breaking news
Wanaparthy
-
పేదలకు మెరుగైన వైద్యసేవలు
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, బస్తీ, పల్లె దవాఖానాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటి, దంత తదితర వైద్య పరీక్షలతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిభిరాలకు వస్తున్న రోగులకు జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతో పాటు తగిన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం పీహెచ్సీ సిబ్బంది పనితీరుతో పాటు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల పనితీరును వైద్యాధికారి డా. ఫయాజ్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవించిన మహిళను పరీక్షించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా సాధారణ ప్రసవాలు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట డా. శ్రావ్యా, డా. మానస, సీహెచ్ఓ సురేష్కుమార్, హెల్త్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. -
మహనీయుడు వాల్మీకి మహర్షి
వనపర్తి: దేశానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించగా.. ఆయన హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన రామాయణాన్ని రచించారని, ఈ గ్రంథం ద్వారా సమాజానికి అనేక విలువలు అందించారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని, ఇతిహాసాల్లో మొదటిది రామాయణమన్నారు. నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, వాల్మీకి సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
పాన్గల్: గ్రామాల్లోని గర్భిణుల పేర్లు నమోదు చేసుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పిస్తూ కాన్పుల సంఖ్య పెంపునకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహించిన ఆశా కార్యకర్తల నెలవారీ సమీక్లకు ఆయన హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ నివారణకు తగిన చర్యలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. క్షయ, కుష్టు తదితర జాతీయ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఏ రోజు వివరాలు అదేరోజు నమోదు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, ఎంఎల్హెచ్పీ వైద్యులు డా. నాగరాజు, డా. మైథిలి, నిహారిక, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మమార్గాన్ని చూపిన వాల్మీకి..
రామాయణ మహాకావ్యంతో ధర్మ మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి అని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వాల్మీకి జయంతిలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూజలు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీతి మార్గంలో నడవడమే వాల్మీకికి మనం ఇచ్చే నిజమైన నివాళులన్నారు. ఆయన రచించిన రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని.. నేటి యువత వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల్లో సత్తా చాటుదాం : సీపీఎం
అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి తెలిపారు. మంగళవారం మండలంలోని చంద్రనాయక్తండా, పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లిలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై పోరాడే నాయకులను గెలిపించుకోవడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి గెలిచిన తర్వాత సంపాదనే ధ్యేయంగా భావిస్తున్న బుర్జువ పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారని.. వారు కోరుకునే పాలన సీపీఎంకే సాధ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతోందని.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు అవకాశం ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందకు వెళ్లాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్, అంజిరెడ్డి, మొగిలన్న, హర్యానాయక్, బాలకృష్ణ పాల్గొన్నారు. హంస ధాన్యం క్వింటా రూ.1,789 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటాల్ రూ. 1,789 ధర పలికింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం 200 బస్తాల హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నారు. అయితే కొన్ని వారాలుగా ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ వారం ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం వేలం ద్వారా తెలియనుంది. -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఓఆర్, ఆదాయ వివరాలు డిపోల వారీగా (రూ.లలో..) ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ సమష్టి కృషితోనే.. అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్ర యాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయులు–2025 అవార్డులకుగాను జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాభివృద్ధిశాఖ అధికారి అఫ్జలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 14 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్నంబర్ 08545–232500ను కార్యాలయ పనిదినాల్లో సంప్రదించాలని సూచించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలిపాన్గల్: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పీఓ, ఏపీఓల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. శిక్షణలో సూచించిన అన్ని అంశాలను తప్పక పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై ఆర్పీలకు అవగాహన కల్పించాలని కోరారు. శిక్షణలో 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు పాల్గొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంఈఓ ఆనంద్, ఆర్ఐలు మహేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.సంత స్థల సమస్య పరిష్కరించాలివనపర్తి రూరల్: ప్రభుత్వం, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవచూపి పెబ్బేరు సంత స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్గౌడ్ కోరారు. మంగళవారం పెబ్బేరులోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెబ్బేరు గ్రామపంచాయతీ నుంచి పురపాలికగా మారిన తర్వాత చాలా సమస్యలతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంత ద్వారా వారానికి రూ.6.36 లక్షల మేర వచ్చే ఆదాయంతో పట్టణాభివృద్ధి చేపట్టేవారని, స్థల వివాదం కోర్టులో ఉండటంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు నెలల కిందట ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా.. నేటికీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణంలో రెండేళ్ల కిందట ప్రారంభించిన వనపర్తి–పెబ్బేరు రహదారి విస్తరణ పనులు నేటికీ అసంపూర్తిగా ఉన్నాయని.. త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధరేంద్రసాగర్, దేవర శివ, అంజన్న, జితేందర్, రాఘవేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంకొత్తకోట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ కొండా ప్రశాంత్రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికార కాంగ్రెస్పార్టీ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ పూర్తిస్థాయిలో బలపడాలని.. అందుకు నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్భూషణ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోటేశ్వర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ, సీనియర్ నాయకులు సాయిరాం, పబ్బ నరేందర్గౌడ్, స్టార్ బాలు, దాబా శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్గౌడ్, చిన్న, మూర్తి, రాజమౌళి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
ఖిల్లాఘనపురం: కార్మికుల బకాయి వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల వినతిపత్రాన్ని వైద్యులు డా. మాధవి, డా. పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జీఓ నంబర్ 60ని తుంగలో తొక్కి కార్మికులకు ఇస్తున్న అరకొర వేతనం రూ.11,250 నుంచి కోత విధిస్తూ రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల పొట్టకొడుతున్న వెంకటయ్య సెక్యూరిటీ సర్వీస్ ఏజన్సీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికులు భీమన్న, నాగయ్య, మునీందర్, వెంకటేష్, సాయికృష్ణ, నజ్మా, ప్రియాంక, పద్మ పాల్గొన్నారు. -
సమీకృత న్యాయస్థాన భవనంతో మేలు
వనపర్తిటౌన్: నూతన న్యాయస్థాన భవన సముదాయంతో కక్షిదారులు, ప్రజలకు ఎంతోలాభం చేకూరనుందని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్ అన్నారు. 20 ఎకరాల్లో 10+2 కోర్టు(పోక్సో, ఫ్యామిలీ కోర్టు కాంప్లెక్స్) భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రూ. 81కోట్లతో నిర్మించనున్న న్యాయస్థానానికి వర్చువల్గా 5వ, తేదీన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్ను సోమవారం వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్ను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు గోపాల్రెడ్డి, కె.తిరుపతయ్య, ఎండీ నిరంజన్ బాబా, నాచనల్లి రాజు, రామన్న గారి వెంకటేశ్వరరెడ్డి, నరేందర్ బాబు, ఎంఏ కలీం, తరుణ్, మల్లేష్ యాదవ్, సా యి కృష్ణ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
పీఓల పాత్ర కీలకం
ఖిల్లాఘనపురం/గోపాల్పేట: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పీఓల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్బాడీ) యాదయ్య అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, గోపాల్ పేట మండల కేంద్రాల్లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఓటీలతో మాట్లాడారు. శిక్షణకు వచ్చిన పీఓ, ఏపీఓలకు ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫారం, బ్యాలెట్ బాక్సు నిర్వహణ తదితర అన్ని విషయాల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ సునీత, ఎంఈఓ జయశంకర్ మాట్లాడుతూ సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీఓ, ఏపీఓలకు మాత్రమే శిక్షణ ఇచ్చామని, మంగళవారం సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజు, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం.నాగరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని ఈర్లదిన్నె, నాగల్కడ్మూర్, పాంరెడ్డిపల్లె, మస్తీపురం గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమని, అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, నాయకులు చుక్క ఆశిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో నిబంధనలు పాటించాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యానాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రచార సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియయాలపై అవగాహన కల్పించారు. ప్రచార సామగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాల్లో ఎక్కడ కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుంచి ఫారం ఏ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీ తో పాటు ముద్రించిన 4 కరపత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా వాల్పోస్టర్పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం–బీ లో చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి పాన్గల్: స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతులను జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు గురికాకుండా వివాదరహితంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల పనితీరు, డిస్ట్రిబ్యూషన్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్లు తెరవడం, బాక్స్లను సీజ్ చేయడం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణలో టెండర్ బ్యాలెట్, చాలెంజింగ్ ఓట్లపై ఆర్పీలు అవగాహన కల్పించారు. శిక్షణకు 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణలో రెండో రోజు పంచాయతీ ఎన్నికలపై శిక్షణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవింద్రావు, ఏపీఓ కుర్మయ్య, ఆర్ఐలు మహేష్, తిరుపతయ్య, సిబ్బంది మల్లేష్, శివరామ్ పాల్గొన్నారు. -
టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
అమరచింత: ఎన్నికల నిర్వహణలో అతిముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ రోజు అప్రమత్తంగా ఉంటూ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాలని పీఓ, ఏపీఓలకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్రావు సూచించారు. ఎన్నికల నిర్వహణపై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన వారిని నిషితంగా పరిశీలించి, వారి వయస్సుపై అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు తెలియ పర్చాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల వ్యవహారంలో సానుకూలంగా ఉండి వారు ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యే ్డక అధికారి అప్జలుద్దీన్, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ భాస్కర్ సింగ్, ఎంపీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్రావు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అఽధ్యక్షుడు మాణిక్యం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. పార్టీ పట్ల విధేయత, నాయకుడి పట్ల విశ్వాసం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నియోజక వర్గంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భానుప్రకాష్రావు, విజయ్కుమార్, మతీన్, రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్రెడ్డి, ధర్మానాయక్, మాదవరెడ్డి, నందిమల్ల అశోక్, నరసింహ, టీక్యా నాయక్, చిట్యాల రాము, ధర్మశాస్త్రి, కృష్ణా నాయక్, మోతిలాల్నాయక్ పాల్గొన్నారు.చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టివనపర్తి రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీడీపీఓ హజీరాబేగం సూచించారు. పోషణ మాసం సందర్భంగా సోమవారం మండలంలోని చిమనగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులను గుర్తించి వారి ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అంధించడంతో పాటు వారు తీసుకుంటున్న ఆరోగ్య జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గర్భిణులకు రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్యగద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర మట్టి అక్రమ తరలింపు
● చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ● తండావాసుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ●మట్టి తవ్వకానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. సర్వే నంబర్ 34లో ప్రభుత్వ భూమి ఉండడంతో కొందరికి అసైన్మెంటు పట్టాలు ఇచ్చాం, అందులో కొంత భాగం మిగులు భూమి కూడా ఉంది. దీంతో పాటు కొంత పట్టా భూములు కూడా ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిలోనా లేక పట్టా భూమిలో తవ్వారా అనే విషయాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ పాన్గల్: మండలంలోని కిష్టాపూర్తండా సమీపంలోని సర్వే నంబర్ 34లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇష్టానుసారంగా ఎర్రమట్టిని తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మిషన్లు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకోవడంతో పాటు పర్యావరణానికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తుండడంపై మండల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో సోమవారం తండావాసులు జిల్లా మైనింగ్, ఎస్పీకి ఫిర్యాదు చే యడంతో అక్రమ మట్టి దందా వెలుగులోకి వ చ్చింది. తండావాసుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు మట్టి తవ్వే ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించి, వివరాలు సేకరించినట్లు సమాచారం. -
కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు యజమాన్యాల కుట్రలో నిర్వీర్యం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పీ.సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులకు లేబర్ జీఓ కాకుండా పీఆర్సీ జీఓ 60 అమలు చేయడంతో కార్మికులకు రూ. 15,600 వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వ కాగితాల్లో అంకెలు చూపుతున్నా, దొడ్డి దారిన యజమాన్యాలకు అనుకూలంగా సర్క్యులర్ జారీ చేసి క్షేత్రస్థాయిలో కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల కాలపరిమితి ముగిసిందని, ప్రస్తుత ప్రభుత్వం రూ.26 వేలు కనీస వేతనం నిర్ణయించి జీఓ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలకుల ఉదాసీన వైకరి ఫలితంగా 2012 నుంచి నేటి వరకు కనీస వేతన జీఓ 68, 43లు సవరణకు నోచుకోలేదని, దీంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు ఎస్ వరుణ్, మన్నెమ్మ, చెన్నమ్మ, సుధ, శోభ, శారద, లావణ్య, శివలీల, రాజేశ్వరి, నారమ్మ, బొజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రామన్పాడు రిజర్వాయర్ వరకు ఉన్న కాల్వపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాల్వ వెంట ఉన్న కచ్చా రహదారిపై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. మూలమళ్ల–నందిమళ్ల సమీపంలో ఉన్న ఎడమ కాల్వ వద్ద వంతెన దిమ్మెలు కూలి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకొని కాల్వ వెంట ఉన్న శిథిల వంతెనల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – అమరచింత -
నేతన్న.. నిరాశ !
●ఏడాది పూర్తయినా అమలుకు నోచుకోని రుణమాఫీ స్థానిక యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా చెల్లించడం, లేదా ఏటా వడీ చెల్లించి పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో వడ్డీ డబ్బులు చెల్లించలేదు. రుణం పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో ప్రతినెల రూ.750 వడ్డీ చెల్లించమంటూ బ్యాంకు మేనేజర్ వత్తిడి చేస్తున్నారు. – కొంకతి శకుంతలమ్మ, నేత కార్మికురాలు, అమరచింత మా కుటుంబం చేనేతపై ఆధారపడి జీవిస్తోంది. కుటుంబ పోషణతో పాటు చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకుల కోసం బ్యాంకులో రూ.75 వేల రుణం తీసుకున్నాం. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నేటికీ వర్తించకపోవడంతో రుణం చెల్లించాలని బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేశారు. ఖాతా పునః ప్రారంభం కోసం వడ్డీ డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – గుండాల బుచ్చన్న, నేత కార్మికుడు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాది పూర్తయినా నేటికీ ఆ నిధులు మంజూరు చేయకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, అమరచింత చేనేత సహకార సంఘం జిల్లాలో 338 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తించనుంది. సుమారు రూ.2.21 కోట్లు కార్మికులకు అందనున్నాయి. పూర్తి వివరాలతో డీసీఎల్ కమిటీ ఆమోదం తర్వాత రాష్ట్ర కమిటీకి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే కార్మికుల ఖాతాల్లో నేరు గా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని కార్మికులకు వివరిస్తున్నాం. రుణాల పునరుద్ధరణ వ్యవహారం తమ పరిధి కాదని మా వద్దకు వస్తున్న నేతన్నలకు వివరిస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల అమరచింత: రైతుల మాదిరి నేత కార్మికులకు కూడా రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తున్నామని గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు వర్తింపజేయకపోవడం.. బ్యాంకు సిబ్బంది రుణాలు తిరిగి చెల్లించాలంటూ వత్తిడి పెంచడంతో నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులు రుణమాఫీ అర్హుల జాబితాను సదరు బ్యాంకర్ల నుంచి సేకరించి పూర్తి నివేదికను రాష్ట్ర కమిటీకి అప్పగించినా.. నేటికీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఇటీవల తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా అమరచింత యూనియన్ బ్యాంకు మేనేజర్ చేనేత కార్మికుల లావాదేవీలు నిలిపివేయడంతో కార్మికులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. రుణమాఫీ గురించి జౌళిశాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని చెప్పిందని.. వచ్చిన వెంటనే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రతి నెల రూ.వెయ్యి వడ్డీ చెల్లించాల్సి వస్తోందని.. లేదంటే బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సానుకులంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 338 మంది కార్మికులు అర్హులుగా గుర్తింపు రుణగ్రస్తుల వివరాలు సేకరించినా.. ఫలితం శూన్యం రూ.2.21 కోట్ల మాఫీపై వీడని చిక్కుముడి రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది వత్తిడి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెద్దమందడి, కొత్తకోటలో నేత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెద్దమందడిలోని వెల్టూర్, ఖిల్లాఘనపురంలోని సోలీపురం గ్రామంలో మాత్రం ఉన్ని మగ్గాలు కొనసాగుతుండగా.. మిగిలిన ప్రాంతాల్లో మగ్గాలపై జరి చీరలు తయారు చేస్తున్నారు. జిల్లాలో 1,090 మంది నేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు 338 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి మగ్గానికి 3 కార్మికుల చొప్పున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అమరచింత చేనేత సహకార సంఘం సభ్యులు 309 మంది స్థానిక యూనియన్ బ్యాంక్, ఆత్మకూర్లోని డీసీసీబీ బ్యాంకులో చేనేత రుణాలు పొందారు. ఆత్మకూర్ మండలంలోని తిప్పడంపల్లిలో ఐదుగురు, కొత్తకోటలో 24 మంది నేతన్నలు రుణాలు తీసుకున్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. రుణాలు పొందిన కార్మికుల వివరాలను డీసీఎల్ కమిటీ ఆమోదించి రాష్ట్ర కమిటీకి పంపి 5 నెలలు గడుస్తున్నా రుణమాఫీ నిధులు మంజూరుగాకపోవడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. 2017 నుంచి చేనేత రుణం తీసుకున్న వారి వివరాలతో పాటు మొత్తం ఎంత మేర మాఫీ అవుతుందన్న విషయాలను సైతం జౌళిశాఖ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా 338 మంది చేనేత కార్మికులు రుణం పొందారని.. రూ.2.21 కోట్ల రుణమాఫీ నేతన్నలకు అందనున్నట్లు తెలిపారు. -
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు. -
సీఎం చొరవతోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు
వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతోనే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం కోసం సీఎంను కోరగా.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మంజూరయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలుపడంతో పాటు విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు, నిధుల మంజూరు త్వరితగతిన జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక పూజలువనపర్తి రూరల్: పెబ్బేరులోని కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయగా.. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.రూ.13.20 లక్షలు పలికిన అమ్మవారి చీరలువనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రతిష్టించిన దుర్గాదేవికి దేవి శరవన్నవరాత్రి ఉత్సవాల్లో అలంకరించిన చీరల వేలాన్ని శనివారం రాత్రి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు వేలంలో పాల్గొని రూ.13.20 లక్షలకు దక్కించుకున్నారు. అందులో ఒక చీరను తిరుపతిరావు అనే భక్తుడు రూ.2.05 లక్షలు పాటపాడి దక్కించుకున్నారు.11న పీయూలో జాబ్మేళామహబూబ్నగర్ మున్సిపాలిటీ: పురుష అభ్యర్థులకు ఈ నెల 11న పీయూ క్యాంపస్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి అర్జున్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం–ఫార్మసీ, బీ–ఫార్మసీ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్), బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ 2021 నుంచి 2025 మధ్య ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 8లోగాhttps://forms.gle/ctBZNQ1ByU5B6xKB6 రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.98494 45877ను సంప్రదించాలని సూచించారు. టీజీసీహెచ్సీ, జాతీయ బల్క్ డ్రగ్ తయారీదారుల సమాఖ్య సహకారంతో ఈ నెల 11 ఉదయం 10 గంటల నుంచి పీయూలోని పీజీ కళాశాల సెమినార్ హాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఎంపికై న వారు ఆయా కంపెనీల్లో క్యూసీ, క్యూ, కెమిస్ట్, మెషిన్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
న్యాయఫలాలు అందరికీ అందాలి
● మెరుగైన వసతులతోనే న్యాయసేవలు ● జిల్లాకేంద్రంలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ● వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్కుమార్ సింగ్ వనపర్తిటౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని... దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్కుమార్ జూకంటిి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. కోర్టు సముదాయ నిర్మాణంలో అందరి కృషి ఉందని.. జిల్లాలో లీగల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ.. తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. కొత్త భవనాల నిర్మాణంలో వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కృషి ఉందన్నారు. -
మరో కొత్త రహదారి
ఫ్యూచర్ సిటీ నుంచి మన్ననూర్ వరకు అనుసంధానంఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ. దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ గ్రీన్ఫీల్డ్ రహదారితోపాటు శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్– శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ నుంచి ఆమనగల్, కొట్ర, డిండి, హాజీపూర్ (బ్రాహ్మణపల్లి) వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ణయించారు. ఈ రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితమే కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారితో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆకుతోటపల్లి– మన్ననూర్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఫ్యూచర్ (ఫోర్త్) సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెండు జాతీయ రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు.. అక్కడి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్ (ఆకుతోటపల్లి) వరకు ప్రతిపాదించిన 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు రూ.1,665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ. రోడ్డును రిత్విక్ సంస్థ, రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమనగల్ వరకు చేపట్టనున్న 22.3 కి.మీ. రోడ్డును ఎల్అండ్టీ సంస్థ రూ.2,365 కోట్లకు దక్కించుకున్నాయి. భూ సేకరణ, టెండర్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఇటు నుంచి మన్ననూర్ వరకు కొత్త రోడ్డును విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి), ఆర్ఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ రహదారి నుంచి అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు కొత్త రోడ్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి– చారకొండ మధ్య నుంచి భైరాపూర్, డిండి తూర్పుభాగం మీదుగా గువ్వలోనిపల్లి, రాయిచేడ్, బుడ్డతండా, బ్రాహ్మణపల్లి వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ సుమారు 50 కి.మీ. దూరం అవుతుంది. ప్రతిపాదిత రోడ్డు ఏర్పాటైతే హైదరాబాద్– శ్రీశైలం మధ్య 40 కి.మీ. దూరం తగ్గడంతోపాటు రెండు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, నంద్యాల వరకు తిరుపతి మార్గంగా, రావిర్యాల నుంచి మన్ననూర్ వరకు శ్రీశైలం రహదారులు వేరు కానున్నాయి. కొత్త రహదారితో ట్రాఫిక్ సమస్య తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్కు సుముఖత.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రూ.7,700 కోట్ల అంచనాలతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో ఏపీలోని కృష్ణపట్నం రేవుతోపాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరు, తిరుపతికి రాకపోకలు సులువు అవుతాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొందించగా.. 62.5 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్లో 56.2 కి.మీ., అటవీ మార్గం, 6.3 కి.మీ. అటవీయేతర ప్రాంతం. స్వల్ప మార్పులతో ఎన్హెచ్ఏఐ అధికారులు మన్ననూర్, వటువర్లపల్లి వద్ద ఎక్కి, దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నాలుగు వరుసలతో 30 అడుగల ఎత్తులో ఈ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈగలపెంట (కృష్ణగిరి)– సున్నిపెంట మధ్య ఉన్న డ్యాంపై ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య గంట ప్రయాణ సమయం, 9 కి.మీ. దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు ప్రతిపాదనలు మన్ననూర్– శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో 40 కి.మీ. తగ్గనున్న దూరం -
‘చట్టాలు ఎవ్వరికీ చుట్టాలు కావు’
అమరచింత: చట్టాలు ఎవరికీ చుట్టాలు కావని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించేందుకే చట్టాలు అమలు చేస్తున్నారని ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని పాంరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సమాజంలో వయోవృద్ధులపై సానుభూతి చూపాలని, వారి సంక్షేమం కోసం కుటుంబ సభ్యులు పాటుపడాలని కోరారు. 18 ఏళ్ల లోపు బాల బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టాన్ని కాదని మైనర్లు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్షను తల్లిదండ్రులకు విధిస్తారని హెచ్చరించారు. బాల్య వివాహలతో కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. 14 ఏళ్ల వయస్సు గల వారిని పనిలో పెట్టుకోవడం నేరమని, నిబంధనలు ఉల్లఘిస్తే యజమానులకు జైలు శిక్షతో పాటు జరిమానాలు ఉంటాయన్నారు. ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు 15100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు తిప్పారెడ్డి, గంగాధర్గౌడ్, జీకే రాములు, అశోక్కుమార్, ముక్తేశ్వర్, రాంచందర్, ఎస్ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రిసైడింగ్ అధికారుల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పీఓ, ఏపీఓలకు అక్టోబర్ 6న నిర్వహించనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సరైనా శిక్షణ గదులు, మైక్ సిస్టం, పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పీఓలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నిబంధనలు అవగాహన చేసుకొని సన్నద్ధత కావాల్సి ఉంటుందన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలని, నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణకు వచ్చే పీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా పీఓలదే బాధ్యత అని, జాగ్రత్తగా వ్యవహారించాలని వారికి తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డీఈఓ అబ్దుల్ఘని, ఏఓ భాను, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమమే అభ్యర్థులను గెలిపిస్తుంది’
ఆత్మకూర్: పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు చేయలేని అభివృద్ధిని 18 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా అన్నారు. శనివారం ఆత్మకూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆశావాహుల జాబితాను సేకరించారు. కాగా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఎనిమిది మంది ముందుకు వచ్చారు. మండల అధ్యక్షుడు పరమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసీరాజ్, హుస్సేన్మియ్యా, బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, మచ్ఛేందర్గౌడ్, ప్రతాప్రెడ్డి, రాఘవేందర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, ఎవరికీ బీఫాం ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జాబితాను అధిష్టానికి పంపిస్తామని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను తదితరులు ఉన్నారు. -
నేడు సామూహిక కోర్టు భవనానికి శంకుస్థాపన
వనపర్తి టౌన్: జిల్లా న్యాయస్థాపన సామూహిక భవనానికి ఆదివారం తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్చువల్గా, ఇతర న్యాయమూర్తులు అనిల్ జూకంటి, మాధవిలే ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వనపర్తి బార్ అసిసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం న్యాయస్థానంలోని బార్ కౌన్సిలర్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 20 ఎకరాల్లో రూ.81 కోట్లతో మెడికల్ కళాశాల సమీపంలో ఈ భవనానికి భూమిపూజ చేస్తారని, ఇది వనపర్తి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. నూతన భవనాల వినియోగంలోకి వస్తే న్యాయ సేవలు ప్రజలకు ఒకే ఆవరణలో అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరు కావడంతో పాటుగా జిల్లాలోని న్యాయమూర్తులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు భరత్కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రజావాణి రద్దు వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తై, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీచేస్తూ గెలుపే లక్ష్యంగా సీపీఎం ఎన్నికల బరిలో ఉంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీఎస్ గోపి అన్నారు. మండల కేంద్రంలోని జీఎస్ భవన్లో శనివారం జరిగిన మండల సీపీఎం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజలు ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై ప్రశ్నించే సీపీఎం నాయకులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇస్తూ గెలిచిన అనంతరం కేవలం సంపాదనే లక్ష్యంగా భావిస్తున్న బూర్జువా పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. సమావేశంలో వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వసంతోత్సవంతో ముగిసిన దేవి శరన్నవరాత్రులు కొత్తకోట రూరల్: పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 11 రోజులుగా దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై పట్టణ పురవీధుల గుండా మేళతాళాలు బాజాభజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. కర్ణాటకకు చెందిన కళాకారుడు వీరనాట్యం ప్రదర్శించారు. వారు ఖడ్గాలు, వీరడోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడున ఇనుప చువ్వలతో నిమ్మకాయలు, కొబ్బరికాయలను చిదిమేస్తూ చేసిన నృత్యాన్ని భక్తులు తిలకించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు భీమా చంద్రకాంత్, గౌరవ అధ్యక్షుడు భీమా ప్రభాకర్, శ్రీనివాసులు, నాగరాజు, శంకర్, సత్యం, విజయ్, పట్టణ అధ్యక్షురాలు జయలక్ష్మి, రాధిక, భారతి, జ్యోతి, అనిత, స్వర్ణలత, మంజుల, శైలజ తదితరులు ఉన్నారు. -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కీలకంగా వ్యవహరించాలి ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ -
ముందుకు సాగట్లే..
● బిల్లులు అందక నిలిచిన పనులు ● కొత్త మున్సిపాలిటీల్లో కనిపించని పురోగతి ● ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.కోటి ●పట్టణంలో నిర్మిస్తున్న వైకుంఠధామ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అమరచింతలో 70 శాతం పనులు పూర్తి చేశారు. స్నానాల గదులు, వెయిటింగ్ గది, పార్కింగ్ పనులు జరగాల్సి ఉంది. బిల్లులు చెల్లించలేదని పనులను కాంట్రాక్టర్ నిలిపివేశాడని తెలిసింది. విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించడం జరిగింది. – నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అమరచింత అమరచింత: గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అధునాతన హంగులతో నూతన వైకుంఠధామాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో వైకుంఠధామం కోసం రూ.కోటి కేటాయించారు. టెండర్ ప్రక్రియను చేపట్టి కాంట్రాక్టర్కు పనులు అప్పగించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా.. సరైన సమయానికి బిల్లులు అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు 65 నుంచి 70 శాతం వరకు పూర్తి కాగా.. మిగిలిన పనులు అటకెక్కాయి. వీటికి తోడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నిర్మాణ పనులు పూర్తిగా మరుగునపడినట్టయింది. పెద్ద పట్టణాల్లో స్థలం లేకపోవడంతో భవిష్యత్లో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. సౌకర్యాలు.. కొత్తగా నిర్మించే వైకుంఠధామాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికతో పనులు చేస్తున్నారు. వీటిలో వెయిటింగ్ గదులు, సెక్యూరిటీ గది, ఆఫీస్ రూంతో పాటు సీటింగ్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. రెండు బర్నింగ్ ప్లాంట్లు, పూజా మండపం, టాయిలెట్లు, స్నానపు గదులను సిద్ధం చేయాలి. అంతే కాకుండా ఆహ్లాదం కోసం పచ్చదనం, వైకుంఠధామం మధ్యలో పార్కును ఏర్పాటు చేస్తారు. వీటి చుట్టు ప్రహరీ లేదా పెన్సింగ్ను కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్ మున్సిపాలిటీల్లో రెండేళ్ల కిందట వైకుంఠధామ నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఆలస్యంగా పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదన్న నెపంతో పూర్తిగా నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్ పట్టణాల్లో 75 శాతం నిర్మాణ పనులు జరిగాయని, పెబ్బేరులో మాత్రం 30 శాతం సైతం పనులు జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో యాభై శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది. -
వైభవం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి గుట్టపైనున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆశ్వజ మాసం శుక్లపక్షం దశమి సందర్భంగా గురువారం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణం జరిపించారు. పండితులు తలంబ్రాలు పోయగా.. ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి పరిసర గ్రామాల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులుతో పాటు నిర్వాహకులు వేముల శ్రీనివాస్రెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీనివాసులుశెట్టి, జగదీశ్వర్రెడ్డి, తిరుపతయ్య, భాస్కర్, రాంబాబు, రాములుయాదవ్, ప్రశాంత్రెడ్డి, బాలవర్ధన్రెడ్డి, రమేష్ బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా విజయదశమి
వనపర్తి● జిల్లాకేంద్రంలో బేతాళుడి సంరక్షణలో ఆయుధాలతో ఊరేగింపుగా వచ్చిన రాజా కృష్ణదేవరావు ● శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వనపర్తిటౌన్: జిల్లాలో గురువారం విజయదశమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమగా జరుపుకొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గురువారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి, అపరాజితదేవిగా ఆరాధించారు. శమీ పూజకు ముందు, అనంతరం ఆలయాలు, మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహికంగా భజనలు చేస్తూ మేళతాళాల నడుమ ఊరేగింపుగా శమీ వృక్షాల వద్దకు చేరి పూజలు నిర్వహించి ఒకరికొకరు జమ్మి పంచుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. పండుగ రోజు మధ్యాహ్నం వరకు పూజ సామగ్రి, పూలు, పండ్లు, నిత్యావసరాల సరుకుల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. జిల్లాకేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా.. వనపర్తి సంస్థానాధీశుల వారుసుడు రాజా కృష్ణాదేవరావు రాజ భవనంలో దుర్గాదేవికి.. అర్చకులు నాటి రాజవంశీయుల ఆయుధాలకు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం పారాయణంతో ముగించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పలువులు మాజీ ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దేవుడి విగ్రహాన్ని పల్లకీలో, విశ్వ బ్రహ్మణులు తయారు చేసిన బేతాళుడి విగ్రహం సంరక్షణలో నాటి ఆయుధాలను కలవృత్తుల పెద్దల సమక్షంలో మేళతాళాలు, బాణాసంచ పేలుళ్ల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగింపుగా నల్లచెరువు మినీ ట్యాంక్బండ్పై ఉన్న శమీ వృక్షం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు జరిపించి జమ్మిని ప్రజలకు అందజేశారు. ఈ వేడుకకు పట్టణ ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పాతబజార్లోని మసీద్ సమీపంలో ఎండీ అనిస్ ఆధ్వర్యంలో ముస్లింలు రాజా వంశీయులకు స్వాగతం పలికే ఆచారాన్ని కొనసాగిస్తూ హిందూ ముస్లింలు పండు గ శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యతను చాటారు. ట్యాంక్బండ్పై రాత్రి 10 గంటల వరకు ప్రజలు కు టుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. టపాసులతో రూపొందించిన రావణుడిని దహనం చేయగా చూసేందుకు పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. -
గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని.. స్వాతంత్య్ర సాధనలో ఆయన కృషి మరువలేనిదని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలో ఆయన పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతావని స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఆయన ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దేశాభివృద్ధికి నిస్వార్థంగా అందరం సేవలు అందించాలని.. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు కొనసాగించడమే మనమిచ్చే ఘన నివాళులన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, సీసీఎస్ ఎస్ఐ జయన్న, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, షీటీమ్ ఎస్ఐ అంజద్, రిజర్వ్ సబ్ సీఐ మొగ్దుంబారీ, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
అహింసతో దేనినైనా సాధించవచ్చు..
సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలకు ఆయనతోపాటు జిల్లా అధికారులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాయువులతో జాతి అభివృద్ధి చెందాలని మహాత్మాగాంధీ చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. గాంధీ జయంతి, విజయదశమి ఒకేరోజు రావడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సుధీర్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం ● దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు ● విభిన్న మార్గాల్లో సంస్థకూ సమకూరనున్న ఆదాయం తెలంగాణ ఆర్టీసీ నూతనంగా శ్రీకారం చుట్టిన యాత్ర దానం నిరుపేదలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు ఎవరైనా సహకరించి విరాళాలు ఇస్తే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇళ్లలో జరుపుకొనే వేడుకలకు సమాంతరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం ఇవ్వడానికి ముందుకు రావాలి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్నగర్ సుజాత 99592 26286 షాద్నగర్ ఉష 99592 26287 నాగర్కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్గౌడ్ 90004 05878 బస్సుల స్థాయికి చార్జీలు ఇలా.. కి.మీ., ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ (రూపాయలలో..) 201– 300 38,782 32,587 29,752 301– 400 38,782 38,782 35,002 401– 500 44,977 44,977 40,252 బస్సులో సీట్లు 50 40 34 -
స్వగ్రామంలో గద్వాల అదనపు కలెక్టర్..
ఖిల్లాఘనపురం: నిత్యం కార్యాలయంలో విధుల్లో బిజీగా ఉండే గద్వాల అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ దసరా పండుగను తన సొంత గ్రామం మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గ్రామస్తుల నడుమ సంతోషంగా జరుపుకొన్నారు. గురువారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం అక్కడే మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి గ్రామ పెద్దలతో కలిసి శమీ పూజ నిర్వహించారు. పాత మిత్రులు, పెద్దలతో సరదాగా గడిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
వసతులు కల్పించాలి..
మండల కేంద్రంలో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో వసతులు కల్పించాలి. వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెబుతున్న అధికారులు నెట్తో పాటు బాల్స్ను ఇవ్వడం లేదు. ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లి ఆడలేని పరిస్థితి నెలకొంది. – చిన్నపాగ భాను, వాలీబాల్ క్రీడాకారుడు, పాన్గల్ పట్టణంలో కరువు.. పట్టణంలోని పది వార్డుల్లో ఎక్కడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలాల్లో క్రీడా మైదానాలు అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నిధులు దండుకున్నారు. కబడ్డీ, వాలీబాల్ ఆడే క్రీడాకారులకు సరైన మైదానాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. – బాలకృష్ణ, అమరచింత -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
తెలంగాణ పండుగ బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో సెర్ప్, మెప్మా, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకలకు కలెక్టర్, ఎస్పీ హాజరై తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడి అందరిని ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన జిల్లాలో బతుకమ్మ సంబరాలు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా ఉత్తమ బతుకమ్మలను ప్రదర్శించిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి మెప్మా, రెండో బహుమతి పురపాలక, మూడో బహుమతి వ్యవసాయశాఖ, నాలుగో బహుమతి కలెక్టరేట్కు దక్కింది. వేడుకల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, చిన్నారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా మైదానం.. నిరుపయోగం
● కనిపించని క్రీడాసామగ్రి ● బీఆర్ఎస్ పాలనలో ఆగమేఘాల మీద ఏర్పాటు ● నీరుగారుతున్న లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం ● నిరుత్సాహంలో యువత, విద్యార్థులు అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు జీవం పోయడంతో పాటు పల్లె క్రీడాకారుల నైపుణ్యాలను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా మైదానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం స్థలం కేటాయించడంతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. కాని చాలా గ్రామాల్లో క్రీడా మైదానాలు గ్రామాలకు దూరంగా గుట్టల ప్రదేశాల్లో ఉండటంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాల మైదానాల్లో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కాస్త ఉపయోగంగా ఉన్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న క్రీడా మైదానాల నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. రాళ్లు రప్పలు తేలిన ప్రదేశాల్లో వీటికి సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంతాల్లో ఆటలు ఎలా ఆడుతారనే సంగతే మరిచారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఉన్న క్రీడా మైదానాల పరిస్థితి ఇదేవిధంగా ఉండటంతో ప్రస్తుతం ప్రభుత్వమైనా వీటిని వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ క్రీడా మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులను ఏర్పాటుచేసి వీటికి సంబంధించిన సామగ్రిని బిగించగా.. ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. క్రీడాకారుల కోసం అన్నిరకాల క్రీడాసామగ్రి కిట్ను ఆయా గ్రామపంచాయతీలకు అప్పగించారు. అవి సైతం ఎక్కడా కనిపించడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం.. స్థల దాతలు ముందుకురాకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేదు. పిచ్చి మొక్కలు, చెత్త చెదారం.. నిర్వహణ లేకపోవడంతో క్రీడా మైదానాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సైతం కనిపించడం లేదు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు వీటిని వినియోగించుకునే పరిస్థితి లేక నిరుపయోగంగా మారాయి. వినియోగంలోకి తీసుకొస్తాం.. గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో సామగ్రి సమకూరుస్తాం. క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం. కొన్ని గ్రామాల్లో వసతులు లేవని తెలిసింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి క్రీడాకారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – రఘునాథ్రెడ్డి, ఇంచార్జి డీపీఓ -
రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్రని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, అక్టోబర్ 9న మొదటి విడత, అక్టోబర్ 13న రెండోవిడత ఎన్నికల ప్రకటన విడుదల చేసే బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు. ఎన్నికల ప్రకటనను ఆర్ఓ కార్యాలయం, కలెక్టరేట్ నోటీసుబోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియను వీడియో తీయాలని, పత్రంలో అభ్యర్థి ఏమైనా తప్పులు చేసినా, సంతకాలు లేకున్నా, తగిన ధ్రువపత్రాలు జత చేయకున్నా గుర్తించి సరి చేయించాలని, సాధ్యమైనంత వరకు తిరస్కరించకుండా చూడాలని ఆదేశించారు. ఏదైనా ధ్రువపత్రం జతచేయని పక్షంలో నిర్దిష్ట సమయంలో అభ్యర్థికి నోటీస్ జారీ చేయాలని, సకాలంలో ధ్రువీకరణ పత్రం సమర్పించని పక్షంలో మాత్రమే తిరస్కరించాలని ఆదేశించారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థి వెంట గదిలోకి ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని వివరించారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు బి–ఫారం ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే కేటాయించి స్వతంత్ర అభ్యర్థులకు అభ్యర్థి పేరు తెలుగు అక్షరాలకు అనుగుణంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రతి పేజీని చదువుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ప్రకారం నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రతి అధికారి కి బాధ్యతలపై అవగాహన కల్పించి అప్పగించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సఫలీకృతం కావాలని, దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ఎస్పీ, ఆయన సతీమణి అపర్ణ, అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎలాంటి ఆటంకం, అవరోధం కలగకుండా ఉండాలని బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దుర్గామాత కరుణా కటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, సురేందర్, మొగ్దుంబారి, జిల్లాలోని ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం
● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు ● మిగిలిన జిల్లాల్లో నమోదు కాని టెండర్లు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మ అని.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇలాంటి వేడుకలు సాంప్రదాయాలను కాపాడటమే కాకుండా కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఎస్పీ, ఆయన సతీమణి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణతో కలిసి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైనా దేవుళ్లకు పూలతో కొలుస్తామని.. కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషం కలిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది, మహిళ అధికారులు, వారి కుటుంబసభ్యులతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకేచోట చేర్చి ఆడిపాడుతూ సందడి చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, మహిళా ఎస్ఐలు స్వాతి, రాణి, రజిత, దివ్య. హిమబిందు, మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువత మత్తుబారిన పడొద్దు
వనపర్తి: జిల్లా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే చెడు ప్రభావాలపై గ్రామాలు, విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో పోలీసు, ఎకై ్సజ్ తదితర అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలు, కల్లు దుకాణాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనుమానితులు, వాహనాలపై నిఘా ఉంచామని, పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
సరస్వతి నమస్తుభ్యం.. జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజు సోమవారం కొత్తకోటలోని వాసవి కన్యకాపరమేశ్వరి, అంబాభవాని ఆలయాల్లో అమ్మవార్లను అర్చకులు సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం అనంతరం మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొన్నారు. – కొత్తకోట యూరియా కోసం ఆందోళన వద్దు పాన్గల్: రైతులు యూరియాను అవసరం మేరకు వినియోగించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. పుష్కలంగా అందిస్తున్నా నేటికీ రద్దీ తగ్గడం లేదన్నారు. కొందరు రైతులు సింగిల్విండో ద్వారా యూరియా పొంది పక్క మండలాల్లోని వారి బంధువులకు సరఫరా చేస్తుండటంతో మండలంలోనే రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లు అందజేసినా నేటికీ యూరియా ఇవ్వలేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో గతేడాది 11 వేల బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది ఇప్పటికే 36 వేల బస్తాలు సరఫరా చేశామని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు సాయి ప్రసాద్గౌడ్, బాలరాజు, జైపాల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
తొలివిడత వనపర్తి నియోజకవర్గ మండలాలకే..
వనపర్తి: జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. తొలి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండోవిడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు, మక్తల్ నియోజకవర్గంలోని రెండు మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు మండలాలు మొత్తం ఏడు మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 11న 15 జెడ్పీటీసీ, 133 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరగనుండగా.. జిల్లాలో రెండో విడతలో 135 గ్రామపంచాయతీలు, మూడో విడతలో 133 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలు : వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి, ఏదుల, శ్రీరంగాపురం, పెబ్బేరు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలు : పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత రిజర్వేషన్ మహిళలు జనరల్ మొత్తం స్థానాలు జనరల్ 16 25 41 బీసీ 23 33 56 ఎస్సీ 9 15 24 ఎస్టీ 3 9 12 స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్పై ఇప్పటికే హైకోర్టులో కేసు కొనసాగుతుండగా.. తుది తీర్పు అక్టోబర్ 8న వెలువడనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు సైతం అనుచరులకు వాయిదా విషయంపై సంకేతాలు ఇవ్వడం గమనార్హం. -
మోగిన నగారా..
● 2 విడతల్లో ప్రాదేశిక.. 3 దఫాల్లో పంచాయతీ సమరం ● అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 77 జెడ్పీటీసీ.. 800 ఎంపీటీసీ స్థానాలు ● 1,678 గ్రామ పంచాయతీలు.. 15,068 వార్డులకు ఎన్నికలు ● గ్రామాల్లో రాజకీయ సందడి.. గెలుపే లక్ష్యంగా పార్టీల కసరత్తు ఆశావహుల జోరు.. నేతల బేజారు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మండలాలు, గ్రామాల్లోని మిగతా వర్గాలకు సంబంధించిన ఆశావహులు ఎక్కువ సంఖ్యలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వారికి సర్దిచెప్పలేక ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో రిజర్వేషన్ల తారుమారుతో భంగపడిన ఆశావహులది మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో పాత, కొత్త నాయకుల పంచాయితీలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ పరిస్థితి నెలకొనగా.. ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పల్లె పోరుకు సై.. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని.. 24, 48, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనుండగా.. మొదటి విడతలో 8 జడ్పీటీసీలు, 71 ఎంపీటీసీలు, రెండోవిడతలో 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం రెండు విడతల్లో నిర్వహించనుండగా.. మొదటి విడతలో 135, రెండోవిడతలో 133 గ్రామపంచాయతీల్లో జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, నోడల్ అధికారులు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
చట్టాలు అందరికీసమానమే
ఆత్మకూర్: చట్టాలకు పేద, ధనిక అనే తేడా ఉండదని.. అందరికీ సమానమని న్యాయమూర్తి శిరీష తెలిపారు. సోమవారం పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు న్యాయవాదులు వివిధ రకాల కేసులు, చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘అక్రమ కేసులు ఎత్తివేయాలి’ ఆత్మకూర్: పోలీసులు ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఐ శివకుమార్తో సమావేశమై కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఇరువర్గాలకు చెందినవారు శాంతియుతంగా నిరసన తెలిపారని, అన్నాదమ్ముల్లా కలిసి జీవిస్తున్న వారి మధ్య విభేధాలు సృష్టించే విధంగా పోలీసుల చర్యలు ఉండటం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని సీఐను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్, మార్కె ట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, నాయకులు చెన్నయ్య, రామకృష్ణ, జానకిరాం, మాసన్న, కొత్తబోయ శేఖర్, రియాజ్అలీ, భీమన్న, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్రావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది. నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సిఐ రవిబాబు, ఎస్సై రవినాయక్ ఉన్నారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ -
యూరియా పంపిణీలో అవకతవకలతోనే ఇబ్బందులు
కొత్తకోట రూరల్: యూరియా పంపిణీ విధానంలో అవకతవకల కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతి కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కనిమెట్టలో బీజేపీ నాయకుడు రాజేందర్రెడ్డి నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతినెలా నాలుగో ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. దేశంలో జరిగే ఘటనలు, కొత్త విషయాలను ప్రధాని ప్రజలతో పంచుకోవడం విశేషమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వీక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని.. అయితే మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని అన్నారు. ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. పంపిణీ విధానంలోనే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డిలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, దళితమోర్చా రాష్ట్ర నాయకులు రాసమోని సాయిరాం, కోటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చందు, తిరుపతి పాల్గొన్నారు. -
పండుగపూట పస్తులేనా..
జీపీ కార్మికులకు మూడు నెలలుగా అందని వేతనాలు ●కుటుంబ పోషణ భారమైంది.. నెలనెలా వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా వంట సరుకుల కోసం చేసిన అప్పులను సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిత్యం తమతో పనులు చేయించుకుంటుందే తప్ప వేతనాలు మాత్రం సక్రమంగా అందించడం లేదు. పండుగ పూట సైతం పస్తులు ఉండక తప్పడం లేదు. – మల్లేష్, పంచాయతీ కార్మికుడు, నాగల్కడ్మూర్ వేతనాల కోసం ఆందోళన.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వేతనాలను క్రమం తప్పకుండా చెల్లించాలంటూ కార్మికుల పక్షాన ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. సకాలంలో వేతనాలు ఇవ్వకుంటే సమ్మె చేపడతాం. – సి.రాజు, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు, మస్తీపురం ఉన్నతాధికారులకు నివేదించాం.. జిల్లాలో పంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల గురించి ఉన్నాతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం నిధులను మంజూరుచేసిన వెంటనే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. – రఘునాథ్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ అమరచింత: గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందుంటున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలనెలా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పండుగపూట పస్తులు తప్పడం లేదంటూ ఆవేదనకు గురవుతున్నారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలంటూ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా కార్మికులు నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి వీరికి వేతన వెతలు అధికమయ్యాయి. ఇంటి పోషణ కోసం ప్రతినెలా అప్పులు చేస్తున్నామని.. వాటిని సకాలంలో తీర్చలేని కారణంగా మరోమారు అప్పులు సైతం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. ప్రతినెలా పంచాయతీ కార్మికుల బ్యాంకు ఖాతాలో నెల వేతనం జమ చేయాల్సి ఉండగా.. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 1,200 మంది కార్మికులు.. జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీటి సరఫరా తదితర పనులు చేస్తున్న కార్మికులు మొత్తం 1,200 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ. 9,500 చొప్పున గౌవర వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో ఆరు నెలలకో పర్యాయం కార్మికుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎస్టీఓలకు పంపించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా వేతనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉపక్రమించింది. అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు వేతన తిప్పలు తప్పడం లేదు. గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్న వీరికి నెలనెలా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా జీతం కోసం ఎదురుచూపులు కుటుంబ పోషణ కోసం తప్పని అప్పులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం -
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
అచ్చంపేట రూరల్: రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం అచ్చంపేటలో నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ జనగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి.. 90 శాతం పనులు పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒకవేళ ప్రాజెక్టులను పూర్తిచేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే దురుద్ధేశంతోనే ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారుతాయన్నారు. గతంలో రాజోలి బండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేసుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బ్యారేజ్ను తునాతునకలు చేస్తామని కేసీఆర్ ధీటుగా బదులిచ్చారని గుర్తుచేశారు. అలాంటి దమ్ము, తెగువ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీళ్లిచ్చిందన్న కేటీఆర్, మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. అచ్చంపేట బిడ్డ అని చెప్పుకొనే రేవంత్రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. హామీలు మరిచిన కాంగ్రెస్కు బాకీ కార్డుతో బుద్ధి చెప్పాలి స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొందపెట్టాలి అసమర్థత వల్లే యూరియా కోసం క్యూలైన్లు మళ్లీ వచ్చాయి అచ్చంపేట జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు -
శతాబ్దాల చరిత్ర.. పాన్గల్ ఖిల్లా
వనపర్తి: శతాబ్దాల చరిత్ర, ఎన్నో వీరగాథల ఘనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాన్గల్ ఖిల్లాలో వెలుగులోకి రాని ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యుల కాలంలో ఈ దుర్గం నిర్మించినట్లు ఖిల్లాపై ఉన్న శాసనాలతో చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని పాన్గల్ ఖిల్లా ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నాటి రాజులు సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తయిన గుట్టపై కోట నిర్మించారు. గుర్రపునాడా ఆకారంలో తూర్పున ప్రధాన ముఖద్వారంతో చుట్టూ శుత్రుదుర్భేద్యమైన రాతికట్టడం, బురుజులతో దుర్గం నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరినా.. ఏటా తొలి ఏకాదశినాడు ప్రజలు గుట్టపైకి చేరుకొని అక్కడి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శిల్పకళా సంపద.. పాన్గల్ ఖిల్లా శిఖరాగ్రానికి, కోట ప్రాంతానికి వెళ్లేందుకు తూర్పు దిక్కున ప్రస్తుతం ఉన్న బాలపీర్ల సమీపంలో దారి ఉంది. గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో ఏడు ప్రధాన ముఖద్వారాలను దాటాల్సి ఉంటుంది. ప్రతి ముఖద్వారం భారీ ఆకారంలో రాతి కట్టడంతో దర్శనమిస్తుంది. కట్టడంపై సింహాలను వేటాడుతున్న శిల్పాలు, ఎత్తయిన జంతువుల శిల్పాలను చూడవచ్చు. శిథిలావస్థలో మసీదు, ఆలయ నిర్మాణాలు.. ఎంతో ఎత్తయిన పాన్గల్ ఖిల్లాపై పురాతన గణపతి, అమ్మవారి ఆలయాలతోపాటు మినార్లతో కనిపించే మసీదు నిర్మాణాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కల్యాణి చాళుక్యుల తర్వాత మసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, బరాద్ షాహీలు, మొఘలులు, అసఫ్ జహీల్ ఈ దుర్గాన్ని యుద్ధంలో సొంతం చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. 1600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులోని పాన్గల్ గుట్టపై రామగుండం బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గత 30, 40 ఏళ్ల క్రితం ఏటా తొలి ఏకాదశినాడు గుట్టపైకి వెళ్లే భక్తులు ఈ గుండంలో ఈత కొడుతూ.. స్నానాలు ఆచరించేవారు. ఇది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దేవిగుట్ట అనే ప్రాంతంలో కొలువైన అమ్మవారి పురాతన శిలా విగ్రహానికి భక్తులు నేటికీ ఏటా ఒకసారి గుట్టపైకి వెళ్లి పూజలు చేస్తారు. చెక్కుచెదరని యుద్ధ ఫిరంగులు శతాబ్దాల నాటి యుద్ధ ఫిరంగులు పాన్గల్ ఖిల్లాపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు కూడా పట్టకుండా ఉన్నాయి. ఖిల్లాలో ఎత్తయిన ప్రాంతంలో ఒకటి, తూర్పు ద్వారం వైపు మరో ఫిరంగి ఉన్నాయి. పాన్గల్ గుట్టపై ముక్తరామేశ్వర ఆలయం ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. కుతుబ్షాల కాలంలో నిర్మించిన బావిని ఇటీవల కాలం వరకు పాన్గల్ గ్రామంలో కుమ్మరి వీధి ప్రాంత ప్రజలు ఉపయోగించిట్లు స్థానికులు చెబుతారు. పులివేట వీరగల్లు ప్రతిమలు వీరగల్లులో పులివేట, పందివేట శిల్పాలు ప్రసిద్ధం. పులు లు, అడవి పందుల నుంచి ప్రజలను రక్షించడానికి గ్రామా ల్లోని వీరులు పోరాడి, అమరులైనప్పుడు.. ప్రజలు వీరుల జ్ఞాపకంగా వీరశిలలను పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ఈ శిల్పాలను చూసినవారు ఆ ఊరివీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారు. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతోపాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని అనే ప్రదేశం దగ్గర దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉల్బణ శిల్పంగా చెక్కి ఉంది. ఈ వీరగల్లును క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కారు. అరుదుగా కనిపించే, ప్రతిష్టించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ ఇదే మండలం బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఇది అరుదైన వీరగల్లు అని.. ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పాలను భద్రపరచడమో.. లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు కృషి చేయాలి. కోటపై ఉన్న అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. వనపర్తి జిల్లాకు తలమానికంగా నిలిచే కోటను భావితరాల వారికి తెలిసేందుకు పర్యాటక కేంద్రంగా మారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. – కుమ్మరి చంద్రయ్య, పాన్గల్ అభివృద్ధి చేస్తాం ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను మంత్రి జూపల్లి సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఖిల్లాకు సంబంధించిన నివేదికలను పంపించాం. పర్యాటక శాఖ అధికారులు ఖిల్లాను సందర్శించి వివరాలను సేకరించారు. మరోమారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చారిత్రక కట్టడాలు కనుమరుగవకుండా కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. – హైమావతి, మాజీ ఎంపీటీసీ, పాన్గల్ -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
పాన్గల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పీహెచ్సీలో కొనసాగుతున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రత్యేక వైద్య శిభిరాల రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిభిరాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది చూడాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉండి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
వనపర్తి: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో శనివారం ఉదయం జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు పోరాడిన మహనీయులను తెలంగాణ సమాజం ఎప్పటికీ స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ప్రజాప్రతినిధులు రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు, సామాజికవేత్త రాజారాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పురం.. అభివృద్ధి పథం
పురపాలికల వారీగా ఇలా.. పురపాలిక వార్డులు జనాభా (వేలల్లో..) అమరచింత 10 15 ఆత్మకూర్ 10 18 కొత్తకోట 15 25 పెబ్బేరు 12 21 అమరచింత: జిల్లాలోని కొత్త పురపాలికలు ఒక్కోదానికి సీడీఎంఏ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు లేక నిలిచిన నిర్మాణాలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎంతమేర డబ్బులు అవసరమవుతాయనే వివరాలతో పుర కమిషనర్లు అంచనాలు సిద్ధం చేసి మంత్రి వాకిటితో పాటు ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి అందించారు. వారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పట్టుబట్టి నిధులు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. జిల్లాలోని కొత్త పురపాలికలైన అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరుకు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేయించుకున్నారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టెండర్లు పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత అధికారులు వార్డుల్లో చేపట్టాల్సిన పనుల కోసం వార్డు అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. చేపట్టాల్సిన పనులు.. మంజూరైన నిధులతో డ్రెయినేజీలు (వరదనీరు పారేందుకు) నిర్మించనున్నారు. వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రహదారులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అర్బన్ పార్క్లు అభివృద్ధి చేస్తూ జంక్షన్ల వద్ద సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు స్వచ్ఛత కోసం రహదారులకు ఇరువైపులా ఉన్న దెబ్బతిన్న మురుగు కాల్వలను నిర్మించాల్సి ఉంది. సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు టౌన్హాల్ నిర్మించాల్సి ఉందని పుర అధికారులు వివరించారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే చేపట్టాల్సిన పనులకు టెండర్లను ఆహ్వానించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పనులు చేపట్టేందుకు అవకాశం ఉండకపోవడంతో వేగవంతంగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త పురపాలికలకు సీడీఎంఏ నిధులు మంజూరు ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు డ్రెయినేజీలు, పార్క్లు, సీసీ రహదారుల నిర్మాణాలపై దృష్టి ఎన్నికల ప్రకటనకు ముందే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారుల సన్నాహాలు గుర్తించిన పనులకే ప్రాధాన్యం.. పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతో గుర్తించిన పనులకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేయనున్నాం. పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, డ్రెయినేజీలు, సీసీ రహదారులు నిర్మించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. – నాగరాజు, పుర కమిషనర్, అమరచింత -
‘బీసీ రిజర్వేషన్లు సాహసోపేత నిర్ణయం’
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన బీసీ వ్యతిరేకవాదులు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సహకరించకుండా అడ్డుకుంటున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేసినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ బీసీలకు 42 శాతం కేటాయించినట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు సంఘటితంగా ఉండాలని.. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుట్రలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్గౌడ్, పెబ్బేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, పార్టీ మండల అధ్యక్షుడు రవికిరణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తీరొక్క పువ్వేసి చందమామ..
బతుకమ్మకు పూజలు నిర్వహిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం జిల్లా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మకు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అన్నారు. రెవెన్యూ, క్రీడలు, ప్రణాళిక, ఆర్అండ్బీ, పౌరసరఫరాలు, ఎంప్లాయిమెంట్శాఖ ఉద్యోగులు ఆడిపాడారు. కార్యక్రమంలో ఏఓ భానుప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఏడీ లాండ్ సర్వే బాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – వనపర్తి -
మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
కొత్తకోట రూరల్: మండలంలోని గుంపుగట్టు (కానాయపల్లి) పంపుహౌజ్లో విధులు నిర్వర్తిస్తున్న మిషన్ భగీరథ ఔట్సోర్సింగ్ కార్మికులు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ శుక్రవారం తాగునీటి సరఫరాల నిలిపివేసి సమ్మెకు దిగారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ ఎస్ఈ రమణ, డీఈ, ఇతర అధికారులు అక్కడకు చేరుకొని కార్మికులతో చర్చించారు. పెరిగిన వేతనాలు నెలకు రూ.12 వేల చొప్పున చెక్కు రూపంలో 29వ తేదీన చెల్లిస్తామనే షరతుతో సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సబ్ కాంట్రాక్టర్ లింగారెడ్డి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మె విరమించారు. 8 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు 10 నెలలుగా వేతనాలు, 5 ఏళ్ల బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదని వివరించారు. సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.శేఖర్, కార్మికులు కురుమూర్తి, వెంకటేష్, విజయ్, సాయికుమార్, నిరంజన్, వెంకటయ్య, బాబు, గోవర్ధన్, వెంకటేష్, సంతోష్, ఈశ్వరమ్మ, నిర్మలమ్మ, వంశి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయి చదువు కుటుంబానికి వెలుగు
● మహిళల అభివృద్ధికి పాటుపడాలి ● సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: ఇంట్లో అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని.. బాల్య వివాహాలను అరికట్టి మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ‘మన కోసం.. మన పిల్లల కోసం‘ అనే నినాదంతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా యూనిసెఫ్ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్నేహ (సేఫ్టీ న్యూట్రిషన్ ఎంపవర్మెంట్ హెల్త్ అడోలెసెన్స్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. బాల్య వివాహాన్ని నిర్వహించిన కుటుంబసభ్యులే కాకుండా ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని చెప్పారు. అదేవిధంగా బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ బారినపడి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. సమాజ గతిని మార్చే శక్తి సెర్ప్ వారిదని, సభ్యులు స్వయం సహాయక బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్నేహ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐలు అన్ని మండలాల్లో సమన్వయంతో పనిచేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు, పోక్సో కేసులు నివారించగలమన్నారు. ఈ సందర్భంగా పొక్సో కేసుపై అవగాహన కల్పించేందుకు పోలీస్శాఖ నిర్వహించిన స్కిట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, డీఆర్డీఓ ఉమాదేవి, డీడబ్ల్యూఓ సుధారాణి, డీఐఈఓ ఎర్ర అంజయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, సెర్ప్ సిబ్బంది, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐలమ్మ ఆదర్శం..
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమస్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని, తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె ధైర్య సాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ తరం వారికి ఆమె ఆదర్శమని, ఆమె ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
● గోపాల్పేట మండలం చెన్నారం మద్యం దుకాణం హైదరాబాద్లోని లింగంపల్లికి బదలాయింపు ● గత మద్యం పాలసీ దరఖాస్తులతో రూ.26.58 కోట్ల ఆదాయం ● ఈసారి రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారుల అంచన వనపర్తి: గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల కిందట నిర్వహించిన మద్యం పాలసీ గడువు నవంబర్ 30తో ముగియనుంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొత్త మద్యం పాలసీకి సంబంఽధించిన దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభించగా.. అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. ఒక్కో దుకాణానికి టెండర్ దాఖలుకు రూ.3 లక్షల డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలకు టెండర్లు నిర్వహించి లక్కీడిప్ విధానంలో కేటాయించారు. ఈసారి గోపాల్పేట మండలం చెన్నారం గ్రామంలో ఉన్న దుకాణంలో విక్రయాలు ఆశించిన మేర లేవని ఎకై ్సజ్ అధికారులు హైదరాబాద్లోని లింగంపల్లిలో ఏర్పాటుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 36 దుకాణాలకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రికార్డుస్థాయిలో విక్రయాలు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామదేవతల ఉత్సవాలు, పండుగలతో పాటు సాధారణ మద్యం విక్రయాలు రికార్డుస్థాయికి చేరాయి. ఒక్క వనపర్తి జిల్లాలోనే రెండేళ్ల కాలంలో ఏకంగా సుమారు రూ.వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆశించిన మేర లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రభుత్వ ఖజానాకు తమవంతుగా ఆదాయం సమకూర్చామనే సంబరం ఎకై ్సజ్ అధికారుల్లో కనిపిస్తోంది. గత మద్యం పాలసీలో రెండేళ్ల కాల పరిమితికిగాను ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల డీడీ జత చేయాల్సి ఉండేది. ఈ నగదు తిరిగి చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి రూ.26.58 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత మద్యం పాలసీలో రెండేళ్ల కాలానికి ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది. ఈ లెక్కన దరఖాస్తుల ఆదాయం గతంతో పోలిస్తే రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎకై ్సజ్ అధికారులు సైతం రూ.50 కోట్ల ఆదాయం దరఖాస్తులపై ఆశిస్తున్నట్లు సమాచారం. మరో రెండు నెలల పాటు మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయాన్ని రెండళ్ల సరాసరి అమ్మకాల మొత్తానికి కలుపాల్సి ఉంటుంది. -
‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
కొత్తకోట రూరల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ ఎంపీడీఓ సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, వేముల శ్రీనివాస్రెడ్డి, బీచుపల్లియాదవ్, మాసన్న, మోహన్రెడ్డి, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: రవాణా, లేబర్ ఛార్జీలు పెంచాలంటూ మన ఇసుక వాహన ట్రాక్టర్ల యజమానులు అర్ధాంతరంగా ఇసుక రవాణాను నిలిపివేశారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మన ఇసుక వాహనం ట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు జిల్లాల కంటే ఈ జిల్లాలో కిలోమీటరుకు రవాణా ఛార్జీ ఎక్కువగానే చెల్లిస్తున్నామని.. అయినప్పటికీ ఇంకా పెంచాలని రవాణా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. మహబూబ్నగర్, గద్వాల జిల్లాలో కిలోమీటర్కు రూ.70 ఉంటే.. ఇక్కడ రూ.80 చెల్లిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. ఇసుక లేకుంటే ఎలా పూర్తవుతాయని, లబ్ధిదారులకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఇసుక రవాణా ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండటంతో ఇసుక రీచ్లలో దొరకడం లేదని, లోపలికి వెళ్తే ట్రాక్టర్ బయటికి రావడం కష్టమవుతుందన్నారు. ఇసుక లోడింగ్కు లేబర్ ఛార్జీ ప్రభుత్వం రూ.350 ఇస్తుండగా.. తాము రూ.500 ఇవ్వనిదే ఎవరూ రావడం లేదని వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని.. ఇసుక రవాణా మాత్రం వెంటనే ప్రారంభించాలన్నారు. అందుకు అసోసియేషన్ సభ్యులు సమ్మతించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ పాల్గొన్నారు. -
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని.. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నివర్గాల హక్కుల సాధనకు పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్ఖాన్, సామాజికవేత్త రాజారాంప్రకాష్, రజక సంఘం జిల్లా నాయకుడు బండలయ్య, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, రాజు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా నిలిచిన డిస్పెన్సరీ సేవలు
● వైద్య సేవలకు దూరమవుతున్న కార్మికులు ● దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన వైనం ● పాలకులు, అధికారులు దృష్టిసారిస్తే మేలు వనపర్తిటౌన్: కార్మికులకు ఉచితంగా వైద్యసేవలు అందించే ఈఎస్ఐ ఏర్పాటు హామీ ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ఆరోగ్య సేవల నిమిత్తం వేతనం నుంచి నిర్దిష్ట రుసుంను పురపాలిక, బీడీ, ఇతర కార్మికుల వేతనాల నుంచి ప్రతినెల కోత విధిస్తారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారినపడితే ఈఎస్ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ఏళ్లుగా పాలకుల హామీగానే మిగిలిపోతున్న తరుణంలో తాజాగా నెల క్రితం ఎమ్మెల్యే మేఘారెడ్డి మంజూరు చేయిస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డిస్పెన్సరీకే దిక్కులేదు.. గత కొన్నేళ్ల కిందట స్థానిక పుర కార్మికుల కోసం అప్పటి పాలకులు డిస్పెన్సరీని మంజూరు చేశారు. 2000 సంవత్సరం వరకు కార్మికులు డిస్పెన్సరీలోనే వైద్యసేవలు పొందారు. ఆ తర్వాత డిస్పెన్సరీ అనుమతి పొందిన ఆస్పత్రి యాజమాన్యం అనారోగ్యం రీత్యా అనుమతిని పునరుద్ధరించుకోకపోవడంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. అప్పటి పాలకులు, అధికారులు దృష్టి సారించకపోవడంతో నేటికీ కార్మికులు వైద్య సేవలకు దూరమవుతున్నారు. జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులున్నా.. డిస్పెన్సరీ సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో కార్మికుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి. ఈఎస్ఐ కార్డులు అంతంతే.. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు జారీ చేయడంలోనూ పుర అధికారులు, ఇతర రంగాల కార్మికుల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అవగాహన ఉన్న కార్మికులు మినహా మిగతా వారు ఈఎస్ఐ నంబర్లు ఆన్లైన్లో ఉన్నాయని చెబుతున్నా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై స్పష్టత కొరవడింది. పురపాలికలోని ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి తెలిసిన ఏజెన్సీకి ఈఎస్ఐ కన్సల్టెన్సీగా అవకాశం ఇచ్చినా.. ఆ ఏజెన్సీ అవసరమైన కార్మికులు ఫోన్చేస్తే తప్ప అధికారులతో సమన్వయం చేసుకొని కార్డుల జారీకి చొరవ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బీడీ కార్మికులు 6 వేలు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించినట్లుగా జిల్లాకు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైతే అన్నిరంగాల కార్మికులకు మేలు చేకూరనుంది. సాధారణ వైద్యసేవల నుంచి మొదలు శస్త్ర, వైకల్య చికిత్సలు సైతం ఇక్కడే అందనున్నాయి. దీంతో కార్మికులకు దూరభారం, రవాణా ఖర్చులు, వ్యయ ప్రయాసలు తప్పుతాయి. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో పాటు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి కార్మిక, వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రి ఏర్పాటుకు భవన పరిశీలన చేపడితేనే అప్పుడు అడుగులు పడినట్లు అవుతుంది. ప్రస్తుతానికి సాధారణ వైద్యసేవలకు డిస్పెన్సరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. -
బతుకమ్మ.. బతుకమ్మా...
కలెక్టరేట్ ఆవరణలో రెండోరోజు గురువారం బతుకమ్మ సంబరాలను జిల్లా విద్య, ఇంటర్మీడియట్ విద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య పాల్గొని బతుకమ్మకు పూజలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలకు విద్యార్థులు అద్భుత రీతిలో బతుకమ్మ ఆడారు. ప్రజలు పర్యావరణంతో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. – వనపర్తి -
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
●ప్రతి ఏటా వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్తో పాటు ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి. – రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక -
చేనేత కార్మికుల ఆందోళన
● మద్దతు పలికిన బీజేపీ, బీఆర్ఎస్, మాస్లైన్, సీపీఐ నాయకులు అమరచింత: చేనేత రుణమాఫీ వర్తింపజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడుస్తున్నా నేటికీ అమలుగాకపోవడంతో గురువారం పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా యూనియన్ బ్యాంకుకు చేరుకొని బ్యాంకు ఎదుట బైఠాయించారు. నేతన్నలకు బీజేపీ, బీఆర్ఎస్, మాస్లైన్, సీపీఐ నాయకులు మద్దుతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులతో పాటు నేతన్నలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తూ రూ.33 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారన్నారు. జిల్లాల వారీగా రుణ వివరాలను బ్యాంకుల ద్వారా సేకరించిన జౌళిశాఖ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపడంతోనే సరిపెట్టారని తెలిపారు. కార్యాలయానికి వెళ్లి ప్రస్తావిస్తే డబ్బులు వస్తే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ చెప్పడమే తప్పా రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకు మేనేజర్ తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. దీనికితోడు తమ ఖాతాలను నిలిపివేశారని చెప్పారు. మేనేజర్తో మాట్లాడితే తమను ధూషించారని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ.. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుంటే ఎంతటివారి ఖాతానైనా ఆర్బీఐ నిబంధనల మేరకు నిలిచిపోతాయి తప్ప వ్యక్తిగతంగా చేసేదేమీ ఉండదన్నారు. రుణమాఫీ డబ్బులొస్తే వారి ఖాతాల్లో జమ చేస్తామని.. అప్పటి వరకు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. జౌళిశాఖ అధికారులు చొరవచూపి తమకు న్యాయం చేయాలంటూ నేతన్నలు బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందించారు. ఆయా పార్టీల నాయకులు మంగ లావణ్య, నర్సింహులుగౌడ్, రాజన్న, రవీందర్, నేత కార్మికులు తెలుగు రమేష్, పారుపల్లి శ్రీనివాసులు, రామలింగం, శేఖర్, లడ్డు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
చదువు మానిన విద్యార్థులపై దృష్టి
వనపర్తి: జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యలో చదువు మానిన విద్యార్థులపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అపార్ ఐడి, విద్యార్థుల డ్రాప్ అవుట్లు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలు చదువు మధ్యలో నిలిపివేస్తే బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ సంఖ్య తగ్గించడానికి ప్రతి పాఠశాల, కళాశాలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఏ విద్యార్థి మధ్యలో చదువు మానేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థుల హాజరు, నాణ్యమైన బోధనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల వారీగా అర్ధాంతరంగా చదువు మానేసిన విద్యార్థుల వివరాల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల డ్రాప్ అవుట్లు తగ్గించి, ప్రవేశాలు పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అపార్ ఐడీ జనరేషన్ వేగవంతం చేయాలని కోరారు. అపార్ ఐడీ జనరేషన్ సమయంలో విద్యార్థుల ఆధార్, పదోతరగతి ధ్రువపత్రాల వివరాలు అసమతుల్యత కారణంగా త్వరగా పూర్తి చేయలేకపోతున్నామని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఆధార్ శిబిరం ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా యూడైస్లోనూ విద్యార్థుల వివరాలను పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య, మండల విద్యాధికారులు, ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఇక టెండర్ల జాతర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో మద్యం వ్యాపారుల నుంచి టెండర్లు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఒక్కో వ్యాపారి ఎన్ని టెండర్లు అయినా దాఖలు చేయవచ్చు. ఈసారి టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాం. – విజయభాస్కర్రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ మహబూబ్నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి. జిల్లా 2019 2021 2023 మహబూబ్నగర్/ నారాయణపేట 1,384 1,525 3,571 నాగర్కర్నూల్ 1,064 1,507 2,524 జోగుళాంబ గద్వాల 418 987 1,171 వనపర్తి 516 694 1,329 దుకాణాల కేటాయింపు ఇలా.. జిల్లా గౌడ్ ఎస్సీ ఎస్టీ ఓపెన్ మొత్తం మహబూబ్నగర్/ నారాయణపేట 14 10 3 63 90 నాగర్కర్నూల్ 9 9 4 45 67 గద్వాల 5 6 0 23 34 వనపర్తి 4 5 1 26 36 నేటి నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్లు -
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం వ్యతిరేకం
● పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీమదనాపురం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని.. జనాభా దామాషా ప్రకారం కచ్చితంగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దుప్పల్లి జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చాయని.. ప్రస్తుత ప్రభుత్వం నగరాల చుట్టూ ఉన్న ఆయా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి చర్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గతంలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములన్నింటినీ క్రమబద్దీకరించి పూర్తి స్వేచ్ఛాహక్కులు కల్పించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కేటాయింపునకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా సరే.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు వెంకట్రాములు, రాజు, మేకల ఆంజనేయులు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగని.. జిల్లాలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలను మహిళలు తీరొక్క పూలతో అలంకరించి మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు. కార్యాలయ ప్రాంగణంలో రోజు కొన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తారని.. సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించి ట్యాంక్బండ్లో నిమజ్జనం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ వేడుకలో జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్ బతుకమ్మకు పూజ చేసిన అనంతరం మహిళలు బొడ్డెమ్మలు వేసి ఆడిపాడారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, అధికారులు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీఎం ఆవాజ్ యోజన సర్వే పూర్తి చేయాలి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న కుటుంబాల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎల్ (1) కింద 39,643 కుటుంబాలు ఉన్నాయని.. ఇందులో 27,205 కుటుంబాల వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 33 శాతం మాత్రమే పూర్తి కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదుల, పాన్గల్, పెబ్బేరు మండలాలు చివరి స్థానంలో ఉన్నాయని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీఓను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే పూర్తిచేసి జియో ట్యాగింగ్ చేయడానికి నెలాఖరు చివరి తేదీగా ప్రకటించారని, ప్రతి కార్యదర్శి రోజుకు 30 ఇళ్లు సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మండల ప్రత్యేక అధికారులు సర్వేపై దృష్టి సారించాలని, గడువులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రోజువారీగా సర్వే నివేదిక అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోభా, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
త్వరగా పూర్తి చేయాలి..
వానాకాలం సాగుచేసిన వరి ప్రస్తుతం పొట్టదశలో ఉంది. అంతేగాకుండా అదిక వర్షాలతో పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట వివరాలను ఆన్లైన్లో త్వరితగతిన నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుంది. – రాజు, రైతు, అమరచింత పొలం నుంచే నమోదు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం వద్దే ప్రత్యేక యాప్లో రైతులు సాగు చేసిన పంట వివరాలు, రైతు, పంట ఫొటోలతో నమోదు చేస్తున్నాం. పంట వివరాల నమోదుతో చేకూరే లాభాలను వివరిస్తూ నమోదు చేసుకుంటున్నాం. – అరవింద్. ఏఓ, అమరచింత రైతుల ప్రయోజనాల కోసమే రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంటల సాగు వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయిస్తోంది. జిల్లాలో జూలై పదో తేదీ నాటికి వివిధ రకాల పంటలు 2,45,356 ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిసింది. అన్నిరకాల పంట వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేస్తాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట ● -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
అమరచింత: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటి, దంత వైద్య పరీక్షలతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. శ్రావ్యా, డా. మానస, డా. ఫయాజ్, సీహెచ్ఓ సురేష్కుమార్, హెల్త్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
వనపర్తి రూరల్: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ అప్పగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హెచ్చరించారు. బుధవారం శ్రీరంగాపురం మండలంలోని లక్ష్మి వారాహి, లక్ష్మి నర్సింహ రైస్మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024–2025 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సీఎంఆర్ను పౌరసరఫరాలసంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ తనిఖీలు సీఎంఆర్లో జాప్యం, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించినవని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి మిల్లర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జగన్మోహన్, డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ రాజు, డీటీ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల పొలం బాట
వానాకాలం పంట వివరాల నమోదులో ఏఈఓలు ● జిల్లాలో 2,45,356 ఎకరాల్లో సాగు ● నెలరోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ ● రైతుల మేలు కోసమే.. అమరచింత: జిల్లావ్యాప్తంగా వానాకాలం పంటల సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు అధికారులు పొలం బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల పాటు గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులు ఏయే పంటలు సాగు చేశారన్న పూర్తి వివరాలను వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని వదులుతుండటంతో ఆయకట్టు రైతులు వరి, ఆముదం, పత్తి, కంది, చెరుకు, మిరప, మొక్కజొన్న సాగులో బిజీగా ఉంటున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పొలాల వెంట తిరుగుతూ సదరు రైతు పట్టాదారు పాసు పుస్తకం ప్రకారం ఏయే సర్వేనంబర్లో ఎన్ని ఎకరాల్లో ఏయే పంట సాగు చేస్తున్నారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. పంటల నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు ఆయా వ్యవసాయ సెక్టార్లలో ఆకస్మికంగా పర్యటిస్తూ పరిశీలించి వ్యవసాయ విస్తరణ అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పంట సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..) వరి 2,01,477 పత్తి 15,863 మొక్కజొన్న 9,475 కంది 3,744 అనుములు 2,396 వేరుశనగ 1,936 జొన్న 1,300 చెరుకు 1,135 ఉలవలు 254 పండ్లు, పూల తోటలు 8,217 255 గ్రామాలు.. 72 మంది ఏఈఓలు... జిల్లాలోని 15 మండలాలు, 72 వ్యవసాయ క్లస్టర్లలో 72 మంది ఏఈఓలు, 12 మంది ఏఓలు, ఇద్దరు ఏడీఏలతో పాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి పర్యవేక్షణలో పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాలు అధికంగా ఉండటంతో వివరాల నమోదుకు సమయం పడుతోందని వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. గతంలో వీఆర్వోలు గ్రామ సేవకుల సహకారంతో పంటల నమోదు ప్రక్రియ నిర్వహించే వారు. తర్వాతి కాలంలో వీఆర్వోలతో పాటు గ్రామ సేవకులను ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ చేయడంతో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. రైతులకు అవగాహన కల్పిస్తూ.. సాగుచేసిన పంట వివరాలను తప్పకుండా వ్యవసాయశాఖ రూపొందించిన యాప్లో నమోదు చేయించుకోవాలని.. లేని పక్షంలో పంట ఉత్పత్తులను విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. యూరియా పంపిణీలో అలస్యం కావడంతో పంట వివరాల నమోదు ప్రక్రియలో జాప్యం జరిగిందని.. వచ్చే నెల నాటిని పూర్తిస్థాయిలో పంటల వివరాలను ఆన్లైన్లో సర్వేనంబర్ వారీగా నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
కొత్తకోట అభివృద్ధికి రూ.15 కోట్లు
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కొత్తకోట: స్థానిక పురపాలికలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ను పుర కమిషనర్ సైదయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే బుధవారం పట్టణంలో అందజేసి మాట్లాడారు. ఇందులో డ్రెయినేజీలు, సీసీ రహదారుల నిర్మాణాలకు రూ.6 కోట్లు, శనిగ చెరువుకట్ట అభివృద్ధి, సంతబజార్ ఏర్పాటు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.5 కోట్లు, పట్టణంలోని పార్క్ల అభివృద్ధికి రూ.2 కోట్లు, మొక్కల సంరక్షణ, మీడియన్ ప్లాంటేషన్కు రూ.50 లక్షలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మురుగు కాల్వలు, రహదారుల మరమ్మతుకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్ కుమార్, స్థానిక నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, పెంటన్నయాదవ్, సుభాష్, రవీంధర్రెడ్డి, మోహన్రెడ్డి, సంద వెంకటేశ్, శంకర్యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా.. మదనాపురం: నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించడంతో మహిళా సంఘాల సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కుటుంబ దోపిడీ తప్ప చేసిందేమీ లేదని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సమన్వయ కమిటీ అధ్యక్షుడు మహేష్, అఽధికారులు, మహిళలు పాల్గొన్నారు. -
సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి
‘ఎన్ఎస్ఎస్’తో విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవాటు ● 2025–26 క్యాంపుల నిర్వహణకు నిధులు విడుదల ● స్వచ్ఛత, పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన ● జనాభా సంఖ్య, పిల్లలు, వ్యాధులు తదితర అంశాలపై సర్వే ● పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు నిధులు విడుదల చేశాం 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి వారం రోజులు సామాజిక కార్యక్రమాలు క్యాంపులో వారం రోజుల పటు ఎంపిక చేసుకున్న గ్రామం, ప్రాంతంలో విద్యార్థులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారికి అధికారులు భోజనం, వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, చెత్తా చెదారాన్ని ఊడ్చడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం, ఉదయం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పిస్తారు. చివరి రెండు రోజులు గ్రామంలో ఉండే ప్రజల వివరాలు, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు, తాగునీరు, అందుతున్న వైద్య సేవలు, అధికంగా ప్రబలుతున్న రోగాలు తదితర అంశాలపై సర్వే నిర్వహించి సంబంధిత నివేదికను గ్రామ, పీయూ అధికారులకు అందిస్తారు. నివేదికలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఆస్కారం ఉంది. పలు చోట్ల ప్రజలకు అవసరమైన మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఇప్పటికే పలు చోట్ల క్యాంపులు ప్రారంభమయ్యా యి. పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ఉండగా.. 45 మంది విద్యార్థులు (వలంటీర్ల)తో ఒక్కో యూనిట్ను ఏర్పాటు చేశారు. క్యాంపునకు అయ్యే ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు రూ.35 వేల చొప్పున మంజూరు చేశారు. మొత్తం పీయూ పరిధిలో 100 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో మొదటి విడతగా 51 యూనిట్లకు అధికారులు రూ. 17.75 లక్షలను విడుదల చేశారు. ఇక్కడ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఎన్ఎన్ఎస్ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. వాటితో అడ్మిషన్లు తదితర విషయాల్లో ఎన్ఎన్ఎస్ సర్టిఫికెట్ కీలకంగా మారనుంది. ఉమ్మడి జిల్లా వివరాలిలా.. విద్యార్థులకు ప్రయోజనం ఎన్ఎన్ఎస్లో భాగంగా ఇప్పటికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలో భాగంగా ప్రజలకు స్వచ్ఛబారత్, నషా ముక్త్భారత్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. వీటి ద్వారా అనేక అంశాలను ఒక విద్యార్థిగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ బవిష్యత్తులో ఎంతో ఉపయోగడపతుంది. – సరిత, ఎన్ఎస్ఎస్ వలంటీర్ -
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
వనపర్తి: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కార్యదర్శి లోకేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి నిషేధిత భూములు, రెవెన్యూ సదస్సు పెండింగ్ దరఖాస్తులపై చర్చించారు. జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ల్యాండ్ ఏడీ బాలకృష్ణ, ఏఓ భానుప్రకాష్, సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాదా బైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నిషేధిత భూముల జాబితాలోని అసైన్డ్, వక్ఫ్ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే కొత్త సర్వేయర్లు వచ్చారని.. జిల్లాలో ఉన్న అసైన్డ్, వక్ఫ్ భూములు సర్వే చేయించి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 121 ప్రకారం నిర్ణీత ఫార్మెట్ పూరించి నివేదికలు పంపించాలని ఆదేశించారు. -
భూ సేకరణే అడ్డంకి
రెండేళ్లుగా ముందుకు సాగని సింగోటం– గోపల్దిన్నె లింక్ కెనాల్ మంత్రి జూపల్లి సమీక్ష.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు కెనాల్ తవ్వకంపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగానే గత నెలలో కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ.25 కోట్ల మేర నిధులు ఉండడంతో రైతులకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని సూచించారు. దీనిపై గ్రామాల వారీగా రైతులతో మాట్లాడేందుకు మంత్రి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వెల్లడించారు. ప్రయోజనం ఇలా.. సింగోటం– గోపల్దిన్నె లింకు కెనాల్తో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఐదు మండలాల రైతాంగానికి మేలు జరగనుంది. వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని చివరి ఆయకట్టు పొలాలతోపాటు పాన్గల్ మండలంలో కొంతమేరకు సాగునీరు అందుతుంది. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న 24,500 ఎకరాలు, రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. అలాగే వేసవిలో గోపల్దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరుతుంది. కొల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోనే వెనకబడిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందించానే లక్ష్యంతో చేపట్టిన సింగోటం– గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ఏళ్లతరబడిగా సాగుతూనే ఉన్నాయి. భూ సేకరణ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పనులను పూర్తి చేసేందుకు ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులను గమనిస్తే ఈసారైనా పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయా.. లేదా.. అనే సంశయం నెలకొంది. ఈ కెనాల్ పూర్తయితే ఐదు మండలాల పరిధిలోని 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం.. జూరాల ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద చివరి ఆయకట్టు భూములు కొల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతులకు రబీ సీజన్లో రెగ్యులర్గా సాగునీటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సింగోటం– గోపల్దిన్నె లింకు కెనాల్కు శ్రీకారం చుట్టారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయింపు చేసినా.. చాలాకాలం తర్వాత 2022లో రూ.147.7 కోట్లు మంజూరు చేసింది. 2023లో ఊపందుకున్న పనులు.. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం, భూ సేకరణ సమస్య కారణంగా నిలిచిపోయాయి. 22.5 కి.మీ., గాను ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకే తవ్వకాలు పరిహారం పెంచితేనేభూములిస్తామని రైతుల డిమాండ్ ఇటీవల మంత్రి జూపల్లి పునఃప్రారంభించినా మందకోడిగానే.. కాల్వ పూర్తయితే 34 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు -
మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
పాన్గల్: మండలంలోని రేమద్దుల గ్రామ మైనింగ్ ప్రాంతాన్ని మంగళవారం మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గ్రామంలోని సర్వేనంబర్ 230, 232, 233, 234, 235, 251, 252 తదితర సర్వేనంబర్లలో ఉన్న 12.16 ఎకరాల తవ్వకాలకు ప్రభుత్వం 2005లోనే అనుమతినిచ్చింది. ప్రభుత్వం అనుమతినిచ్చిన సర్వేనంబర్లలో కాకుండా 243, 245లో కొంతవరకు తవ్వకాలు చేపట్టి అక్కడున్న గొల్లకుంటను ధ్వంసం చేశారని వాల్యానాయక్తండా రైతుల ఫిర్యాదు మేరకు పరిశీలించామని.. రైతులు, గ్రామస్తులతో వివరాలు, జీపీఎస్ యంత్రం ద్వారా మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించినట్లు అధికారులు వివరించారు. మధ్యాహ్నం నుంచి వర్షం కురవడంతో వివరాల సేకరణకు అంతరాయం ఏర్పడిందని.. మరోమారు సందర్శించి పూర్తి వివరాలు సేకరించి హద్దులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ సురేఖ, మైనింగ్ సర్వేయర్ సుజాత, ఆర్ఐ మహేష్, ఇన్చార్జ్ సర్వేయర్ శివకుమార్, జీపీఓ బాబు, వీఆర్ఏ మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వచ్చే సీజన్ నాటికి..
లింక్ కెనాల్ కోసం దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులతో గతంలోనే మాట్లాడాం. ఇటీవల భూసేకరణ అంశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తావించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు 5 కి.మీ., మేరకు కాల్వ తవ్వకం పూర్తయింది. చాలాచోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. వచ్చే సీజన్ నాటికి కెనాల్ పనులు పూర్తికావొచ్చని భావిస్తున్నాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ ● -
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వనపర్తి: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, వైద్యశాఖకు సంబంధించిన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎన్ఐసీ మందిరంలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 2 వరకు జరిగే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. ప్రత్యేక వైద్య నిపుణులు ఎవరెవరు వచ్చారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 10 వేల పైచిలుకు వరకు పిల్లలు, మహిళలు ప్రత్యేక వైద్య పరీక్షలకు హాజరయ్యారని, రోజుకో స్పెషలిస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హాజరై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి సమాధానమిచ్చారు. వైద్య నిపుణుడు వచ్చే ముందురోజు ప్రజలకు సమాచారం ఇచ్చి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వనపర్తి హెల్త్ పోర్టల్లో రోగుల వివరాలు నిక్షిప్తం చేసి వారికి సంక్షిప్త సందేశం అందించేందుకు సరైన వాట్సాప్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది 63 డెంగీ కేసులు నమోదయ్యాయని, డెంగీ ప్రబలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారుల సహకారంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా 5వ ఏఎన్సీ చెకప్ సైతం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వసతిగృహ విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్బీఎస్కే సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించడానికి హెచ్బీ1సీ పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డా. చైతన్య, డా. సాయినాథ్రెడ్డి, డా. పరిమళ, డా. మంజుల పాల్గొన్నారు. -
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
గోపాల్పేట: మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం గోపాల్పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ముందుగా పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ స్పెషలిస్టు డా.శ్రావణి 61మంది పిల్లలకు పరీక్షలు చేశారు. అందులో 44 మంది తక్కువ బరువుతో కూడి పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించారు. చిన్నారులకు అవసరమైన మందులు అందజేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 24, 26, 29, అక్టోబర్ 1న ఇతర వైద్యులతో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24న నేత్ర వైద్యులు, 26న జనరల్ వైద్యులు, 29న చర్మ వైద్యులు, అక్టోబర్ 1న దంత వైద్యులు అందుబాటులో ఉంటారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా.చాంద్పాషా, సీహెచ్ఓ సిద్దగౌడ్, సూపర్వైజర్లు సుచిత్ర, కౌసల్య, వెంకటమ్మ, మధుబాబు పాల్గొన్నారు. -
యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
గోపాల్పేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సోమవారం వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం గోపాల్పేట సింగిల్విండో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. తీరా సింగిల్విండో సిబ్బంది ప్రస్తుతం స్టాక్ లేదని.. మంగళవారం వస్తే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడి నుంచి వనపర్తి–హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నిత్యం యూరియా కోసం తిరుగుతున్నా ఒక బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టోకెన్లు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వానాకాలం సాగుచేసిన పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పీఏసీఎస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఇప్పటికే 2వేల వరకు టోకెన్లు ఇచ్చామని.. మంగళవారం లోడ్ వచ్చిన తర్వాత మరింత మందికి టోకెన్లు అందిస్తామన్నారు. బుధవారం ఎక్కువ మొత్తంలో యూరియా రానుందని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
వనపర్తిటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ దేవాలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపాల్లో దుర్గామాత ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భవానీ దీక్ష స్వీకరించారు. మొదటి రోజు దుర్గామాతకు అష్టోత్తర, లలితా సహస్రనామావళితో సామూహికంగా కంకుమార్చన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, అయ్యప్ప, చౌడేశ్వరి, బ్రహ్మంగారి ఆలయాల్లో అమ్మవారిని బాలత్రిపురసుందరిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 కలశాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చి వాసవీ కన్యకా పరమేశ్వరిదేవికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత మంగళగౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
ఖాళీల భర్తీ ఎప్పుడో?
● భర్తీకి నోచుకోని కీలక పోస్టులు ● ఇన్చార్జి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి ● క్షేత్రస్థాయిలో కార్మికులకు అవగాహన కార్యక్రమాలు కరువు వనపర్తిటౌన్: కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే కార్మికశాఖకు అధికారులు కరువయ్యారు. ఒకే ఒక్క జూనియర్ అసిస్టెంట్, మరొక అటెండర్తోనే జిల్లా కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ వంతుకు గంతేసినట్లుగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వేణుగోపాల్కు వనపర్తి జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన వారంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో కార్మికులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. దీనికి తోడు పూర్తి బాధ్యత లు ఉన్న గద్వాల జిల్లాలో ముఖ్యమైన కార్యకలాపాలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం మానేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అసలు కార్మికశాఖలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీ.. కార్మికశాఖలో అత్యంత కీలకమైన పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లతో పాటు సీనియర్ ఆసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్పై పనిభారం పెరగడంతో పాటు అసలు విధులు పడకేస్తున్నాయి. కీలకమైన బాధ్యతల్లో ఉండాల్సిన అధికారులు లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పథకాల అమలులో జాప్యం.. కార్మికశాఖ ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులకు అందించడంలో జాప్యం తప్పడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల వేతన సమస్యలను గుర్తించి పరిష్కరించడం.. కార్మిక మండలి కొనసాగిస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అసంఘటిత రంగ కార్మికులకు సభ్యత్వాల నమోదు తదితర బాధ్యతలన్నీ సిబ్బంది కొరతతో మరుగున పడుతున్నాయి. అనేక మంది వ్యాపారులు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ కేవలం కొందరికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. అధికారులకు సైతం తప్పుడు సమాచారం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిపై విచారణ, చర్యల్లో జాప్యం నెలకొంటుంది. కొరవడిన తనిఖీలు.. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆకస్మిక తనిఖీలు ఆగిపోయాయి. కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాల్సిన కీలక అధికారుల పోస్టుల ఖాళీ కలవరపెడుతోంది. ప్రధాన అంశాలపై నిరంతర అన్వేషణ ఉండటం లేదు. అధికారికంగా వచ్చే ఫిర్యాదులపై స్పందించే పరిస్థితులు కూడా అరకొరగానే కనిపిస్తున్నాయి. కార్మికశాఖ కార్యాలయం ఇదే కార్యాలయంలో ఏ వివరాలు కావాలన్నా ఇన్చార్జిగా ఉన్న అధికారికే తెలుసు. కార్యాలయంలో మాకు కేటాయించిన విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నాం. ఇక్కడ నాతోపాటు ఒక అటెండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎంత మంది కార్మికులు ఉన్నారు.. ఎంత మందికి క్లెయిమ్స్ క్లియర్ చేశారనే వివరాలు ఇన్చార్జ్ అధికారికే తెలుసు. ఆయన ద్వారానే వివరాలు తీసుకోవాలి. – రఫీ, కార్మికశాఖ జూనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారుల పోస్టులే కాదు.. కార్యాలయాల్లో సిబ్బంది నియామకాల్లోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జిల్లా కార్యాలయంలో కార్మికుల వివరాలు నమోదు చేయడం, వారి క్లైమ్స్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే డాటా ఆపరేటర్లు ఒక్కరు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీంతో శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందు బాటులోకి రాలేదు. -
ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు
● బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల ● కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ ● కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత దసరా పండగ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తదే భవిష్యత్ అంటూ వారికి భరోసా కల్పిస్తోంది. ముందుగానే హామీ ఇచ్చినట్టుగా బీసీ రిజర్వేషన్ల అమలుతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికీ తమ కేడర్ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలు నిర్వహించగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్/వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీ కులగణన ఆధారంగా.. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జెడ్పీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఖరారు చేయనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీఓ ఖరారు చేయనుండగా.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీఓలు కేటాయించనున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు స్థానాలు ఇలా.. జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ నాగర్కర్నూల్ 20 214 మహబూబ్నగర్ 16 175 వనపర్తి 15 136 జోగుళాంబ గద్వాల 13 141 నారాయణపేట 13 136 -
క్రీడలకు వనపర్తి తలమాణికం
వనపర్తి: క్రీడలు, విద్యకు వనపర్తి జిల్లా ప్రసిద్ధి చెందిందని.. ఈ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావడం గర్వించదగ్గ విషయమని డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 21న ప్రారంభమైన 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా క్రీడలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజులపాటు ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర విభాగం నుంచి పది జట్లు, బాలికల విభాగం నుంచి 10జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో విన్నర్గా హైదరాబాద్ జట్టు, బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లా డారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపించడం అభినంద నీయమన్నారు. కార్యక్రమంలో సెపక్ తక్రా అసోసి యేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, వనపర్తి సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ జలేందర్రెడ్డి, జిల్లా యూత్ స్పోర్ట్స్ అధికారి సుధీర్రెడ్డి, రిటైర్డ్ పీడీ భాస్కర్గౌడ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్, నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
వనపర్తి: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రజలకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 28 అర్జీలు అందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
పూత రాలింది..
ఈసారి ఐదు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి అయింది. గత నెల విరివిగా కురిసిన వర్షాలకు పత్తి మొక్కలు మెత్తగా మారి ఆకులు రంగులు మారడంతో పాటు పూత రాలిపోయింది. కాయలు సైతం తెగుళ్ల బారిన పడటంతో పత్తి బయటపడటం లేదు. ఈసారి ఎకరాకు కేవలం 2 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. – లక్ష్మన్న, రైతు, మదిగట్ల (పెద్దమందడి) 5 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. అధిక వర్షాలు, తెగుళ్లతో ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే కాయల ద్వారా పత్తి బయటపడింది. ఇదికూడా ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు మాత్రమే చేతికందే పరిస్థితి ఉంది. రూ.500 కూలి చెల్లిస్తూ ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పత్తి ఏరుతున్నాం. – అమడబాకుల సుజాత, కొంకన్వానిపల్లి ఈసారి మూడు ఎకరాల్లో పత్తి సాగుచేశా. తెగుళ్లు సోకి పత్తి కాయలు రాలిపోయాయి. కేవలం 1.50 ఎకరాల పంట మాత్రమే చేతికందే అవకాశం ఉంది. నష్టాలు తప్పడం లేదు. – లక్ష్మి, రైతు, కొంకన్వానిపల్లి ఈసారి అధిక వర్షాలతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గుతోంది. తెగుళ్ల నుంచి పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చినా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు ఎర్రబడ్డాయి. రైతులు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పంట నష్టపోయిన రైతుల నివేదిక సిద్ధం చేసి పంపిస్తాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట ● -
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట
● ఎండు, ఆకుమచ్చ తెగులుతో తగ్గిన దిగుబడి ● జిల్లాలో 15,831 ఎకరాల సాగు ● ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులుఅమరచింత: అధిక వర్షాలు, తెగుళ్లతో పత్తి పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాక సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఆశించిన దిగుబడి వస్తుందని ఆశించిన రైతన్నకు అప్పులు, కన్నీరే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూత, పిందెతో పాటు గూడ, కాయలు రాలుతోందని.. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు పిచికారీ చేసినా ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా ఆగమయ్యాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 15,831 ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి అయిందని.. పంట ఎండుముఖం పట్టి ఉన్న కొద్దిపాటి పత్తినైనా సకాలంలో అందుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యవసాయ కూలీలను ఇతర ప్రాంతాల నుండి రోజుకు రూ.450 కూలి ఇచ్చి కాసిన పత్తిని ఏరి ఇళ్లకు తరలించుకుంటున్నారు. మండలం విస్తీర్ణం (ఎకరాల్లో..) అమరచింత 4,857 ఆత్మకూర్ 4,270 మదనాపురం 2,445 పెద్దమందడి 1,570 ఖిల్లాఘనపురం 1,483 కొత్తకోట 535 రేవల్లి 311 గోపాల్పేట 145 వనపర్తి 120 పెబ్బేరు 35 ఏదుట్ల 30 చిన్నంబావి 23 పాన్గల్ 4 శ్రీరంగాపురం 3 పత్తి సాగుకు ఎకరాకు రూ.35 వేలు.. కౌలు రైతులకై తే రూ.45 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలం దున్నడానికి రూ.2 వేలు, సాలు కొట్టడానికి రూ.2,500, విత్తనానికి రూ.3 వేలు ఖర్చు అవుతుండగా.. కూలీలకు రెండు పర్యాయాలకు రూ.8 వేలు, ఎరువులకు రూ.12 వేలు, మందుల పిచికారీ మూడు పర్యాయాలకు రూ.9 వేల వరకు అవుతుందని వివరించారు. వీటితో పాటు పత్తి ఏరేందుకు అయ్యే ఖర్చు వీటికి రెట్టింపు అవుతుందంటున్నారు. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న అంచనాలతో రైతులు పత్తి సాగు చేశారు. కాసిన పత్తి కాయలు అధిక వర్షాలకు రాలిపోవడం, మిగిలిన కాయల నుంచి వచ్చే పత్తి కేవలం ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు మాత్రమే చేతికందే పరిస్థితి నెలకొంది. ఈసారి మార్కెట్లో పత్తికి ఆశించిన ధర లేకపోవడంతో వచ్చిన పత్తిని ఇంటికి తరలించి భద్రపర్చుకుంటున్నారు. మార్కెట్లో క్వింటాకు రూ.7 వేల వరకు ఉండగా దళారులు కేవలం రూ.5,500 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతన్నలు భారీగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే రెండు, మూడు పర్యాయాలు పత్తి ఏరుకునే అవకాశం ఉండేది. కాని ఈసారి పూర్తిగా దెబ్బతినడంతో ఒకసారి మాత్రమే పత్తి ఏరుకునే వీలుందని రైతులు చెబుతున్నారు. -
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
● ఆలయాలు, మండపాల్లో కొలువుదీరనున్న అమ్మవారు ● ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు వనపర్తిటౌన్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాకేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి, వేంకటేశ్వరస్వామి, రామాలయం, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి, కమటేశ్వరి, బ్రహ్మంగారి ఆలయాలతో పాటు వివిధ కాలనీల్లో మండపాలను ఏర్పాటు చేసి విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించారు. నిర్వాహకులు అమ్మవార్లను రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాజ ప్రసాదంలో వనపర్తి సంస్థానాదీశుల వారసుడు రాజాకృష్ణదేవరావు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు చేయడంతో పాటు రామాయణ పారాయణంతో ఉత్సవాలను ప్రారంభించి విజయదశమి రోజు శ్రీరామ పట్టాభిషేక పారాయణంతో ముగించడం ఆనవాయితీగా వస్తోంది. -
క్రీడాకారులకు ప్రోత్సాహం
వనపర్తి: ప్రతిభ కనబర్చే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమంగా రాణించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే.శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్తక్రా చాంపియన్షిప్ క్రీడా పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో క్రీడలకు రూ.800 కోట్లు కేటాయించిందన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేలా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. సెపక్తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానం ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదివనపర్తిలో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే వరకు శ్రమించాలని.. గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలంపిక్స్లో పతకం సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడలకు జిల్లా నిలయం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి విద్యాపర్తి మాత్రమే కాదని, క్రీడలకు కూడా నిలయమన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఇక్కడి వారే కావడం, రాష్ట్ర క్రీడా మంత్రి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వాసే కావడం ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా క్రీడలపై మక్కువ ఎక్కువని.. ఇక్కడే చదువుకొని అనేక క్రీడల్లో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా హైదరాబాద్లోని క్రీడా ప్రాధికార సంస్థకు వెళ్లి కలవాలని సూచించారు. వనపర్తి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ , పెద్దమందడి, ఖిల్లా ఘనపురం మండలాలకు మినీ స్టేడియం మంజూరు చేసిన ముఖ్యమంత్రి, క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో 9 ఎకరాల్లో క్రికెట్ మైదానం కోసం స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. సెపక్తక్రా క్రీడల్లో రాణించి ఇన్కం టాక్స్ విభాగంలో ఉద్యోగం సంపాదించిన ఖిల్లాఘనపురం అమ్మాయి నవతను అభినందించారు. ఇదిలా ఉండగా క్రీడలకు వనపర్తి వ్యవసాయ మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్ అధ్యక్షత వహించగా.. పోటీల ప్రారంభానికి ముందు ప్రముఖ క్రీడాకారుడు, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి క్రీడా జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సుధీర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సెపక్తక్రా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి పబ్బ భాస్కర్గౌడ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అట్టహాసంగా ప్రారంభమైన 11వ అంతర్రాష్ట సెపక్తక్రా పోటీలు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 20 జట్లు -
త్వరలో డీసీసీ సారథుల నియామకం?
వనపర్తి: కొంతకాలంగా అధికార కాంగ్రెస్పార్టీలో చర్చనీయాంశంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకంపై దసరాలోగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు క్యాడర్ చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్య్రా పార్టీ జిల్లా సారఽథులను నియమించి వారి సేవలను పార్టీ అభ్యర్థుల గెలుపునకు వినియోగించుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా.. జిల్లా విషయానికొస్తే అధ్యక్ష పదవిలో రేసులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వర్గీయులు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ని మరోమారు కొనసాగించాలనే ప్రతిపాదన చిన్నారెడ్డి రాష్ట్ర, కేంద్ర కమిటీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాదంటే.. ఓ న్యాయవాది, మరో రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్ నాయకుడి పేర్లు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇనాళ్లు ఓ లెక్క.. నేను పార్టీలో చేరాక మరోలెక్క అన్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ పెద్దలను ఒప్పించి టిక్కెట్ తెచ్చుకొని అన్యూహ్యంగా ఇచ్చిన మాట ప్రకారం బలమైన నాయకుడిపై భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు పార్టీలో చేరి తన గెలుపునకు కీలకపాత్ర పోషించిన సన్నిహిత మిత్రుడు, మాజీ కౌన్సిలర్, మాజీ ఎంపీపీ ముగ్గురి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు డీసీసీ పీఠం దక్కించుకుంటారో తెలుసుకోవాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే. పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రకటించే అవకాశం ఇటీవల స్థానిక నేతలతో ముఖ్యమంత్రి చర్చించినట్లు ప్రచారం గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పాటించగా.. అదే విధానాన్ని డీసీసీ అధ్యక్షుల నియామకంలోనూ కేంద్ర, రాష్ట్ర పెద్దలు కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కొనసాగితే డీసీసీ పీఠం ఎమ్మెల్యే వర్గీయులకే దక్కడం ఖాయమని చెప్పవచ్చు. ఈ విషయంలో జిల్లాలో భాగస్వాములైన కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సైతం ఎమ్మెల్యే ప్రతిపాదననే బలపర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో డీసీసీ పీఠం ఎమ్మెల్యే వర్గీయులకు దక్కడం లాంచనప్రాయమేనని పార్టీ శ్రేణుల్లో చర్చ వినిపిస్తోంది. -
దసరాకు ప్రత్యేక బస్సులు
●స్టేషన్ మహబూబ్నగర్: ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్నగర్ రీజియన్లో 641 ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు తిరగనున్నాయి. రీజియన్లోని పది డిపోల నుంచి ఈ అదనపు బస్సులు శనివారం ప్రారంభం కాగా.. వచ్చే నెల 2వ తేదీ వరకు నడపనున్నారు. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు. దసరా పండుగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు కొద్దిమేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభ మూడు రోజులు, ముగింపు అనంతరం రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ రూట్లో ఎక్కువ అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ రూట్లోనే ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు రూట్లోనూ అదనపు బస్సులు నడవనున్నాయి. మహబూబ్నగర్ డిపో నుంచి అధికంగా 93 అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, వారి సౌకర్యార్థం అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, షెల్టర్లు, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో శనివారం బస్టాండ్లలో రద్దీ కొంతమేర కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. వచ్చేనెల 2 వరకు నడపనున్న ఆర్టీసీ హైదరాబాద్ మార్గంలోనే రాకపోకలు అధికం -
నేటి నుంచి అంతర్జిల్లా సెపక్తక్రా పోటీలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆది, సోమవారం 11వ సెపక్తక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల పరిధిలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయని.. అందులో 10 మహిళలు, 10 పురుష జట్లు ఉంటాయని తెలిపారు. క్రీడా పోటీలను రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర స్సోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభిస్తారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ పోటీల్లో ఖిల్లాగణపురం మండలానికి చెందిన జాతీయ క్రీడాకారిణి వనిత పాల్గొంటుందని.. మరోసారి జాతీయస్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. పోటీలను తిలకించేందుకు జిల్లాలోని క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్తో పాటు భాస్కర్గౌడ్, భాస్కర్రెడ్డి, గట్టు వెంకన్న, ఉప్పల భాస్కర్, జగదీశ్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సీఎంఆర్ పూర్తయిన మిల్లులకే ధాన్యం
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: ఇప్పటి వరకు సీజన్ల వారీగా సీఎంఆర్ అప్పగించి బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లులకే 2025–26 వానాకాలం వరి ధాన్యం కేటాయిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025–26 వానాకాలానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 430 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు అంచనా వేస్తున్నామని.. మిల్లర్లకు ఇబ్బంది కలగకుండా క్లీనర్లు ఏర్పాటు చేయించి ధాన్యం శుభ్రం చేయడంతో పాటు నిర్దేశించిన తేమశాతం వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డిఫాల్ట్ మిల్లర్లు బకాయి సీఎంఆర్ అప్పగిస్తేనే కొత్తగా ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. గత వానాకాలం సీజన్కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ నవంబర్ 12లోగా ఇవ్వాలని సూచించారు. మిల్లర్లు వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మాత్రమే దింపుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
పాన్గల్: నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీధర్, శ్రీరామ్, శోభారాథోడ్ రైతులకు సూచించారు. నాణ్యమైన విత్తనం.. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని మాందాపూర్, దత్తాయిపల్లిలో పర్యటించి రైతులు సాగు చేసిన కావేరి 1638 రకం వరి పంటను పరిశీలించారు. విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ప్రతి గ్రామానికి సరిపడా నాణ్యమైన విత్తనం గ్రామంలోనే సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, అఖిల, రైతులు పాల్గొన్నారు. -
రూ.6.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
అమరచింత: నియోజకవర్గంలో అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్కు మహర్దశ రానుంది. ఏళ్ల కిందట మరమ్మతుకు గురై ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించకుండా ఉన్న ఎత్తిపోతల మరమ్మతుపై మంత్రి వాకిటి శ్రీహరి దృష్టి సారించారు. మక్తల్ పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరడం.. రెండు నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు సంబంధిత శాఖ మంత్రిని కలవగా మరమ్మతుకు వెంటనే రూ.6.50 కోట్లు మంజూరు చేసి ఇందుకు సంబంధించిన జీఓ పత్రాలను సైతం ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రస్తుతం రూ.4 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని.. త్వరలో మరో రూ.2.50 కోట్లు రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జూరాల జలాశయం నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 2005లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టును రూపొందించి సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కాని పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు వినియోగించడంతో ఎక్కడికక్కడే పగిలి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ప్రతి ఏటా పైపులు పగిలి పంటలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో పైపుల మార్పునకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల కింద 2,800 ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఎత్తిపోతల నీటిని ఆయకట్టు రైతులకు అందించేందుకుగాను అంతర్గత పైప్లైన్లు వేయాల్సి ఉంది. పైపులు పగిలిపోవడం, లీకేజీలు ఏర్పడటంతో మంజూరైన నిధులతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. వీటితోపాటు అనేక చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లను బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ప్యానల్ బోర్డులు, పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు టెండర్ ప్రక్రియలో ఆలస్యం వినియోగంలోకి రానున్న నాగిరెడ్డిపల్లి, బెక్కర్పల్లి ఎత్తిపోతలు ఉమ్మడి లిఫ్ట్ ఆయకట్టు 15 వేల ఎకరాలు నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్చాల్సి ఉండగా.. చిన్న సంపుహౌజ్లు నిర్మించాల్సి ఉంది. కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో వీటికోసం రూ.2.85 కోట్లు ప్రతిపాదించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డు, పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పనులకు సంబంధించి రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి కూడా ఇవ్వడంతో నిధులు మంజూరయ్యాయి. -
స్వచ్ఛభారత్లో భాగస్వాములు కావాలి
వనపర్తి: గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచగలిగినప్పుడే జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛమైన ఆరోగ్య భారతావనిని నిర్మించగలమని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. స్వచ్ఛతా హి సేవా–2025లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. శనివారం ఉదయం లీడ్ బ్యాంక్ కార్యాలయం, జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అమ్మ చెరువు ట్యాంక్బండ్ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడికి వచ్చిన అధికారులు, ప్రజలు, అగ్నివీర్ శిక్షణ అభ్యర్థులు తదితరులతో కలిసి ప్లాస్టిక్, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు స్వచ్ఛతను పాటిస్తూ తోటి వారికి సైతం పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ట్యాంక్బండ్ పరిసరాల్లో ఉన్న చెత్త, ప్లాస్టిక్ కవర్లను తొలగించి ట్రాక్టర్లో డంపింగ్యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల శుభ్రతతో అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కరగకుండా, నీటిలో కలిసిపోకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తోందని.. ప్రజలు వాటి వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతేగాకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లు, కాల్వల్లో వేయకుండి తడి, పొడిగా వేరు చేసి మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని సూచించారు. సింగిల్యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జల్, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, సహాయ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు. -
మత్తు రహిత జిల్లాగా మారుద్దాం
● అసాంఘిక కార్యక్రమాల నియంత్రణపై దృష్టి ● దసరా సెలవుల్లో దొంగతనాలు జరగకుండా చూడాలి ● నేర సమీక్షలో ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో నెలవారి నేరసమీక్ష నిర్వహించి పెండింగ్ కేసులపై చర్చించారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించాలని, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రిపోర్టులు, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి ఛేదించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన ప్రజలకు, కృషి చేసిన సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా రానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ఉత్సవాల్లో డీజేలు వినియోగించకుండా చూడాలని, మండపాల వద్ద రాత్రిళ్లు నిర్వాహకులు ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి అధికారి పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రజలు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని, రౌడీలు, సస్పెక్ట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠిన చర్యలతో కట్టడి చేయాలని సూచించారు. దసరా సెలవుల్లో చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్తుంటారని.. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు కాబట్టి దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని కోరారు. సమీక్షలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, డీసీఆర్బీ, ఐటి కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ సర్వే వేగవంతం చేయాలి
వనపర్తి: భూ రికార్డులు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వేయర్లు భూ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలోని వివిధ మండలాల సర్వేయర్లతో భూ సర్వే, భూ సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎఫ్–లైన్ దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. అసైన్డ్, భూ దానం, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఏఐ మ్యాపింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని సూచించారు. సర్వే పనులు సకాలంలో పూర్తి చేయడంతోనే రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతమవుతుందన్నారు. సమావేశంలో ఏడీ సర్వే ల్యాండ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్దేశిత సమయానికి పంట కోతలు చేపట్టాలి.. కోత యంత్రాల నిర్వాహకులు వానాకాలం వరి కోతల్లో అధికారుల సూచనలు పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో పాటు కోత యంత్రాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు పచ్చిగా ఉన్నప్పుడే కోతలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, తేమ శాతం కీలకమన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ కాశీవిశ్వనాథం, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు. గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి.. 2024–25 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ గడువులోగా ఎఫ్సీఐకి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం వనపర్తి మండలం చిట్యాల శివారులోని పారాబాయిల్డ్ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, ఇప్పటి వరకు సరఫరా చేసిన బియ్యం వివరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు. సకాలంలో సీఎంఆర్ అప్పగించేందుకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. మిల్లర్లు కూడా తమవంతు కృషి చేయాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ -
యూరియా అక్రమంగా తరలిస్తున్నారంటూ..
కొత్తకోట రూరల్: రైతులు యూరియా కోసం తెల్లవారుజామున వచ్చి వరుసలో నిలబడి పడిగాపులు పడుతుంటే.. వారికి ఇవ్వకుండా రాత్రిళ్లు అక్రమంగా తరలిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని పీఏసీఎస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం పంటలు ముగింపు దశకు చేరుతున్న సమయంలోనూ రైతులకు సరిపడా యూరియా అందించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంటుందని, కొందరు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకొని రాత్రిళ్లు అక్రమంగా తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. యూరియాను రైతులకు సరఫరా చేయాలని, అక్రమంగా తరించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ సీఈఓ బాలరాజుకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గుంత మల్లేష్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ చీర్ల నాగన్నసాగర్, వహీద్, రాంచందర్, జనార్దన్ తదితరులు ఉన్నారు. -
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి. – హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా ధరలు పెరిగాయి.. భారంగా మారింది... ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది. – చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి) నాలుగు నెలలైనాబిల్లు రాలేదు.. ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాం. అధికారులు ఫొటో, వివరాలు తీసుకొని మూడు నెలలు అయింది. ఇప్పటివరకు బేస్మెంట్ బిల్లు రూ.లక్ష రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం. – ఆలేటి ఎల్లమ్మ, గట్టురాయిపాకుల, నాగర్కర్నూల్ జిల్లా ఆధార్కార్డుల్లో తప్పులతో ఇబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. – వైద్యం భాస్కర్, గృహనిర్మాణశాఖ పీడీ, మహబూబ్నగర్ ● -
ఆగని అన్నదాతల ఆందోళన
పాన్గల్: వ్యవసాయ పనులు నిలిపివేసి రోజుల తరబడి యూరియా కోసం సింగిల్విండో కార్యాలయానికి తిరుగుతున్న లభించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం పాన్గల్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వారికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్, సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని.. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రాస్తారోకోతో రహదారిపై వాహనాలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఎస్ఐ శ్రీనివాస్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ భాస్కర్గౌడ్, ఇన్చార్జ్ ఏఓ డాకేశ్వర్గౌడ్ అక్కడికి చేరుకొని మాట్లాడారు. ఇప్పటి వరకు సింగిల్విండో ద్వారా 21 వేల బస్తాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా 14 వేల బస్తాల యూరియా పంపిణీ చేశామని, ఇంకా 1,500 బస్తాలు వస్తుందని, రాగానే టోకన్లు పొందిన రైతులకు అందజేస్తామని, ఆందోళన చెందవద్దని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. -
అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎస్పీ..
తల్లిదండ్రులు గర్వించేస్థాయికి ఎదగాలి కొత్తకోట రూరల్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాతృభూమికి మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు సేవలు అందించేలా ఎదగాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. నిబద్ధత, కఠోర సాధన, ప్రణాళికబద్ధంగా చదివితే కలలను సాకారం చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పలువురు అందించిన నగదుతో తరగతి గదులు, పాఠశాల గోడలపై పిల్లల్ని ఆకర్షించేలా పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు, శాస్త్రవేత్తల చిత్రాలు గీయించారు. వాటిని ఆయన తిలకించడంతో పాటు విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అంతకుముందు పాఠశాలకు వచ్చిన ఎస్పీకి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తరగతి గదిలోనే ఉజ్వల భవిష్యత్ ఉందని, ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మంచి పుస్తకం, మంచి స్నేహితుడిని ఎంచుకుంటే చాలా సాధించవచ్చన్నారు. ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు చాలావరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవారేనని తెలిపారు. విజయం సాధించిన వారి జీవితాలను విద్యార్ధులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం సహకరించిన యువత, ప్రధానోపాధ్యాయుడిని ఎస్పీ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులత, ఎస్ఐ శివకుమార్, ఏసీటీఓ ప్రసన్నరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జీకే శ్రీనివాస్, రోజారాణి, కిరణ్కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు పాల్గొన్నారు. వనపర్తి: బీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌక్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఎస్పీ రావుల గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబి శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భావిస్తారన్నారు. ప్రజలంతా ఐక్యత, స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఈ నెల 5న మిలాద్ ఉన్ నబి, అదే రోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున ముస్లింలు గొప్ప ఔదార్యాన్ని చాటుతూ అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారానికి మార్చుకోవడం హర్షణీయమన్నా రు. కార్యక్రమంలో ఎండీ బాబా, చాంద్పాషా, ఎండీ గౌస్, ఎండీ ఆరీఫ్, సుల్తాన్, మహబూబ్ పాషా, నవాజ్. ఫయాజ్. సోహెల్, సమీర్, రిజ్వాన్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
● ఇద్దరు రెవెన్యూ అధికారులపై లంచం కేసు నమోదు కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారుల వలకు లంచగొండి ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్కు చెందిన ఓ వ్యక్తి తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్కే జిలాని, కిషన్నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక
వనపర్తి రూరల్: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పెబ్బేరు పీజేపీ క్యాంపు మైదానంలో సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు కోచ్ నాగరాజు తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 45 మంది క్రీడాకారులు హాజరుకాగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎంపికల్లో నైపుణ్యం కనబర్చిన వారిని క్యాంపునకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచి క్యాంపు కొనసాగుతుందన్నారు. ఎంపికల్లో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకుమార్రెడ్డి, నందిమళ్ల తిరుప తి, కోశాధికారి అఫ్సర్, ఉపాధ్యక్షులు సురేందర్రెడ్డి, పీడీ రాజేందర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ చేయాలివనపర్తి రూరల్: జిల్లాలో రేషన్ డీలర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వర్తించాలని గురువారం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో అనేకమంది రేషన్ డీలర్లను తొలగించారని, మరికొందరు 6ఏ కేసులు నమోదై సస్పెన్షన్లో ఉన్నారని చెప్పారు. రేషన్ దుకాణాల డీలర్లు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాల్సి ఉండగా.. ఇతరులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యతలో మెలగాల్సిన పలువురు డీలర్లు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వివిధ మండలాల అధ్యక్షులు దేవర శివ, అంజన్నయాదవ్, మహేందర్నాయుడు, నాగరాజు, యశ్వంత్, రాములు, రంగన్న, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేతసాక్షి, నాగర్కర్నూల్/ మహబూబ్నగర్ (వ్యవసాయం): మహబూబ్నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. -
గోపాల్పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
గోపాల్పేట: మండల కేంద్రంలోని పీఏసీఎస్లో రెండురోజులుగా యూరియా లేదు. గురువారం సైతం రాదని తెలియడంతో రైతులు పీఏసీఎస్ ఎదుట ఉన్న బీటీ రోడ్డుపై ఆందోళన చేపట్టగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి యూరియా తెప్పించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పాండునాయక్ అక్కడకు చేరుకొని యూరియా శుక్రవారం వస్తుందని చెప్పినా రైతులు, బీఆర్ఎస్ నాయకులు వినిపించుకోలేదు. స్థానిక అధికారులు జిల్లా అధికారులకు ఫోన్చేసి శుక్రవారం తప్పకుండా పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆందోళనతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
‘పాలమూరు’పై చర్చకు సిద్ధం : ఎమ్మెల్యే
వనపర్తి: బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని, నిర్మాణ పనులపై చర్చకు సిద్ధమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్ విసిరారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఎల్వోసీలను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని.. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నేతలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతోందని.. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి రూ.50 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు శంకర్ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
వనపర్తిటౌన్: ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు చట్టాలపై అవగాహన కల్పించాలని.. తద్వారా విద్యార్థులు ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్నతంగా రాణించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పోక్సో, మోటార్ వెహికల్ యాక్ట్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, ఏఎంఓ మహానంది, ప్రజ్వల సంస్థ కో–ఆర్డినేటర్ అంబర్సింగ్, ఇన్చార్జ్ కృష్ణవేణి, రిసోర్స్ పర్సన్ శ్రీలత, పారా లీగల్ వలంటీర్ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాతీరానికి సొబగులు
కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాయి. నిధుల కేటాయింపు.. వెల్నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం రూ.45.84 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, నడింతిప్ప ప్రాంతాల్లో కృష్ణానది మధ్యలో గల దీవిలో పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇక్కడ యోగా డెక్, పెవిలియన్, స్పా ఏరియా, కాటేజీలు, సిబ్బంది వసతి గృహాలు, స్విమ్మింగ్పూల్, ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూంలు, బోట్లు నిలిపేందుకు జెట్టీలు, వివిధ రకాల చెట్లతో గార్డెనింగ్ వంటి పనులు సుందరంగా చేపట్టనున్నారు. అదేవిధంగా సోమశిలలో వీఐపీ ఘాట్కు పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.1.60 కోట్లతో ఘాట్ విస్తరణ, బోటింగ్ వసతులు మెరుగుపర్చే పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఇటీవలే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కన్సల్టెన్సీలతో సంప్రదింపులు.. పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు పలు కన్సల్టెన్సీలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్తోపాటు ఇతర నగరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పర్యాటక శాఖ అధికారులను సంప్రదించారు. ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టే వారికే ఈ పనులు అప్పగించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కన్సల్టెన్సీల ప్రతినిధులు అమరగిరి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. హెలీ టూరిజంతో ప్రాముఖ్యత.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు హెలీ టూరిజం ప్రారంభిస్తామని ఇటీవల రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. నల్లమల అడవి, కృష్ణానది అందాలు తిలకిస్తూ సాగే హెలీ టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నదిలో లాంచీ ప్రయాణం ఏర్పాటు చేయగా..హెలీ టూరిజం ఏర్పాటుతో జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రహదారుల నిర్మాణం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటిలో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, జటప్రోల్, సింగోటం వంటి ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వస్తున్నారు. అమరగిరిలో పెద్దఎత్తున పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లే రహదారిని బాగుచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.80 కోట్లతో అమరగిరికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. రోడ్డు వెంట ఉన్న కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. బీటీ నిర్మించాల్సి ఉంది. అలాగే పెంట్లవెల్లి నుంచి మంచాలకట్టకు వెళ్లే రోడ్డును కూడా బాగుచేసేందుకు రూ.1.40 కోట్లు కేటాయించారు. రహదారులు, పర్యాటక అభివృద్ధి పనులు పూర్తయితే కొల్లాపూర్ పర్యాటకంగా మరింతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సోమశిలలోని వీఐపీ ఘాట్ సమీపంలో నిలిపిన పర్యాటక బోట్లు పనుల అప్పగింతపై చర్చలు.. సోమశిల, అమరగిరిలో పర్యాటక అభివృద్ధి పనులు కన్సల్టెన్సీలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కొల్లాపూర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అమరగిరిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కృష్ణానది తీరం వెంట ఉండే పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. – నర్సింహ, జిల్లా పర్యాటకశాఖ అధికారి, నాగర్కర్నూల్ కృష్ణానది పరివాహకంలో పర్యాటకం అభివృద్ధికి నిధులు అమరగిరి, సోమశిలలో వసతుల కల్పనకు చర్యలు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్న కన్సల్టెన్సీలు పర్యాటక గ్రామాలకు వెళ్లే రహదారుల ఏర్పాటుకు శ్రీకారం -
అప్రమత్తతతోనే విద్యుత్ ప్రమాదాల నియంత్రణ
వనపర్తి: వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 11 మంది రైతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారన్నారు. రైతులు వర్షాకాలంలో తడిగా ఉండటం గమనించక మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తాకడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. యజమాని మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడుతోందని.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు గ్రామాల్లో విధిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ బ్రాంచి సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి
వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న, దొడ్డు రకం మొత్తం 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. ఐకేపీ, మెప్మా, పాక్స్ తరఫున ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై నివేదిక అందజేయాలని సూచించారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అన్ని కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. టెంట్, తాగునీరు, గన్నీ బ్యాగులు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, క్యాలిపర్స్, క్లీనర్లు, టార్పాలిన్లు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, బరువు కొలిచే యంత్రాలు, ఇతర పరికరాలు అదనంగా అవసరం ఉంటే ముందుగానే ఇండెంట్ ఇవ్వాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏఈఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, కోత యంత్రాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి శిక్షణ ఇవ్వాలన్నారు. పంట కోతలు మొదలయ్యే నాటికి ధాన్యం కొనుగోలుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ ఆంజనేయులుగౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, డీసీఓ రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
జిల్లాలో 5 పురపాలికలు.. 31 ఖాళీలు
● గ్రామపాలన అధికారుల నియామకంతోనే.. ● ఉన్న వారిపై అదనపు పనిభారం ● పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో సతమతమవుతున్న వైనం ●అమరచింత: బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూశాఖలో ధరణిని అందుబాటులోకి తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వారినివివిధ విభాగాల్లో భర్తీ చేశారు. చాలామందిని పురపాలికల్లో వార్డు అధికారులుగా నియమించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి భూ భారతిని తీసుకొచ్చి గ్రామపాలన అధికారులను నియమించింది. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న వీఆర్వోలకు తాజాగా ఎంపిక పరీక్ష నిర్వహించి తిరిగి గ్రామపాలన అధికారులుగా గ్రామాలకు కేటాయించడం, నియామక పత్రాలు అందించడంతో వారంతా ఆయా గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే గతంలో గ్రూప్–4 ద్వారా నియామకమైన వార్డు అధికారుల్లో కొందరు నేటికీ విధుల్లో చేరకపోవడం, ఉద్యోగంలో చేరిన వారు దీర్ఘకాలిక సెలవులు, డిప్యుటేషన్పై వెళ్లడంతో పురపాలికల్లో నిర్వహణ భారంగా మారుతోంది. ఆస్తి పన్ను వసూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో పాటు స్వచ్ఛ కార్యక్రమాలను పుర కమిషనర్లే ముందుండి సిబ్బందితో చేయిస్తున్నారు. సమస్యల గుర్తింపులో ఇబ్బందులు.. వార్డు అధికారులు లేక ఆయా కాలనీల్లో సమస్యలు గుర్తించడంతో పాటు పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, మురుగు కాల్వల శుభ్రతతో పాటు ఇంటి నిర్మాణాల అనుమతులు తదితర విషయాలను వార్డు అధికారుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాలనీవాసులే నేరుగా పుర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తేనే తెలుస్తోందని పుర ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రోజువారి నివేదిక అందించే బాధ్యతను జిల్లా అధికారులు వార్డు ఆఫీసర్లకే కేటాయించడంతో జిల్లా లబ్ధిదారుల ఇళ్ల చుట్టే తిరగడానికే కాలం గడిచిపోతుందని.. మిగిలిన పనులు ఎలా పూర్తి చేయాలని వార్డు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం, హౌసింగ్ సూపర్వైజర్లకు సహకరించడం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించడం వంటి పనులతో సతమతమవుతున్నారు. పురపాలికల వారీగా ఖాళీలు ఇలా.. వార్డు ఆఫీసర్ల కొరతతో ఇంటి, కొళాయి పన్ను వసూళ్లలో జాప్యం జరుగుతోంది. ఇంతవరకు వార్డు అధికారులు పుర కార్మికులను వెంట బెట్టుకొని ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూళ్లు చేపట్టేవారు. ప్రస్తుతం ఉన్న అధికారులకు ఒక్కొక్కరికి రెండు వార్డులు కేటాయించి పన్ను వసూళ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగించడంతో పనిభారం అధికమై సతమతమవుతున్నారు. -
ఆగ్రహించిన అన్నదాతలు
● టోకన్లు ఇచ్చి యూరియా ఇవ్వరా అంటూ.. రహదారిపై బైఠాయించి ఆందోళన ● మద్దతు తెలిపిన మాస్లైన్, సీపీఐ నాయకులు అమరచింత: మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవాకేంద్రం నిర్వాహకుడు మూడురోజుల కిందట ఇచ్చిన టోకన్లకు గురువారం కూడా యూరియా ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మాస్లైన్, సీపీఐ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం యూరియా కొరత ఉందన్నారు. యూరియా పంటలకు సకాలంలో వేయకపోవడంతో ఎదుగుదల లోపించిందని తెలిపారు. టోకన్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పడమే తప్పా అంతర్గతంగా బడా రైతులు అధికంగా తీసుకెళ్తున్నారని, అరికట్టే వారు కరువయ్యారన్నారు. మండలంలో ప్రస్తుతం వరితో పాటు చెరుకు సాగు అధికంగా ఉందని.. సకాలంలో అందక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయని వివరించారు. యూరియా కోసం వచ్చిన మహిళా రైతులు తెచ్చుకున్న ఆహారం అక్కడే తింటూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏఓ అరవింద్ రైతులతో మాట్లాడి యూరియా అందరికి అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాస్లైన్ మండల కార్యదర్శి రాజన్న, డివిజన్ కోశాధికారి రాజు, సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సస్పెన్షన్
వనపర్తి: జిల్లా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.విజయ్కుమార్ ఓ ఆధార్ కేంద్రం ఏర్పాటుకు అనుమతికిగాను రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని ఆధారాలు లభించడంతో ఈడీఎస్ కమిషనర్ రవికిరణ్ ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈడీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. కొత్తవారిని నియమించే వరకు మహబూబ్నగర్ ఈడీఎం చంద్రశేఖర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మీ–సేవా కేంద్రాలు, ఆధార్ సెంటర్ల నిర్వాహకుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహబూబ్నగర్ ఈడీఎం వద్ద ప్రస్తావించగా.. విషయం నిజమే నని గురువారం జిల్లాలో జాయినింగ్ రిపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ను వివరణ కోరగా.. సమాచారం వచ్చిందని, ఇప్పటి వరకు లేఖ రాలేదన్నారు. ఈడీఎంను తొలగిస్తున్నట్లు వచ్చిన ఉత్తర్వుల ప్రతి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో నేషనల్ గ్రీన్ కోర్ కో–ఆర్డినేటర్ సుదర్శన్ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నందుకుగాను ఆయనను అభినందించి మాట్లాడారు. విద్యతో పాటు సామాజిక, పర్యావరణ అంశాలను జోడించి అవగాహన పెంచాలన్నారు. ఈ నెల 15న రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం గ్రీన్ కో–ఆర్డినేటర్లు పర్యావరణ పరిరక్షణలో ఎలా ముందుండాలో సూచించారని, అందుకు అనుగుణంగా పని చేయాలని కోరారు. ● మహబూబ్నగర్ అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు -
సమన్వయంతోనే సమస్యల పరిష్కారం
వనపర్తి: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపురం మండలాలకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్ ఆదర్శ్ సురభి సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తకోట మండలానికి చెందిన పలువురు విద్యుత్ అంతరాయం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా, మున్సిపల్ కాంప్లెక్స్ భవనం ఏర్పాటు, సంతకు స్థలం కేటాయింపు తదితర సమస్యలను వారికి వివరించారు. వెంకటగిరి ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మించాలన్నారు. మదనాపురంలో బస్టాండ్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలని మండలవాసులు కోరారు. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలు, తాగునీటి సమస్య వేధిస్తోందని.. పరిష్కరించాలని సూచించారు. దుప్పల్లిలో పశు వైద్యశాల, గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరి ఆలయానికి రహదారి, వారాంతపు సంత నిర్వహణకు స్థలం కేటాయింపునకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కలెక్టర్ను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులతో త్వరగా మొదలు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. చిన్న చిన్న కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. పరిష్కరించాలని కోరారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా చొరవ తీసుకుంటున్నందుకు కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కానాయిపల్లి ఆర్అండ్ఆర్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అత్యధికంగా 72 శాతానికిపైగా కొత్తకోట మండలంలో జరిగిందని ఇది మంచి పరిణామమన్నారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్ రోడ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ ఎస్ఈని ఆదేశించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1912ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మదనాపురం మండల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, కొత్తకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, కతలప్ప, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రుల వద్ద బ్యానర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్గా మారింది. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, ఎస్టిమేషన్ వివరాలు జిల్లా చేసిన బకాయిలు సర్జరీలు (రూ.లలో..) గద్వాల 527 1,02,78,990 మహబూబ్నగర్ 19,032 46,95,71,170 నాగర్కర్నూల్ 133 34,03,362 నారాయణపేట 275 1,02,52,882 వనపర్తి 603 1,94,18,046 బకాయిలు రూ.కోట్లకు చేరడంతో ప్రైవేట్ ఆస్పత్రుల విముఖత వైద్యసేవల నిలిపివేతతో పేదలకు ఆర్థిక ఇబ్బందులే.. మొదటిరోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు? -
విశ్వకర్మలు అన్నిరంగాల్లో రాణించాలి : ఎస్పీ
వనపర్తి: విశ్వకర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనను ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించి పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ మనుగడలో విశ్వకర్మల చేతివృత్తులు ప్రధాన భూమిక పోషించాయని, యాంత్రిక ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులకు ప్రాధాన్యం తగ్గి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. సమస్యలను అధిగమించాలంటే తమ పిల్లలు గొప్పగా చదువుకునేందుకు ప్రోత్సహించాలని, అంతేగాక తాము సంపాదించిన సొమ్మును భూమి కొనుగోలుకు వెచ్చించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంస్కారవంతమైన జీవనాన్ని సాగించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ, స్వర్ణకార సంఘం, బులియన్ మర్చంట్ ప్రతినిధులు ఎస్పీని సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు, దేవాలయ, విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి కృషిచేసిన వారిని ఎస్పీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో డా. పోతేదారు యాదాచారి, దర్శనోజు సత్యనారాయణ, వేణు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, బైరోజు చంద్రశేఖర్, డా. శ్యాంసుందర్, కొండోజు గోపినాథ్, నారాయణదాసు గోవర్ధనాచారి, చెన్నయ్యచారి, వీరాచారి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.నిండుకుండలా రామన్పాడు జలాశయంమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు.ప్రైవేట్కు ధీటుగా ఉత్తీర్ణత సాధించాలిఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు బాగా చదివి ప్రైవేట్కు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని, దేశం గర్వించేస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, గురువులు, తమ ఊరికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరగా డీఐఈఓను కళాశాల అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాగ్యవర్ధన్రెడ్డి, టీజే విశ్వేశ్వర్, జమ్మన్న, రాఘవేందర్రావు, శ్వేత, వీణ, లలితమ్మ, ఏకే కురుమూర్తి, చైతన్యరాణి, పావని, సునీల్రెడ్డి, రాఘవేంద్ర, రామన్గౌడ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి టీఎల్ఎం మేళాకు ముగ్గురు ఎంపికపాన్గల్: జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాలో మండల విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో గోప్లాపూర్ యూపీఎస్ విద్యార్థి కార్తీక్ ప్రథమ బహుమతి, ఇంగ్లీష్ విభాగంలో బుసిరెడ్డిపల్లి పీఎస్ విద్యార్థి శిరీష ద్వితీయ బహుమతి, గణిత విభాగంలో వెంగళాయిపల్లి పీఎస్ విద్యార్థి రాణి ద్వితీయ బహుమతి సాధించినట్లు పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు, ఉపాధ్యాయులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి టీఎల్ఎం మేళాలో పాల్గొంటారని చెప్పారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తి: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. ● జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని.. మొత్తం ప్రయాణికుల్లో 64.28 శాతం మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా రూ.97.54 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. 85 వేల మందికి 2,34,879 గ్యాస్ సిలిండర్లు రూ.500కే పంపిణీ చేశామని.. దీనికిగాను ప్రభుత్వం రూ.6.56 కోట్ల రాయితీ అందించిందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకుగాను మహిళాశక్తి పథకంలో భాగంగా 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను మంజూరు చేశామని.. వీటి ద్వారా ప్రతి సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల ఆదాయం వస్తుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ.. జిల్లాలో ఇప్పటి వరకు 17,490 కొత్త రేషన్ కార్డులను జారీ చేయగా.. 45,576 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. అలాగే ప్రస్తుత కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని.. జిల్లాలో 2024, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్లలోపు విద్యుత్ అందిస్తున్నామని.. జిల్లాలో ఇప్పటి వరకు 82,708 కుటుంబాలకు సంబంధించి రూ.30.48 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అదేవిధంగా కొత్తగా 33 కేవీ సామర్థ్యం గల 29 ఉప కేంద్రాలు రూ.45.43 కోట్లతో నిర్మిస్తున్నామని.. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,173 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయగా.. 3,731 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.26.73 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతుభరోసా.. రైతును రాజు చేసేందుకు రైతుభరోసా, పంట రుణమాఫీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్లో 1,75,869 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.205 కోట్ల 93 లక్షల 79 వేలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకంలో భాగంగా 2024–25 సంవత్సరానికిగాను 681 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.34.05 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పంట రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 4 విడతల్లో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు చెప్పారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు జిల్లా ప్రగతి నివేదిక చదువుతున్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని.. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 1,943 దరఖాస్తులు రాగా.. 1,207 పరిష్కరించామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనను అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. వనపర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానించి నేరాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. సఖి, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నామని.. సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను అరికడుతున్నట్లు వివరించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రత్యేక పోలీస్ బృందం నిఘా ఉంటుందని.. మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నందుకు జిల్లా పోలీస్శాఖను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
ఆరోగ్య మహిళ.. ప్రభుత్వ ధ్యేయం
● ‘స్వస్త్ నారి.. సశక్త్ పరివార్ అభియాన్’ ప్రారంభం ● సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఖిల్లాఘనపురం: దేశంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం మండల కేంద్రంలోని సీఎస్సీ ఆవరణలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అక్కడికి వచ్చిన మహిళలు, బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే శక్తి మహిళకే ఉంటుందని, అలాంటి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 2 వరకు పుట్టిన బిడ్డ నుంచి అన్ని వయసుల మహిళలకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేక వైద్య నిపుణులు వచ్చి మహిళలకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని.. అన్ని విద్యాలయాలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాకేంద్రంలో సీటీ స్కాన్ సెంటర్.. ఎంపీ మల్లు రవి చొరవతో యూనియన్ బ్యాంక్ సహకారంతో జిల్లాకేంద్రంలో రూ.2.50 కోట్లతో సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వైద్య శిబిరంలో 12 రోజుల పాటు క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, దంత, క్షయ, మధుమేహం తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను మండలంలోని సోళీపురంలో 6 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మండల వైద్యులు డా. చైతన్య, ఆస్పత్రి సూపరింటెండెంట్, మండల సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, డైరెక్టర్ సాయిచరణ్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పోషణ మాసం ప్రారంభం మండల కేంద్రంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. అంగన్వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. త్వరలోనే మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.. రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లడిల్లిన అప్పంపల్లి అమరవీరులకు గుర్తింపేది? -
నేడు బైక్ ర్యాలీ : సీపీఎం
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కూలీలు, కార్మికుల అడ్డాల దగ్గర ర్యాలీపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు వనపర్తి అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. 1948, సెప్టెంబర్ 17 వరకు నిజాం రాజ్యంగా ఉందన్నారు. సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనమైనందున విలీన దినాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు బాబు, లక్ష్మన్న, నర్సింహ, సిద్ధు, బీసన్న, నాగన్న, సూరి, దొరస్వామి, లింగస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.స్కాలర్షిప్స్ చెల్లించాలని విద్యార్థుల ఆందోళనవనపర్తి: బకాయి ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వచ్చి మాట్లాడాలని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు పట్టుబట్టారు. ఏఓ భానుప్రకాష్ విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వారు గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకొని అక్కడే కూర్చోబెట్టారు. సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యేకొత్తకోట రూరల్: పట్టణంలోని వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పక్కా భవనాల నిర్మాణాలకు కృషి చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్జే బోయేజ్, పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు మేసీ్త్ర శ్రీనివాసులు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి మంగళవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వసతిగృహ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, అంచనాలు సిద్ధం చేసి తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. అడిగిన వెంటనే ఎమ్మెల్యే స్పందించినందుకుగాను స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. -
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు. – అంజన్న, ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి పోరాటంలో ఎంతో పాత్ర.. తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు. – సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి -
ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టరేట్ ముస్తాబు
వనపర్తి: ప్రజాపాలన దినోత్సవ నిర్వహణకు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో బుధవారం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, జాతీయ గీతాలను ఆలపిస్తారు. వేడుకలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. -
నేరాల నియంత్రణలో ఉపాధ్యాయులది కీలక పాత్ర
వనపర్తి: సమాజంలో చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో ఉపాధ్యాయులది కీలకపాత్రని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్శాఖ తరఫున ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని, థర్డ్ పేరెంట్గా వ్యవహరించాలని, ఎల్లప్పుడూ వారిపై దృష్టి సారించి తప్పుడు మార్గంలో పయనించకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే హెల్ప్లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించాలన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఉత్తమ వనపర్తి నిర్మాణానికి సహకరించాలని కోరారు. జిల్లాలో అనేక విషయాల్లో కలెక్టర్ సహకారం పోలీస్శాఖకు అందుతుందని.. ఈ ఏడాది సైబర్ నేరాలను కూడా గణనీయంగా తగ్గించగలిగామని, ఇప్పుడు పోక్సో కేసులను కూడా తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చట్టాలపై ఉపాధ్యాయులకు ఉన్న సందేహాలను ఎస్పీ నివృత్తి చేశారు. పొక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన స్కిట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, డీసీపీఓ రాంబాబు, చైల్డ్ చాప్టర్ ఎన్జీవో సంస్థ అధినేత జాకీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యతోనే సమస్యల పరిష్కారం : డీఐఈఓ
పాన్గల్: విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతోందని.. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) అంజయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హైదరాబాద్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వారు రూ.1.80 లక్షల విలువైన తాగునీటి సీసాలు, రాత పుస్తకాలు, రెండు బీరువాలు, ప్రింటర్, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఆస్పత్రి యాజమాన్యం కళాశాలకు సామగ్రి అందించడం అభినందించదగిన విషయమన్నారు. ఇంటర్ విద్య విద్యార్థికి పునాది లాంటిదని.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా అధ్యాపకులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమల్రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు. -
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. స్మరించుకోని పాలకులు.. నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
కుటుంబ సభ్యులే వైద్య సేవకులై..
జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. మంగళవారం ఆస్పత్రికి నడవలేని స్థితిలో వచ్చిన వారిని కుటుంబ సభ్యులే స్ట్రక్షర్పై తీసుకెళ్లడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించేందుకు వెళ్లగా సారు సమావేశంలో ఉన్నారు.. కలవడం కుదరదని సిబ్బంది చెప్పడం కొసమెరుపు. – వనపర్తి -
‘విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించరా?’
వనపర్తిటౌన్: తాము అధికారంలోకి వస్తే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతోన్మాద ఎంఐఎంకు భయపడి పార్టీ కార్యాలయాల్లో తప్ప అధికారికంగా జరగడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థానం నిజాం రాజులు తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించకుండా, జాతీయ నినాదం, జెండాను ఎరగనివ్వకుండా, ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు యత్నించారని చెప్పారు. నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్పటేల్ ఆపరేషన్ పోలో సైనిక చర్యతో నిజాంలు లొంగారని.. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. పెద్దిరాజు, కుమారస్వామి, గజరాజుల తిరుమల్లేష్, రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
ఐక్యతతోనే అభ్యున్నతి సాధ్యం
రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ వనపర్తి: క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండి అభ్యున్నతి సాధించాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనానన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మతపెద్దలతో నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. జిల్లాలోని క్రిస్టియన్లు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్జాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతోందని, అన్ని కులాలను సమానంగా ఆదరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెంకటాపూర్లో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అన్ని మండలాలు, గ్రామాల్లో క్రైస్తవుల సమాధులకు స్థలం కేటాయించాలని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. క్రైస్తవులకు బీసీ(సీ) కుల ధ్రువీకరణపత్రం జారీ విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాధుల కోసం జిల్లాకేంద్రంలో ఇప్పటికే 2 ఎకరాల స్థలం కేటాయించామని.. ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలో గుట్టలు, రాళ్లు ఉన్నందున చదును, మౌలిక వసతుల కల్పనకు మరో రూ.30 లక్షల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమడబాకులతండాలో క్రైస్తవ ప్రార్థనా మందిరానికి అనుమతి ఇచ్చామని.. వెంకటాపూర్లో సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో క్రైస్తవులు అణచివేతకు గురవుతున్నారని, కుల ధ్రువీకరణ పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వివక్షకు గురవుతున్నామన్నారు. జెరూసలేం యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. క్రైస్తవులు తమ ఇళ్లలో ప్రార్థనలు చేసుకునే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్ పాల్గొన్నారు. -
మహిళల కోసం మెగా వైద్య శిబిరం
ఖిల్లాఘనపురం: ‘స్వస్త్ నారి.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం సీహెచ్సీని, వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లను స్థానిక వైద్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లావ్యాప్తంగా 98 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి మహిళలకు వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. శిబిరాల్లో 19 మంది ప్రత్యేక వైద్య నిపుణులు, మండల వైద్యులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. -
హే కృష్ణా.. ఇకనైనా!
●సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. సుమారు 12 వేల జింకలు.. కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్, మక్తల్ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, కాయలు, తీగలు.. కృష్ణ జింకలు పంట పొలాల్లో తిరగాడే క్రమంలో చేలల్లో మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో నాలుగైదు పర్యాయాలు విత్తనాలు వేయడం ఆయా రైతులకు ఏటా పరిపాటిగా మారింది. ఇంతే కాకుండా.. పత్తి కాయలు, కంది కాయలను సైతం జింకలు ఆహారంగా తీసుకుంటుండడంతో పంటలు సరిగ్గా చేతికి రావడం లేదు. వరి పంటలో గుంపులు గుంపులుగా జింకలు తిరుగుతుండడంతో వేసిన తీగలు తెగిపోయి నష్టం వాటిల్లుతోంది. దిగుబడి తగ్గుతుండడంతో ఆ రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. పంటలు కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రతి ఏటా నష్టం వాటిల్లుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎట్టకేలకు ముందడుగు.. కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. కృష్ణానది పరీవాహకంలో అన్నదాతల అగచాట్లు విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు.. ఆదేశాలకే పరిమితం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం నష్టంతో పాటు నిత్య కాపలాతో రైతులకు తప్పని తప్పలు మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి. – అంపయ్య, గుడేబల్లూరు, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
అక్టోబర్ 15 వరకు..
ముడుమాల్ వద్ద రిహాబిలిటేషన్ సెంటర్కు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి.. వచ్చేనెల 15 వరకు పనులు మొదలుపెడుతాం. దీంతోపాటు ఎక్కడైతే కృష్ణ జింకలు ఎక్కువ ఉన్నాయో.. అక్కడ మినీ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్కు.. ఆ తర్వాత క్రమంగా నల్లమల లేదా కవ్వాల్ అడవులకు తరలిస్తాం. నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మినీ రిహాబిలిటేషన్ సెంటర్ కోసం పది ఎకరాల్లో భూమి గుర్తించాం. ఇక్కడ పైలెట్ ప్రాజెక్ట్గా ఈ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – అరవింద్రెడ్డి, డీఎఫ్ఓ, నారాయణపేట నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – బస్లింగప్ప, చేగుంట, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా -
‘పీఎం దక్ష’తో దివ్యాంగులకు ప్రయోజనం
వనపర్తి రూరల్: దివ్యాంగులు పీఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. సోమవారం పెబ్బేరు మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానసిక, శారీరక దివ్యాంగ బాలలను పునరావాస కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ్ జన్కౌశల్ వికాస్ పథకం గురించి వివరించారు. దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని.. టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వాహనాలు, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మహాత్మా జోతిబాపూలే పాఠశాలను సందర్శించి లీగల్ లిటరసీ క్లబ్ను ప్రారంభించి క్లబ్లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వర్తించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఓబుల్రెడ్డి, హెచ్ఎం కవిత, లీగల్ వలంటీర్లు సుశీల, శేఖరాచారి పాల్గొన్నారు. -
స్వచ్ఛత.. ప్రతి ఒక్కరి బాధ్యత
అమరచింత: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ఇళ్లలోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా పురపాలిక ఆటోలు, ట్రాక్టర్లలో వేసి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో అమరచింత పురపాలికకు కేటాయించిన 2 ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పురపాలిక పరిశుభ్రంగా ఉండేందుకు పుర కార్యాలయాలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, ఆటోలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పురపాలికలకు మాత్రమే వాహనాలు కేటాయించగా అందులో అమరచింత ఉండటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పుర మేనేజర్ యూసుఫ్, పీసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ కార్యదర్శి అయ్యూబ్ఖాన్, మహేందర్రెడ్డి, అరుణ్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, విష్ణు, మోహన్, తౌఫిక్, అశు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 40 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
● మూడుముళ్ల బంధంతో బాలల భవిష్యత్ నాశనం చేయొద్దు ● ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: బాల్యవివాహాలకు బాధ్యులైన తల్లిదండ్రులు, బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకోవాల్సిన వయసులో ఆడపిల్లలను పెళ్లి పీటలు ఎక్కించి వారి బంగారు భవిష్యత్ను నాశనం చేయొద్దన్నారు. ఆడపిల్లలను ఎప్పుడూ ఇంటికి భారంగా అనుకోవద్దని అన్నారు. 18ఏళ్లు నిండని బాలికలు కుటుంబ బాధ్యతలు స్వీకరించే స్థితిలో కూడా ఉండరని.. శారీరకంగా బలంగా ఉండకపోవడం వల్ల దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఆడపిల్లలను ఉన్నతంగా చదివించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని సూచించారు. జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా వీల్లేదన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు చేసేందుకు యత్నిస్తే బాధ్యులైన తల్లిదండ్రులతో పాటు బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్యవివాహాల నియంత్రణ కోసం గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీ (వీసీపీసీ), మండల బాలల పరిరక్షణ కమిటీ (ఎంసీపీసీ) ఏర్పాటుచేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణకు హెల్ప్లైన్ నంబర్ 1098 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా బాలికలు, మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జాతీయ లోక్అదాలత్లో 2,737 కేసుల పరిష్కారం.. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదై కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 171, డ్రంకెన్ డ్రైవ్, మోటార్ వెహికిల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 514, సైబర్ క్రైం 45 కేసుల్లో రూ. 15,10,698 బాధితుల అకౌంట్కు రీఫండ్ చేయడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. 15 రోజుల నుంచి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది ఆయా కేసుల్లోని కక్షిదారులను స్వయంగా కలిసి జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్అదాలత్లో 2,737 కేసులను పరిష్కరించడం జరిగిందని.. ఈ కేసుల పరిష్కారంలో చక్కగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్, సంగంబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్ను ఎల్లూరు నుంచి మహబూబ్నగర్, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు. భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. అనంతరం సీవీఆర్ భవన్కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. రిలే దీక్షలను విరమింపజేసిన మంత్రి సీఎం రేవంత్రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ ● నేడు, రేపు ప్రత్యేక చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్కల్వకుర్తి టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్లో వివరాలను పొందుపరిచారు. నేరుగా రిపోర్టు.. దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చి న రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్ర క్రియలో పాల్గొనే అవకాశం ఉండదని ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేవాలి స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
అద్భుతం.. ఆ కట్టడాలు
వనపర్తిసరళమైన కోయిల్సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025