Wanaparthy
-
స్తంభించిన కొనుగోళ్లు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడుల క్రయవిక్రయాలు స్తంభించాయి. యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం పోటెత్తడంతో మార్కెట్ ఆవరణలో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 30 వేల బస్తాల వరి ధాన్యం, మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు రావడంతో కొనుగోళ్లు జరిపినా తూకాలు, బస్తాల తరలింపు చేయకపోవడంతో మంగళవారం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా శుక్ర, శనివారాల్లో సైతం ఇదే సమస్య కారణంగా కొనుగోళ్లు నిలిపివేయగా.. ఆదివారం బస్తాలను గోదాంలకు తరలించడంతో సోమవారం క్రయవిక్రయాలు సాఫీగా సాగాయి. అయితే మూడు రోజుల సరుకు మంగళవారం ఒకేసారి రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేసి.. తూకాలు, బస్తాల తరలింపు చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు.. బాదేపల్లి యార్డు ఆవరణలో సామర్థ్యానికి మించి దిగుబడులు రావడం, సకాలంలో టెండర్లు దాఖలు చేసి తూకాలు వేయడం, బస్తాల తరలింపులో ఆలస్యం చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డు అధికారులు, పాలక మండలి నిర్ణయించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రెండు, మూడు రోజులపాటు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. లారీలు, హమాలీల కొరతతో ఇబ్బందులు.. ఒకవైపు పేరుకుపోయిన నిల్వలు.. మరోవైపు మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు ప్రతిరోజు భారీగా వస్తుంది. ఈ క్రమంలో బస్తాలు తరలించేందుకు లారీలు, హమాలీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ నుంచి బయటి ప్రాంతాల్లోని గోదాంలకు తరలించాలంటే అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కారణంగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి క్రయవిక్రయాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట దిగుబడులను అమ్మడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల కుమ్మక్కు..? ధాన్యం దిగుబడులు అధికంగా రావడం, రోజుల తరబడి రైతులు మార్కెట్లోనే ఉండిపోయే పరిస్థితులు తలెత్తడం కారణంగా వ్యాపారులు ఇదే అదునుగా తక్కువ ధర కేటాయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఎలాగో అమ్మకతప్పదన్న కారణంగా వ్యాపారులంతా కుమ్మకై ్క తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న, వరి ధాన్యం ఇకపై రోజు విడిచి రోజు చేపట్టాలని నిర్ణయం మంగళవారం నిలిపివేత.. నేడు టెండర్ ప్రక్రియ తీవ్ర ఆందోళనలో రైతులు -
కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పేదల సొంతింటి కల సాకారమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో 12 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొని కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. తాము శిథిల ఇళ్లలో ఉంటూ ఎప్పుడు కూలుతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేష్, సర్పంచ్ అరుణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, జైపాల్రెడ్డి, పార్టీ మండల నాయకులు ,గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలతో సృజనాత్మకత పెంపు
వనపర్తిటౌన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు చదివించాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను శ్రద్ధగా వినడంతోనే కాకుండా అర్థం చేసుకుంటేనే పై తరగతుల్లో మంచి మార్కులు సాధించగలరన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ అధికారి శేఖర్, కమ్యూనిటీ మొబైల్ అధికారి ప్రతాప్రెడ్డి, మండల విద్యాధికారి మద్దిలేటి, జీహెచ్ఎంలు ఉమాదేవి, వరలక్ష్మి, సువర్ణాదేవి, శివకుమార్, ఉపాధ్యాయులు ధర్మరాజు, సామాజికవేత్త గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రమాదం!
రహదారులపై ధాన్యం ఆరబోత ● జిల్లాలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ● రెండేళ్లలో నలుగురు మృత్యువాత.. మరో పదిమందికి గాయాలు ● అవగాహన కార్యక్రమాలు కరువు ● పట్టించుకోని అధికారులు ●వనపర్తి: రోడ్లపై పంటనూర్పిళ్లు, ధాన్యం ఆరబోయడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు స్పందించడం లేదు. విలువైన ప్రాణాలు కోల్పోతున్నా.. నిర్లక్ష్యం వీడకపోవడం శోచనీయం. రోడ్లపై ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు వెళ్తే జరిమానా విధిస్తున్న అధికారులు.. ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నారు. తాజాగా ఏదుల రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై మొక్కజొన్న ఆరబెట్టి చుట్టూ ఉంచిన రాళ్లకు బైకు ఢీకొని 24 ఏళ్ల వీరపాగ కృష్ణ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై కూడా పంట ఉత్పత్తులను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం ఆగడం లేదు. జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో రైతులు పొలాల్లోనే పంట నూర్పిళ్లు, ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినా.. నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో రోడ్లపై పంటలను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం పరిపాటిగా మారింది. రోడ్లపై ధాన్యం కుప్పలు, ఆరబోసిన ధాన్యం చుట్టూ ఏర్పాటుచేసిన రాళ్లతో రాత్రిళ్లు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో ద్విచక్ర వాహనదారులు నలుగురు మృతిచెందిగా.. మరో పదిమందికిపైగా గాయాల పాలైనట్లు అధికారిక సమాచారం. ఇక ప్రమాదానికి గురైనా పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వని ఘటనలు పదుల సంఖ్యలో ఉంటాయి. ఈ ఘటనలపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పోలీసుశాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాలో ఏటా వరి సాగు పెరుగుతూనే ఉంది. దీంతో జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచారు. కేంద్రాల వద్దనే పంటలను ఆరబెట్టేందుకు సౌకర్యాలు కల్పిస్తే రైతులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. -
గ్రామాల అభివృద్ధికి కృషి
● తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారిస్తూ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కేతేపల్లి, వెంగళాయిపల్లి, జమ్మాపూర్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి పూర్తయిన వాటి గృహా ప్రవేశాలు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేయకుండా ధాన్యం తూకం చేయాలని, తాలు పేరుతో తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తూకంలోనూ పారదర్శకత ఉండాలని.. అధికారులు మండలానికి ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు పోస్టు చేస్తే పరిష్కరించేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దీంతోపాటు ధాన్యం తరలించే లారీలకు జియో ట్యాగింగ్ చేస్తే ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుస్తుందని సూచించారు. అధికారులు రోజు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు అనసూయమ్మ, మల్లయ్య, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తరలించేందుకు పక్కా ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహచర మంత్రులు, ప్రధానకార్యదర్శితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. రోజు 10 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. రవాణా కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెక్టార్ వారీగా సొంత వాహనాలతో పాటు వారు చెప్పిన అద్దె వాహనాల్లో ధాన్యం తరలింపునకు కేటాయించాల్సిందేనన్నారు. ఒకవేళ ఒప్పందం ప్రకారం లారీలు సమకూర్చకుంటే చీటింగ్ కేసు నమోదు చేయాలని, గత సీజన్తో పాటు ఈ సీజన్ డబ్బులు సైతం ఇవ్వకుండా నిలిపివేయాలని ఆదేశించారు. రవాణా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాహనాల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న లారీ అసోసియేషన్లతో మాట్లాడి అన్ని లారీలు, డీసీఎంలు ధాన్యం తరలించేందుకు వినియోగించుకోవాలని రవాణా అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములను ధాన్యం నిల్వలకు తీసుకోవాలని, గోదాములను గుర్తించి జాబితా ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. రోజు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు, గోదాముల్లో దించుకోవాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఒప్పందం కుదుర్చుకున్న 53 మిల్లులకు రోజు ధాన్యం తరలించి వెంటనే దించుకునేలా చూడాలన్నారు. అన్ని మిల్లుల వద్ద సిబ్బందిని ఉంచి రోజువారీగా ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి నివేదిక అందించాలని కోరారు. హమాలీల సమస్య తలెత్తకుండా చూడాలని లేబర్ కమిషనర్ను ఆదేశించారు. కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం.. రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో నివేదిక అందజేయాలన్నారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు రోజువారీ వివరాలను మీడియాకు ఇవ్వాల్సిందిగా సూచించారు. రానున్న 15 రోజులు రెవెన్యూ అదనపు కలెక్టర్తో పాటు పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, డీఆర్డీఓ, డీసీఓ, రవాణా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుపైనే దృష్టి సారించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, డీటీఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
తెలియక వచ్చాను..
బాదేపల్లి యార్డులో మంగళవారం కొనుగోళ్లు చేయడం లేద ని తెలియక ధాన్యం తీసుకువచ్చాను. దీంతో ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం తెలిసి ఉంటే బుధవారమే తీసుకువచ్చే వాడిని. రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. – మధుసూదన్రెడ్డి, రైతు, గోప్లాపూర్ రైతులు సహకరించాలి.. బాదేపల్లి యార్డుకు సోమవారం ఒక్కరోజే 30 వేల బస్తాల దిగుబడులు వచ్చాయి. దీంతో బస్తాలు తూకం వేయడంలో ఆలస్యమైంది. మంగళవారం కూడా అవే బస్తాలు తూకాలు వేశాం. బస్తాల తరలింపులోనూ ఆలస్యం కావడంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించాం. ఈ విషయం రైతులు గమనించి సహకరించాలి. – అశ్వక్ ఆహ్మద్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి -
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం
● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ ● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే.. నర్సు తనదైన సేవ చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఒంట్లో ఏమాత్రం అనారోగ్యం అనిపించినా డాక్టర్ అని పరుగులు పెడతామే కానీ.. అక్కడ మనకు నిజమైన సేవలందించేది నర్సులే. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగి త్వరగా కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకం. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సమయానికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ అందించడమే కాకుండా అవసరమైన చికిత్సతో పాటు పరీక్షలు చేస్తూ ప్రాణాలు రక్షిస్తారు. తాము సేవ చేసే వ్యక్తి ఎవరో.. వారి వ్యక్తిత్వమేమిటో.. పేదవాడా.. డబ్బున్నవాడా.. అని పట్టించుకోకుండా సేవలందించే ఆత్మబంధువులు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తూ.. ఎంతో మందికి ప్రసవాలు చేస్తూ, వేల సంఖ్యలో రోగులకు పలు రకాల చికిత్సలు అందిస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పాలమూరు నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. -
సూచనలు ఇస్తాను..
నవాబ్పేట పీహెచ్సీలో రెండేళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. పీహెచ్సీకి వచ్చే వారిలో చాలామంది వైద్యంపై ఎలాంటి అవగాహన లేకుండా వస్తుంటారు. అలాంటి వారికి సమస్య తెలుసుకుని చికిత్స అందిస్తుంటాను. మారుమూల పల్లెల నుంచి రాత్రివేళలో పలు రకాల సమస్యలతో వస్తుంటారు. వారందరికి కావాల్సిన ప్రాథమిక చికిత్స అందిస్తుంటాను. ఇక ఈ పీహెచ్సీలో కాన్పులు అధికంగా అవుతుంటాయి. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారం తీసుకువాలనే విషయంపై సూచనలు ఇస్తాను. – పుష్పలత, నర్సు, నవాబ్పేట -
ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించి తక్షణమే విచారించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజల సౌలభ్యానికే డివిజన్ స్థాయి ప్రజావాణి : ఆర్డీఓ ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం, అర్జీల సత్వర పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి 10 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు, అధునాతన ఏటీసీ కోర్సుల్లో 2026–2028 విద్యాసంవత్సరం మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ మహ్మద్ ఇస్తేమాల్హక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు http://iti.telangana.gov. in వెబ్సైట్లో ఈ నెల 14 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో 1వ తరగతి (డే స్కాలర్) ప్రవేశాలకు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019, జూన్ 1 నుంచి 2020, మే 31 మధ్యన జన్మించిన వారు అర్హులని, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.2క్ష లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 5లోగా కలెక్టరేట్లోని మొదటి అంతస్తు రూమ్నంబర్ 118లో సమర్పించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొనా ్నరు. నివాసం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు మీ–సేవ ద్వారా పొందాలని.. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్పై గజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించాలని సూచించారు. ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్లో కౌన్సెలింగ్ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు
వనపర్తి: మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా ధాన్యం దించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల వద్ద అన్లోడింగ్, జనగణన ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలిన ధాన్యం కేటాయించిన మిల్లుకు చేరిన తర్వాత అక్కడ తరుగు, ఇతర కారణాల పేరిట రైతులను మోసం చేయడానికి వీలులేదని.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకోకుండా అనేక కారణాలు చూపి లారీలను నిలబెట్టుకుంటే చర్యలు తప్పమన్నారు. తహసీల్దార్లు పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రవాణా కాంట్రాక్టర్లు కూడా సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని, ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. క్షేత్రస్థాయి హద్దులను తనిఖీ చేసుకోవాలి.. జనగణన–2027లో భాగంగా సోమవారం నుంచి క్షేత్రస్థాయి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నిర్వహించడానికి వెళ్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, జనగణన సామగ్రి తప్పనిసరిగా అందజేయాలని చార్జ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎన్యూమరేటర్లు మొదటి మూడురోజులు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల హద్దుల్ని తనిఖీ చేసుకునేలా చూడాలని సూచించారు. హెచ్ఎల్బీల హద్దుల్ని మూడురోజులు తనిఖీ చేసుకొని హౌస్లిస్టింగ్ ఆపరేషన్స్కు సిద్ధం కావాలన్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో జనగణన చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని, ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. ఓఆర్ఎస్ కిట్ అందుబాటులో ఉంచాలని ఛార్జ్ అధికారులకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, వీసీ ద్వారా తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సెన్సస్ ఛార్జ్ అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయ లోపంతోనే..
మిల్లర్లు కోత విధిస్తే ఉపేక్షించం ● కేంద్రాల్లోనే నాణ్యతను పునః పరిశీలించాలి ● రవాణాకు నిర్దేశిత వాహనాలే వినియోగించాలి ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మిల్లర్లు ప్రత్యేకించి ఈ సీజన్లో చిన్నపాటి యంత్రాలను తీసుకొచ్చి నూక, బియ్యం శాతం తక్కువగా వస్తుందంటూ రైతుల ధాన్యంలో కోతలు విధించే ప్రయత్నం చేస్తున్నారని.. వాటి ఫలితాలు అశాసీ్త్రయమైనవని, పరిగణలోకి తీసుకునేది లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. రవాణా ఏజెన్సీలు అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన లారీలకు బదులు ఇతర లారీలతో ధాన్యం తరలిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులకు గురిచేస్తే బిల్లుల చెల్లింపుల సమయంలో అవస్థలు తప్పవని రవాణా ఏజెన్సీలను హెచ్చరించారు. జిల్లాకు సుమారు 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమైతే ప్రస్తుతం 55 లక్షల గన్నీబ్యాగులు ఉన్నాయని, మిగతా వాటి కోసం ఇండెంట్ పంపిస్తామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాంలకు సొంత వాహనాల్లో ధాన్యం తరలిస్తే రవాణా డబ్బులను చెల్లించనున్నట్లు చెప్పారు. వనపర్తి: అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య సమన్వయ లోపంతోనే వరి ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెన్స్లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఆయనతో పాటు వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికొస్తే ఇప్పటి వరకు 40 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొన్న ధాన్యం సకాలంలో మిల్లులు, గోదాంలకు తరలించకపోవడం, మిల్లుల వద్ద ధాన్యం బస్తాలతో లారీలు నిలిచిపోవడం వంటి సమస్యలు నిత్యం తమ దృష్టికి వస్తున్నాయని, రైతులు మిల్లులు, గోదాం వద్దకు వెళ్లి పైరవీలు చేస్తే తప్ప ధాన్యం దించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు మిల్లర్లు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను బతిమిలాడాలా అంటూ పౌరసరఫరాలశాఖ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి రైతులు విక్రయించిన ధాన్యంలో కోతలు విధిస్తూ ఇబ్బందుల పాలు చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎం, డీఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుజేసే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. సదరు ఔట్సోర్సింగ్ టీఏను స్టేజీపైకి పిలిపించి రైతులను ఇబ్బందులు పెట్టమని ఎవరు చెప్పారని నిలదీశారు. ప్రభుత్వ గోదాంల వద్ద టీఏలు, మిల్లుల వద్ద మిల్లర్లు తూకాల్లో కోతలు విధించి రైతులకు అన్యాయం చేయాలని చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి నిబంధనల ప్రకారం బియ్యం అప్పగించాలని.. అందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన ధాన్యం బస్తాలో నింపి నిర్దేశిత మిల్లులు, గోదాంలకు తరలించేలా డీఆర్డీఓ, డీసీఓ, మెప్మా, సివిల్ సప్లయ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ నిత్యం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సాగాలి.. జిల్లావ్యాప్తంగా ఎక్కడా వరిధాన్యం కొనుగోలు సమస్య అనే ఫోన్ రానివ్వకుండా అధికారులు, మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోరారు. మిల్లర్లు రైతుల ధాన్యంలో కోత విధించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయరాదన్నారు. గోదాంల వద్ద టీఏలను సైతం పౌరసరఫరాలశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, డీఆర్డీఓ ఉమాదేవి, మార్కెటింగ్ శాఖ డీఎం స్వరణ్సింగ్, డీఎం, డీఎస్ఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 280 మిల్లులుంటే.. కేవలం 53 మిల్లులకే యాసంగి ధాన్యం కేటాయింపులు చేశారు. అధికారులు కొందరికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. మిగతా వారితో ఎందుకు రికవరీ చేయడం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. ధాన్యం నాణ్యత లోపాలతో మిల్లర్లు నష్టపోతున్నారని జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్రెడ్డి బదులివ్వగా, అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. మిల్లర్లు నష్టపోతే వందలోపు ఉన్న మిల్లులు మూడువందలకు చేరవుగా ఎందుకు పెరుగుతాయని.. రైతులను నష్టపరిచే చర్యలను తాము ఎప్పటికీ ఉపేక్షించబోమన్నారు. సంచిలో ఆరు కిలోల తాలు వస్తుందని ఆయన మరో ఆరోపణ చేస్తే సంచిలో అంత తాలుంటే ధాన్యం నింపే అవకాశం ఉండదన్నారు. రైతులు ధాన్యం దించేందుకు మిల్లులు, గోదాంల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని, కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారి తూకం చేస్తే సమస్య ఉత్పన్నం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు సక్రమంగా పర్యవేక్షిస్తే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యే మిల్లర్లు, అధికారులు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, టీఏలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో సమీక్షకు హాజరైన రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. -
రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం
వనపర్తి రూరల్/గోపాల్పేట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కేంద్రాల్లో అన్నదాతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. సోమవారం వనపర్తి మండలం చిమనగుంటపల్లి, చిట్యాల వ్యవసాయ మార్కెయార్డు, గోపాల్పేటలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గింజ కొంటామన్న మంత్రులు, అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకున్నా, విద్యుత్ కోతలున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి, మొక్కజొన్నను కొనకుండా రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగంగాక తప్పదని హెచ్చరించారు. రవాణా, హమాలీలు, గన్నీబ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. యాసంగి పంటలో ఎలాంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వరి, మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందని.. వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, తరుగు పేరుతో మోసం చేయొద్దని సూచించారు. ఆయన వెంట చిట్యాల సర్పంచ్ శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, మాణిక్యం, భానుప్రకాష్, రఘువర్ధన్రెడ్డి, రవిప్రకా ష్, చిట్యాల రాము, పరంజ్యోతి, రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, గోపాల్పేటలో సర్పంచ్ స్వప్నభాస్కర్, రైతుబంధు మాజీ అధ్యక్షుడు తిరుపతియాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి తంటాలు
వట్టిపోతున్న సోర్సుబోర్లు.. మిషన్ భగీరథపైనే ఆశలు ● వనపర్తిలో 4 రోజులకోసారి సరఫరా ● పెబ్బేరు శివారు ప్రాంతాల్లో ట్యాంకర్లతో.. ● పురపాలికల్లో సరిపడా లేని ట్యాంకర్లు ● వేసవిలో తప్పని నీటి కష్టాలు ●అమరచింత: జిల్లాలోని పుర ప్రజలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమైనా.. సోర్సుబోర్లు వట్టిపోతుండటంతో మిషన్ భగీరథపైనే ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్ని పురపాలికల్లో రోజు విడిచి రోజు నీటిని వదులుతుండటంతో వచ్చి నీటిని నిల్వ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మూడు, నాలుగు రోజులకోసారి వార్డుల వారీ గా నీటిని వదులుతుండగా.. వాటినే పొదుపుగా వా డుకోంటున్నామని ప్రజలు తెలిపారు. పెబ్బేరు పురపాలికలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో పురపాలికకు చెందిన రెండు ట్యాంకర్ల ద్వార నిత్యం ఆయా కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట పురపాలికల్లో పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడి పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉన్న సోర్సుబోర్లు వేసవిలో వట్టిపోయే స్థితికి చేరుకున్నాయి. మిషన్ భగీరథే ఆధారం.. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో నీటి సరఫరా మిషన్ భగీరథపైనే పూర్తిస్థాయిలో ఆధారపడింది. జలాశయాల్లో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవని పట్టణ ప్రజలు వెల్లడిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎల్కూర్లోని మిషన్ భగీరథ సంప్హౌజ్ వద్ద మరమ్మతులు తలెత్తితే నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురవుతాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని సోర్సుబోర్లు వట్టిపోకుండా మరమ్మతులను వెంటనే చేపట్టడం, ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలతో నీటి కష్టాలను దూరం చేయవచ్చు. నీటి కోసం ఎదురుచూపులు వేసవికి ముందే రెండ్రోజులకు ఓసారి కొ ళాయిలకు నీటిని వదిలేవారు. ప్రస్తుతం 4 రోజులకు ఒకసారి వ దులుతున్నారు. నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – లక్ష్మి, 24వ వార్డు, వనపర్తి పుర అధికారుల నిర్లక్ష్యం.. కాలనీవాసులు తాగునీటి కోసం రోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. కొళాయిల్లో నీరు వస్తుందని తెలిస్తే చాలు అన్ని పనులు వదిలేసి నీటిని పట్టుకొని నిల్వ చేసుకునే దుస్థితి నెలకొంది. మూడు, నాలుగు రోజులకు ఓసారి నీటిని వదులుతున్నారు. నీటిసమస్య తీవ్రంగా ఉంది. అధికారులు పట్టించుకొని పరిష్కరించాలి. – సాయిలీల, 22వ వార్డు, వనపర్తి ముందస్తు చర్యలు.. వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. పురపాలికలోని చేతి పంపులను బాగుచేయించి మోటార్లు బిగించి నీటిని అందిస్తున్నాం. మిషన్ భగీరథ నీటితో పాటు సోర్సుబోర్లను వినియోగించుకుంటూ ప్రజలకు నీటి కష్టాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ ఒక్కరికి రోజుకు 125 లీటర్ల చొప్పున.. నిత్యం కొళాయిల ద్వారా ఒక్కరికి 125 లీటర్ల చొరప్పున నీటిని సరఫరా చేయాలి. ఇలా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లెక్కన నీటిని అందించాల్సి ఉంది. వచ్చిన నీటిని తాగు, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్పేట మండలంలోని చాకల్పల్లి, ఏదుట్ల, రేవల్లి మండలంలోని గౌరిదేవిపల్లి, నాగపూర్, రేవల్లి, శానాయిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గౌరిదేవి పల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
పాన్గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
నాణ్యమైన వరి ధాన్యం తీసుకురావాలి
వనపర్తి: రైతులు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన వరి ధాన్యం కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆదివారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, వ్యవసాయ, కో–ఆపరేటివ్, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐకేపీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. రైస్మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోకపోవడంతో రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం చేయకపోవడం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, చెత్త ఎక్కువగా ఉండటంతో ఎఫ్సీఐకి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చేలా చూడాలని మిల్లర్లు కలెక్టర్కు వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ రైతులు సహకరించి తూర్పారబట్టిన వడ్లను కేంద్రానికి తీసుకురావాలని, నాణ్యమైన ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. సేకరించిన ధాన్యం ట్యాబ్ఎంట్రీలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద నిలుపుకోవద్దని సూచించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడిసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి యాసంగి కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీసీఓ రాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అభివృద్ధి వైపు.. పీయూ
నిధులు (రూ.కోట్లలో..) రీసెర్చి ఫెసిలిటీ భవనం 13.50 బాలుర హాస్టల్ 12.50 బాలికల హాస్టల్ 12.50 ఎస్టీ బాలికల హాస్టల్ 10 ఎస్టీ బాలుర హాస్టల్ 10 సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 ఇంజినీరింగ్ కళాశాల 35 లా కళాశాల 10 సింథటిక్ ట్రాక్ గ్యాలరీ 4.60 సింథటిక్ ట్రాక్లో టైల్స్వర్స్ 0.53 మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది. దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్గా.. పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు. తీరనున్న హాస్టల్ సమస్యలు... యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి. పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు శరవేగంగా నూతన భవనాల నిర్మాణాలు విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం సీవేజ్ వాటర్ ట్రీట్మెట్ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు అందుబాటులోకి ఎస్టీపీ ప్లాంట్.. పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన వరి ధాన్యం లారీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని శేరుపల్లి శివారులో ఉన్న సప్తగిరి రైసుమిల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, మిల్లు యజమానులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం అన్లోడింగ్ సమయంలో ఎలాంటి తరుగు తీయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైస్మిల్లుకు నియమించిన ప్రత్యేక అధికారి లారీల రాకపోకలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఏ ఽలారీ ఎప్పుడు వచ్చింది.. ఎప్పడు ఖాళీ అయ్యింది అనే వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రతి రైసుమిల్కు గ్రామపంచాయతీ అధికారులను నియమించామని.. మిల్లు వద్ద ఉండి ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చూస్తారని పేర్కొన్నారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
వైభవంగా భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: కొత్తకోట పట్టణ సమీపంలో గల వెంకటగిరిగుట్టపై ఆలయంలోని భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణపక్షం ఏకాదశి పురష్కరించుకొని వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున ఉత్సవమూర్తి విగ్రహాలను అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరణ చేశారు. కల్యాణానికి కొత్తకోటతో పాటు కానాయపల్లి, పాలెం, నిర్వేన్ గ్రామాల నుంచి పెద్దఎత్తున హాజరైన భక్తుల మధ్య అర్చకులు వేదమంత్రాలతో అర్చకులు తలంబ్రాలు పోయగా ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. భక్తులతో ఆలయం గోవింద నామస్మరణంతో మారుమోగింది. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులుతో పాటు ఆలయ నిర్వాహకులు, వేముల శ్రీనివాస్రెడ్డి, బలిజపల్లి శ్రీనివాస్, దినేష్రెడ్డి, నర్సింహారావు, భీమ దత్తుశెట్టి, సంద వెంకటేష్, బలరాం, నరేష్కుమార్ పాల్గొన్నారు. -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్నగర్ -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ -
వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
కొత్తకోట: ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసి.. విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి కోరారు. శనివారం కొత్తకోటలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న పీఆర్సీ ప్రకటించడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహాగౌడ్, రవీందర్రెడ్డి ఆయనను శాలువాలతో సన్మానించారు. -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
గద్వాల: మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
కొనుగోళ్లలో కొర్రీలను తట్టుకోలేక.. ధాన్యానికి నిప్పుపెట్టి రైతుల నిరసన
వీపనగండ్ల: తరుగు, తాలు పేరుతో రైస్మిల్లర్లు పెడుతున్న కొర్రీలను తట్టుకోలేని రైతులు శనివారం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో నడిరోడ్డుపై వరిధాన్యానికి నిప్పుపెట్టి ఆందోళనకు దిగారు. రైస్మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల మహిళా సమాఖ్య ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తే.. తరుగు, తాలు, తేమ తదితర కారణాలు చూపి ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారన్నారు. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేశ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
జనగణనలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి ● జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా మారథాన్ వనపర్తి: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. జనగణన నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన మారథాన్.. పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 11 నుంచి జూన్ 10 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 13వేల మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇళ్ల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. జనగణనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీపీఓ హరికృష్ణ, డీవైఎస్ సుదీర్రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్ చెల్లింపులు పూర్తిచేయండి.. 2022–23 యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్తో కలిసి రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 యాసంగి వేలం ధాన్యానికి సంబంధించి బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్ చెల్లింపులు పూర్తిచేసిన మిల్లర్లను డిఫాల్టర్ జాబితా నుంచి తొలగించి.. వారికి తిరిగి ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు పొందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం ఆంజనేయులు ఉన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
ప్రజా పాలనలో పంట కొనే దిక్కులేదు
కొత్తకోట రూరల్: రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. శనివారం కొత్తకోటలోని శివాజీ చౌరస్తాలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. రైతుల పంట కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. పంట పండించేందుకు పడిన కష్టానికి మించి అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. బోనస్ ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పీటీసీ పి.విశ్వేశ్వర్, కౌన్సిలర్లు తిరుపతయ్య, అయ్యన్న, గాడీల ప్రశాంత్, ఆకుల శ్రీనివాసులు, కె.శ్రీనివాస్జీ, గోపాల్నాయక్, డైరెక్టర్ భాస్కర్, జలేంధర్రెడ్డి, యుగంధర్రెడ్డి, ఎద్దుల నాగేశ్, వికాస్, మహేశ్ పాల్గొన్నారు. -
కార్మిక ద్రోహులకు బుద్ది చెబుదాం
ఆత్మకూర్:కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికలోకం ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు మహమూద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు అన్నారు. ఆత్మకూర్లో మేడే ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగునంగా కనీసవేతనం రూ.24వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కార్మికులకు అన్యాయం చేసేందుకు పూనుకుంటుదని మండిపడ్డారు. కేంద్రంలో మోది ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు. కేంద్ర, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుచ్చన్న, సుజ్నానం, అరుణ్, రవి, నిషాంత్, భారతీయుడు, ప్రకాష్ తదితరులు ఉన్నారు. -
సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్
ప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
అమ్మనే ఆదర్శం..
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్కర్నూల్/ పాలమూరు/గద్వాల ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. ● వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఎస్సెస్సీ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, వర్క్షాప్ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, లైబ్రరీ డే, విద్యా వేడుకలను నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వందశాతం పూర్తయ్యేలా ఏఈఓలకు లక్ష్యాలను నిర్దేశించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో సీపీఓ హరికృష్ణ, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీఎం ఆంజనేయులు, డీఏఓ ఆంజనేయులు, డీడబ్ల్యూఓ సుధారాణి ఉన్నారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు వనపర్తి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్ (30 రోజులు), మగ్గం వర్క్ (30 రోజులు), సీసీ కెమెరా టెక్నిషీయన్ (13 రోజులు), ఫొటోగ్రఫి – వీడియోగ్రఫి (31 రోజులు), ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ (14 రోజులు), కొవ్వొత్తులు, అగరబత్తుల తయారీ (13 రోజులు), హౌస్ వైరింగ్ (31 రోజులు), ఎల్ఎంవీ కారు డ్రైవింగ్ (31 రోజులు), జనరల్ ఈడీపీ (6 రోజులు), ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్ సర్వీసెస్ (31 రోజులు), సెల్ఫోన్ రిపేర్ అండ్ సర్వీసింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), రిఫ్రిజిరేటర్ – ఎయిర్ కండీషనింగ్ వర్క్ (30 రోజులు), ద్విచక్ర వాహనం మెకానిక్ (30 రోజులు), తేనెటీగల పెంపకం, తేనె తయారీ (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మగ్గం వర్క్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ముద్రా పథకం ద్వారా రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి.. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లాకేంద్రంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 85220 88978, 98859 40945, 79816 84174 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
‘మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం’
చిన్నంబావి: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలకేంద్రంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి పంట తడిసిందని.. గన్నీ బ్యాగుల కొరత ఉండటంతో బహిరంగ మార్కెట్లో రూ.40 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు వివరించారు. వెంటనే ఆయన కలెక్టర్కు ఫోన్చేసి పరిస్థితి వివరించారు. తడిసిన పంటను సైతం కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పాలనలో మొక్కజొన్న, పప్పుశనగలు, వరి ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని.. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా రైతు ప్రశాంతంగా ఉన్నది లేదని విమర్శించారు. మంత్రి జూపల్లి సొంత మండలంలోనే ఈ పరిస్థితి ఉందంటే.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిన్నంబావిలో పుప్పుశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటో మంత్రి రైతులకు వివరించాలని కోరారు. ఆయన వెంట చెల్లపాడు సర్పంచ్ పెద్దనర్సింహ, రంజిత్కుమార్, మహేశ్వర్రెడ్డి, డేగ శేఖర్, రామకృష్ణ, సంపంగి మద్దిలేటి, తగరం నర్సింహ, సుధాకర్, జేవీకే నాయుడు, మహిచంద్ర, బాలగౌడు తదితరులు ఉన్నారు. -
ఆధునిక సాగు.. దిగుబడి బాగు
ఖిల్లాఘనపురం: సేంద్రియ వ్యవసాయంతో మానవ మనుగడ సాధ్యమవుతుందని.. రైతులు ఆధునిక పద్ధతిలో పంటల సాగు చేపడితే లాభసాటిగా ఉంటుందని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆగ్రానమీ విభాగం శాస్త్రవేత్తలు డా. ప్రగతి, డా. సాయిమిత్ర తెలిపారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని సోళీపురం రైతువేదికలో ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి సమావేశానికి హాజరైన వారు ఆధునిక సాగు పద్దతులు, ఖర్చు తగ్గింపు మార్గాలు, నేల ఆరోగ్యం పరిరక్షణపై రైతులకు అవగాహణ కల్పించారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని అవసరమైన ఎరువులు తగిన మోతాదులో వినియోగించాలన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడంతో సారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. పంట మార్పిడితో నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నీటి వనరులను సంరక్షించుకోవాలని.. వరికి అవసరానికి మించి యూరియాను వినియోగిస్తే నేల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత అవసరమని, తెగుళ్ల నివారణకు రసాయనాలను సరైన సమయంలో వ్యవసాయ అధికారుల సూచనలతో వాడాలని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ సాగు అలవర్చుకోవాలని.. కనీసం సొంత అవసరానికై నా ఎకరం, అర ఎకరం వరి సాగు చేసుకుని బియ్యం పట్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి రేవతి, మహేశ్వరి, సర్పంచ్ సింధు, ఉప సర్పంచ్ నవీన్రెడ్డి, ఏఈఓ సునీల్, పలు గ్రామాల పెద్దలు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మైనర్ డ్రైవింగ్ కట్టడి కోసం ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు పెంచుతాం. మైనర్లకు వాహనాలు ఇస్తే సదరు వాహన యజమానిపై సెక్షన్ 180 ప్రకారం కేసు నమోదవుతుంది. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బైపాస్లపై రాత్రివేళ రాష్ డ్రైవింగ్లపై కూడా దృష్టిపెడుతాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మైనర్లు, చిన్నారులకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనెల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 42 కేసులు నమోదు కాగా.. రూ.63 వేల జరిమానా విధించారు. గద్వాల జిల్లాలో కేసులు నమోదు కాలేదు. కానీ, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను మందలించారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 102 కేసులు నమోదు కాగా.. రూ.51 వేల జరిమానా విధించారు. వనపర్తి జిల్లాలో మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 3 కేసులు నమోదు కాగా.. రూ.1,500 జరిమానా విధించారు. నాగర్కర్నూల్ జిల్లాలో 48 కేసులు నమోదు కాగా.. రూ.60 వేల జరిమానా విధించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్లు రాష్గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. మైనర్లు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ సీఐ ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవుల నేపథ్యంలో రోడ్లపై బైక్లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరులో రెండు బైపాస్ రోడ్లపై రేస్ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం పిల్లలు వాహనాలు నడుపుతూ రవాణా శాఖ, పోలీసులు తనిఖీలు చేసే సందర్భంలో పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. మోటారు వాహన చట్టం, పోలీస్ శాఖ న్యాయ సంబంధిత సెక్షన్స్ కింద కేసు పెడితే వాహన యజమానికి కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. బాలబాలికలు వాహనాలు నడిపిన సమయంలో ప్రమాదానికి గురైతే యజమానిపై కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. కోర్టులో నేరం రుజువు అయితే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మైనర్లు వాహనాలు నడిపిన సందర్భంలో సెక్షన్–181 ఆఫ్ ఎంవీఐ యాక్ట్తోపాటు రూ.1,500 జరిమానా విధిస్తారు. -
మత్స్యకారుల అభ్యున్నతికి సహకారం
● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తిటౌన్: మత్స్యకారుల అభ్యున్నతికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించి చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని నాగవరం శివారు రైతువేదికలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి చేపల ఉత్పత్తిని పెంచేందుకు సహకరిస్తామని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో మత్స్యకారులు చేపల విక్రయాలు చేసుకునేందుకు మొబైల్ వాహనాలు, రాయితీ రుణాలు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని నల్లచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కట్టపై గంగమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని చెప్పారు. ముదిరాజ్లకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించి సమన్నత స్థానం కల్పించారని చెప్పారు. అనంతరం గోపాల్పేట మండలం చాకలిపల్లికి చెందిన మహిళలకు మహిళా పారిశ్రామిక సహకార సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, పుర చైర్పర్సన్ మాధవి, పెబ్బేరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవానంద్, సీఎస్సీ ప్రతినిధి మాలిక్, ప్రజాప్రతినిధులు, జిల్లా మత్స్య సహకార సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సమీకృత సముదాయాన్ని వినియోగించుకోవాలి.. సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. శుక్రవారం భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ అస్స్యూరెన్స్ కార్యాలయాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సముదాయం నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అద్దె అధికంగా ఉండటంతో దుకాణాలు తీసుకోవడానికి వ్యాపారస్తులు ముందుకు రాలేదన్నారు. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు పంపించి ఆయన ఆమోదంతో తగ్గించినట్లు చెప్పారు. కలెక్టర్తో మాట్లాడి అవసరమైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్హాల్ను సైతం వినియోగంలోకి తీసుకొస్తామని, దాని చుట్టూ గోల్డ్ బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని.. త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మారుస్తామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పుర చైర్పర్సన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రా, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో పాడి కీలకం
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వనపర్తి రూరల్: గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, పశువులకు సకాలంలో టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించడం అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పెబ్బేరులో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మెగా ఫర్టిలిటి అండ్ హెల్త్క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు నిర్వహించడం రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా. వెంకటయ్యగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ చైర్మన్ చైర్పర్సన్ గౌని ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తపాలాశాఖలో సీబీఐ కలకలం
● తోటి ఉద్యోగుల నుంచి లంచం ఆశించిన పోస్టల్ ఇన్స్పెక్టర్ ● సుదీర్ఘ విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న అధికారులు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న గోపీనాథ్ తోటి ఉద్యోగుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 7 వరకు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్లకు అదనపు విధులు కేటాయిస్తారు. ఇందుకుగాను అదనంగా డబ్బులు చెల్లిస్తారు. 2023 నుంచి 2026 వరకు అదనపు విధుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో మంజూరుకు పోస్టల్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి వచ్చే డబ్బుల నుంచి కొంత శాతం తనకు చెల్లించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కొందరు బీపీఎం, ఏబీపీఎం, డాక్సేవక్లు చెల్లించగా.. ఒకరిద్దరు సీబీఐ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కార్యాలయానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. విషయం తెలుసుకున్న గోపీనాథ్ పరారయ్యారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సెల్ఫోన్ ట్రేసింగ్ ద్వారా గుర్తించిన సీబీఐ అధికారులు పట్టుకొని పోస్టల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, కార్యాలయ ట్రెజరీలో కొంత నగదుకు సంబంధించి లెక్కలు చూపడంలో విఫలం కావడంతో గురువారం రాత్రంతా అక్కడే ఉంచారు. విధులు ముగించుకొని ఇంటికెళ్లిన మిగతా ఉద్యోగులను రాత్రి 10.30 గంటలకు కార్యాలయానికి పిలిపించి బీపీఎంలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం, కార్యాలయ ట్రెజరీలో అదనంగా నిల్వ ఉన్న డబ్బులపై ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని వివరాలను లిఖితపూర్వకంగా ధ్రువీకరించుకొని నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 వరకు కార్యాలయంలోనే ఉండి సుదీర్ఘ విచారణ అనంతరం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి వనపర్తి ప్రధాన పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న అంగీకరించారు. -
ఆనందంగా ఉంది..
ఎత్తిపోతల మోటార్లు సరిగా పనిచేయక మా పొలాల వరకు సాగునీరు పారేది కాదు. పైపుల లీకేజీ కారణంగా ఏళ్లుగా సాగునీరు వృథా అయ్యేది. సరళాసాగర్ ఎత్తిపోతల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మా చివరి పొలాలకు కూడా సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే మా కష్టాలు గుర్తించి నిధులు మంజూరు చేయించడం గొప్ప విషయం. – శ్రావణ్కుమార్, శంకరమ్మపేట, మదనాపురం శ్రీ కురుమూర్తి, సరళాసాగర్, నెలివిడి ఎత్తిపోతల మరమ్మతుకు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. సరళాసాగర్ ఎత్తిపోతల పంపులు కాలం చెల్లినవి కావడంతో సీజన్ మధ్యలో తరచూ మొరాయించేవి. మరమ్మతులకు నెలల సమయం పట్టేది. అప్పటికే పంటలు ఎండిపోయేవి. ప్రస్తుత ఎమ్మెల్యే మూడు ఎత్తిపోతల మరమ్మతులకు రూ.4.31 కోట్లు మంజూరు చేయించడంతో వ్యవసాయం మీద నమ్మకం పెరుగుతోంది. సాగునీరు సమృద్ధిగా అందితే అధిక దిగుబడులు సాధిస్తాం. – హనుమాన్రావు, కాంగ్రెస్ నాయకుడు, నర్సింగాపురం, మదనాపురం కురుమూర్తిస్వామి ఆశీస్సులు, సరళాసాగర్ పుణ్యంతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి. ఎత్తిపోతల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నాం. పనులు నాణ్యతగా చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రతి చుక్క నీటిని రైతుల పొలాలకు చేర్చే బాధ్యత నాది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ● -
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం : బీఆర్ఎస్
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి, మొక్కజొన్నను నెలరోజులుగా కొనుగోలు చేయడం లేదని, సేకరణలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆరోపించారు. గురువారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును వారు సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 287 మాత్రమే ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని.. పండించిన వరి, మొక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షులు రఘువర్ధన్రెడ్డి, వెంకటసాగర్, డేగ మహేశ్వర్రెడ్డి, రవిప్రకాష్రెడ్డి, సర్పంచ్ శోభా కృష్ణ, ఉప సర్పంచ్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. -
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు గురువారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,533 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ మొత్తం కిక్కిరిసిపోయింది. అలాగే 4,668 బస్తాల మొక్కజొన్న మార్కెట్కు వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,825, కనిష్టంగా రూ.5,069, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,219,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,858, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, రాగులు రూ.2,807 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,070, హంస గరిష్టంగా రూ.1,779, కనిష్టంగా రూ.1,619గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటాలి
వనపర్లిటౌన్: హైదరాబాద్లో ఈ నెల 17న జరగబోయే తెలంగాణ 12వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ ఆకాంక్షించారు. గురువారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లా జట్టు ఎంపికలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జిల్లాను ఉన్నతస్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలని, పట్టుదలతో చివరి నిమిషం వరకు విజయం కోసం పోరాడాలన్నారు. ఎదురుదెబ్బను మెట్టులా చేసుకొని గెలుపువైపు పయనించాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు.. అండర్–8 బాలుర 60 మీటర్ల పరుగు విభాగంలో హార్థిక్, అండర్–10 బాలుర లాంగ్జంప్నకు లిఖిత్, 300 మీటర్ల పరుగు పందెంకు మహేష్, 60 మీటర్ల పరుగు పందెం బాలికల్లో రితిక, 300 మీటర్లు జాహ్నవి, అండర్–12 పరుగు పందెం బాలురలో యశ్వంత్రెడ్డి, షాట్పుట్ నరేందర్, 400 మీటర్ల పరుగు పందెం శ్రీ చరణ్, బాలికల 60 మీటర్ల పరుగు పందెం ఘోషిక, 400 మీటర్ల పరుగు పందెం సింధూ, అండర్– 16 బాలురు షాట్పుట్కు నరేందర్, లాంగ్జంప్ ప్రణీత్, బాలికల షాట్పుట్ సానియా, జావెలిన్ త్రో హారిక, అండర్–18 బాలుర షాట్పుట్కు సాయి, లాంగ్జంప్ శంకర్, షాట్పుట్కు దశరథ్, ట్రిపుల్జంప్కు మహదీప్ ఎంపికయ్యారని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి బొలమోని కుమార్, జబ్బార్, దేవేందర్, అజయ్కుమార్, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
వనపర్తి: ఎలాంటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్ కోరారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విపత్తులను ఎదుర్కోడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరదలు, పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు, అడవుల్లో మంటలు చెలరేగడం, రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం ఎలా వ్యవహరించాలనే వివరాలు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉండాలో సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలపై ఈ నెల 15 వరకు టేబుల్ ఎక్సర్సైజ్ చేయాలని.. 18వ తేదీన మాక్డ్రిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలు ఏమిటి, ఎలా నిర్వర్తించాలనే విషయాలను తెలుసుకోవడమేగాకుండా ప్రాక్టికల్గా చేస్తేనే ప్రమాదాలు వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను వరద ప్రమాద జిల్లాలుగా, 5 జిల్లాలను పరిశ్రమల ప్రమాద జిల్లాలుగా, అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలను అగ్ని ప్రమాద జిల్లాలుగా గుర్తించినట్లు తెలిపారు. వీసీలో హైదరాబాద్ నుంచి ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెనన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్మాన్, కార్యదర్శి హరిచందన దాసరి, జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి బి.ధర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రయత్నం.. సత్ఫలితం
● ‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత శాతం ● రాష్ట్రస్థాయిలో జిల్లా 29 స్థానం నుంచి 19వ స్థానానికి చేరిక ● ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు ● గణితం, ఆంగ్లం ప్రత్యేక తరగతుల నిర్వహణతోనే.. అమరచింత: కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవతో జిల్లా విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. గత విద్యాసంవత్సరం 10వ తరగతి ఫలితాలను పరిశీలిస్తే 89.2 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 29వ స్థానంలో నిలిచింది. దీంతో ఆయన 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. పది ఫలితాల్లో జిల్లా వెనుకబడటానికి కారణాలను ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా 680 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా.. అందులో 415 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఉత్తీర్ణత సాధించలేదని గుర్తించారు. వెంటనే జిల్లాలోని గణిత ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇంతమంది విద్యార్థులు కేవలం గణితంలోనే ఫెయిల్ కావడానికి కారణం ఏమిటి? సరిగా బోధన అందడం లేదా లేక మరేదైనా కారణం ఉందా అని ఆరా తీశారు. విద్యార్థులకు కనీసం కూడికలు, తీసివేతలు, గుణింతాలు కూడా రాకపోవడం, ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు అర్థం కాకపోవడం వంటి ప్రధాన కారణాలు తెలుసుకున్నారు. వెంటనే 8, 9, 10 తరగతి విద్యార్థులకు గణితం, ఆంగ్లంలో తేలికై న ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించి అందులో ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితా రూపొందించారు. ఆయా పాఠ్యాంశాల్లో అధిక ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులతో ప్రత్యేక అభ్యసన సామగ్రిని తయారు చేయించారు. వాటిని అన్ని ఉన్నత పాఠశాలల్లో తొలి రెండు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు బోధించారు. విద్యాశాఖపై కలెక్టర్ ప్రత్యేక నజర్ కలెక్టర్ ఆదేశాలతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి 8 ,9, 10 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు గణితం, ఆంగ్లంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పదోతరగతి విద్యార్థులకు నిత్యం ఉదయం, సాయంత్రం గంట పాటు విషయాల వారీగా తరగతులు కొనసాగాయి. వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాం. దీంతో ఆశించిన ఫలితాలు సాధించగలిగాం. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి ప్రత్యేక తరగతులతో విద్యార్థులు గణితంపై అవగాహన పెంచుకొని కాస్త పట్టు సాధించారు. దాని ఫలితంగా ఈ విద్యా సంవత్సరం పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే గణితంలో ఫెయిల్ అయ్యారు. దీంతో పది ఫలితాల్లో జిల్లా 97.46 శాతం ఉత్తీర్ణత సాధించి గతేడాది కంటే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి రాష్ట్రస్థాయిలో 19వ స్థానానికి చేరింది. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యాశాఖ అధికారితో పాటు ఉపాధ్యాయులను అభినందించి ఇదే ఉత్సాహంతో ముందుకుసాగాలని.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. -
బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య కార్మికులకు పదినెలల బకాయి వేతనాలు, కటింగ్ ఏరియర్స్ వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్రకార్యదర్శి సురేష్ కోరారు. గురువారం స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపి వైద్యాధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యం పెంచాలని దశల వారీగా పోరాటాలు చేయడం, మంత్రి వాకిటి శ్రీహరి కృషితో పడకల సామర్థ్యం పెంచడంతో పాటు 10 నెలల ఏరియర్స్ విడుదల చేశారని గుర్తుచేశారు. బడ్జెట్ విడుదలై రెండునెలలు గడుస్తున్నా చెల్లించకుండా కాంట్రాక్టర్, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మూడునెలల వేతనాలు పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. కార్మికులు ఏళ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వేతనాల్లో కోత విధిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు ఏరియర్స్తో పాటు జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషా, నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రామన్పాడ్ తగ్గుముఖం
రిజర్వాయర్లో ఏడు మీటర్లు తగ్గిన నీటిమట్టం ● నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీరు సరఫరా ● జిల్లాలోని 255 గ్రామాలు.. 6.46 లక్షల జనాభా ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్ జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి రామన్పాడు రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం ఆత్మకూర్: జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే జిల్లాలోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. వనపర్తి జిల్లాలో 255 గ్రామాలు, 6.46 లక్షల జనాభా ఉంది. నిత్యం 1.05 లక్షల కొళాయిల ద్వారా 76 ఎంఎల్డీ (7.66 కోట్ల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు చేతిపంపులు 451, సింగిల్ఫేస్ బోరుమోటార్లు 460, త్రీఫేజ్ బోర్లు 687, బావుల్లో మోటార్లు 38 సిద్ధంగా ఉండగా గ్రామపంచాయతీల్లో ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
మరో రెండు కార్పొరేషన్ పదవులు
గద్వాల: ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణషీప్ మరియు గోట్ డెవలప్మెంట్ కో–ఆపరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా, గ ట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాట్ చైర్మన్గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేష న్ చైర్మన్గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు. కొల్లె సరిత బీఆర్ఎస్ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్గా కూడా పనిచేశారు. కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నాగరాజుగౌడ్ అమరచింత: పట్టణానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్ను రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్పార్టీ బలోపేతంతో పాటు మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాగరాజుగౌడ్కు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన ‘చైర్మన్ గిరి’ -
పంటమార్పిడితో అధిక దిగుబడులు
గోపాల్పేట: రైతులు భూసార పరీక్షలు చేయించి తరచూ పంటమార్పిడి చేస్తూ సాగు చేపడితే అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకు జిల్లాలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఆయా కార్యక్రమాల్లో రైతులు పాల్గొని పంటల సాగుపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు తదితర అంశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. భూసార పరీక్ష ఫలితాలతో రైతులు ఏ పంటలు సాగు చేయాలనే విషయం తెలుస్తుందని.. భూసార పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని.. దీనిద్వారా రైతుకు కేవలం 7 నుంచి 9 శాతం వడ్డీతో రుణాలు అందుతాయని, సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం మూడు శాతం వరకు వడ్డీ తిరిగి అందజేస్తుందని చెప్పారు. ఏటా ఒకేరకమైన పంటలు సాగు చేయడంతో భూసారం కోల్పోయి దిగుబడి తగ్గుముఖం పడుతుందని.. పంటమార్పిడితో అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లాలో గన్నీబ్యాగుల కొరత రానివ్వమని.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, పశ్చిమ ఆసియా యుద్ధాలతో సరఫరాలో జాప్యం జరిగిందని, త్వరలో అధిగమిస్తామని చెప్పారు. బుధవారం రేవల్లి మండలానికి పదివేల గన్నీబ్యాగులు పంపించామని.. మిగిలిన మండలాల్లో కూడా కొరత లేకుండా చూస్తామని వివరించారు. అలాగే మొక్కజొన్న కొనుగోళ్లను సైతం వేగవంతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రఘు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి రాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, ఎల్డీఎం శివకుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి.. వనపర్తి రూరల్: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్గౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్కు వచ్చిన రైతులకు అంబలి, తాగునీరు అందించారు. జిల్లాలోని మిగిలిన అన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్యార్డుల్లోనూ అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్, ఆంజనేయులు, ఆసీఫ్, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
మోదీ హయంలోనే దేశం అభివృద్ధి
వనపర్తిటౌన్: ప్రధానమంత్రి మోదీ హయంలోనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జరిగిన సన్నాహక, విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రూ.8 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అనేక ప్రాజెక్టులు జాతికి అంకితం చేసేందుకు ఈ నెల 10న ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు బూత్ కమిటీ సభ్యులు, మండల నాయకులు, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ దేశాన్ని, అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాళ్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పుదుచ్చేరి 2వ పర్యాయం, అస్సాం హ్యాట్రిక్ విజయం, పశ్చిమబెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని.. అదే ఉత్సాహంతో భవిష్యత్లో రాష్ట్రంలో సైతం డబుల్ ఇంజన్ సర్కార్గా మార్చేందుకు అడుగుపడనున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత, జిల్లా ఇన్చార్జ్ బొక్క బాల్రెడ్డి, రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన, కౌన్సిలర్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య -
గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ వనపర్తి రూరల్: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన వెంటనే మిల్లుకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని కిష్టగిరి, నాచహళ్లి, మెంటేపల్లి, నర్సింగాయపల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం తూకాలు, మౌలిక వసతులు, రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీబ్యాగులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని సూచించారు. ప్యాడీ క్లీనర్లను వినియోగించుకులానే రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోళ్లు పూర్తిచేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తిచేసి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరిపడా లారీలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్లను కోరారు. -
వాణిజ్య పంటలతో లాభాలు బాగు
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తిటౌన్: రైతులు వరి మాత్రమే కాకుండా ఆయిల్పాం, పప్పుగింజలు, కూరగాయల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాం సాగు చేయాలన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో సరిపడా పామాయిల్, పప్పు దినుసుల నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్పాం సాగుచేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చని కోరారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. ఆయిల్పాం సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులను ప్రత్యేక బస్సులో సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాదరావు, వ్యవసాయశాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ కృపాకర్రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వీణా, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, తహసీల్దార్ రమేశ్రెడ్డి, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. -
వైద్యశాఖలో అలజడి
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు. జిల్లా వైద్యాధికారిపై పరువునష్టం దావా -
పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి
వనపర్తి: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనా కోరారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సామరస్యంగా నిర్వహించుకునేలా ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చూడాలన్నారు. పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధకశాఖ సిబ్బందితో 3 చెక్పోస్ట్లు ఏర్పాటు చేశామని.. నిర్ధారిత ప్రామాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉంటేనే పరిశీలించి అనుమతిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని శాంతిభధ్రతలకు విఘాతం కలిగించొద్దని.. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించేందుకు పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతిభద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉందని.. మతపెద్దలు సమన్వయం పాటించేలా దిశా నిర్దేశం చేయాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు చేసే వారిపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు పోలీసుశాఖ చర్యలను అభినందిస్తూ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లపై వాహనాలు నిలుపొద్దు.. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రోడ్డు మీద వాహనాలు నిలిపిన, దుకాణాల బోర్డులు ఏర్పాటుచేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న దుకాణదారులు, వాహనదారులకు ఏఎస్పీ, డీఎస్పీ గిరిబాబు అవగాహన కల్పించారు. రోడ్డు అందరి సొత్తని.. ఒక్కరి సౌలభ్యం కోసం ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. రోడ్లను ఆక్రమించడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని.. అనవసర పార్కింగ్, రాంగ్సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి తప్పులు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా -
రోడ్డెక్కిన అన్నదాతలు
గోపాల్పేట: ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ మంగళవారం మండలంలోని నర్సింగాయపల్లి బస్టాండు సమీపంలో రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో సుమారు 20 రోజుల కిందట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా నేటికీ ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న గోపాల్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడించి బుధవారం కొనుగోళ్లు, తరలింపు జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
నేతన్నకు పొదుపు జాడేది?
12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ● ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు ● కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ● ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లు.. రూ.2.64 కోట్లు మాత్రమే జమ రూ.13.24 కోట్లు బకాయి.. ఉమ్మడి జిల్లాలోని జియోట్యాగ్ కలిగిన మగ్గాల ప్రధాన కార్మికులు, అనుబంధ కార్మికులు ప్రతి నెల రూ.2 వేల చొప్పున రూ.66.20 లక్షలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.7.94 కోట్లు కార్మికులు జమ చేశారు. ప్రభుత్వ వాటా 16 శాతం అంటే రూ.15.88 కోట్లు జమ కావాల్సి ఉండగా.. రెండు నెలల డబ్బులు రూ.2.64 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఇంకా ప్రభుత్వం నుంచి రూ.13.24 కోట్లు అందాల్సి ఉంది. అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉన్నాయని.. 10వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31 వరకు https://tgms .telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు జిల్లాస్థాయిక్రీడాకారుల ఎంపికలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో గురువారం సబ్ జూనియర్ అథ్లెటిక్స్, సీనియర్స్ విభాగం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు జరగనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో 17వ తేదీన జరగబోయే 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. అండర్ 8లో 60 మీటర్లు, 200 మీటర్లు, స్టాండింగ్ బ్రాడ్జంప్, అండర్–10లో 60 మీటర్లు, 300 మీటర్లు, లాంగ్ జంప్ (5 మీటర్స్ అప్రోచ్ రన్), అండర్–12లో 60 మీటర్లు, 400 మీటర్లు, లాంగ్ జంప్ (5 మీటర్స్ అప్రోచ్రన్), షాట్పుట్ (బ్యాక్ త్రో), అండర్–14లో ట్రయాథ్లాన్–ఏ,బీ,సీ, కిడ్స్ జావెలిన్ త్రో ఎంపికలు ఉండనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి జంప్స్, త్రోస్, 400 మీటర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు అండర్–16 బాలబాలికల లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, అండర్–18 లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, 400 మీటర్స్, అండర్–20లో లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, 400 మీటర్స్, మెన్ అండ్ ఉమెన్స్కు లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, జావెలిన్, డిస్కస్ త్రో, హేమర్ త్రో, 400 మీటర్స్, షాట్పుట్ ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 7 గంటలకు గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలని, మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 80961 15222, 94413 53375 సంప్రదించాలని సూచించారు. ప్రజాభవన్ ప్రజావాణిలో గణప సముద్రం రైతులు ఖిల్లాఘనపురం: నష్ట పరిహారం చెల్లించాలంటూ మంగళవారం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు హైదరాబాద్లోని ప్రజాభవన్ ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పడంతో 2025, జూలైలో అవార్డు కాపీలపై సంతకాలు చేశామన్నారు. 100 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లింకపోవడంతో కలెక్టర్ను కలిశామని.. జిల్లాలో చేయాల్సిన ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారన్నారు. కలెక్టర్ దగ్గర టోకన్ నంబర్ తీసుకొని 2025, నవంబర్ 5న ప్రజావాణిలో ఫైనాన్స్ డిపార్డుమెంట్కు లేఖ అందించడంతో పాటు మండల కేంద్రంలో బంద్, రాస్తారోకో చేపట్టామని వివరించారు. అయినా ఇప్పటి వరకు పరిహారం అందలేదని.. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే చెల్లించాలని, న్యాయం జరిగేలా చూడాలని చిన్నారెడ్డిని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ముంపురైతుల అధ్యక్షు డు రవీందర్రెడ్డి, రాళ్ల కృష్ణయ్య, కటికె శ్రీనివాసులు, గగ్గలపల్లి శ్రీనివాస్రెడ్డి, గగ్గలపల్లి శేఖర్రెడ్డి, సౌడం రాములు, నల్లమద్ది సురేందర్రెడ్డి, గంగాపురం రాజురెడ్డి, దేవరశెట్టి సురేందర్, పలువురు రైతులు ఉన్నారు. రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు. -
‘భూ భారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ భారతి పెండింగ్ దస్త్రాలను లాగిన్కు పంపడంతో పాటు కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. అలాగే సాదాబైనామా దరఖాస్తులను జీఓనంబర్ 76, 77 ప్రకారం పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక జాబితా సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని 472 రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ విఠోభా పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అమృత్ 2.0 పనులు వేగవంతం
కొత్తకోట రూరల్: అమృత్ 2.0 పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించి పురోగతిపై సమీక్షించారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యం సరికాదని.. ప్రతి దశలో పనులు పరిశీలించాలని స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. పనులు వేగంగా పూర్తిచేసి గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సైదయ్య, స్థానిక నాయకులు పి.కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎన్జే బోయేజ్, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, బాదం వెంకటేశ్వర్లు, పెంటన్నయాదవ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లు, గోదాంకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం ఆయన వనపర్తి మండలం చిట్యాల మార్కెట్యార్డు, కొత్తకోట మండలం వడ్డేవాట, సంకిరెడ్డిపల్లి, ముమ్మళ్లపల్లిలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ధాన్యం రికార్డులను పరిశీలించి నమోదుపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టిపెడ్డలు లేకుండా క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. చాలాచోట్ల తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తుందని.. అలా ఉంటే మిల్లర్లు ధాన్యంలో కోత విధించేందుకు ఆస్కారం ఉండదని, రైతులు శుభ్రం చేసి తీసుకురావాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని కేంద్రాల ఇన్చార్జ్లను ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేయాలని, ట్యాబ్ఎంట్రీ ప్రక్రియ వేగంగా జరగాలని, తద్వారా నగదు చెల్లింపుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ చాంద్పాషా, కొత్తకోట పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
కలెక్టర్ను కలిసిన అదనపు ఎస్పీ
వనపర్తి: జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలన్నారు. మహిళల భద్రత, బాలల సంరక్షణ, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్పీ ప్రజావాణికి 7 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏడు వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నేరుగా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను కలిసి సమస్యలు వివరించి వినతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం పోలీసుశాఖ బాధ్యతని, ప్రజావాణి సమస్యలను నిర్భయంగా తెలియజేసే వేదికగా నిలుస్తోందన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పోలీసుశాఖపై విశ్వాసం ఉంచి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
రోజు రూ.40 చెల్లించే వాడిని
15 ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నా. ఉదయం నుంచి రాత్రి వర కు అమ్ముకోవడం.. అమ్మి న దాంట్లో తైబజార్ రూ పంలో రూ.40 పురపాలికకు చెల్లించేవాడిని. కౌన్సిల్ నిర్ణయంతో మా లాంటి పేదలకు అదనపు భారం తప్పింది. – దూల నిరంజన్, కూరగాయల విక్రయదారు సంతోషంగా ఉంది.. వ్యాపారం సక్రమంగా నడిచినా.. నడవకపోయినా రోజు తైబజార్ చెల్లిస్తుండేవాళ్లం. ప్రస్తుత పుర పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో అరకొర ఆదా యం వచ్చే మాలాంటి వారికి కాస్త ఉపశమ నం లభించినట్లయింది. చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మి, చిరు వ్యాపారి, కమాన్ చౌరస్తా పేదల కోసమే.. రెక్కాడితేగాని డొక్కాడని పేద వ్యాపారులు తైబజార్తో ఇబ్బందులు పడకూడదని భావించాం. కౌన్సిల్లో బలమైన వాదనలు వినిపించి అందరు సభ్యులు ఒప్పుకునేలా కృషి చేశాం. మా పార్టీలోని మిగతా సభ్యులు కూడా తైబజార్ రద్దుకు సుముఖత వ్యక్తం చేయడంతో చిరు వ్యాపారులకు న్యాయం చేసినట్లయింది. – ధనలక్ష్మి, కౌన్సిలర్ -
క్షయ గుర్తింపునకుప్రత్యేక శిబిరాలు
పాన్గల్: క్షయ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా టీబీ నోడల్ అధికారి డా. వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన క్షయ నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. శిబిరాల్లో వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంపై దృష్టి సారిస్తారని తెలిపారు. క్షయ మరణాలు తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడితే రోగం నయమవుతుందన్నారు. టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ నాగలక్ష్మి, జిల్లా టీబీ వ్యాఽధి నిర్ధారణ సిబ్బంది నాగేష్, వినోద్, మధు, స్థానిక వైద్యసిబ్బంది రాంచందర్, మదన్గోపాల్, నాగేశ్వరి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పంటమార్పిడిపై దృష్టి సారించాలి గోపాల్పేట: రైతులు పంటమార్పిడిపై దృష్టి సారించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు పొందడంతో పాటు లాభాలు గడించే అవకాశం ఉందని పాలెం వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. కవిత తెలిపారు. సోమవారం మండలంలోని మున్ననూరు, గోపాల్పేట, ఏదుట్ల, బుద్దారం గ్రామాల్లోని రైతువేదికల్లో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. బుద్దారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాంప్రకాశ్, దివ్య, చైతన్య పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడులపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు చేయించి ఫలితాల ఆధారంగా నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. యూరియా వినియోగాన్ని తగ్గించడం, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నేల సారాన్ని పెంచేందుకు పప్పుదినుసుల పంటలకు మారడం వంటి వాటి గురించి తెలియజేశారు. ఏదులలో మండల వ్యవసాయ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. భూమిని సంరక్షించడం, ఆరుతడి పంటల సాగు, జీలుగ, పిల్లి పెసర, పచ్చిరొట్ట సాగు, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం భూసార పరీక్ష ఫలితాల కార్డులను రైతులకు అందించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి: యాసంగి సీజన్కు సంబంధించిన వరి కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణాశాఖ అధికారులు, ఏపీఎంలతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గతేడాది యాసంగిలో ఈ సమయం వరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని, ఎందుకు ఆలస్యమవుతోందని ఏపీఎంల వారీగా అడిగి తెలుసుకున్నారు. లారీలు కేంద్రాలకు రావడం లేదని ఏపీఎంలు తెలుపగా.. అక్కడే ఉన్న రవాణా కాంట్రాక్టర్ వెంకటస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 వాహనాలు సమకూరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఎక్కడున్నాయని ప్రశ్నించారు. 20 వాహనాలు ఉన్నాయని.. మిగిలినవి వెంటనే పంపిస్తానని చెప్పగా మొత్తం వాహనాలు క్షేత్రస్థాయిలో కనిపించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి మిల్లుకు తరలించాలన్నారు. ధాన్యం లారీల్లో చేర్చిన వెంటనే ట్రక్షీట్ తీసుకొని ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని కోరారు. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోకుండా అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడిసిందనే వార్త రాకూడదని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, డీటీఓ మానస, డీసీఓ బి.రాణి, మార్కెటింగ్ అధికారి స్వ రణ్సింగ్, పౌరసరఫరాల సంస్థ డీఎం, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. మరో ఐదురోజులే గడువు.. జనగణన–2027లో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే నెల 10వ తేదీ వరకు స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కొనసాగుతుందని.. జిల్లాలోని అన్ని కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్శాఖ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మీడియా ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు, ప్రతి కుటుంబం నుంచి కుటుంబ యజమాని ఆన్లైన్లో స్వీయ జనగణన చేసుకోవాలన్నారు. స్మార్ట్ఫోన్లో చాలా సులువుగా ఫారం నింపవచ్చని, కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుందని చెప్పారు. httpr://re.cenrur.gov.in లో లాగిన్ కావాలని.. పూర్తయిన తర్వాత వచ్చిన గుర్తింపు సంఖ్యను మే నెల 11 నుంచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. తుది గడువు మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. జిల్లాలోని అందరు కుటుంబ యజమానులు స్వీయ జనగణన పూర్తి చేసుకొని గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. కార్యక్రమంలో జనగణన జాయింట్ డైరెక్టర్ బి.లాజర్, జిల్లా సెన్సెస్ నోడల్ అధికారి సుల్తాన్ అలీ, సీపీఓ హరికృష్ణ, డీపీఓ రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని బండపల్లి, బహుదూర్గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకొస్తే తూకం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించాలన్నారు. సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అంతకుముందు బండపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు బాలీశ్వరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు హుస్సేనమ్మ, రమాదేవి, ఐకేపీ సిబ్బంది, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మరమ్మతు
జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు ● తాజాగా 42 ఇనుప రోపులపునరుద్ధరణ ● ఇదివరకే 10 రోపులకు కొనసాగుతున్న పనులు ● ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు 62 రేడియల్ క్రస్టు గేట్లు జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 రేడియల్ క్రస్టు గేట్లు ఉన్నాయి. ఇందులో 4, 8, 12, 19, 21, 25, 27, 31, 41, 45, 51 గేట్ల రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడినట్లు 2019లోనే అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి మరమ్మతులపై ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాలకు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపులు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపు లు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇను ప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏ ర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రా ష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మ తు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్లో ఉంచారు. మరమ్మత్తులు పూర్తిచేస్తాం.... జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ -
చిరు వ్యాపారులకు ఊరట
వనపర్తిటౌన్: స్థానిక పుర పాలకవర్గం తైబజార్ వ్యవస్థను రద్దు చేసి చిరు వ్యాపారులకు భారీ ఊరట కల్పించింది. ఈ నెల 2న జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రహదా రులకు ఇరువైపులా, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతంలో చిరు వ్యాపారులందరూ రోజువారీగా తైబజార్ పేరిట నిర్దేశిత రుసుం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు చెల్లించే వారు. రోజు రూ.100 నుంచి రూ.2 వేల వరకు సంపాదించే ఆయా వ్యాపారాలు ప్రాధాన్యతను బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు చెల్లించేవారు. కొందరు సరిగా వ్యాపారం నడవకపోయినా, అరకొరగా సాగినా డబ్బులు మాత్రం తప్పనిసరిగా చెల్లించేవారు. 18 నెలల కిందటే కాంట్రాక్టర్ గడువు ముగియడంతో పుర సిబ్బందే వసూలు చేస్తున్నారు. సేకరించిన నిధులతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న తైబజార్ వేలం పాట డబ్బుల గోల్మాల్పై పాలకవర్గ సభ్యులు అధికారుల తీరును తప్పుబడుతూ కౌన్సిల్ సమావేశంలో అంశాన్ని లేవనెత్తడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ నెల 2న జరిగిన సమావేశంలో తైబజార్ను రద్దు చేస్తున్నట్లు తీర్మానించడంతో చిరు వ్యాపారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పురపాలికలో 300 మంది.. పట్టణ పరిధిలో 300 మంది వరకు చిరు వ్యాపారులు తైబజార్ చెల్లించే వారని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆదివారం సంత రోజుతో పాటు పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య వెయ్యి వరకు చేరుకుంటుందని అంచనా. పాలకవర్గ నిర్ణయంతో స్థానిక వ్యాపారులకేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునే వారికి సైతం మేలు చేకూరుతుంది. తైబజార్ వేలం ద్వారా పురపాలికకు ఏటా సుమారు రూ.18 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఆ ఆదాయాన్ని పురపాలిక కోల్పోయినట్లు అయింది. వాహన పన్నుపై స్పష్టత కరువు.. పట్టణంలోకి వచ్చే వివిధ వ్యాపార, సేవా, వాణిజ్య ప్రకటనల వాహనాలు, పార్సిల్, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఎలాంటి మినహాయింపు లేదని.. పన్ను వసూలు చేయాలని కౌన్సిల్లో నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు పన్ను వసూళ్లపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఏయే వాహనానికి ఎంత వసూలు చేయాలనే దానిపై నేటికీ విధివిధానాలను అధికార యంత్రాంగం ఖరారు చేయకపోవడంతో పురపాలికకు వచ్చే అరకొర ఆదాయం కూడా రాకుండా పోతోంది. వనపర్తి పురపాలికలో తైబజార్ రద్దు వాహనాల పన్ను వసూళ్లపై స్పష్టత కరువు ఈ నెల 2న కౌన్సిల్లో తీర్మానించిన సభ్యులు కష్టాలు చూడలేకే.. చిరు వ్యాపారుల కష్టాలు చూడలేకే ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవ, కౌన్సిల్ సభ్యుల అంగీకారంతో తైబజార్ రద్దు చేశాం. మేము తీసుకున్న నిర్ణయం వనపర్తి చరిత్రలో చారిత్రాత్మకం. చిరు వ్యాపారి రోజు రూ.10 నుంచి రూ.50 వరకు తైబజార్ చెల్లించేవారు. మా నిర్ణయంతో ప్రతి నెల రూ.300 నుంచి రూ.1,500 వరకు ఆదా చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం. – ఎం.మాధవి, చైర్పర్సన్, వనపర్తి పురపాలిక -
ప్రశాంతంగా ‘నీట్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. రేపు రైతు సదస్సు కొల్లాపూర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న కొల్లాపూర్లోని మహెబూబ్ ఫంక్షన్హాల్లో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉద్యానశాఖ డివిజనల్ అధికారి లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు పెరిగిన నేపథ్యంలో సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు సదస్సులో తగు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే సదస్సుకు కేవీకే పాలెం శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
3 చోట్ల శిక్షణ తరగతులు
జిల్లాలోని చిన్నంబావి, శ్రీరంగాపురం, వనపర్తి, అమరచింత మండలాల్లోని కేజీబీవీల నుంచి ఒకొక్క సబ్జెట్ నుంచి 10 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. అమరచింత కేజీబీవీని నీట్ శిక్షణ కోసం ఎంపిక చేయగా.. ఐఐటీ శిక్షణ కోసం వనపర్తి కేజీబీవీ, క్లాట్ శిక్షణ కోసం గోపాల్పేట కేజీబీవీని ఎంపిక చేసి తరగతులు ప్రారంభించారు. నీట్ శిక్షణకు వచ్చిన విద్యార్థినులకు రోజువారీగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాలపై గంటన్నర పాటు శిక్షణ ఇస్తున్నారు. అమరచింత కేజీబీవీలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థినులు -
బాధిత కుటుంబాలకు బాసట
మరికల్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) అమలు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు తహసీల్దార్ పరిధిలో ఉన్న ఈ పథకం బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులు ఇప్పటి నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇస్తే విచారణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ వేగవంతం కానుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటుచేసుకునేది. ప్రస్తుతం లబ్ధిపొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్ధిష్ట గడువు కూడా విధించటంతో దరఖాస్తులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. పది రోజుల్లో పరిశీలన బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో అధికారులు విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో క్షేత్ర స్థాయి విచారణ లో జాప్యం చోటు చేసుకునేది. సమస్యను గుర్తించి న ప్రభుత్వం తాజా మార్పునకు నిర్ణయించటంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రూ. 20 వేల చొప్పున.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. 2017, ఏప్రిల్ 13 తర్వాత మరిణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎన్ఎఫ్బీఎస్ అమలు ఎంపీడీఓ చేతుల్లోకి.. కుటుంబ పెద్ద చనిపోతే రూ.20 వేల సాయం అర్హులు సద్వినియోగం చేసుకోవాలి జత చేయాల్సిన పత్రాలు ఆహార భద్రత కార్డు మృతుడి ఆధార్ కార్డు మరణ ధ్రువీకరణ పత్రం మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం ఆదాయ ద్రువీకరణ పత్రం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా పుస్తకం వీటన్నింటిని జతచేసి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ పత్రాలను స్థానిక సంస్థల కార్యాలయాల్లో అందించాలి. -
శిక్షణ అదుర్స్
నీట్, ఐఐటీ, క్లాట్ పరీక్షలకు ప్రత్యేక తరగతులు ● జిల్లాలో 4 కేజీబీవీల నుంచి.. ● ప్రతి సబ్జెట్కు 40 మంది విద్యార్థులు ఎంపిక ● ప్రభుత్వ నిర్ణయం కేజీబీవీ విద్యార్థినులకు వరం శిక్షణ బాగుంది ప్రస్తుతం అమరచింతలోని కేజీబీవీలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. నీట్ శిక్షణకు ఎంపియ్యా. నాకు డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చదువుకుంటున్న పాఠశాలలోనే నీట్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. రోజువారీగా తరగతుల నిర్వహణతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించి, ప్రోత్సహిస్తున్నారు. – దివ్యశ్రీ, కేజీబీవీ అమరచింత క్లాట్లో శిక్షణ పొందుతున్నా.. నేను సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. ప్రభుత్వం కేజీబీవీల వి ద్యార్థునుల కోసం పోటీ పరీక్షలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తుండటంతో క్లాట్పై శిక్షణ పొందడానికి గోపాల్పేట కేజీబీవీకి వచ్చా. విషయాల వారీగా బోధనతో పాటు సౌకర్యాలు బాగున్నాయి. – భవ్యశ్రీ, కేజీబీవీ, గోపాల్పేట నీట్లో ర్యాంకు సాధిస్తా.. అమరచింత కేజీబీవీలో నీట్పై శిక్షణ ఇస్తున్నారని ఎస్ఓ చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. రోజువారి తరగతుల నిర్వహణ తీరు బాగుంది. సబ్జెక్టుల్లో అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేస్తున్నారు. మొదటి సారిగా ఇస్తున్న శిక్షణను ప్రేరణగా తీసుకుని వచ్చే సంవత్సరం మరింతగా రాణించి నీట్లో మంచి ర్యాంకు సాధిస్తా. – పల్లవి, కేజీబీవీ వనపర్తి డాక్టర్ కావాలనేది కల.. నీట్ శిక్షణపై పట్టు సాధించి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించేందుకు శిక్షణ తోడ్పడనుంది. తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడికి శిక్షణకు వచ్చా. వసతులతో పాటు అవగాహన ఉన్న సీఆర్టీల ద్వారా శిక్షణ ఇప్పించడం బాగుంది. డాక్టర్ కావాలనే కల నేర్చుకుంటాను. – పూజ, బైపీసీ, చిన్నంబావి రోజు వారీగా.. జిల్లాలోని 4 కేజీబీల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు మూడు కేజీబీవీల్లో ఒకొక్క పోటీ పరీక్షపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు ఆయా కేజీబీవీలకు వెళ్లి విద్యార్థినులకు అందుతున్న బోధన గురించి ఆరా తీస్తున్నాం. వచ్చే ఏడాది వరకు ఆయా సబ్జెట్ల్లో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి అనుకున్న ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. – శుభలక్ష్మి..జీసీడీఓ అమరచింత: కేజీబీవీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు నీట్, ఐఐటీ, క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లాలోని 4 కేజీబీవీలను ఎంపిక చేసి ప్రతి కేజీబీవీ నుంచి టాప్ టెన్లో ఉన్న 10 మంది విద్యార్థి నులను ఎంపిక చేస్తూ.. వేసవి సెలవులు వృథా కాకుండా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులను కల్పించి ఆయా సబ్జెట్లపై పట్టున్న సీఆర్టీల ద్వారా రోజువారి తరగతులను బోధించే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షణతో పాటు జిల్లా విద్యాధికారుల తనిఖీలు, జీసీడీఓ ఆకస్మిక తనిఖీలతో నాణ్యతతో కూడిన బోధన అందించడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షలపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి ప్రయత్నం.. కేజీబీవీలో ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ, ఈసీటీ చదువుతున్న వారికి నీట్, క్లాట్, ఐఐటీ పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తొలి ప్రయత్నంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు లైబ్రరీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధిచిన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లైబ్రరీ స్టడీకి అవకాశం కల్పిస్తున్నారు. -
ధాన్యం.. దైన్యం
● గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఇబ్బందులు ఇవే.. ● ఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ధాన్యం వద్దనే పడిగాపులు.. నాకున్న ఎనిమిదెకరాల్లో వరిని సాగుచేసి.. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాను. లారీలు రావడం లేదని ఏవేవో కారణాలు చెబుతూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎప్పుడు అకాల వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతుందోనని భయంతో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – వెంకటన్న, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ఇంకా కొనడం లేదు.. నేను ఈసారి మూడెకరాల్లో వరిసాగు చేశా. పంట కోసి వారం రోజులైంది. గ్రామంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అధికారులు త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల భయంతో ఆందోళన చెందుతున్నాం. వానలో ధాన్యం తడిస్తే చేసిన కష్టం నీళ్లపాలవుతుంది. తేమశాతం లేని ధాన్యాన్ని వెంటనే కొనేందుకు చర్యలు తీసుకోవాలి. – చంద్రారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం ●ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. సన్నాలకే మొగ్గు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ● దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది. ● గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు.. ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది. -
దోపిడీకి ముగింపేది?
బహిరంగ మార్కెట్లో తరుగు, కమీషన్ పేరుతో మామిడి రైతులు విలవిల ● నెలక్రితం టన్నుకు రూ.1.50 లక్షలు, నేడు రూ.30 వేలే ● రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించని వ్యాపారులు ● ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలోకి.. ● జిల్లాలో 17 వేల ఎకరాల్లో సాగు రూ.60 లక్షలు వెచ్చించి వివిధ గ్రామాల్లో 10 తోటలు కౌలుకు తీసుకున్నా. ఇప్పటికీ మామిడి కాయలు విక్రయిస్తే రూ.15 లక్షలు కూడా రాలే. మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో 5 టన్నుల కాయలు నేలరాలగా వాటిని విక్రయిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా సరిపోలే. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, దళారుల దోపిడీని అరికట్టాలి. – పెబ్బేటి మహేష్, మామిడి కౌలు రైతు, వీపనగండ్ల ప్రతి ఏటా మామిడి రైతులు కొనుగోలుదారుల చేతుల్లో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. – దొడ్ల కవిత, సర్పంచ్, గోపల్దిన్నె నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి మా మిడి కాయలు కొనుగోలు చేసి ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయిస్తాం. – విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, వనపర్తి వీపనగండ్ల: ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల నిలువు దోపిడీ వెరిసి మామిడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అరివి అన్న చందంగా మారింది వారి పరిస్థితి. మామిడి చెట్లకు వేసే ఎరువులు, పూత దశలో పిచికారీ చేసే రసాయనిక మందులకు రూ.వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు అవుతుంది. తీరా పంట దిగుబడి వచ్చాక మామిడి కాయలు అమ్ముదామని పోతే బహిరంగ మార్కెట్లో దళారులు తరుగు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలడంతో దిగుబడి దారుణంగా పడిపోయింది. మిగిలిన పంటను అయినా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. స్పందించాల్సిన ఉద్యాన శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం జిల్లాలో పెబ్బేరు, కడుకుంట్ల గ్రామాల వద్ద కొందరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీపనగండ్ల మండలంలో మండల మహిళా సమైక్య ద్వారా మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభించి కాయ సైజు 250 గ్రాముల నుంచి 450 గ్రాముల మధ్యే ఉండాలన్న నిబంధనను విధించి, రోజు రెండు టన్నుల కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కవర్ కట్టిన కాయలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ నిబంధనలను పాటించడం లేదు. 4 శాతం తరుగు తీయాల్సి ఉండగా.. హమాలీ తరుగు, కాయలు నాణ్యతగా లేవని సాకు చూపి 18 శాతం తరుగును తీస్తున్నారు. నెల క్రితం టన్ను కాయలు రూ.1.50 లక్షలు పలకగా నేడు టన్నుకు రూ.30 చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలం రైతులు ఎకరాల్లో.. అమరచింత 101 449 ఆత్మకూర్ 240 769 కొత్తకోట 244 592 మదనాపురం 96 284 చిన్నంబావి 1,099 2,410 పాన్గల్ 1,081 1,980 వీపనగండ్ల 2,389 5,406 ఖిల్లాఘనపురం 193 421 గోపాల్పేట 292 675 పెబ్బేరు 515 1,319 పెద్దమందడి 210 562 రేవల్లి 150 344 శ్రీరంగాపురం 310 648 వనపర్తి 456 963 ఏదుల 381 748 మొత్తం 7,757 17,576 -
‘కాంగ్రెస్ రైతుల ఉసురు తీస్తోంది’
ఆత్మకూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. శనివారం గాంధీచౌక్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులు రాజులుగా బతికారని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేశామని గుర్తుచేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా లారీలు రావడం లేదని, గన్నీ బ్యాగులు లేవనే సాకుతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన అరకొర పంటను కాపాడుకుని కేంద్రానికి తీసుకువస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఽశంకుస్థాపనలకే పరిమితం ఆత్మకూర్ మండలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి, కాంగ్రెస్ నాయకులు ఆ అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందనే విషయం మరవొద్దని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులు సైతం ప్రారంభించలేదని, ఈ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, లక్ష్మీకాంత్రెడ్డి, కోటేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అనుచరులతోనే..
కొనుగోలు కేంద్రాల్లో వేలం సమయంలో గుత్తేదారు తన అనుచరులనే నలుగురిని నియమించుకొని వేలం పాడుతున్నట్లు నటించి తను అనుకున్నట్లుగా రైతులకు తక్కువ రేటు చెల్లిస్తున్నాడు. రశీదు కూడా ఇవ్వరు. నగదు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నారు. చీడపీడల నివారణ, కాయలు తెంపేందుకు కూలీల రేట్లు, ట్రాన్స్పోర్ట్, తరుగు మొత్తంగా ఎకరాకు రూ.80 వేలు ఖర్చు వస్తే విక్రయించిన తర్వాత రూ.20 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వీపనగండ్లలో కాయల నాణ్యతను చూపిస్తున్న రైతులు -
‘ఉపాధి’ పనులకు కూలీల సంఖ్య పెంచాలి
ఖిల్లాఘనపురం: ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచేందుకు మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం ఖిల్లాఘనపురం వచ్చిన ఆమె సర్పంచు పద్మమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, పంచాయతీ కార్యదర్శి రవికుమార్తో మాట్లాడుతూ.. వివరాలు సేకరించారు. మండల వ్యాప్తంగా గతేడాదితో పోల్చితే కూలీల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతేడాది ఈ సమయంలో 2 వేల మంది కూలీలు మండలంలో పనికి హాజరైతే.. ఇప్పుడు ఆ సంఖ్య 1,150 పడిపోయిందన్నారు. జిల్లావ్యాప్తంగా మే నెలలో 1.23 లక్షల మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా కేవలం 12 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారని తెలిపారు. పనులు చేసిన కూలీలందరికీ ఏప్రిల్ 15 నాటికి కూలి డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసిందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా ప్రజాప్రతినిధులు చొరువ తీసుకోవాలని సూచించారు. రైతులు ఎవరైనా అర ఎకరం వరకు మునగ పంట సాగు చేస్తే ఉపాధి పథకం ద్వారా సహకారం అందిస్తామని పేర్కొ న్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తు న్న మహిళా సంఘం భవనం, దివ్యాంగుల భవనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో నాయ కులు ఆగారం ప్రకాష్, నాగేష్ పాల్గొన్నారు -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మదనాపురం: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వేగంగా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వినోద్కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మదనాపురంలో ఐకేపీ సెంటర్తో పాటు అజ్జకొల్లు, రామన్పాడు, దుప్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు వెంటనే సేకరించాలని సూచించారు. తూకాల్లో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్ణీత బరువు కంటే అదనంగా తూకం వేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరగా మిల్లులకు తరలించాలి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా మిల్లులకు తరలించి, కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ఏపీఎం రాంబాబు, తహసీల్దార్ రేపోలు రాజు, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5లోగా అక్రిడిటేషన్కు దరఖాస్తు చేసుకోవాలి వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డు జారీ చేసేందుకు వీలుగా జిల్లాలోని జర్నలిస్టులు మే 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి.సీతారాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తప్పా మిగిలిన జర్నలిస్టులు యాజమాన్యాల సిఫారస్ లెటర్, సర్క్యూలేషన్, అనుభవ పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, కాపీ డీపీఆర్ఓ కార్యాలయంలో అందించాలన్నారు. జర్నలిస్టు ప్రస్తుత హోదానే ఆన్లైన్లో నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున జర్నలిస్టులు జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే సడ్మిట్ చేసిన దరఖాస్తుల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు మే 5 లోపు డీపీఆర్ఓకు నేరుగా ఫోన్ చేసి తన దరఖాస్తును డిలీట్ చేయించుకొని తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 5 వరకు వచ్చే దరఖాస్తులను మాత్రమే కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే తదుపరి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి, అర్హులైన జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. -
సంఘర్షణ నిర్మూలన కోసం..
● మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు ● మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు ● పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
‘రోడ్ల ఆక్రమణను అందరూ ఖండించాలి’
వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని, మున్సిపల్ పాలక వర్గ సభ్యులందరూ సహకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతను మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ అధికారులకు క్రమశిక్షణ కొరవడిందని, కనీసం ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వడం లేదని కౌన్సిలర్లు పితాంబర్, గంధం మదన్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధికి సంబంధించి ఫొటోలతో కూడిన సమాచారం అందిస్తేనే కౌన్సిల్ బిల్లులు ఆమోదిస్తుందని కౌన్సిలర్ పాకనాటి కృష్ణ స్పష్టం చేశారు. విలీన గ్రామాలకు జనరల్ ఫండ్ నిధులు కేటాయించొద్దనడం సరికాదని కౌన్సిలర్లు శరవంద, ముడావత్ శంకరమ్మ అన్నారు. చైర్పర్సన్ భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై కౌన్సిలర్ ధనలక్ష్మి అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ దుకాణాలకు సంబంధించి పన్నులపై సీపీఎం సభ్యుడు గంధం మదన్ ప్రశ్నించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్లు కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషితోనే ఆస్తి పన్నుపై రాయితీ లభించిందని బీఆర్ఎస్ సభ్యుడు శ్రీకర్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
పీహెచ్సీలకు పైసల్లేవ్..!
పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పీహెచ్సీకి హెచ్డీఎఫ్ (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్సీల వైపు చూడటం లేదు. చివరగా 2023 మార్చిలో.. మహబూబ్నగర్ జిల్లాలోని 17 పీహెచ్సీలు, ఆరు యూపీహెచ్సీలకు, మూడు సీహెచ్సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్ పీహెచ్సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు. గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్ రాలేదు. వనపర్తి జిల్లాలో కేవలం హెచ్డీఎస్ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు. నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్సీలు ఉండగా 2023 అక్టోబర్ నుంచి హెచ్డీఎస్ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. అవసరాలు తీరేదెలా? బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్గ్రూప్ టెస్ట్ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటే తప్పక ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6 వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. గత మూడేళ్లుగా విడుదల కాని హెచ్డీఎస్, కాయకల్ప బడ్జెట్ నిర్వహణకు సైతం అవస్థలు.. పేరుకుపోతున్న సమస్యలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా కనికరించని ప్రభుత్వం నెట్ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు. ఇటీవలే ప్రభుత్వానికి బడ్జెట్ విషయంపై పలుమార్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతమైతే కలెక్టర్ దగ్గర అదనపు నిధులు తీసుకున్నాం. వాటిలో నుంచి పీహెచ్సీల నిర్వహణ కోసం కొంత ఖర్చు చేస్తున్నాం. చిన్నపాటి నిర్వహణ ఖర్చులు మెడికల్ ఆఫీసర్లు భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు త్వరలో వస్తాయని అనుకుంటున్నాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి ప్రస్తుతం పీహెచ్సీలకు నిధుల కొరత ఇబ్బంది ఉంది. హెచ్డీఎస్, కాయకల్ప నుంచి రావాల్సిన బడ్జెట్ సకాలంలో రావడం లేదు. ప్రస్తుతం సీఎస్ఆర్ నిధులతోపాటు ఇతర చోట్ల వచ్చేవాటిని సర్దుబాటు చేస్తున్నాం. త్వరలో ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు నిర్వహణలో సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ, మహబూబ్నగర్ -
కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి
కొనుగోళ్ల ప్రారంభ దశలో కొంత సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమే. జిల్లాలోని 36 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు నిర్ణయించాం. గతంలో సీఎమ్మార్ పూర్తి చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ధాన్యం పంపిస్తున్నాం. ప్రస్తుతం కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. ట్రాన్స్పోర్ట్ సమస్య వనపర్తి జిల్లాలో లేదు. దొడ్డు రకాలను దించుకునేందుకు ముందుకు వచ్చిన మిల్లర్లకే సన్నాలు ఇస్తున్నాం. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ, వనపర్తి ● -
3నెలలకోసారి ఉద్యోగ మేళాలు
● రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ● ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రతి కార్మికుడిని గౌరవించాలి’
వనపర్తి: కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడిని గౌరవించాల్సి అవసరం ఉందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కార్మికులను, ఉపాధి హామీ పథకంలో జిల్లాలోనే అత్యధిక పని దినాలు సద్వినియోగం చేసుకున్న కార్మికురాలు విజయమ్మ సన్మానించారు. అలాగే ఐటీఐ విద్యార్థులకు ప్రతిభా పురస్కార పత్రాలు అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూల స్తంభమని కొనియాడారు. కార్మికులే ప్రగతి చక్రాలు కార్మికులే సమాజ ప్రగతి చక్రాలని, నిరంతరం వారు కష్టపడి చేయడం వల్లే అందరి అవసరాలు తీరుతున్నాయని డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. ప్రతి వ్యక్తి తను పనిలో నిబద్ధతతో ఉంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కార్మికులకు గౌరవించడం, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటీఐ కళాశాలకు సంబంధించిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులకు సంబంధించిన పోస్టర్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై, కార్మికులకు కల్పించే పథకాలపై రూపొందించిన బుక్లెట్ను అధికారులు ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన ఏబీడీ లిక్కర్ పరిశ్రమలో 1,600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, యాజమాన్యం తరఫున హాజరైన రీజనల్ మేనేజర్ ఉమాశంకర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్మిక శాఖ అధికారి రవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ హక్, ఐటిఐ విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘పోలీసుల ప్రతిష్టను పెంచేలా పనిచేయాలి’
వనపర్తి: పోలీస్ సిబ్బంది తమ ప్రతిష్టను పెంచేలా, క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా సూచించారు. సాయుధ దళ పోలీసు కార్యాలయాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి, కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్, స్పోర్ట్స్ విభాగం, బాంబ్ డిస్పోజల్ టీం, మోటార్ వాహనాల విభాగాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి, నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ, సామగ్రి వినియోగం, వాహనాల స్థితిగతులను సమీక్షిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని, శాఖ ప్రతిష్టను దష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖ ప్రతిష్ట సిబ్బంది క్రమశిక్షణ, పనితీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా -
కార్మికుల సంక్షేమ కాంగ్రెస్ అజెండా
వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్మే మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆర్టీసీ విస్తరణపై వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఎంతో మంది మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం త్వరగా పరిష్కరించి, పీఆర్సీ పెంచిందని, మిగతా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో కండక్టర్లు, డ్రైవర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు ఎమ్మెల్యేకు డీఎం దేవేందర్గౌడ్కు మొక్క అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్టీసీ అధికారులు, కౌన్సిలర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుతో సుస్థిర ఆదాయం గోపాల్పేట: ఆయిల్పాం మొక్కలు ఒకసారి నాటితే మూడేళ్ల తర్వాత కాపు ప్రారంభమై 30 ఏళ్ల పాటు నిరంతరం ఆదాయం అందిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక నీటివసతి, ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు ఆయిల్పాం తోటలు వెంటనే సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే గెలలు అమ్ముకునేందుకు ఫ్యాక్టరీల విషయంలో, డబ్బుల విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రస్తుతం గోపాల్పేట మండలంలో 320 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు పెంచుతున్నారని, భవిష్యత్లో మరింత విస్తరించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారిణి కరుణశ్రీ, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా విద్యా వారోత్సవాల నిర్వహణ
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల 11 నుంచి విద్యా వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాట, పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు రెమెడియల్ తరగతులు నిర్వహించేందుకు, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా సర్పంచులు, వార్డుసభ్యులు, కౌన్సిలర్లు అందరికీ నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం పుర పరిధిలోని హౌసింగ్బోర్డు కాలనీ, నర్సింగాయపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులను పుర కమిషనర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని నర్సరీని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కొత్తకోట రూరల్: ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. గురువారం పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పౌరహక్కుల దినంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మనిగిళ్ల, చిన్నమందడి, వెల్టూర్, పెద్దమందడిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీశారు. సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా కొనసాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని సూచించారు. పెట్రోల్బంక్ల తనిఖీ.. మండలంలోని కనిమెట్ట, పెద్దమందడి మండలం వెల్టూరులోని పెట్రోల్బంకును గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరా నిరంతరం కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, ఇతర అధికారులు ఉన్నారు. -
క్రీడాశిక్షణకు వేళాయె..
●జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 17 క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మే నెల చివరి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా ఉండవచ్చు. శిక్షకులకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ అమరచింత: వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కల్పిస్తూ నచ్చిన క్రీడను పరిచయం చేస్తూ తర్పీదునిచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి నెలరోజుల పాటు వివిధ క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కొన్ని మండలాల్లో క్రీడా శిబిరాలు ప్రారంభం కాగా.. మిగిలిన ప్రాంతాల్లో మరో రెండ్రోజుల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. శిక్షకులకు ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించనుంది. శిబిరాలకు వచ్చే 14 ఏళ్లలోపు బాలలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వేసవి సెలవులు పూర్తయే వరకు విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లావ్యాప్తంగా 17 ప్రాంతాలు ఎంపిక చేశారు. జిల్లాకేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో 7, మిగిలిన శిబిరాలు మండలాల్లో నిర్వహించనున్నారు. మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన శిక్షకుల దరఖాస్తులను పరిశీలించి వాటి ఆధారంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడాసామగ్రి పంపిణీ.. శిక్షణకు హాజరయ్యే క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడాసామగ్రి అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి సుధీర్రెడ్డి తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్లకు జిల్లాకేంద్రంలో పంపిణీ చేశారు. శిక్షణకు వచ్చే క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుంటూ కోచ్ల వద్ద భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. శిబిరాలకు ప్రథమ చికిత్స కిట్లు అందించేందుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయి. కేంద్రం క్రీడ శిక్షకుడు శ్రీరంగాపురం కబడ్డీ ప్రవీణ్ ఆత్మకూర్ వాలీబాల్ అబ్దుల్ ఖదీర్ ఖిల్లాఘనపురం అథ్లెటిక్స్ దేవేందర్ గోపాల్పేట ఫుట్బాల్ సందీప్ ఏదుల ఫుట్బాల్ రవీందర్ వనపర్తి ఫుట్బాల్ ప్రవీణ్ చిన్నమందడి వాలీబాల్ రమేశ్ పెద్దమందడి వాలీబాల్ మన్యం యాదవ్ పాన్గల్ వాలీబాల్ శ్యామల (బాలికలు) కల్వరాల, వీపనగండ్ల వాలీబాల్ శ్రీకాంత్ పెద్దగూడెం, వనపర్తి వాలీబాల్ శేఖర్ పెబ్బేరు–1 ఫుట్బాల్ నాగరాజు పెబ్బేరు–2 ఫుట్బాల్ శంకర్ సోలీపూర్ హాకీ మన్యం యాదవ్ కడుకుంట్ల, వనపర్తి హాకీ నిరంజన్గౌడ్ వనపర్తి హకీ జావేద్, సాగర్ చిట్యాల, వనపర్తి కిక్బాక్సింగ్ వరుణ్కుమార్ 30 రోజుల శిక్షణతో క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం లభిస్తుంది. వేసవి సెలవులు వృథా చేయకుండా ఆసక్తి గల విద్యార్థులకు రోజు ఉదయం 8 వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు క్రీడల్లో శిక్షణనిస్తారు. జిల్లాలో 17 వేసవి శిబిరాలు 14 ఏళ్లలోపు చిన్నారులకు అవకాశం 30 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు -
డిపో అభివృద్ధికి కృషి చేయాలి
వనపర్తి టౌన్: తోటి ఉద్యోగులు ప్రతిభ కనబర్చిన వారిని ఆదర్శంగా తీసుకొని డిపో ఆదాయం పెంచాలని, రీజియన్లో డిపోను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆర్టీసీ డీఎం దేవేందర్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో గురువారం ఉత్తమ ఉద్యోగుల అభినందన కార్యక్రమం నిర్వహించి మార్చిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందించి మాట్లాడారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, డీజిల్ ఆదా, బస్సుల నిర్వహణ, జీరో బ్రేక్డౌన్ ఉన్నవారిని అభినందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్, మెయింటెనెన్స్ సిబ్బంది, సూపర్వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నారసింహ జయంత్యుత్సవాలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని శంకర్గంజ్లో ఉన్న లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వరశర్మ నేతృత్వంలో ఉదయం శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ, మూల, ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని ఆంజనేయుడు, శివుడికి సైతం విశేషంగా పూజలు చేశారు. రాత్రి స్తంభపూజ, లక్ష పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన పరమేష్ జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్–20 జట్టు ఎంపికలో పరమేష్ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, వెంకట్, అఫ్సర్, రాజేందర్, సీనియర్ క్రీడాకారులు పరమేష్ను అభినందించారు. -
భానుడి విలయతాండవం
ఉమ్మడి పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ : డీఈఓ
వనపర్తిటౌన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని.. చదువుతోనే ఎన్నో విజయాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీచేసి అనంతరం తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. బడిబాటలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో సైతం ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, బ్యాంక్ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ ● -
ప్రజాపాలనతోనే పేదలకు మేలు
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న పలువురు లబ్ధిదారుల గృహాలను సందర్శించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని, గౌరవప్రదమైన జీవనం అందించడమే ధ్యేయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ పి.అరుణ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి కృష్ణారెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
పదిలో మెరిసిన బాలికలు
● రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచిన వనపర్తి ● 106 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడైన విషయం విధితమే. జిల్లా విషయానికొస్తే గత విద్యాసంవత్సరం రాష్ట్రంలో 29వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 19వ స్థానానికి ఎగబాకడం విద్యాశాఖ అధికారులకు కాస్త సంతృప్తినిచ్చింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 89 ఉండగా.. ప్రస్తుతం 97.46 శాతానికి చేరుకోవడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే బాలికలదే పైచేయిగా కొనసాగింది. ఆశ్రమ పాఠశాలలో వందశాతం.. జిల్లాలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. బీసీ వెల్ఫేర్, ప్రైవేట్ పాఠశాలల్లో 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా విద్యాలయాల్లో 88 శాతం నుంచి 98 శాతం నుంచి వరకు ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా 7,219 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా.. 183 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 149 మంది ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది, కేజీబీవీల్లో నలుగురు, మోడల్ స్కూల్లో ముగ్గురు, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదుగురు, మైనార్టీ గురుకులాల్లో ఇద్దరు, సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ అయినట్లు అధికారులు వెల్లడించారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఒక్కరు గైర్హాజరు కావడంతో ఉత్తీర్ణత వందశాతం నమోదు కాలేదు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పెబ్బేరు మోడల్ స్కూల్ విద్యార్థిని పి.అర్షిత 577 మార్కులు, పాన్గల్ మండలం కదిరెపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని అస్నాన్ 576 మార్కులు, జిల్లాకేంద్రంలోని హరిజనవాడ పాఠశాల విద్యార్థి నజీర్ 566 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 175 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. 106 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో 97.46 శాతం ఉత్తీర్ణత నమోదు పైవ్రేట్ పాఠశాల విభాగంలో ఆత్మకూర్లోని ఎస్వీఎస్ సెంట్రల్ స్కూల్ విద్యార్థిని శ్రీనిధి 585 మార్కులు, జిల్లాకేంద్రంలోని సీవీ రామన్ పాఠశాల విద్యార్థిని సంజన 582 మార్కులు, ఆత్మకూర్లోని శ్రీవాణి పాఠశాల విద్యార్థిని దీప్తి 579 సాధించి తమదైన ముద్ర వేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 7,219 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 7,027 మంది ఉత్తీర్ణత సాఽధించారు. వీరిలో బాలురు 3,594 మంది పరీక్షలు రాయగా, 3,462 మంది ఉత్తీర్ణత సాధించగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. మరో 129 మంది ఫెయిల్ అయ్యారు. బాలికల విషయానికొస్తే 3,625 మంది పరీక్షలు రాయగా.. 3,565 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరుకాగా.. మరో 54 మంది ఫెయిల్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్ని సెక్టార్లలో బాలికల ఉత్తీర్ణత శాతమే అధికంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. -
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎస్ఐఆర్ ప్రత్యేక అధికారి చెన్నయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని పరిశీలించి నెమ్మదిగా సాగుతుండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 70 శాతం మాత్రమే పూర్తయిందని పేర్కొంటూ.. అన్ని మండలాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరికొద్ది రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ మ్యాపింగ్లో వెనుకబడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మ్యాపింగ్ శాతం గరిష్టస్థాయికి తీసుకెళ్లా లని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
బంకులు.. బారులు
పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో మంగళవారం ఉదయం వాహనదారులు జిల్లాలోని పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద బారులు తీరారు. ఆత్మకూర్, అమరచింత ఒక్కో మండలంలో మూడు బంకులు ఉండగా కేవలం ఒక్కో బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పంట కోతల సమయం కావడంతో కోత యంత్రాలు, ట్రాక్టర్ల నిర్వాహకులు డ్రమ్ములను తీసుకొచ్చి డీజిల్ పోయించుకోవడం కనిపించింది. మిగిలిన బంకుల్లో నో–స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. అమరచింతలో పోలీసుల పహారాలో ఇంధనం సరఫరా చేయడం కనిపించింది. గోపాల్పేటలోని రెండు బంకుల్లో సాయంత్రం వరకు నో–స్టాక్ బోర్డులు కనిపించాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఓ బంకుకు పెట్రోల్ రావడంతో వాహనదారులు బారులు తీరారు. చెన్నారంలో మాత్రమే డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. రేమద్దుల పెట్రోల్ బంకులో మధ్యాహ్నం వరకు పెట్రోల్ విక్రయించారు. – ఆత్మకూర్/అమరచింత/గోపాల్పేట -
ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపాలి
వనపర్తి రూరల్: ఆయిల్పాం పంటను ఒక్కసారి సాగు చేస్తే ఏళ్ల తరబడి ఆదాయం పొందవచ్చని.. రైతులు సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాణిజ్య పంటల కంటే ఆయిల్పాం సాగుకు అధిక ప్రోత్సాహం, రాయితీ అందిస్తోందని వివరించారు. మండలంలో 200 ఎకరాల్లో పంట సాగు లక్ష్యంగా నిర్ణయించిందని.. రాయితీతో పాటు అంతర పంటల సాగుకు రూ.4,200 చెల్లిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి భాస్కర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా, మండల ఉద్యాన అధికారి కృష్ణయ్య, ఏఈఓ ఆంజనేయులు, గ్రామస్తులు పరశురాం, అర్జున్ పాల్గొన్నారు. -
బాలల భద్రత అందరి బాధ్యత
వనపర్తి: బాలల భద్రత, మత్తుకు అలవాటుపడ్డ వారిలో మార్పు, యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి పారద్రోలడమే ముఖ్య ఉద్దేశమని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. బాలల భద్రత, రక్షణ.. మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు భరోసా, ఏహెచ్టీయూ షీ–టీం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లింగ సమానత్వం, సమ్మతి, సైబర్ నేరాలు, యువతలో సురక్షిత ప్రవర్తన, సమస్యలు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం తదితర వాటి గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సురక్షితంగా ఉండటం చాలా అవసరమన్నారు. సమాజంలోని మార్పులను అర్థం చేసుకొని సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలికలు, యువతులు ఏ సమస్య వచ్చినా భయపడకుండా వెంటనే పోలీసులు లేదా షీ–టీమ్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో హెచ్టీయూ ఎస్ఐ అంజద్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ శిరీష, షీ–టీం సిబ్బంది, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో వెబెక్స్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం సేకరించాలని, రైతులు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించాలని, సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు, హమాలీలకు తాగునీరు, నీడ వసతి కల్పించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సమకూర్చుకోవాలని సూచించారు. రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు, గోదాంకు తరలించాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి కావాలని సూచించారు. ఇంధన కొరత లేకుండా చర్యలు.. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరం కొనసాగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఆర్డీఓ సుబ్రమణ్యంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఇంధన అవుట్లెట్ డీలర్లు, ఎస్ఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలు, రవాణా, అత్యవసర సేవలకు ఇంధన కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే బంకుల్లో తగినంత నిల్వలు ఉండేలా పర్యవేక్షణ చేయాలని, రోజువారీ విక్రయాలు, నిల్వలపై సమగ్రంగా పరిశీలించాలని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీ పంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీప ంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్యువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
పల్లె దవాఖానాపై పట్టింపేది
పేదలకు అందని వైద్యసేవలు ● కొన్ని కేంద్రాలు డిప్యుటేషన్తో మూత.. మరికొన్ని వైద్యులున్నా సక్రమంగా తెరుచుకోని వైనం ● సమయపాలన పాటించని సిబ్బంది.. మధ్యాహ్నానికే మూత ● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం ●ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.. గ్రామంలోని పల్లె దవాఖానాకు వైద్యులు సక్రమంగా విధులకు రావడం లేదని కలెక్టర్, డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశాం. వైద్యులు రాక కేంద్రం మూతబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ఆర్ఐ ముందుకొచ్చి భవనం నిర్మించి వసతులు కల్పిస్తే వైద్యులు రాకపో వడం సరికాదు. జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యుడిని నియమించి కేంద్రం తెరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – రేగిచెట్టు నిరంజన్, సర్పంచ్, రేమద్దుల వైద్యులు లేక మూతబడిన కేంద్రం.. పల్లె దవాఖానాలోని ఎంఎల్హెచ్పీ వైద్యుడు డిప్యుటేషన్పై జిల్లాకేంద్రానికి వెళ్లడంతో మూతబడింది. సిబ్బంది కూడా వ్యాక్సిన్ ఉన్న బుధవారం రోజు మాత్రమే తెరిచి మిగతా రోజులు మూసి ఉంచుతున్నారు. అత్యవసర సమయంలో వైద్యసేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారులు స్పందించి డిప్యుటేషన్ రద్దుచేసి కేంద్రంలో వైద్యుడు ఉండేలా చూడాలి. – జంబులయ్య, సర్పంచ్, తెల్లరాళ్లపల్లి డిప్యుటేషన్ విషయాన్నిపరిశీలిస్తాం.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం. అలాంటివి మూతబడటానికి వీలు లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలి. కేంద్రాలకు వెళ్లని, సమయపాలన పాటించని సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఎంఎల్హెచ్పీలు డిప్యుటేషన్పై వెళ్లిన విషయాన్ని పరిశీలిస్తాం. – డా. సాయినాథ్రెడ్డి, జిల్లా వైద్యాధికారి పాన్గల్: పల్లె దవాఖానా.. కొన్నాళ్ల కిందట ఈ పేరు వినగానే ప్రభుత్వ వైద్య సేవలపై పేదలకు ఓ విశ్వాసం కలిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఈ దవాఖాల్లోనూ వైద్యులుంటారని.. నిరంతర వైద్యసేవలు అందుతాయని నమ్మారు. కానీ.. వారు విశ్వసించిన స్థాయిలో ఈ దవాఖానాల్లో వైద్యసేవలు అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఎప్పుడోస్తారో కూడా తెలియని పరిస్థితి ఉండగా.. మరికొన్ని చోట్ల సిబ్బంది కేంద్రాలను తెరిచే దిక్కే లేకుండా పోయింది. కొన్ని కేంద్రాల్లోని ఎంఎల్హెచ్పీ వైద్యులు డిప్యుటేషన్పై జిల్లాకేంద్రానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఆయా కేంద్రాలు మూతబడ్డాయి. ఉన్న కేంద్రాలకు వచ్చే ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది ఎక్కడ కూడా సమయ పాలన పాటించడం లేదు. పల్లె దవాఖానాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలనే నిబంధన ఉన్నా.. తాము వచ్చిందే సమయంగా భావించి మధ్యాహ్నానికే మూసి వెళ్తున్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు తప్పడం లేదు. నెరవేరని లక్ష్యం.. వైద్యసేవలు పల్లెలకూ విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్ లేదా బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని ఎంఎల్హెచ్పీలుగా నియమించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల పేరునే పల్లె దవాఖానాలుగా మారుస్తూ ఎంఎల్హెచ్పీ, ఒక ఏఎన్ఎం ఇక్కడ సేవలందించాలని ఆదేశించారు. కాగా క్షేత్రస్థాయిలో సిబ్బంది డిప్యుటేషన్పై వెళ్లడంతో మూడు కేంద్రాలు మూతబడ్డాయి. మరికొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తుండటంతో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె దవాఖానాలు కొనసాగాలంటే అధికారులు పర్యవేక్షణ చేస్తూ కేంద్రాలను నిర్దేశిత సమయం వరకు తెరిచి ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. ‘పాన్గల్ మండలంలో 28 జీపీలకు ఒకే పీహెచ్సీ ఉంది. ఇందులో ఇద్దరు వైద్యులు ఉండగా.. ఒకరు డిప్యుటేషన్పై కడుకుంట్ల పీహెచ్సీకి వెళ్లి ఏళ్లు గడుస్తోంది. ముగ్గురు ఎంఎల్హెచ్పీ వైద్యులు, ఒక హెల్త్ అసిస్టెంట్ డిప్యుటేషన్లపై వెళ్లడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. మరో వైద్యుడు ఫీల్డ్ విజిట్కు వెళ్తుండటంతో పేదలకు సక్రమంగా వైద్యసేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’ -
డిప్యుటేషన్తో కేంద్రాలు మూత..
పాన్గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, మాందాపూర్, చింతకుంటపల్లి, చిన్నంబావి మండలంలోని వెలుగొండ, గోపాల్పేట మండలంలోని నాగపూర్ పల్లె దవాఖానాల నుంచి ఎంఎల్హెచ్పీ వైద్యులు డిప్యుటేషన్పై వెళ్లడంతో తెరుచుకోవడం లేదు. ఈ కేంద్రాల్లోని సిబ్బంది కూడా కేవలం వ్యాక్సిన్ ఉన్న బుధవారం రోజు కొద్దిసేపు తెరిచి ఉంచుతున్నారు. రేమద్దుల, బుసిరెడ్డిపల్లిలోని దవాఖానాలు వైద్యులున్నా సక్రమంగా తెరుచుకోవడం లేదు, అన్నారంలోని దవాఖానా మాత్రం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. పల్లె దవాఖానాలు సక్రమంగా తెరవకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
వనపర్తి: మాదకద్రవ్యాల రహిత జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఎస్పీ బాలాజీనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి మే నెల రెండో తేదీ వరకు ప్రభుత్వం బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ చొరవతో జిల్లాకేంద్రంలోని బాలసదనం చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చేయించి పత్రాలతో పాటు క్రీడా సామగ్రి అందజేశామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో బాల్య వివాహాలు కట్టడి చేయడంలో పురోగతి సాధించినట్లు చెప్పారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తుకు బానిసైన వారిని మాన్పించేందుకు డి–అడిక్షన్ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పది, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలసదనం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మిషన్ వాత్సల్య దత్తతకు సంబంధించిన అడాప్షన్ హెల్ప్డెస్క్, పోస్టర్లును అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీపీఓ రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలు వేగంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 41 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ
వనపర్తి: స్థానిక డీఎస్పీగా జి.గిరిబాబు సోమవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో విధులు నిర్వహించిన ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు సేవలందించిన వెంకటేశ్వరరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్పీ గిరిబాబు మాట్లాడుతూ.. వనపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల ను కాపాడటం తన బాధ్యతన్నారు. నేరాల నియంత్రణలో రాజీ ఉండదని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ పోలీసింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందేవిధంగా పని చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని.. పోలీసు అధికారులు వారితో కలిసి పనిచేయాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం వీపనగండ్ల: క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం లభించడమేగాక క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని కల్వరాలలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాముడు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, జీహెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఈటీ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్, భాస్కర్, శివుడు, వెంకట్, గోపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: ఎఫ్ఏక్యూ నిబంధనలు పాటిస్తూ యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని కనిమెట్ట, కానాయిపల్లి, పాలెం గ్రామంతో పాటు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రైతులకు కల్పించిన వసతులు, ధాన్యం సేకరణ జరుపుతున్న తీరును పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని గుర్తించాలని, కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ కోసం టెంట్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు లేదా గోదాంకు తరలించాలన్నారు. ధాన్యం మిల్లు, గోదాంకు చేరే వరకు నిర్వాహకులదే బాధ్యతని.. కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్ఎంట్రీ చేయాలని చెప్పారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అఽ దికారి కాశీవిశ్వనాథ్, కొత్తకోట తహసీల్దార్ చాంద్పాషా, పీఏసీఎస్ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. సమన్వయంతో సర్వే పూర్తి చేయాలి.. వీపనగండ్ల: ఉద్యోగులు సమన్వయంతో హౌస్హోల్డ్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణకు ఆయన హాజరై సూచనలు, సలహాలు చేశారు. ప్రణాళికతో చేపడితేనే సర్వేను పూర్తి చేయగలమని.. అందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు తూంకుంటలో మూతబడ్డ ఇసుక రీచ్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమై ఇసుక రీచ్కు సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ గడ్డం శివకుమార్, ఆర్ఐ కురుమూర్తి, సర్వేయర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ నమోదు..
● ఏప్రిల్ 26 నుంచి మే నెల పది వరకు.. ● వివరాలు నమోదు చేసుకుంటున్న ఉద్యోగులు, ప్రజలు ● జనగణన–2007లో భాగమే ● రెండ్రోజుల్లో 490 మంది.. –8లో u●వనపర్తి: జనగణన–2027 స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మే నెల పది వరకు పౌరులు వారి కుటుంబ వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో నమోదు చేసుకునేందుకు భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం విధితమే. మొదటిరోజు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని 15 మండలాలు, ఐదు పురపాలికలను 1,139 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించారు. ఒక్కో బ్లాక్లో 700 నుంచి 800 జనాభా ఉండేలా మ్యాపింగ్ చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఇంటి నిర్మాణం, పైకప్పు, వాహనాలు, రేషన్ కార్డు తదితర 33 రకాల ప్రశ్నలకు ఆన్లైన్ పోర్టల్లో జవాబులు నమోదు చేయాల్సి ఉంటుంది. స్వీయ నమోదు సమయంలో సెల్నంబర్ ఆధారంగా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విధిగా ఇంటి లోకేషన్ను మార్క్ చేయాలి. మొదటిరోజు 182 మంది అధికారులు చేసుకోగా.. రెండోరోజు మధ్యాహ్నం వరకు సుమారు 490 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు సీపీఓ హరికృష్ణ వెల్లడించారు. జిల్లాలో ఇలా.. సిద్ధం చేసిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల మ్యాపింగ్ల ప్రకారం జనగణన ప్రక్రియ తొలి విడత ప్రారంభమవుతుంది. మే నెల 11 నుంచి అధికారులు 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకుగాను 1,139 మంది హెచ్ఎల్పీబీలు, 1,081 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమంగా భారత ప్రభుత్వం జనగణన– 2027 ప్రారంభించింది. స్వీయ నమోదు అవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలి. మొదటి దఫా ఇళ్ల గణన, జనాభా గణన 2026, మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ఏ దర్యాప్తు ప్రయోజనాల కోసం ఈ సమాచారాన్ని వినియోగించబడదు. – హరికృష్ణ, సీపీఓ, వనపర్తి 15 రోజులు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం -
ముగిసిన కో–ఆప్షన్ ఎన్నిక
ఆత్మకూర్: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. పుర కమిషనర్ చికినే శశిధర్, చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీను, కౌన్సిలర్లు పాల్గొన్నారు. క్యాటగిరి–1 నుంచి శ్రీనివాసులు, సౌజన్య గంగాధర్, క్యాటగిరి–2 నుంచి జహంగీర్, సన జహీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. దళిత సంఘాల ఆందోళన.. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలో దళిత వర్గానికి అన్యాయం జరిగిందని.. అర్హులైన వారిని సైతం విస్మరించారని దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ బైలా ప్రకారం ఎన్నిక జరగలేదని.. పట్టణంలో రెండు వేల ఓట్లున్న దళితులను విస్మరించి అవమానించారని నాయకులు రవీందర్, బుచ్చన్న, గాలిపంపు శ్రీను తదితరులు ఆరో పించారు. కలెక్టర్తో పా టు రాష్ట్రస్థాయి అధి కారులకు ఫిర్యాదు చేయ నున్నట్లు తెలిపారు. మైనార్టీల నిరసన.. 40 ఏళ్లుగా కాంగ్రెస్పార్టీలో ఉంటూ సేవలందించిన వారిని కాదని ఇటీవల వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ మైనార్టీ యువకులు నిరసన వ్యక్తం చేశారు. మైనార్టీ విభాగంలో సీనియర్ నాయకుడు మెకానిక్ షబ్బీర్ను కాదని జహంగీర్కు పదవి కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. -
మార్కెట్ ఏర్పాటుచేయాలి..
కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న వరి కోతలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి కోతలు తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్రమే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజేపీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
త్యాగానికి ప్రతీక వాసవీమాత
● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి: అహింస, ఆత్మగౌరవం, త్యాగనీరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి వాసవి కన్యకాపరమేశ్వరి మాత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్లో వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి ధర్మం, అహింస, సత్యం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని, ఆమె చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, వాసవీమాత బోధనలు అందరూ ఆచరించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వాసవీమాత జయంతి వేడుకలు సమాజంలో సత్ సంకల్పం పెంపొందించేలా ఉంటాయన్నారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సుధీర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. వనపర్తి రూరల్: ప్రజా ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మెంటెపల్లి, నాచహళ్లి, పెద్దగూడెం, పెద్దగూడెం తండా, కడుకుంట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి ,సర్పంచ్లు పుష్పలత, వాల్యానాయక్, తిరుపతయ్య, రాములు, అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఎదురుచూపులు..
‘చంద్రగఢ్’ మరమ్మతుకు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? –8లో u●చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం సంప్హౌజ్ నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్నవించడంతో నిధులు మంజూరయ్యాయి. -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
మదనాపురం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దంతనూరులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదల చిరకాల కోరిక సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. ప్రజా ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న తమను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం గ్రామంలో హమాలీ కార్మిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ నాగరాజుగౌడ్, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, మాజీ సర్పంచ్ రాజవర్ధన్రెడ్డి, కాంగ్రెస్పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటన్న, గుగ్గిళ్ల రాములు, వివిధ గ్రామాల సర్పంచులు సుజాత నాగరాజు, శ్రావణ్ కుమార్, చింతకుంట శేఖర్, అంజాద్ అలీ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాగుతో అధిక దిగుబడులు కొత్తకోట రూరల్: రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాలెం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం రాయితీపై అందజేసిన డ్రోన్ను ప్రారంభించి మాట్లాడారు. డ్రోన్తో ఎరువులు, పురుగు మందులు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్ వినియోగాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
ఇదేం శిక్షణ..!
● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు న్యూటౌన్లో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ రాజేంద్రనగర్లోని నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. గతంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ ఇచ్చిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని, సిలబస్ పూర్తి చేయలేదని, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలు కోచింగ్ సెంటర్ల యజమానులు వాటి స్థానంలో కొత్త పేర్లతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంతోపాటు హాస్టల్స్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తిలోనూ చాలా కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడం విశేషం. టెట్, డీఎస్సీ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టుకుని శిక్షణ ఇస్తుండగా.. మరికొంత మంది ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు. -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: మొదటి విడత స్వీయ జనగణన ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి హరికృష్ణతో కలిసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి వివరించారు. జిల్లాలో జనగణన–2027 ప్రక్రియ చేపట్టేందుకు 1,139 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించామన్నారు. ఒక్కో బ్లాక్లో సుమారు 700 నుంచి 800 జనాభా ఉంటుందని.. జనగణనకు జిల్లావ్యాప్తంగా 1,086 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్వైజర్లను నియమించి శిక్షణనిచ్చినట్లు చెప్పారు. మొదటి విడత స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రజలందరూ సంబంధిత వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ధాన్యం.. దైన్యం!
ఆరేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల పంపిణీ ● పొంచి ఉన్న అకాల వర్షాల ముప్పు ● ప్రైవేట్ వ్యాపారుల వద్ద అద్దెకు తీసుకుంటున్న వైనం ● ఆందోళనలో అన్నదాతలు కొత్తకోట రూరల్: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి.. కొనుగోలు కేంద్రాలు కూడా లాంఛనంగా ప్రారంభించినా ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబెట్టుకుంటున్నారు. వాతావరణంలో మార్పులతో వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతుల వద్ద టార్పాలిన్లు లేక ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50 శాతం రాయితీతో టార్పాలిన్లు రైతులకు అందజేసింది. ధర రూ.2,500 ఉంటే రూ.1,250కి విక్రయించింది. తర్వాత ఈ పథకాన్ని వ్యవసాయశాఖకే పరిమితం చేయగా.. చివరిగా 2018లో వీటిని పంపిణీ చేశారు. ఆరేళ్లుగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో కొందరు అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారుల వద్ద టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పూర్తి ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో టార్పాలిన్కు రూ.4 వేల వరకు ధర ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యాసంగిలోనైనా రాయితీపై అందివ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. అదనపు భారం.. పండించిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోనేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోదానికి రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తారు. రెండెకరాల ధాన్యానికి సుమారు 10 టార్పాలిన్లు అవసరమవుతాయి. రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత యాసంగిన 20 రోజులపైనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంచాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్కరిపై రూ.2 వేల పైనే భారం పడింది. తేమ పేరుతో కొర్రీలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు 17 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందంటూ కేంద్రాల వద్ద రోజుల తరబడి ఆరబెట్టాల్సి వస్తోందని.. అకాల వర్షాలకు ధాన్యం టార్పాలిన్లు లేక తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి రాయితీ ఇస్తున్నప్పటికీ టార్పాలిన్ల పంపిణీపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేదు.. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం అందుబాటులో ఉంచాం. సర్దుబాటు చేసుకోవాలి. రాయితీ టార్పాలిన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రకటిస్తే రైతులకు తెలియజేస్తాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట నిర్లక్ష్యం సరికాదు.. యాసంగి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాం. అనుకోకుండా వర్షం వస్తే కప్పేందుకు టార్పాలిన్లు లేవు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. – బాజ గిరన్న, రైతు, కానాయపల్లి -
రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డితో కలిసి మండలంలోని తిర్మలాయపల్లి, కమాలోద్దీన్పూర్, అంతాయపల్లి, ఆగారం, ఖిల్లాఘనపురం, సల్కెలాపురం, సూర్యతండా, అల్లమాయపల్లి, రోడ్డుమీది తండా, షాపురం, మానాజీపేట, దొంతికుంట తండా, సోళీపురం, రుక్కన్నపల్లి, ఉప్పరిపల్లి, సూరాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లిలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు మండల కేంద్రంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కేంద్రాల్లో విక్రయించడంతో మద్దతు ధర రూ.2,389 లభిస్తుందని.. అదేవిధంగా సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ అందుతుందని వివరించారు. అవసరమైన ప్రతి గ్రామంలో సింగిల్విండో, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సుగుణ, ఎంపీఓ నర్సింహయ్య, ఏపీఎం నాగరాజు, సింగిల్విండో సీఈఓ కృష్ణ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ఖిల్లాఘనపురం సర్పంచ్ ఆగారం పద్మమ్మ, నాయకులు మురళీధర్రెడ్డి, రవీందర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య యాదవ్, ఆగారం ప్రకాష్, గంజాయి రమేష్, క్యామ రాజు, డా. నరేందర్గౌడ్, బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మాసయ్యగౌడ్, నవీన్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రవినాయక్, శ్రీరాములు, దేవిజానాయక్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
ఇబ్బందులు తప్పడం లేదు..
రైతులు దేశానికి వెన్నెముక అంటారు. కానీ.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రతి విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పంట వేసిన నాటి నుంచి విక్రయించేంత వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి తీసుకొస్తే కప్పడానికి టార్పాలిన్లు లేక వర్షం ఎప్పుడొస్తుందోనని భయంగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది. – మండ్ల శాంతమూర్తి, రైతు, అజ్జకొల్లు అద్దెకు తెచ్చుకుంటున్నాం.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి వర్షానికి తడవకుండా ఉంచేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నాం. గతంలో ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్తు విక్రయించగా.. ప్రస్తుతం నిలిపివేసింది. అద్దెకు తీసుకురావడంతో అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు విక్రయించాలి. – రాజు, రైతు, కొత్తకోట ● -
చాలా మంచిది..
దవాచాయ్ తాగడం శరీరానికి చాలా మంచిది. గ్యాస్, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం ఒక్క టీ గ్లాస్ దవాచాయ్ తాగుతాను. గత కొన్ని రోజులుగా నేను దవాచాయ్ తాగుతున్నాను. నాకు తెలిసిన మిత్రులకు, గ్యాస్ సమస్య ఉన్నవారికి అలవాటు చేశాను. సుమారు 24 వనమూలికల సమ్మిళితంతో తయారు చేస్తున్నారు. పాలు, చక్కెర, టీ పొడిలతో తయారు చేసిన చాయ్ను తగ్గించాం. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ, వనపర్తి కెఫిన్.. ప్రమాదకరమైనది రెగ్యులర్గా తీసుకునే టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. సాధారణ టీలో 60 శాతం, గ్రీన్టీలో 50 శాతం ఉంటుంది. దీంతోపాటు కాఫీ, టీ పొడి, పాలు, చక్కెర సైతం కల్తీ అవుతున్నాయి. కల్తీ అయినవి ఎందుకు అని దవాచాయ్ తీసుకుంటున్నాం. సహజసిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన వన మూలికల చూర్ణం నీటిలో మరిగిస్తే దవాచాయ్ తయారవుతుంది. – శ్రీకాంత్, ఉద్యోగి, వనపర్తి గ్రీన్ జ్యూస్లతో ఆరోగ్యం ఇక్కడ లభించే పలు రకాల గ్రీన్ జ్యూస్లతో చాలా ఆరోగ్యం. సేంద్రియ ఎరువులతో పండించిన గుమ్మడి, సోరకాయ, దొండ, కాకర, ఇతర కూరగాయలను జ్యూస్గా చేసి ఇస్తున్నారు. ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం సాధ్యం కాదు. టీ, కాఫీలకు బదులు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక గ్రీన్ జ్యూస్ తాగుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాం. – రాంరెడ్డి, వనపర్తి ● -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
● తెల్లవారుజాము నుంచేప్రారంభమైన రాకపోకలు ● విధుల్లో చేరిన 382 మంది కార్మికులు వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడంతో శనివారం రోడ్డెక్కాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు సమ్మె విరమణపై స్పష్టత రాకపోవడంతో కార్మికులు రిపోర్ట్ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో ఉదయం 3 గంటలకు బయలుదేరాల్సిన బస్సులు 5 గంటల సమయంలో రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా మొదటిరోజు అద్దె, ఆర్టీసీ బస్సులు 20, రెండో రోజు 50, మూడోరోజు 68 బస్సులు 10 రూట్లలో ప్రైవేట్ సిబ్బందితో సేవలందించాయి. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ఆర్టీసీ రూ.50 లక్షల పైచిలుకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం 186 మంది కండక్టర్లు, 127 మంది డ్రైవర్లు, 55 మంది మెకానిక్లు, మరో 14 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 382 మంది విధుల్లో చేరడంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 38 రూట్లలో 109 ఆర్టీసీ, అద్దె బస్సులు రాకపోకలు సాగించాయి. డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆయా రూట్లలో సకాలంలో బస్సులు నడిచేలా పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవలను మునుపటిలాగే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. -
ప్రతిరోజు రెండుపూటలు..
ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే చాయ్కు ఇది పూర్తిగా భిన్నమైంది. దవాచాయ్కి పాలు, చక్కెర, టీపొడి అవసరం ఉండబోదు. 24 మూలికల చూర్ణంను నీటిలో మరిగించి నేరుగా తీసుకోవడమే. మరిగించిన నీరు ముదురు గులాబీ రంగులోకి వస్తే.. ప్రతిరోజు రెండుపూటలా చాయ్ కప్పు మోతాదులో తీసుకుంటే.. చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని ప్రాంతాల్లో ఈ చాయ్కు డిమాండ్ పెరిగింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చాయ్ సెంటర్కు ఉదయం సుమారు 250 నుంచి 500 మంది వస్తుంటారు. కొందరు దవాచాయ్ తాగితే.. మరికొందరు గ్రీన్ జ్యూస్ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
గ్రీన్ జ్యూస్ రకాలు.. ఉపయోగాలు
● ఎనిమిది రోజుల వయస్సు గల గోధుమగడ్డి జ్యూస్తో రక్తం పెరిగి.. బీపీ నియంత్రణ, చర్మవ్యాధులు తగ్గుతాయి. ● బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల గ్యాస్, అల్సర్ సమస్య, బరువు తగ్గడం, హార్ట్ బ్లాక్ సమస్య పరిష్కారంతోపాటు గర్భాశయ సమస్యల చెక్ పెడుతుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తోంది. ● కొత్తిమీర, పుదీన, తులసీ జ్యూస్తో గర్భసంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ● సోరకాయ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది. ● కాకరకాయ జ్యూస్ షుగర్ను నియంత్రణలో ఉంచటంతోపాటు మల బద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది. ● కీర దోసకాయ జ్యూస్ గుండెజబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు పనిచేస్తుంది. ● దొండకాయ జ్యూస్ లివర్ సంబంధిత సమస్యను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ● క్యారెట్, బీట్రూట్ జ్యూస్ను రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ జ్యూస్ను తాగకూడదు. మునగాకు జ్యూస్ మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ శరీరంలో సత్తువ తగ్గిన వారికి ఒంట్లో బలం పెంచేందుకు, ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. రణపాల జ్యూస్ కిడ్నీలో రాళ్లు కరిగించడం, చర్మ వ్యాధులను తగ్గించడం, దీర్ఘకాలిక గాయాలను తగ్గించడానికి దోహదపడుతుంది. మునగాకు జ్యూస్లో అధిక పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గటం, జీర్ణక్రియ మెరుగుపడటం, చర్మం, జుట్టు సమస్యలను పరిష్కరించడం, షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. -
వేసవి క్రీడా శిబిరంప్రారంభం
గోపాల్పేట: యువత, క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్కుమార్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిబిరాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైదానంలో రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు ఫుట్బాల్ క్రీడలో మెళకువలు నేర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు, జిల్లా హాకీ అకాడమీ కోచ్ సాగర్, క్రీడాకారులు సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంవాయిదా వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో శనివారం నిర్వహించాల్సిన తైబజార్, పశువుల సంత, జంతు వధశాల బహిరంగ వేలం వాయిదా వేసినట్లు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తైబజార్కు 3, పశువుల సంతకు 2, జంతు వధశాలకు దరఖాస్తులు రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వేలం ఈ నెల 29 (బుధవారం) నాడు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. 31 జట్లు.. 61 మ్యాచ్లు.. టోర్నమెంట్ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఏడు గ్రూప్లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ఫైనల్కు చేరుకుంటాయి. మ్యాచ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్లు జరిగే మైదానాల్లో మ్యాట్లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. -
పకడ్బందీగా ఓటరు మ్యాపింగ్
వనపర్తి రూరల్: ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మండలంలోని పెద్దగూడెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపాలన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని తహసీల్దార్ రమేష్రెడ్డి, సంబంధిత అధికారులను కోరారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్సరెన్స్లో జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్ఐలు, గ్రామపాలన అధికారులతో సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ ధాతు ఆయుర్వేదం సహకారంతో సెంటర్ల ఏర్పాటు కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. -
నీటి కుంటలతో భూగర్భ జలాల వృద్ధి
ఖిల్లాఘనపురం: ఉపాధి పనుల్లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో నీటి కుంటలు తవ్వడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మూగ జీవాలకు తాగునీటి వసతి ఏర్పడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమృత్ సరోవర్లో భాగంగా శుక్రవారం మండలంలోని ఉప్పరిపల్లి శివారులో నెమలి జాలు వంపు వద్ద తవ్విన నీటి కుంటను వారు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. 10 వారాలుగా కూలీ డబ్బులు రావడం లేదని తెలుపగా.. వివరాలు తెలుసుకొని వారం రోజుల్లో చెల్లించేలా చూస్తామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులో రూ.10 లక్షల ఉపాధి నిధులతో అమృత్ సరోవర్ ఫండ్ను తవ్వుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఇలాంటి వాటిని నిర్మించడంతో భూగర్భ జలాలు కచ్చితంగా పెరుగుతాయన్నారు. అటవీ భూమి కావడంతో మూగ జీవాలకు కూడా తాగునీటి వసతి కల్పించినవారమవుతామని తెలిపారు. గ్రామానికి చాలా దూరంలో పనులు చేస్తున్నామని.. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కూలీలు చెప్పడంతో స్పందించిన అధికారులు మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉన్నందున గ్రామపంచాయతీ ట్రాక్టర్లో కూలీలను తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, టీఏ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను శుక్రవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి, ఆస్తుల పరిరక్షణకు నాటి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి నాటి గవర్నర్ అనుమతికి పంపితే కాలయాపనతో సాధ్యం కాలేదని వివరించారు. వేతన సవరణ 44 శాతం అందించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి పోరాడటం ప్రాథమిక హక్కని.. నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగదొక్కడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను పట్టించుకోకుంటే ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ విశ్వనాథం, బొబ్బిలి ప్రేమ్కుమార్, పెద్దముక్కుల రవి, చలపతిరెడ్డి, బీఎస్ నారాయణ, గోకం భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్, శ్రీకర్గౌడ్, ప్రేమ్నాథ్రెడ్డి, సూర్యవంశం గిరి, జోహెబ్ హుస్సేన్, హేమంత్, చిట్యాల రాము, మంద రాము, అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కార్మికులు ఆర్టీసీ డిపో నుంచి బస్టాండ్, పొట్టి శ్రీరాములు చౌరస్తా, రాజీవ్ చౌక్, కమాన్ చౌరస్తా, శంకర్గంజ్ తదితర ప్రాంతాల మీదుగా మౌన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శేషదాసుల రథోత్సవం
మల్దకల్: స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం దాసులవారి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి భాజాభజంత్రీలతో ఊరేగించారు. అంతకు ముందు అభిషేకాలు, హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, శశాంక, ప్రసన్నచారిలు భక్తులకు ప్రవచనాలు వినిపించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు బ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళా భజన మండలి సభ్యులతో ప్రత్యేక భజనలు కొనసాగాయి. భక్తులకు దాసుల వారి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, శేషదాసుల వారి వంశస్థులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, విష్ణుదాసు, శశాంకదాసు, మధుసూదనాచారి, వెంకటేశ్వరావు, అరవిందరావు, శ్రీకాంత్జోషి, శేషగిరిరావు, గిరిరావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, బాబురావు, శ్రీకాంత్జోషి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 44 వాహనాలు, డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుడి మృతి బాధాకరం
ఖిల్లాఘనపురం: ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతి ఎంతో బాధాకరమని టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు రాంసింగ్నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్నారని, శంకర్గౌడ్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఉద్యోగ భద్రత, వేతన సమస్యలు, పెండింగ్ బకాయిలు, పరిపాలనా ఒత్తిళ్లు తదితర సమస్యలతో ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్గౌడ్ బలిదానాన్ని ప్రభుత్వం గుర్తించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉద్యోగులందరికి సమన్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలన్నారు. ఇకనైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు హీరాలాల్, ఉపాధ్యాయుడు రాజశేఖర్ పాల్గొన్నారు. డీసీఆర్బీ డీఎస్పీని కలిసిన న్యాయ సలహాదారు వనపర్తి: జిల్లా భరోసా కేంద్రం న్యాయ సలహాదారుగా నియమితులైన సత్యశ్రీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు, బాధిత వర్గాల రక్షణకు భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం, మార్గదర్శకం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు తక్షణ న్యాయ సాయం అందించే దిశగా నిబద్ధతతో పని చేయాలని. పోలీసుశాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,279 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,199 ధర పలికింది. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,900, జొన్నలు గరిష్టంగా రూ.5,678, కనిష్టంగా రూ.4,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,609, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.24,40, కనిష్టంగా రూ.1,721, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,827, కనిష్టంగా రూ.1601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,217, కనిష్టంగా రూ.1,925, హంస గరిష్టంగా రూ.1,741, కనిష్టంగా రూ.1,729గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా హైదరాబాద్ దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2026–27కుగాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్.రాజేందర్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయ బాలికలు (అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 70 శాతం వీరికే కేటాయిస్తామని.. పదో తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం (అనాథలైతే..) , హాస్టల్/హోమ్ నుంచి సంబంధిత సూపరింటెండెంట్/అధికారితో జారీ చేసిన డిక్లరేషన్/బోనాఫైడ్ సర్టిఫికేట్ బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికేట్, మెమో (కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి) జిరాక్స్ ప్రతులను దరఖాస్తునకు జతచేసి మే నెల 22లోగా జిల్లాకేంద్రంలోని బాలరక్ష భవన్, మోనప్పగుట్ట, కలెక్టర్ కార్యాలయం పక్కన సమర్పించాలని, ఇతర వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించవచ్చని సూచించారు. -
పోటీ లేకుండా సహకారం
● నూతన సంస్కరలా..? రాజకీయ వ్యూహమా..? ● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు ● డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం పీఏసీఎస్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. మదనాపురం/అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. పోటీ లేకుండా పదవులు? ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూలు జిల్లాలో 23, వనపర్తి15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ప్రభుత్వం నామినేటేడ్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులకు పోటీ లేకుండానే సహకార సొసైటీలో పదవులు దక్కే అవకాశం దక్కుతుంది. ఆత్మకూర్, రేచింతల, కొత్తకోట, పామాపురం, పెద్దమందడి, కొప్పునూరు, తూంకుంట, గోపాల్పేట, శ్రీరంగాపురం, పెబ్బేరు, పాన్గల్, నాగవరం, రాజానగరం, ఖిల్లాఘనపురం, వనపర్తి. పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ స్థానిక రైతుల అవసరాలు, క్షేత్రస్థాయి సమస్యలపై పాలకమండళ్లకు ఉండే అవగాహన అధికారులకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు మంజూరు చేయాలన్నా, ఎరువుల తెప్పించాలన్నా ఇన్చార్జ్లు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. సహకార సంఘాలు బలోపేతం అయితేనే పల్లెల్లో ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 15 సంఘాల భవితవ్యం తేలాలంటే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఖిల్లాఘనపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11 నుంచి కొనసాగుతున్న ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం ఆయన పరిశీలించారు. వారితో మాట్లాడి శిక్షణలో ఎదురవుతున్న సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా ముందుగా చేపట్టే ఇళ్ల గణన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజు ఉదయం వేళలో సర్వే చేసేలా చూసుకోవాలని.. ఆ సమయంలో ఎండవేడిమి తక్కువగా ఉండటంతో పాటు ప్రజలంతా ఇళ్ల దగ్గరే ఉంటారని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు కచ్చితంగా స్టిక్కర్ అంటించాలని.. ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో పేర్లు రాయాలన్నారు. ఇళ్ల రకాలు, ఆలయాలు, పాఠశాలలు తదితర ప్రభుత్వ భవనాలను గుర్తించాలని.. కార్లు, మోటర్ సైకిళ్లు, టీవీలు తదితర వాటి వివరాలు చెప్పేందుకు ఇష్టపడని వారితో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేర్పుతో ఒప్పించి సేకరించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వరి కోతలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాదాబైనామాల పరిష్కారం, మండలంలోని భూముల పరిస్థితులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర వాటి వివరాలను తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 382 వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇప్పటి వరకు 103 గ్రామాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు, జనాలతో మాట్లాడి ఎందుకోసం వచ్చారు.. కార్యాలయ అధికారులు పనులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, ఆర్ఐ తిరుపతయ్య, కార్యాలయ సిబ్బంది, టీఓటీలు, ఎన్యూమరేటర్లు ఉన్నారు. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం కావాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
–8లో u● ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో ఆర్అండ్బీ శాఖ చేపట్టాల్సిన రోడ్ల పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ, మెడికల్ ఆస్పత్రి, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఎన్.ఖీమ్యానాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. వనపర్తి: ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశ కమిటీ చైర్మన్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన తోపాటు కో–చైర్మన్ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ పరిధిలో జీవాలకు సకాలంలో రోగనిరోధక టీకాలు వేసి రైతులకు సహకరించాలన్నారు. హౌసింగ్శాఖకు సంబంధించి జిల్లాకు మొత్తం 6,203 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో కేవలం 4,864 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా 1,340 ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక కారణాలతో ఇళ్ల నిర్మాణం చేసుకోలేని వారికి స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్స్ పెండింగ్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రూ.13 కోట్లతో మొత్తం 199 సీసీరోడ్లు మంజూరయ్యాయని.. వీటిలో ఇంకా 25 నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పౌర సరఫరాల అధికారికి సూచించారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ మల్లు రవి సూచించారు. ప్రతి బ్యాంకు పరిధిలో ఎన్ఎస్ఎంఈ, ముద్ర, పీఎం విశ్వకర్మ పథకాల పరంగా లబ్ధిదారులకు వేగంగా రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్యాంకర్ల వద్ద పెండింగ్లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కూడా సామాజిక బాధ్యతగా నిర్మించడం జరిగిందన్నారు. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు 500 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వందశాతం పూర్తిచేయాలి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామం కూడా పంచాయతీ భవనం లేకుండా ఉండొద్దని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాల లబ్ధిని చేకూర్చాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు రావాల్సి ఉంటే కలెక్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్మిక శాఖకు సంబంధించి శ్రమ యోగి మాంధన్ యోజన పథకంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. -
అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. -
ఆర్టీసీ సేవలు అంతంతే!
వనపర్తి: ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు పలు డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది. జిల్లాకేంద్రమైన వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రైవేటు డ్రైవర్లతో ఉదయం అంతంతమాత్రంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు.. సాయంత్రం వరకు 50 శాతానికి పైగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని బస్సులను ప్రైవేటు కండెక్టర్లతో నడపగా.. మరికొన్నింటిని కండెక్టర్ లేకుండానే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. గురువారం పాఠశాలలకు చివరిరోజు కావడంతో గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ల నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు దాదాపుగా తమ సొంత వాహనాలనే వినియోగించారు. పోలీసు పహారాలో.. తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో, బస్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు పహారా మధ్య బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని బస్సుల్లో పోలీసు సిబ్బంది కండక్టర్లుగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్, కర్నూలు, గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, ఆత్మకూర్, ఖిల్లాఘనపురం తదితర రూట్లలో బస్సుల సమయపాలన లేకపోయినా.. ఆశించిన మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 71 బస్సులు ప్రయాణికులకు సేవలందించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 17 ఆర్టీసీ బస్సులు, 47 అద్దె బస్సులు, 7 ఈవీ బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు. రెండో రోజు అరకొరగానే బస్సు సర్వీసులు కార్మికుల సమ్మెకు అద్దె బస్సుల యజమానుల మద్దతు 50శాతం పైగా బస్సులు నడిపినట్లు అధికారుల వెల్లడి రీజియన్లో 426 నడిచిన బస్సులు రెండు రోజు గురువారం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి. -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
మదనాపురం: ఓటరు జాబితాను తప్పులు లేకుండా పాదర్శకంగా రూపొందించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. గురువారం మదనాపురం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. జాబితాలో మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించాలని.. దీనిపై క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కుకు దూ రం కాకూడదన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆ యన హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దా ర్ రేపోలు రాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ‘ఉపాధి’ కూలీల వేతనాలు చెల్లించండి అమరచింత: ఉపాధిహామీ కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అమరచింత ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మూడు నెలలుగా కూలి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయడంతో పాటు రోజు పని ప్రదేశంలో రెండు పూటల ఫొటో క్యాప్చర్ తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన ఉపాధి కూలీలకు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో తాగునీటి వసతి, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తట్టబుట్ట సరఫరా చేయాలన్నారు. కొలతల పద్ధతిని రద్దుచేసి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని.. ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో భగవంతు, చిన్నవిష్ణు, జలగరి రాములు, విజయ్, నిశాంత్, అరుణ్ పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా ఆత్మకూర్: స్థానిక మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు చికినే శశిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పాలనలో అనుభవమున్న మాజీ వార్డు సభ్యుల నుంచి ఒక్క నామినేషన్ కూడా అందకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని వివరించారు. తిరిగి 24, 25 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, 27న ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కమిషనర్ సూచించారు. వేరుశనగ @ రూ.6,461 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.6,461, కనిష్టంగా రూ.4,889 ధరలు లభిచాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,310, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,887, కనిష్టంగా రూ.5,377, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,609, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,461, కనిష్టంగా రూ.1,651, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కనిష్టంగా రూ.1,600, కందులు రూ.గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.5,660, పెబ్బర్లు రూ.6,277 ధరలు లభించాయి. -
మక్కలు.. తిప్పలు..
● వేగం పెరుగని మొక్కజొన్న కొనుగోళ్లు, రోజుల తరబడీ రైతుల ఎదురుచూపులు ● నాగర్కర్నూల్లో వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత ● ప్రైవేటు అమ్మకాలతో దక్కని మద్దతు ధర ●సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. అరకొరగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు గోపాల్పేట కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన మక్కలను తీసుకెళ్లేందుకు లారీలు సరిగా రావడం లేదు. అకాల వర్షాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి. మరోవైపు అధికారులు ఈ నెల చివరి వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారు. అలా కాకుండా వచ్చేనెల కూడా కొనాలి. ఇంకా చాలామంది కోతలు కోయాల్సి ఉంది. వారికి ఇబ్బంది లేకుండా చూడాలి. – సింగారపు రమేశ్, యువ రైతు, సింగాయపల్లి, ఏదుల మండలం మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల నేపథ్యంలో రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే అదనుగా ప్రైవేటు దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వ మద్ధ తు ధర క్వింటాలు రూ. 2,400 లభిస్తుండగా, ప్రైవేటులో ఎక్కడా క్వింటాలు రూ.1,700 దాటడం లేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రతీ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
రైతులు, మహిళలకు సమున్నత స్థానం
కొత్తకోట రూరల్: ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందించి అన్నదాతలకు అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. పెద్దమందడి మండల కేంద్రంతో పాటు వెల్టూరులో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎంపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే, కాంటా చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్ఓ కాశీవిశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ పథకం కింద రూ 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సైన్స్ ల్యాబ్ను బుధవారం ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్సురభి ప్రారంభించారు. అనంతరం చిట్యాలలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ, సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్కుమార్, ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్సిపాల్ ప్రశాంతి, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, సర్పంచులు జి శోభ, సాలమ్మ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి -
రీజియన్లో 134 నడిచిన బస్సులు
● 109 బస్సులకు గాను సేవలందించింది 20 మాత్రమే ● ప్రయాణికులకు తప్పని తిప్పలు ● డిపో ఎదుట నిరసన తెలిపిన ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు వనపర్తి టౌన్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెతో బుధవారం ప్రగతి రథ చక్రాలు డిపోకే పరిమితమయ్యాయి. వనపర్తి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ప్రజలకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాల వైపు పరుగులు తీశారు. మూడు, నాలుగు గంటలకు ఒక్క బస్సు రావడం.. అది కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బస్సులే కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్మికుల సమ్మెను విజయవంతం చేసేందుకు వనపర్తి ఆర్టీసీ జేఏసీ కార్మికులు వేకువజాము నుంచే డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా ముట్టడించారు. పోలీస్, రవాణా అధికారుల సహకారంతో.. పోలీస్, రవాణా శాఖ అధికారుల సహకారంతో కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు అతికష్టం మీద నడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రవాణా శాఖ అధికారులు హెవీ లైసెన్స్ ఉన్న 12 మంది డ్రైవర్లను, మరో ఏజెన్సీ 12 మంది కండక్టర్లను తీసుకొని హైదరాబాద్, మహబూబ్నగర్, ఆత్మకూర్, గద్వాల తదితర ప్రాంతాలకు మొత్తంగా కేవలం 12 బస్సులను మాత్రమే నడపగలిగారు. ఆర్టీసీ అధికారులు విన్నవించినా.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు అత్యధికులు సమ్మెకు మద్దతివ్వడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. కేవలం 8 అద్దె బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. ప్రతీ రోజు ఆర్టీసీ డిపో నుంచి డిపార్ట్మెంట్, అద్దె బస్సులు కలుపుకొని 38 రూట్లలో 109 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. సమ్మె కారణంగా రెండు, మూడు రూట్లలో ఒకే సర్వీస్తో అద్దె, ఆర్టీసీ బస్సులు కలుపుకొని కేవలం 20 బస్సులను మాత్రమే డిపో అధికారులు నడపగలిగారు. ఉమ్మడి జిల్లాలో ఏ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రోడెక్కడం లేదని, వనపర్తి డిపో మేనేజర్ కార్మికుల సమ్మెకు సహకరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు డీఎం దేవేందర్గౌడ్తో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యవహరిస్తున్నట్లు డీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులకు, డిపో మేనేజర్ దేవేందర్గౌడ్తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. -
కుక్కల నియంత్రణకు చర్యలు
జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో కుక్కల సంతతిని నింయంత్రించేందుకు ఎనిమల్ కేర్ సెంటర్ను నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కుక్కల బెడద నుంచి ఉపశమనం కలిగించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా నిత్యం కుక్కల గుంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే మా దృష్టికి తీసుకురావాలి. వారి ఇబ్బందులు తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, వనపర్తి -
‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి’
వనపర్తి టౌన్: పదో తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైందని, ఉన్నత చదువులకు నాందిగా నిలుస్తుందని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం సంగ్రహణాత్మక మూల్యాంకనం–2లో 500 పైగా మార్కులు సాధించిన, నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్–2026 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హరిజనవాడ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను మెమోంట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ గెలుపునకు ప్రయత్నిస్తూనే తోటి వారికి సహయపడాలని సూచించారు. పాఠశాల వయస్సులో విద్యార్థులు చురుగ్గా ఉంటారని, ఇప్పటి నుంచే లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతోనే జీవితంలో ఏదైనా సాధించగలమని, క్రమశిక్షణ లేని గెలుపు జీవితంలో గౌరవాన్ని ఇవ్వదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చంద్రశేఖర్, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు వాకిటి రవికుమార్, పాఠశాల చైర్మన్ యాదయ్య, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, శ్రీనివాసరావు, డీటీఎఫ్ అధ్యక్షుడు యోసేప్, గంధం నాగరాజు, ఉపాధ్యాయులు వెంకట రాములు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
భూమి సంరక్షణ అందరి బాధ్యత
కందనూలు: భూమిని సంరక్షించడం అందరి బాధ్యత అని, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్ను రక్షించుకోవడమే’ అనే నినాదంతో విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సులోనే పర్యావరణ విలువలను అలవర్చుకోవాలని, వాటిని సమాజంలోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భూమి తల్లి సంరక్షణ కోసం చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లో వినియోగించే ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని, ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని చెప్పారు. అనంతరం పుడమితల్లి సంరక్షణపై వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కుర్మయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్కుమార్, ఉపాధ్యాయుడు సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాబోయ్.. భౌభౌలు
వనపర్తిజిల్లాలో మూడు నెలల్లో 350 మందిపై కుక్కల దాడులు గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026●వనపర్తి: జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల వ్యవధిలోనే 350 మందిపై కుక్కలు దాడి చేశాయంటేనే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల సంతతిని తగ్గించేందుకు రూ.50 లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్ కొద్ది రోజులుగా మూసే ఉంచారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసినా.. స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ధోరణి వీడటం లేదు. కనీసం నియంత్రణ చర్యలపై కూడా దృష్టి సారించకపోవడం శోచనీయం. ఐదు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పరిధిలోనే సుమారు 2,600 పైచిలుకు కుక్కలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా. ఇక గ్రామాలతో కలిపితే వాటి సంఖ్య రెండింతల కంటే ఎక్కువే ఉంటుంది. చిన్నారులు క్రీడా మైదానంలో ఆడుకునేందుకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా సమీకృత కలెక్టరేట్లోనూ కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా.. పట్టించుకులే వారు లేకుండా పోయారనే నిట్టూర్పులు నిత్యం వినిపిస్తుంటాయి. కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులు, ద్విచక్రవాహనాలపై వారిని వెంబడిస్తున్నా యి. రాత్రిపూట రోడ్లపై వాహనదారుల వెంటపడుతూ భయపెడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు నామమాత్రలు చర్యలతో సరిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యర్థ ఆహార పదార్థాలు, మాంసం వల్లే.. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు ప్రాంతాల్లో హోటళ్లు, చికెన్, మటన్ షాపుల్లో వదిలేసే వ్యర్థాల కోసం కుక్కలు అక్కడే గుంపులుగా ఉంటూ.. రోడ్లపై సంచరించే వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను రోడ్డు పక్కనే వేయడంతో మాంసానికి అలవాటు పడిన కుక్కలు.. మాంసం లభించనప్పుడు పందులు, మేకలు, గొర్రెలు, మనుషులపై దాడి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బ యటికి వెళ్లాలన్నా భయపడాల్సిన దుస్థితి ఉందని ప్ర జలు వాపోతున్నారు. కుక్కల దాడి నుంచి తప్పించుకునే సమయంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. సుల్తానాబాద్ ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం అధికారుల్లో కనిపించని చలనం మనుగడలో లేని ఎనిమల్ కేర్ సెంటర్ రూ.50 లక్షల నిధులు వెచ్చించినా ఫలితం లేదు జిల్లావ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 3 వేల వరకు కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 450 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మరికొన్ని కుక్కలకు సైతం ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్ మూతపడి ఉన్న కారణంగా ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవని మున్సిపల్ అధికారులు తెలిపారు. కుక్కలు 2024లో 824 మందిపై, 2025లో 1,137 మందిపై దాడిచేయగా చికిత్స అందించారు. 2026 మార్చి చివరి వరకు 351 మందిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. పది రోజుల నుంచి నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ కలిగి దాడులు చేస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. అవి ఆగ్రహంతో ఉన్న సమయంలో ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వారిపై దాడి చేస్తు న్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక ఇలా వ్యవహరిస్తుంటాయని వైద్యులు తెలిపారు. ప్రధానంగా పిల్లలపై అధికంగా దాడులు చేసే అవకాశం ఉంటుందంటున్నారు. -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
వనపర్తి రూరల్: గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సుధారాణి అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల రైతువేదికలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు సీడీపీఓ హజీరాబేగం, సర్పంచ్ జి.శోభ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోషక విలువలు, బాలింతలు, గర్భిణులు, నవజాత శిశుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. సీడీపీఓ హజీరాబేగం మాట్లాడుతూ.. రోజు తీసుకునే ఆహారంలో పోషక విలువలున్న ఆకు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని.. అందులో భాగంగానే పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాంబాబు, అంగన్వాడీ సూపర్వైజర్లు బాలీశ్వరి, రాణి, సంహిత, భారతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మర్రికుంట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్, హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించడంతో పాటు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందన్నారు. వేసవి శిబిరం మే నెల 29 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల వంట గదిని పరిశీలించి స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీ విద్యార్థులు సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ‘పరిషత్’ సందడి!
ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ● ఓటరు జాబితా, ఉద్యోగుల గుర్తింపు, శిక్షణలు ఇప్పటికే పూర్తి ● ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు ● పెరగనున్న స్థానాలు మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రియ తప్పదా..? అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు.. గత పరిషత్ ఎన్నికల సమయంలో జిల్లాలో 128 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఈసారి ఐదు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం పెరిగింది. నాగర్కర్నూల్ జిల్లా నుంచి కొన్ని గ్రామాలను వనపర్తి జిల్లాలో విలీనం చేయడంతో మాచుపల్లి, గుండ్యావాల్యానాయక్తండా, సింగాయపల్లి, ముతిరెడ్డిపల్లి, గొల్లపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పాటు కావడంతో పాటు ఏదులను మండలం చేసి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని పెంచారు. ప్రస్తుతం 133 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పెరిగిన ఐదు ఎంపీటీసీ స్థానాలు, ఒక మండలం వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. వనపర్తి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి ఒకరోజు అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన చిక్కుముడితో వాయిదా పడిన విషయం పాఠకులకు విధితమే. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం మరోసారి మే నెలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించడంతో పల్లెల్లో మళ్లీ ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో బుజ్జగింపులతో రాజీపడి పోటీ నుంచి తప్పుకున్న వారు, ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనుకున్నవారు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబినేట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు గ్రామీణ నాయకులు ముమ్మరం చేస్తున్నారు. 2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఓటరు జాబితా సవరణ..


