breaking news
Wanaparthy
-
సర్వే చేసి హద్దులు నిర్ధారించాలి
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడలో ఎస్సీలకు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. గ్రామంలో 47 ఏళ్ల కిందట ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతు నుంచి భూమి కొనుగోలు చేసిందని.. సర్వేనంబర్లలో తేడాలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో శుక్రవారం ఆయన తహసీల్దార్ సుగుణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వేనంబర్ 40లో 1.18 ఎకరాలు, 41లో 0.33 ఎకరాలు మొత్తం 2.11 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి పేద ఎస్సీలకు ఇంటి స్థలాలుగా కేటాయించిందన్నారు. ఎవరూ ఇళ్లు నిర్మించుకోకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సర్వేనంబర్లలో కాకుండా సర్వేనంబర్లు 40, 42లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసిందని.. త్వరలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆదేశించామన్నారు. ఏమైనా తేడాలుంటే సంబంధిత రైతుతో మాట్లాడి లిఖితపూర్వకంగా రాయించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐ తిరుపతయ్య తదితరులు ఉన్నారు. -
గోదాం నిర్మాణంతో రైతులకు ఉపయోగం
గోపాల్పేట: ఏదులలో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాంతో ఏదుల, రేవల్లి, గోపాల్పేట మండలాల రైతులకు ఎంతో మేలు చేకూరనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులలో గోదాం నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేపట్టారు. భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం రూ.25 కోట్లతో నిర్మించనున్న రేవల్లి, అనంతపురం, ఏదుల, తీగలపల్లి రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతో నాగర్కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ సత్యశీలారెడ్డి, రేవల్లి అధ్యక్షుడు పర్వతాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
లక్ష్య సాధనకు కృషి చేయాలి : కలెక్టర్
వనపర్తి రూరల్: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని అందుకు అనుగుణంగా చదివి చేరుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం పెబ్బేరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. గణితంపై పట్టు సాధించేందుకు సులభ ఫార్ములాలు, స్మార్ట్ ట్రిక్స్ నేర్చుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కష్టపడి చదవాలన్నారు. అలాగే పాఠశాలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ, తహసీల్దార్ మురళీగౌడ్, ఎంపీడీఓ రోజా, ఎంఈఓ జయరాములు, ఏఎంఓ మహానంది, అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మల్లురవి బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి వాకిటి సీఎం రేవంత్రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ల బాధ్యత నాదే: సీఎం రేవంత్డ్డి డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు జటప్రోలులో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన -
రుణమాఫీ లెక్క తేలింది
అమరచింత: ప్రభుత్వం ప్రకటించినట్లుగానే చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు కేటాయించడంతో చేనేత, జౌళిశాఖ అధికారులు బ్యాంకుల ద్వారా రూ.లక్ష రుణం పొందిన నేత కార్మికుల వివరాల సేకరణకు ఆయా బ్యాంకు మేనేజర్లకు లేఖలు రాసిన విషయం విధితమే. ఆయా బ్యాంకు మేనేజర్లు తమ బ్యాంకు పరిధిలో చేనేత క్రెడిట్కార్డు, రూపే కార్డు, బ్యాంకు రుణం పొందిన వారి వివరాల నివేదికను జౌళిశాఖ అధికారులకు అందజేయగా.. డీఎల్సీ (డిస్ట్రిక్ట్ లేవల్ కమిటీ) ముందు ఉంచడం, వారు ఆమోదించడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ చేయడమే గాకుండా జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెద్దమందడి, కొత్తకోట, ఖిల్లాఘనపురంలో నేత కార్మికులు తమ వృత్తిని నమ్ముకొని కుటుంబాలు పోషించుకుంటున్నారు. పెద్దమందడిలోని వెల్టూర్, ఖిల్లాఘనపురంలోని సోలీపురం గ్రామంలో ఉన్ని మగ్గాలు కొనసాగుతున్నా.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మగ్గాలపై జరి చీరలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 1,090 మంది చేనేత కార్మికులు ఉండగా.. 338 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రతి మగ్గానికి ముగ్గురు కార్మికుల చొప్పున సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నారు. అమరచింత చేనేత సహకార సంఘం ద్వారా యూనియన్ బ్యాంక్, ఆత్మకూర్లోని డీసీసీబీ బ్యాంకు ద్వారా 309 మంది కార్మికులు చేనేత రుణాలు పొంది ఉన్నారు. ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లిలో ఐదుగురు, కొత్తకోటలో 24 మంది నేతన్నలు రుణాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలకుపైగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని చేనేత సహకార సంఘ కార్యవర్గం చెబుతోంది. జిల్లావ్యాప్తంగా 2017 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల వివరాలతో పాటు ఎంత మేర మాఫీ వర్తిస్తుందన్న వివరాలను జౌళిశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 338 మంది చేనేత కార్మికులు రుణాలు పొందారని.. రూ.2.21 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు. జిల్లాలో ఇలా.. 2017 నుంచి..రూ.75 వేలు మాఫీ అవుతున్నాయి.. అమరచింత యూనియన్ బ్యాంకులో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ పునరుద్ధరించుకుంటూ వస్తున్నా. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని తెలిసి సంతోషంగా ఉంది. – సాక పద్మ, చేనేత కార్మికురాలు, అమరచింత ఆనందంగా ఉంది.. మాది చేనేత కుటుంబం. అందరం నేత పనిపై ఆధారపడి జీవిస్తున్నాం. కుటుంబ పోషణతో పాటు చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకు కోసం బ్యాంకులో సహకార సంఘం సిఫారస్ మేరకు రూ.లక్ష రుణం తీసుకున్నా. తిరిగి చెల్లించే స్తోమత లేక ఏటా వడ్డీ డబ్బులు చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ ప్రకటనతో రూ.లక్ష మాఫీ అవుతుందని తెలిసి చెప్పలేని ఆనందం కలిగింది. – క్యామ కుమార్, చేనేత కార్మికుడు, అమరచింత నేతన్నలకు ఆసరా.. అమరచింత చేనేత సహకార సంఘం ద్వారా 309 మంది నేత కార్మికులకు అధికారుల సహకారంతో బ్యాంకుల్లో రుణాలు ఇప్పించాం. వ్యాపారం సహకరించక చాలామంది కార్మికులు అప్పుల్లో కురుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి రుణగ్రస్తుల వివరాలు సేకరించడం సంతోషకరం. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, అమరచింత చేనేత సహకార సంఘం జిల్లాలో 338 మంది చేనేత కార్మికులు.. సుమారు రూ.2.21 కోట్ల మాఫీ బ్యాంకుల వారీగా రుణగ్రస్తుల వివరాల సేకరణ త్వరలోనే డీఎల్సీకి నివేదికత్వరలోనే నివేదిస్తాం.. జిల్లావ్యాప్తంగా బ్యాంకుల్లో చేనేత రుణాలు పొందిన 338 మంది వివరాలు సేకరించాం. వీరికి సుమారు రూ.2.21 కోట్ల మేర రుణమాఫీ వర్తించి లబ్ధి పొందనున్నారు. త్వరలోనే జాబితాను డీఎల్సీ ఎదుట ఉంచనున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి..
వనపర్తి: త్వరలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో యూత్ సర్వీస్ కేంద్రం ఏర్పాటు చేసి పది ఆపై విద్యనభ్యసించిన యువతకు 11 రకాల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణనిస్తామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన దిశ సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో పని చేసినప్పుడే సత్ఫలితాలు పొందవచ్చని సూచించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఓసారి అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తామని తెలిపారు. ఏటా రూ.80 కోట్ల పైచిలుకు దోచిపెట్టారు.. గత ప్రభుత్వం మత్స్య బీజ క్షేత్రాలను అభివృద్ధి చేయడంలో విఫలమైందని, ఉమ్మడి పాలమూరులో ఉన్న నాలుగు క్షేత్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మరో 14 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. ఏటా ఆంధ్ర కాంట్రాక్టర్లతో చేప విత్తనాలు కొనుగోలు చేసి తెలంగాణ సంపదను రూ.80 కోట్ల మేర దోచి పెట్టారని మండిపడ్డారు. భవిష్యత్లో పాలమూరు జిల్లాలోనే 28 లక్షల చేప విత్తనాల ఉత్పత్తి సామర్థ్యంతో మత్స్యబీజ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తామని.. ఇందుకు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిధులు కేటాయించినట్లు వివరించారు. బాధ్యతగా పనిచేయాలి : ఎంపీ మల్లు రవి అధికారులు తమ ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఎంపీ మల్లు రవి సూచించారు. డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అలాగే గద్వాల జిల్లా పుల్లూరు నుంచి కొల్లాపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దిశా సమావేశానికి హాజరుకాని అధికారులు, వచ్చి తిరిగి వెళ్లిన భూగర్భ జల పరిశోధనశాఖ అధికారి, మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, లిఖిత పూర్వక సంజాయిషీ కోరాలని కలెక్టర్కు సూచించారు. జిల్లాకేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్తో పాటు 10 మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. నీటి పారుదల, విద్యుత్శాఖల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన ఎనిమిది విద్యుత్ సబ్స్టేషన్లకు ఇప్పటి వరకు ఎందుకు టెండర్లు పిలువలేదని అధికారులను ప్రశ్నించారు. సవాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో 500 మీటర్ల కాల్వ తవ్వేందుకు సంబంధిత అధికారులతో అనుమతి తీసుకుంటే ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని.. నీటిపారుదలశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకులు తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా పాలన చేశారని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో పనులు చేపట్టలేదని వివరించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దిశ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు -
ప్రభుత్వ విద్యార్థులకు పోటీ పరీక్షల తరగతులు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నీట్, జేఈఈ, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందకు ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ నుంచి ఉచిత ఆన్లైన్ తరగతులు ప్రారంభించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. కళాశాలలో రెగ్యులర్ తరగతులతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ తరగతులు కూడా రోజు ఇంటర్బోర్డు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏదేని కారణంతో తరగతులకు హాజరు కాలేని పక్షంలో రికార్డెడ్ వీడియోస్ సైతం చూసే సదుపాయం ఉందని, వేల మంది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో నిర్మించనున్న యంగ్ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జటప్రోల్ సమీపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సముదాయం నిర్మించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకేచోట ఉండి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అభ్యసించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు.. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన అనంతరం జటప్రోలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. బహిరంగ సభకు జనసమీకరణతో పాటు ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో పూజలు.. సీఎం రేవంత్రెడ్డి జటప్రోల్లోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మదనగోపాలస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం కలెక్టర్ సంతోష్ సైతం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటిసారిగా కొల్లాపూర్కు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రేవంత్రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి రానున్నారు. కృష్ణాతీరంలో మారుమూల ప్రాంతంగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయనున్నారన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తారని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు జటప్రోలుకు చేరుకుంటారు. 1.55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2.10 గంటలకు యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 2.20 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
ఉపాధ్యాయులతో పని చేయించే బాధ్యత హెచ్ఎంలదే..
వనపర్తిటౌన్: ఉపాధ్యాయుల్లో కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించామని.. అవసరమైనప్పుడు మాత్రమే డీఈఓ కార్యాలయానికి రావాలని డీఈఓ అబ్దుల్ ఘనీ స్పష్టం చేశారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘బడి.. మరిచారు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి బుధవారం కార్యాలయంలో ఏయే విభాగాల్లో ఎవరెవరు ఉన్నారు.. ఎవరు ఏం పని చేస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్యాలయంలో అదనపు బాధ్యతల ఉపాధ్యాయులు లేరని, పాఠశాలలకు అప్పగించామని చెప్పారు. వేతనాలు ఆయా పాఠశాలల నుంచే పొందుతారు కాబట్టి వారితో పని చేయించుకునే బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే అని తేల్చి చెప్పారు. వారు చెప్పినా విధులు నిర్వర్తించకుంటే అసమర్థతే అన్నారు. సీఎంఓగా యుగంధర్ను రిలీవ్ చేస్తున్నామని.. కొత్తగా నియమించిన ప్రతాప్రెడ్డి గురువారం విధుల్లో చేరుతారని చెప్పారు. బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నందున విధుల్లోకి తీసుకోలేదన్నారు. పని లేకుండా కార్యాలయంలో అదనపు బాధ్యతలతో ఎవరు కనిపించినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రత్యేక అధికారి తనిఖీ పాన్గల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఇంటర్బోర్డ్ ప్రత్యేక అధికారి విశ్వేశ్వర్ తనిఖీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం ఆయనను శాలువాతో సన్మానించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమల్రావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ఎడమ కాల్వ సమీపంలో చేపల విక్రయాల వద్ద రద్దీ (ఫైల్) మదనపురం: కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోని ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అజ్జకొల్లులో రూ.50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు 60 శాతం నిధులు కేంద్రానివేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం నర్సింగాపురం గ్రామానికి చెందిన కావలి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది గ్రామస్తులు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎద్దుల రాజవర్ధన్రెడ్డి, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ డోకూరు పవన్కుమార్రెడ్డి, దేవరకద్ర బీజేపీ ఇన్చార్జ్ కొండా ప్రశాంత్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, పాలమూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర కన్వీనర్ కురువ రమేష్, భరత్భూషణ్, మాధవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కృష్ణయాదవ్, దుప్పల్లి ఆంజనేయులు, బాబుగౌడ్, అమర్నాథ్, కురుమన్న పాల్గొన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో 60 శాతం నిధులు కేంద్రానివే.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
నాటిన ప్రతి మొక్కను కాపాడాలి
ఖిల్లాఘనపురం: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు అధికారులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసిన వెంటనే నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని పరిశీలించి నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రుణాలు.. రైతులు వ్యవసాయంతో పాటు పశువులు, కోళ్లు, గొర్రెల పెంపకం చేపట్టినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సింగిల్విండో ద్వారా రైతులకు కర్షకమిత్ర పథకం కింద మంజూరైన రుణాల ప్రొసీడింగ్లు అందించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సింగిల్విండో ద్వారా సుమారు రూ.5 కోట్ల కర్షకమిత్ర రుణాలు ఇస్తున్నామని.. రైతులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. త్వరలోనే సింగిల్విండో బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, డైరెక్టర్లు సాయిచరణ్రెడ్డి, రాము, శ్యాంసుందర్రెడ్డి, కృష్ణయ్య, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, క్యామ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్ పాల్గొన్నారు. -
సమస్యల.. జూరాల
వరదల సమయంలో ప్రాజెక్టు రహదారిపై వాహనాల బారులు ●సమస్య పరిష్కరించాలి.. జూరాల ప్రాజెక్టుపై ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. డ్యాం పైనుంచి గద్వాల, రాయచూర్కు అక్కడి వారు వనపర్తి, నారాయణపేటకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఎడమ కాల్వ వద్ద వాహనాలు నిలపడంతో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. – కుర్మారెడ్డి, కిష్టంపల్లి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.. ఎడమ కాల్వ సమీపంలోని పుష్కరఘాట్ రహదారిలో ప్రాజెక్టుకు సంబంధించిన ఖాళీ స్థలం చాలా ఉంది. వాహనాలు నిలిపేందుకు తగిన వసతులు కల్పించాలి. ఈ విషయంపై పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలి. – వెంకటేష్, నందిమళ్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. అంతేగాకుండా చేప వంటకాలు తినేందుకు ఆసక్తి చూపుతూ వాహనాలను రహదారికి ఇరువైపులా నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని గుర్తించాం. పుష్కరఘాట్ వైపు వాహనాలు నిలిపి ఉంచేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సెలవు రోజుల్లో సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండ తగిన చర్యలు తీసుకుంటాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ జూరాల ప్రాజెక్టు రహదారిపై వాహనాల రద్దీ (ఫైల్) అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద వసతుల కల్పనలో అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరదొస్తే చాలు.. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకుల వాహనాలతో జలాశయం రహదారి నిండి గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. సంబంధిత అధికారులు ఎడమ కాల్వ వద్ద శాశ్వత పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. వనపర్తి, నారాయణపేట జిల్లాల ప్రజలు జూరాల ప్రాజెక్టుపై నుంచి గద్వాల, రాయచూర్ తదితర ప్రాంతాలకు నిత్యం వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. వరదల సమయంలో ఇలాంటి సమస్య నిత్యం ఎదురవుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి దాపురిస్తోందని.. సంబంధిత అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించి రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. పార్కింగ్కు స్థలం ఉన్నా.. దిగువ పుష్కరఘాట్కు వెళ్లే ప్రదేశంలో విశాలమైన ఖాళీ స్థలం ఉన్నా అక్కడ వాహనాలు నిలిపేందుకు వినియోగించడం లేదు. గతేడాది ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు తాత్కాలికంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. తర్వాత పట్టించుకోకపోవడంతో సమస్య తలెత్తుతోంది. గంటల తరబడి ట్రాఫిక్ జాం రాకపోకలకు తప్పని అవస్థలు పార్కింగ్ స్థలాల ఏర్పాటులో అధికారులు విఫలం పోలీసుల చర్యలు అంతంత మాత్రమే.. ప్రాజెక్టు ఆనకట్ట వద్ద రద్దీ నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం అమరచింత పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో వరదల సమయంలో డ్యాం బీట్కు రోజు ముగ్గురు జవాన్లు.. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణకు హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు జవాన్లను కేటాయిస్తున్నామని ఆత్మకూర్ సీఐ వెల్లడిస్తున్నా, ఆచరణలో మాత్రం అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యమని.. అందుకు అనుగుణంగా మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని మదనాపురం, కొత్తకోటకు సంబంధించిన ఇందిరా మహిళాశక్తి సంబరాలు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నామని, కొత్తకోట మిరాసిపల్లి వద్ద మహిళలతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులను చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు హైదరాబాద్లో విక్రయించేందుకు శిల్పారామంలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 43 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. ఇందుకుగాను విద్యుత్శాఖకు ప్రభుత్వం రూ.1.26 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం బలోపేతానికి ప్రభుత్వ ఆసుపత్రులు, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దేవరకద్రలో రూ.రెండు వేల కోట్లతో బ్రహ్మోస్ క్షిపణి కర్మాగారం, అడ్డాకుల వద్ద డ్రైపోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం.. కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులుగా ఉంటారని.. అందుకే ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ.15.5 కోట్ల వడ్డీని జమ చేసినట్లు చెప్పారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొస్తే రుణాలిచ్చి ప్రోత్సహించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 50 వేల యూనిఫామ్లను మహిళా సంఘ సభ్యులతో కుట్టించినట్లు వివరించారు. వరి కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీఆర్డీఓ ఉమాదేవి జిల్లాలో మహిళా సాధికారితకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఐదుగురు ఉత్తమ మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ లేని బ్యాంకు రుణాలు రూ.8.30 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. మండల మహిళా సంఘాలకు ప్రమాద, రుణ చెక్కు రూ.2.38 లక్షలు, కొత్తకోట పురపాలికకు సంబంధించి రూ.65,29,903 చెక్కును అందజేశారు. ఆర్టీసీ బస్సు నుంచి వచ్చిన అద్దె రూ.1,38,936 చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, మార్కెట్యార్డు డైరెక్టర్ పావని, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మండల సమాఖ్య అధ్యక్షులు చెన్నమ్మ, జయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందిస్తాం ఎమ్మెల్యే జి.మధుసూధన్రెడ్డి -
37.35
14.92025–262020–212021–222024–252022–23ఆర్థిక సంవత్సరం2023–24కేటాయించిన పనిదినాలు (లక్షల్లో) 23.8631.4 26.9526.24 -
ఉపాధికి కత్తెర
వనపర్తి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను తగ్గించేందుకు 2008లో నాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని వారికి, వ్యవసాయం పనులు లేని సమయంలో కూలీలకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు ఈ పథకం దోహదపడింది. మొదట్లో ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పథకానికి ప్రజల నుంచి ఆదరణ పెరిగి, ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో కూలీలు జాబ్ కార్డులు తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం 37.35 లక్షలుగా ఉన్న పనిదినాలు జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 14.9 లక్షలకు కుదించబడినట్లు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త నిబంధనతో కూలీలు పనికి దూరవుతున్నారు. జిల్లాలో పని దినాల తగ్గుముఖం గతేడాది జిల్లాకు 23.8 లక్షల పని దినాలు కేటాయించగా.. ప్రస్తుతం 14.9 లక్షలకు కుదింపు -
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెంట్లవెల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. జటప్రోల్లో రూ. 150కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలీపా్య్డ్, సభా స్థలాన్ని మంత్రి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. కాగా, జటప్రోల్ సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 16.06 ఎకరాల భూమి గోప్లాపూర్ శివారుకు చెందినదని.. కొత్తగా నిర్మించే పాఠశాలకు తమ గ్రామం పేరు పెట్టాలని కోరుతూ గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
మహిళలే మహారాణులు
వనపర్తి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తర్వాత ఆ స్థాయిలో మహిళలకు సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు మళ్లీ సీఎం రేవంత్రెడ్డి పాలనలో మంజూరవుతున్నాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఇందిరా మహిళాశక్తి విజయోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్జీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల సభ్యుల సమావేశాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, మరో 7 వేల ఇళ్లు కావాలని సీఎంను కోరినట్లు తెలిపారు. శ్రావణమాసం రానుందని, ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఆడపడుచు లాంఛనాలతో నియోజకవర్గంలోని మహిళలతో నూతన గృహప్రవేశం చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి తొలి సంబరాల సమావేశం వనపర్తిలో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యంలోనే సాకారమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాకు రూ. 9కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో అద్దె బస్సులు, పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళలను సీఎం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా మహిళా సంఘాల సభ్యులకు రూ. 38.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు కృషి మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్సురభి చెప్పారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొస్తే రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, పలు రకాల వ్యాపారాలు చేసేందుకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్గౌడ్, డీఆర్డీఓ ఉమాదేవి, పీసీసీ సభ్యుడు శంకరప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యారాణి, మహిళా సంఘాల సభ్యులు నిర్మల, స్వప్న, ఇందిరా, మహేశ్వరి, శాంతమ్మ, శ్రీలత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆడపడుచు లాంఛనాలతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేయిస్తా.. మళ్లీ రాజన్న పాలన వచ్చింది రూ.38.80 కోట్ల చెక్కుల అందజేత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించాలి
ఎర్రవల్లి: తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పాం సాగు విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని టీఎస్ ఆయిల్ఫెడ్ జి.ఎం సుధాకర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని కొండేరులో మహిళా రైతు శిరీష పొలంలో ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి అక్బర్తో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 51 ఎకరాల్లో 22మంది రైతుల పొలాల్లో 2907 ఆయిల్పాం మొక్కలను ఒకే రోజు నాటడం జరిగిందన్నారు. అధిక ఆదాయానిచ్చే ఆయిల్పాం సాగు పై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాల ని సూచించారు. ఆయిల్పాం మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని దాదాపు 30 సంవత్సరాల వరకు ఈ మొక్కలు దిగుబడిని ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఇస్తాయన్నారు. ఆయిల్పాం సాగుతో పాటుగా వాటిలో వివిధ రకాల అంతర పంటలను కూడా సాగుచేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆయిల్పాం సాగును పోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తుందన్నారు. ౖకార్యక్రమంలో ఆయిల్ఫెడ్ జిల్లా ఇంచార్జి శివనాగిరెడ్డి, డివిజనల్ ఉధ్యావవన అధికారి ఇమ్రాన్, రాజశేఖర్, మహేష్, ఏరియా అధికారి రామకృష్ణ, రైతులు శేఖర్రెడ్డి, చింపరయ్య, రాజు, విజయ్ మోహన్రెడ్డి, మహీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘానికి అవార్డు
అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. బైలెల్లినాదే
ఆత్మకూర్: పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపాలిటీ, పంచాయతీల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మ ఆలయాల వద్ద అమ్మవారికి పచ్చిపులుసు, అన్నం, కోళ్లు, పొటేళ్లతో నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా దీవించడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి
వనపర్తి విధ్యావిభాగం: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.పవన్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులు రూ.7వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డికి విద్యార్థులతో కలిసి ఉత్తరాలు రాస్తున్నామన్నారు. పెండింగ్ సమస్యతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి అధికమవుతోందని, కుటుంబాలపై భారం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రాజు, అనిల్, కవిత, రాజేందర్, ప్రవీణ్, కల్పన తదితరులు ఉన్నారు. -
కార్మిక వ్యతిరేక లేబర్కోడ్లు రద్దు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కా ర్మిక వ్యతిరేక నాలుగు లేబర్కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ 4వ మహాసభలు పెబ్బేరులో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సుభాష్చౌరస్తా, బస్టాండ్ మీదుగా సహారా ఫంక్షన్ హాల్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయనతో పాటు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడగు భాస్కర్తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిరకాల కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఈపీఎఫ్ పింఛన్ కనీసం రూ.9 వేలు చెల్లించాలని, అన్నివర్గాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఎన్పీఎస్, యూపీఎస్ను రద్దుచేసి పాత చట్టబద్దమైన పింఛన్ పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాఽధ్యక్షులు జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఆర్ఎన్ రమేష్, రాము, ఎండీ మహముద్, సునీత, గంధం మదన్, బొబ్బిలి నిక్సన్, బుచ్చమ్మ, ఊశన్న, దేవన్న , ఆహ్వాన సంఘం అధ్యక్షులు బాలయ్య, శారద పాల్గొన్నారు. -
‘రామన్నగట్టు’ పనులు ప్రారంభించాలి
వనపర్తి రూరల్: రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని ఖాసీంనగర్ ఎర్రగట్టుతండాలో నిర్వహించిన సమావేశంలో ఎం.నర్సింహ, నీలేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్పార్టీకి చెందిన 40 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాసీంనగర్ పరిసర తండాల రైతులు సాగునీటికి పడుతున్న కష్టాలు చూసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి 03.10.2023న రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్పార్టీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుభరోసా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, నాయకులు ధర్మానాయక్, గోపాల్నాయక్, రవిప్రకాష్రెడ్డి, మాధవరెడ్డి, నరేష్ పాల్గొన్నారు. -
ఎత్తిపోతలకు గ్రహణం
●ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర ● తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం ● ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్సాగర్లో ఒక పంపుతోనే తరలింపు ● బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూ ఏజెన్సీల కొర్రీ ● వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం ఒక్క మోటారుతో కోయిల్సాగర్.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటిని పంపింగ్ చేస్తున్నాం.. నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్లో గ్రిడ్ను రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ రెండు పంటలకు నీరివ్వాలి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను. – కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. రెండు మోటార్లతో నెట్టెంపాడు.. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. -
బడి.. మరిచారు
●పట్టించుకోవడం లేదు.. కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో రిపోర్టింగ్ చేసిన మరుసటి రోజే అమ్మ ఆదర్శ పాఠశాల విధుల కోసం డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. విద్యార్థులు నష్టపోతున్నారని డీఈఓతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించాం. గ్రామస్తులు సైతం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు లేని కారణంగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి. – ఐ.నారాయణ, ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, చింతకుంట (పాన్గల్) ఆదేశాలిచ్చాం.. అదనపు బాధ్యతలు కేటాయించిన ఉపాధ్యాయులు పని ఉన్నప్పుడు మినహా మిగిలిన రోజుల్లో పాఠశాలల్లో విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశాం. అందరూ పాటించేలా చూస్తున్నాం. సీఎంఓగా నియమించిన, రీప్యాట్రేషన్ ఉత్తర్వులపై బడిబాట కార్యక్రమం తర్వాత నిర్ణయం తీసుకుందామని కలెక్టర్ చెప్పినందునే పక్కన బెట్టాం. ఆత్మకూర్ పాఠశాలలో బయోలజీ ఉపాధ్యాయుడి ఖాళీ విషయం నా దృష్టికి రాలేదు. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి ఏళ్లుగా డీఈఓ కార్యాలయంలో తిష్టవేసిన ఉపాధ్యాయులు వనపర్తి టౌన్: జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు ఏళ్లుగా బడిబాట మరిచి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆసక్తి చూపకపోగా.. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అధికారులమనే ధీమాలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా విద్యాశాఖలో ఫారెన్ సర్వీ్స్లు, అదనపు సర్వీస్లు అనే రెండు విభాగాలున్నాయి. ఫారెన్ సర్వీస్ కింద విధులు కేటాయించిన ఉపాధ్యాయులు ఐదేళ్ల పాటు డీఈఓ కార్యాలయంలో పూర్తిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరి వేతనం సైతం కార్యాలయం నుంచే చెల్లిస్తారు. అదనపు సర్వీస్లో కొనసాగే పలు విభాగాల అధికారులు పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూనే అత్యవసర సమయాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో సమయం కేటాయించి నిర్దేశించిన విధులు నిర్వర్తించాలి. అదనపు బాధ్యతల ఉపాధ్యాయులు ఏడాదిలో పది రోజులు, ఎక్కువగా అయితే నెల రోజులు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పని చేయాలి. కానీ పలువురు ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేశారు. అదనపు బాధ్యతల అధికారుల ఎంపికలో సీనియార్టీ, సిన్సియార్టీ, ఆసక్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని డీఈఓ విచక్షణతో బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా వీరే ఏ అధికారి వచ్చినా మచ్చిక చేసుకొని ఇతరులకు అవకాశం ఇవ్వకుండా కొనసాగుతూ.. వారానికి లేదా నెలకు ఓసారి పాఠశాలకు వెళ్లి సంతకాలు చేసి వేతనాలు పొందుతున్నారే తప్ప పాఠశాలల్లో పాఠాలు బోధించడం లేదన్న ఆరోపణలున్నాయి. డీఈఓ కార్యాలయంలో ఏసీజీఈ, డీసీఈబీ, కార్యదర్శి, డీఎస్ఓ, ఎస్జీఎఫ్ కార్యదర్శి, ఓపెన్ కో–ఆర్డినేటర్, గ్రీన్ కో–ఆర్డినేటర్, కార్యాలయంలో క్లర్క్, తదితర విభాగాలకు పలువురు ఉపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో అత్యధికులు పాఠశాల ముఖమే చూడటం లేదని సమాచారం. పాన్గల్ మండలం చింతకుంట ప్రాథమిక పాఠశాలకు కేటాయించిన ఓ ఉపాధ్యాయుడు రిపోర్టింగ్ చేసిన రెండోరోజే డీఈఓ కార్యాలయంలో విధులు కేటాయించాలంటూ ఓ ఉపాధ్యాయ సంఘం నేతలతో పైరవీ చేయించుకున్నారు. ఆ ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపించాలంటూ గ్రామస్తులు అధికారులకు ఎన్ని వినతులు, విజ్ఞప్తులు చేసినా పట్టి్ంచుకోలేదు. కనీసం ఇతర ఉపాధ్యాయుడిని సైతం సర్దుబాటు చేయలేకపోతున్నారు. కొత్తకోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయోలజీ సైన్స్ పోస్టులు రెండు మంజూరుంటే ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఆత్మకూర్లో ఓ పోస్టు జనవరి నుంచి ఖా ళీగా ఉండటంతో అదనంగా ఉన్న ఉపాధ్యాయుడి ని కేటాయించాలని ప్రధానోపాధ్యాయుడు విన్నవించినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదనపు బాధ్యతలతో అసలు విధులకు ఎసరు పట్టించుకోని అధికారులు, పాలకులు నష్టపోతున్న విద్యార్థులు -
సీపీఆర్పై శిక్షణనివ్వాలి
వనపర్తి: గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తక్షణం చేయాల్సిన ప్రాథమిక వైద్యం సీపీఆర్పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సీపీఆర్, క్యాన్సర్, క్షయ, సీజనల్ వ్యాధులు, మధుమేహం, ఆర్బీఎస్కేపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నామని, నివారించేందుకు సీపీఆర్ విధానంపై జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువమందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కోరారు. ముందుగా జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది, జిమ్ ట్రైనర్లు, విద్యాశాఖలో పీఈటీలు, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. ఆగస్టు 15 నుంచి నోటి, ఛాతి, గర్భాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. మధుమేహం వ్యాధి నిర్మూలనపై సమీక్ష నిర్వహిస్తూ ఇప్పటి వరకు చేపట్టిన హెచ్బీ–1సి వైద్య పరీక్షల ద్వారా ఎవరికై తే 8 కన్నా ఎక్కువ రైడింగ్ నమోదైందో వారి వద్దకు వైద్యాధికారులు స్వయంగా వెళ్లి షుగర్ లేవల్స్ పెరగడానికి గల కారణాలు తెలుసుకొని వైద్యం అందించాలన్నారు. వైద్య పరీక్షల డేటాను ఆన్లైన్లో నమోదు చేసి అందరు వైద్యాధికారులు పర్యవేక్షణ చేసేలా చూడాలని కోరారు. క్షయ బారినపడి జిల్లాలో 16 మంది చనిపోవడానికి కారణాలు ఏమిటి.. వైద్యం అందిస్తున్నప్పటికీ ఎందుకు చనిపోయారనే కారణాలు తెలుసుకునేందుకు ఆడిట్ నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఆర్బీఎస్కే ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ప్రామాణిక కార్డు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు విద్యార్థులకు అందజేయాలని సూచించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చి వైద్యం అందించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్యులు, థియేటర్ అందుబాటులో ఉన్నాయని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాలు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని.. ప్రసవాల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణుల ఏఎన్సీ నమోదు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, చికెన్ గునియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, డా. పరిమళ, డా. రియాశ్రీ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్, క్షయ, సీజనల్, అసంక్రమిత వ్యాధులను నియంత్రించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ప్రభుత్వ కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు
వనపర్తిటౌన్: జిల్లాలోని 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను నియమిస్తూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలకు పి.ఆనంద్, పెద్దమందడి కళాశాలకు టి.భీమసేన, పానగల్ కళాశాలకు తిరుమలరావు, శ్రీరంగాపూర్ కళాశాలకు ఈజే మోజెస్, ఆత్మకూర్ కళాశాలకు సైదులు, వీపనగండ్ల కళాశాలకు శివగౌడ్ నియమితులైనట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఆరు కళాశాలలు ఇన్చార్జ్లతో కొనసాగాయని.. ఇప్పటి నుంచి రెగ్యులర్ ప్రిన్సిపాల్స్తో నడవనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా లేదని చెప్పారు. 17న జాబ్ మేళా వనపర్తి: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో జిల్లాకేంద్రంలోని పీఎంకేకేలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి పది, ఐఐటీ, ఏదైనా డిగ్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ అనంతరం హైదరాబాద్, వనపర్తి జిల్లాలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని.. ఆసక్తిగల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిరు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు99485 68830, 91753 05435, 77990 73053 సంప్రదించాలన్నారు. కేఎల్ఐ కాల్వకు సాగునీరు వదలాలి పాన్గల్: కేఎల్ఐ కాల్వకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు చంద్రశేఖర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్ సమీపంలోని కేఎల్ఐ డి–8 కాల్వను రైతులతో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలం ప్రారంభమై నెలలు గడుస్తోందని, ఓ పక్క సరైన వర్షాలు కురవకపోవడం, మరోపక్క కాల్వల్లో సాగునీరు పారకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరి నారు పోసుకొని నాట్లు వేసేందుకు సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలో రైతుల ఇబ్బందులు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారులు స్పందించి వెంటనే కాల్వలకు సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని.. లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరసాగర్, ధర్మానాయక్, తిరుపతయ్యయాదవ్, బాలరాజు, శేఖర్, యాదగిరిచారి, దామోదర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6 ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న నీటి విడుదల మదనాపురం: రామన్పాడు జలాశయం నుంచి సోమవారం సాగునీటి సరఫరా కొనసాగుతుందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టులో సముద్ర మట్టానికిపైన 1,019 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 873 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని తరలించినట్లు వివరించారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం
వన మహోత్సవంపై పర్యవేక్షణ కరువు వివరాలు 8లో u●లక్ష్య ఛేదనకు ప్రయత్నం.. గతేడాది సుమారు నాలుగు లక్షల మొక్కలు ఎందుకు తక్కువగా నాటారనే విషయంపై సమీక్ష నిర్వహిస్తాం. ఏయే శాఖలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే అంశాన్ని గుర్తించి ఈ ఏడాది లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాన్ని ఆయా ప్రభుత్వ శాఖలు విధిగా చేరుకోవాలి.. అందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. – ప్రసాద్రెడ్డి, వన మహోత్సవం కార్యక్రమ ఇన్చార్జ్ అధికారి -
మెట్ట పంటలకు జీవం..
కర్నెతండా రహదారి పక్కన ఏపుగా పెరిగిన జొన్న పంట ఈ ఏడాది కురిసిన ముందస్తు వర్షాలకు జిల్లా రైతులు మెట్ట పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలు సాగు చేశారు. విత్తనాలు నాటిన తర్వాత సుమారు నెల పాటు చినుకు రాలకపోవడంతో వాడుముఖం పట్టాయి. ఇటీవల కురిసిన ముసురు వానలకు పచ్చబడి ఏపుగా పెరగడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కనీసం 10 రోజులకు ఓసారైనా వర్షం కురిస్తే పంటలు దెబ్బ తినకుండా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – ఖిల్లాఘనపురం షాపురం గ్రామ శివారులో మొక్కజొన్న ఇలా.. -
బడుల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అహర్నిషలు కృషి చేస్తూ రూ.వేల కోట్లు మంజూరు చేస్తోందని.. వార్షిక పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడం ఏమిటని ఉపాధ్యాయులపై మంత్రి వాకిటి శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.25 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అదేవిధంగా సింగంపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణితో మాట్లాడి గతేడాది పది ఫలితాల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారని అడిగారు. ఇందుకు ఆమె స్పందిస్తూ మొత్తం 80 మంది విద్యార్థులకుగాను 36 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించకపోతే ఏం బోధిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను నియమించినా.. చదువు చెప్పడంలో ఎందుకు నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని తనవంతుగా రూ.26 లక్షలు వెచ్చించి క్యూఆర్ కోడ్ కలిగిన పాఠ్య పుస్తకాలను నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశామని, ఆశించిన ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయారని ఎంఈఓ, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలకు వచ్చిన ప్రతిసారి విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన వసతులు కల్పిస్తున్నామని, ఇంకా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. వచ్చే ఏడాది వంద శాతం ఫలితాలు ఇవ్వకపోతే నిధులు ఇవ్వమని చెప్పారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుల బలోపేతంతో పాటు అంగన్వాడీలకు పక్కా భవనాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలుచేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని తెలిపారు. ప్రహరీ నిర్మాణానికి హామీ.. మండలంలోని తూక్యానాయక్తండా ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. చుట్టుపక్కల ఉన్న పంటపొలాల నుంచి విషపు పురుగులు వస్తున్నాయని ప్రధానోపాధ్యాయుడు అనిల్కుమార్రెడ్డి మంత్రికి విన్నవించారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ పీఆర్ అధికారులకు నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ కలెక్టర్ యాదయ్య, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహంకాళి విష్ణు, తిరుమల్లేష్, ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంపీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అడిగినన్నీ ఇస్తున్నా.. ఆశించిన ఫలితాలు రాకపోతే ఎలా? మంత్రి వాకిటి శ్రీహరి -
కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు వరుణుడి రాకకు ఎదురుచూపులు.. ప్రస్తుత వర్షాకాలంలో రుతు పవనాలు ముందస్తుగా వచ్చి మురిపించడంతో అధికారులు వన మహోత్సవానికి గుంతలు తవ్వి ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నర్సరీ నుంచి సుమారు ఐదు లక్షల వివిధ రకాల మొక్కలు కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా డీఆర్డీఓ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అటవీ ప్రాంతంలో నాటే మొక్కలు, ఇళ్ల ఆవరణల్లో నాటుకునేందుకు పండ్ల మొక్కలను జిల్లా లక్ష్యానికి సరిపడే విధంగా పెంచారు. కానీ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో మొక్కలు సిద్ధంగా ఉన్నా.. నాటేందుకు అవకాశం లేకుండా పోతోంది. వనపర్తి: వన మహోత్సవం పేరిట అధికారులు ఏటా మొక్కలు నాటేటప్పుడు చూపుతున్న ఆసక్తి.. వాటి సంరక్షణలో లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పచ్చదనం పెంపొందించడంపై అధికార, పాలకవర్గానికి ఆసక్తి సన్నగిల్లుతోందనేందుకు నీరసించిన ఫలితాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వన మహోత్సవంలో భాగంగా గతేడాది జిల్లాలో 18.3 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. 14.3 లక్షల మొక్కలు మాత్రమే నాటడం కారణంగా చెప్పవచ్చు. ఏటా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అగ్రస్థానంలో లక్ష్యం నిర్దేశించుకొని మొక్కలు నాటుకున్నారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు కలుపుకొని 21.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఇటీవల అటవీశాఖ నిర్వహించిన వన మహోత్సవం తొలి కార్యక్రమంలో కేవలం 1,945 మొక్కలు నాటారు. పెరగని అటవీ విస్తీర్ణం.. పదేళ్లుగా హరితహారం, వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షల్లో మొక్కలు నాటుతున్నా.. జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవి (పచ్చదనం) నిబంధన చేరుకునేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 5.41 లక్షల ఎకరాలు ఉండగా.. అటవీ విస్తీర్ణం కేవలం 27.50 వేల ఎకరాలు ఉంది. ఇంకా వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని పెంచాల్సి ఉంటుంది. పచ్చదనం.. తగ్గుముఖం ఏటా లక్షల్లో మొక్కలు నాటుతున్నా.. పచ్చదనం విస్తీర్ణం మాత్రం పెరగడం లేదు. రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి మొక్కలు నాటుతున్నా.. ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండిన మొక్కల స్థానంలో తిరిగి నాటేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పెరుగుతోంది. జిల్లాకేంద్రంలో అటవీశాఖ నిర్వహించిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాయకులు (ఫైల్) శాఖల వారీగా మొక్కల లక్ష్యం.. శాఖ 2024 2025 లక్ష్యం నాటింది లక్ష్యం నాటింది గ్రామీణాభివృద్ధి 10,00,000 9,12,539 11,54,800 – అటవీశాఖ 1,00,000 66,404 2,00,000 1,945 పంచాయతీరాజ్ 3,00,000 – 35,000 – నీటిపారుదల 2,39,212 – 50,000 – వ్యవసాయ 12,000 1,000 30,000 – ఉద్యాన 15,000 26,975 50,000 – ఎకై ్సజ్ 10,000 3,400 13,500 – ఇతర శాఖలు 1,63,000 4,20,956 6,37,000 – జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ., మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి జీవరాశులు, వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది. ●కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు.. కృష్ణానదిలో కాలుష్య కారకాలు కలుస్తున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. ఇది మా పరిధిలోని అంశం కాదు. కాలుష్య నివారణ బోర్డుకు సంబంధించిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ పచ్చగా మారుతున్నాయి.. కృష్ణానదిలో నీళ్లు మూడేళ్లుగా పచ్చగా మారుతున్నాయి. ఇవి పై నుంచి వస్తున్నాయి. వరద వచ్చినప్పుడు నీళ్లపై ఆకుపచ్చ రంగులో తెట్టెలు ఉంటున్నాయి. నీళ్లు తగ్గే సమయంలో అధికంగా కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా కొన్నిచోట్ల ఈ నీటి తెట్టెలు కనిపించాయి. ఈ విషయం ఇక్కడికి వచ్చే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – బాలరాజు, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం మత్స్య సంపదకూ ముప్పే.. నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు. కృష్ణానదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్క న్యూస్రీల్కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా.. గతేడాది 18.3 లక్షలకుగాను నాటింది 14.3 లక్షలే.. పెరుగుతున్న మొక్కల్లో తగ్గుతున్న లెక్క ఈ ఏడాది లక్ష్యం 21.7 లక్షలు శుద్ధి చేసిన నీటినే.. మిషన్ భగీరథ స్కీంకు కృష్ణానది నుంచి ఎత్తిపోసే నీటినే వినియోగిస్తున్నాం. ఈ నీళ్లను రెగ్యులర్గా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. మట్టి, చెత్త ఏమున్నా ఫిల్టరింగ్లో వెళ్లిపోతుంది. ఆరోగ్యానికి హాని కలిగించని ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి. నీటి ఫిల్టరింగ్ను రెగ్యులర్గా పర్యవేక్షిస్తాం. నది నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే బాధ్యత మా శాఖ పరిధిలో లేదు. – అంజాద్పాష, డీఈఈ, మిషన్ భగీరథ పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి మారిన నది నీళ్లు మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు -
మత్స్యబీజానికి అనాసక్తి!
చేప పిల్లల స్థానంలో నగదు ఇవ్వాలని డిమాండ్ ●నగదు చెల్లించాలి.. రాయితీ చేప పిల్లలకు బదులు సరిపడా నగదు చెల్లిస్తే బాగుంటుంది. అవే డబ్బులతో మార్కెట్లో డిమాండ్ ఉన్న చేప పిల్లల రకాలు కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకొనే వీలుంటుంది. ఏడాది పాటు చెరువులో నీరు ఉండటంతో చేపల బరువుతో పాటు సైజు పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. – రవికాంత్, కార్యదర్శి, అమరచింత మత్స్య సహకార సంఘం ప్రభుత్వం ఆదుకోవాలి.. జూరాల జలాశయంలో తమ జాలర్లు చేపలు పట్టుకొని జీవిస్తున్నారు. దీంతోపాటు గ్రామంలోని చెరువులో సైతం చేపలు పెంచుకుంటున్నాం. ప్రభుత్వం ఈసారి నగదు రూపంలో సొసైటీకి అందిస్తే మత్స్యకారులే నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసుకుంటారు. – శ్రీధర్, నందిమళ్ల మత్స్య సహకార సంఘం ఎలాంటి సమాచారం లేదు.. రాయితీ చేప పిల్లల పంపిణీ, మత్స్యకార సొసైటీలకు నగదు జమపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మత్స్యకారులు మాత్రం చాలాసార్లు తమకు నగదు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీని మాని సంఘాలకు నగదు ఇవ్వాలని.. వాటితో తమకు నచ్చిన మత్స్య బీజాన్ని చెరువులు, కుంటల్లో వదులుకుంటామని జిల్లా మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన రాయితీ చేప పిల్లలు ఆశించిన మేర పెరగక.. లాభాలు రాక కుటుంబ పోషణ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం మత్స్య సహకార సొసైటీలకు 50 శాతం చేప పిల్లలు పంపిణీ చేసి చేతులు దులుపుకొందని.. మరి కొన్నింటికి అసలే ఇవ్వలేదని చెబుతున్నారు. చేప పిల్లల పోషణకు అనువైన పరిస్థితులున్నా.. అవి కేవలం అర కిలో, కిలో బరువు వరకే పెరగడం ఏమిటని మత్స్యశాఖ అధికారులను ప్రశ్నిస్తుండగా, ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించగా.. వారే చేప పిల్లలను చెరువులు, జలాశయాలల్లో వదిలారే తప్ప ఎంపికలో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మత్స్యకారులు జీవనం పొందాలంటే ప్రభుత్వం ఈసారి నగదు అందించాలన్న డిమాండ్ అధికమైంది. చేపల వేటతోనే కుటుంబ పోషణ.. మత్స్యకారులు నిత్యం చేపలు పట్టి విక్రయించి వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని రామన్పాడు, జూరాల, శ్రీశైలం బ్యాక్వాటర్తో పాటు చిన్న చిన్న చెరువులు, నీటికుంటల్లో చేపలు పట్టుకొని వేలాది మంది జాలర్లు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోరమీను, బంగారు తీగ, రొయ్యలు అధికంగా లభించక పోవడంతో కేవలం బొచ్చజాతి చేపలను విక్రయిస్తున్నారు. ● గ్రామాల్లోని నీటి కుంటలు, చెరువుల్లో గ్రామస్తుల సహకారంతో మత్స్యకారులు చేపలు పెంచుకుంటున్నారు. అతిపెద్ద సొసైటీలు సైతం జలాశయాల్లో చేపలు పట్టి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ వచ్చే ఆదాయంతో సొసైటీల నిర్వహణతో పాటు సభ్యులకు రోజువారి వేతనాలు అందిస్తూ కొనసాగిస్తున్నారు. అయితే సొసైటీలకే ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తే మేలు రకం చేప పిల్లలు కొనుగోలు చేసుకుంటామంటున్నారు. జిల్లాలో ఇలా.. గ్రామాలు 255 రిజర్వాయర్లు, చెరువులు, 1,052 కుంటలు మత్స్య సహకార సంఘాలు 143 మత్స్యకారులు 13,600 చేపల విక్రయదారులు సుమారు 20 వేలు నాసిరకంతో నష్టపోతున్నామన్న వాదన నచ్చిన సీడ్ తెచ్చుకుంటామంటున్న మత్స్యకారులు గతేడాది 50 శాతం మాత్రమే పంపిణీ జిల్లాలో 13,600 మంది మత్స్యకారులు గతేడాది పంపిణీ ఇలా.. గతేడాది జిల్లాలో 50 శాతం మేర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసింది. 58 లక్షల చేప పిల్లలకుగాను రూ.89,40,011 వెచ్చించింది. ఈసారి సొసైటీలకు ఇచ్చే చేప పిల్లల ఆధారంగా చిన్న వాటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, పెద్ద పొసైటీలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తే మేలురకం మత్స్యబీజం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. -
కెప్టెన్గా రాణించిన అనిత
నారాయణపేట జిల్లా కోస్గి మండలం హన్మాన్పల్లికి చెందిన అనిత ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ లీగ్లో రెడ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించి చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. రెండు మ్యాచుల్లో 59 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. వనపర్తిలోని గిరిజన సొసైటీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆల్రౌండర్గా రాణిస్తోంది. ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021లో హెచ్సీఏ మహిళా జట్టుకు ఎంపికై సూరత్లో జరిగిన టోర్నీలో ఆడింది. బెంగళూర్లో జరిగిన టీ–20 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరపున పాల్గొంది. హెచ్సీఏ టోర్నీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికకవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనిత. -
ఆల్రౌండర్గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే
మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రాఫే బ్యాటింగ్తో పాటు కీపర్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్టిక్ట్ అండర్–19 వన్డే క్రికెట్లో బ్యాటింగ్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద్వాలపై అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. నారాయణపేటపై 127 బంతుల్లో 3 సిక్స్లు, 25 ఫోర్లతో 165 పరుగులు చేశాడు. లీగ్లో 495 పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2023లో టుడే లీగ్లో రెండు సెంచరీలు, మూడు అర్థసెంచరీలు చేశాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో పీయూ తరఫున ఆడి రాణించాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీమిండియాకు ఆడాలన్నదే తన కల అని పే అంటున్నాడు అబ్దుల్ రాఫే. -
బాల్యం బడిబయటే!
‘బడిబాట’ నిర్వహిస్తున్నా.. నెరవేరని లక్ష్యం ●వనపర్తి: విద్యాశాఖ ఏటా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా.. జిల్లాలో ఆశించిన మేర ఫలితాలు రావడం లేదన్న నిరాసక్తత అధికార, పాలకవర్గం నుంచి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించినా.. కొన్ని ప్రాంతాల్లోని బాలలు బడికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి తన బృందంతో జిల్లాలో పర్యటించింది. అదే సమయంలో జిల్లాకేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బస్సు కోసం కొందరు విద్యార్థులు యూనిఫాం ధరించి ఎదురుచూస్తుండగా.. పక్కనే పలువురు బడిబాట ఎరుగని చిన్నారులు కాగితాలు ఎరుకుంటూ కనిపించిన దృశ్యాలను పట్టణవాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా 4,488 కొత్త ప్రవేశాలు చేపట్టామని గొప్పలు చెప్పుకొంటున్న విద్యాశాఖ అధికారులకు ఈ దృశ్యాలు కనిపించవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే.. ఈసారి సుమారు 500 వరకు కొత్త ప్రవేశాలు తగ్గినట్లు అధికారుల గణాంకాలతో స్పష్టమవుతోంది. ఈ విషయంపై విద్యాశాఖ అఽధికారులు నోరు మెదపడం లేదు. రెండు నుంచి పదోతరగతి వరకు ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నివేదికలో చూపించారు. అధికారులు మరింత దృష్టి సారిస్తే ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన అధికార, పాలకవర్గంలో ఉంది. ఇందుకు కారణం విద్యాశాఖలో కీలక పోస్టులను డైట్ అధ్యాపకులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకు రావటమేనన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ ఇంటర్పై అనాసక్తి.. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో కనీసం 50 శాతం మంది కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో చేరడం లేదు. ఇందుకు గల కారణాలను కొన్నేళ్లుగా డీఐఈఓలు అన్వేషిస్తున్నా ఫలితం మాత్రం శూన్యమేనని చెప్పవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల నుంచి ఏటా సుమారు 7 వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఇందులో కనీసం సగం మంది కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందడం లేదు. రెసిడెన్షియల్కు ఆదరణ.. అయిదో తరగతి తర్వాత విద్యార్థుల్లో ఎక్కువ మంది రెసిడెన్షియల్కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలికలు కేజీబీవీలకు, బాలురు గురుకులాలకు వెళ్తున్నారు. ఒకటో తరగతిలో వచ్చే అడ్మిషన్లు ఆరో తరగతిలో తగ్గిపోతున్నాయి. బడిబాట కార్యక్రమంలో మిగిలిపోయిన బాలలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. బడిఈడు పిల్లలందర్ని పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధిశాఖ ఏటా సగటున 4,500 మించని కొత్త ప్రవేశాలు ప్రతి ఏడాది ‘పది’ ఉత్తీర్ణత సాధిస్తున్న ప్రభుత్వ విద్యార్థులు సుమారు ఏడు వేల మంది.. ఇంటర్లో ప్రవేశాలకు 50 శాతం మంది అనాసక్తి -
బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్
మహబూబ్నగర్కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పున వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్కర్నూల్పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్లో జరిగిన హెచ్సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్. -
‘శత’క్కొట్టిన కేతన్కుమార్
జడ్చర్లకు చెందిన కేతన్కుమార్ యాదవ్ బ్యాటింగ్లో సంచలనం సృష్టించాడు. రెండేళ్లుగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న కేతన్ అండర్–23 లీగ్లో మూడు సెంచరీలు కొట్టి 474 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. వనపర్తితో జరిగిన టూ డే లీగ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకొట్టి 221 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 113, రెండో ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. మహబూబ్నగర్పై మరో సెంచరీ (101 పరుగులు) చేశాడు. రంజీ జ ట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు కేతన్కుమార్. -
‘కామారెడ్డి డిక్లరేషన్ను కప్పిపుచ్చేందుకే డ్రామాలు’
వనపర్తి విద్యావిభాగం: కామారెడ్డి డిక్లరేషన్ను కప్పిపెట్టే డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి నివాసంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తోందని.. ఆర్డినెన్స్ ద్వారా 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ, పార్లమెంట్ ఆమోదం తర్వాతే బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని తెలిసి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి కాంగ్రెస్పార్టీ కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. కార్మిక, రైతు చట్టాలకు చట్టబద్ధత కల్పించినట్లుగానే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, వేణు యాదవ్, బొల్లెద్దుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కళాశాలల నిర్వహణకు నిధులు మంజూరు వనపర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.2.30 లక్షలు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మంజూరు చేశారని డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం తెలిపారు. జూన్, జూలైకుగాను నిధులు విడుదలయ్యాయని.. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.40 వేలు, బాలికల జూనియర్ కళాశాలకు రూ.30 వేలు, ఉర్దూ మీడియం కళాశాలకు రూ.12 వేలు, ఆత్మకూర్ కళాశాలకు రూ.24 వేలు, కొత్తకోట, పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్, శ్రీరంగాపూరం, వీపనగండ్ల, గోపాల్పేట ఒక్కో కళాశాలకు రూ.16 వేలు, పెబ్బేర్ కళాశాలకు రూ.12 వేలు మంజూరయ్యాయని.. ప్రిన్సిపాల్స్ కళాశాల కమిటీ సమన్వయంతో వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.1.20 లక్షలు మంజూరుకాగా.. ఒక్కో కళాశాలకు రూ.10 వేల చొప్పున జమ చేసినట్లు వెల్లడించారు. కళాశాల కమిటీ నిర్ణయం మేరకు క్రీడా సామగ్రి కొనుగోలు చేసి ప్రతి శనివారం విధిగా క్రీడలు నిర్వహించాని సూచించారు. -
బ్యాటింగ్లో ‘ప్రతీక’ ప్రతిభ
మహహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన ప్రతీక తాండూరులో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్లో పాల్గొని ప్రతిభచాటింది. వికెట్ కీపర్గా, బ్యాటింగ్లో రాణిస్తోంది. హైదరాబాద్లోని కేఎస్ఎం క్లబ్లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ప్రతీక గత ఏడాది అండర్–15 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరఫున తమిళనాడు, ఆంధ్ర జట్లతో మ్యాచ్లు ఆడింది. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో వుమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రికెట్లో ప్రతిభ కనబరిచి భారత జట్టు ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది ప్రతీక. -
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
వనపర్తి: నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసుల దర్యాప్తు క్షుణ్ణంగా చేపట్టి పర్యవేక్షించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసు దర్యాప్తును నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు అండగా ఉండాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ పరిమితిలో ఉండాలని, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ప్రతి అధికారికి పూర్తి విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. భూ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సీఐలకు సూచించారు. పోక్సో, అత్యాచార కేసుల్లో జిల్లా భరోసా కేంద్రం సేవలను వినియోగించుకొని బాధితులకు మెడికో, లీగల్ సేవలు అందిస్తూ, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని, దోషులను న్యాయస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్పై విద్యాసంస్థలు, గ్రామాలు, కూడళ్లలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమీక్షలో డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఐటీ కోర్, డీసీఆర్బీ కమ్యూనికేషన్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఖిల్లాఘనపురం: మనం నేడు నాటే మొక్కలు భవిష్యత్తులో మానవ మనుగడకు ఉపయోగపడతాయని.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు రుక్కన్నపల్లి, మల్కాపురంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని అధికారులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ఉపాధి సిబ్బంది మొక్కలు నాటేందుకు కావాల్సిన గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ ప్రజలు, పెద్దల సహకారంతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ సునీత, ఎంపీఓ రాజు, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్ఏలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
నాగర్కర్నూల్/ కల్వకుర్తి/ కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం ప్రారంభం, జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవనం శంకుస్థాపన, వెల్దండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రూ.140 కోట్లతో రహదారుల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ నుంచి మున్ననూర్ వరకు ప్రధాన రహదారికి మరి కొన్ని రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తన చారిటీ ట్రస్టు ద్వారా కృషిచేస్తానన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలి ట్రామా కేర్ సెంటర్, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
వనపర్తి: వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. టోల్ఫ్రీ నంబర్ల 08545–233525, 08545–220351కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపాయకర పరిస్థితులు, ముంపు ప్రమాదం, ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం సముద్ర మట్టానికి పైన 1,019 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలో 770 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 525 క్యూసెక్కుల వరద కొనసాగుతుందని.. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 700 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 782 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయండి వనపర్తి రూరల్: పెబ్బేరులో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐటీయూ జిల్లా 4వ మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ర్యాలీగా జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి చేరుకొని డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులుకు బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఆశా కార్యకర్తలను అనుమతించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా మహాసభలకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పుర, గ్రామపంచాయతీ కార్మికులు, ఐకేపీ వీఓఏలు, మెప్మా ఆర్పీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు, తదితర శాఖల్లో పని చేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.సునీత, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గంధం మదన్, జిల్లా కమిటీ సభ్యులు నందిమళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానం.. పల్లె ప్రకృతి వనం
గోపాల్పేట: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో 10 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాన్ని సేకరించి భారీ సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు ఉదయపు నడక కోసం వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసింది. ప్రారంభంలో నిర్వహణ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగించగా.. వారు ఆయా వనాల్లో కలుపు తీయడం, నీరు పట్టడం వంటి పనులు చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. దీంతో సిబ్బందికి అదనపు పనులు కావడంతో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రకృతి వనాల్లో కలుపు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని గోపాల్పేట మండలంలో 15, రేవల్లిలో 12, పెద్దమందడిలో 22, కొత్తకోటలో 22, పాన్గల్లో 28, వీపనగండ్లలో 14, ఖిల్లా ఘనపురంలో 27, వనపర్తి రూరల్ 26, చిన్నంబావిలో 17, అమరచింతలో 14 ఇలా మొత్తం 319 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రకృతి వనం ఏర్పాటుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు రూ.రెండు లక్షల వరకు వెచ్చించారు. కేటాయించిన స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటు చేసి గేటు బిగించి పల్లె ప్రకృతి వనాలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక నాటిన మొక్కలు కనిపించకపోగా పిచ్చి మొక్కలతో నిండి దర్శనమిస్తున్నాయి. ● రేవల్లిలోని పల్లె ప్రకృతి వనాన్ని పట్టించుకోకపోవడం, గేటుకు తాళం వేసి ఉంచడంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. బయటి నుండి సైతం ముళ్లపొదలు పెరిగి ప్రకృతి వనం కనిపించకుండా అయింది. ● గోపాల్పేటలో మండల కేంద్రం పల్లె ప్రకృతి వనంతో పాటు పక్కనే ఉన్న ధన్సింగ్ తండాకు చెందిన పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడం, పర్యవేక్షించేవారు కనిపించకపోవడంతో స్థానికులు బహిర్భూమికి వినియోగిస్తున్నారు. ● వీపనగండ్ల మండలంలో గోపాల్దిన్నె, కల్వరాల, బొల్లారం గ్రామాల్లోని ప్రకృతి వనాలు పిచ్చి మొక్కలతో నిండి నిరుపయోగంగా మారాయి. అలాగే మరికొన్ని చోట్ల యువత మద్యం తాగడానికి, సిగరేట్లు కాల్చేందుకు వినియోగించుకుంటున్నారని ఆయా గ్రామస్తులు వివరించారు. రూ.కోట్ల ప్రజాధనంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిచ్చి మొక్కలతో నిండిన రేవల్లి పల్లె ప్రకృతి వనం నిర్వహణకు నిధులు కరువు పట్టించుకోని పాలకులు, అధికారులు జిల్లావ్యాప్తంగా 319 ఏర్పాటు కొన్ని గ్రామాల్లో బహిర్భూమికి వినియోగిస్తున్న వైనం పిచ్చి మొక్కలు మొలిచాయి.. మండల కేంద్రానికి చెందిన పల్లె ప్రకృతి వనాన్ని పాలమూరు రంగారెడ్డి కాల్వ సమీపంలో గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. గేటుకు తాళం వేసి ఉంచారు. ఉపాధి, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకొని శుభ్రంగా చేస్తే బాగుంటుంది. అధికారులు ఆ దిశగా కృషి చేయాలి. – బంగారు శ్రీనివాసులు, రేవల్లి నిర్వహణ మరిచారు.. గత ప్రభుత్వంలో ప్రజలు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాధించేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉపాధి సిబ్బంది నిర్వహణ చూసేవారు. ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయాయి. జిల్లా అధికారులు స్పందించి అందుబాటులోకి తీసుకురావాలి. – బాలరాజు, గోపాల్పేట తగిన చర్యలు తీసుకుంటాం.. పల్లె ప్రకృతి వనాలను అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే ఊరుకోం. గ్రామాల వారీగా అధికారులతో పరిశీలన జరిపి నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామపంచాయతీ సిబ్బందితో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు తొలగిస్తాం. – రఘునాథ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రతిపక్షాలకు అభివృద్ధితో సమాధానమిస్తాం
మదనాపురం: ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాటలు మాట్లాడినా.. అభివృద్ధితోనే సమాధానమిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్లో రూ.10 లక్షలతో నిర్మించనున్న హమాలి సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. నిత్యం శ్రమించే కార్మికుల కష్టాలను గుర్తించి వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి: జనాభా నియంత్రణతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం, కాన్పుల మధ్య ఎడం, తల్లి బిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పాటించండి.. ఆరోగ్యంగా జీవించండి, కుటుంబ సంక్షేమం.. దేశ సౌభాగ్యం అనే నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాన్పునకు కాన్పునకు మధ్య ఎడమ ఉండాలని.. జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలతో పాటు రక్తహీనత, గర్భస్రావం సంభవించే ప్రమాదం ఉందని వివరించారు. ప్రతి కుటుంబం ఒక్కరు లేదా ఇద్దరు సంతానంతో ఆరోగ్యవంత సమాజం ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్న కుటుంబంతో కలిగే ప్రయోజనాలు, తల్లి బిడ్డ ఆరోగ్యం వంటి అంశాలపై జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. బండారి శ్రీనివాసులు, వైద్యాధికారులు, నర్సింగ్ విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
పీఏఐ పకడ్బందీగా పూర్తి చేయాలి
వనపర్తి: కేంద్రానికి 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీల అభివృద్ధి సూచిక (పీఏఐ) వివరాలు పంపించాల్సి ఉంటుందని.. పకడ్బందీగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఈ అంశంపై సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి నిర్దేశించిన 9 విభాగాల్లో 147 ఇండికేటర్స్ను పూర్తి చేసి గ్రామపంచాయతీల వారీగా పంపించాలని సూచించారు. ఇండికేటర్స్ వివరాలను సేకరించి ఎంపీడీఓల లాగిన్ నుంచి పంపించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, ముఖ్య ప్రణాళిక అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచండి
వనపర్తి: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగష్టు 15 నాటికి ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్లో ఉండకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు అవసరమైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. చాలా దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్లోనే పరిష్కరించవచ్చని చెప్పారు. మిగిలిన వాటిని ప్రాధాన్యత క్రమంలో ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్కు పంపించాలన్నారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి ఉంటే స్పీకింగ్ ఆర్డర్ ద్వారా తిరస్కరించి దరఖాస్తుదారుకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ వేగవంతం చేయాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కొరకు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి
ఆత్మకూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్కుగాను గురువారం ఆమె స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రూ.కోటి వ్యయంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ముందుగా రూ.20 లక్షలు బ్యాంకు రుణం పొందేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మండల పరిధిలోని జూరాల గ్రామ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఎం నాగమల్లిక, తహసీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద, ఏపీఎంలు శ్రీనివాసులు, సక్రూనాయక్ పాల్గొన్నారు. -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్కర్నూల్/వనపర్తి: ఏటా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దశా బ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా పెరుగుతున్న కారణంగా భవిష్యత్లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. దీంతో యువ జనాభా తగ్గుముఖం పడు తుండటం, వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ, సామాజిక మార్పులు, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రా ధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం దంపతులు ఒకరు లేదా ఇద్దరి వరకే పిల్లలను కనేందుకు మొగ్గు చూపుతున్నారు. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్లోనే ఎక్కువ శా తం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణులు కాగా, 10.19 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుండగా, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వరకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కు.ని., పకడ్బందీగా అమలు, సా మాజికంగా, ప్రజల ఆలోచనల్లో మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వరకు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
కార్యకర్తలకు అండగా ఉంటాం : బీరం
పాన్గల్: నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని.. సంఘటితంగా ఎదుర్కొంటూ అండగా ఉంటామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జమ్మాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చిన్నంబావి మండలంలో మాజీ జెడ్పీటీసీ భర్త చిన్నారెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని.. ఈ ఘటనపై కోర్టును ఆశ్రయిస్తే అరెస్టు చేయకుండా నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదే మండలంలోని చిన్నమారూర్లో యాదవులపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారిపైనే కేసులు నమోదు చేసి భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. మండలంలోని రేమద్దులలో అధికార పార్టీ అండతో అక్రమార్కులు సాగునీటి కాల్వను ధ్వంసం చేసి మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్నాయక్, న్యాయమూర్తి రవికుమార్, జ్యోతినందన్రెడ్డి, సుధాకర్యాదవ్ పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం వనపర్తి విద్యావిభాగం: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ లలిత కళాతోరణంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. గురు పూజోత్సవం సందర్భంగా వ్యాస మహర్షిని మనందరం పూజిస్తున్నామని తెలిపారు. గురువు లేకుండా శిక్షణ లేదని, చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే వారు, జ్ఞానోదయాన్ని కల్పించేవారు గురువని.. మనల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన గురువులను స్మరించుకోవడం, వారిపట్ల కృతజ్ఞత భావంతో ఉండటం చాలా ముఖ్యమన్నారు. కవులు, ఉపాధ్యాయులు, కళాకారులు, సాహితీవేత్తలు, కరాటే మాస్టర్లను వారు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పెద్దిరాజు, మున్నూర్ రవీందర్, సీతారాములు, కుమారస్వామి, వెంకటేశ్వర్రెడ్డి, తిరుమల్లేష్, బచ్చు రాము, వెంకటేష్నాయుడు, రాజశేఖర్, కాటమోని కృష్ణగౌడ్, రాయన్న, ఉపేందర్యాదవ్, చంద్రశేఖర్, శివ పాల్గొన్నారు. రామన్పాడులో పెరిగిన నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో గురువారం నీటిమట్టం కాస్త పెరిగిందని.. సముద్ర మట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 770 క్యూసెక్కుల వరద పారుతుందని చెప్పారు. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 905 క్యూసెక్కులు, కుడి, ఎడమ కా ల్వలకు 45, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిన్నామని వివరించారు. -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవ కాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. వీరినే మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేస్తే సరిపోతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
కొత్తకోట రూరల్: పాఠశాల, కళాశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. గురువారం మండలంలోని అమడబాకుల కస్తూర్బాగాంధీ విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గురువులను దైవ సమానులుగా భావించాలని.. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడంతో మానసికోల్లాసంతో పాటు సమయస్ఫూర్తి, జ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో లీగల్ లిటరసీ క్లబ్ ప్రారంభించి టీచర్ కో–ఆర్డినేటర్గా ధనుంజయ్గౌడ్ను, స్టూడెంట్ రిప్రజెంటేటివ్గా వేణు, శ్రీమాన్, విద్య, శ్రీవాణిని నియమించారు. కార్యక్రమంలో ప్యానల్ లాయర్ కృష్ణయ్య, గ్రామ పెద్దలు సత్యారెడ్డి, వామన్గౌడ్, కృష్ణయ్య, రంగారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కృష్ణయ్య, సురేంద్రాచారి, ప్రకాష్, శ్రీనివాసులు, విజయ్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్గౌడ్, సురేష్బాబు, కేజీబీవీ ఎస్ఓ చందన, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మానవ మనుగడలో వృక్షాలే కీలకం
వనపర్తి: ప్రాణ వాయువునిస్తూ మానవ మనుగడలో వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. వాతావరణ సమతుల్యత కాపాడుతున్న చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏకో పార్క్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఎఫ్ఓ సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతకు భూ భాగంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని, ప్రస్తుతం జిల్లాలో 18 నుంచి 19 శాతం మాత్రమే ఉందని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇళ్ల ఆవరణలు, పొలాల గట్టు, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 21 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. బైపాస్ రోడ్లో మార్నింగ్ వాక్.. జిల్లాకేంద్రంలోని కొత్తకోట రోడ్ నుంచి కర్నూలు రోడ్ వరకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేపట్టారు. ప్రజలకు ఉపయోగపడేలా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి జిల్లాకేంద్రంలోని మెడికల్, నర్సింగ్ కాలేజీ, కోర్డులు, ఇతర కార్యాలయాలకు చేరుకునేందుకు సౌకర్యంగా మారనుందని తెలిపారు. రోడ్డు నిర్మాణంలో స్థలాలు కోల్పోయే వారితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, నాయకులు కిచ్చారెడ్డి, మహేష్, కృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
వనపర్తి రూరల్: పెట్టుబడిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుట్టా ఆంజనేయులు ఆరోపించారు. బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, బీఆర్టీయూ, టీఎన్జీయూసీ, ఐసీఈయూ తదితర సంఘాల నాయకులు, కార్మికులు, పలు శాఖల ఉద్యోగులు, రైతులు పాల్గొని మద్దతు తెలిపారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి గాంధీచౌక్ ,శంకర్గంజ్, కమాన్ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి అరుణ్కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషా, బీఆర్టీయూ జిల్లా నాయకుడు గట్టుయాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, సంఘం ఏర్పాటు చేసుకొనే హక్కు కష్టతరంగా మార్చిందన్నారు. 1886లో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటలు పని చేయాలని నిర్ణయించిందని.. రాష్ట్ర ప్రభుత్వం జీఓనంబర్ 282 తీసుకొచ్చి పది గంటలు పని చేయాలని నిర్ణయించడం దారుణమని తెలిపారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం పక్కన పెట్టిందని, వేతనాలకు గ్యారెంటీ లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు, స్కీం వర్కర్లు, ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. హమాలీ, రవాణా తదితర రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. -
కోతకు గురైన భూములు..
గణప సముద్రం చెరువును రిజర్వాయర్గా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభం కావడంతో కొందరు వ్యక్తులు కత్వకు ఓ పక్కన ఉన్న కొంత సిమెంట్ బెడ్డు, రాతి కట్టడాన్ని తొలగించారు. గతేడాది పెద్ద వాగుకు భారీగా వరద రావడంతో సగభాగం తెగి పలువురు రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. దెబ్బతిన్న భూములకు పరిహారం ఇవ్వాలని, ఈ ఏడాది వర్షాకాలంలో వాగు పారితే వందల ఎకరాల భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని.. వెంటనే మరమ్మతులు చేపట్టాలంటూ రైతులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో పాటు తహసీల్దార్, వ్యవసాయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కత్వ నిర్మాణం పూర్తయితేనే కేఎల్ఐ నీరు గణపసముద్రం రిజర్వాయర్కు చేరుతాయి. -
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు ఏర్పాట్లు
వనపర్తి: లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఈ 27న నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం పరీక్షల నిర్వహణపై సీసీఎల్ఏ లోకేష్కుమార్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ హాజరై వివరాలు వెల్లడించారు. 15వ తేదీలోగా పరీక్ష కేంద్రం వివరాలు సిద్ధం చేసి సీసీఎల్ఏకు పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొదటి విడత శిక్షణకు 112 మందిని కేటాయించారని.. 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో ఏడీ ల్యాండ్ సర్వేయర్ బాలకృష్ణ, ఏఓ భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
వనపర్తి: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాలని, నూతన చట్టాలపై అవగాహన కల్పించాలని, పోలీస్స్టేషన్కు ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జిల్లా పరిధిలో శిక్షణ పొంది మొదటిసారి పోలీస్స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న ఆరుగురు ఎస్ఐలు హిమబిందు, దివ్యారెడ్డి, జె.నరేష్, ఎన్.వేణుగోపాల్, డి.శశిధర్, కె.భాస్కర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. మొదటి పోస్టింగ్ను ఎప్పుడూ మరిచిపోమని.. నిర్వర్తించిన విధులు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడికి చేరుకోవాలని, డయల్ 100 ఫిర్యాదులను స్పందించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను గ్రామస్తులు, వ్యాపారులతో కలిసి మరమ్మతు చేయించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ పాల్గొన్నారు. -
వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి
వనపర్తి రూరల్: రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు దుకాణదారుడితో విధిగా రసీదు తీసుకొని పంట దిగుబడి సరిగా రానప్పుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని సూచించారు. బుధవారం మండలంలోని ఖాసీంనగర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, బాల కార్మికుల చట్టం గురించి వివరించారు. అదేవిధంగా ఉచిత న్యాయ సాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఉచిత న్యాయ సేవా కేందాన్ని ప్రారంభించారు. న్యాయపరమైన సహాయం, సలహాల కోసం కమిటీలో ఉన్న ప్యానల్ లాయర్లు తిరుపతయ్య, ఎండీ నిరంజన్బాబా, పారా లీగల్ వలంటీర్లు శివప్రసాద్, రవీందర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డా. పుష్పలత, ప్యానల్ లాయర్లు తిరుపతయ్య, కృష్ణయ్య, ఎండీ నిరంజన్బాబా, వలంటీర్లు రవీందర్, శివప్రసాద్, నాగరాజు, కార్యదర్శి లక్ష్మి, మాజీ సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
వరద భయం..!
పెద్ద వాగుపై 50 ఏళ్ల కిందట కత్వ నిర్మాణం వివరాలు 8లో u●మరమ్మతులు కరువు.. గతేడాది కత్వను ఎవరో ఓ పక్క కొంచెం పగలగొట్టారు. పెద్దవాగు పారడంతో మా పొలాల పక్కన తెగింది. దీంతో 0.15 ఎకరాల భూమి కోతకు గురైంది. కత్వ మరమ్మతులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు. – బుగ్గని కర్రెన్న, మల్కిమియాన్పల్లి కత్వ నిర్మాణం చేపట్టాలి.. ప్రభుత్వం కొత్తగా కత్వ నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ ఏడాది వర్షాలకు పెద్ద వాగు పారి పొలాలు మొత్తం కొట్టుకపోతాయి. గతేడాది 0.20 ఎకరాల భూమి కొట్టుకపోయింది. ఈ ఏడాది వాగు పారితే వందల ఎకరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కత్వ మరమ్మతు చేపడితేనే గణప సముద్రం రిజర్వాయర్కు నీరు చేరుతుంది. – చిట్యాల చెన్నయ్య, మల్కిమియాన్పల్లి ప్రభుత్వానికి నివేదించాం.. ఖిల్లాఘనపురం మండలం మల్కిమియాన్పల్లి, అప్పారెడ్డిపల్లి, అన్పహడ్ శివారులో గణపసముద్రం రిజర్వాయర్కు నీటిని మళ్లించేందుకు వాగుకు అడ్డంగా నిర్మించిన కత్వ గతేడాది వరదకు గండి పడింది. మరమ్మతు కోసం అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. మంజూరు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – మధుసూదన్రావు, ఈఈ, నీటిపారుదలశాఖ ఇతడి పేరు కప్పెట చెన్నయ్య. మండలంలోని మల్కిమియాన్పల్లి స్వగ్రామం. గతేడాది పెద్ద వాగు పొంగిపొర్లి కత్వకు గండి పడి పక్కన ఉన్న 0.30 ఎకరాల వ్యవసాయ భూమి కోతకు గురైంది. ఇసుక మేటలు వేయడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలించి రూ.15 వేలు పరిహారం అందించి చేతులు దులుపుకొన్నారు. ఈ వర్షాకాలంలో వాగు పారితే మరింత భూమి కోతకు గురయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతున్నారు. ఖిల్లాఘనపురం: మండల కేంద్రం సమీపంలోని గణపసముద్రం రిజర్వాయర్(కాకతీయుల కాలంలో తవ్విన చెరువు)కు వర్షపు నీటిని మళ్లించేందుకు 50 ఏళ్ల కిందట పెద్దవాగుపై కత్వ (ఆనకట్ట) నిర్మాణం చేపట్టారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి, భీమునితండా తదితర ప్రాంతాలు, మండలంలోని మామిడిమాడ, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, మల్కిమియాన్పల్లి, అన్పహాడ్, వెంకటాంపల్లి, కమాలోద్ధీన్పూర్, ఆగారం, అంతాయపల్లి, కొత్తపల్లి మీదుగా వచ్చే వర్షపు నీరు పెద్దవాగుకు చేరి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ వాగుకు అడ్డంగా మల్కిమియాన్పల్లి, అప్పారెడ్డిపల్లి, అన్పహడ్ శివారులో కత్వ నిర్మించారు. వాగు పారే సమయంలో గణపసముద్రం రిజర్వాయర్కు నీటిని మళ్లించేలా షట్టర్లను బిగించారు. ఏటా వాగు పారే సమయంలో అవసరమైన నీటిని మళ్లించి తర్వాత షట్టర్లను మూసి వేస్తారు. మిగతా నీరంతా కత్వ నిండి పైనుంచి పారేలా ఏర్పాట్లు చేశారు. గతేడాది వరదలకు గండి కోతకు గురైన పంట పొలాలు నేటికీ మరమ్మతులు కరువు.. ఆందోళనలో అన్నదాతలు పాటు కాల్వకు నిలిచిపోనున్న పెద్ద వాగు, కేఎల్ఐ నీరు -
బైరోజు, పోల్కంపల్లికి రాష్ట్రస్థాయి పురస్కారాలు
వనపర్తి టౌన్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ బుధవారం ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాలకు పట్టణానికి చెందిన ప్రముఖ నవల రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, శిల్పి విభాగంలో ప్రముఖ శిల్పి, సాహితీవేత్త, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఈ నెల 19న ఒక్కొక్కరికి రూ.20,116 నగదు, పురస్కారాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, సాహితీవేత్తలు వెంకటేశ్వర్రెడ్డి, నారాయణరెడ్డి, జనజ్వాల, సూర చంద్రశేఖర్, గోపీనాథ్, గంధం నాగరాజు, శ్యాంసుందర్, బండారు శ్రీనివాస్, రాములు హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి అమరచింత: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విఠోభా కోరారు. బుధవారం పుర కార్యాలయంలో కమిషనర్ నాగరాజుతో కలిసి వార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణానికి 55 ఇళ్లు మంజూరయ్యాయని, ప్రోసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 18 మంది ఇళ్ల మార్కింగ్ చేసుకొని పనులు ప్రారంభించారని వార్డు అధికారులు వెల్లడించారు. మిగిలిన లబ్ధిదారులు కూడా పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని పీడీ కోరారు. పుర మేనేజర్ యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. తండాల్లోని సమస్యలు పరిష్కరించాలి పాన్గల్: జిల్లాలోని పలు గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ కోరారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, మల్లాయిపల్లితండాలో పర్యటించి ఆయా తండావాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తండాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, మూతబడుతున్న పాఠశాలలను తెరిపించాలన్నారు. అర్హులకు గిరిజన కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని.. తండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. గతంలో పలుమార్లు జిల్లా అధికారులకు సమస్యల వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని.. పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే గిరిజనులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాబునాయక్, రవినాయక్, చిట్టెమ్మ, కిషన్, సక్రూ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
కొత్తకోట రూరల్: జిల్లాలోని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని నాబార్డ్ డీడీఎం పి.మనోహర్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని కనిమెట్టలో ఎస్ఐఆర్డీ ఎన్జీఓ కొత్తకోట ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఈఓ నిర్వహణకు నాబార్డ్ నిధులు రూ.27 లక్షలు మంజూరుకాగా, సభ్యుల పొదుపు, వాటాధనం ఆధారంగా రూ.15 లక్షలు ఈక్విటీ గ్రాండ్ మంజూరు చేస్తోందన్నారు. ఎఫ్ఈఓ లెక్కలు క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. సభ్యులు సంఘటితంగా ఉండి వాటా ధనం చెల్లిస్తే నాబార్డ్ ప్రతి సభ్యుడికి రూ.2 వేలు అందజేస్తుందని తెలిపారు. ఎఫ్ఈఓ ద్వారా చేపల ఆధారిత వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు బ్యాంకుతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ముదిరాజ్ కమ్యూనిటీలో చేపల ఆధారితంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సభ్యులకు లాభాలు వస్తాయో జిల్లా మత్స్యశాఖ అధికారి డా. బి.లక్ష్మప్ప వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో ఆదాయం పెరుగుతుందని.. కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్ర సందర్శన యాత్రలు చేపట్టి వ్యాపార కేంద్రాలను చూపిస్తామని, శిక్షణ కూడా ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, వాకిటి బాలరాజు, గాదం పరమేశ్, పెంటయ్య, నరుకుల బాలన్న, నరుకుల శ్రీనివాసులు, మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు ఆకుల ఇందిరమ్మ, 11 మంది డైరెక్టర్లు, కురుమయ్య, పి.శ్రీనివాసులు సీఈఓ పి.అరుణ, ఎస్ఐఆర్డీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్లు 98499 05923, 90102 37295
వనపర్తిటౌన్: వనపర్తి పుర పరిధిలోని సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లుతో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నాం. పుర ప్రజలు తమ తమ వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, తాగునీటి సరఫరాలో అంతరాయం, వీధిదీపాల ఏర్పాటు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. తేదీ : 11.07.2025 (శుక్రవారం) సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు రేపు మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
పాన్గల్: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్పార్టీ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 32 కుట్టుమిషన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నరకం వరికి రూ.500 బోనస్ తదితర పథకాలు అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్కు ఘన నివాళి.. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి కొనియాడారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. అభివృద్ధిని దిశానిర్దేశం చేసిన చిరస్మరణీయుడని.. ఆయన అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిపోతాయన్నారు. అనంతరం రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ.. మండలంలోని దావాత్ఖాన్పల్లిలో ఆరుగురు, శాగాపూర్లో 13 మంది లబ్ధిదారులకు మంత్రి జూపల్లి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటే సకాలంలో నగదు బ్యాంకు ఖాతాలో జమవుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అవుతుందని.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా అధికారులు, స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ గోవింద్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, విండో డైరెక్టర్ ఉస్మాన్, వెంకటేష్నాయుడు, రవికుమార్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ, ఆశాల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మురుగు నీటికుంటలు, వర్షపునీరు నిల్వ ప్రదేశాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించి రసాయనాలను పిచికారీ చేయాలని కోరారు. గర్భిణుల నమోదు, హైరిస్క్ కేసులు గుర్తించాలని, ప్రసవానంతరం తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత గుర్తించి వైద్యాధికారి క్రమం తప్పకుండా వైద్యం అందించాలని సూచించారు. చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, అసంక్రమిత, క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్యసేవలు, మందులు అందించి నియంత్రణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. మంజుల, డీడీఎం వెంకటకృష్ణ, మండల వైద్యాధికారి డా. ఫయాజ్ అహ్మద్, డా. మానస, సీహెచ్ఓ సురేష్, ఎంపీహెచ్ఈఓ విద్యాసాగర్, పీహెచ్ఎన్ ప్రమీల, సూపర్వైజర్ సురేందర్గౌడ్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి పాన్గల్: ప్రభుత్వం ఇందిరా మహిళశక్తి ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరా మహిళశక్తి సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మండల మహిళా సమాఖ్యకు బస్సును కేటాయించినట్లు పేర్కొన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సంఘాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కొత్త సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు సభ్యత్వం కల్పించాలని సిబ్బందికి సూచించారు. మొండి బకాయిల వసూళ్లపై ఆయా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి పూర్తిగా చెల్లించేలా చూడాలన్నారు. సమావేశంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖయాదవ్, ఐకేపీ అధికారులు, వివిధ గ్రామాల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో మంగళవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 344 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 609 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 40, వివిధ ఎత్తిపోతల పథకాలకు 399, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
‘వైఎస్సార్ పథకాలు మరువలేనివి’
వనపర్తిటౌన్: అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నేటికీ చెదరని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కొనియాడారు. నాటి ఆయన పాలనలో అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆదేశానుసారం మంగళవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్సాగర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు ఆయనను, ఆయన పాలనను ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు. మైనార్టీ రాష్ట్ర నాయకులు అఖ్తర్, కమర్మియా, పట్టణ మాజీ అధ్యక్షుడు కిరణ్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరె రాములు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సమద్మియా, రాగి వేణు, ఎండీ బాబా, నారాయణ, కోళ్ల వెంకటేష్, పాండురావు, సురేష్గౌడ్, వేణయ్యచారి, మెంటేపల్లి రాములు, రోహిత్, లీలావతి, చిట్టెమ్మ, జయమ్మ, యాదమ్మ, అలిసమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు. -
శాకాంబరీదేవిగా వాసవీమాత..
ఆషాడమాసం సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. అర్చకులు వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించి లక్ష పుష్పార్చన, సహస్ర కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు మహోత్సవం నిర్వహించి ఆలయంలో మహిళలు గోరింటాకు పెట్టుకున్నారు. నిర్వాహకులు షర్మిల, గాయత్రి, కవితరాణి, విజయలక్ష్మి, వీణ, శ్రీదేవి, అర్చన, వనజ, సంధ్యారాణి, సుధారాణి, పావని, అనురాధ, అపర్ణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – ఆత్మకూర్ -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు.. 9 పైలెట్ గ్రామాలు ఎంపిక మహిళా సీఆర్పీల నియామకం.. ఎంపిక చేసిన గ్రామాల్లో సేంద్రియ సాగును విస్తరింపజేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామంలోని మహిళా సంఘంలో చదువుకున్న మహిళ రైతును సీఆర్పీగా ఎంపిక చేస్తారు. వీరికి కేంద్రం అందించే నిధుల నుంచి నెలకు రూ.4 వేలు వేతనం అందించనున్నారు. కనీసం పదోతరగతి పూర్తిచేసి సాంకేతిక పరిజ్ఞానం కలిగి వ్యవసాయ అనుభవం ఉన్న మహిళనే ఎంపిక చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా.. సేంద్రియ సాగు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో జనాభా కేటాగిరీల వారీగా రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించడంతో పాటు రైతులకు సేంద్రియ సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రెండు నెలల కిందటే గ్రామాలు ఎంపిక కావడంతో దాదాపుగా మట్టి నమూనాల సేకరణ పూర్తిచేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. కనీసం ఎకరా పొలం కలిగి ఉన్న రైతులనే ఎంపిక చేశారు. దేశమంతటా సేంద్రియ సాగును ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని.. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతులను ప్రోత్సహిస్తూ రానున్న రోజుల్లో కలుషిత ఆహారాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరచింత: రైతులు త్వరగా పంటలు చేతికి రావాలనే లక్ష్యంతో రసాయన ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తుండటంతో భూ సారం రోజురోజుకు దెబ్బతినడంతో పాటు పండిన పంట రసాయనాలమయమై ప్రజలు కొత్త కొత్త రోగాల బారినపడి తమ ఆయుష్షును కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహిస్తూ ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నాచ్యురల్ ఫార్మింగ్)పథకాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువుల వినియోగంతో పొలాలు ఎలా నిర్జీవంగా మారుతున్నాయన్న విషయాలతో పాటు వాటితో ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాన్ని వివరిస్తూ క్రమేణా సేంద్రియ సాగువైపు దృష్టి మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలో ని 9 మండలాల్లో 9 గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసి ఆయా గ్రామా ల్లో జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీల వారీగా 125 మంది రైతులను ఎంపిక చేసి వారితో ఏడాది పాటు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు. ఎకరా పొలం మాత్రమే.. ఎంపిక చేసిన రైతుల పొలంలో ఒక ఎకరాలో మాత్రమే సేంద్రియ సాగు చేపట్టనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ రైతు ఏ పంట సాగు చేయాలో అధికారులు సూచిస్తారు. వీరికి మొదటి విడతలో పంటకు సరిపడా వేప పిండి, వేప నూనె ఉచితంగా అందిస్తారు. అలాగే సేంద్రియ విధానంలో పండించిన పంటకు మార్కెట్లో ఉండే డిమాండ్ను వివరించి చైతన్యపరుస్తారు. మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాలివే.. రసాయన ఎరువుల ఆహార నియంత్రణే లక్ష్యం ఒక్కో గ్రామంలో 125 మంది రైతులతో.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. -
ఆయకట్టుకు సాగునీరు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటి విడుదల ● 4.20 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం ● అసంపూర్తి పనులతో 50 శాతం ఆయకట్టు మాత్రమే సాగు ● కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల నిర్వహణ పకడ్బందీగా చేపడితేనే ప్రయోజనం సాక్షి, నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్హౌజ్ వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేఎల్ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈ సారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండి.. బ్యాక్వాటర్ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతులు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. లక్ష్యం 4.20 లక్షలు.. ఇచ్చేది 2.5 0లక్షల ఎకరాలకే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేపట్టాలంటే.. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే కేఎల్ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈ సారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రధానంగా కేఎల్ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్ పనులు పూర్తికాలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఈ సారి కృష్ణానదికి జూన్లోనే వరద పెరిగింది. పది రోజులుగా వరద పెరిగి.. జూరాల, శ్రీశైలం జలాశయాల్లో పెద్దఎత్తున చేరింది. సాధారణంగా జూలై నెలాఖరు, ఆగస్టు నెలల్లో నిండే శ్రీశైలం రిజర్వాయర్.. ఈ సారి జూలై మొదటి వారంలోనే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ఇప్పటికే 199.27 టీఎంసీలకు చేరింది. ఎగువన జూరాల ప్రాజెక్టు, సుంకేసుల నుంచి లక్షనర్నర క్యూసెక్కుల వరద వస్తుండటంతో మంగళవారం శ్రీశైలం రిజర్వాయర్ నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 15 రోజులుగా శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం పెరిగి.. పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కేఎల్ఐ ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వారం రోజుల ముందుగానే నీటిని విడుదల చేస్తే ఇప్పటికే సాగులో ఉన్న రైతులకు ఉపయుక్తంగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ చేపడితేనే ప్రయోజనం.. కేఎల్ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్లను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో.. ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం సైతం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, నెట్వర్క్ చానల్స్ లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మూడు ప్రధాన రిజర్వాయర్లలో నీరు ఖాళీ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. నిర్వహణలో నిర్లక్ష్యం.. సాగునీటికి ఇబ్బంది లేకుండా.. కేఎల్ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి రెండు మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్టెక్ వద్ద సర్జ్పూల్ నుంచి పంప్హౌస్లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోతే గేట్లు పనిచేయని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మోటార్ల నిర్వహణతో పాటు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
‘డీట్’.. యువతకు దిక్సూచి
నిరుద్యోగ యువతకు ఊరట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీట్తో నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరుతుంది. యువత ఈ సదావకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. డీట్లో నమోదు చేసుకున్న యువత ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. – జ్యోతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, వనపర్తి ● ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’తో ప్రైవేట్లోని ఉద్యోగ సమాచారం ● 1,500లకు పైగా నిరుద్యోగుల నమోదు ● నిరక్షరాస్యుడి నుంచి పీహెచ్డీ చేసిన అందరూ అర్హులే.. ● ఎప్పటికప్పుడు ఫోన్లకు ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు వనపర్తి: యువత ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలను అన్వేషించుకొని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగం ఎక్కడ ఉన్నా తెలిసేలా ఒక ప్లేస్మెంట్ వెబ్సెట్ను రూపొందించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ పర్యవేక్షణలో ఈ వెబ్సైట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలు, కనిష్టంగా 50 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి గల కంపెనీల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు. ఇటీవల సీఎం ఎ.రేవంత్రెడ్డి అధికారికంగా ఈ వెబ్సైట్ను పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించారు. ఈ మేరకు వనపర్తి జిల్లా నుంచి సుమారు 1,500 మంది నిరుద్యోగ యువత డీట్ వెబ్సైట్లో తమ విద్యార్హత, వివరాలతో రిజిస్టర్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని కంపెనీల్లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీల వివరాల నోటిఫికేషన్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరి ఫోన్కు వస్తుంటాయి. జిల్లాలో రెండు పరిశ్రమలకే అర్హత డీట్లో ఇప్పటి వరకు జిల్లా నుంచి కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ, పెబ్బేరు మండలంలోని ఏడీబీ లిక్కర్ ఫ్యాక్టరీ రెండు మాత్రమే నమోదు చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలను రిజిస్టర్ చేయించే దిశగా జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరక్ష్యరాస్యుల నుంచి ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్హత ఉన్న వారి వరకు ఎవరైనా డీట్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఒక్కచోట రిజిస్టర్ చేసుకున్న యువత రాష్ట్రంలో ఎక్కడైనా ప్రైవేటు రంగ సంస్థలో ఖాళీలు ఉంటే వారి విద్యార్హత బట్టి అర్హత కలిగి ఉంటారు. రిజిస్టర్ చేసుకున్న సమయంలో నిరుద్యోగి జాబ్ చేసే ఆసక్తి గల ప్రాంతాల పేర్లను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలి. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే అధికారులతో కలిసి డీట్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆసక్తి గల యువత www.deet.telangana.gov.in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డీట్కు రూపకల్పన చేసింది. ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే అధికారు లు ఈ విషయంపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి. ఉద్యో గం కోసం ప్రయత్నిస్తున్న యువతను వెబ్సైట్లో రిజిస్టర్ చేయించాలి. ప్రభు త్వం తరఫను అధికారులకు అన్ని విధాగాలుగా సహకరిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం ● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత ● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్లు సిద్ధమైన తర్వాత రద్దు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది.. ● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం ● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు ● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు కూలగొట్టిన ఇంటి వద్ద కళావతి -
అసలేం జరుగుతోంది..
● ఆచూకీ లేని ఎస్ఐ, ఏఎస్ఐ ● అవినీతి ఆరోపణలతో వ్యక్తిగతసెలవుల్లో వెళ్లినట్లు ప్రచారం ● నేడు కొత్త ఎస్ఐ బాధ్యతలు తీసుకునే అవకాశం అమరచింత: స్థానిక పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, ఏఎస్ఐలపై అవినీతి ఆరోపణల ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయన్న సమాచారంతో వారు వ్యక్తిగత సెలవులపై వెళ్లినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎస్ఐ, ఏఎస్ఐ వారం రోజులుగా స్టేషన్ రాకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వీటికి తోడు పోలీసులు చెబుతున్న మాటలకు ఎంతమాత్రం పొంతన లేదు. రెండు నెలల కిందట మండలంలోని ధర్మాపురంలో జరిగిన క్రికెట్ గొడవల్లో వ్యక్తి మృతి చెందిన వ్యవహరంలో ఎస్ఐ సురేష్, ఏఎస్ఐ ప్రవర్తించిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అంతర్గతంగా విచారణ జరిగి, ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమయ్యారని తెలవడంతో వారు సెలవులపై వెళ్లినట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలే అధికం ఎస్ఐ మండలంలోని పలు ఘటనలో వ్యక్తిగతంగా ఫిర్యాదుదారులను బెదిరిస్తూ అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ సరఫరా, మట్టి తరలింపు, పొలం పంచాయితీల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులతో కలిసి తమపై వచ్చిన అభియోగాలను రూపుమాపుకొనేందుకు యత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. విధుల్లోకి వీఆర్లో ఉన్న ఎస్ఐ వ్యవహారం కొలిక్కిరాకముందే జిల్లా కేంద్రంలో వీఆర్లో ఉన్న ఎస్ఐని బదిలీపై అమరచింతకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం కొత్త ఎస్ఐ బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ఐ, ఏఎస్ఐ సెలవుల్లో వెళ్లడంపై విషయాన్ని ఆత్మకూర్ సీఐ శివకుమార్ను వివరణ కోరగా.. మంగళవారం విధుల్లో చేరుతారని బదులిచ్చారు. కానీ ఎస్ఐ, ఏఎస్ఐలు సస్పెండ్ అయ్యారనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. -
‘కార్మికుల పని గంటల పెంపు సరికాదు’
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ జులై 5న విడు దల చేసిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తకోట చౌరస్తాలో సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు జీవో కాపీలను దహనం చేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ జీవో పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడిందని, ఇది అమలయితే కార్మికులు శ్రమ దోపిడికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక రంగంలో సంస్కరణలు అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను అమలు చేసేందుకు ఆరాటపడుతుందని ఆయన విమర్శించారు. లేబర్ కోడ్లో ప్రతిపాదించిన 10 గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 282 రూపంలో ముందుకు తీసుకురావడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవాజ్ ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, సహాయ కార్యదర్శి అజీజ్ పాషా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, రాములు, నరసింహ, రాములు యాదవ్, కురుమన్న, బాలస్వామి, హమాలి కురుమన్న, బాబు, వెంకటన్న, లక్ష్మి పాల్గొన్నారు. -
కనులపండుగగా ఇమామే హుస్సేన్ సవారి
అమరచింత: అల్విదా షా.. అల్విదా షా హై హసన్, హూస్సేన్ అంటూ భక్తులు పీర్ల నిమజ్జన వేడుకలను సోమవారం కనులపండువగా నిర్వహించారు. మొహర్రం ను పురస్కరించుకొని 10 రోజులపాటు పీర్ల చావిడీల్లో కొలువుదీరిన ఆలం లను సోమవారం నిమజ్జనానికి తరలించారు. అమరచింత పట్టణంలో ఇమామే హుస్సేన్ ఆలం సవారీ వేడుకలు ఆది, సోమవారం రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం రాత్రి ఇమామే హుస్సేన్ సవారీ వేడుకల్లో భక్తులు మొక్కులు చెల్లించుకోగా.. సోమవారం నిమజ్జనోత్సవం జరిపించారు. పట్టణ ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోవడంతో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఆత్మకూర్, మదనాపురం ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రార్థనలు పట్టణంలోని పెద్దపీర్ల మసీదులో కొలువుదీరిన ఇమామే హుస్సేన్ ఆలం ను మంగళవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దర్శించుకొని చాదర్, పూలమాలలు సమర్పించిన మొక్కులు సమర్పించారు. -
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 50 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి విద్యావిభాగం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఎయి డెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు ‘జాతీయ స్థాయి అవార్డు 2025’ ఎంపిక కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని సూచించారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు https://nationa lawardstoteachers.education.gov.in వెబ్ సైట్ నుంచి నేరుగా ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ బియ్యం విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి జగన్మోహన్ హెచ్చరించారు. సోమవారం పౌరసరఫరాల సంస్థ సమీకృత కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023–24 సీజన్కు సంబంధించిన బియ్యం (ఎఫ్సీఐ) గడువు ఈ నెల 27వరకు ఉందని, బియ్యం సరఫరా చేయని మిల్లర్లు తప్పకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2024–25 సీజన్కు సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇప్పటి వరకు మిల్లింగ్ చేయని మిల్లర్లకు సూచనలు చేశారు. రామన్పాడుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,021 అడుగులకు గాను సోమవారం నాటికి 1,018 అడుగుల నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ, కుడి కాల్వ ద్వారా 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వార 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా 520 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 45 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ‘పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి’ వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు వివిధ ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అమరేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిశాయన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విష్ణువర్ధన్, కరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్గౌడ్, సుదర్శన్, భాస్కర్, మనోహర్గౌడ్, శశివర్ధన్, రాములు, ప్రభాకర్, మదన్లాల్, కృష్ణప్రసాద్, నరేష్ తదితరులు ఉన్నారు. -
గురుకులాల్లో వసతులు కల్పించాలి
వనపర్తి: ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని కేడీఆర్నగర్లో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల, పెద్దమందడి మండలం జగత్పల్లి మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, నాగవరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల, కొత్తకోట సమీపంలోని వీపనగండ్ల ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. వసతులు, భోజన ఏర్పాట్లు, వంటగది, తాగునీటి సౌకర్యం, మూత్రశాలలను పరిశీలించారు. సిబ్బంది సరిపడా ఉన్నారా? విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీపనగండ్ల ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో తరగతి గదులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని.. వేరే ప్రాంతానికి మార్చాలని ప్రిన్సిపాల్ సాయిరెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి విద్యావిభాగం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025కి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల ఉపాధ్యాయులు http://nationlawardsto teachers.education.go.in పోర్టల్లో ఈ నెల 13లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణకు నేడు చివరి గడువు వనపర్తి టౌన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీసీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీకి రూపొందించిన 1:1 జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు శనివారంతో గడువు ముగుస్తుందని టీఎస్ఎస్ఏ ఎక్స్ అఫీషియో జిల్లా ప్రాజెక్ట్ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023లోనే అర్హత పరీక్ష నిర్వహించి 1:3 విధానంలో మెరిట్ కం రోస్టర్ విధానం జాబితా రూపొందించామని పేర్కొన్నారు. జాబితాలోని అభ్యర్థులకు గత నెల 23న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి తుది జాబితాను రూపొందించి http://doewanaparthy.weebly.com వెబ్సైట్లో ఉంచామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రం 4 గంటలలోగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కళాశాలల మరమ్మతుకు నిధులు మంజూరు వనపర్తిటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాత్కాలిక మరమ్మతులు, కనీస సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.1,28,60,000 మంజూరు చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం తెలిపారు. భవనాలకు రంగులు, చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, బోర్డులు, డ్యూయల్ డెస్క్ల కొనుగోలుకు ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. పైన పేర్కొన్న పనులు ఏఏపీసీల ద్వారా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి టీజీఈడౠ్ల్యఐడీసీ ఈఈకి సూచించినట్లు డీఐఈఓ వివరించారు. అరుణాచలానికిప్రత్యేక బస్సులు వనపర్తిటౌన్: గురుపౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు జిల్లాకేంద్రంలోని బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం రాత్రి అరుణాచలానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. 10వ తేదీన గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం తిరిగి బయలుదేరి 11న ఉదయం 3 గంటల వరకు వనపర్తికి వస్తుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీట్ల రిజర్వేషన్, పూర్తి వివరాలకు సెల్నంబర్లు 79957 01851, 73828 39379, 94906 96971 సంప్రదించాలని పేర్కొన్నారు. -
మధ్యలో నిలిపేస్తే ఎలా..?
కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు ఎంతసేపు ఉండాలో.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అమర్నాథ్, కర్నూలు -
దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను బాగా నిర్వహించారని సిబ్బందిని అభినందించారు. వచ్చిన దరఖాస్తులను ఆగష్టు 15 నాటికి పరిష్కరించాలని ఏ ఒక్కటికూడా పెండింగ్ ఉండొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు అవసరమైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. చాలా దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్లోనే పరిష్కరించవచ్చని.. మిగిలిన వాటిని ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్కు పంపించాలని ఆదేశించారు. దరఖాస్తులను ఫార్మెట్–1, ఫార్మెట్–2గా విభజించుకోవాలని, తప్పకుండా రికార్డు నిర్వహించాలని, ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి ఉంటే స్పీకింగ్ ఆర్డర్ ద్వారా దరఖాస్తుదారుకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రోజువారీగా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు సాయంత్రం 5లోగా నివేదించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ దరఖాస్తులు పరిష్కరించాలి.. ప్రజాపాలన, మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చిన రేషన్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 14న ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు జారీ చేయనున్నందున తహసీల్దార్ లాగిన్లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి త్వరగా పరిష్కరించాలని, 10వ తేదీలోగా అర్హుల దరఖాస్తులను ఆమోదించి, మిగిలిన వాటిని తిరస్కరించాలని, పెండింగ్ ఉంచుకోవద్దన్నారు. వరదలతో అప్రమత్తం.. వరదలు వస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కృష్ణానది పరీవాహక ప్రాంతాల తహసీల్దార్లకు సూచించారు. ఇప్పటి వరకు ఇచ్చిన మార్గదర్శకాలు విధిగా పాటించాలని.. అందరూ మండల కేంద్రాల్లోనే ఉండాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్ పాల్గొన్నారు. -
కాలుష్య బట్టీలు
కానరాని అధికారుల తనిఖీలు.. జిల్లాలో ఇష్టానుసారంగా బట్టీలు ఏర్పాటు చేస్తుండటం.. వాటిని కాల్చడంతో వచ్చే పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటుకలను కాల్చేందుకు వరిపొట్టుతో పాటు చెట్లను నరికి ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటుక బరువు తగ్గించేందుకు ఉపయోగించే బూడిద గాలికి ఎగిరి కళ్లలో పడితే ఆస్పత్రిలో చికిత్స పొందితేగాని ఉపశమనం లభించని పరిస్థితి ఉందని సమీప ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఆ బూడిద కంటి పొరపై అత్తుకొని తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం. పొగతో ఊపిరితిత్తుల సమస్యలు నెలకొంటున్నట్లు తెలుస్తోంది. వనపర్తి: జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగుతోంది. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా నిర్వాహకులు జనావాసాలకు అతి సమీపంలో బట్టీలు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పాన్గల్ ప్రధాన రహదారికి అతి సమీపం, మదనాపురం, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లో ఇటుక బట్టీలు గుట్టలను తలపించేలా ఉన్నాయి. వేసవిలో సమీపంలోని చెరువులు, కుంటల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పొక్లెయిన్లతో ఇష్టారీతిన మట్టిని తవ్వి గుట్టలుగా వేసుకొని ఏడాది పొడవునా ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, ఇరిగేషన్, కాలుష్య నివారణ అధికారులకు విషయం తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని.. మామూళ్ల మత్తులో ఉన్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గద్వాల, రాయచూరు ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి వారికి అక్కడే తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ పనులు చేయించుకుంటారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల ఏర్పాటు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. సమస్య ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. కచ్చితమైన ప్రదేశాలు సూచిస్తూ ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారో పరిశీలన చేస్తాం. – సురేష్బాబు, జిల్లా అధికారి, కాలుష్య నియంత్రణ బోర్డు, వనపర్తి చెరువులు, కుంటలు తవ్వి మట్టిని తరలిస్తున్న నిర్వాహకులు కాలుష్య కోరల్లో పట్టణవాసులు మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం? -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
స్టేషన్ మహబూబ్నగర్/మదనాపురం/జడ్చర్ల టౌన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్ప్రెస్ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్ప్రెస్లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం నిలిచిపోయిన హంద్రీ, బెంగళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లు తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల పునరుద్ధరణ రైలులో జ్వరంతోనే.. ఎమ్మిగనూరు గంజిల గ్రామానికి చెందిన కె.లక్ష్మి అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయి స్వగ్రామానికి వెళ్లేందుకు భర్త పెద్దలింగన్నతో కలపి హంద్రీ ఎక్స్ప్రెస్ ఎక్కింది. జడ్చర్ల స్టేషన్లో రైలు నిలవటంతో ఇబ్బందులు పడ్డారు. జ్వరం రావడంతో మాత్రలు వేసుకుని రైలులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్దామంటే ఇలా ఇబ్బందులు వస్తాయని అనుకోలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతు సేవలే లక్ష్యంగా..
విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలిగిన పిల్లలకు డీసీసీబీ తరపున ప్రత్యేకంగా విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేకంగా రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. సహకార రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు ● త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ ● విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు ● రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట ● నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం మహబూబ్నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. 34,731 మంది రైతులకుమేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ఆర్బీఐ అనుమతితో.. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ -
మన్యంకొండ వెళ్తున్నాం..
నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. – నర్సింహ, గద్వాల తినడానికి ఏమీ లేవు.. మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్, మహబూబ్నగర్ ● -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి : ఎస్పీ
వనపర్తి: వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీ మీట్లోనూ సత్తాచాటి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. నాగర్కర్నూల్లో రెండ్రోజుల పాటు నిర్వహించిన జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీసు డ్యూటీ మీట్లో జిల్లా నుంచి పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది నాలుగు బంగారు, నాలుగు కాంస్య, 5 రజత పతకాలు సాధించారు. శుక్రవారం ఎస్పీ వారిని అభినందించి మాట్లాడారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో వనపర్తి సీఐ కృష్ణయ్య బంగారు, ఫింగర్ ప్రింట్స్ విభాగంలో రజత పతకం సాధించారు. అదేవిధంగా షీటీం ఎస్ఐ అంజద్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు, హ్యాండ్లింగ్ లిఫ్టింగ్ ప్యాకింగ్ విభాగంలో రజత పతకం సాధించారు. గోపాల్పేట ఎస్ఐ నరేష్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో రజత, క్రైం ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లాస్ విభాగంలో చిన్నంబావి ఎస్ఐ జగన్ రజత పతకం, వనపర్తి రూరల్ కానిస్టేబుల్ శ్రీనివాసులు క్రైం సీన్ అబ్జర్వేషన్ విభాగంలో, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో బంగారు పతకం సాధించారు. వనపర్తి టౌన్ కానిస్టేబుల్ రాజశేఖర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో బంగారు, క్రైం సీన్ అబ్జర్వేషన్ విభాగంలో రజత పతకం సాధించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు పురేందర్గౌడ్, రమేష్ బాంబు డిస్పోజల్ టీం విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఏఆర్ కానిస్టేబుళ్లు రవీందర్, గంగాధర్ యాక్సిస్ కంట్రోల్ విభాగంలో కాంస్య, ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ డాగ్స్క్వాడ్ విభాగంలో కాంస్య సాధించారు. -
బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత
వనపర్తి: బాలల హక్కులు పరిరక్షించేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నిబద్ధతతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్రెడ్డి కోరారు. గురువారం కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్తో కలిసి జిల్లాకేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాల, శ్రీరంగాపూర్లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్యశాఖపై ఉందన్నారు. పిల్లల్లో లోపాలుంటే ముందుగానే గుర్తించి ఎన్ఆర్సీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించి సరైన పౌష్టికాహారం, వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా ఏదైనా వైకల్యంతో ఉంటే డీఎస్టీ పరీక్షలు నిర్వహించి ఫిజియో, స్పీచ్ థెరపీ వంటివి చేయించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కచ్చితంగా తినిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసుల వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ సమన్వయంతో నిర్వహించడమే గాకుండా యజమానులపై జరిమానాలు విధించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే బాధ్యులపై కేసులు చేయడమే కాకుండా పెళ్లి ఆలోచనలు చేస్తున్నప్పుడే ముందుగానే పసిగట్టి అవగాహన కల్పించి నిరోధించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అలాగే పాఠశాలలను తనిఖీ చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ● జిల్లాలో వయసుకు తగిన బరువు ఎత్తు లేని పిల్లలను అంగన్వాడీ కార్యకర్తలు 102 వాహనంలో ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు ఉంచి వైద్యం, పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. ప్రతి గ్రామంలో వీసీపీసీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి సోమవారం సమావేశమై బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అనాథ పిల్లలకు మెరుగైన విద్యం అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ● జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే కచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. పోక్సో కేసులో చార్జిషీట్ నమోదు చేయడమే కాకుండా బాధితులకు సకాలంలో పరిహారం ఇప్పించడంతో పాటు వారికి సపోర్ట్ పర్సన్ను నియమించి తగిన ధైర్యం, సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు సంతప్తికరంగా ఉన్నాయని కమిషన్ సభ్యులు కొనియాడారు. అనంతరం జిల్లాలో ఉత్తమ మార్కులు పొందిన అనాథ పిల్లలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, జిల్లా పోలీసు అధికారులు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, స్వచ్ఛందసంస్థ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి -
బాలికల చదువు భావితరాలకు వెలుగు
కొత్తకోట రూరల్: బాలికల చదువు భావితరాలకు వెలుగునిస్తోందని.. తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ అన్నారు. గురువారం పెద్దమందడి మండలం మద్దిగట్ల, మోజర్ల ఉన్నత పాఠశాలలో 2024–25లో 10వ తరగతి ఫలితాల్లో హేమమాలిని మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలువడంతో ఐకేపీ సంస్థ ప్రకటించిన రూ.25 వేల నగదు, తల్లిదండ్రులకు దుస్తులు డీఈఓ అందజేసి మాట్లాడారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఐకేపీ సంస్థ నగదు, దుస్తులు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, వసతిగృహాలు ఏర్పాటు చేస్తోందని.. 10వ తరగతి తర్వాత ఇంటర్ తప్పక చదివించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల జీహెచ్ఎం ఎస్.వరప్రసాదరావు, ఉపాధ్యాయ బృందం, ఐకేపీ సభ్యులు, విదార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
‘పీఆర్సీ వెంటనే అమలు చేయాలి’
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్షుడు అమరేందర్రెడ్డి కోరారు. గురువారం సంఘం కొత్తకోటశాఖ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల కొత్తకోట, పాలెం, కనిమెట్ట, రామనంతపురం, నిర్వేన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు చేయించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శి రాఘవేంద్రాచారి, అరవింద్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, రాములు, జిల్లా కార్యవర్గసభ్యులు ఈశ్వరయ్య, శ్రీనివాస్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సరేందర్ పాల్గొన్నారు. -
‘సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి’
వనపర్తి రూరల్: దేశవ్యాప్తంగా ఈ నెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి మహిళా సంఘాల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. మహిళా కార్మికుల హక్కుల పరిరక్షణ, గౌరవమైన జీవితం కోసం ఐద్వా నిరంతర పోరాటం చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా, మహిళలకు అన్యాయంగా మారుతున్నాయని, రోజురోజుకు ప్రైవేటీకరణ పెరుగుతుందన్నారు. ఆరోగ్య, విద్య హక్కు, భద్రత మహిళలకు లభించాలంటే పోరాడాల్సిందనని.. ఇందుకు సార్వత్రిక సమ్మె మైలురాయి అవుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు తగ్గుతుంటే ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి ఉమా, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రసాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరు మోడల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజేశ్వరి, మోక్ష, ధర్మతేజ రాష్ట్రసాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డా. టి.నరేష్కుమార్ గురువారం తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు మంచిర్యాల జిల్లాలో జరిగే అండర్–15 రాష్ట్రస్థాయి బాలికల ఫుట్బాల్ పోటీల్లో రాజేశ్వరి, మోక్ష.. నిజామాబాద్ జిల్లాలో జరిగే బాలుర విభాగం పోటీల్లో ధర్మతేజ జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీడీ కమలాకర్, అధ్యాపకులు బుచ్చయ్య, మంగమ్మ, హేమలత, సాహిత్య. హఫీజ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కొత్తకోట రూరల్: వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జె.మల్లేశం వార్డెన్లను ఆదేశించారు. గురువారం కొత్తకోట సమీపంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులు, వంటగది, విద్యార్థుల నివాస గదులు, స్టోర్రూంను పరిశీలించడంతో పాటు విద్యార్థుల ప్రవేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాన్ని అధిగమించేందుకు ఇన్వర్టర్ ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన బోధన, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయన వెంట వసతిగృహ సంక్షేమ అధికారి ఎస్.సంతోష్కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
కాంగ్రెస్లో కష్టపడిన వారికే పదవులు
కందనూలు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని, కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ లీడర్లకే అవకాశం ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నేతలు కష్టపడితేనే వారికి పదవుల రూపంలో ప్రతిఫలం దక్కుతుందన్నారు. ఇందుకోసం పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ గల్లీలో పార్టీ కోసం కష్టపడితేనే ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ వల్లే తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియా వారియర్లుగా యువజన కాంగ్రెస్ లీడర్లు ఎదగాలని, అందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. సోషల్ మీడియానే వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గె లుపొందేలా ప్రతి కార్యకర్త పాటుపడాలని కోరారు. -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
ధాన్యం.. దోపిడీ!
జిల్లాలో ముగిసిన యాసంగి కొనుగోళ్లు ●విచారణ చేపడతాం.. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక తూకాల్లో కోతలపై పలువురు రైతులు ఇటీవల ఫిర్యాదు చేశారు. కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయంపై దృష్టి సారించాం. ఫిర్యాదులపై స్పందించి కొందరు రైతులకు డబ్బులు ఇప్పించాం. ఇప్పటి వరకు రైతుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తాం. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్, వనపర్తి ‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ధర్మయ్య. గోపాల్పేట మండలం ఏదుట్ల స్వగ్రామం. గతేడాది యాసంగిలో 15 ఎకరాల్లో వరి సాగుచేయగా సుమారు 700 బస్తాల ధాన్యం పండింది. దీనిని గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. తీరా రైస్మిల్లుకు తరలించాక తేమశాతం ఎక్కువ ఉందంటూ ఏకంగా 17 క్వింటాళ్ల కోత విధించి అతడి అనుమతి లేకుండానే చెల్లించాల్సిన డబ్బుల్లో రూ.35 వేలు తగ్గించి మిగతావి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయిందని రైతు వాపోయారు. ఇలాంటి ఘటనలు ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం.’ కోతలు సరికాదు.. నేను యాసంగిలో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తే 50 క్వింటాళ్ల ధాన్యం పండింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తర్వాత మిల్లుకు తరలిస్తే సుమారు మూడు క్వింటాళ్ల కోత విధించారు. ఇందుకుగాను రావాల్సిన డబ్బుల్లో రూ.ఐదు వేలు తగ్గించి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మేము కష్టపడి పంటలు పండిస్తే మిల్లర్లు ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. – ఎల్లస్వామి, రైతు, ఏదుట్ల (గోపాల్పేట) ● ట్రక్ షీట్ తూకాల్లో కోతలు.. నోరు మెదపని అధికారులు ● మంత్రి ఆదేశించినా.. మారని మిల్లర్ల తీరు ● ప్రతి లారీకి తప్పని వైనం ● లబోదిబోమంటున్న అన్నదాతలు -
ఆక్రమణకు అడ్డుకట్టేది?
వనపర్తిటౌన్: పట్టణ నడిబొడ్డున పారుతున్న తాళ్ల చెరువు అలుగు అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణకు గురవుతోంది. ఏళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. కొందరు రియల్ వ్యాపారులు అలుగు ప్రదేశాన్ని సైతం ప్లాట్లుగా చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి. అలుగు కాల్వ 3 కిలోమీటర్ల పొడవు ఉండగా.. వెడల్పు మాత్రం ఒకచోట పిల్ల కాల్వలా, మరోచోట కాల్వగా, ఇంకోచోట 10 నుంచి 20 అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీంతో అధికారులు కొద్ది దూరం మినహా వెడల్పు ఒకే తరహాలో నిర్ధారించారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో దశబ్దాల తరబడి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. ఈ కాల్వ శ్వేతనగర్ మీదుగా పట్టణ శివారులోని రాజనగరం చెరువు వరకు ఉండగా.. ఇందులో నుంచే పట్టణంలోని మురుగు, వర్షపు నీరు ప్రవహించి రాజనగరం చెరువులో కలుస్తుంది. శ్వేతానగర్, శ్వేతానగర్ కంటే ముందున్న ఖాళీ ప్రదేశం, బ్రహ్మంగారి వీధి, రాయిగడ్డలోని కొంత భాగం, బాబాజీ మఠం, కమాన్చౌరస్తా, శంకర్గంజ్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ మేర కబ్జాకు గురైంది. దశాబ్దాలుగా అలుగు పారే ప్రాంతాన్ని ఆక్రమించి ఇష్టారీతిన ఇళ్లు, ప్రహరీలు నిర్మించినా గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. రామాటాకీస్ ప్రాంతంలో వరద ఉధృతిని అధిగమించేందుకు సుమారు 200 మీట్లర పొడవున పనులు పూర్తి చేశారు. ఈ ప్రాంతం మినహా మిగతా స్థలమంతా ఆక్రమణకు గురవుతూనే ఉంది. వాగు వెడల్పు అంతా ఒకేలా ఉంటే ముంపు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. రోజురోజుకు కుంచించుకోవడంతో 2020లో వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మున్ముందు ఇలానే కొనసాగితే అలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో పాటు వర్షాకాలంలో శ్వేతానగర్, శంకర్గంజ్, బ్రహ్మంగారి వీధి, రాయిగడ్డ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. అలుగు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే భారీ వర్షాలకు వాగు పరీవాహక కాలనీలు జలమయం కావడంతో పాటు దళితవాడకు చెందిన చంద్రయ్య వరదకు కొట్టుకుపోయి మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. కుంచించుకుపోతున్న తాళ్ల చెరువు అలుగు అధికారుల మీనమేషాలు తొలగింపునకు ముందుకు పడని అడుగులు రెండు దశాబ్దాలుగా ఊగిసలాటే.. ఆక్రమణలు తొలగించాలి.. తాళ్ల చెరువు అలుగులో అధికారులు ఆక్రమణలను తొలగించడం లేదు. కబ్జాకు గురైనట్లు నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలకు వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – జి.ప్రకాష్, రాయిగడ్డ, వనపర్తి చర్యలు తీసుకుంటాం.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అలుగులో పేరుకపోయిన పూడికను పొక్లెయిన్తో తొలగించాం. అలుగు రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుంటాం. అలుగు అంశం రెవెన్యూ, ఇరిగేషన్శాఖ పరిధిలోకి రావడంతో అవసరమైతే ఆయా శాఖల అధికారులతో చర్చించి ముందుకెళ్తాం. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
కార్మికులకు అండగా ఉంటాం : టీఎఫ్టీయూ
వనపర్తి రూరల్: కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ వారికి అండగా ఉంటామని టీఎఫ్టీయూ రాష్ట్ర అఽధ్యక్షుడు కాచం సత్యనారాయణ అన్నారు. బుధవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్హాల్లో తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య (టీఎఫ్టీయూ) 2వ మహాసభలు రాష్ట్ర నాయకుడు కావలి గోవిందునాయుడు అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఎఫ్టీయూ రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికుల కోసం పనిచేస్తున్న సంస్థ అని తెలిపారు. హమాలీలు, భవన నిర్మాణ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తదితర సంఘటిత కార్మికుల హక్కుల సాధన, స్కూల్ స్వీపర్లుకు కనీస వేతనం, క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వాలు చొరవ చూపి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహ్మద్ ఖలీల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, హమాలీ సంఘం నాయకులు, సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సుమారు 30 అక్రమ నిర్మాణాలు..
తాళ్ల చెరువు అలుగు వెడల్పు 50 నుంచి 60 అడుగులుగా అధికారులు నిర్ధారించారు. కాగా గతంలో రియల్ మాయ, కబ్జాదారుల మాటలు విని పక్కా స్థలాలు అనుకొని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదలున్నారు. అయితే ప్రస్తుతం అలుగులో 30 పక్కా భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని పాక్షికంగా, మరికొన్ని సగభాగం, ఇంకొన్ని పూర్తిగా కోల్పోయే భవనాలున్నాయని ప్రచారం సాగింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో అలుగులో నిర్మాణాలు చేపట్టిన వారికి పుర అధికారులు నోటీసులు జారీచేసి మిన్నకుండిపోవడం గమనార్హం. అలాగే ఆత్మకూర్లోని పరమేశ్వస్వామి చెరువు పరిసర ప్రాంతాలు కూడా కబ్జాకు గురికావడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయాయి. -
మహిళల రక్షణకు భరోసా కల్పించాలి
వనపర్తి: షీటీమ్, భరోసా బృందాలు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ మహిళల రక్షణకు తామున్నామన్న భరోసా కల్పించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో షీటీమ్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి 2025, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులు, బాధితులకు అందిన న్యాయం, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేసు మొదటి నుంచి చివరి వరకు ప్రతి దశలో మెరుగుపడాల్సిన పరిస్థితి, పోలీసుశాఖ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం, ఆరోగ్య చికిత్స తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాయం కోరి వచ్చే మహిళలు, పిల్లల విషయాల్లో షీటీమ్ సిబ్బంది గోప్యత పాటించాలన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజా రక్షణకు పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీయాలని సూచించారు. విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసి వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడి వారి బాగోగులు, ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్న తీరును అడిగి తెలుసుకోవాలన్నారు. మహిళలు, ఆడపిల్లలకు షీటీమ్ రక్షణ కల్పిస్తుందనే భరోసా ఇచ్చేలా విధులు నిర్వహించాలని కోరారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలను చూడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. యుక్త వయసులో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తాయని, పోక్సో కేస్స్టడీలను వివరిస్తూ షీటీమ్, భరోసా సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈవ్టీజింగ్ జరిగే హాట్స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, షీటీమ్ జిల్లా నంబర్, సిబ్బంది నంబర్లు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద పిల్లలకు కనిపించేలా రాయించాలన్నారు. ముఖ్యంగా ఆలయాలు, మినీ ట్యాంక్బండ్లు, పార్కులు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. భరోసా కేంద్రం సిబ్బంది కూడా తరచూ షీటీమ్ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మాయిలకు అందిస్తున్న సేవలను వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, శివకుమార్, సెల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, షీటీమ్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తు గడువు పొడిగింపు
వనపర్తి: దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు http//tgobmms. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రామన్పాడులో తగ్గుతున్న నీటమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,019 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 650 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 733, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి కొత్తకోట రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సహకార సంఘం అధికారి రాణి కోరారు. బుధవారం మండలంలోని అప్పరాల సహకార సంఘం గోదాం ఆవరణలో పీఏసీఎస్ పామాపురం ఆధ్వర్యంలో స్థానిక రైతులు, గ్రామస్తులతో కలిసి ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు నాటి సంరక్షించినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగమన్నారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని.. భూమిపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేష్బాబు, సెక్షన్ అసిస్టెంట్ కిరణ్, సీఈఓ రాఘవేంద్రారెడ్డి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజన సమస్యల సాధనకు ఉద్యమం పాన్గల్: సమస్యల సాధనకు ప్రతి గిరిజనుడు ఉద్యమించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సంఘం నాయకుడు బాబునాయక్ అధ్యక్షతన జరిగిన సంఘం మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖఅతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. జిల్లాలో గిరిజన కార్పొరేషన్ ద్వారా రుణాలిచ్చేందుకు 185 మందిని ఎంపిక చేసినా.. నేటికీ మంజూరు చేయడం లేదని వివరించారు. తండాల అభివృద్ధికి కేటాయించే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు విడుదల చేయాలని, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆయా సమస్యల సాధనకు సంఘం ఆధ్వర్యంలో చర్చించి పోరాటాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు కృష్ణానాయక్, రాములు, రాజునాయక్, అనిత, చిట్టెమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు. 6వ తేదీలోగా డబ్బులు చెల్లించండి అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తుండటంతో అంతకు పైబడి బ్యాంకు రుణం పొందిన కార్మికులు అదనపు డబ్బులను వెంటనే బ్యాంకులో జమ చేయాలని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ కార్యాలయ పరిధిలోని చేనేత సహకార సంఘాల సభ్యులు బ్యాంకుల్లో చేనేత రుణాలు పొందిన వివరాలు పంపిస్తున్నామని వివరించారు. -
పొగతో సావాసం
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో పారబోసి తగులబెట్టడంతో పొగతో బాధపడుతున్నాం. డంపింగ్ యార్డుకు తీసుకెళ్లమని చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. – శేఖర్, పెబ్బేరు రెండు రోజులకోసారి.. కొత్తకోట మున్సిపాలిటీలో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకెళ్లిన చెత్తను శివారులో తగులబెడుతున్నారు. దీంతో దు ర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. – లాల్కోట రవి, కొత్తకోట రూ.25 లక్షలు వెచ్చించినా.. చెత్తను ప్రాసెస్ చేయడం కంటే తగులబెట్టడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.25 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించినా ఉపయోగం లేదు. ప్రయాణికులతో పాటు సెగ్రిగేషన్ షెడ్డు సమీపంలోని కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్న వారందరూ పొగను పీల్చుకోలేక రోగాల బారిన పడుతున్నారు. – చంటి, అమరచింత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను నిత్యం డంపింగ్ యార్డుకు తరలించి, వాటి నుంచి ప్లాస్టిక్, ఇనుప వస్తువులను వేరు చేస్తున్నాం. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆదాయం సమకూర్చి, మున్సిపల్ అభివృద్ధికి వినియోగిస్తున్నాం. – శశిధర్, మున్సిపల్ కమిషనర్ ఆత్మకూర్ ● -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్గల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి మోసం చేసే ఫర్టిలైజర్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, మాందాపూర్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏఓ రాజవర్ధన్రెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణం వద్ద ఎరువుల ధరల వివరాలు నమోదు చేయాలని, దుకాణంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. అనంతరం దుకాణాలల్లో రికార్డులు, ఈ–పాసు యంత్రాలను పరిశీలించారు. యూరియా వాడకం తగ్గించాలి వానాకాలం సాగులో యూరియా వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించినట్లు డీఓ గోవింద్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. విత్తనాలు, ఎరువులు ఎంపికలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని కోరారు. మల్లాయిపల్లి, దొండాయిపల్లి రైతువేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయా గ్రామాల ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఈఓ అఖిల తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వనపర్తి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిరంతరం సూపర్వైజర్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాలను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే స్టాక్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా ఫార్ములాలను అనుసరించి పాఠ్యాంశాలను నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణిత శాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగి విద్యార్థుల ద్వారా సమాధానాలను రాబట్టారు. హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల సందర్శన జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థుల మా ర్కులను పరిశీలించిన కలెక్టర్, వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులు అంజి, వెంకటమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీవో శుభలక్ష్మి, హౌసింగ్ డీఈ విఠోబా, తహసీల్దార్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రోగులతో గౌరవంగాప్రవర్తించాలి వనపర్తి: వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స చేయడమే కాకుండా, ఉత్తేజమైన మాటలతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నర్సింగాయపల్లి పరిధిలోని ఎంసీహెచ్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికోస్ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వైద్య విద్యార్థులను అభినందించారు. వైద్య వృత్తిలో ఉన్న వారు ఎక్కడ ఉన్నా.. ఆ స్థానిక భాషను నేర్చుకొని రోగులతో స్నేహపూర్వకంగా మెలిగితే వారికి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ సమక్షంలో వైద్య విద్యార్థులు కేక్ కట్ చేశారు. కలెక్టర్ నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్మయి, జీజీహెచ్ సూపరిటెండెంట్ రంగారావు తదితరులు ఉన్నారు. -
3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..
మరమ్మతుల కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా.. పట్టింపు లేకుండాపోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత మరమ్మతులకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదన చేయగా.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్లోని ఎనిమిది గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలని భావించగా.. వీటి కోసం ఫిబ్రవరి నెలలో రూ.కోటి మంజూరు చేశారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా.. పురోగతి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తగలబెడుతున్నారు!
● ఆత్మకూర్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 5,050 నివాస గృహలు ఉండగా.. 19 వేల జనాభా ఉంది. 28 మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒక ట్రాక్టర్, 3 ఆటోల ద్వారా నిత్యం 700 కిలోల తడి, టన్ను పొడి చెత్త సేకరిస్తున్నారు. వీటిని డంపింగ్ యా ర్డుకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. అమరచింతలోని చింతలకుంట సమీపంలో పారబోసిన చెత్త● కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 6 వేల ఇళ్లు ఉండగా 23 వేల మంది నివసిస్తున్నారు. 23 మంది పారిశుద్ధ్య కార్మికులు 2 ట్రాక్టర్లు, 4 ఆటోల ద్వారా ఇళ్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. వీటిని పట్టణానికి కిలో మీటరు దూరంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలించలేక సమీప కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో పారబోసి తగలబెడుతున్నారు. -
జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 73.521 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 86.948 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రెండు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 160.469 మి.యూ విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి ఉపయోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 150 క్యూసెక్కుల నీరు పారుతుండగా.. సమాంతర కాల్వకు సరఫరా లేదన్నారు. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 610 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. కోయిల్సాగర్ @ 20.6 అడుగులు.. దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 20.6 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11అడుగులుగా ఉన్న నీటిమట్టం 9.6 అడుగులు పెరిగి 20.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు ఉండగా మరో 6 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి నీటిమట్టం చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లేవల్ వరకు నీటిమట్టం 32.6 అడుగులు ఉండగా మరో 12 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఈ ఏడాది జూన్ చివరి వరకే నీటిమట్టం బాగా పెరగడం ఇదే మొదటిసారి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వివరాలు ఆన్లైన్ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా పర్యటనకు రాగా కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వైద్య కళాశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మాత, శిశు వైద్యశాలపై ప్రిన్సిపాల్ కిరణ్మయి ప్రొజెక్టర్ ద్వారా ప్రస్తుతం ఉన్న వసతులు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వివరించారు. ప్రొఫెసర్లు, అసోసియట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉందని, విద్యార్థులు ట్రాన్స్పోర్టేషన్, క్యాడవర్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సీఈఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి వసతులు, డయాలసిస్ చేయించుకునే వారి వివరాలు, సమస్యలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ సిబ్బందితో మాట్లాడి రోజు ఎన్ని క్లెయిమ్స్ చేస్తున్నారు? వస్తున్న అవుట్ పేషంట్ల సంఖ్య ఎంత.. ఉదయాన్నే విధులకు రాగానే ఎవరు ఏయే పనులు చేస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం.. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరగాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని పడకలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా మెడికల్ కో–ఆర్డినేటర్ డా. రమాదేవి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఆన్లైన్ పోర్టల్లో వివరాల నమోదు తప్పనిసరి ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్కుమార్ -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుదారులకు వినతులపై తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 87 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. ఎస్పీ గ్రీవెన్స్కు 14 వినతులు.. వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 14 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనంతరం సంబంధిత ఠాణాల ఎస్ఐ, సీఐలకు ఫోన్ చేసి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. 8 భూ తగాదాలు, 4 కుటుంబ ఘర్షణలు, రెండు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
పురం.. అధ్వానం
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం పట్టణవాసులకు శాపంగా మారుతోంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగతా కాలనీల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగంతా రహదారులపై పారుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఇళ్ల ముంగిట మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నామని ఆయా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్నిచోట్ల కాలనీవాసులే మురుగు తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫొటోలకే పరిమితం.. పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక రూపొందించినా.. అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. ఫొటోల కోసం ఓ చిన్న ప్రాంతంలో హడావుడి చేయడం తప్పితే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జూన్ 2 నుంచి వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తూతూమంత్రంగా చేపడుతుండటంతో స్వచ్ఛ ఆశయం మరుగున పడుతోంది. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, వారితో కలిసి శ్రమదానం చేయడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలన, తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపర్చాలి. వారితో అధికారులు ప్రతిజ్ఞ చేయించాల్సి ఉంది. ఒకటి, రెండుచోట్ల మొ క్కుబడిగా సమావేశాలు నిర్విహించడం మిగతా చోట్ల ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. కొత్త కాలనీల్లో.. వేధిస్తున్న సిబ్బంది కొరత.. పురపాలిక వార్డులు జనాభా పారిశుద్ధ్య కార్మికులు వనపర్తి 33 70,416 150 పట్టణంలో ఏర్పడిన కొత్త కాలనీల్లో మురుగు కాల్వలు, రహదారులు లేక రోడ్లు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు, మురుగు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అంతర్గత వీధుల్లో రహదారులపై పారుతున్న మురుగు వంద రోజుల ప్రణాళిక అమలులోనూ నిర్లక్ష్యం తూతూమంత్రంగా పనులు పట్టించుకోని అధికారులు -
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలి
కొత్తకోట రూరల్: రైతులు ఆయిల్పామ్ సాగుచేసేలా అధికారులు ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలో రైతులు నాగరాల తిరుపతిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పొలాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఆయిల్పామ్ సాగు చేసిన రైతులతో మాట్లాడి ఎకరాకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత దిగుబడి వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గెలలను పరిశీలించి అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 2025–26 సంత్సరంలో జిల్లాలో 3,500 ఎకరాల ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించారని.. అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని రైతులకు కావాల్సిన డ్రిప్ పరికరాలు, మొక్కలను అందించాలని కోరారు. జిల్లాలోని 15 మంది రైతులు 41 ఎకరాల్లో మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, ఉద్యాన అధికారి వి.విజయభాస్కర్, అధికారులు ఎన్.సురేష్, ఆర్.కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్రెడ్డి, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ అధికారి, ఏరియా మేనేజర్, డ్రిప్ కంపెనీ అధికారులు, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బీచుపల్లియాదవ్, రైతులు హరీశ్రెడ్డి, బుచ్చన్న, మాదన్న, మోహన్రెడ్డి, రాంచందర్రెడ్డి తదితరులు ఉన్నారు. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణాలకు శంకుస్థాపన.. కొత్తకోట: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణాలకు సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.33 లక్షల వ్యయంతో భవనాలు నిర్మిస్తున్నామని, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లను ఆధునికీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మండల విద్యాధికారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ
వనపర్తి రూరల్: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని చందాపూర్లో పార్టీ మండల అధ్యక్షుడు సందా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఆయనతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, అయ్యంగారి ప్రభాకర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటీ పడావో.. బేటీ బచావో పథకంతో మొదలుకొని పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్, ఉచిత బియ్యం ఇలా అనే పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా వారు పంచాయతీ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, కుమారస్వామి, బాలరాజు, వాకిటి సుదర్శన్, చిన్న నర్సింహ, రాఘవేందర్, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య రక్షణే ‘జై సంవిధాన్’ లక్ష్యం
పాన్గల్: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సోమవారం మండలంలోని మల్లాయిపల్లి, చింతకుంటలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. అర్హులందరికీ రైతు భరోసా.. రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని.. గ్రామాల వారీగా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు అర్హత ఉన్న రైతు భరోసా రాలేదని.. మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్లు తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. -
డ్రెయినేజీలు నిర్మించడం లేదు..
మా కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా నేటికీ స్పందించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీరంతా రహదారులపై పారుతోంది. పారిశుద్ధ్య కార్మికులు కూడా రాకపోవడంతో మేమే తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. – చెన్నయ్య, రాంనగర్కాలనీ దుర్వాసన భరించలేకపోతున్నాం.. మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక మురుగంతా ఖాళీ ప్రదేశాల్లో నిలుస్తోంది. దోమలు, పందుల బెడదతో సతమతం అవుతున్నాం. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. – సంపూర్ణ, కాలనీవాసి, 11వ వార్డు భయంగా బతుకుతున్నాం.. మా కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మరుగు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీనికితోడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో విషపు పురుగుల సంచారం పెరిగింది. దీంతో భయం భయంగా బతుకుతున్నాం. పిచ్చి మొక్కల తొలగింపునకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. – నిరంజన్పాషా, కొత్తకోట రోడ్ ● -
చినుకు రాలక.. చింత తీరక..
తిర్మలాయపల్లి శివారులో వాడుముఖం పట్టిన మొక్కజొన్న రోహిణి కార్తెలో ముందస్తుగా వర్షాలు కురవడంతో పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసిన అన్నదాతలు పత్తి, జొన్న, మొక్కజొన్న, ఆముదం వంటి మెట్ట పంటలు సాగు చేశారు. తర్వాత చినుకు రాలక పంటలు మొలక దశలోనే వాడుముఖం పడుతున్నాయి. 20 రోజులుగా మబ్బులు, ఈదురుగాలులు మినహా వాన చినుకు రాలడం లేదు. దీంతో రైతు చేసేది లేక రోజు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం మండలంలో పత్తి 960 ఎకరాలు, జొన్న 370 ఎకరాలు, మొక్కజొన్న 430 ఎకరాలు, ఆముదం 50 ఎకరాలు మొత్తం 1,810 ఎకరాల మెట్ట పంటలు సాగైనట్లు తెలుస్తోంది. మొలకలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. – ఖిల్లాఘనపురం -
అందిన పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ బడుల్లో 90 శాతం పంపిణీ పూర్తి ●కొత్త పుస్తకాలు ఇచ్చారు.. గతంలో పాఠశాలలు తెరిచిన కొన్ని రోజుల తర్వాత పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు. ఈసారి ముందుగానే తరగతిలో ఉన్న వారందరికి కొత్త పుస్తకాలు అందించారు. దీంతో ప్రారంభం నుంచే విషయాల వారీగా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో రోజువారీగా పుస్తక పఠనంతో పాటు ప్రశ్నలకు జవాబులు రాసుకొని ఉపాధ్యాయులకు అప్పజెబుతున్నాం. – చరణ్, 4వ తరగతి, నందిమళ్ల పాత పుస్తకాలు ఇచ్చేవారు.. గతంలో కొత్త పాఠ్య పుస్తకాలు సకాలంలో రాకపోవడం, అరకొరగా రావడంతో ఉపాధ్యాయులు పాత పుస్తకాలు సరి చేసేవారు. ఈ ఏడాది మాత్రం తరగతిలో అందరికి కొత్త పుస్తకాలు ఇవ్వడంతో పాటు పాఠాలు కూడా బోధిస్తున్నారు. వీటితో పాటు ఒక జత యూనిఫాం కూడా ఇచ్చారు. – రమ్య, 5వ తరగతి, నందిమళ్ల 90 శాతం పంపిణీ పూర్తి.. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. 2,54,650 వచ్చాయి. మిగిలిన 8 వేల పుస్తకాలు వచ్చిన వెంటనే మండలాల వారీగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఈసారి ముందస్తుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో రోజువారి తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తవుతుంది. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి అమరచింత: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బడిబాట కార్యక్రమం కంటే ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం ఆచరణలో సాధ్యమైంది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలు ఆయా మండలాల విద్యాధికారులకు చేరడం, వాటిని పాఠశాలల వారీగా తరలించడం వంటి కార్యక్రమాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు బడులకు వచ్చిన వెంటనే వారి చేతికి పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో ఇప్పటి వరకు 90 శాతం పంపిణీ పూర్తయిందని విద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,62,650 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 2,54,650 రాగా పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా సరఫరా చేశారు. విద్యార్థులకు ఈసారి పాఠ్య పుస్తకాలతో పాటు ఒకజత యూనిఫామ్ను సైతం ముందస్తుగా అందించారు. పాత, కొత్త విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరడంతో తరగతుల నిర్వహణ సజావుగా సాగుతుందని, విద్యార్థులకు విషయాల వారీగా తరగతులు ప్రారంభించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. బడిబాట కంటే ముందే.. పాఠశాలలు తెరవకముందే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో విద్యాధికారులు సఫలీకృతమయ్యారు. జూన్ 16 వరకు కొనసాగిన బడిబాటలో ఉపాధ్యాయులు పాఠశాల క్లస్టర్ల వారీగా విద్యార్థుల నమోదుతో పాటు డ్రాపౌట్ విద్యార్థులను బడికి రప్పించేందుకు ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లాలో 558 సర్కారీ పాఠశాలలు సకాలంలో ప్రారంభమైన తరగతులు ఒక జత యూనిఫామ్స్ కూడా.. -
జూలై 5న ‘పాలమూరు’ సదస్సు
వనపర్తిటౌన్: పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై జూలై 5న పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు పాలమూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వేదిక ప్రతినిధులు వెంకటేశ్వర్లు, యోసేపు కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న దొడ్డి కొమురయ్య హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు సదస్సు కొనసాగుతుందని.. పాలమూరు శాశ్వత వెనుకబాటుతనంపై చర్చించడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బీజేపీవనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో గడప గడపకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి కోరారు. ఆదివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, సీనియర్ నాయకుడు కొమ్ము శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాములు, మండల ప్రధానకార్యదర్శి శివ, ఎల్లస్వామి, చరణ్, విరాట్, శివ, రాయన్నసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయాల సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. విగ్రహావిష్కరణలో మాజీ మంత్రులు -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తిటౌన్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకు రూ.10,29,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సాయం అందజేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్యశ్రీ లేనివారికి చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సమద్ మియా, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, పార్టీ పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న యాదవ్, ఏఐపీసీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగార్జున, నాయకులు ఆవుల చంద్రశేఖర్, రాగి అక్షయ్, కోళ్ల వెంకటేష్, రాగి వేణు, మణిగిళ్ల బాలరాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత ● రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు ● పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు ● 2 వేలకుపైగానే ఎఫ్లైన్ అర్జీలు పెండింగ్ ● తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు రికార్డులు శిథిలావస్థకు.. ఉమ్మడి ఇల్లాలో సర్వే చేసేందుకు సిబ్బంది కొరతతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. రీ సర్వే చేయకపోవడంతో చాలా కార్యాలయాల్లో రికార్డులు శిథిలావస్థకు చేరాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ సంతకం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసేలా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. దీని ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనిపై చర్యలకు అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. లైసెన్స్ సర్వేయర్ తప్పు చేస్తే ఏమి టి పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇందుకోసం సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరిస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనుంది. మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జోగుళాంబ గద్వాల 20 9 11 నాగర్కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 జిల్లాల వారీగా ఇలా.. -
మెనూ విధిగా పాటించాలి
గోపాల్పేట: వసతిగృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందుబాటులో ఉండి మెనూ పాటించేలా చూసుకోవా లని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తినేముందు ప్లేట్లు, చేతులు కడుక్కునేందుకు నీరు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు. బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వార్డెన్ రమేష్గౌడ్ ఉన్నారు. -
మత్తుకు బానిసైతేభవిష్యత్ నాశనం
ఆత్మకూర్: విద్యార్థులు, యువత మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని.. దూరంగా ఉండాలని ఆత్మకూర్ జూనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి శిరీష కోరారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్, ధూమపానం, మద్యం లాంటి చెడు అలవాట్లకు యువత ఆకర్శితులై బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుపై దృష్టిసారించి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని, గ్రామాల్లో సైతం మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, బాలల హక్కులకు భంగం కలిగించే వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, ప్రధానకార్యదర్శి ముక్తేశ్వర్, సీనియర్ న్యాయవాదులు తిప్పారెడ్డి, రామేశ్వర్రెడ్డి, నారాయణగౌడ్, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, కురుమూర్తి పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 800 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. 19.6 అడుగులకు కేఎస్పీ నీటిమట్టం.. దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రం వరకు 19.6 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదలను కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటి మట్టం 8.6 అడుగులు పెరిగింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్ల లేవల్ వరకు నీటి మట్టం 32.6 అడుగులుగా ఉంది. ‘కేంద్ర పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి’ వీపనగండ్ల: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకుడు ఎల్లేని సుధాకర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, మహిళలుకు 33 శాతం రిజర్వేషన్, ట్రిబుల్ తలాక్ లాంటి అనేక సమస్యలను పరిష్కరించిందని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర, కిసాన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్గౌడ్, పార్టీ మాజీ మండల అఽధ్యక్షుడు నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరేష్, రాకేష్యాదవ్, కృష్ణ, రవిగౌడ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
నేడు సాయిచంద్ విగ్రహావిష్కరణ
అమరచింత: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం గిడ్డంగులశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జానపద కళాకారుడు సాయిచంద్ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీసంఖ్యలో హాజరు కానున్నారు. బహిరంగ సభ నిర్వహణకు కావాల్సిన స్థలంతో పాటు సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమానికి వచ్చిన వారికి భోజన వసతి కల్పించనుండగా.. నిర్వహణ ఏర్పాట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఫ అమరచింతలో పుట్టి పెరిగిన వేద సాయిచంద్ తన తండ్రి వెంకట్రాములు గానాన్ని వారసత్వంగా స్వీకరించి తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే విప్లవ పాటలకు అకర్షితుడై పీడీఎస్యూ, అరుణోదయ కళాకారుడిగా అరంగేట్రం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ఉద్యమంలో తమ కళాకారులతో కలిసి ఎన్నో జిల్లాల్లో ధూంధాం కార్యక్రమాలు నిర్వహంచి తన గానంతో ప్రతి ఒక్కరి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. శ్రీకాంతాచారి స్మారక సభలో సాయిచంద్ పాడిన ‘రాతి గుండెలో కొలువైన శివుడా..’ అన్నపాట ప్రతి తల్లి హృదయాన్ని కలిచి వేసింది. 2023, జూన్ 20న రాష్ట్ర గిడ్డంగులశాఖ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్న సమయంలో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. రెండో వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సతీమణి రజనీ సాయిచంద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజులుగా పట్టణంలో పర్యటిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. హాజరుకానున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు -
బోనస్.. బకాయి
జిల్లాలో యాసంగి కొనుగోళ్లు పూర్తయినా ప్రారంభం కాని చెల్లింపులు ● 17,900 మంది రైతులు.. రూ.48.92 కోట్లు పెండింగ్ ● వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు ● డబ్బుల కోసం ఎదురుచూపులు వనపర్తి: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినా.. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి చెల్లిస్తామన్న బోనస్ క్వింటాకు రూ.500 చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటే బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సర్కార్.. యాసంగి సీజన్ బోనస్ చెల్లింపులో ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందో అధికారులకు సైతం తెలియకపోవడం శోచనీయం. నిత్యం ఏదో ఒకచోట రైతులు ఈ విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం వద్దనే పెండింగ్ అనే సమాధానమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొత్తం 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తే.. అందులో సుమారు లక్ష మెట్రిక్ టన్నులు సన్నరకమే ఉంది. దీంతో భారీ మొత్తంలో రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన సన్నాల సాగు.. యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 17,900 మంది రైతుల నుంచి సుమారు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. వారికి ధాన్యం డబ్బుల చెల్లింపుతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ రూపంలో సుమారు రూ.48.92 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లా రైతులు కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో మాత్రమే ఎక్కువగా సన్నాలు సాగు చేసేవారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు సన్నాలకు బోనస్ అందిస్తామని చెప్పడంతో పాటు గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటు బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో యాసంగిలో రైతులు పెద్దఎత్తున సన్నాలు పండించారు. గతేడాది వానాకాలంలో సుమారు రూ.10 కోట్ల మేర బోనస్ చెల్లిస్తే.. యాసంగిలో ఆ మొత్తం ఏకంగా రూ.48.92 కోట్లుకు చేరిందంటే ఎంత విస్తీర్ణంలో సన్నాలు సాగు చేశారో అర్థమవుతుంది. వానాకాలంలో మరింత పెరుగుదల.. గతంతో పోలిస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో సన్నాల సాగు జిల్లావ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన సాగునీటి వనరులు, స్వల్పకాలికాల్లోనూ సన్నాల రకం విత్తనాలు అందుబాటులోకి రావటమే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారు. రూ.1.90 లక్షలు రావాలి.. బోనస్ వస్తుందనే ఆశతో యాసంగి సీజన్లో 15 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశా. మొత్తం 380 క్వింటాళ్లు విక్రయిస్తే ఇందుకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. బోనస్ డబ్బులు రూ.1.90 లక్షలు రావాల్సి ఉంది. ఎప్పుడు వేస్తారని ఎదురుచూస్తున్నా. – శేషిరెడ్డి, చెన్నూరు (గోపాల్పేట) త్వరగా చెల్లించాలి.. సన్నరకం వడ్లు వేస్తే క్వింటాకు రూ.500 ఇస్తమని ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో కొంత పొలం దొడ్డు రకం, కొంత పొలం సన్నరకం సాగు చేశా. సన్న రకం వరి 30 క్వింటాళ్లు పండితే కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా బోనస్ రాలేదు. త్వరగా చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయి. – భద్రయ్య, తిర్మలాయపల్లి (ఖిల్లాఘనపురం) ప్రభుత్వానికి నివేదించాం.. జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన బోనస్ వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతాయి. ఈ విషయంలో రైతులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్ -
సోమశిలకు సొబగులు
సాక్షి, నాగర్కర్నూల్: ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్(సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● కృష్ణాతీరంలోని సుందరప్రాంతాలు, నల్లమలలోపర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ● జటప్రోలు, కొల్లాపూర్లోని పురాతన ఆలయాల అనుసంధానం ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం -
డిసెంబర్ నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ.3.50 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సాగునీరు విడుదల
వీపనగండ్ల: మండలంలోని గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి శనివారం అధికారులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కాల్వలకు సాగునీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ అవుట్ ఫాల్ గేట్లను ఎత్తడంతో మండలంతో పాటు చిన్నంబావి మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరు అందుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం ఉమ్మడి మండలంలోని రైతులు సకాలంలో వరి తుకాలు పోసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేసినట్లు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్యాదవ్, మాజీ సర్పంచ్లు బీచుపల్లి యాదవ్, రంజిత్కుమార్ వివరించారు. కార్యక్రమంలో జూరాల ఇరిగేషన్ డీఈ భావన తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్పేట: నిజామాబాద్లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్ 15 బాలుర ఫుట్బాల్ పోటీలకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ సురేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ నెల 18న జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారని.. జిల్లా నుంచి 18 మంది పాల్గొంటుండగా గోపాల్పేట విద్యార్థులు ప్రశాంత్, బాబునా యక్, సాయి మణికంఠ, మహేష్, చరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పీడీతో పాటు ప్రధానోపాధ్యాయుడు రాందేవ్రెడ్డి అభినందించారు. -
నేర రహిత సమాజమే ధ్యేయం : ఎస్పీ
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. యాక్సిడెంట్, మిస్సింగ్, దొంగతనం కేసుల దర్యాప్తులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని.. విధుల్లో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. పోలీస్స్టేషన్లలో రిసెప్షన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలను త్వరగా పరిష్కరించి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని, ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఠాణా ఆవరణలో అనవసర వాహనాలు లేకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉ న్న కేసులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూర్, వనపర్తి సీఐలు శివకుమార్, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, డీసీఆర్బీ, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
●ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 9, యూజీ కోర్సులలో టాపర్స్లో 17 మంది గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ము ఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీ యూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు గవర్నర్కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గవర్నర్ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. స్పాన్సర్లకు అవకాశం.. కాన్వకేషన్లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పీయూలో 4వ కాన్వకేషన్ కు సిద్ధమవుతున్న అధికారులు మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మాలో 88 మందికి గోల్డ్మెడల్స్ రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇచ్చే అవకాశం -
సంత చింత తీరేనా?
ఖిల్లాఘనపురంలో అసంపూర్తిగా వే సైడ్ మార్కెట్ ●రాకపోకలకు ఇబ్బందులు.. మండల కేంద్రంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వేసైడ్ మార్కెట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తిచేసి ప్రారంభించి అన్ని వ్యాపారాలు అక్కడే జరిగేలా చూడాలి. – పాలవాది శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం చేపల మార్కెట్ లేదు.. మండల కేంద్రంలో చేపలు విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ లేదు. కొత్తగా నిర్మించే వేసైడ్ మార్కెట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. నిర్మాణం పూర్తిగాకపోవడంతో మహబూబ్నగర్కు వెళ్లే రహదారి పక్కన విక్రయాలు చేపడుతున్నాం. వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలకు సాగిస్తుండటం ఇబ్బందిగా మారింది. – బెస్త గోపాల్, ఖిల్లాఘనపురం త్వరగా పూర్తిచేస్తాం.. ఖిల్లాఘనపురంలో వే సైడ్ మార్కెట్ నిర్మాణంలో ఉంది. 90 శాతం పనులు పూర్తయ్యాయి.. ఇంజనీరింగ్శాఖ అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు పూర్తి చేయించి వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. వినియోగంలోకి వస్తే కూరగాయలు, చేపలు, మాంసం అన్నింటిని అక్కడే విక్రయించుకునే అవకాశం ఉంటుంది. – స్వరణ్సింగ్, డీఎం, మార్కెటింగ్శాఖ ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో కూరగాయలు, చేపలు, మాంసం రోడ్లపైన విక్రయిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసైడ్ మార్కెట్ భవన నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 90 శాతం పనులు పూర్తి చేసి బిల్లులు రాకపోవడంతో మిగిలిన 10 శాతం పనులు చేపట్టడం లేదు. సీసీ, విద్యుత్ సౌకర్యం తదితర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. సంబంధిత శాఖ అధికారులు, పాలకులు స్పందించి కాంట్రాక్టర్కు బిల్లులు ఇప్పించి మిగతా పనులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు. రోడ్లపైనే విక్రయాలు.. వే సైడ్ మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో యధావిధిగా ఖిల్లాఘనపురం, మామిడిమాడ, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయాలు చేపడుతున్నారు. వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారి పక్కన చేపలు విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన చిరు వ్యాపారులు విక్రయాలు చేపడుతుండటంతో వాహనదారులు, దారి వెంట వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం వారాంతపు సంత రోజున ఇబ్బందులు వర్ణనాతీతం. నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు.. 90 శాతం పనులు పూర్తి బిల్లులు రాక అర్ధాంతరంగా వదిలేసిన కాంట్రాక్టర్ ప్రధాన రహదారులపైనే కూరగాయలు, మాంసం, చేపల విక్రయం ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు, ప్రజలు -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటి మట్టం సాక్షి, నాగర్కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం.. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్లో భాగమైన ఎల్లూర్ పంప్హౌస్లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి జలకళ ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానదిలో కొనసాగుతున్న వరద రిజర్వాయర్లో 125 టీఎంసీలకు చేరువైన నీరు ఈసారి జూన్లోసగానికిపైగా నిండిన శ్రీశైలం జలాశయం కేఎల్ఐ కింద ఆయకట్టుకు సీజన్ ముందు నుంచే నీటి సరఫరాకు అవకాశం -
సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే
మదనాపురం: రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని రామన్పాడు రిజర్వాయర్ వద్ద ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకం ప్రధాన మోటార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులకు అనేక విధాలుగా మేలు చేకూరుతుందని, పేదల ప్రభుత్వమని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు మహేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..
డ్యాం క్రస్ట్గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల పొంచి ఉన్న ముప్పు.. జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల ● -
‘మత్తు’ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరగగా.. సంబంధిత శాఖల నుంచి నివేదిక తీసుకోవడంతో పాటు బాధ్యతలను అప్పగించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లు, పాన్ డబ్బాలు, మద్యం దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నిఘా ఉంచాలని ఎకై ్సజ్శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన 222 యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలకంగా మార్చి ప్రతి నెల మొదటి శుక్రవారం సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని ఆదేశించారు. యాంటీ డ్రగ్ కమిటీ సమావేశాలకు జిల్లా అధికారులు హాజరుకావాలని, అప్పుడప్పుడు తాను సైతం వస్తానని తెలిపారు. పీహెచ్సీలకు అనారోగ్యంతో వచ్చే యువతను నిశితంగా పరిశీలించి మత్తు పదార్థాల అలవాటు ఉందా అనే విషయాలను గుర్తించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. పత్తి, జొన్న తదితర పంటల సాగులో అక్కడక్కడ గంజాయి పండించే అవకాశాలు ఉంటాయని.. వ్యవసాయ విస్తరణ అధికారులు గట్టి నిఘా ఉంచాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణులు కల్తీ కల్లు తాగడంతో ఆరోగ్యం పాడవడంతో పాటు పుట్టబోయే పిల్లలపై దాని ప్రభావం ఉంటుందని.. తాగకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 22 మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2025లో వనపర్తిలో 2, గోపాల్పేట మండలంలో 2, పెబ్బేరులో ఒక కేసు నమోదైందన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, సరఫరా చేసినా, గంజాయి పండించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధ్యాపకులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఒంటరిగా ఉండటం, కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడకపోవడం, కళాశాలకు తరచూ డుమ్మా కొట్టడం, అకస్మాత్తుగా కోపానికి రావడం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తే కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమేలా..?
వనపర్తిశుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు వరప్రదాయిని.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువు పట్టుగా నిలిచే క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్ రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్గేట్లకు ఉన్న ఇనుప రోప్లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీలమయం.. -
నాగులకుంట కబ్జాపై నివేదిక ఇవ్వండి
అమరచింత: పుర పరిధిలోని నాగులకుంట కబ్జాపై సమగ్ర నివేదిక అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రవికుమార్ యాదవ్ను ఆదేశించారు. గురువారం ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంటను పరిశీలించారు. కొన్నేళ్లుగా కుంట స్థలంలో మట్టి వేసి నీరు నిల్వకుండా కొందరు కబ్జా చేస్తున్నారని ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. మిషన్ కాకతీయలో చేపట్టిన కట్ట నిర్మాణం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కుంటలు, చెరువులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఈ ఆంజనేయులు, రైతులు ఉన్నారు. -
విద్యాశాఖలో డీసీఈబీ రగడ!
వనపర్తి టౌన్: జిల్లా విద్యాశాఖలో డీసీఈబీ (డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) కార్యదర్శి కొనసాగింపుపై రగడ మొదలైంది. ఈ పోస్టు కోసం పలువురు ప్రధానోపాధ్యాయులు పోటీ పడుతుండగా.. వారికి ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నేతలు సహకరిస్తూ పోటాపోటీగా పాపులు కదుపుతుండటంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏడాదికి సుమారు రూ.30 లక్షల వరకు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు కావడం.. వీటి వినియోగానికి డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి అధికారం ఉండటంతో ఈ పోస్టుకు డిమాండ్ పెరిగి తమ వర్గానికి చెందిన వారికే కేటాయించాలంటూ ఎమ్మెల్యే, మంత్రితో సిఫారస్ చేయడం విస్మయం కలిగిస్తోంది. ● డీఈఓ డీసీఈబీ కార్యదర్శి నియామకంతో పాటు పలువురు ప్రభుత్వ గజిటెడ్ ఉపాధ్యాయులు, ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ మూడు, ఆరు నెలలకొకసారి సమావేశమై నిధుల వినియోగంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిధుల వినియోగానికి చెక్ పవర్ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శికి ఉండటంతో ఈ పోస్టు దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ కథ.. జిల్లా ఏర్పాటు అనంతరం 2017 నుంచి ఇప్పటి వరకు డీసీఈబీ సెక్రటరీగా జిల్లాకేంద్రంలోని దళితవాడ జీహెచ్ఎం సూర చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఈయనతో పాటు గతంలో విధులు నిర్వర్తించిన ఏఎంఓ సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఎనిమిదేళ్లుగా ఒక్కరినే ఎలా కొనసాగిస్తారని, మరొకరికి అవకాశం ఇవ్వాలని డీఈఓకు ఫిర్యాదులు వచ్చాయి. డీసీఈబీని తాను కాపాడానని, తననే కొనసాగించాలంటూ ప్రస్తుత కార్యదర్శి పట్టుబడుతున్నారు. బాధ్యతల నుంచి తప్పిస్తే డీఈఓ కార్యాలయంలో జరిగే సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఈ పదవిపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం కలెక్టర్ చెంతకు చేరడంతో నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఫీజుల వసూలు ఇలా.. ఎనిమిదేళ్లుగా ఒకే వ్యక్తిని కొనసాగించడంపై విమర్శలు ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటాపోటీ రాజకీయ జోక్యంతోస్పందించేందుకు జంకుతున్న అధికారులు మరొకరికి అవకాశం ఇవ్వాలి.. ఒకే ఉపాధ్యాయుడిని డీసీఈబీ కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగించడం సరైంది కాదు. గతేడాది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశాలు ఉన్నాయి. సీనియర్లను కాదని ఇనాళ్లు ఒక్కరికే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మార్చాలని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలి. – బౌద్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీపీఆర్టీయూ నిబంధనలు పాటిస్తాం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీసీఈబీ కార్య దర్శి నియామకం చేపడతాం. ఈ పోస్టుకు మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అ న్ని విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ య న ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – మహ్మద్ అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థుల నుంచి ఏడాదికి ఒకసారి రూ.110, ప్రైవేట్లోని 9, 10 విద్యార్థులకు రూ.150 పరీక్ష ఫీజులు వసూలు చేస్తారు. అలాగే ప్రైవేట్లోని 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.130 చొప్పున డీసీఈబీ వసూలు చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీసీ బుక్ కోసం రూ.300, ప్రైవేట్ పాఠశాలల నుంచి రూ.600 వసూలు చేస్తారు. ఈ నిధులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించడం, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తారు. ప్రస్తుతం డీసీఈబీలో రూ.37,62,536 నిధులున్నాయి. ఇవేగాక గత విద్యాసంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు చెల్లించిన ఫీజులు జమ చేయాల్సి ఉంది. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, క్షయ నిర్మూలన, ఏఎన్సీ నమోదు, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలు వ్యాప్తిచెంది డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులతో పాటు డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అరికట్టాలని సూచించారు. గతేడాది డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాము, కుక్క కాటుకు చికిత్సలు అందించేలా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. దగ్గు, జ్వరం లక్షణాలున్న ప్రతి ఒక్కరికి నాట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 567 మంది వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా చూడాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్సీ నమోదులు సకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి డా. పరిమళ, సీహెచ్సీ నుంచి డా. చైతన్య, వైద్యాధికారులు పాల్గొన్నారు. స్యామ్, మ్యామ్ పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలి జిల్లాలోని స్యామ్, మ్యామ్ పిల్లలను ఎన్ఆర్సీకి తీసుకెళ్లి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు.. వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 441 మంది ఉన్నట్లు గుర్తించామని, వారందరిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకెళ్లి వారం పాటు వైద్యం చేయించాలన్నారు. అదేవిధంగా బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతినెల మొదటి మంగళవారం గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులను భాగస్వాముల ను చేయాలన్నారు. అంగన్వాడీల్లో ఐదేళ్లు నిండిన ప్ర తి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో.. 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా విద్యాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆదర్శం.. అమరచింత నేతన్నలు
అమరచింత: స్థానిక చేనేత కార్మికుల సమష్టి కృషితోనే పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలు ఆర్థికంగా, వ్యాపారపరంగా ముందుకు సాగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు కొనియాడారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకుగాను బుధవారం ఆయన పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. యువత, మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలోనే మక్తల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదివరకే రెండుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని.. అమరచింతలోనూ ప్రభుత్వపరంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకుగాను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కార్మికులకు సరైన వేతనాలు లేక వృత్తికి దూరమవుతున్న తరుణంలో పట్టణానికి చెందిన మహంకాళి శేఖర్ నాబార్డు ఆర్థిక సహకారంతో స్వయంగా కంపెని స్థాపించి కార్మికులను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతోపాటు కుట్టులో అనుభవం ఉండి, ఉపాధి లేని మహిళల కోసం రెడీమేడ్ వస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. పలు రెడీమేడ్ కంపెనీలు వస్త్రాల తయారీకిగాను ముడి సరుకును పంపడంతో నిత్యం సుమారు 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ ఎండీకి వివరించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నా మని వేణుగోపాల్రావు హామీ ఇచ్చారు. సెట్విన్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ్కుమార్, చేనేత కార్మికులతో పాటు కాంగ్రెస్ నాయకులు అరుణ్, మహేందర్, తిరుమల్లేష్, వెంకటేశ్వర్రెడ్డి, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆదేశాలతో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
గద్వాల కాంగ్రెస్లో అదే తీరు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్జాన్తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వాళ్లకే పనులు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ పేరుకు అధికార పార్టీ నాయకులమే కానీ.. పనులన్నీ బీఆర్ఎస్కు చెందిన నాయకులకే జరుగుతున్నాయని బాహాటంగానే ఆరోపించినట్లు తెలిసింది. పరిశీలకులు ఇది వరకే రెండుసార్లు వచ్చారని.. ఇది మూడోసారని.. అయినా నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పరిశీలకులకు ఉదాహరణలతో వివరించినట్లు సమాచారం. 2, 3 రోజుల్లో శుభవార్త.. సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్హాట్గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మా రూటే ‘వేరు’ అన్యాయం అంటూ సరిత.. తాము పార్టీని నమ్ముకుని ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నామని.. కానీ, తమకు తీరని అన్యాయం జరుగుతోందని పరిశీలకుల ఎదుట సరిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు మొదలుకొని.. ప్రభుత్వ శాఖలలో అన్ని రకాల పనుల వరకు తమకు భంగపాటు ఎదురవుతోందని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా నా వర్గం అని తెలుసుకుని పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీస్ కేసులు నమోదవుతున్నాయని, ప్రతిరోజు పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎదురుకాదని.. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని గట్టిగా కోరినట్లు సమాచారం. మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బండ్ల కృష్ణమోహన్రెడ్డితో.. హరిత హోటల్లో సరిత వర్గంతో.. చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు సీఎం సహకారంతో ముందుకు.. తనకు న్యాయం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధే ధేయ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారమందిస్తానని చెప్పినట్లు తెలిసింది. -
గాడి తప్పుతోంది..!
జిల్లా విద్యాశాఖలో అడ్డగోలుగా డిప్యుటేషన్లు ●కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలో డిప్యుటేషన్ల విషయమై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్లపై వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారిలో ఏడుగురికి జిల్లాస్థాయిలోనే గత విద్యాసంవత్సరం ఇవ్వగా.. మరొకరు డీఎస్ఈ స్థాయిలో ఇచ్చారు. ఇటీవల వెల్లువెత్తుతున్న నిరసనలు, ఫిర్యాదుల మేరకు కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాఽధికారి -
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం : ఎస్పీ
వనపర్తి: విద్యార్థులు, యువత దృష్టి జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని.. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావొద్దని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జేఎస్ రాములు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందని.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రహిత జిల్లా ఏర్పాటే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని.. అందులో భాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. యువత తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తూ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలన్నారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, నిర్వాహకులు జె.సతీష్రాజు, మహిమరాజు, సంతోష్రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోక్సో బాధితురాలికి ఆర్థిక సాయం.. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ రావుల గిరిధర్ పోక్సో కేసు బాధితురాలి కుట్టు శిక్షణకుగాను తక్షణ సాయంగా రూ.10 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార బాధితులకు భరోసా కేంద్రం అన్నివిధాలుగా అండగా నిలుస్తోందని, సిబ్బంది బాధితుల ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి బాధిత సహాయ నిధి నుంచి రూ.10 వేల వరకు తక్షణ పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. భరోసా కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్, శిరీష పాల్గొన్నారు. -
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్కు కేరాఫ్గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్లోని హనుమాన్, శంకర్గంజ్లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
స్థానిక పోరుకు కసరత్తు
ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ● ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి ● బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ● ప్రధాన పార్టీల సమావేశాలతో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్కర్నూల్లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదం తెలిపి పార్లమెంట్కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుపొందిన స్థానాలు గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు జిల్లా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మహబూబ్నగర్ 14 175 నాగర్కర్నూల్ 20 214 వనపర్తి 14 128 జోగుళాంబ గద్వాల 20 214 నారాయణపేట 11 142 జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇండిపెండెంట్ మహబూబ్నగర్ 111 42 6 16 నాగర్కర్నూల్ 137 52 4 16 వనపర్తి 89 20 – 19 జోగుళాంబ గద్వాల 50 17 – 5 నారాయణపేట 88 26 23 5 జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మహబూబ్నగర్ 14 – – నాగర్కర్నూల్ 17 3 – వనపర్తి 13 1 – జోగుళాంబ గద్వాల 7 – – నారాయణపేట 9 1 1 -
ముందుజాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధుల నివారణ
పాన్గల్: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సూచించారు. సోమవారం పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అదే విధంగా దావాజీపల్లిలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. శిబిరంలో హెచ్ఐవీ, టీబీ తదితర నిర్ధారణ పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు అందిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించా రు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్, సీ హెచ్ఓ రామయ్య, ఆయుస్మాన్ మందిర్ వైద్యాధికారి మైథిలి, సిబ్బంది రాంచందర్, రేవతి పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నషాముక్త్ భారత్పై జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యాలయాలు, బస్టాండ్, ఆటో స్టాండ్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్, విద్యాశాఖ, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 90 ఫిర్యాదులు వచ్చినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మండల విద్యాధికారులు, హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ హెచ్ఎంలతో విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు సైతం జరిగినందున.. విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని.. అంగన్వాడీ కేంద్రాల నుంచి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే విధంగా ఎంఈఓలు, హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం టీజీ ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్శాఖ, పరిశ్రమలశాఖ, టౌన్ ప్లానింగ్, లేబర్ డిపార్ట్మెంట్ వంటి శాఖలు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అన్నింటినీ పరిశీలించాక జిల్లాస్థాయి టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 24 దరఖాస్తులను పరిశీలించి.. 18 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ చెప్పారు. మరో నాలుగింటిని తిరస్కరించగా.. రెండు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటుచేసిన ఏడుగురు ఎస్సీ లబ్ధిదారులకు, 12మంది ఎస్టీ లబ్ధిదారులకు, ఒక పీహెచ్సీ లబ్ధిదారుడికి టి.ప్రైడ్ పాలసీ సబ్సిడీకి ఆమోదం తెలిపారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఎంఈఓ అబ్దుల్ ఘని, జీఎం ఇండస్ట్రీస్ జ్యోతి తదిరతులు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
సివిల్స్ కోచింగ్ వినియోగించుకోండి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వహించే సివిల్స్ కోచింగ్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ సునీత అన్నారు. సోమవారం ఆ శాఖ కార్యాలయంలో సివిల్స్ కోచింగ్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీ డీడీ ఉప సంచాలకులు, ఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ నందు 2025– 26 సంవత్సరానికి గాను 10 నెలల సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వచ్చే నెల 7లోగా http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 040– 23546552, 81216 26423 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ సుదర్శన్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్, కన్యాకుమారి, వార్డెన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
‘బెస్ట్’ నో అవైలబుల్!
బీఏఎస్ పథకానికి నిధుల కొరత ●వనపర్తి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) నిధుల కొరతతో నీరసించిపోతోంది. రెండేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో పేద విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులను లక్కీ డిప్ పద్ధతిన ఎంపిక చేసి.. ఆయా స్కూళ్లకు అధికారులు కేటాయిస్తారు. విద్యార్థులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా పథకాన్ని రూపొందించారు. అయితే కొన్నేళ్ల పాటు ఈ పథకం సజావుగా సాగింది. ప్రస్తుత ప్రభుత్వం నిధుల విడుదలకు బ్రేక్ వేయడంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఐదు పాఠశాలలకు వర్తింపు.. బీఏఎస్ పథకంలో భాగంగా విద్యార్థులకు డే స్కాలర్స్, రెసిడెన్షియల్ విభాగాల్లో అవకాశం కల్పిస్తారు. ఒకటో తరగతిలో ఎంపికచేసే విద్యార్థులకు డే స్కాలర్స్లో.. ఐదో తరగతి నుంచి ఎంపికచేసే విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఎంపిక చేస్తారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ పాఠశాల, వనపర్తి మండలం పెద్దగూడెం సమీపంలోని రేడియంట్ హైస్కూల్, పెబ్బేరు మాస్టర్మైండ్, ఆత్మకూరులోని అక్షర, శ్రీవాణి పాఠశాలలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బెస్ట్ అవైలబుల్ పథకానికి ఎంపికై న విద్యార్థులకు ఆయా కేటగిరీల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు అందించి విద్యనందించారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో తాము బీఏఎస్ పథకంలో అడ్మిషన్లు ఇవ్వలేం.. మునుపు పంపిన వారిని సైతం కొనసాగించలేమంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం.. రెండేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు నిధులు విడుదల కాలే దు. రూ.లక్షల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తాం. అప్పటి వరకు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరాం. కొందరు పాజిటివ్గా.. మరికొందరు నెగిటివ్గా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. – అబ్దుల్ ఘని, డీఈఓ ఆందోళనలో తల్లిదండ్రులు.. బీఏఎస్ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమస్యను లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ స్పందించి ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాము రూ.లక్షల్లో అప్పులు చేసి రెండేళ్లుగా నెట్టుకొచ్చామని.. ఇక తాము భరించలేమంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. జిల్లాలో రూ. 4కోట్ల వరకు పెండింగ్ రెండేళ్లుగా నిధుల విడుదలకు బ్రేక్ అడ్మిషన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రజావాణిలో కలెక్టర్ను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రులు -
ఇంటర్లో 1,445 అడ్మిషన్లు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు చేపట్టిన ఇంటింటి ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. సోమవారం పలు గ్రామాల్లో అధ్యాపకులు పర్యటించి.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. జిల్లాలో ఇంటింటి ప్రచారంతో ఇప్పటి వరకు 1,445 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. 1,71,405 మంది ఖాతాల్లో రూ.196.49కోట్లు జమ వనపర్తి: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 1,71,405 మంది రైతుల ఖాతాల్లో రూ.196.49 కోట్లు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందు నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,27,492 ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందిందని.. మిగిలిన రైతులందరి ఖాతాల్లో మంగళవారం సాయంత్రంలోగా రైతుభరోసా నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని 43 రైతువేదికల వద్ద రైతుల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడతారన్నారు. రైతులందరూ కోలాహలంగా రైతువేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీఏఓ కోరారు. జానియర్ సివిల్కోర్టు న్యాయమూర్తిగా శిరీష ఆత్మకూర్: పట్టణంలోని జూనియర్ సివిల్కోర్డు న్యాయమూర్తిగా సోమవారం శిరీష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, న్యాయవాదులు ముక్తేశ్వర్, తిప్పారెడ్డి, నారాయణగౌడ్, రామేశ్వర్రెడ్డి, శంకర్లింగం, అశోక్, రామచందర్ తదితరులు న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
కోయిల్సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తుండటంతో ఆదివారం సాయంత్రం వరకు 17.6 అడుగులకు చేరింది. ఈ నెల 1న జూరాల వద్ద ఉన్న ఫేస్–1 ఉంద్యాల పంపుహౌస్ నుంచి ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి పర్దీపూర్ రిజర్వాయర్కు తరలించారు. ఆ తర్వాత 6న ఫేస్–2 తీలేర్ పంపుహస్కు వద్దకు చేరిన నీటిని అక్కడ ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 22 రోజులుగా కోయిల్సాగర్కు నీటి విడుదల కొనసాగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటిమట్టం 6.6 అడుగులు పెరిగి 17.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 9 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులుగా ఉండగా.. మరో 15 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. -
‘భగవద్గీత మత గ్రంథం కాదు’
వనపర్తి రూరల్: భగవద్గీత మత గ్రంఽథం కాదని.. సర్వ మానవుల జీవితాలను ఉద్దరించే గ్రంఽథమని కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. ఎల్వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి పట్టణ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో భగవద్గీత విజయభేరి నిర్వహించగా.. ఆయన హాజరై భగవద్గీత శ్లోకాలు చదివి వాటి సారాంశం వివరించారు. సృష్టి ఉన్నంత వరకు ప్రపంచానికి నిదర్శనంగా నిలబడి ఉండే సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోని ఎన్నో గ్రంథాల సారాంశం భగవద్గీతలో ఇమిడి ఉందని వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పట్టణ పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు ఒమేష్గౌడ్, నిర్వాహకులు వెంకటస్వామి, బీచుపల్లి, పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షుడు రామకృష్ణ, మాస్టర్ పాండురంగయ్య, రుక్మానందం తదితరులు పాల్గొన్నారు.