రామాల్లో కొండలు, గుట్టల ప్రాంతాలను గుర్తించిన అధికారులు వాటి చుట్టు వీలైనన్ని కందకాలు తవ్వించే కార్యక్రమాలు చేపట్టారు. కొండపైకి వెళ్లేందుకు వీలుగా ఖాళీ స్థలం వదులుతూ కందకం తవ్వుతున్నారు. దీంతో కొండ ఎగువ భాగంలోని వర్షపు నీరు జాలువారి నేరుగా కందకంలోకి చేరి భూగర్భ జలాలు పెంపొందించేందుకు దోహదపడనున్నాయి. అలాగే నీరు నిల్వ ఉండటంతో కొండలు, గుట్టల ప్రాంతంలో పచ్చదనం పెంపొంది పశువులు, జంతువులకు మేత దొరుకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల కందకాలు పూర్తి చేశారు. పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు 40 వేల కందకాల నిర్మాణం పూర్తి ప్రతి గ్రామానికి 100 ఇంకుడు గుంతలు లక్ష్యం ప్రజాప్రతినిధుల ఇంటి నుంచే ప్రారంభం కేంద్ర జల సంరక్షణ అభియాన్లో జిల్లా ముందంజ -
ఓటరు జాబితా సవరణపై అపోహలు వద్దు
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఖిల్లాఘనపురం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణపై ఎలాంటి అపోహలు వద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. మండలంలోని పర్వతాపురం, అల్లమాయపల్లి, తిర్మలాయపల్లి, అంతాయపల్లి, దొంతికుంటతండాలో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పర్వతాపురంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్తో పాటు డీఎల్పీఓ రఘునాథ్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే ఓటరు జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉంటుందని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా అధికారులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సాగులో ప్రభుత్వం గుర్తించిన వరి, పత్తి తదితర పంటల విత్తనాలు మాత్రమే కొనుగోలు, ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటల సాగు పెంచాలన్నారు. జాతీయ కుటుంబ సహాయ పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జల సంరక్షణ.. మన సంరక్షణ పథకంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత తవ్వుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఎస్సై వెంకటేష్, హౌసింగ్ ఏఈ సందీప్, సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
మంగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొత్తకోట రూరల్: మంగంపల్లిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలస్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, ఇంకుడు గుంతల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మెప్పు పొందుతుందని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.30 కోట్లు చెల్లించిందన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగంపల్లిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశామని.. ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు తనవంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ ద్వారా మరో రూ.10 లక్షల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధులతో గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తానని, గ్రామంలో ఇప్పటికే సీసీ కెమెరాలు బిగించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామని తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ఇంకుడు గుంతలతో గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.20 వేల లబ్ధి పొందవచ్చన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని.. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీఓ పరిణత, ఎస్ఐ జలంధర్రెడ్డి, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో దుమారం..!
గతంలో కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్పై విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్లోనే ఉంటారా.. కాంగ్రెస్లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాల కు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పాన్గల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని శాగాపూర్తండాలో సర్పంచ్ నాగేష్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరు కావాలని, ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు. ఇంటి, కొళాయి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, తండా వాసులు పాల్గొన్నారు. -
వడివడిగా..
● కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన ● కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ● ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ ● గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష ● నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ ● పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూరు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనాల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్తల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధిలోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. -
రేపట్నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
వనపర్తిటౌన్: శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్తు సంయుక్తంగా రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో శని, ఆదివారం 7వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని.. కవులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా. నాయికంటి నరసింహశర్మ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం తెలుగు మహాసభల కరపత్రాలను జిల్లా కవులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహనీయుల స్ఫూర్తివేధిక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, కవి బైరోజు గిరిరాజాచారి, సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి, తపస్ రాష్ట్ర కార్యదర్శి అల్వాల వరప్రసాద్గౌడ్, విశ్రాంత తపాలా అధికారి, ఎమ్మార్పీఎస్ జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య, తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, సామాజిక విశ్లేషకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త వెంకటస్వామి, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఉమామహేశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
రవినాయక్ను అభినందించిన రాష్ట్రపతి
గోపాల్పేట: మండలంలోని బుద్దారం లక్ష్మీతండాకు చెందిన ముడావత్ రవినాయక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ పూర్తిచేసి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ నెల 2న ఢిల్లీలో జన జాతీయ గరిమా ఉత్సవ్ వేడుకల్లో భాగంగా భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా గిరిజన్ స్కాలర్షిప్ పొంది పీహెచ్డీ పూర్తిచేసిన 200 మందిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సన్మానించి అభినందించారు. ఇందులో ముడావత్ రవినాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రవినాయక్ ఏపీలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఏసీజీఈ గణేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 11 వరకు పరీక్షలు కొనసాగుతాయని.. జిల్లావ్యాప్తంగా ఒకేఒక్క పరీక్ష కేంద్రం చాణక్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 204 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొదటిరోజు శుక్రవారం తెలుగు పరీక్ష 40 మంది విద్యార్థులు రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష కొనసాగనుందని వివరించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాలి వనపర్తి రూరల్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోనే మహిళా సాధికారిత సాధ్యమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ 72వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33 శాతం రిజర్వేషన్ చట్టం చేశారని, బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి అమలు కాకుండా అడ్డుపడిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారొద్దని, అన్యాయం జరిగినప్పుడు వీధులోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతుండటంతో పాటు న్యాయం కూడా జరుగుతుందన్నారు. మహిళలు ఏకమై పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గీత, శిరీష, శ్రీదేవి, వెంకటమ్మ, సాయిలీల, నాగమణి, వార్డుసభ్యురాలు సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య పాల్గొన్నారు. పెంచిన వేతనాలు వర్తింజేయాలి ఖిల్లాఘనపురం: ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను వర్తింపజేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల జీతాలు విడుదల చేయాలని, ముఖ్యమంత్రి 73 షెడ్యూల్ రంగాల్లోని 11 వేల మంది కార్మికులకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం వచ్చేదన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
కందనూలు: సీఎం రేవంత్రెడ్డి కుమ్మెర పంప్హౌస్ సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు కుమ్మెర కార్యక్రమ ఇన్చార్జి ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లోవివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున 350 మందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ సమయంలో సెల్ఫోన్లు చూడటం, ఇతర వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ విధులను నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పాయింట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ.. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
బీడీ ప్యాకింగ్ రేట్లు పెంచాలి : టీయూసీఐ
అమరచింత: బీడీ ప్యాంకింగ్ రేటు వెయ్యికి రూ.15 పెంచాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మార్స్స్ భవనంలో గురువారం ఉమ్మడి జిల్లా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. బీడీ కూలి వెయ్యికి రూ.20 పెరిగిందని.. అందుకు అనుగుణంగానే ప్యాకింగ్ రేట్లు పెంచాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో రూ.18 ఉండగా.. ఇక్కడ మాత్రం కేవలం రూ.8.50 మాత్రమే చెల్లించడం దారుణమన్నారు. బీడీ ప్యాకర్స్ వేతనాలు పెంచాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని.. వారం రోజుల్లో యాజమాన్యం చర్చించకపోతే ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.. కార్యక్రమంలో దేవదానం, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. బీడీ ప్యాకర్స్ కార్యవర్గం ఏర్పాటు.. బీడీ ప్యాకర్స్ గౌరవ అధ్యక్షుడిగా జేఎన్ దేవదానం, అధ్యక్షుడిగా గోపిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా సుందర్, ప్రధానకార్యదర్శిగా బ్రహ్మం, సహాయ కార్యదర్శిగా రవి, కోశాధికారిగా కురుమూర్తితో పాటు ఏడుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఆశల పల్లకీలో..
జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనపై గంపెడాశలు ● శ్రీశైలం నిర్వాసితులకు దక్కని న్యాయం ● నాలుగు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు ● ఇంజినీరింగ్ కళాశాల, పరిశ్రమల ఏర్పాటుపై హామీ దక్కేనా?సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధిపై ఇవ్వనున్న వరాలపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులతో పాటు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగంతో పాటు పరిహారానికి సైతం నోచుకోలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులు సీఎం రేవంత్రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు. నాలుగు దశాబ్దాలైనా.. శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన నీటిమూటగానే మారింది. అందుకోసం 1984లో జారీ చేసిన జీఓ 98 సైతం నేటీకీ అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయిన వారిలో ఇంకా 2,156 మంది ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంత మంది మరణించగా.. మరికొందరు వృద్ధాప్యానికి చేరువయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో శ్రీశైలం భూనిర్వాసితుల అంశం ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఈ క్రమంలో సీఎం అపాయింట్మెంట్ కోసం నిర్వాసితుల తరఫున ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించారు. అయితే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమకు పరిహారం విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశలు పెట్టుకున్నారు. -
అసంపూర్తిగానే.. ఆకాంక్ష
వనపర్తికేఎల్ఐతో మహర్దశ పట్టినా నామమాత్రంగానే సాగు ● భారీ సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాల్వలు లేకపోవడమే కారణం ● వరప్రదాయినిగా నిలిచిన జూరాలలో పేరుకున్న పూడిక ● నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ పనులు పెండింగ్లోనే.. ● పుష్కర తెలంగాణలో సాగు నీళ్ల కోసం తప్పని నిరీక్షణ ● నేడు, రేపు సీఎం రేవంత్, మంత్రుల ప్రాజెక్ట్ల సందర్శన .. ప్లాస్టిక్ నిషేధం మహబూబ్నగర్ సమీపంలోని పర్వతాపూర్ మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026–8లో uఅడుగులు పడినా పూర్తికాని ‘పాలమూరు’ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఐదు (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పంప్ను ప్రారంభించారు. రిజర్వాయర్ల వారీగా.. నార్లాపూర్: కొల్లాపూర్ మండలంలో 8.61 టీఎంసీల సామర్థ్యం గల నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. పంప్ హౌస్ పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కెనాల్ నిర్మించాల్సి ఉండగా.. 400 మీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. పంప్హౌస్ కోసం 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్ కింద సబ్ కెనాళ్లు, బ్రాంచ్ కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్ చేయాల్సి ఉంది. పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం రెండు మోటార్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మూడింటిని ఏర్పాటు చేసింది. ఇంకా నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యూ -
ఎస్ఐఆర్ మాటున ఓట్ల తొలగింపునకు కుట్ర
కొత్తకోట రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని.. ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ ముందుకు సాగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భవిష్యత్లో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే పార్టీ శ్రేణులు సంఘటితంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం కొత్తకోట సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పార్టీ వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాసులు, దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లె రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రతి కార్యకర్త, అభిమానిని సభ్యుడిగా నమోదు చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి నాయకులు పార్టీ ఇన్చార్జీలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పరంగా అగ్రగామిగా నిలిచిందని, తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేశామన్నారు. కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తూ ప్రజలతో కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, తామంతా ఒకే జట్టుగా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పి.సుఖేషిని, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, కౌన్సిలర్ అయ్యన్న, పార్టీ నాయకులు గాడీల ప్రశాంత్, కొండారెడ్డి, బాబురెడ్డి, న్యాయవాది యాదగిరి, ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్, మొద్దుబాబు, చీర్ల నాగన్నసాగర్, కటికె శ్రీనివాసులు, నరేష్సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ -
నకిలీ విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి
వనపర్తి: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున జిల్లా రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని.. నకిలీ విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలకు సంబంధించి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించగా కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని.. ఒకవేళ రైతులు వరి ధాన్యం వేయడానికి మాత్రమే మొగ్గు చూపితే, కేవలం సన్నరకం సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని, గత సీజన్లో అధిక మొత్తంలో యూరియా తీసుకున్న వారిని గుర్తించి వారు దేనికోసం వినియోగించారనే అంశంపై తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘పది’లో 100 శాతం ఉత్తీర్ణతకు ప్రణాళికలు.. రాబోయే విద్యాసంవత్సరంలో పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. భౌతికశాస్త్రం, ఆంగ్లంపై శ్రద్ధ వహించి వెనుకబడిన విద్యార్థుల కోసం సులభమైన పద్ధతిలో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భౌతికశాస్త్రం, ఆంగ్లం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది గణితంలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి, ప్రత్యేకంగా బోధించి మంచి ఫలితాలు సాధించినట్లే.. ఈసారి కూడా భౌతికశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాథమిక అంశాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలు రూపొందించాలని, నెలాఖరులోగా ఆయా పుస్తకాల తయారీ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముందుగా ఈ ఏడాది పదోతరగతి చదివే విద్యార్థులకు సులభ పరీక్ష నిర్వహించి ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆయా సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే న్యాణ్యమైన బోధన విద్య
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని సీఎంఓ ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సోళీపురం, ఉప్పరిపల్లి, రుక్కన్నపల్లి, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సోళీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా అందించడమేగాక నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి, సర్పంచ్లు సింధు, శేఖర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రామ, వార్డుసభల నిర్వహణ
వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుసభలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు, గ్రామసభల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. పర్యావరణ వారోత్సవాలను కొనసాగిస్తూనే మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకొని అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరిగేలా చూడాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించాలని, రైతులు పంట మార్పిడి దిశగా అడుగులు వేసేలా చూడాలన్నారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యం, మొక్కల పెంపకంపై చైతన్యపర్చాలని, రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లాస్థాయి వరకు అధికారులందరూ సమన్వయంతో గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సకలజనులసంక్షేమమే ధ్యేయం
‘గృహజ్యోతి’కి రూ.51.98 కోట్లు.. జిల్లాలో ఇప్పటి వరకు 84,906 కుటుంబాలు గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. ప్రభుత్వం రూ.51.98 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 378 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేయగా.. నామిని ఖాతాలో రూ.18.90 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 1,82,262 లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. 25,167 కొత్త రేషన్ కార్డులతో పాటు 1.57 లక్షల మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చామన్నారు. 5,970 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 5,970 ఇళ్లు మంజూరుకాగా.. 86 శాతం ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, 1,063 తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రూ.125.19 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. అదేవిధంగా 2వ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వనపర్తి: సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. మహిళలకు వరం ‘మహాలక్ష్మి’.. ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. మహిళాశక్తి పథకంలో భాగంగా జిల్లాలో మండల మహిళా సమాఖ్యల నుంచి 12 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల చొప్పున రూ.8.33 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. అమరచింత, వనపర్తి మండలాల మహిళా సమాఖ్యలకు ‘కుసుమ్ ప్రాజెక్టు‘ ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకుగాను రూ.60 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఎకరా స్థలంలో మహిళా సంఘాలతో రూ.2 కోట్లతో పెట్రోల్బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లాలోని 1,27,715 మంది మహిళాసంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని.. పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10,536 మంది రూ.32.14 కోట్ల విలువైన వైద్య సేవలు విని యోగించుకున్నట్లు వెల్లడించారు. ప్రగతి నివేదిక చదువుతున్న చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. జిల్లాలోని వివిధ పాఠశాలలు, బాలభవనం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ అవగాహనలో ప్రతిభ చాటిన వనపర్తి జెడ్పీహెచ్ఎస్ బాలికలు, కొత్తకోట జెడ్పీహెచ్ఎస్ బాలికలు, పెబ్బేరు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, పుర చైర్పర్సన్ మాధవి, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా విద్యాధికారి బదిలీ
వనపర్తిటౌన్: జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీని వికారాబాద్కు బదిలీ చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డికి జిల్లా విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, బాధ్యతల స్వీకరణపై స్పష్టత కొరవడిందని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన అబ్దుల్ ఘనీని ఇక్కడి బాధ్యతలు సైతం నిర్వర్తించాలని జిల్లా ఉన్నతాధికారులు మౌఖికంగా సూచించినప్పటికీ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. డీఈఓ అబ్దుల్ ఘనీని మంగళవారం ఎంఈఎఫ్, ఎమ్మార్పీఎస్, జ్లిలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధానకార్యదర్శి శశివర్ధన్, ఎస్ఎల్టీఏ జిల్లా ప్రధానకార్యదర్శి అమర్నాథ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవ, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు తరలిరండి మహబూబ్నగర్ న్యూటౌన్: నగరంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు సీపీఎం శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్నగర్లో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని, 20న జరిగే భారీ బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పాల్గొంటారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణతో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం మహాసభల వాల్పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వెంకట్రాములు, సాగర్, భూపాల్, ధర్మానాయక్, శ్రీరామ్నాయక్, రాములు, కిల్లె గోపాల్, కురుమూర్తి, జగన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,539 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 193 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,539, కనిష్టంగా రూ. 4,589, సరాసరి రూ. 6,589 ధరలు లభించాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 6189 ధర పలికింది. 28 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,270, కనిష్టంగా రూ. 2,129, సరాసరి రూ. 2,269 ధరలు వచ్చాయి. -
‘సైబర్’ నియంత్రణలో మీడియా పాత్ర కీలకం
వనపర్తి: సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా మీడియా సంస్థలు విస్తృత ప్రచారం నిర్వహించాలని, బాధితులకు సత్వర సాయం అందించేందుకు హెల్ప్లైన్ నంబర్ 1930ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎస్పీ సైబర్ మోసాలు, 1930 గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయన్నారు. ఆన్లైన్, కస్టమర్కేర్తో మోసాలు, ఫేక్ లింక్లు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి పేరుతో మభ్యపెట్టడం వంటి ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికీ తెలియజేయరాదని, సైబర్ బాధితులు ఆలస్యం చేయకుండా సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతతో పాటు మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ బాధితులకు అందుబాటులో ఉన్న సేవలను చేరవేయడంలో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సమాజం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, మీడియా, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రత, ఆన్న్లైన్ మోసాల గుర్తింపు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, రూరల్ ఎస్ఐ హృషికేష్, జిల్లాలోని అన్ని పత్రికలు, ఛానళ్ల పాత్రికేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్ పోరాటం
వనపర్తి: ప్రత్యేక రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ప్రొ. జయశంకర్ చివరి శ్వాస వరకు పోరాడారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజపేట సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకం, పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏళ్లపాటు అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్ప్రహలను తొలగించి ఆత్మగౌరవాన్ని పెంపొందించారన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదేళ్ల పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందించినట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు సంక్షేమం, మహిళలు, యువత, నిరుద్యోగులకు ప్రకటించిన పలు హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి, జయశంకర్ ఆశయాల సాధనకు కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ మళ్లీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో.. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కుసుమర్తి–సుకుర్ లింగంపల్లి గ్రామాల మధ్య భీమా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలం కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. -
ప్రొ. జయశంకర్ ఆశయ సాధనకు కృషి
వనపర్తి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గత పాలకులు తెలంగాణ విప్లవ గళం గద్దర్ను అవమానిస్తే.. ప్రజా ప్రభుత్వం ఆయన కుమార్తె వెన్నెలకు సముచిత స్థానమిచ్చి గౌరవించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినదించిన శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ గీతాన్ని అందించిన కవి అందెశ్రీని గత పాలకులు ఎన్నో అవమానాల పాలు చేశారన్నారు. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మీరాకుమార్ కృషితోనే తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమానికి కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. -
అమరుల కుటుంబాలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నా కూతురు కావలి సువర్ణ 2010 జనవరి 19న తెలంగాణ కోసం ఉరేసుకుని చనిపోయింది. నాడు మా బాధను పంచుకోవడానికి ఎంతోమంది నాయకులు వచ్చి ఓదార్చి వెళ్లారు. 2014లో అప్పటి ప్రభుత్వం నా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఓదార్చిన పాపాన పోలేదు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి అమరుల కుటుంబాలను కలిసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అండగా నిలవాలి. – కావలి రాములమ్మ, మిరాసిపల్లి, కొత్తకోట మండలం ● -
ప్రగతి పథంలో..
తెలంగాణ వచ్చాక ఉన్నత విద్యాలయాల ఏర్పాటు వనపర్తి: జిల్లాకు మొదటి నుంచి విద్యాపర్తిగా పేరుంది. సంస్థానాధీశుల కాలం నుంచే పాలకులు విద్యకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. ఉన్నత విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ప్రజాప్రతినిధులుగా ఎవరు ఎన్నికై నా.. తమదైన శైలిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959లోనే వనపర్తిలో సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. సంస్థానాధీశుల రాజప్రాసాదంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు డిగ్రీ, పీజీ, ఉద్యాన కళాశాలలను ఏర్పాటు చేయగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫిషరిస్ సైన్స్ కాలేజీ, వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలకు వనపర్తి నిలయమైంది. అదే విధంగా నర్సింగ్, మెడికల్ కాలేజీలు సైతం సువిశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కూల్ సైతం జిల్లాకు మంజూరు కాగా.. సొంత భవనంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్యనభ్యసించిన వనపర్తి జిల్లా పరిషత్ పాఠశాల, ఇంటర్ కాలేజీలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 47కోట్లతో అధునాతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్లుగా సప్త సముద్రాలు.. వనపర్తి సంస్థానాధీశురాలైన రాణి శంకరమ్మ హయాంలో వనపర్తి చుట్టూ వర్షపునీటిని నిల్వ చేసేందుకు సప్త సముద్రాలను నిర్మించారు. అయితే జలయజ్ఞంలో భాగంగా వాటిని రిజర్వాయర్లుగా మార్చేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు బీజం వేయగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణానీటితో నింపారు. దీంతో పాటు జిల్లాలోని సుమారు 1,075 చెరువులు, కుంటలను సైతం కేఎల్ఐ, బీమా, జూరాల సాగునీటి కాల్వలతో అనుసంధానం చేయడంతో జిల్లా నలుమూలల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెబ్బేరులోని ఫిషరీస్ సైన్స్ కళాశాల పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు! ఎడ్యుకేషన్ హబ్గా మారిన వనపర్తి అందుబాటులోకి ఆధునిక వైద్యం రికార్డుస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు -
ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్ఓ సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే.. సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయడం లేదో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తప్ప.. తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దని తెలిపారు. ప్రజావాణిలో 59 దరఖాస్తులు అందినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. -
వేడుకలకు ముస్తాబు
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ముస్తాబైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను సోమవారం ఏఓ భానుప్రకాశ్తో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి, 7:53 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేరుకుంటారు. 7:55 గంటలకు వచ్చే ముఖ్య అతిథికి వారు పుష్పగుచ్ఛ అందజేసి ఆహ్వానించనున్నారు. అనంతరం ముఖ్య అతిథి జాతీయ జెండావిష్కరణ, తెలంగాణ గీతాలాపన, పోలీసు గౌరవ వందన స్వీకరణ అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపిస్తారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను శాలువాతో సత్కరిస్తారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వర్తింపజేస్తూ.. మంజూరు పత్రాల అందజేత, స్టాల్స్ సందర్శనతో కార్యక్రమం ముగుస్తుంది. -
ప్రజలకు మెరుగైన వైద్యం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే వనపర్తి జిల్లాగా ఆవిర్భవించడం.. వెనువెంటనే జిల్లాకు నర్సింగ్, మెడికల్ కాలేజీల మంజూరుతో స్థానిక ఏరియా ఆస్పత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. దీంతో వైద్య సేవల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ కేర్ సెంటర్ నుంచి.. రూ.లక్షలు వెచ్చించాల్సి వచ్చే మెటర్నటీ వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎంసీహెచ్లో 90శాతం కాన్పులు కావడం విశేషం. -
చదరంగానికి పూర్వ వైభవం
వనపర్తి టౌన్: చదరంగం క్రీడలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎల్.మురళీధర్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7న స్విస్ లీగ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రజా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదరంగం క్రీడ మేధస్సును పెంచడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందిస్తుందని, అందుకే విద్యార్థుల్లో ఈ క్రీడపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అండర్–9, 11, 13 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రఽథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వెండి పతకాలు అందిస్తామన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో కొనసాగే పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు అత్యధికంగా పాల్గొని రాష్ట్రస్థాయి జట్టులో పాలమూరు ఖ్యాతిని చాటేలా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చెస్ పోటీలకు హాజరయ్యే బాల బాలికలకు భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తిగల విద్యార్థులు 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ క్రీడ పోటీలు జరిగినా పాలమూరు ప్రాతినిథ్యం ఉంటుందని, చెస్ పోటీల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు వనపర్తి చెస్ అసోసియేషన్ ధృఢ నిశ్చయంతో పని చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి రాములు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తిటౌన్: రాష్ట్ర ఆడపడుచుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెబ్బేర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మహిళా వారోత్సవాలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయంలో కట్టు, బొట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇచ్చే చీర ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. అన్నిరంగాల్లో ముందుండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత పాలకులు చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొన్నారు. గోదాం నిర్మాణానికి శంకుస్థాపన.. వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే ధాన్యం నిల్వ ఇబ్బందులు తొలగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు కొండన్న, రాములు, బాలరాజు, గ్రామ ప్రజలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ.. వైభోగమే
● మన్యంకొండలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గరుడగిరి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రోచ్ఛరణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య అపూర్వ మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గరుడగిరి వరకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాలు అలంకరణలో స్వామి దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజ్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శేషవాహనంపై స్వామివారి విహారం మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శేషవాహన సేవను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
5 నుంచి జిల్లా ప్రశిక్షణ శిబిరం
వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రశిక్షణ ప్రభారీ గిరమోని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రశిక్షణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి మే నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించామని, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులకు ప్రతి జిల్లాలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాకేంద్రం నాగవరంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 250 మంది జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో నిర్వహించే శిబిరంలో మూడు రోజుల పాటు వివిధ కాలాంశాలపై 13 సెషన్లు ఉంటాయని.. ప్రతి సెషన్కు రాష్ట్రస్థాయి నాయకులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్టీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, సబిరెడ్డి వెంకట్రెడ్డి, మున్నూరు రవీందర్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, కేతూరి బుడ్డన్న, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన తదితరులు పాల్గొన్నారు. 31 వేల బస్తాల ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 31 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో ఆర్ఎన్ఆర్ 28,146 బస్తాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,880, కనిష్టంగా రూ.2,212 ధర వచ్చింది. అలాగే 3 వేల బస్తాల 1010 రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,711 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. డైట్ సెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డైట్ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో తమ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మేరాజుల్లాఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, ఎస్సెస్సీ, ఇంటర్, కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు బోనోఫైడ్స్ తీసుకురావాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నం.99499 93714ను సంప్రదించాలని కోరారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొల్లాపూర్ రూరల్/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
సర్వీస్ తంటాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
బాల్య వివాహాలను వ్యతిరేకించాలి
వనపర్తి: బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ సమాజంలోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్నేహ (కిషోర బాలికలు) సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బాలికలు ప్రధాని, స్పీకర్, ఎంపీల పాత్రలు పోషిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కిషోర బాలికలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం బాగుందని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వాటిపై గళం వినిపించాలని, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడేళ్లలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని.. వాటిని అవగాహనతో అధిగమించాలని కోరారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్ చెక్కులు, ఎఫ్పీఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఓ రాణి, డీఐఓ జ్యోతి, డీడబ్ల్యూఓ సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఐఈఓ నరేంద్ర, పలువురు అధికారులు, స్నేహ సంఘాల బాలికలు, విద్యార్థులు పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న స్నేహ సంఘాల సభ్యులు -
ప్రజల భద్రతలో రాజీ లేదు
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి ● సైబర్ మోసాలు, బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమాలు ● ఎస్పీ డి.సునీతారెడ్డి సమీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులు వనపర్తి: ప్రజల విశ్వాసమే పోలీసుశాఖకు అతిపెద్ద బలం.. ప్రతి అధికారి ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలి.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, సైబర్ మోసాల నియంత్రణ, గ్రామస్థాయిలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పోలీసు అధికారి బాధ్యతని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి ఎస్ఐ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, గ్రామ పోలీసు అధికారులు తమకు అప్పగించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్స్, సస్పెక్ట్ల కదలికలపై నిఘా ఉంచాలని, బూకోర్ట్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ డివైస్లు వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీసుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను నమ్మవద్దని ప్రజలకు తెలియజేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరిస్తూ.. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని, పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహిస్తూ రాత్రిళ్లు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలని సూచించారు. పోలీస్స్టేషన్లలోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని.. ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని, నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పని చేయాలన్నారు. సమీక్షలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ పాల్గొన్నారు. -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పొగాకుతో ప్రాణాంతక సమస్యలు
వనపర్తిటౌన్: పొగాకు వినియోగంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని.. వినియోగదారుడికంటే కుటుంబమే అధిక భారం మోయాల్సి వస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ ఒకేషనల్ కళాశాల భవనం ఎదుట దినసరి కూలీలకు పొగాకుతో కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఇంటి పెద్ద పొగాకుకు బానిసై అనారోగ్యం బారినపడితే ఇంట్లో వాళ్లు బతికుండగానే నరకం చూడాల్సి వస్తోందని తెలిపారు. కొద్ది నిమిషాల ఆనందం కోసం తాగే పొగాకుతో కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆర్థిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. డా. రామచందర్రావు మాట్లాడుతూ.. మత్తుకు బానిసైన వ్యక్తులు ప్రభుత్వ ఆస్పత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ పొంది భవిష్యత్ను సుఖమయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కళాజాత సువర్ణ బృందం తమ ఆటపాటలతో ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపర్చారు. అనంతరం దినసరి కూలీలతో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డా. రియాశ్రీ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, డా. శ్రీనివాస్, జూనియర్ వైద్యుడు డా. శశాంక్, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, అనిల్, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పదిలో రాష్ట్రంలోనే ప్రథమం వనపర్తిటౌన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఓపెన్ పదిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో, ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఓపెన్ పదిలో 391 మందికిగాను 370 మంది పాసై 94.63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఓపెన్ ఇంటర్లో 723 మందికిగాను 612 మంది పాసయ్యారని.. 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తమ చదువు పూర్తి చేయాలని సూచించారు. -
నేడు దరఖాస్తునకు చివరి గడువు
వనపర్తి: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ ఖాన్, ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ ఖాజా బహుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు htt ps://cet.cgg.gov.in/tmreir వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని, ఇందులో మహిళలకు 33 శాతం దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరి ంచారు. మరిన్ని వివరాలకు ఫోన్నంబర్ 040 23236112 సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు www.tela nganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విద్యాలయాల్లో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ప్రవేశాలు పొందిన వారు అర్హులని, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు మించరాదని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన హార్డ్కాపీలు రెండు సెట్లను అటెస్టెడ్ చేసి జులై 31 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం లేదా సెల్నంబర్ 72078 54914, ఫోన్నంబర్ 08545 232500 సంప్రదించాలన్నారు. మండలానికి శిక్షణ ఐఏఎస్లు గోపాల్పేట: శిక్షణ ఐఏఎస్లు సాయిశివాని, సచిన్ బసవరాజ్ రెవెన్యూశాఖ గురించి తెలుసుకునేందుకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మండలంలోని చాక్పల్లికి తీసుకెళ్లి సర్వేనంబర్లు, దిక్కులు చూపే రాళ్లు చూపించారు. శనివారం కార్యాలయంలో రైతుల ఖాతాలు ఎలా చూడాలి, రికార్డులు ఎన్ని రకాలు, ఎలా పరిశీలించాలనే విషయాలను తహసీల్దార్ వారికి వివరించారు. వారి వెంట రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. -
వరి సాగే అధికం..
మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వతో పాటు అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతుండటంతో ఎలాంటి వరి వంగడాలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయనే విషయాలను రైతులకు వివరిస్తున్నాం. – అరవింద్, ఏఓ, అమరచింత జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండోస్థానంలో పత్తి, చెరుకు, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు. ఎంత మేర విత్తనాలు, ఎరువులు కావాలనే వివరాలను ఏఓలతో సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. పంటల సాగుకు ముందే నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి -
పోక్సో.. కాస్కో
అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. శిక్షలు పడిన పలు కేసులు ఇలా.. మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్ తాలిబ్, సయ్యద్ అల్తాప్లకు వాట్సాప్లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్ తాలిబ్, ఏ3 సయ్యద్ అల్తాప్కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు -
సంతోషం కలిగించింది..
తమ వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సంతోషం కలిగించింది. ఇంతవరకు వేతనం కోసం రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండింది. తమలాంటి ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. – చరణ్, పంచాయతీ కార్మికుడు, మస్తీపురం చిన్న పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరయినప్పుడే పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించడం మాలాంటి కార్మికుల ఆశలకు ఊపిరి నింపింది. ఇక నుంచి మేము కూడా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు తీసుకుంటామనే ప్రకటన సంతోషం కలిగిస్తోంది. – చుక్క అంజన్న చింతరెడ్డిపల్లి పంచాయతీ వర్కర్. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన చెల్లిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. రెండు, మూడు నెలలు దాటినా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ప్రతినెల చెల్లించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించడం మంచిదే. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తాం. – సి.రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, టీయూసీఐ అమరచింత -
తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు
● తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోత విధించే రైస్మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మండలంలోని కేతేపల్లిలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. మార్కెట్లో ఉన్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని.. తూకం చేసిన ధాన్యం తరలింపునకు లారీల సంఖ్య పెంచాలని సూచించారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయించాలని, కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే సమీపంలో ఉన్న మైరూన్ రైస్మిల్లును సందర్శించి ధాన్యం అన్లోడ్, నిల్వలపై ఆరా తీశారు. మిల్లుల వద్ద లారీలు ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దని, అవసరమైతే స్థానికంగా హమాలీలను నియమించుకొని వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. హమాలీల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఎఫ్సీఐ ఇబ్బందులు మంత్రి దృష్టికి.. రైతులు తాలు, ధుమ్ము ఉన్న ధాన్యం తీసుకురావడంతో బియ్యంలో మెరికలు, నలుపుగా వస్తుండటంతో ఎఫ్సీఐ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మిల్లు యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శుభ్రం చేసిన ధాన్యం తీసుకొస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్సాగర్, తహసీల్దార్ కార్తీక్రావు, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, పుల్లారావు, భాస్కర్యాదవ్, రాముయాదవ్, పౌరసరఫరాల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి
వనపర్తిటౌన్: త్వరలో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కనిపించకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని.. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.30.29 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆరువేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలో వనపర్తి మహిళలకు పెట్రోల్బంక్ మంజూరు కాబోతుందని, ప్లాట్లు లేని పేదలకు వెయ్యి ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు సూపర్మార్కెట్, రైస్మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో ఇప్పటి వరకు రూ.83.76 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, మొదటి విడతలో మహిళలకు ఉచితంగా 12,669 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మలి విడతలో 15 వేల చీరలు వచ్చినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళల చేతుల్లో సంసారం ఉంటేనే కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సంఘంలో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు చనిపోతే తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వమే బీమా చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, గోదాములు అన్ని మహిళలకే కేటాయిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులకు రూ.3.40 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్యూమరేషన్ ప్రక్రియ
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎన్యూమరేషనన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్, నిర్వహణపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టరేట్ కాన్ఫరెనన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ సూపర్వైజర్లతో మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ తమ పరిధిలోని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వనపర్తిటౌన్: ఖాళీగా ఉన్న 600పైగా ఎంఈఓ పోస్టులు, 80 డిప్యూటీ ఈఓ కేడర్ పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కొత్తగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సైతం హెల్త్కార్డు వర్తింపజేసి మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహనాయుడును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సభ్యుడు అలీ తదితరులు పాల్గొన్నారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్ స్టోరేజీ లెవెల్లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది. పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్లో మధుసూదన్రెడ్డి, కిషోర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చంద్రకిరణ్, నూర్జహాన్ ఉన్నారు. కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్కుమార్కు అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. -
అన్నదాతల నిరసన
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న గిరిజన భవనంలో అధికారులు వరి ధాన్యం నిల్వ చేస్తున్నారు. గురువారం గ్రామంలోని రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి దించుకోవాలని అధికారులను కోరారు. తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్ మిల్లుకు తీసుకెళ్లాలని సూచించగా.. ఇక్కడే దించుకోవాలంటూ రైతులు పట్టుబట్టారు. ఎస్ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య కలిసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం వేరే మిల్లుకు తరలించాలని, తడవని ధాన్యం ఇక్కడే దించుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. కాగా.. లారీల్లోని సంచులు దించుతుండగా మొలకెత్తిన సంచులు కనిపించడంతో మళ్లీ గొడవ మొదలైంది. లారీలోని తడిసిన ధాన్యం దించుకుంటారు.. తమ ధాన్యం వేరే మిల్లుకు ఎందుకు తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నించారు. ఎంతచెప్పినా వినకపోవడంతో అధికారులు గోదాంకు తాళం వేసి వెళ్లిపోయారు. చివరకు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్మిల్లుకు తరలించేలా ఒప్పించారు. -
ప్రజాసేవ.. గొప్ప మానవత్వం
వనపర్తి రూరల్: ప్రతి మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించడం గొప్ప మానవత్వమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో బూజుల సోమమ్మ, రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వారి కుమారులు ఖగేంధర్రెడ్డి, హేమసుందర్రెడ్డి, భువనేశ్వర్డ్డి ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో ఉంటూ స్వగ్రామంలో తల్లిదండ్రుల పేరిట కంటి వైద్య శిబిరం నిర్వహించిన బీఎస్ఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులను ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను కూడా తన స్వగ్రామం మంగంపల్లిలో 20 ఏళ్లు సర్పంచ్గా పని చేశానని, ఆ గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తనవంతుగా రూ.21 వేలతో పాటు పుస్తే, మెట్టెలను అందిస్తూ వస్తున్నానని.. ఎంపీపీ అయిన తర్వాత మండలస్థాయిలో పేద కుటుంబాల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు మేఘన్న అభయాస్తం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, పేదలకు తనవంతు సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే మంచి మనసున్న వారందరికి సమాజం రుణపడి ఉంటుదన్నారు. కన్నవారిని, జన్మనిచ్చిన గ్రామాన్ని ఎప్పటికీ మరవొద్దని.. తమకు తోచిన సాయాన్ని అందిస్తూ రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్టా నాగేష్, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, బీఎస్ఆర్ సొసైటీ సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి రాజు, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు ● అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ● పిల్లల నూరేళ్ల జీవితాన్నీ చేజేతులా కాలరాస్తున్న వైనం ● ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి కుంగుబాటు ● నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● 2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ● 2025 ఆగస్ట్ 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. ● గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.. అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి. – డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును సందర్శించి ధాన్యం నిల్వ కోసం అదనంగా ఏర్పాటు చేసిన గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో అకాల వర్షాలకు 600 మెట్రిక్ టన్నుల ధాన్యం తడవగా.. వాటిని బాయిల్డ్ మిల్లుకు తరలించామని తెలిపారు. జిల్లాలో రెండేళ్లుగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వస్తున్నాయని.. గతంలో సీజన్కు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, ప్రస్తుతం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చేరిందన్నారు. ధాన్యం నిల్వకు గోదాముల్లో స్థలం కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు తదితర అధికారులు ఉన్నారు. రికార్డుస్థాయిలో వరి దిగుబడి.. వనపర్తి: జిల్లాలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వచ్చినందున నిల్వ కోసం అదనపు స్థలం అవసరం అవుతోందని.. రైస్మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి అన్లోడ్ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. మిల్లర్ల వారీగా గోదాములలో ఖాళీ స్థలాలపై చర్చించి అదనంగా ధాన్యం బస్తాల కేటాయింపుపై సూచనలు చేశారు. నిల్వ కోసం అందుకు తగిన అద్దె చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
సురవరం సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే
వనపర్తి: గోల్కొండ పత్రిక సంపాదకులు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సురవరం 130వ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి, పక్కన ఉన్న పార్క్లోని సురవరం కాంస్య విగ్రహానికి శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సమాజానికి చేసిన సేవలు.. మార్పు, సంస్కరణల కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం’ పాన్గల్/వీపనగండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం పాన్గల్ మండలం చింతకుంట, వీపనగండ్ల మండలం కల్వరాల వరి కొనుగోలు కేంద్రాలను శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా తూకం చేయడం లేదని పలువురు రైతులు వివరించగా.. వెంటనే ఆయన కలెక్టర్, అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం బస్తాలను తరలించేందుకు జాప్యం లేకుండా లారీలను పంపాలని సూచించారు. సమస్యలను రెండ్రోజుల్లో పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో జాప్యంతో అకాల వర్షాలకు తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా తూకం చేయడంలో తీవ్ర జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు మోసపోతే గోస పడుతాం అనే మాట వంద శాతం నిజమైందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్నాయక్, రవికుమార్, వెంకటయ్యనాయుడు, గో పాల్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతుపై రవాణా భారం
కొనుగోలు కేంద్రాల నుంచి సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు ● అద్దె కోసం రవాణా కాంట్రాక్టర్లను ఆశ్రయించాల్సిందే.. ● గతంలో వెచ్చించిన డబ్బులు ఇచ్చినట్లేనా..? ● జిల్లాలో 9 రూట్లు.. నిత్యం 360 లారీలు అందుబాటులో... పదిరోజుల కిందట 314 బస్తాల వరి ధాన్యాన్ని వీపనగండ్ల గోదాంకు ట్రాక్టర్లలో తరలించాం. బస్తాకు రూ.9 చొప్పున కాంట్రాక్టర్ ఇస్తామన్నారు. డబ్బుల కోసం వెళ్తే.. ఇంకా బిల్లు రాలేదని తర్వాత ఇస్తామంటున్నారు. అద్దె చెల్లించాలని ట్రాక్టర్ల యజమానులు వత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రవాణా డబ్బులు ఇప్పించాలి. – కురుమయ్య, రైతు, గోపల్దిన్నె (వీపనగండ్ల) నేను దొడ్డురకం వరి పండించా. వారం కిందట సంచికి రూ.పది చొప్పున 270 సంచులు రెండు ట్రాక్టర్లలో గోపాల్పేట గోదాంకు తరలించాను. అప్పు చేసి రూ.ఐదు వేలు అద్దె చెల్లించాను. ధాన్యం తరలించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అధికారులు త్వరగా చెల్లించేలా చూడాలి. – బాషమోని శేఖర్, రైతు, ఏదుట్ల రైతులు ధాన్యం మిల్లుల వద్ద దించగానే వే బ్రిడ్జి రసీదు, మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లుగా ఇచ్చిన రసీదు ట్రాన్పోర్టు కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు ఇవ్వమని ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా లోపాలుంటే పరిశీలించి కాంట్రాక్టర్లతో వెంటనే రైతులకు అద్దె డబ్బులు ఇప్పిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – వినోద్కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వనపర్తి: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడటంతో పాటు ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి ధాన్యం విక్రయాలు పుంజుకోవడంతో సకాలంలో తూకాలు, తరలింపు అసాధ్యంగా మారింది. ధాన్యం మిల్లులు, గోదాములకు తరలించేందుకు సరిపడా వాహనాలను రవాణా కాంట్రాక్టర్లు సమకూర్చడం లేదు. రైతులే తమ సొంత, అద్దె వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించి అన్లోడ్ చేసిన వెంటనే మిల్లర్లు ఇచ్చిన రసీదు, వేబ్రిడ్జి రసీదును కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు చెల్లించాలని రవాణా కాంట్రాక్టర్లకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమకు ఇంకా బిల్లులు రాలేదంటూ.. కొందరు కాంట్రాక్టర్లు రైతులకు వాహనాల అద్దె చెల్లించడం లేదు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నెలల తరబడి సదరు కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి వాహనాల అద్దె డబ్బులను వసూలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుత సీజన్లో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఉంచలేక రైతులు సొంత, అద్దె వాహనాల్లో మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులున్న దూరం ఆధారంగా బస్తాకు రూ.8 నుంచి రూ.10 వరకు వాహనదారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా రవాణా కాంట్రాక్టర్లు చెల్లింపుల విషయంలో రైతులు, అద్దె వాహనాలు సమకూర్చిన వారిని పలుమార్లు అడిగించుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి ఇలాకాలోని వీపనగండ్ల మండలంలో ఉన్న గోవర్ధనగిరి కొనుగోలు కేంద్రం నుంచి 16, గోపల్దిన్నె నుంచి 10, కల్వరాల నుంచి 12, వీపనగండ్ల కొనుగోలు కేంద్రం నుంచి 20 ప్రైవేట్ వాహనాల్లో రైతులు తమ ధాన్యాన్ని గోదాంకు తరలించారు. పదిరోజులు గడుస్తున్నా.. నేటికీ రవాణా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదు. డబ్బులు అడిగితే తనకే ఇంకా బిల్లు రాలేదంటూ చెబుతున్నారని రైతులు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రావడం లేదు. చేసేది లేక గ్రామాల్లోని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించాం. ధాన్యం బస్తాలను మేము తరలిస్తే అద్దె రవాణా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో మేము చాలా నష్టపోతున్నాం. రైతు ఖాతాలో అద్దె జమ చేయడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. – బంగి నర్సింహ, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం -
9 రూట్లు.. 360 వాహనాలు...
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ వరి ధాన్యం సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయానికి వస్తుందని అధికారులు 400పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తొమ్మిది రూట్లుగా విభజించి ఒక్కో రూట్కు 40 లారీల చొప్పున 360 లారీలు అందుబాటులో ఉంచాలని టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ వారు సకాలంలో సరిపడా వాహనాలు సమకూర్చకపోవడంతో ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సరిపడా వాహనాలు సమకూర్చాలని జిల్లా అఽధికారులు రవాణా కాంట్రాక్టర్లకు చెప్పినా స్పందన లేకపోవడంతో రైతులే ట్రాక్టర్లలో తరలించుకుంటే అద్దె చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో ముందుకొచ్చారు. కానీ అద్దెకూడా వెంటనే చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. సంతోకర విషయం ఏమిటంటే గతంతో పోలిస్తే ధాన్యం విక్రయించిన డబ్బులు మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లు రసీదు ఇచ్చిన కొన్ని గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం విశేషం.


