Sangareddy
-
కలెక్టర్గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి జోన్: జిల్లా నూతన కలెక్టర్గా ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఐబీ గెస్ట్ హౌస్కు వచ్చిన కలెక్టరుకు అదనపు కలెక్టరు చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డి పూల మొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తన చాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పద్మజారాణి, సాయిబాబా, జ్యోతి, అఖిలేశ్రెడ్డి, ఐనేశ్, వెంకటేశ్వర్లు, లలితకుమారి పాల్గొన్నారు. మంత్రి వాకిటికి ఎంపీ షెట్కార్ సన్మానంనారాయణఖేడ్: రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరిని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా మంత్రి ఎంపీని సత్కరించారు. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలపాత్ర పోషించాలని, జహీరాబాద్ పార్లమెంట్, ఖేడ్ అసెంబ్లీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ ఆకాంక్షించారు. ఎంపీ షెట్కార్ వెంట జిల్లా దిశ కమిటీ సభ్యులు ప్రకాశ్ రాథోడ్, నాయకులు హన్మంత్రావు, పీకే రావు, రవి ఉన్నారు. అదనపు డీఆర్డీఓ బదిలీసంగారెడ్డి టౌన్: సంగారెడ్డిలో జిల్లాలో అదనపు డీఆర్డిఓగా విధులు నిర్వహించిన జంగారెడ్డి శుక్రవారం బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అదనపు డీఆర్డీఓ సూర్యారావు రానున్నారు. పెట్టుబడిదారుల కోసమే లేబర్ కోడ్లుసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: శ్రామికుల శ్రమను దోచుకునేందుకే కేంద్రం లేబర్ కోడ్లను పెట్టుబడిదారుల కోసం అమలు చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో శుక్రవారం జరిగిన సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో చుక్కా రాములు మాట్లాడుతూ....జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ లేబర్ కోడ్స్లో పొందు పరిచారని, కనీస వేతనాలు, పీఎఫ్ ఈఎస్ఐ, బోనస్ వంటి సదుపాయాలు అందని ద్రాక్షగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జూలై 9 న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కోడ్స్ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కార్మిక వర్గానికి నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రాణం నిలిపే దాతలు
ఆపదలో ఆదుకుంటున్న రక్తదాతలుఇప్పటివరకు 500 మందికి రక్తదానం సంగారెడ్డి బ్లడ్ డోనార్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 500 మందికి రక్తదానం చేశాం. 2019లో ఈ గ్రూప్ ప్రారంభించాం. ఈ గ్రూపులో 300 మంది వరకు సభ్యులున్నారు. రక్తం అవసరం ఉందని గ్రూపులో మెస్సేజ్ వస్తే స్పందించి రక్తదానం చేయడానికి మా గ్రూప్ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. –బంగారు క్రిష్ణ, సంగారెడ్డి 22 సార్లు ఇచ్చాను నాది ఏబీ–పాజిటివ్ గ్రూప్. ఇప్పటివరకు 22 సార్లు రక్తదానం చేశాను. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అనేక శిబిరాల్లోనే కాకుండా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేశాను. –సయ్యాద్ సజీద్ సుహన్, ప్రభుత్వ ఉద్యోగి అపోహలు వీడాలి.. రక్తదానం చాలా విలువైనది. ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదాతలమవుదాం. ఆరోగ్యవంతమైన ప్రతీ ఒక్కరూ వైద్యుల సలహాలు, సూచనలతో ఏడాదిలో 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. –డాక్టర్ సతీశ్ ,జనరల్ ఫిజీషియన్, సంగారెడ్డిసంగారెడ్డి క్రైమ్: రక్తదానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని వైద్యులు చెబుతుంటారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం అవసరమైన సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు రక్తం కోసం పడే పాట్లు వర్ణనాతీతం. చేతిలో డబ్బులుండి వైద్యం చేయించే అవకాశం ఉన్నా కూడా ఆ సమయంలో రోగికి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకురాకపోతే ఇక ఆ రోగి పరిస్థితి చెప్పనవసరం లేదు. అప్పటివరకూ రక్తదానం గురించి ఎవరూ కనీసం అవగాహన లేని ఆలోచించని స్థితిలో ఉన్నవారు సైతం అప్పటికప్పుడు బ్లడ్ బ్యాంకుల వెంట లేదా తెలిసిన బంధువులు, స్నేహితుల్ని రక్తదానం చేయమని వేడుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విషయం తెలుసుకుని ఇదిగో మేమున్నామంటూ ముందుకొస్తోంది సంగారెడ్డి పట్టణ యువత. ఈ యువతకు ఎవరూ ఎవరికీ తెలియనవసరం లేదు. రక్తసంబంధమే ఉండనక్కర్లేదు. రక్తం కావాలని సమాచారం తెలిస్తే చాలు రక్తమిచ్చి వెళ్తారు. అపోహలు వీడి... ఒకప్పుడు రక్తదానంపై అనుకున్నంత స్థాయిలో అవగాహన పెరగలేదు. కొంతమంది యువత ఏవో లేనిపోని అపోహలతో రక్తదానానికి దూరంగా ఉండేవారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లోగానీ, రక్తనిధి కేంద్రాల్లో దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మారుతున్న కాలంలో వాట్సప్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెరిగి యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు వస్తోంది. ఎవరికై నా రక్తం అవసరమైన విషయాన్ని సోషల్మీడియాలోగానీ, వాట్సాప్లోగానీ తెలుసుకుంటున్న యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడొక శుభపరిణామం. రక్తదాతల దినోత్సవం.. జూన్ 14వ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతీ నెల ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తూ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇటీవలే పట్టణంలో రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో రక్తదాతల సంఖ్య కూడా పెరుగుతోంది. వీరు చేయవచ్చు.. రక్తదాత వయస్సు 18 నుంచి 60లోపు ఉండాలి. తమ శరీర బరువు కనీసం 45 కిలోలు పైబడి ఉండాలి. రక్తదాత నుంచి సేకరించే రక్తం (300 ఎంఎల్) ఒక యూనిట్ మాత్రమే. యువతీ,యువకుల్లో టాటు వేయించుకున్నవారు రక్తదానం చేయడం ప్రమాదకరం. రక్తదాతలు రక్తం ఇచ్చిన 24 గంటల వరకు ధూమపానంగానీ, మద్యం తాగడం గానీ చేయకూడదు.ప్రముఖ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు కారల్ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందుకు గాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పట్టణ యువత నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం -
ఆదర్శానికి లీకేజీలు
వట్పల్లి(అందోల్): మోడల్ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతిని కల్పించడం కోసం ప్రభుత్వం ఆదర్శ వసతి గృహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వట్పల్లి మండల పరిధిలోని పోతులబోగుడా మోడల్ పాఠశాల విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్ భవనం రెండేళ్లు కూడా గడవకముందే శ్లాబ్ పెచ్చులూడుతూ నీటి లీకేజీలు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి, అధికారుల అలసత్వం వెరసి ఈ భవనం మళ్లీ మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. రూ.1.28కోట్ల నిధులతో... ఈ హాస్టల్ నిర్మాణం కోసం 2016లో ఆర్ఎంఎస్ఏ ద్వారా రూ.1.28 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2018లో వసతి గృహ నిర్మాణం ప్రారంభించగా దాదాపుగా ఆరేళ్ల తర్వాత హాస్టల్ నిర్మాణ పనులను పూర్తి చేసి 2023 అక్టోబర్ నెలలో వసతి గృహాన్ని ప్రారంభించారు. భవనం నిర్మించి రెండేళ్లు గడవకముందే భవనం పైకప్పు నుండి గోడలపై నీటి లీకేజీలు దర్శనమిస్తున్నాయి. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిర్మాణం కోసం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. మరమ్మతు పనులు చేపట్టేనా..? 2023లో మోడల్ పాఠశాల హాస్టల్ను ప్రారంభించినప్పటికీ వసతిగృహ నిర్వహణ సిబ్బందిని నియమించకపోవడంతో రెండేళ్ల పాటు నిరుపయోగంగా ఉండటంతో పక్షులకు ఆవాసంగా మారి గదులు పక్షుల వ్యర్థాలతో నిండిపోయింది. ఈ ఏడాది నుంచి హాస్టల్ను ప్రారంభించేందుకు అధికారులు ఇటీవల వసతి గృహ సిబ్బందిని నియమించారు. దీంతో హాస్టల్ సిబ్బంది గదులను శుభ్రం చేయించడం, నీటి సరఫరా, విద్యుత్ మరమ్మతులు వంటి పనులను చేయిస్తున్న క్రమంలో భవనంపై చెరువులను తలపించేలా నిలిచిన వర్షపునీటితో పైకప్పు లీకేజీలు అవుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వసతి గృహం నీటి అవసరాలను తీర్చేందుకు బోరుమోటారును కూడా ఏర్పాటు చేయలేదు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు హాస్టల్కు వచ్చే అవకాశం ఉండటంతో ప్రారంభంలోనే సమస్యలతో స్వాగతం పలికేలా ఉంది. అధికారులు వెంటనే మరమ్మతులతోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. రెండేళ్లక్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిస్థాయిలో ప్రారంభించకముందే నీటి లీకేజీలు -
గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
కల్హేర్(నారాయణఖేడ్)/కంగ్టి(నారాయణఖేడ్)/నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్లతో గూడు లేని పేదలకు సొంతింటి కల నేరవేరుస్తామని ఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్ మండలం రాంరెడ్డిపేట్లో, కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్, ఎడ్లరేగడి తండాలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. మండలానికి 464 మందికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు నాలుగు విడతల్లో చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. 45 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. పేద చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొన్ని సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను మొదలుపెట్టామని దశలవారీగా అన్ని స్కూళ్లలోనూ వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి -
మతలబేమిటో!
మార్పు వెనుకకొండా సురేఖను తప్పించి వివేక్ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్ సమన్వయం వివేక్కు సవాలేచర్చనీయాంశంగా మారిన ఇన్చార్జి మంత్రి మార్పు నిర్ణయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన 7 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను, కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది. కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.ఆ నియోజకవర్గాల్లో కీలకం.. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్వెంకటస్వామికి ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నా జిల్లాలో పార్టీ కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కేడర్ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఇన్చార్జి మంత్రి మార్పు అనేది సంబంధిత వర్గాల్లో చర్చకు దారితీసింది. -
ముందుగానే యూనిఫామ్లు
న్యాల్కల్ (జహీరాబాద్): పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫామ్)లు సకాలంలో విద్యార్థులకు అందకపోవడం వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పాత పుస్తకాలు, చిరిగిన పాత బట్టలతో పాఠశాలలకు వచ్చేవారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పాఠశాలల ప్రారంభానికి ముందే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చురుగ్గా పంపిణీ జిల్లాలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు పూర్తి కావడంతో అధికారులు యూనిఫామ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలతో కలిపి మొత్తం 1,249 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 1,09,319 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేసే కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఒక్కో విద్యార్థికి ఒక జత చొప్పున జిల్లా నుంచి ఆయా మండలాల్లోని పాఠశాలలకు యూనిఫామ్లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమ య్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్స్ ఏకకాలంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పాఠ్య పుస్తకాలు పంపిణీ ముందే చేపట్టి దాదాపు పూర్తి చేసిన అధికారులు యూనిఫామ్స్ను కూడా త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తరగతుల వారీగా.. ఒకటి నుంచి 5వ తరగతి చదువుతున్న బాలురకు చొక్కా, నిక్కర్, ఒకటి నుంచి 3వ తరగతి చదువుతున్న బాలికలకు చొక్కా, లాంగ్ఫ్రాక్, 4,5 తరగతులకు బాలికలకు షర్ట్, స్కర్ట్, 6 నుంచి 10వ తరగతి వరకు (బాలురు)చొక్కా, ప్యాంట్, బాలికలకు పంజాబీ డ్రెస్స్లను పంపిణీ చేస్తున్నారు. జత డ్రెస్స్లను దాదాపు అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి విద్యార్థులకు అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన జత కూడా త్వరలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా న్యాల్కల్ మండలంలోని పలు పాఠశాలలకు శుక్రవారం యూనిఫామ్లు వచ్చాయి. వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు అందజేస్తున్న వైనం తొలగనున్న విద్యార్థుల ఇబ్బందులుసంతోషంగా ఉంది గతేడాది స్కూల్ డ్రెస్స్లు ఆలస్యంగా అందించారు. దీంతో ఉన్న పాత డ్రెస్స్లనే వేసుకొని స్కూల్కు వెళ్తూ ఇబ్బంది పడ్డాం. ఈసారి ముందే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం చాలా సంతోషంగా ఉంది. – అక్షిత, 7వ తరగతి, విద్యార్థినీ–మిర్జాపూర్(బి) అన్ని పాఠశాలలకు పంపిణీ చేశాం అన్ని పాఠశాలలకు యూనిఫామ్ల పంపిణీ అనుకున్న సమయానికే పంపించాం. ఒకటి రెండు పాఠశాలలు మినహా దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఒక జత యూనిఫామ్స్ అందించగలిగాం. మిగిలిన జతను కూడా త్వరలో అందిస్తాం. –వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి -
పిడుగుపాటుకు మహిళ మృతి
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు శివ్వంపేట(నర్సాపూర్): పిడుగుపాటుకు మహిళా కౌలు రైతు మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని గూడూర్లో శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తకుమ్మరి బాలమణి,శివరాజు దంపతులు, వీరి కొడుకు శ్రీకాంత్, తమ్ముడు శంకరయ్య అతడి భార్య సత్తమ్మ(45) కలిసి కౌలు భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. పిడుగు పడిన శబ్దాలు వస్తుండటంతో సత్తమ్మ, శ్రీకాంత్ చింత చెట్టు కిందికి వెళ్లారు. వారిపై పిడుగు పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న బాలమణికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సత్తమ్మ ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీకాంత్ కాళ్లు కదపలేక షాక్లో ఉండగా అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 11 మేకలు మృతి... నంగునూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు గురై 11 మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం ఘణపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు ఏలేటి లక్ష్మారెడ్డి, లింగంపల్లి కొ మురయ్య తన వ్యవసాయ బావి వద్ద మేకలు మేపుతున్నారు. సాయంత్రం ఒక్కసా రిగా వర్షం కురవడంతో మేకలు సమీపంలోని చెట్ల కిందికి వెళ్లాయి. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో లక్ష్మారెడ్డికి చెందిన ఏడు, సంపత్కు చెందిన నాలుగు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతులు మరో చెట్టు కింద ఉండటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. చర్చిపై... నారాయణఖేడ్: ఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామ చర్చి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం పిడుగు పడింది. దీంతో చర్చి జెండా కాలిపోవడంతో పాటు సౌండ్ సిస్టానికి సంబంధించిన లౌడ్ స్పీకర్లు కింద పడ్డాయి. పరిసరాల్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
వియత్నాం విద్యార్థులకు శిక్షణ
పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి వియత్నం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. హోచిమిన్ సిటీలోని విఝెన్ డాంగ్ కళాశాల సైబర్ సెక్యూరిటీపై రెండు వారాల వర్క్షాప్ నిర్వహించడానికి ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. ఈనెల 16 నుంచి జూలై 1 మధ్య నిర్వహించనున్న ఈ వర్క్షాప్లో సైబర్ సెక్యూరిటీలో పలు అంశాలను బోధించనున్నారు.వర్క్షాప్కు వెళ్లనున్న డా. నిరంజన్ -
సముద్రంలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
ముంబైలో ఘటనరామాయంపేట(మెదక్): పట్టణానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు ముంబైలోని సముద్రం అలల్లో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన టంకరి రాము (34)కు భార్య సరితతోపాటు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ముంబైలో ఉంటున్న తన సోదరి ఇటీవల రామాయంపేటకు వచ్చారు. సోదరితో పాటు రెండు రోజుల క్రితం రాము కూడా ముంబై వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అక్క, పిల్లలతో కలిసి సముద్రంలో బోటు షికారు చేశాడు. రాము బోటు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన అలల్లో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సమీపంలో ఉన్న పోలీసులు అతన్ని బయటకు తీసేలోగా మృతి చెందాడు. ఈ విషయంపై ఉదయం రామాయంపేటకు సమాచారం రాగా అతని తల్లి భార్యాపిల్లలు బోరున విలపించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నాడు భర్త.. నేడు భార్య
శివ్వంపేట(నర్సాపూర్): ఆత్మహత్యకు యత్నించిన దంపతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పదిరోజుల క్రితం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో పురుగుల మందు తాగి ఆత్మహ త్యకు యత్నించిన విషయం విధితమే. మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన పందుల శివకుమార్(40) అతని భార్య శోభ (35) ఆత్మహత్యకు యత్నించారు. గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా మరుసటి రోజు శివకుమార్ మృతిచెందాడు. భార్య శోభ గురువారం మృతి చెందడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. భూ సమస్యలతో మనస్తాపానికి గురై.. పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం... ఝరాసంఘం మండలం కక్కెరవాడకు చెందిన రాజు(26)తో కొత్తపేటకు చెందిన బాలమణికి గతంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం అతడు కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. రాజు తన సొంత గ్రామానికి భూ సమస్యల విషయంపై వెళ్లి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులు మృతి -
పాఠశాల భవనం ప్రారంభం
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని సూరారంలో శుక్రవారం పాఠశాల భవనాన్ని వీఎస్టీ ప్రతినిధులు అనిష్గుప్తా, అమిత్ ఆరోర, శాంతి, కార్తీక్లు ప్రారంభించారు. వీఎస్టీ యాజమాన్యం రూ.70లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించింది. సూరారం జెడ్పీపాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి శిథిలమైన పాఠశాల భవనం గురించి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి విషయం తెలుసుకున్న వీఎస్టీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రూ.60 లక్షలు వెచ్చించి మూడు తరగతి గదులు, రూ.10 లక్షల నిధులతో టాయిలెట్స్ను నిర్మించింది. గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం వీఎస్టీ సంస్థ ప్రతినిధులు, రౌండ్టేబుల్ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధులను సత్కరించింది. రూ.70లక్షల వ్యయంతో వీఎస్టీ సంస్థ నిర్మాణం సత్కరించిన ఉపాధ్యాయ బృందం -
పేదలకోసం రాజీలేని పోరాటం
సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డిహుస్నాబాద్: ప్రజల కోసం అలుపెరుగని, రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర గల ఏకై క పార్టీ సీపీఐ పార్టీ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో ఈ నెల 27న నిర్వహించే సీపీఐ 4వ మహాసభల విజయవంతం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలన మతోన్మాదం, పెచ్చరిల్లి పోతుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతూ ఆదివాసీలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మావోయిస్టులను చంపడం ఏమిటని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేయాలని, లేకుంటే ప్రజలతో దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆహ్వాన సంఘం నూతన కమిటీ సీపీఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ప్రధాన కార్యదర్శిగా హుస్నాబాద్ మండల కార్యదర్శి గడిపె మల్లేశ్, ఉపాధ్యక్షులుగా జాగీర్ సత్యనారాయణ, పోతిరెడ్డి వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, శంకర్, వనేష్, అశోక్, దయానంద్ రెడ్డి, కోశాధికారిగా సుదర్శన చారిని ఎన్నుకున్నారు. -
ఈత సరదా.. నిండు ప్రాణం బలి
జిన్నారం (పటాన్చెరు): ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన గుమ్మడిదల పరిధిలోని అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా గాగిల్లాపూర్కు చెందిన గులాం హుస్సేన్ (35) స్థానికంగా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్విమ్మింగ్ శిక్షకులు లేకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు, బాధితులు వాపోయారు. మండలంలో అనధికారికంగా కొనసాగుతున్న స్విమ్మింగ్ పూల్స్ను గుర్తించి యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన చేపల వేట
చెరువులో మునిగి బాలుడు మృతిఅల్లాదుర్గం(మెదక్): చేపల వేటకు వెళ్లిన బాలుడు కాలు జారి చెరువులో మునిగి మృతి చెందాడు.ఈ ఘటన అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సాయిలు, సంతోష దంపతులు హైదరాబాద్లో వాచ్మెన్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. మూడు రోజుల క్రితం గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించడంతో సాయిలు కుటుంబం ఉత్సవాలకు వచ్చారు. ఈ క్రమంలో సాయిలు కొడుకు సతీశ్రావ్ (14)తో పాటు మరో ఇద్దరు కలిసి గ్రామ శివారులోని రెలకుంట చెరువులో సరదాగా చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో సతీశ్రావ్ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. వెంట వచ్చిన ఇద్దరు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పారు. స్థానికులు చెరువు వద్దకు వచ్చి వెతకగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు , సమగ్ర శిక్ష సీఎంవో వెంకటేశం, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, ప్రధానోపాధ్యాయురాలు సునీతతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. కోంటూర్ ప్రాథమిక పాఠశాలలో.. హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని కోంటూర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సంగీత తెలిపారు. అలాగే నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు అందించారు. ఉపాధ్యాయులు ప్రవళిక, రేవతి పాల్గొన్నారు. -
బీదర్కు బస్సులు నడపండి
ఖేడ్ డీఎంకు ప్రజలు వినతి న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని న్యాల్కల్, అత్నూర్, డప్పూర్, వడ్డి, శంశల్లా పూర్ మీదుగా బీదర్కు బస్సు సర్వీస్ను నడిపించాలని వడ్డి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివేకానంద సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆనందేశ్వర్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఖేడ్కు తరలి వెళ్లి డిపో మేనేజర్ మల్లేశయ్యకు వినతి పత్రం అందజేశారు. సామూహిక అక్షరాభ్యాసం న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని హద్నూర్, న్యామతాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాడి బాట కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లో ఎంఈఓ మారుతి రాథోడ్, ఉపాధ్యాయులు 1వ తరగతిలో చేరిన చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్యతోపాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితరాలు అందిస్తున్నందున పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. -
మానవత్వం చాటుకున్న ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం కొల్చారం పోలీస్ స్టేషన్ పర్యటన ముగించుకొని ఎస్పీ వస్తున్న క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని తన వెంట ఉన్న క్యూఆర్టీ సిబ్బందితో పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. 26 మందికి జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 26మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.40వేల జరిమానా విధించారు. పాఠశాలలో కంప్యూటర్లు మాయం హుస్నాబాద్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు కంప్యూటర్లు మాయమయ్యాయి. పాఠశాలకు మంజూరైన 10 కంప్యూటర్లను పైఅంతస్తులో ల్యాబ్ గదిలో ఉంచారు. వీటిని ఇంకా ప్రారంభించలేదు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలకు తాళం వేసి ఉంచారు. పాఠశాలల పునఃప్రారంభం గురువారం రెండు కంప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాల కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం ఝరాసంగం(జహీరాబాద్): ప్రమాదవశాత్తు కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాధితుడు శ్రీశైలం కథనం ప్రకారం... మండల పరిధిలోని పార్యవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మూడు కొన్నేళ్లుగా గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ పామ్ను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్తు వైర్లు, కోళ్ల దాణా, డ్రింకర్లు, ఫీడర్లు, కాలిపోయాయి. సుమారు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. షెడ్డు తగులబెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య మనోహరాబాద్(తూప్రాన్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నబత్తుల ఆంజనేయులు(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పొలానికి వెళ్లిన ఆంజనేయులు సాయంత్రమైన ఇంటికి రాలేదు. కాగా శుక్రవారం ఉదయం గ్రామ శివారులో అడవి పక్కన ఓ చెట్టుకు ఊరి వేసుకుని కనిపించాడు. కాగా మృతుని భార్య నవనీత భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. ఇంటి వద్ద కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తుందని పోలీసుల ఫిర్యాదులో తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. -
అత్యుత్తమ ప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు
దుబ్బాకటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన, సౌకర్యాల కల్పన, సాంకేతికత వినియోగం లాంటి ప్రమాణాలను మెరుగు పరచుకోవడం ద్వారా న్యాక్ గుర్తింపు సాధించవచ్చని ప్రొ.ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చెక్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న 22 కళాశాలల్లో, 11 కళాశాలలకు తాను మెంటార్గా ఉన్నానని, వాటిలో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటని తెలిపారు. నైపుణ్య శిక్షణ తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ, డిజిటల్ లైబ్రరీ వినియోగం, బోధనలో ఐటీసీ వనరుల వినియోగం, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను అధ్యాపకుల బోధనలతో అనుసంధానించడం వల్ల న్యాక్ గుర్తింపులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.భవాని, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ తప్పిదం.. విద్యార్థి చదువుకు దూరం
కొండాపూర్(సంగారెడ్డి): ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు చేసిన తప్పిదం కారణంగా విద్యార్థి చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి 544 మార్కులు సాధించినప్పటికీ ఆ విద్యార్థికి ఇంటర్ విద్య అందని ద్రాక్షలాగానే మిగిలిపోయేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే .. కొండాపూర్ మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కురాకుల అక్షిత అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. ఇటీవలే విడుదలైన పది ఫలితాలలోనూ 544 మార్కులు సాధించింది. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదవాలనుకుంది. దీంతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ ఇంటర్నెట్లో గురుకుల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. సదరు ఇంటర్నెట్ నిర్వాహకుడు దరఖాస్తు ఫారం ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలో విద్యార్థి జెండర్ దగ్గర సీ్త్ర కి బదులు పురుషుడు అని నమోదు చేశారు. ఆ అమ్మాయికి చిలుకూరులోని సోషల్ వెల్ఫేర్ బాలుర కళాశాలలో సీటు వచ్చింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అక్షిత తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రైవేట్ కళాశాలలో చదివించే ఆర్థిక స్తోమత లేదు. అధికారులు స్పందించి సదరు వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాలలో సీటు ఇప్పించాలని కోరుతున్నారు. -
వెంట పడుతున్నాడని.. చంపేశారు
సిద్దిపేటఅర్బన్: అడ్డా కూలీని కొట్టి చంపిన హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 8న రంగధాంపల్లి పరిధిలోని మయూరి దాబా వెనక ఖాళీ స్థలంలో బోదాసు నర్సింహులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం పోలీస్ స్టేషన్లో త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలో నివాసం ఉండే గ్యాదరి శ్రీదేవికి పెద్దపల్లి జిల్లా రత్నాపూర్కు చెందిన ఇట్టవేని సతీష్తో కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చనువుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తొగుట మండలం పెద్ద మాసాన్పల్లికి చెందిన నర్సింహులు సైతం శ్రీదేవికి పరిచయం కాగా వెంటడేవాడు. దీంతో శ్రీదేవి విషయాన్ని సతీష్తో చెప్పింది. ఓ రోజు మద్యం తాగుతున్న సమయంలో శ్రీదేవికి సతీష్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఒప్పుకుంది. కానీ, నర్సింహులు వెంట పడుతుండటంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న రాత్రి సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద శ్రీదేవిని నర్సింహులు కలిసి కల్లు తాగుదామని పిలిచాడు.అదే సమయంలో సతీష్ కూడా వచ్చాడు. రంగధాంపల్లి వద్ద దావత్ ఉందని ముగ్గురం కలిసి వెళ్దామని నర్సింహులును శ్రీదేవి నమ్మించింది. అక్కడి నుంచి వెళ్లి ముగ్గురు కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం గొడవపడి సతీష్ నర్సింహులును ఛాతీపై, ముఖంపై పిడి గుద్దులు గుద్ది, తల వెనక భాగంలో కొట్టగా మృతి చెందాడు. కేసును ఛేదించిన త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బందిని ఏసీపీ రవీందర్రెడ్డి అభినందించారు. మద్యం తాగించి కొట్టిన వైనం నిందితుల రిమాండ్ వివరాలు వెల్లడించిన త్రీటౌన్ సీఐ -
మోదీ పాలన స్వర్ణయుగం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ మెదక్జోన్: ప్రధాని మోదీ పదకొండేండ్ల పాలన స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం మెదక్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి చేసిందేమి లేదని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువకుల అభివృద్ధి కోసం మోదీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. రోడ్డు, వాయు మార్గాలు, వందేభారత్ రైళ్లతో పాటు దేశశ భద్రత విషయంలో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చేలా భారత్ సత్తాను ఆపరేషన్ సిందూర్ ద్వారా చూపించాడన్నారు. రైతు అభివృద్ధే ధ్యేయంగా రైతు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర, పెట్టుబడుల కోసం కిసాన్సమ్మాన్ నిధి అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్రెడ్డి, స్థానిక నేతలు ఎంఎల్ఎన్ రెడ్డి, సుభాష్గౌడ్, సత్యనారాయణ, రాములు, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డు హత్య
పటాన్చెరుటౌన్: దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితుల్లో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పటాన్చెరు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్ కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన కై రత్మియా (53) పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఉష మాగ్ వైర్స్ ఇండియా ప్రయివేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఇస్నాపూర్లో ఉంటున్నాడు. అయితే బొంతపల్లికి చెందిన పెయింటర్లు బిట్టు, మహమ్మద్ మాజీద్, రోషన్ కుమార్, మహమ్మద్ సద్దాం, వికాస్ కుమార్, నర్సింగరావు, వినీత్ కుమార్తో పాటు ఓ బాలుడు కలిసి పనిచేసే చోట క్రికెట్ ఆడేవారు. ఈ నేపథ్యంలో పరిచయం ఏర్పడి మద్యం తాగుతూ జల్సాలకు అలవాటుపడ్డారు. పనిచేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడం లేదని, దొంగతనం చేద్దామని పతకం రచించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న అర్ధరాత్రి ఉష మాగ్ వైర్స్ కంపెనీలో కాపర్ వైర్ దొంగిలించే ముందు మద్యం తాగారు. ప్లాన్ ప్రకారం బొలెరో వాహనం, నంబర్ప్లేట్ లేని ద్విచక్ర వాహనం తీసుకుని 8 మంది దొంగతనానికి వెళ్లారు. దొంగతనం చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ గార్డు కై రత్ మియా గమనించి టార్చ్ వేసి చూశాడు. దీంతో అతడి తలపై కరల్రతో కొట్టడంతో గట్టిగా అరిచాడు. స్థానికంగా ఉన్న లేబర్ రావడంతో అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును పటాన్చెరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 23న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో భాగంగా మొబైల్ ఫోన్లు,. సీసీ కెమెరాలు పరిశీలించి రోషన్ కుమార్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుల వివరాలు వెల్లడించాడు. బాలుడు, బిట్టు అనే నిందితులు పరారు కాగా, మిగతా వారిని అరెస్టు చేసి రమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వాహనం, సెల్ఫోన్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీసీఎస్ సీఐ శివకుమార్, బీడీఎల్ సీఐ స్వామి గౌడ్, సీసీఎస్ సీఐ –2 రామానాయుడు, ఎస్ఐలు శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, మహేశ్వర్ రెడ్డి తోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఆరుగురు నిందితుల రిమాండ్ పరారీలో ఇద్దరు వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అదనపు కలెక్టర్ నగేశ్ హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కూచన్పల్లి జడ్పీ హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు సరిగా అర్థం చేసుకొని బాగా చదువుకోవాలన్నారు. గ్రామంలో బడీడు పిల్లలందరూ కచ్చితంగా పాఠశాలలోనే ఉండాలన్నారు. ఎవరైనా రాకుండా ఉంటే వారిని గుర్తించి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలుగు ఉపాధ్యాయుడు శశికుమార్ తన కుమారుడికి, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మరి కొంతమంది విద్యార్థులకు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అడ్మిషన్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో మధుమోహన్, పాధ్యాయులు శివరాజ్, సుకన్య, శ్రీనివాస్, మల్లారెడ్డి ,సందీప్, సంతోషికుమారి, వినోద్, కొండల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజు, చక్రపాణి, కృష్ణవేణి , గంగమణి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. -
ఎట్టకేలకు డీఎస్ఆర్ అమలు
మొదట యాప్ను నిరాకరించిన పంచాయతీ కార్యదర్శులుసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీల్లో పాలన పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్– డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లో వివరాలు అప్డేట్ చేసేందుకు దూరంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎట్టకేలకు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత నెల 24న ఈ విధానంను అమలులోకి తెచ్చినా ఇప్పటి వరకు వివరాలు నమోదు చేయలేదు. జిల్లాలో వివరాలు నమోదు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఏ శాఖలో లేని విధంగా తమకు ఫేస్ రికగ్నైషన్ యాప్ ఎందుకని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కొత్త మార్గదర్శకాలతో రూపకల్పన గత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ యాప్ను రూపొందించింది. అందులో ఉన్న మార్గదర్శకాలతో పలువురు పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించకపోవటంతో పాటు విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం యాప్లో పలు మార్పులు చేస్తూ ఫేస్ రికగ్నైషన్తో హాజరుతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నది. ప్రతి రోజు సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఫొటోతో ఫేస్ రికగ్నైషన్తో హాజరు వేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా సేకరించిన చెత్త వివరాలను తూకం వేసి, ఎన్ని కేజీలు ఉందో వివరాలు అప్లోడ్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 631 గ్రామ పంచాయతీలు జిల్లాలోని 26 మండలాల్లో 631 గ్రామ పంచాయతీల్లో 631 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల మెరుగైన పారిశుద్ధ్యానికి జోన్లను ఆయా గ్రామాల్లో ఇండ్ల సంఖ్య, జననివాసం, మార్కెట్లు, ఇనిస్టిట్యూషన్, వ్యాపార సంస్థల ఆధారంగా జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు విభజించారు. ఈ మేరకు 1464 జోన్లను ఏర్పాటు చేశారు. యాప్ వినియోగం ద్వారా జిల్లాలో బుధవారం వరకు 15 గ్రామ పంచాయతీల్లో మాత్రమే అమలైంది. మిగితా 616 గ్రామ పంచాయతీలు అమలుకు దూరంగా ఉన్నాయి. గురువారం జిల్లా అంతటా యాప్ అమలు ప్రారంభభమైంది. మొదటి రోజు జిల్లా అంతటా ఫేస్ రికగ్నైషన్ యాప్ ద్వారా హాజరు వేశారు. మిగితా వివరాలు సైతం నమోదు చేయనున్నారు. అంగీకరించని కార్యదర్శులుప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ను మొదట పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకించారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్న్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరం, తెలంగాణ పంచాయతీ సెక్రటరీల ఫోరం.. ఈ మూడు సంఘాలు జేఏసీగా ఏర్పడి యాప్కు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టారు. ఇప్పటికే తమ ఫోన్లలో ఇందిరమ్మ ఇళ్లు, స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, ఆహారభద్రత కార్డులతో పాటు తదితర వివరాలను యాప్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా వచ్చిన యాప్తో మరింత భారం అవుతుందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. గత నెల 24నుంచి అందుబాటులోకి ఫేస్ రికగ్నైషన్తో కార్యదర్శుల హాజరు పారదర్శక పాలన అమలుకు చర్యలు -
మోటార్ల దొంగలు అరెస్ట్
కేసును ఛేదించిన రేగోడ్ పోలీసులురేగోడ్(మెదక్): వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లను దొంగిలిస్తున్న నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రేగోడ్ మండలంలోని పెద్దతండాకు చెందిన వడ్త్యా కిషన్ నాయక్, హరిజానాయక్ నెల క్రితం ఆయా గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్లను దొంగిలించారు. వాటికి ఉండే స్టాండ్లను కూడా ఎత్తుకెళ్లారు. అయితే కొండాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీకాంత్ ఫిర్యాదుతో పాటు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుళ్లు వినోద్, సురేశ్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. రూ.70 వేల విలువైన ఐదు మోటార్లు, రెండు స్టాండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఏఎస్ఐ శంకర్, సిబ్బందిని సీఐ అభినందించారు. ఆరెగూడెం చోరీ కేసులో.. వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఆరెగూడెంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హనుమాద్రి లక్ష్మాగౌడ్ ఇంట్లో ఈ నెల 5న చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి చెక్కపెట్టెలో దాచిన రూ.90 వేలు నగదును అపహరించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన సొత్తులో ఖర్చుపెట్టుకోగా మిగిలిన రూ.23 వేలు నగదు, ఒక సెల్ఫోన్, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప పైపును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
వందరోజుల కార్యాచరణ అమలు చేయాలి
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపాలిటీ ప్రగతి పారిశుద్ధ్యం మెరుగు పరచడంతోపాటు పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన వందరోజుల కార్యాచరణ ప్రణాళికను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సీడీఎంఏ కార్యాలయం అదనపు డైరక్టర్ గిరిశ్రీవాస్తవ అధికారులను సూచించారు. మున్సిపల్ డీఎంఏ ఆదేశాల మేరకు గిరిశ్రీవాస్తవ, రిటైర్డ్ కమిషనర్ ఇస్వాక్అబ్ఖాన్ గురువారం మున్సిపల్ పరిధిలో పర్యవేక్షించారు. పట్టణంలో ఊబచెరువుపై అమృత 2.0లో భాగంగా మొక్కలు నాటి, గాంధీచౌక్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్ని పరిశీలించారు. అనంతరం శాసీ్త్రరోడ్లోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ట్రెడ్ లైసెన్స్లను తనిఖీ చేశారు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఎస్హెచ్జీ మహిళలకు రూ.కోటి చెక్కును అందజేశారు. మహిళలు రుణాలను సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే.ఉమా, ఏఈ రాజేశ్కుమార్, మేనేజర్ ఉమిందర్సింగ్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పర్యావరణ అధికారి అశోక్, సీఓ రమాదేవి, ఎస్హెచ్జీ మహిళలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్హెచ్జీ మహిళలకు రూ.కోటి చెక్కు అందజేత సీడీఎంఏ కార్యాలయం అదనపు డైరెక్టర్ గిరిశ్రీవాస్తవ -
బాల భరోసాకు శ్రీకారం
చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం ● ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు ● పథకం అమలుకు ప్రత్యేక చర్యలు సంగారెడ్డి జోన్: చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో బాల భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్రాలలోని బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు సేవలు అందిస్తుండగా బాల భరోసా పథకం కింద వైద్య పరీక్షలను కూడా చేపట్టనుంది. పథకం అమలుకు మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తుంది. ప్రతీ ఏటా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణమాసం నిర్వహించి పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారు. పౌష్టికాహారలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి అనుబంధ పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బాల భరోసాతో చిన్నారుల సంరక్షణ ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటుంది. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు గుడ్లు, పాలు, పౌష్టికాహారం, బాలామృతం పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు నెలవారి ఇంజక్షన్లు అందిస్తున్నారు. చిన్నారి బరువు, ఎత్తులను పరిశీలించి ఎదుగుదలకు అవసరమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య పరీక్షలలో ఏమైనా లోపాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స నిమిత్తం పెద్ద ఆస్పత్రులకు పంపించి ఉచిత వైద్యాన్ని అందించనున్నారు. జిల్లాలో 1504 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వాటి పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో సుమారు 93వేల మంది చిన్నారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో సర్వే జరుగుతోంది ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా సర్వే చేసి ఐదేళ్లలోపు పిల్లలను గుర్తిస్తున్నాం. గ్రామాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బాల భరోసా పథకాన్ని అమలు చేస్తాం. లలిత కుమారి, జిల్లా సంక్షేమశాఖ అధికారి, సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన విద్యార్థుల వివరాలు ప్రాజెక్టు పేరు 0–5సం.లోపు ఉన్న చిన్నారులు జోగిపేట 13,086 నారాయణఖేడ్ 16,690 పటాన్చెరు 21,707 సదాశివపేట 16,455 జహీరాబాద్ 27,337 -
జిల్లా కలెక్టర్గా పి.ప్రావీణ్య
● వల్లూరు క్రాంతి టూరిజం కార్పొరేషన్కు బదిలీ ● ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పి.ప్రావీణ్య నియమితులయ్యారు. హన్మకొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రావీణ్యను ఇక్కడికి బదిలీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్గా పనిచేస్తున్న వల్లూరు క్రాంతి బదిలీ అయ్యారు. ఆమెను తెలంగాణ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులను మూకుమ్మడి బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతికి బదిలీ అయింది. 2024 జనవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి జిల్లాలో సుమారు 17 నెలలు పనిచేశారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ప్రధానంగా మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ప్రధానంగా ఎస్హెచ్జీ (స్వయం సహాయక సంఘాల) మహిళలు స్వావలంబన సాధించే దిశగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం అమలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల నిర్వహించిన ‘మన్కీ బాత్’లో ఈ డ్రోన్ మహిళల పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్హెచ్జీ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ తీసుకుని ఈ డ్రోన్ల సహాయంతో వ్యవసాయ పనులను చేస్తున్నారు. అలాగే మహిళలకు కారు డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్యాక్సీలు నడిపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్హెచ్జీ మహిళలతోనే పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయించారు. ఈ బంక్ను ఇటీవలే ట్రయిల్ రన్ జరుగుతోంది. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ బంక్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. పాలనపై తనదైన ముద్ర.. కలెక్టర్ క్రాంతి జిల్లా పాలనపైనా తనదైన ముద్ర వేశారు. తరచూ సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే నిరుపేదలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కలెక్టర్ క్రాంతి సఫలీకృతులయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరించారు. ప్రొఫైల్పి.ప్రావీణ్య 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. సివిల్స్లో 82వ ర్యాంక్ సాధించారు. రెండో ప్రయత్నంలోనే అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యారు. ముందుగా కర్ణాటక కేడర్ అధికారిగా నియమితులు కాగా, తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమె గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పని చేశారు. కరీంనగర్ ట్రైనీ కలెక్టర్గా కూడా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం బెంగళూరులో సాగినట్లు సమాచారం. -
అందోలులోనే నవోదయ పాఠశాల
● ఉన్నతాధికారుల నుంచి లభించిన అనుమతులు ● స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ జోగిపేట(అందోల్): జవహర్ నవోదయ పాఠశాల అందోలులో ఏర్పాటుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లభించాయి. జిల్లాకు మంజూరైన పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో గురువారం కలెక్టర్ వల్లూరు క్రాంతి అందోలులోని సర్వేనంబరులోని 1141లోని 30 ఎకరాల స్థలాన్ని ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. దీంతో దాదాపు అందోలులోనే నవోద పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ స్థలాన్ని నవోదయ విద్యాసంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ముందుగానే పరిశీలించి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదికకు కలెక్టర్ ఆదేశం అందోలు వద్ద ఉన్న 1141 సర్వే నంబరులోని స్థలాన్ని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించి పూర్తి నివేదికను తయారు చేసి పంపాలని ఆర్డీఓ పాండు, ఇతర రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ స్థలంలో గతంలో ఎవరికై నా కేటాయించారా? వంటి విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలంలో చేపడుతున్న నిర్మాణ వివరాలను డిప్యూటీ తహసీల్దారు మధుకర్రెడ్డి మ్యాపు ద్వారా కలెక్టర్కు వివరించారు. నవోదయ విద్యా సంస్థల వారు కూడా ఈ స్థలానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. దీని ప్రక్కనే 150 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వివరించారు. -
మోగింది బడి గంట
దాదాపు నెలన్నర రోజుల వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా బడులు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిగంటలు మోగడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. తమతో కలిసి చదివిన స్నేహితులను కలుసుకున్నారు. ఒకరికొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గురువులకు పాదాభివందనం చేశారు. తొలిరోజు కావటంతో పాఠశాలలకు తోరణాలు కట్టి విద్యార్థులను టీచర్లు ఆహ్వానించారు. చిన్న పిల్లలు మాత్రం పాఠశాలకు రావడానికి అయిష్టం వ్యక్తం చేశారు. కొందరు ఆడుతూ కనిపించారు. మరి కొందరు ఇంటికి వెళ్తామని మారాం చేశారు. బడులు తెరిచిన రోజే జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు. అందోల్ మండలం నేరుడుగుంట ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి బడిగంట మోగడంతో లోపలికి వెళ్తున్న విద్యార్థులు -
వ్యర్థజలాలతో విధ్వంసమే
వర్షం నీటిలో వదలొద్దని పరిశ్రమలకు పీసీబీ తాఖీదులు ● సాల్వేంట్ రికవరీ, షుగర్ డిస్ట్రిలరీలకు సైతం! ● ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు ● పీసీబీవి నామ మాత్రపు చర్యలేనంటున్న ప్రజలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన హానికరమైన రసాయన వ్యర్థ జలాలను వాననీటిలోకి వదిలేయడం జిల్లాలో పరిపాటైపోయింది. ఫలితంగా చెరువులు, కాలువలు కలుషితమై పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయి. ఇక వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు సైతం కలుషితమై మానవాళికీ ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) జిల్లాలో సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. ఫార్మాస్యూటికల్, సాల్వేంట్ రికవరీ, కెమికల్, బల్క్డ్రగ్, బ్రూవరీ, షుగర్, డిస్ట్రిలరీలకు ఈ తాఖీదులు ఇస్తోంది. ఇలా జిల్లావ్యాప్తంగా 120కి పైగా పరిశ్రమలకు ఈ ముందస్తు నోటీసులు వెళ్లాయి. ప్రధానంగా జిన్నారం మండలం గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలతోపాటు, పటాన్చెరు మండలం పాశమైలారం, సంగారెడ్డి, హత్నూర మండలం గుండ్లమాచనూరు, కొండాపూర్, సదాశివపేట మండలాల్లోని ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలు ఈ నోటీసులు వెళ్లాయి. జిల్లాలోని రెడ్ కేటగిరీకి చెందిన పరిశ్రమలు సుమారు రెండు వేల వరకు ఉంటాయి. ఇందులో చాలా పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా పరిశ్రమల్లో నిత్యం ఉత్పత్తి అయ్యే హానికరమైన రసాయన వ్యర్థాలను నిల్వ చేస్తుంటాయి. వర్షకాలం రాగానే వర్షపునీటిలో వదిలేస్తుండటం పరిపాటిగా మారింది. వర్షాలు కురుస్తున్న రాత్రివేళల్లో ఈ హానికరమైన రసాయన వ్యర్థాలను పరిశ్రమల నుంచి బయటకు వదిలేస్తుంటాయి. కాలకూట విషంతో సమానమైన ఈ హానికరమైన రసాయన వ్యర్థాలు వర్షం నీటిలో కలిసి సమీపంలో చెరువులు, కుంటల్లోకి చేరుతోంది. వర్షం నీటితోపాటు చాలా మట్టుకు భూగర్భంలోకి ఇంకి పోతున్నాయి. దీంతో చెరువులు కుంటలు కాలుష్య కాసారాలుగా మారడంతో పాటు, భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఈ నీటిని తాగే పశుపక్ష్యాదులు మృత్యువాత పడటం, చెరువుల్లోని చేపలు మృతి చెందడం పరిపాటైపోయింది. ఇలా వర్షాకాలం వస్తే చాలు జలకాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది. మొక్కుబడి నోటీసులేనా..? జిల్లాలో రెడ్ కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆర్థిక, రాజకీయ, అంగబలం ఉన్న ఈ పరిశ్రమల యాజమాన్యాల ఆగడాలపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మొక్కుబడి చర్యలతోనే సరిపెడుతున్నారు. ఇలా పరిశ్రమలకు నోటీసులు ఇవ్వడం పరిపాటేనని, ఆయా పరిశ్రమలు ఇలా రసాయన వ్యర్థ జలాలను వదలడం కూడా సాధారణమేనని బాధితులుగా మారుతున్న స్థానికులు వాపోతున్నారు. కాలుష్యంపై పీసీబీకి ఏటా వందల సంఖ్యలో ఫిర్యాదులు అందినా మొక్కుబడి చర్యలు తీసుకోవడం పరిపాటే. నోటీసులు అంటూ..శాంపిళ్ల సేకరణ.. వంటి నామమాత్ర చర్యలతో సరిపెడుతున్న పీసీబీ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా ఆయా పరిశ్రమలు ఇచ్చే రూ.లక్ష, రూ.రెండు లక్షల బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం వంటి చర్యలతోనే సరిపెడుతున్నారు. అలాగే మొక్కుబడి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఈ పరిశ్రమల ఆగడాలు ఏటా వర్షాకాలం యథేచ్చగా సాగుతున్నాయి. ఇప్పుడు ముందస్తుగా ఇస్తున్న తాఖీదులు కూడా మొక్కుబడి తంతనే అభిప్రాయం బాధితుల్లో వ్యక్తమవుతోంది. -
గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొంది...వాటిని వినియోగించని వారి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులందరూ నిర్మించుకునేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడితే పరిష్కరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. నోటరీ పేరుతో లబ్ధిదారులు తమ ఇళ్లను విక్రయించినట్లు విచారణలో తేలితే వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థానిక కోట కింద మిగిలిన ఇళ్లను సైతం అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 5500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్కు ఎమ్మెల్యే ఫోన్లో సూచించారు. కొల్లూరు, ఉస్మాన్నగర్, అమీన్పూర్, కర్దనూర్, నాగులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వ్యాపార సముదాయాలోని దుకాణాలను నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కేటాయించాలని సూచించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నరసయ్య, పీడీ చలపతిరావు, డీఈ రవీందర్, ఆయా మండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కంది(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని బేగంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన కొలతలు, నియమాలను పాటించి ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. నిర్మాణాలు చేసుకుంటున్న వారందరికీ విడతలవారీగా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, హౌసింగ్ డీఈ మాధవరెడ్డి, ఏఈ మేఘనాథ్, తాజా మాజీ ఉపసర్పంచ్ మహేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి తారాబాయి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’ ఫీజుల దోపిడీని అరికట్టాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధిక ఫీజులను నిరసిస్తూ గురువారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ...జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యను వ్యాపారమయం చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘంచి విద్యా చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ లాభార్జనే తమ ధ్యేయంగా ప్రైవేట్ విద్యావ్యవస్థ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు, దుస్తులు కూడా విద్యాసంస్థల్లో పెట్టి వ్యాపారం కొనసాగిస్తుంటే విద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుర్తింపులేని ప్రైవేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి: కేవీపీఎస్పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ పాల్పడుతున్నాయని మండిపడ్డారు. -
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకటస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖ స్థానంలో వివేక్ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య పదవి దక్కిన సంగతి తెలిసిందే. మంత్రిని కలిసిన దళిత సంఘాల నాయకులు జహీరాబాద్ టౌన్: రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ను జహీరాబాద్ దళిత సంఘాల నాయకులు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. -
నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారు బడికి టీచర్ కుమారుడు
రామాయంపేట(మెదక్): తాను పనిచేస్తున్న పాఠశాలలోనే ఓ ఉపాధ్యాయురాలు తన కుమారున్ని చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రవళిక విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రైవేట్ స్కూలులో చదువుతున్న కుమారుడు కార్తీక్ను తాను పనిచేస్తున్న పాఠశాలలోని మూడో తరగతిలో చేర్పించేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఎంఈవో విద్యార్థి కార్తీక్కు అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. 17మందికి జరిమానా గజ్వేల్రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 17మందికి కోర్టు జరిమానా విధించిందని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడ్డారని పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతిగౌడ్ ఎదుట హాజరు పర్చగా, విచారణ అనంతరం 17 మందికి వెయ్యి రూ. చొప్పున 17వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి పుల్కల్(అందోల్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవానానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఎస్ఐ క్రాంతి కుమార్ కథనం ప్రకారం... మండల పరిధిలోని తాడ్దాన్పల్లి గ్రామానికి చెందిన బేగరి యాదయ్య(40) గొంగ్లూర్ గ్రామానికి బైక్పై వస్తున్నాడు. గొంగ్లూర్ గ్రామానికి చెందిన అర్జున్, రాజు అనే యువకులు ద్విచక్రవాహనంపై సంగారెడ్డి వైపు వెళుతున్నారు. బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో బేగరి యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అర్జున్,రాజులకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బేగరి యాదయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ విజయ్కుమార్ వివరాల ప్రకారం... మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ మండలం దొంగలగుట్ట తండాకు చెందిన కోడావత్ రాములు(47)ఈ నెల 5న సాయంత్రం సొంతపనిపై బైక్పై ములుగు మండలం కొత్తూరుకు వచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పూరిగుడిసె వెనుకభాగంలో నిర్మాణ పనులు ప్రారంభించాడు. కాగా ఇల్లు మంజూరు లిస్టులో అతని పేరు లేకపోవడంతో ఆవేదన చెందాడు. దీంతో మంగళవారం రాత్రి గ్రామ శివారులో క్రిమి సంహారక మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అతడి తండ్రి నర్సిహులు అంబులెన్సులో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం వైద్యులు అశోక్ను డిశ్చార్జి చేశారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో సజీలుద్దీన్ను సంప్రదించగా.. అశోక్కు మొదటి లిస్టులో ఇల్లు మంజూరు కాలేదని తెలిపారు. -
ఈ పాఠశాలలో చేరేందుకు పోటీ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని భుజిరంపేటలో ప్రాథమిక పాఠశాల పచ్చదనంతో కళకళ లాడుతుంది. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులను ఆకుట్టుకునేలా పచ్చని చెట్టు, చెమన్ మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు వేసవి సెలవులలో సైతం మొక్కలకు నీళ్లుపోసి పెంచడంతో పాఠశాల ఆవరణలో దారికి ఇరువైపులా ఉన్న మొక్కలు, ఏపుగా పెరిగిన చెట్లు నీడనిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా 133మంది విద్యార్థులు ఉన్నారు. భుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో దారికి ఇరువైపులా ఉన్న చెమన్ మొక్కలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలలను శుభ్రపరిచి, మామిడి తోరణాలతో, రంగు రంగుల పేపర్లతో అలంకరించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతితో పాటు 7, 8, 9, 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. గురువారం వరకు దరఖాస్తులు తీసుకుని, తరువాత విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో 12వందలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. -
ప్రముఖులు చదివిన పాఠశాల
మామిడి తోరణాలు కట్టి వర్గల్(గజ్వేల్): సర్కారు బడులు వేసవి సెలవులు ముగించుకుని గురువారం పునఃప్రారంభమవుతున్న వేళ విద్యార్థిలోకానికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా వర్గల్ మండలం బొర్రగూడెం ప్రాథమిక పాఠశాలను హెచ్ఎం రాజనరేందర్రెడ్డి బృందం బుధవారం శుభ్రం చేయించి, మామిడి తోరణాలు కట్టి స్వాగత ఏర్పాట్లు చేశారు. చక్కని చదువుతో భవిష్యత్కు పునాదులు వేస్తామని భరోసా కల్పిస్తున్నారు. జహీరాబాద్ టౌన్: పట్టణంలోని అల్లీపూర్లోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ (ఎంఆర్హెచ్ఎస్ ) అత్యంత పురాతనమైన ఎయిడెడ్ పాఠశాల. మెథడిస్ట్ సంస్థ 1931లో సుమారు 63 ఎకరాల్లో పాఠశాలను స్థాపించింది. అమెరికాకు చెందిన గార్డెన్ దొర దంపతులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించారు. 94 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాఠశాలలో 1 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధన చేస్తున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయుల కోసం ఇల్లు కట్టించారు. ఆటల కోసం విశాల మైదానం, హాస్టల్ భవనం, బాలబాలికల కోసం టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం తదితర వసతులు కల్పించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, స్వర్గీయ మాజీ మంత్రి ఫరిదుద్దీన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితర ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, డాక్టర్లు, ఇంజినీర్లు ఇలా ప్రతి రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పట్లో పాఠశాలలో అడ్మిషన్ దొరకడం కష్టంగా ఉండేది. సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనేది. ప్రస్తుతం పర్యవేక్షణ కొరవడటంతో ఆదరణ తగ్గుతోంది. అయినా ఇప్పటికీ 1200 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన మిస్ రత్న శేషప్ప, స్వర్గీయ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా అవార్డును అందుకున్నారు. -
ఇంటి కోసమే పెదనాన్న హత్య
పటాన్చెరు టౌన్ : ఇంటిని దక్కించుకుందామని ప్లాన్ ప్రకారం పెదనాన్నపై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. బుధవారం బీడీఎల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ స్వామి గౌడ్ వివరాలు వెల్లడించారు. పటాన్చెరు మండలం ఘనపూర్కు చెందిన చెర్ల రాములు(55)కు గ్రామంలో పాత ఇల్లు ఉంది. భార్యాపిల్లలతో కలిసి అతడు రామచంద్రాపురం అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. కాగా రాములు తమ్ముడి కొడుకు దిలీప్ పక్క పోర్షన్లోనే ఉంటున్నాడు. అయితే ఆయనకు తెలియకుండా ఇంట్లో ఉన్న సామగ్రిని ఇంటి బయట సబ్జాపై పడేసి, ఓ మహిళకు అద్దెకిచ్చాడు. ఈనెల 5వ తేదీ రాత్రి రాములు గ్రామానికి వచ్చి తన ఇంట్లో ఉన్న మహిళను ఇల్లు అద్దెకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. అప్పుడే వచ్చిన తమ్ముడి కొడుకు దిలీప్కి ఆ మహిళ విషయం చెప్పింది. నా ఇంటిని కిరాయికి ఎలా ఇస్తావని దిలీప్పై అరిచాడు. ఇంటిని దక్కించుకుందామని ప్లాన్ వేసుకున్న దిలీప్ కట్టెల పొయ్యిలో ఉన్న కట్టె తీసుకొని విచక్షణారహితంగా కొట్టాడు. రాములు చేయి విరిగి కింద పడిపోగా ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని స్కూటీపై గ్రామంలోని కిరాణాషాప్కు వెళ్లి బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చాడు. వాకిట్లో పడి ఉన్న రాములుపై బట్టలు తీసుకువచ్చి మీద వేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. అతను చనిపోయాడనుకొని స్కూటీపై కొద్ది దూరం వెళ్లి గమనిస్తున్నాడు. ఈ క్రమంలో రాములు మంటల్లో నుంచి లేచి ఇంటి ప్రక్కన ఉన్న డ్రమ్ములో నీళ్ళు పోసుకొని మంటలను ఆర్పుకున్నాడు. మళ్లీ దిలీప్ రాములు వద్దకు వచ్చి కట్టెతో కొట్టగా అతడు కింద పడిపోగా, ఈడ్చుకుంటూ వెళ్లి మంటల్లో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్కు వెళ్లాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాములును ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. తమ్ముడు కుమారుడి రిమాండ్ వివరాలు వెల్లడించినబీడీఎల్ సీఐ స్వామి గౌడ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం ఇంటికి బట్టలు తీసుకునేందుకు వచ్చిన దిలీప్ను సీఐ స్వామి గౌడ్, ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన స్కూటీ, ఫోన్, పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. -
75 సంవత్సరాల చరిత్ర
హుస్నాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇటీవల పూర్వ విద్యార్థులతో కలిసి వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకుంది. ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చింది. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి స్పీకర్ మధుసూదనా చారి, ప్రస్తుతం జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల డైరెక్టర్ గాజుల శ్యాంప్రసాద్ లాల్ ఈ బడిలో చదువుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఐఎఫ్టీ ప్యానెల్స్, రోజు వారి హాజరు యాప్, బాలికలు, బాలురకు ప్రత్యేక టాయిలెట్స్, తాగునీటి వసతి కోసం వాటర్ ప్లాంట్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, 230 డెస్క్లు, అన్ని తరగతుల్లో చాక్ బోర్డ్స్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇప్పించేందుకు ప్రత్యేక టీచర్ నియామకం, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్లు ఈ బడి ప్రత్యేకతలు. -
ఇది ప్రభుత్వ భూమి.. కాదు పట్టా భూమి
కౌడిపల్లి(నర్సాపూర్): ఇది ప్రభుత్వ భూమి అని కబ్జా చేయవద్దని మండలంలోని వెల్మకన్న గ్రామస్తులు, బీజేపీ నాయకులు జేసీబీతో చేయిస్తున్న పనులను అడ్డుకున్నారు. కాగా ఇది మా సొంత భూమి అని పట్టా కూడా ఉందని స్థలం యజమాని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరగగా పోలీసులకు విషయం తెలియడంతో నచ్చజెప్పారు. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మోతీలాల్గౌడ్కు గ్రామ సమీపంలో వెల్మకన్న శివారులో వ్యసాయ భూమి ఉంది. కాగా బుధవారం జేసీబీతో ఆ స్థలంలో రాళ్లు తొలగించి చదును చేస్తున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు, బీజేపీ నాయకులు రాజేందర్, రాకేష్, అశోక్, రవిసాగర్ తదితరులు జేసీబీ ఆపాలని అడ్డుకున్నారు. దీంతో గొడవ జరుగుతుండటంతో స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి, పోలీసులు అక్కడి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పారు. పట్టాభూమిలో పనులు చేసుకుంటున్నానని మోతీలాల్గౌడ్ చెప్పగా, ఇది ప్రభుత్వ భూమి అని వెల్మకన్న గ్రామస్తులు వాదించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో ఎస్ఐ తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సుల్లో ఉన్నారని, అవి ముగిసిన తరువాత భూమి సర్వేచేసి హద్దులు నిర్వహిస్తామని ఎస్ఐ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పనులను అడ్డుకున్న గ్రామస్తులు, బీజేపీ నాయకులు ఎస్ఐ హామీతో సద్దుమణిగిన గొడవ -
భూసేకరణ కొలిక్కి..!
పలు గ్రామాల అవార్డులకు ఎన్హెచ్ఏఐ ఆమోదముద్ర ● పరిహారం చెల్లించేందుకు రెవెన్యూశాఖ సన్నాహాలు ● రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ తీరు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన అవార్డు (సేకరించే భూముల సర్వేనంబర్లు, పట్టాదారుల పూర్తి వివరాలు)లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఆమోదముద్ర వేసింది. మరికొన్నింటికి అప్రూవల్ రావాల్సి ఉంది. ఈ ఆమోదం వచ్చిన వెంటనే నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ఈ రహదారి ఉత్తర భాగం 161 కి.మీలు సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఆర్డీఓలు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇదీ జరిగింది... మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో శివంపేట, నర్సాపూర్ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 1,048 మంది రైతుల వద్ద మొత్తం 758 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 28 అవార్డులను ప్రకటించారు. ఇందులో ఎన్హెచ్ఏఐ పీడీ కార్యాలయం నుంచి 13 అవార్డులకు ఇప్పటికే అనుమతి లభించింది. మరో 15 అవార్డులకు అప్రూవల్ వచ్చిన వెంటనే పరిహారం చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 13 గ్రామాలు, ఆందోల్ డివిజన్లోని ఐదు గ్రామాలు కలిపి మొత్తం 824 ఎకరాలు సేకరిస్తున్నారు. సంగారెడ్డి డివిజన్కు సంబంధించి 24 అవార్డులకుగాను ఎన్హెచ్ఏఐ అధికారులు ఆరింటికి మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. ఆందోల్కు సంబంధించిన భూసేకరణ అవార్డులకు అప్రూవల్ రావాల్సి ఉంది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో 430 ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఎనిమిది గ్రామాల్లోని 482 మంది రైతులు నిర్వాసితులుగా మారుతున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన అవార్డులకు అప్రూవల్ కోసం ఎన్హెచ్ఏఐకి పంపనున్నారు. ఈ అప్రూవల్ వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు నిర్వాసిత రైతులకు పరిహారం పంపిణీ చేస్తారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలంటున్న నిర్వాసితులు.. తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతులు తమ భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూములు గుంజుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో పలుచోట్ల ఈ భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను నిర్వాసిత రైతులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిహారం కింద ఎకరానికి రూ.70 లక్షలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండటంతో తమ భూములకు తక్కువ పరిహారం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వంటి గ్రామాల నిర్వాసితులు ఈ భూసేకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే పనులను కూడా అడ్డుకున్నారు. మూడేళ్లలో జరిగిన లావాదేవీలను బట్టి ధర భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు ధర నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాలకు ధరను బట్టి...ఈ పరిహారం లెక్కిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పరిహారం అందే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.70 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
పేదలకే ఇందిరమ్మ ఇళ్ల్లు
గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి వారి సొంతింటి కల నెరవేర్చనున్నట్లు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లి, శాసీ్త్రనగర్, నెహ్రూనగర్, వెంకటాపూర్ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ గృహాలను కేటాయిస్తున్నామన్నారు. పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటి కల నెరవేర్చుకోవాలని సూచించారు. గృహాలు అర్హులకే దక్కాలనే సంకల్పంతో డిజిటల్ విధానంతో ఫొటో క్యాప్చరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు వారు పలు వార్డుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీలు పండరీరెడ్డి, రమేశ్ చౌహన్, తాహెర్, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
‘రైతు భరోసా’ వచ్చేనా
రాకుంటే సాగు సాగేదెట్టా! ● ప్రైవేటుగా పుట్టని అప్పులు ● విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తప్పని తంటాలు నోరు మెదపని అధికారులు రైతు భరోసా ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుందని రైతులు పదే పదే ప్రశ్నిస్తున్నా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. తగిన సమాధానం చెప్పకుండా మిన్నకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై రైతులు విమర్శిస్తున్నారు.జహీరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభం అయినా గత రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. రైతు భరోసా సాయాన్ని విడతలుగా అందజేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందజేయలేదు. గతేడాది వానాకాలం సీజన్లో రైతు భరోసా ఆర్థిక సహాయం కోసం రైతులు ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు. రబీ సీజన్లో కూడా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా సాయం అందిస్తామని ప్రచారం చేసుకున్నప్పటికీ అందరికీ ఇప్పటివరకు సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. రబీ సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందగానే అప్పులు తీర్చుతామని మాట ఇచ్చి పెట్టుబడులకు డబ్బు తెచ్చుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేక పోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సాగు పెట్టుబడులు లేక డీలా వానాకాలం సీజన్ ప్రారంభం అయినా చేతి లో చిల్లి గవ్వ కూడా లేకపోవడం, అప్పులు తెచ్చిన వారికి తిరిగి అప్పులు చెల్లించకపోవడంతో తాజాగా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకుల నుంచి కూడా అప్పు పుట్టని పరిస్థితి నెలకొందంటున్నారు. అందించింది సగమే! రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఆర్థిక సాయం జిల్లాలో సగం మందికి మాత్రమే అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 7.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రబీ సీజన్కుగాను రైతులకు ఎకరాకు రూ.6వేల వంతున ఒక విడత కింద సుమారు రూ.430 కోట్ల మేర రైతు భరోసా సాయం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.200 కోట్లు మాత్రమే జిల్లాలోని రైతాంగానికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ అయింది. ఇంకా సుమారు రూ.230 కోట్ల మేర రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. మూడున్నర ఎకరాల వరకే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని మూడున్నర ఎకరాల వరకు మాత్రమే అందజేసిందని రైతులు పేర్కొంటున్నారు. కొందరు రైతులకు మూడు ఎకరాలు ఉన్నా రైతు భరోసా అందలేదంటున్నారు. -
కబ్జా చేస్తే ఊరుకోం
● అధికారులు చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేయిస్తాం ● బీరంగూడ అఖిలపక్ష నేతల హెచ్చరికపటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ దేవాలయం పరిసరాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని బీరంగూడ అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. బీరంగూడ గుట్ట కమాన్ వద్ద మల్లికార్జున్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో బుధవారం పట్టణ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు అదేల్లి రవీందర్, తాజా మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేశ్తోపాటు బీరంగూడ గ్రామ పెద్దలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారుల అవినీతి కారణంగానే ప్రభుత్వ భూమి మాయమవుతుందన్నారు. అధికారులు సర్కారు భూములను కాపాడకపోతే తామే పేద ప్రజలతో గుడిసెలు వేయించి కబ్జాలు చేయిస్తామని హెచ్చరించారు. అధికారులు తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకపోతే హైడ్రా కమిషనర్ వద్దకు వెళ్తామని, అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని వారు చెప్పారు. అమీన్పూర్ కొత్తగా మండలంగా రూపుదిద్దుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేని దుస్థితి ఉందన్నారు. అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం బీరంగూడ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారని, పోలీస్ స్టేషన్ను ఇక్రిశాట్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారని, ఒక్కక్రీడా మైదానం లేదని ఇలా అనేక అవసరాలున్నాయని అదేల్లి రవీందర్ వివరించారు. బీరంగూడ అమీన్పూర్లో ఎంతోమంది పేదలున్నారని వారికి సొంత ఇళ్లు లేవని గుర్తు చేశారు. -
బడిగంటకు వేళాయే
సంగారెడ్డి జోన్: నేటి నుండి బడి గంట మోగనుంది. సుమారు నెలన్నర రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేస వి సెలవులలో ఆటపాటలు, విహారయాత్రలో గడిపిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమ య్యే సామగ్రి కొనుగోలుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీరిక లేకుండా గడుపుతున్నారు. పాఠశాలలకు పుస్తకాలు, దుస్తులు పాఠశాలలు తెరువక ముందే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేసింది. జిల్లాకు 7,33,210 పుస్తకాలు అవసరం ఉండగా 7,02,900 పుస్తకాలు పాఠశాలలకు చేరకున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫాం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా 1,09,000వేల యూనిఫాం చేరుకున్నాయి. నేడు వట్పల్లిలో బడిబాట పాఠశాలల పునఃప్రారంభఃలో భాగంగా నేడు వట్పల్లి మండలంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతతోపాటు కల్పించే మౌలిక వసతులు తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతూ బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిసారిగా ఉపాధ్యాయులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తొలిసారిగా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బోధన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు దఫాలుగా నిర్ణయించి, శిక్షణ అందించారు. అదేవిధంగా పాఠశాలల్లో పని చేసే సిబ్బందితో పాటు వంట నిర్వాహకులకు సైతం శిక్షణ ఇచ్చారు. ఎంతో ఉత్సాహంగా బడికి.. సెలవుల తర్వాత పాఠశాలకు స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. పాఠశాల ప్రారంభం అనగానే కొత్త పుస్తకాలు, నోట్ పుస్తకాలు సంతోషాన్ని ఇచ్చేవి. పుస్తకాలకు ర్యాపర్స్ వేసుకునేవాళ్లం. పాఠశాల ప్రారంభం రోజే స్నేహితులంతా కలుస్తారనే ఉత్సాహం ఉండేది. ప్రతీ ఒక్కరు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. –వల్లూరు క్రాంతి, కలెక్టర్ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ.. మా ఇంటి నుంచి పాఠశాలకు కిలోమీటరు దూరం ఉండేది. బడికి రోజూ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. మొదటి రోజు పాఠశాల అనగానే కొత్తగా ఆనందంతోపాటుగా తెలియని అనుభూతి కలిగేది. కొత్త స్నేహితులు, కొత్త తరగతి గదిలో కూర్చోవటం సంతోషం కలిగించేది. ప్రతీ ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. –పరితోశ్ పంకజ్, ఎస్పీ నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఉపాధ్యాయులకు పూర్తయిన శిక్షణ బడిబాట పట్టనున్న విద్యార్థులు జిల్లాలోని పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలలు 1,248 మోడల్ స్కూల్స్ 10 కేజీబీవీ 22 విద్యార్థులు 1,20,000 పాఠశాలలకు వచ్చిన పుస్తకాలు 7,02,900 యూనిఫాం 1,09,000 -
దైవచింతనతో మానసిక ప్రశాంతత
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు టౌన్: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని జగన్నాథ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్ జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు సన్మానించారు. కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులుజహీరాబాద్ టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్కు మద్దతుగా బుధవారం ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. వాహనాల్లో బయల్లేరి వెళ్లిన వారు బీఆర్కే భవనం వద్ద ప్లకార్డులు పట్టుకుని కేసీఆర్కు మద్దుతుగా నినాదాలు చేశారు. హైదారాబాద్కు వెళ్లిన వారిలో బీఆర్ఎస్ నాయకులు రవికిరణ్, నారాయణ,పెంటారెడ్డి, సంజీవ్రెడ్డి, మశ్చేందర్, రామకృష్ణరెడ్డి ఉన్నారు. పనిభద్రత కల్పించాలిసీఐటీయూ నాయకుడు యాదగిరి సంగారెడ్డి: మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పని భారం తగ్గించడంతోపాటు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశా రు. హాజరు పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తున్న మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి ఎం.యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో రెండు చేతులు విరిగిన కాంట్రాక్ట్ కార్మికుడు మహేశ్ను సీఐటీయూ నాయకులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ...కార్మికుడు ప్రమాదానికి గురయితే మానవత్వం చూపించాలి కానీదురుసుగా ప్రవర్తించకూడదన్నారు. మహేశ్ను వేధించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కిష్టారెడ్డిపేటలో కూల్చివేతలు పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కిష్టారెడ్డిపేటలో బుధ వారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈసందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చామని, వాటికి స్పందించని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి నోటీసులు ఇచ్చామని, తమ సూచనలను పట్టించుకోకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తే కూల్చివేశామని తెలిపారు. -
ఇంట్లో నుంచి వెళ్లి.. ఎర్రకుంటలో శవమై
గజ్వేల్రూరల్: భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఎర్రకుంటలో శవమై కనిపించాడు. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని రహమత్నగర్కు చెందిన గుంటుకు రాంచందర్(70) తన భార్య సత్తవ్వతో గొడవపడి ఈనెల 6న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని ఎర్రకుంటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు రాంచందర్గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. సంగారెడ్డి క్రైమ్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం.. భవానీనగర్కు చెందిన గొగికర్ ఈశ్వర్, కళాబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు గొగికర్ రాకేష్ (35) వృత్తిరీత్యా చికెన్ షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం శంకర్పల్లికి చెందిన రేవతితో వివాహం జరగగా పాప ఉంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 20 రోజుల క్రితం రేవతి పాపను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఆదివారం చికెన్ షాపునకు వెళ్లిన రాకేష్ రాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులు రూమ్ తలుపులు తడితే తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా స్విమ్మింగ్ పోటీలు
రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక సిద్దిపేటజోన్: జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్లో మంగళవారం వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 5 నుంచి 16 ఏండ్ల లోపు ఉన్న బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 130మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీలను మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిభ చూపిన వారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీలను ప్రవీణ్ తదితరులు పర్యవేక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
కొల్చారం(నర్సాపూర్): బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే టీ జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ వివరాల ప్రకారం... కౌడిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మెగావత్ శివరాం(44) హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల డిప్యుటేషన్పై మెదక్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎప్పటిలాగే ఉదయం బైక్పై శివరాం కౌడిపల్లి నుంచి మెదక్ వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరుకు వెళ్తోంది. ఏడుపాయల టీ జంక్షన్ వద్దకు రాగానే శివరాం బైకును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్) : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మంద స్వామి(42) తనకున్న అరెకరంలో వ్యవసాయంతోపాటు తాపీమేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుమారు రెండేళ్ల క్రితం పెద్ద కూతురు వివాహం చేయడానికి తెచ్చిన అప్పులతో పాటు రేకుల ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పులు ఎక్కువయ్యాయి. పంట చిట్టీలకు చెల్లించడానికి డబ్బులు సమకూరకపోవడం, మరో ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉండటం భవిష్యత్తులో వారి వివాహాలు ఎలా చేయాలో మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని ఖాన్ చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. పటాన్చెరు టౌన్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి వివరాల ప్రకారం... రామేశ్వరంబండా గ్రామానికి చెందిన భరత్ గౌడ్ (26) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చి తన ఆటోను స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో యువకుడు.. వర్గల్(గజ్వేల్): కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వర్గల్ మండలం నెంటూరులో జరిగింది. బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగ స్వామి, సంతోష దంపతుల పెద్ద కొడుకు సాయికిరణ్(20) ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురయ్యాడు. సాయికిరణ్ రోజు మాదిరిగా పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సోమవారం సాయంత్రం గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం గ్రామస్తులు గమనించి కుటుంబీకులకు తెలియజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెదనాన్నపై తమ్ముడి కొడుకు దాడి..
పటాన్చెరు టౌన్: సొంత పెదనాన్నపై తమ్ముడి కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్కు చెందిన రాములు (60) (రిటైర్డ్ వీఆర్ఓ)కు గ్రామంలో మూడు రూమ్లు ఉన్నాయి. పక్కనే ఆయన సోదరుడికి కూడా ఉన్నాయి. రాములు రామచంద్రపురం పరిధిలోని అశోక్నగర్లో ఉంటున్నాడు. ఆయన సోదరుడు కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతడి భార్య, కుమారులు ఘనపూర్లో ఉంటున్నారు. ఈనెల 4న రాత్రి ఘనపూర్కు వెళ్లాడు. రాములుకు చెందిన ఇంటిలో ఓ మహిళ ఉండటంతో ఇల్లు నీకు ఎవరు అద్దెకిచ్చారని అడిగాడు. పక్కనే ఉన్న ఆయన తమ్ముడి కొడుకు దిలీప్కుమార్ వచ్చి నీ ఇల్లు ఎక్కడ ఉందని గొడవపడ్డాడు. అనంతరం రాములుపై దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను అదేరోజు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి కుమారుడు చైతన్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆపై పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం చికిత్స పొందుతూ మృతి -
అందుబాటులోకి తెస్తాం
మినీ, ఇండోర్ క్రీడా మైదానాలను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తాం. గతంలో నిధులు సరిగా లేక నిర్వహణ చేయలేకపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకెళ్లి మెరుగైన క్రీడా మౌలిక వసతులు కల్పిస్తాం. అవసరమైన మరమ్మతులు చేయిస్తా. నిర్వహణ కోసం పే అండ్ ప్లే కింద క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు చేస్తాం. నైట్ వాచ్మెన్, స్వీపర్లను నియమిస్తాం. క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. –జంగపల్లి వెంకట నర్సయ్య, డీవైఎస్ఓ, సిద్దిపేట -
అంతర పంటలతో ఆదాయం
● పప్పుధాన్యాలు సాగు చేస్తే మేలు ● ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు ● సాగుపై సూచనలు చేస్తున్న అధికారులుకొల్చారం(నర్సాపూర్): సాధారణంగా రైతులు ఒక కాలంలో ఒకే పంటను సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల పంట నష్టపోతే రైతు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో రెండు లేదా మూడు పంటలను ఒకేసారి సాగు చేయవచ్చు. ఒకటి ప్రధానపంట, రెండవదీ అంతర పంట. ప్రధాన పంటతోపాటు అంతర పంటలుగా పప్పు దినుసులను సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనమని కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి పేర్కొన్నారు. ప్రయోజనాలు ఒక పంట నష్టపోతే రెండవ పంట నుంచి రాబడి సంపాదించి, నష్టాన్ని భర్తీ చేయవచ్చు. రైతు పొలం నుంచి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెంచవచ్చు. కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని పంటల మధ్యనున్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేల కోతను అరికట్టవచ్చు. పంటల నాణ్యతను పెంచవచ్చు. పుష్పజాతి మొక్కలు, గడ్డిజాతి ధాన్యపు మొక్కలతో భూ సారాన్ని పెంచవచ్చు. సరైన పద్ధతిలో పంటల్ని ఎంచుకొని అంతర పంటలు పండించడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. భూసారాన్ని పెంచుతాయి పప్పుధాన్యాల పంటలు రాల్చిన ఆకులు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజనిని రైజోబియం వేరుబుడిపెల ద్వారా స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. అంతేకాక అన్ని పప్పుధాన్యాల ఉత్పత్తికి దోహదపడి లభ్యత పెరిగి కొరతను తగ్గిస్తాయి. తోడుగా రైతుకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.పత్తిపంటలో అంతర పంటగా సాగు చేస్తున్న కందిఒక పంట మరో పంట దిగుబడిని పెంచేలా..నేల నుంచి పోషక పదార్థాలు, నీరు గ్రహించే లోతులో వ్యత్యాసం ఉండే వేర్ల నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి. ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి. పోషక పదార్థాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటీ ఉండకూడదు. వేర్వేరు కాలపరిమితులలో ఉన్న పంటలను, కలపడం వల్ల పోషక పదార్థాల అవశ్యకతలో తేడాలవల్ల, కీలక దశల్లో పోటీ ఉండకుండా ఆరోగ్యంగా పెంచవచ్చు. బహువార్షిక పంటలైన ఉద్యాన పంటలు తొలుత నాలుగైదేళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో పంటలు పండించవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి రెండు కంటే ఎక్కువ పంటలను వివిధ దశల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటపై ఆకర్షించి చీడపీడల బారి నుంచి ప్రధాన పంటను రక్షించవచ్చు. -
పట్టు బట్టారు.. ర్యాంకు సాధించారు
జగదేవ్పూర్(గజ్వేల్)/ బెజ్జంకి(సిద్దిపేట): ఇద్దరిది ఒకే ఊరు..మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే.కలలు కన్నారు.. ర్యాంకు సాధించారు. సోమవారం విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశపరీక్షల్లో హర్షవర్ధన్ మొదటి ర్యాంకు సాధించగా, శివప్రసాద్ 6వ ర్యాంకు సాధించాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన కర్రావుల హర్షవర్ధన్ జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 2022లో కూడా ఓయూ పీహెచ్డీ ప్రవేశపరీక్షలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం కెమిస్ట్రీ ప్రవేశపరీక్ష రాసి మళ్లీ స్టేట్ మొదటి ర్యాంకు పొందాడు. ర్యాంకు రావడం పట్ల సంతోషంగా ఉందని, తన కష్టం వెనుక అమ్మనాన్నల ఆశీర్వాదం ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. శివప్రసాద్కు 6వ ర్యాంకు.. గుండారం గ్రామానికి చెందిన బొల్లి శివప్రసాద్ జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నాడు. ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఫీలాసఫీలో స్టేట్ 6వ ర్యాంకు సాధించాడు. మొదటి సారి పరీక్ష రాసి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. -
బెట్టింగ్కు అలవాటుపడి చోరీలు
● వృద్ధురాలి ఆభరణాల చోరీ కేసులో నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మనోహరాబాద్(తూప్రాన్): వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని ఆభరణాలతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ వివరాలు వెల్లడించారు. తూప్రాన్ మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాదనపురం పెంటయ్య(30) మండలంలోని వట్టూర్ గ్రామానికి చెందిన వరలక్ష్మి(30)తో సహజీవనం చేస్తున్నాడు. కాగా నిందితుడికి భార్యాపిల్లలు ఉన్నారు. నిందితుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసై ఈ క్రమంలో లోన్లు సైతం తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ అవ్వడంతో తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడు. గత సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ పల్సర్ బైక్ను చోరీ చేసి ఆంధ్రాకు చెందిన నంబర్ ప్లేట్ అమర్చాడు.ఈ నెల 7న సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ పాములపర్తికి వెళ్లేందుకు గజ్వేల్ బస్టాండులో ఉంది. నిందితులు వరలక్ష్మి వృద్ధురాలికి మాయమాటలు చెప్పి పెంటయ్యతో కలిసి బైక్ౖపై తీసుకొని పర్కిబండ సమీపంలోని ఓ గుడిలోకి వెళ్లి మద్యం తాగారు. కాగా వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె ఒంటిపై ఉన్న తులం బంగారు నల్లపూసల తాడు, చెవికమ్మలు, 50 తులాల వెండి కడియాలు చోరీ చేశారు. వృద్ధురాలు అరవగా చంపుతామని బెదిరించి పరారయ్యారు. వెంటనే వృద్ధురాలు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దండుపల్లి వద్ద వాహనాల తనిఖీలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. -
మందుబాబులకు జరిమానా
పటాన్చెరు టౌన్: డ్రంకెన్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. పటాన్ చెరు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం నిర్వహించిన వాహన తనిఖీలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా ఏడుగురికి రూ. వెయ్యి, ఐదుగురికి రూ.1500 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. హోటల్లో తిష్ట వేసిన కొండెంగ నర్సాపూర్: పట్టణంలోని ఓ హోటల్కు మంగళవారం కొండెంగ వచ్చి దర్జాగా కూర్చుంది. అడవి నుంచి వచ్చిన కొండెంగ స్థానిక రెడ్ రోస్ హోటల్లోకి వచ్చి ఖాళీగా ఉన్న ఓ టేబుల్ పక్కన కుర్చీలో కూర్చుంది. హోటల్ యజమాని అహ్మద్ దానికి బిస్కట్లు ఇవ్వగా తిని అక్కడే కునుకు సైతం తీసింది. కాగా సుమారు రెండు గంటల పాటు ఉండగా అక్కడకు వచ్చిన కస్టమర్లు దాని పక్క నుంచి వెళ్లినా ఏమనకుండా కూర్చోవడంతో పలువురు మొబైల్స్తో ఫొటోలు తీసుకున్నారు. కోతులు తమ ఇండ్లలోకి, హోటళ్లలోకి రాగానే వాటిని వెళ్లగొట్టేందుకు పట్టణ ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. కాగా హోటల్కి వచ్చిన కొండెంగను యజమాని వెళ్లగొట్టక పోవడం గమనార్హం. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే పిట్స్ చికిత్స పొందుతూ వరుడు మృతి జహీరాబాద్ టౌన్: ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పెళ్లి కొడుకుని విధి వెంటాడింది. వధువు మెడలో తాళి కట్టిన కొన్ని నిమిషాలకే వరుడికి పిట్స్ వచ్చి మృతి చెందాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం చిలమామిడి గ్రామానికి గొల్ల రాములు పట్టణంలోని శాంతినగర్లో ఉంటున్నాడు. ఆయన చిన్నకుమారుడు ధనరాజ్(25) పట్టణ సమీపంలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువర్గం సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకు పెళ్లి పీటలపై పిట్స్ వచ్చి కుప్పకూలాడు. వెంటనే ధనరాజ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో బంధుమిత్రులు దుఃఖంలో మునిగిపోయారు. చిలమామిడిలో అంత్యక్రియలు నిర్వహించారు. 12న అమర్నాథ్కు సరుకుల లారీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జమ్ము కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రలో భాగంగా చేపట్టనున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన సరుకుల వాహనాలను ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు అమర్నాథ్ సేవాసమితి అధ్యక్షుడు కాచం కాశీనాథ్, చైర్మన్ చీకోటి మధుసూదన్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శరబేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అనంతరం సరుకుల లారీకి పూజలు చేసి పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, టీపీసీసీ సెక్రటరీ గంప మహేందర్ హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు భూపతి, లక్ష్మణ్, రాములు, శరభయ్య, నవీన్ కుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
సబ్జైల్ను సందర్శించిన అధికారులు
జోగిపేట(అందోల్): జోగిపేట సబ్జైల్ను రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) సందీప్ శాండిల్య పలువురు ఐపీఎస్ అధికారులు బృందాలుగా వచ్చి మంగళవారం సందర్శించారు. సబ్జైలులోని అన్ని గదులను, ఏరియాను పరిశీలించారు. ఆకస్మికంగా జైలును సందర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. డిటెక్టివ్ విభాగం డీసీపీ శ్వేతారెడ్డి, టీఎస్ఎన్ఏబీ సందీప్ శాండిల్యలు వేర్వేరుగా జైలును సందర్శించి జైలు పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు, ఐపీఎస్ అధికారి రమణకుమార్, డీఎస్పీ సత్తయ్యగౌడ్లతో కలిసి సందర్శించారు. స్థానిక సీఐ,ఎస్ఐలు కూడా వారి వెంట ఉన్నారు. మోడల్ హౌజ్ నెల్లో పూర్తి చేయాలిగృహనిర్మాణ పీడీ చలపతిరావు కంగ్టి(నారాయణఖేడ్): నెల రోజుల్లోగా మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు మంగళవారం ఏఈలను ఆదేశించారు. కంగ్టి మండల కేంద్రంలో మోడల్ హౌజ్ నిర్మాణానికి సంబంధించి మార్క్అవుట్ చేశారు. మండలంలోని గాంధీనగర్, జీర్గితండా, సుక్కల్తీర్థ్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ తివారీ, ఏఈలు సత్యనారాయణ, అంకుశ్, వంశీకృష్ణ పాల్గొన్నారు. -
బంగారు భవిష్యత్తుకు ఇంటర్ కీలకం
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని సివిల్స్కు ఎంపికయ్యా ● 450 మంది విద్యార్థులకు రూ.9 లక్షల నగదు బహుమతిపటాన్చెరు: విద్యార్థి జీవితంలో లక్ష్యం, ఇంటర్మీడియెట్ అత్యంత కీలకమని విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ , జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని, రేషన్ షాపులను, ఇందిరమ్మ ఇళ్ల పనులను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...తాను విద్యార్థి దశలోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని కలెక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకుని అందుకునుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని లక్ష్యాన్ని సాధించానన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి..విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఇటీవల 30 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భూ భారతి చట్టాన్ని అనుసరించి ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన ఉండాలి: ఎస్పీ పరితోశ్ విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. బిహార్లోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో..దశాబ్ద కాలంగా పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 450 మంది మొదటి బహుమతి రూ.3 వేలు, ద్వితీయ బహుమతి రూ.రెండు వేలు, తృతీయ బహుమతి వెయ్యి రూపాయల చొప్పున రూ. తొమ్మిది లక్షల నగదు పురస్కారాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం
రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నిమ్జ్ భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నిమ్జ్ ప్రాజెక్టుపై కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ...ప్రాజెక్టును సకాలంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణకు అందించే పరిహార పంపిణీ వేగవంతం చేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. మొదటి దశలో సేకరించిన భూములకు సంబంధించి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. 12,630 ఎకరాల లక్ష్య సేకరణలో ఇప్పటికే 7,300 ఎకరాలు భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. భూ సేకరణపై ప్రతీ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీఓ రాంరెడ్డి, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమ్జ్ భూములు పరిశీలన జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ భూములను రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ స్థానిక అధికారులతో పరిశీలించారు. ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్, ఎల్గోయి గ్రామ శివారుల్లోని ప్రాజెక్టు భూములను పరిశీలించారు. -
రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు
సీడీసీ చైర్మన్ రాంరెడ్డి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామాల్లో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు సీడీసీ చైర్మన్ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని కంభాలపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సరస్వ తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన భూ భారతితో సమస్యలు పరిష్కారం కానున్నాయ న్నారు. భూ భారతి చట్టంతో ప్రజలకు మెరు గైన సేవలు అందుతాయన్నారు. రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసిన వారికీ రశీదు లు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, నాయకులు బాబు, అంజన్న, భీంసేన్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఊపందుకున్న ఇందిరమ్మ ఇళ్ల పనులుజహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసి పూనాదుల పనులు ఊరూరా ఊపందుకున్నాయి. జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఇళ్ల నిర్మాణానికి ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అంద జేశారు. లబ్ధిదారుల స్థలాల వద్ద ముగ్గు వేసి పునాది పనులు ప్రారంభించారు. రెండు మండలాల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు మొదలయ్యాయి. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల సర్టిఫికెట్లు అందజేసి, ముగ్గులు వేశారు. కార్పొరేట్ ప్రయోజనాలకే లేబర్ కోడ్లుసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: మోదీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకే లేబర్ కోడ్లను తీసుకువస్తుందని వీటి రద్దు కోసం జూలై 9న జరగను న్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్ర త లేక కార్మికుల జీవితాలు దుర్భరం అయ్యా యని వాపోయారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో ఎంతో అభివృద్ధిబీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హత్నూర(సంగారెడ్డి): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి జరిగిందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ పేర్కొన్నారు. హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హత్నూర మండలం దౌల్తా బాద్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్గౌడ్ మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కాని నిర్ణయాలు తీసుకుని సుసాఽ ద్యం చేసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మోదీనేన్నారు. -
నిమ్జ్ లబ్ధిదారుల ఎంపిక షురూ
● సీఎం రేవంత్రెడ్డి హామీ అమలు దిశగా అధికారుల చర్యలు ● 3,300 మంది జాబితా సిద్ధం.. ఎంపీడీఓలకు అప్పగింత సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నిమ్జ్లో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నిర్వాసితుల సమస్యలు మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని ఈ ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యతలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన ఈ హామీ అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితుల జాబితాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3,300 మంది నిర్వాసితుల జాబితాలను భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కార్యాలయం అధికారులు ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. మిగిలిన నిర్వాసితుల జాబితాలను కూడా త్వరలో అప్పగించనున్నారు. వారిలో అర్హులెంత మంది? భూసేకరణ అధికారులు ఇచ్చిన జాబితాలో ఇందిర మ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ఎంపీడీఓలు కసరత్తు చేస్తున్నారు. ఈ నిర్వాసితుల్లో అనర్హులు ఎవరైనా ఉన్నారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. భూములు కోల్పోయిన వారిలో కొందరు హైదరాబాద్, సంగారెడ్డివంటి చోట్ల నివాసముంటున్నారు. ఇలాంటి వారిని మినహాయించి స్థానికంగా నివాసముంటున్న నిర్వాసితులకే ఈ గృహాలను మంజూరు చేయనున్నారు. వీరిలో ఇంటి స్థలం ఉన్న వారు ఎంత మంది? స్థలం లేని వారు ఎంత మంది తేల్చనున్నారు. స్థలం లేనివారి కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు వంటి వాటిపై అధికారులు ఆయా మండలాల రెవెన్యూ, ఎంపీడీఓలు దృష్టి సారించారు. 5,612 మంది నిర్వాసితులు మూడు లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూ.31 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ కోసం మొత్తం 12,635 ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్రంలో భారీ ఎత్తున భుములు సేకరిస్తున్న వాటిలో నిమ్జ్ కూడా ఒకటి. జహీరాబాద్ ప్రాంతంలో న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో ఈ భూములను సేకరిస్తున్నారు. 5,612 మంది రైతులు ఈ నిమ్జ్లో భూములు కోల్పోతున్నారు. ఇందులో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. -
జ్ఞాన ఉద్యమంలో భారత్ ముందంజ
గ్లోబల్ యంగ్ సైంటిస్ట్ సదస్సులో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ జ్ఞాన ఉద్యమంలో భారత్ ముందు వరుసలో ఉందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నాగరి కత సూత్రాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ దేశంలో ఉందని వివరించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ యంగ్ సైంటిస్ట్ సదస్సులో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని మాట్లాడారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఏఎన్ఆర్ఎఫ్ వంటి కార్యక్రమాలు అట్టడుగు వర్గాల ఆవిష్కరణలను పెంపొందించడానికి, పరిశోధనలకు ప్రోత్సాహాకా న్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ అసుతోశ్ శర్మ, జీవైఏ కో చైర్మన్ ఎన్సీ ఫ్లోరీస్, ఐఐటీహెచ్ గవర్నింగ్ బాడీ చైర్మన్ డాక్టర్ బీవీ మోహన్రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ -
డిప్యూటీ స్పీకర్కు సన్మానం
నారాయణఖేడ్: డిప్యూటీ స్పీకర్గా ఇటీవల నియమితులైన రాంచందర్ నాయక్ను మంగళవారం హైదరాబాద్లోని బంజారాసేవాలాల్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రమేశ్చౌహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంచందర్ నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించడం పార్టీకి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు. రాంచదర్నాయక్ను కలిసిన వారిలో సంఘం నాయకులు లక్ష్మణ్ చౌహన్, మోహన్ రాథోడ్ ఆయన వెంట ఉన్నారు. -
నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
కొండాపూర్(సంగారెడ్డి): నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కొండాపూర్లో తహసీల్దార్ అశోక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ...మండలంలోని పల్లెలను, గ్రామాలను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన వ్యాపారులు చెలరేగిపోతున్నారన్నారు. రైతులను మోసం చేసేందుకు కాలం చెల్లిన మందులను, నకిలీ విత్తనాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ... కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు అందేలా చూడాలని కోరారు. -
కేంద్రంపై కార్మికలోకం ఉద్యమించాలి
జిన్నారం (పటాన్చెరు): కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక లోకానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయాలని చూస్తోందని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు కోడ్లను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లి టీఐడీసీ పరిశ్రమ కార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే 95% కార్మికులకు వెట్టిచాకిరిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని 12 గంటల వరకు పెంచుతారని అలాగే కనీస వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ బోనస్ సౌకర్యాలు కూడా అందవని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని కార్మిక వర్గం అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశ్, రాజయ్య, భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, శ్రీరాములు, ప్రభాకర్, సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు -
పిట్ మెజర్మెంట్కు పాతర
సిబ్బంది లేమితోనే! పిట్ మెజర్మెంట్ ప్రక్రియ నిర్ణీత సమయంలో ఎందుకు నిర్వహించలేదనే విషయమై ‘సాక్షి’భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవిబాబును వివరణ కోరగా.. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఈ పక్రియ సకాలంలో జరిగి ఉండకపోవచ్చన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని ఇకపై ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పారు. ● కళ్లు మూసుకున్నందుకు అధికారులకు కాసులు! ● మైనింగ్ కుంభకోణంలో అధికారుల పాత్రపై అనుమానాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాళ్లు, ఖనిజాల క్వారీల్లో అక్రమ మైనింగ్ దందాకు భూగర్భ గనుల శాఖ అధికారులు అడుగడుగునా వంత పాడారా.? రూ.వందల కోట్లు సీనరేజీ ఎగవేసి ఇష్టానుసారంగా ఖనిజ సంపదను కొల్లగొడుతుంటే అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఈ అధికారులకు కాసుల వర్షం కురిసిందా..? జిల్లాలో వెలుగు చూసిన రూ.974 కోట్ల మైనింగ్ కుంభకోణంలో భూగర్భ గనులశాఖ అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మైనింగ్ మాఫియా నుంచి ప్రతినెలా పెద్ద మొత్తంలో దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసిన ఆశాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారనేది సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో స్టోన్ అండ్ మెటల్ క్వారీల్లో నిర్వహించిన ఈటీఎస్ సర్వేలో భారీ మైనింగ్ కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అడ్డగోలు సహజ సంపదను లూఠీ చేసిన 15 మైనింగ్ కంపెనీలకు రూ.974 కోట్లు చెల్లించాలని ఆశాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. రాజకీయ అండదండలతో ఇష్టానుసారంగా దోపిడీ చేసిన మైనింగ్ మాఫియా..జిల్లాలోని సహజ సంపదను లూఠీ చేసింది. విచ్చల విడిగా తవ్వకాలు జరిపి విలువైన స్టోన్ అండ్ మెటల్ను తరలించి రూ.వేల కోట్లు వెనుకేసుకుంది. ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు..? ఏదైనా మైనింగ్ లీజు మంజూరు చేస్తే...ఆ లీజు తీసుకున్న క్వారీలో ఎంత మొత్తంలో ఖనిజ సంపద తవ్వి రవాణ చేశారు. తరలించిన ఈ ఖనిజ సంపదకు అంతేమొత్తంలో భూగర్భ గనులశాఖకు సీనరేజీ చెల్లించారా..? అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్ణీత సమయంలో పిట్ మెజర్మెంట్ ప్రక్రియ చేపట్టాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఈ పిట్ మెజర్మెంట్ ప్రక్రియను నిర్వహించాలి. పిట్ మెజర్మెంట్ చేస్తే ఎంత మొత్తంలో ఖనిజాన్ని తవ్వారనేది తేలిపోతుంది. అయితే ఏళ్ల తరబడి ఈ పిట్ మెజర్మెంట్ జరగలేదు. ఎంతన్నా తవ్వుకుని పోనివ్వు..మాకు ప్రతినెలా మామూళ్లు ఇస్తే చాలన్నట్లు ఆశాఖ అధికారులు వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ అక్రమ మైనింగ్పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కనీసం ఫిర్యాదులు వచ్చిన క్వారీల్లోనైనా ఈ పిట్ మెజర్మెంట్ ప్రక్రియ నిర్వహించలేదంటే..ఆ శాఖ అధికారులు ఈ దోపిడీకి ఏ మేరకు సహకరించారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుని కళ్లు మూసుకున్నారనే విమర్శలున్నాయి. అధికారుల పాత్రపై విచారణ జిల్లాలో వెలుగు చూసిన మైనింగ్ కుంభకోణంలో ఆ శాఖ అధికారుల పాత్రపై విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లుగా, జియాలజిస్టులుగా, రాయల్టీ ఇన్స్పెక్టర్లు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన అధికారుల పాత్ర ఈ కుంభకోణంలో ఎంత వరకు ఉందనే అంశపై లోతైన విచారణ జరగాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన అధికారులు చాలామంది రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
బడిబాట ర్యాలీలు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలంలోని కొడకంచి, నల్తూర్ తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య వసతులను వివరించారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశాలు కల్పించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆదివారం సెలవు దినమైన బడిబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొగిలిమాల, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీ నిధులతో బోర్ల తవ్వకాలు నారాయణఖేడ్: తాగునీటి సమస్య పరిష్కారానికి పలు గ్రామాలు, తండాలకు బోర్ల తవ్వకం కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తనకోటా నిధుల ద్వారా ఒక్కోచోట బోరు తవ్వకం, మోటారు బిగించడం, పైపులైను ఏర్పాటు పనులకోసం రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ఖేడ్ మండలం స్కూల్ తండా, హన్మాన్ తండాలతోపాటు మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో బోర్ల తవ్వకాలను ఆయా తండాల పెద్దలు, గ్రామస్తులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. నీటి ఎద్దడి నివారణకోసం ఎంపీ నిధులు కేటాయించడం పట్ల ఆయా తండాల వాసులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నారాయణఖేడ్: ఖేడ్ పట్టణ శివారులోని మనూరు క్రాస్రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన లలితాంబిక దేవి ఆలయంలో నిర్వహిస్తున్న లలితాంబిక దేవి సహిత శివనంది, గణపతి, సుబ్రహ్మణ్య, శ్రీచక్ర, నాగదేవత, నంది, ధ్వజ, శిఖర విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు, త్రయహ్నిక యాగమహోత్సవాలు మూడవరోజైన ఆదివారం కొనసాగాయి. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, యువజనకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, మాజీ జెడ్పీటీసీ జితేందర్నాథ్ షెట్కార్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. వేల కోట్ల అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ పాత్ర ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడం ప్రాజెక్టు ఖర్చు రూ.60 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు పెంచడం రూ.30 వేల కోట్ల అవినీతిలో బీజేపీ,బీఆర్ఎస్ పాత్ర ఉన్నట్లు కనిపిస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆరోపించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆదివారం పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రాజెక్టులపై మాజీమంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 35 పథకాలతో రాష్ట్రంలోని సంబండ వర్గాల ప్రజల కార్మిక కర్షక అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యువరాజ్, రతన్సింగ్, అంజయ్య, మల్లేశ్, రవి, ప్రకాశ్, ఆశిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిమ్జ్లో హ్యుందాయ్ విస్తరణ
సంగారెడ్డిజోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్)లో ఏర్పాటు కానున్న హ్యుందాయ్ పరిశ్రమను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రాంతాల్లో పరిశ్రమ విస్తరణకు అనుకూలమైన నేలలు ఉండటంతో హ్యుందాయ్ ప్రతినిధులు పరిశ్రమను విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా నిమ్జ్లో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పరిశోధనాభివృద్ధి కేంద్రం ఏర్పాటు దక్షిణ కొరియా ఆటోమెటివ్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ రాష్ట్రంలోని నిమ్జ్లో ఆ సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించనుంది. సుమారు 675 ఎకరాల విస్తీర్ణంలో రూ.8,500కోట్లతో నెలకొల్పనున్నారు. ఇందులో ఆటోమెటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటో టైపింగ్ ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా కార్ల తయారీతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు, వాహనాల టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 4,000లకు పైగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడి ప్రాంతంలో 407 ఎకరాల విస్తీర్ణంలో ఇదే పరిశ్రమ వాహనాల టెస్టింగ్ ట్రాక్ నిర్మించేందుకు భూములను కేటాయించింది. అయితే ప్రస్తతం రిసెర్చ్ సెంటర్ను స్థాపించాలని నిర్ణయించింది. అనుకూలమైన భూములు గుర్తింపు ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో పరిశ్రమ ఏర్పాటుకు మొదటగా భూమిని కేటాయించారు. పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములలో సాంకేతిక బృందం సభ్యులు సుమారు 50 పాయింట్లలో 20 మీటర్ల మేర లోతులో మట్టి నమూనాల్లో సేకరించి పరిశ్రమల స్థాపనకు భూములు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలో భూములు పరిశీలించనున్న పరిశ్రమ ప్రతినిధులు నిమ్జ్లో పరిశ్రమ స్థాపన కొరకు పరిశ్రమ ప్రతినిధులు త్వరలో పర్యటించి, భూములు పరిశీలించనున్నారు. ఇందుకోసం ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్, ఎల్గోయి ప్రాంతాల్లో భూములను కేటాయించారు. 675ఎకరాలు.. రూ.8,500కోట్ల పెట్టుబడులు పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కేటాయింపు త్వరలో భూములు పరిశీలనకు ప్రతినిధులు -
చేప ప్రసాదానికి పోటెత్తిన జనం
నారాయణఖేడ్: ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తెను పురస్కరించుకుని నిజాంపేట్ మండల కేంద్రంలో ఆదివారం పంపిణీ చేసిన చేప ప్రసాదానికి జనాలు బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలనుంచి వేలాదిమంది తరలివచ్చారు. ఏటా గ్రామంలోని తమ ఇంటివద్ద పంపిణీ చేస్తూ వస్తుండగా ప్రసాదం కోసం వస్తున్న వేలాది మందికి స్థలం చాలక పోతుండటంతో ఈసారి గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కనే టెంట్లు వేసి పంపిణీ చేపట్టారు. తడ్కంటి సోదరులు తడ్కంటి పర్వాగౌడ్, లింగాగౌడ్, నాగరాజు, శంకర్గౌడ్, వెంకటేశ్గౌడ్, సాయిబాబా గౌడ్లు వ్యాధిగ్రస్తులతో చేపప్రసాదాన్ని మింగించారు. దూర ప్రాంతాల నుంచి కొంతమంది ప్రసాదం కోసం శనివారం సాయంత్రం నిజాంపేటకు చేరుకోగా వారికి నిర్వాహకులు బస ఏర్పాట్లు చేశారు. ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధిగ్రస్తులకు పంపిణీ -
ముదిరాజ్ల సంక్షేమానికి సహకారం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● అమీన్పూర్లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని ముదిరాజ్ల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించనున్న ముదిరాజ్ భవనం పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సేవా దృక్పథం, ధైర్యానికి మారుపేరైన ముదిరాజ్లు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సొంత నిధులతో ముదిరాజ్ల కోసం సంక్షేమ సంఘం భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ను రూ.రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో ఆధునీకరించినట్లు గుర్తు చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజ్లు అందించిన సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేశ్, బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మృతికి సంతాపంజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే,సీనియర్ నాయకులు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే గూడెం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా మూడుసార్లు శాసన సభకు ఎన్నికై ..ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సాధించుకున్న గోపీనాథ్ మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
దుబ్బాకటౌన్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రఘపతి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోనగిరి బాలయ్య (65) భార్య హంసవ్వతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగి హంసవ్వ అమ్మగారింటికి వెళ్లిపోయింది. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలేదు. బాలయ్య తరచూ తన కూతురికి ఫోన్ చేస్తూ బాధపడేవాడు. దీంతో మనస్తాపానికి గురై అతడు ఆదివారం ఉరివేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి.. చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాసాయిపేట మండల పోతాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బర్రె మహేశ్(30) ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. మహేశ్ ఇటీవల కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన అతడు శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలో వ్యక్తి.. హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన మధుసూదన్రెడ్డి, భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అతడు బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు వృథా చేయడంతోపాటు మద్యం తాగి భార్యను కొడుతున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో భర్త.. జగదేవ్పూర్(గజ్వేల్): భార్య ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని నిర్మల్నగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రె కిరణ్(27) హైదరాబాద్లో పనిచేస్తున్న క్రమంలో కామారెడ్డికి చెందిన నీరజను ఐదేళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలోనే ఉంటున్నారు. ఆమె గజ్వేల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుండగా, కిరణ్ గ్రామంలోనే వ్యవసాయం, పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఐదేళ్ల లోపు కుమార్తెలు ఉన్నారు. కాగా కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. భార్య ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద పెద్ద కూతురుకు సెల్ఫోన్ ఇచ్చి తాను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని మంచం నవారుతో ఊరేసుకుకున్నాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. -
శనిగరం అద్భుతం
చుట్టూ ఎత్తైన కొండలు.. పరుచుకున్న పచ్చని చెట్లు..వాటి మధ్యలో నిండుకుండలా అందమైన ప్రాజెక్ట్. కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో ఆరో నిజాం రాజు మీర్మహబూబ్ అలీఖాన్ 1887లో జలాశయం నిర్మాణం ప్రారంభించగా 1891లో పూర్తయింది. నేటికి 134 ఏళ్లు..అయినా చెక్కు చెదరకుండా ఉంది. మొదట్లో 4,827 ఎకరాల్లో ఆయకట్టు ఉండేది. ప్రస్తుతం రెండు మండలాల్లో కలిపి 5100 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. – కోహెడ రూరల్ (హుస్నాబాద్):జలాశయం నిర్మించి 134 ఏళ్లుప్రాజెక్టు రాగి తూము● సీసం, డంగు సున్నం, బంకమట్టితో నిర్మాణం ● నేటికీ చెక్కు చెదరని ప్రాజెక్ట్ ● 9 గ్రామాల్లో 5100 ఎకరాలకు సాగు నీరు ● వందేళ్లు దాటినా లీకేజీలు లేవుశనిగరం జలాశయం నిర్మాణానికి 504 కిలోల బంగారం ఖర్చు శనిగరం గ్రామంలో నిజాం కాలంలో మధ్యతరహ ప్రాజెక్టు నిర్మాణం అప్పటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద చెరువుగా శనిగరం ప్రాజెక్టు ఉండేది. ఈ పురాతన జలాశయం కోసం ఆ కాలంలో 560 సీర్లు (504 కిలోల బంగారం)ఖర్చు చేశారు. చెరువు తూము, ఆనకట్టను నున్నటి బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మధ్యలో సీసం, డంగుసున్నం, బంకమట్టిని నింపి నిర్మించారు. ఇప్పటికీ చెరువు నిండా నీరున్నా ఒక్క చుక్క కూడా లీక్ కాదు. నాడు చేపట్టిన పనులు అంత అద్భుతంగా ఉండటమే కారణమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఒక టీఎంసీ ఉండి 42 అడుగుల ఎత్తులో ఉంటుంది. 5100 ఎకరాలకు సాగు నీరు శనిగరం గ్రామంలో నిర్మించిన ప్రాజెక్టుతో కోహెడ, బెజ్జంకి మండలాల్లో కాలువల ద్వారా 9 గ్రామాలకు 5100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రత్యేకత ఏంటంటే ఈ రిజర్వాయర్ నిండినా ఎలాంటి ప్రమాదం లేకుండా నీరు వాటంతట అవే పోయేలా పాలింగ్ గేట్లను మొదట అమర్చారు. ఈ తరహా గేట్లు తుప్పు పట్టడంతో ఆధునీకరించి కొత్త గేట్లు బిగించారు. రైతులకు, మత్స్యకారులకు ఈ చెరువు కల్పతరువుగా మారింది. గంగమ్మ, దాయాల మత్తడి కాలువల ద్వారా వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతోంది.రైతులకు ఆధారం మా గ్రామంలోని రైతులకు ప్రాజెక్టు ఆధారం. సుమారు ఐదువేల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందుతోంది. బోరు, బావుల్లో నీరు కంటే ఈ నీటితో పంటలు బాగా పండుతాయి. ఈ ప్రాంత రైతులకు ఇదే జీవనాధారం. –గునిగంటి రాజయ్య, రైతు, శనిగరం 100 టన్నుల చేపల ఉత్పత్తి ప్రాజెక్టుపై వెయ్యి మందికి పైగా మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం 100 టన్నులకు పైగా చేపల ఉత్పత్తి అవుతోంది. చేపలతో పాటు రొయ్యలు కూడా ఇక్కడ లభిస్తాయి. – సూతరి కనకయ్య, సంఘం నాయకులు -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
హత్నూర (సంగారెడ్డి): విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన హత్నూరలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మంగలి నరసింహులు వారం రోజుల క్రితం టేక్మాల్ పశువుల సంతలో 1.50 లక్షలు పెట్టి రెండు ఎడ్లను కొనుగోలు చేశాడు. ఆదివారం గ్రామ శివారులో మేత కోసం రెండు ఎడ్లను తీసుకొని వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ కింద ఓ ఎద్దు మేత మేసేందుకు వెళ్లడంతో విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడింది. దీంతో కళ్ల ఎదుటే లక్షల రూపాయలు పెట్టి తెచ్చిన ఎద్దు మృతి చెందడంతో బాధితుడు బోరున విలపించాడు. -
లిఫ్ట్ ఇచ్చి.. ఆభరణాలు చోరీ
మనోహరాబాద్(తూప్రాన్): లిఫ్టు పేరుతో వృద్ధురాలిని బైక్పై ఎక్కించుకున్న గుర్తుతెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మండలంలోని పరికిబండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్గౌడ్ వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ అనే మహిళ శనివారం గజ్వేల్ మీదుగా వర్గల్ మండలంలోని పాములపర్తికి బయలుదేరింది. ఈ క్రమంలో గజ్వేల్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా బైక్పై వచ్చిన వ్యక్తితో పాటు మరో మహిళ వృద్ధురాలిని మాటల్లో పెట్టి పాములపర్తిలో దించుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. పాములపర్తిలో దింపకుండా మనోహరాబాద్ మండలంలోని పరికిబండ శివారుకు తీసుకొచ్చి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం రామవ్వ మెడలోంచి తులం బంగారు ఆభరణంతో పాటు 50 తులాల వెండి కడియాలు తస్కరించి పరారయ్యారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న అనంతరం వృద్ధురాలు తన ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడు బైక్పై వెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.వృద్ధురాలి బంగారు, వెండి కడియాలు అపహరణ -
కూలిన పట్టుపురుగుల షెడ్డు
కౌడిపల్లి(నర్సాపూర్): మల్బరి పట్టు పురుగుల షెడ్డు ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలింది. ఈ ఘటన మండలంలోని రాయిలాపూర్తండాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నునావత్ రాజు తన పొలంలో కొన్నేళ్ల క్రితం మల్బరి పట్టుపురుగుల షెడ్డు నిర్మించాడు. ప్రస్తుతం లాభాలు సరిగా లేకపోవడంతో ఖాళీగా ఉంది. కాగా రాత్రి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన రావడంతో షెడ్డు పూర్తిగా కూలింది. రేకులు, గోడలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో రాజుకు సుమారు రూ .2లక్షలు నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. కలశం విగ్రహం వెలుగులోకి.. హుస్నాబాద్రూరల్: మండలంలోని పొట్లపల్లి మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం పునాది తవ్వుతుండగా రాతి కలశం విగ్రహం బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో 1996లో కూడా పెద్ద శివలింగం బయటపడటంతో అక్కడే దేవాలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. పొట్లపల్లి నూటొక్క దేవాలయాలకు నిలయంగా ఉండేదని చరిత్ర కారులు అభిప్రాయపడుతున్నారు. మల్లికార్జునస్వామి వారి విగ్రహం కూడా గతంలో బయట పడటంతో అక్కడే గుడి నిర్మించి పూజలు చేస్తున్నారు. రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు శివ్వంపేట(నర్సాపూర్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామ చౌరస్తా తూప్రాన్– నర్సాపూర్ హైవేపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏదుల్లాపూర్ పులుగం వాడకు చెందిన సంజీవరెడ్డి గ్రామం నుంచి బైక్పై దొంతి వైపునకు వస్తున్నాడు. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామానికి చెందిన మేకల లక్ష్మీ, నర్సిహులు దంపతులు శివ్వంపేటలో పెళ్లికి వెళ్లి గ్రామానికి బైక్పై వస్తుండగా రెండు బైక్లు ఉసిరికపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నర్సిహులు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోగా, లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. సంజీవరెడ్డికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి.. అక్కన్నపేట(హుస్నాబాద్): వృత్తిలో భాగంగా ఓ గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గౌరవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బైరగోని రవి ఆదివారం గ్రామ సమీపంలోని తాటివనంలోని తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్లో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతదేహం లభ్యంసంగారెడ్డి క్రైమ్: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రమేష్ వివరాల ప్రకారం... స్దానిక మహబుబ్సాగర్ చెరువు కట్ట పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
యంత్రం సాగుకే మొగ్గు
● కూలీల కొరత, పెట్టుబడుల భారం తగ్గింపు ● దుక్కి దున్నేది మొదలు పంట కోత వరకు యంత్రాలే ● కిసాన్ మేళాలో రైతుల పరిశీలన హుస్నాబాద్రూరల్: వానాకాలం మొదలవ్వడంతోనే రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతారు. ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు, విత్తనాలు వేసేందుకు కూలీలకు ముందుగా డబ్బులు చెల్లించి పనులకు తీసుకెళ్తారు. విత్తనాలు, వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకకపోవడంతో బీహార్, మహారాష్ట్ర బీదర్, ఒడిశా రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. కూలీల కొరత, జాతీయ ఉపాధిహామీ పథకంతో కూలీ రేట్లు పెరగడంతో రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతోంది. దీనిని అధిగమించడానికి రైతులు యంత్రాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కిసాన్ మేళాలో రైతులు యంత్రాల అన్వేషణలోనే నిమగ్నమై వాటి పని తీరు, ధరలు, బ్యాంకుల నుంచి అందించే రుణాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తే అధిక దిగుబడులు తీసి వ్యవసాయంను పండగ చేస్తామని రైతులు అభిప్రాయపడుతున్నారు. కలుపు తీయడానికి.. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్న రైతులు విత్తనాలు వేసేందుకు యంత్రాలను వాడుతున్నారు. రూ.5వేలకు దొరికే విత్తన యంత్రంతో రెండు గంటల్లో ఎకరం దుక్కిలో విత్తనం వేయొచ్చు. మొక్కల మధ్య దూరం పెంచుకునే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటల్లో కలుపు తీయడానికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కూలీల అవసరం లేకుండా పవర్ టిల్లర్తో 2 గంటల్లో కలుపు తీయొచ్చు. మార్కెట్లో పవర్ టిల్లర్ రూ.72వేలకు దొరుకుతుంది. పత్తి తీసేందుకు, మొక్కజొన్న పంటను కోసే యంత్రాలు రైతులకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కూరగాయల విత్తనాలు నాటే యంత్రాలను కూడా కిసాన్ మేళాలో ప్రదర్శించడం ద్వారా రైతులు ఆసక్తిగా పరిశీలించారు. నాట్లు వేసేందుకు.. వరి నాట్లు వేయాలంటే రైతులకు కూలీల కొరత ఉంది. ఒక ఎకరంలో నాటు వేయడానికి కూలీల ఖర్చు రూ.7,500 అవుతుంది. రెండు లీటర్ల పెట్రోల్తో మిషన్ ఎకరం నాటు వేస్తుంది. ఎకరాకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు నాటు వేసే యంత్రాలు అద్దెకు దొరుకుతాయి. యంత్రం సహాయంతో నాటు వస్తే డబ్బులు తక్కువ, సమయం కూడా ఆదా అవుతుంది. వరిలో కలుపు తీసే వీడర్ మార్కెట్లో ఉంది. రైతులు వరి నాటు మొదలు కోత వరకు యంత్రాల కోసమే ఎదురు చూస్తున్నారు.సబ్సిడీపై ఇవ్వాలి కిసాన్ మేళా వల్ల గ్రామాల రైతులకు చాలా విషయాలు తెలిశాయి. కూలీల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం యంత్రాలను సబ్సిడీపై అందిస్తే రైతులకు పెట్టుబడుల భారం తగ్గుతుంది. డ్రోన్ సహాయంతో ఎరువులు పిచికారీ చేయడం వల్ల రైతులకు క్రిమిసంహారక మందుల ప్రమాదం తప్పుతుంది. ఊరికి నాలుగు నాటు వేసే యంత్రాలు, డ్రోన్లు, సాగుకు ఉపయోగపడే యంత్రాలు ఇస్తే ఊరందరికి ఉపయోగపడతాయి. – అలేటి ఈశ్వర్రెడ్డి, రైతు, పోతారం(ఎస్) -
స్టాల్స్ సందర్శించి.. ప్రదర్శనలు తిలకించి
వర్గల్(గజ్వేల్): హుస్నాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు, ప్రదర్శనలను ఆదివారం మండల రైతులు తిలకించారు. ములుగు ఏడీఏ అనిల్కుమార్, వ్యవసాయాధికారి శేషశయన ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్ల నుంచి 200 పైచిలుకు రైతులు తరలివెళ్లారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన వివిధ యంత్రాలు, డ్రోన్ పరికరాలను పరిశీలించారు. స్టాళ్లలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన కొత్త వంగడాల గురించి తెలుసుకున్నారు. వారి వెంట ఏఈఓలు సంతోష్, సునీత, భారతి, మానస, సుప్రజ, తేజస్వి ఉన్నారు.రైతు మహోత్సవంలో వర్గల్ రైతులు -
చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు ..
కల్హేర్(నారాయణఖేడ్): చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్ మండలంలోని రాంరెడ్డిపేట్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గంగారాం(42) చేపలు పట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా గాలి వీచడంతో ప్రమాదవశాత్తు తెప్ప బోల్తా పడింది. దీంతో గంగారాం నీటిలో మునిగి చేపల వలలో చిక్కుకుని మృతి చెందాడు. వెంటనే వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించింది. కల్హేర్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. -
సేద్యంలో రైతే శాస్త్రవేత్త
హుస్నాబాద్: వ్యవసాయ సేద్యంలో రైతే పెద్ద శాస్త్రవేత్త అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండ రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి తెచ్చి రైతుల ఇక్కట్లను దూరం చేస్తున్నారన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయన్నారు. త్వరలో రైతుకు విత్తన హక్కు కల్పించే విధంగా విత్తన చట్టం తీసుకువచ్చేందుకు కమిటీలు వేశామని తెలిపారు. పసుపు రైతులు యాంత్రీకరణ దిశగా ఆలోచించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని కోదండరెడ్డి సూచించారు. రైతుకు కులం, మతం లేదని అందరి వాడని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు. భూ పరీక్ష చేసుకొని అనుకూలమైన పంట వేయాలని సూచించారు. మంచి విత్తనాలు అందిస్తాం సీడ్ కార్పొరేషన్ ద్వారా మేలైన విత్తనాలు అందిస్తున్నామని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ కంపెనీల ప్రచారాలకు మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని, అయినా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. పంట మార్పిడి చేసి దిగుబడి సాధించుకోవాన్నారు. యంత్ర పరికరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థ,విత్తన చట్టం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిసద్వినియోగం చేసుకోండి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకురావడానికే రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఎవరైనా ఈఎంఐ కింద రుణాలు పొంది యంత్రాలు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భవానీ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సింగూరు చేపకు గిరాకి
● మృగశిర కార్తె ఆరంభం నుంచే విక్రయాల సందడి ● ఆస్తమా, ఉబ్బసం వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకంపుల్కల్(అందోల్): మృగశిర కార్తె ఆరంభం రోజే చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావని చాలామంది నమ్ముతుంటారు. ఆదివారం మృగశిర ప్రారంభం కావడంతో చేపలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఇక జిల్లాలో సింగూరు చేపకున్న డిమాండ్ అయితే చెప్పనవసరం లేదు. పసందుగా సింగూరు చేప జిల్లాలో ఉన్న ఏకై క భారీ నీటిపారుదల సింగూరు బహుళార్థసాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు, జంట నగరాల ప్రజలకు తాగునీటిని, స్థానికంగా సాగునీటిని అందిస్తుంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మత్స్యకారులకు ఉపాధిని కల్పించి వారి జీవితాల్లో సిరులు పూయిస్తుంది. ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకుని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగూరు డ్యాంలో పెరిగే చేపలు రుచికరంగా ఉంటాయని చేప ప్రియులు చెబుతుంటారు. ఇక్కడ పెరిగిన చేపలు హైదారాబాద్తోపాటు, జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు చాలామంది చేపలు కొని తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వమే చేప పిల్లల విడుదల సింగూరు భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వమే చేప పిల్లలను విడుదల చేస్తుంది. ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలను, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు చాలామంది చేపల వృత్తిని ఎన్నుకుని ఉపాధి పొందుతున్నారు. జోరుగా విక్రయాలు మత్స్యకారులు పట్టిన చేపలను కొందరు వ్యాపారులు ఆటోల్లో తరలించి సమీప పట్టణాల్లో విక్రయిస్తారు. స్థానికులు మాత్రం అక్కడే ప్రాజెక్టు సమీపంలో షెడ్లు వేసుకుని విక్రయాలు చేపడతారు. మృగశిర నాడు ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయాలు చేపడతారు. ప్రస్తుతం డ్యాంలో 18 టీఎంసీల వరకు నీరు ఉండటంతో చేపల సంపద వృద్ధి చెందుతుంది. ప్రతీ ఊళ్లో అమ్మకాలు గ్రామాల్లో చెరువుల్ని మత్స్యకారులకే ప్రభుత్వం అప్పగించి, చేప పిల్లలు సరఫరా చేయడంతో ఊరూరా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో జీవించే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. సాధారణ చేపలు కిలో రూ.150 కాగా కొర్రమీను లాంటి రకాలు కిలో రూ.350కు విక్రయిస్తారు. మృగశిర నాడు మాత్రం రెట్టింపు ధరలతో విక్రయిస్తారు.చేపలు పట్టడమే జీవనాధారం సింగూరు డ్యాంలో చేపలు పట్టి వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి చేపల వేట ప్రధాన జీవనాధారం. ప్రభుత్వం మత్స్యకారులకు లైసెన్స్లు ఇచ్చి పలు ప్రోత్సాహకాలిస్తుంది. పట్టిన చేపల్లో కొన్ని స్థానికంగా విక్రయించి మిగతావి వ్యాపారులకు హోల్సేల్ ధరలకు సరఫరా చేస్తాం. – టేకు లక్ష్మణ్ (మత్స్యకారుడు,సింగూరు) మార్కెట్ ఏర్పాటు చేయాలి సింగూరు ప్రాజెక్టులో మత్స్యకారులు మూడు దశాబ్దాలుగా చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు. సింగూరులో చేపల మార్కెట్ లేక మత్స్యకారులు దళారులకు సరఫరా చేస్తున్నారు. స్థానికంగా చేపల మార్కెట్ ఏర్పాటుచేయాలని పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చేపల మార్కెట్ ఏర్పాటు చేయడానికి గత పాలకులు స్థలాన్ని పరిశీలించినా ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో మత్స్యశాఖకు పట్టున్న సింగూరులో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల కు మేలు జరుగుతుంది. –నందికంటి శ్రీనివాస్ (సింగూరు మత్స్యకార సంక్షేమ సంఘం, అధ్యక్షుడు) -
విత్తు తొందరపాటేనా!
రోహిణి కార్తెలో అకాల వర్షాల సంబరం● ముందే విత్తిన పత్తి విత్తనాలు ● వేడిమితో చనిపోతున్న విత్తన పిండం ● 12తర్వాతే వర్షాలంటున్న వాతావరణశాఖముందస్తుగా విత్తనాలు వేసిన కూలీలునారాయణఖేడ్: బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రోహిణి కార్తెలో అకాల వర్షాలు కురవడం..రుతుపవనాలు సైతం ముందస్తుగానే పలకరిస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పడం...కొందరు రైతులు సైతం తొందరపడి ముందస్తుగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అయితే రైతులు, వాతావరణ శాఖ వేసిన అంచనాలు తల్లకిందులై రోహిణి కార్తెలో ఎండలు దంచికొట్టడంతో వేసిన పత్తి విత్తనాలు మొలకదశలోనే వాడిపోయాయి. తొందరపాటుతో నష్టమే రోహిణి కార్తెలో కురిసిన వర్షాలతో వేసిన పత్తి విత్తనాలతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మే నెలలో సాధారణంగా 19.1మి.మీ వర్షపాతం కురియాల్సి ఉంది. కానీ, వర్షాకాలం తరహాలో 106మి.మీ వర్షపాతం కురిసింది. జిల్లాలో 15, 16, 17, 18, 21, 23, 24 అధిక వర్షపాతం నమోదు కాగా 17న అత్యధికంగా జిల్లాలో 29.5మి.మీ, 24న 23.7మి.మీ నమోదయ్యింది. భారీ వర్షాల వల్ల రైతులు జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో సుమారు 20వేల ఎకరాల వరకు పత్తి విత్తనాలు విత్తారు. ఎకరా పత్తి విత్తనాలు నాటేందుకు 1.75కిలోల విత్తనం బస్తాకు రూ.1వేయి, 8 నుంచి 10మంది కూలీలకు రూ.4వేల నుంచి 5వేల వరకు వెచ్చించగా ఇతరత్రా ఖర్చులు కూడుకుని రూ.6వేల నుంచి రూ.7వేలు ఖర్చు చేశారు. ముఖ్యంగా గర్భు నేలల్లో విత్తడం వల్ల నష్టం అధికంగా వాటిల్లుతుంది. నల్లరేగడి నేలలు నీటి తడులను తట్టుకుని ఉండటం వల్ల వర్షాలు కొంత ఆలస్యమైనా విత్తనం చనిపోకుండా ఉంటుంది. మొరంతో కూడుకున్న గర్భునేలల్లో నీటి తడులు పట్టుకొని ఉండకుండా కురిసిన నీరు భూగర్భంలోకి ఇంకడం వల్ల విత్తనం వేశాక ఎండలు కాయడంతో విత్తన పిండం చనిపోతుంది. గతేడాది కూడా ఇలాగే ముందస్తు కురిసిన వర్షాలకు పత్తి విత్తుకొన్న రైతులు చివరకు మొలకలు సరిగా రాకపోవడంతో దున్నేసి తిరిగి విత్తనాలు విత్తుకున్నారు. మృగశిర ప్రవేశించాకే... మృగశిర కార్తె ప్రవేశించాక తొలకర్లు కురిసి భూమి బాగా నానిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతూనే ఉన్నారు. అధికారుల సూచనలు అంతగా పట్టించుకోకపోవడం వల్ల గతేడాది, ఈ ఏడు విత్తనాలు ముందస్తుగా విత్తిన రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఈ ఖరీఫ్లో పత్తి విత్తనాలను 1,43,817.81 హెక్టార్లలో సాగుచేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.12 తర్వాతే వర్షాలు.. మృగశిర కార్తె ఈనెల 8న ప్రారంభం అవుతుంది. కార్తె ప్రారంభం నుంచి తొలకర్లు పలకరిస్తాయి. కాగా వాతారణ శాఖ అధికారులు 12వ తేదీ తర్వాతే తొలకరి వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరణకు అవసరమైన తేమ వెళ్లిపోవడం వల్లనే ప్రస్తుతం పొడిగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. మరో వారంపాటు నైరుతి రుతుపవనాల పురోగమనం కష్టమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా రైతులు ముందస్తు వర్షాలకు తొందర పడటం వల్ల నష్టాన్ని మిగులుస్తున్నట్లు తెలుస్తోంది. -
రేషన్.. పరేషాన్
● సర్వర్, సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ ఆలస్యం ● ఇబ్బందులు పడుతున్న రేషన్ డీలర్లు, లబ్ధిదారులున్యాల్కల్(జహీరాబాద్): సన్న బియ్యం కోసం రేషన్ షాప్ల వద్ద కార్డుదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండటంతో రేషన్ బియ్యం తీసుకొనేందుకు ఉదయమే రేషన్ దుకాణాల వద్దకు వెళ్తున్నారు. రేషన్ను త్వరగా తీసుకుని పొలం పనులకు వెళ్లవచ్చనే ఆశతో దుకాణాలకు వెళ్తున్నప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్షాప్ల వద్ద సర్వర్ బిజీ, వేలిముద్రలు వెంటనే రాకపోవడం తదితర కారణాల వల్ల సమయానికి రేషన్ ఇవ్వలేక డీలర్లు, రేషన్ పొందలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు నెలల రేషన్ పొందేందుకు కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. వేధిస్త్తున్న సర్వర్ సమస్య సన్న బియ్యం కోసం రేషన్షాప్లకు వెళ్లిన కార్డుదారులు సమయానికి బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్రప్రభుత్వం 5 కిలోల బియ్యం సరఫరా చేస్తుండగా, ఒక కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఐదు కిలోల బియ్యంకు ఒకసారి, ఒక కిలో బియ్యం ఒకసారి ఫింగర్ ప్రింట్ యంత్రంపై వేలిముద్రలు ఇవ్వాలి. అయితే మూడు నెలల రేషన్కు మొత్తం ఆరుసార్లు వేలిముద్రలు ఇవ్వవలసి రావడంతో ఒక్కొక్క కార్డు దారుడు బియ్యం తీసుకునేందుకు 15 నుంచి 30 నిమిషాలు పడుతోంది. అయితే కొన్నిసార్లు వేలిముద్రలు తీసుకునే క్రమంలో సర్వర్ సమస్య తలెత్తడంతో బియ్యం పంపిణీ మరింత ఆలస్యమవుతోంది. సర్వర్ సమస్యతో పాటు వేలి ముద్రలు త్వరగా రాకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా రోజుకు 100 మంది కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని బియ్యం పంపిణీలో జాప్యాన్ని నివారించాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.సర్వర్ సమస్యతోనే ఇబ్బంది సర్వర్ బిజీ కారణంగా రేషన్ బియ్యం పంపిణీ చాలా ఆలస్యం అవుతోంది. రోజుకు 100 మంది కార్డుదారులకు కూడా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. –అబ్ధుల్ రెహ్మాన్, రేషన్ డీలర్,అత్నూర్ ఇబ్బందులు తొలగిస్తాం సర్వర్ బిజీ కారణంగా రేషన్ బియ్యం పంపిణీలో వస్తున్న ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఈ పాస్ స్థానంలో కొత్త సాప్ట్వేర్ను తీసుకువస్తున్నాం. కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రేషన్ షాప్లను పరిశీలిస్తున్నారు. –జి.బాల సరోజ, డీసీఎస్ఓ, సంగారెడ్డి -
త్యాగానికి ప్రతీక బక్రీద్
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం పటాన్చెరు టౌన్: త్యాగానికి చిహ్నమైన బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్ ఒకటని, ఈ పండుగ త్యాగానికి ప్రతీకని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ బక్రీద్ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ బక్రీద్ను పురస్కరించుకుని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంవట్పల్లి(అందోల్): మండల పరిధిలోని పోతులబొగుడా మోడల్ పాఠశాలలో 2025–26 ఏడాదికిగాను అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దీనా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పీజీటీ వృక్షశాస్త్రం–1, పీజీటీ గణితం–2 మొత్తం మూడు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ అర్హతను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక జత జిరాక్స్ పత్రాలను ఈ నెల 13న పాఠశాలలో నిర్వహించే డెమో తరగతులకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 7569382704 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. అనుమతుల్లేకుండా వ్యాపారాలు చేయవద్దుజోగిపేట మున్సిపాలిటీ కమిషనర్ తిరుపతి జోగిపేట(అందోల్): ట్రేడ్ లైసెన్స్లు లేకుండా వ్యాపార సంస్థలను నడపకూడదని జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్ సీహెచ్.తిరుపతి స్పష్టం చేశారు. జోగిపేట పట్టణంలోని దుకాణాలలోని ట్రేడ్ లైసెన్స్లను శనివారం పరిశీలించారు. లైసెన్స్ లేనివారు వెంటనే తీసుకోవాలని లేదంటే జరిమానాలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణంలో 634 దుకాణదారులు మాత్రమే లైసెన్స్లు కలిగి ఉన్నారని, రెన్యూవల్ చేయించుకోవలసిన వారు వెంటనే అనుమతులను పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు. 10న గిరిజన గురుకులంలో ఇంటర్లో ప్రవేశాలునారాయణఖేడ్:ఖేడ్ గిరిజన బాలుర సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు ఈనెల 10న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు టీసీ, పదోతరగతి మార్కుల మెమో, స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, గ్రామీణ ప్రాంతాలవారైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలవారైతే రూ.2 లక్షలకు మించని ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్, క్రీడలు, అర్థాన్, దివ్యాంగులైతే ధ్రువీకరణ పత్రాలు, మూడు కలర్ పాస్పోర్టు సైజు ఫొటోలు, రెండు జతల జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. రేపు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’రాయికోడ్(అందోల్): మండల కేంద్రం రాయికోడ్లోని రైతువేదికలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి సారిక శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంటల సాగుకు సంబంధించి ఏడీఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. పంట మార్పిడి ప్రాధాన్యత, దిగుబడులు పెంచుకునే మార్గాలు, నూతన వంగడాల ప్రత్యేకతలు, ప్రాంతీయ పంటల యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై సమగ్ర వివరాలను రైతులకు వివరిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సాహో.. సర్కారు బడి
సరికొత్త ఒరవడిలో ప్రభుత్వ పాఠశాలలు ● కృత్రిమ మేధ..డిజిటల్ పాఠాలు ● ప్రీ ౖప్రెమరీ నుంచి ఆంగ్ల మాధ్యమం ● పీఎంశ్రీ పాఠశాలలకు రూ.కోటి ● చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యండిజిటల్ బోధన మెదక్ జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు, నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు 963 ఉండగా, 93,166 మంది విద్యార్థులున్నారు. ఈ యేడు ఆంగ్ల మాధ్యమంతో కూడిన పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. భవిష్యత్ అవసరాల కనుగుణంగా డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఐఎఫ్పీ ప్యానల్ బోర్డులపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఇందుకు 176 పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ కనె క్షన్లు సైతం ఇస్తున్నారు. ఇందులో ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడం ద్వారా అన్ని సబ్జెక్ట్ల కంటెంట్ పొందుపరుస్తున్నారు. కృత్రిమ మేధలో భాగంగా ఏఐఎక్స్ఎల్ ప్రోగ్రాం ప్రారంభించారు. 21 పాఠశాలలను ఎంపిక చేశారు. 40 మందికి పైగా విద్యార్థులున్న మరో 300 పాఠశాలల ఎంపికకు ప్రతిపాదనలు పంపించారు. ఎక్స్టెప్ సంస్థ ఆధ్వర్యంలో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడంతో పాటు గణితంలో కూడా కనీస సామర్థ్యాలు సాధించేలా కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నారు. పాపన్నపేట(మెదక్): సర్కారు బడులు విజ్ఞాన శాలలుగా విరాజిల్లుతున్నాయి. బడిలో తొలి అడుగులు ఆంగ్ల మాధ్యమంతోనే ప్రారంభమవుతున్నాయి. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన రూ.కోటి నిధులతో పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి. డిజిటల్ శిక్షణ, కృత్రిమ మేధ, నిపుణుల బోధన, ఆట పాటల మైదానాలు..కళల కార్యశాలలు విద్యార్థులను జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఉపాధ్యాయుల అంకిత బోధనతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ఈ యేడు పదో తరగతిలో 96.87 శాతం ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. అందుకే‘ సర్కార్ బడి పిలుస్తొంది రా’ అంటూ ఉపాధ్యాయులు‘ బడిబాట’ పట్టారు. పీఎంశ్రీ పథకంతో రూ.కోటి ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైవింగ్ ఇండియా’పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలకు ఐదేళ్లలో రూ.కోటి నిధులు ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. 24 అంశాల కింద ఐదేళ్లలో రూ.కోటి మంజూరు చేస్తారు. బాలికల్లో ఆత్మరక్షణ, కిచెన్ గార్డెన్, వార్షికోత్సవాలు, విజ్ఞాన యాత్రలు, పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పాఠశాలలకు నిధుల వరద నిధుల వరదతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సౌకర్యాలు ఒన గూరుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జిల్లాలోని 562 పాఠశాలలకు రూ.20.62 కోట్లు మంజూరయ్యాయి. వీటితో బడిలో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా 10 నెలల పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ కోసం రూ.5.06 కోట్లు మంజూరు చేశారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పథకం కింద అన్ని పాఠశాలలకు రంగులు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ యేడు 3కి.మీ దూరం నుంచి బడికి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్టు అలవెన్స్ మంజూరు అయింది. క్రీడల వేదికలు.. ప్రభుత్వ పాఠశాలలు పరిపూర్ణ వికాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. విద్యార్థి నిత్య జీవితంలో ఆటలు భాగస్వామ్యం అవుతున్నాయి. అలాగే వేడుకల వేళ సాంస్కృతిక కార్యక్రమాల ధూం ధాం జోరందుకుంటుంది. వార్షికోత్సవాలు నిర్వహిస్తూ., విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట విద్యార్థిని అర్చిత కళాఉత్సవ్ కార్యక్రమంలో జాతీయ స్థాయికి ఎంపికై ంది. అలాగే మెదక్ టీజీఆర్ఎస్ విద్యార్థిని శ్రీవాణి జాతీయ స్థాయి ఫుట్బాల్లో పోటీల్లో పాల్గొంది. ఇన్స్పైర్ పోటీల్లో పాపన్నపేట మండలం చీకోడ్ లింగాయపల్లి విదార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈయేడు పదో తరగతిలో తూప్రాన్ టీజీఆర్ఎస్ విద్యార్థి అభిలాష్ 586 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచాడు. 58 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ రాహుల్రాజ్ ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందిస్తాం. నిష్ణాతులైన టీచర్లతో విద్యాబోధన చేయిస్తున్నాం. బాల్యం నుంచే ఇంగ్లిష్ మీడియం, ఏఐ(కృత్రిమ మేధ) పాఠాలు, డిజిటల్ విద్య, ఐఎఫ్పీ బోర్డుల ద్వారా మనస్సుకు హత్తుకునేలా పాఠ్యాంశాల వివరణ. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ , మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రవాణా ఖర్చులు అందిస్తాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి..బాధ్యత మాది. స్థాయికి తగ్గ సామర్థ్యాలు అందిస్తాం. – రాధాకిషన్, డీఈఓ, మెదక్ -
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
పాపన్నపేట(మెదక్): చేపల వేటకు వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పొడిచన్పల్లి శివారులోని గండం చెరువులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన భామిని బాలరాజు (29) చేపల వేటతో పాటు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మృగశిర కార్తె కావడంతో చేపలు పట్టి అమ్ముకుందామని తోటి వారితో కలిసి, గండం చెరువుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. అక్కడున్న వారు రక్షించే లోపలే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వల చుట్టుకొని మత్య్సకారుడు.. నర్సాపూర్ రూరల్: మత్య్సకారుడు చేపల వేటకు వెళ్లి వల చుట్టుకొని మృతి చెందాడు. ఈ ఘటన నర్సాపూర్ రాయరావు చెరువులో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దుద్దాల యాదగిరి (45) శనివారం సాయంత్రం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వల చుట్టుకొని మృత్యువాతపడ్డాడు. ఆదివారం మృగశిర కార్తె కావడంతో చేపలు పట్టుకు వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు మృతుడి భార్య రాంబాయి తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిసాన్ మేళాలో రైతుల సందడి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం కొనసాగిన కిసాన్ మేళాకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి సందడి చేశారు. స్టాళ్లలో ప్రదర్శించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, చేపలు, డ్రోన్లు, ట్రాక్టర్లు తదితర వాటిని రైతులు ఆసక్తిగా పరిశీలించి, వినియోగం, ప్రయోజనాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ వినియోగంతో ఖర్చులు ఆదా సోలార్ పవర్ నెట్మీటరింగ్ పద్ధతి అనుసరించడం ద్వారా వంద శాతం విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. సౌరశక్తి ఉత్పత్తి సహజ సిద్ధ నిరంతర ప్రక్రియే అయినప్పటికీ ప్రారంభ పెట్టుబడి ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు తక్కువేనని పేర్కొన్నారు. మార్కెట్లోకి వస్తున్న అనేక రకాల విత్తనాల్లో మేలు రకమైన వాటిని గుర్తించాలని, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని పలు విత్తన స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. దీని నివారణకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ రైతులకు అఽధిక దిగుబడినిచ్చే విత్తనాలను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ మోటర్లు ఐఎస్ఐ మార్క్ ఉన్న వాటినే వినియోగించాలని కూడా సూచించారు. రాష్ట్రంలో చేనేత, మరమగ్గ కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత అభయహస్తం పథకం మంచి ఫలితాన్నిస్తుందన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తుండటంతో వారికి ప్రయోజనం కలుగుతోందన్నారు. -
గేదెలను కడిగేందుకు వెళ్లి యువకుడు మృతి
చిలప్చెడ్(నర్సాపూర్): గేదెలను కడిగేందుకు వెళ్లిన యువకుడు ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలం ఫైజాబాద్ శివారులో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... మండల పరిధిలోని బండపోతుగల్ గ్రామానికి చెందిన దారా శేఖర్ (24) ఫైజాబాద్ గ్రామానికి చెందిన టేకుల నర్సింహా రెడ్డి వద్ద గేదెలు మేపడానికి జీతం ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులో గేదెలను మేపేందుకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి వచ్చాయి. కానీ అతడు మాత్రం రాలేదు. విషయాన్ని నర్సింహా రెడ్డి శేఖర్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు వస్తాడులే అని ఊరుకున్నారు. శనివారం ఉదయం నర్సింహా రెడ్డి, శేఖర్ అన్న రవి గ్రామ శివారులో వెతుకుతుండగా వడ్లోని కుంటలో శేఖర్ మృతదేహం కనిపించింది. గేదెలను కడిగేందుకు, బట్టలు, మొబైల్ను గట్టునపెట్టి కుంటలోకి దిగాడు. జేసీబీ గుంతని గుర్తించని శేఖర్ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి
● జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్ రావు ● 18న హైదరాబాద్లో బహిరంగ సభమెదక్ కలెక్టరేట్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆర్టిజన్ల జిల్లా సమావేశం జరిగింది. జిల్లా చైర్మన్ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదన్నారు. దీన్ని నిరసిస్తూ ఈనెల 18న హైదరాబాద్ ఇందిరాపార్క్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్లకు కన్వర్షన్ కోసం సమ్మె నోటీసు ఇస్తామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి సమస్యను జేఏసీతో చర్చించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా చైర్మన్ సధాకర్, జిల్లా కో కన్వీనర్ సందీప్, సంగారెడ్డి జిల్లా చైర్మన్ రాములు, జిల్లా కన్వీనర్ దుర్గయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా జేఏసీ నాయకులు కనకరాజు, రవికుమార్, జీన్నా, నాగరాజు, సురేష్, నర్సిహులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
కొండపాక(గజ్వేల్): వ్యవసాయ పనులకు ట్రాక్టరు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారకర ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సిర్సనగండ్ల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దేవిరెడ్డి బాపురెడ్డి (47) తన సొంత ట్రాక్టరును పొలం దున్నేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కాలువ పక్క నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ కాలువలో బోల్తాపడింది. దీంతో ఆయన ఇంజిన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం బాపురెడ్డి కుమారుడు ఉదయ్ కుమార్రెడ్డి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దుద్దెడలో ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. ఈ క్రమంలో సిర్సనగండ్ల గ్రామ శివారులో డివైడర్ను ఢీకొట్టి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి. ట్రాక్టర్ ఢీకొని రైతు.. నారాయణఖేడ్: ట్రాక్టరు ఢీకొని రైతు మృతి చెందాడు. ఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి వివరాల ప్రకారం.. ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన బాలయ్య(50) తన పొలం దున్నడానికి ట్రాక్టరును అద్దెకు తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ బాగయ్య ట్రాక్టరుతో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు బాలయ్యను ఢీకొట్టడంతో మృతి చెందాడు. వర్షాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
75 ఏళ్ల కల మోడీతో సాకారం
మెదక్ ఎంపీ రఘునందన్రావు మర్కూకు(గజ్వేల్): చీనాబ్ నదిపై వంతెన నిర్మించి ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల కలను సాకారం చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. వంతెనతో జమ్మూ కశ్మీర్ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసిన ఏకై క నాయకుడని కొనియాడారు. మండలంలోని పాములపర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఈనెల 6న ప్రధాని జమ్మూ కశ్మీర్ పర్యటనను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసిందని, పాకిస్తాన్ మాత్రం తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్తయ్య, శ్రీనివాస్ గుప్తా, నాయకులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్లో రాణించిన క్రీడాకారులుమద్దూరు(హుస్నాబాద్): రాష్ట్ర స్థాయి 46వ జూనియర్ బాలుర హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని మండల హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ శనివారం తెలిపారు. నల్లగొండ జిల్లా మంగళపల్లిలో నాలుగు రోజులుగా జరిగిన పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సిద్దిపేట జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ గుప్తా, హ్యాండ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసు గౌడ్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేషం, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్, ఇంతియాజ్, కనకయ్య, తదితరులు అభినందించారు. -
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతానికి గురై పాడి ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని నాగపురిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాట తిరుపతికి చెందిన పాడి ఆవు మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. రూ.90వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వాపోయాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు దుబ్బాకటౌన్: ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన కిశోర్ రెడ్డి అతడి స్నేహితుడు వాసు నాయక్తో కలిసి దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తుంన్నాడు. మార్గమధ్యలో రాయపోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల దుర్గమ్మ గుడి మూలమలుపు వద్ద అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాప ప్రాణం తీసిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నర్సాపూర్ రూరల్: అప్పటి వరకు అక్కాతమ్ముళ్లతో ఆడుకున్న పాప ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోవడంతో కుటుంబ సభ్యుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. నర్సాపూర్ – తూప్రాన్ రహదారిపై హనుమంతపూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందం అర్చన (9) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపూర్కు చెందిన చిందం అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి హనుమంతపూర్ సమీపంలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. సాయంత్రం తల్లి లలిత కూతురు అర్చనతో కలిసి నర్సాపూర్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు కాలినడకన బయలుదేరారు. తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అర్చనను వెనుక నుంచి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఆ సందర్భంలో తల్లి కేకలు పెడుతూ బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు వదిలింది. అర్జున్ లలిత దంపతులకు నలుగురు సంతానం కాగా పెద్ద కూతురు ఉజ్వల, రెండో కూతురు అర్చన , రిషి, విశాల్ ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శాశ్వత నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: నియోజకవర్గంలోని తండాలు, గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీలో శాశ్వతంగా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. అమృత్ –2 పథకం ద్వారా రూ.13 కోట్లతో చేపట్టే పనుల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో గురువారం తాగునీటి సరఫరా పైపులైను పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ మండలం పోతన్పల్లి, గునుకులకుంట, మాధ్వార్, లింగనాయక్పల్లి, లింగాపూర్, హన్మంతరావుపేట, మాద్వార్ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో 5 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉండగా గత పాలకులు 1,200 కనెక్షన్లు మాత్రమే ఉన్నట్లు ప్రతిపాదనలు పంపడంవల్ల అమృత్ పథకంద్వారా రూ.13 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. అమృత్ –3 పథకంలో భాగంగా నిధుల మంజూరుకోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. గొర్రెకల్లో డెడికేటెడ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించి తాగునీటి సరఫరాకు విద్యుత్ సమస్యలు లేకుండా చేశామన్నారు. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లను మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ సతీశ్తివారీ, నాయకులు పండరీరెడ్డి, రమేశ్ చౌహాన్, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
తాగడానికి డబ్బులివ్వలేదని భర్త ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇక్కిరి స్వరూప, యాదగిరి(41)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. యాదగిరి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గత నెల 31న మద్యం తాగడానికి భార్యను డబ్బులు అడుగగా తన వద్ద లేవని పంట డబ్బులు వచ్చిన తరువాత ఇస్తానని చెప్పింది. దీంతో అదేరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనస్తాపంతో ఉరేసుకొని మహిళ.. సంగారెడ్డి : మనస్తాపంతో ఉరేసుకొని మహిళ మృతి చెందిన ఘటన చౌటకూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ క్రాంతికుమార్ పాటిల్ వివరాల ప్రకారం... అందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన కావేరి (23 )ను చౌటకూరు గ్రామానికి చెందిన పోచయ్యతో గత సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. భర్తతో పాటు అత్తమామలతో కలిసి ఉంటున్నారు. వివాహం అనంతరం మూడు నెలలకే గర్భస్రావం అయింది. అలాగే 15 రోజుల క్రితం మరలా గర్భం దాల్చగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి గర్భంలో ఉన్న శిశువుకు హృదయ స్పందన సరిగా లేదని, శిశువును తీసివేయాలని చెప్పారు. భర్త అత్తామామలు ఈ విషయంపై, అలాగే వరకట్నంపై ప్రతిసారి సూటిపోటి మాటలు మాట్లాడేవారరని భావించిన కావేరి బుధవారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను భర్త పోచయ్య సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మృతురాలి తల్లి భూమమ్మ ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మందలించడంతో యువకుడు.. హవేళిఘణాపూర్(మెదక్): చెడు అలవాట్లకు బానిసైన ఓ యువకుడిని ప్రవర్తన మార్చుకోవాలని తల్లి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సర్దన గ్రామానికి చెందిన ఎండి.సల్మాన్(24) జీవనోపాధి కోసం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన సల్మాన్ను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యుద్ధ ట్యాంకులను పరిశీలించిన కేంద్రమంత్రి
కంది(సంగారెడ్డి): మండల పరిధిలోని ఎద్దు మైలారం ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)లో యుద్ధ ట్యాంకులను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు పరిశీలించారు. గురువారం సాయంత్రం ఓడీఎఫ్ను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్లో తయారవుతున్న బీఎంపీ 2 యుద్ధ ట్యాంకుల పనితీరును, అక్కడ తయారయ్యే యుద్ధ సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైన్యానికి అవసరమైతే యుద్ధ ట్యాంకులను అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీఎంపీ 2 ట్యాంకును అధికారులతో కలిసి నడిపారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్రావు సీఎండీ సంజయ్ ద్వివేది, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎస్.ముఖర్జీ, సీజీఎం శివశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీకి నిదర్శనం ఆర్టీసీ ఉద్యోగులు
● బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన నగలు, నగదు అప్పగింత ● ఉద్యోగులను సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గజ్వేల్రూరల్: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. వీరి నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులను సన్మానించారు. జీపీపీ ఆర్టీసీ డిపోకు చెందిన (టీజీ 36 జెడ్ 0027)బస్సులో గజ్వేల్ నుంచి భువనగిరి మార్గంలో కండక్టర్ ఓం ప్రకాష్, డ్రైవర్ సలీంలు ఈ నెల 2న విధులు నిర్వహించారు. ప్రయాణికుడు యాదగిరి భువనగిరిలో బస్సు ఎక్కి జగదేవ్పూర్కు టికెట్ తీసుకున్నాడు. రాత్రి ప్యాసింజర్లు కూర్చునే సీటుపై ఉన్న లగేజ్ పార్శిల్ రాక్లో ఓ బ్యాగ్ ఉండటాన్ని కండక్టర్ ఓం ప్రకాష్ గుర్తించాడు. వెంటనే ప్రయాణికులను అడిగి వారి సమక్షంలో ఆ బ్యాగును తెరిచి చూడగా 15తులాల బంగారు నగలు, రూ.మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వెంటనే ఆ బ్యాగును జగదేవ్పూర్ పోలీసులకు అప్పగించారు. బ్యాగు మరిచిపోయిన ప్రయాణికుడు యాదగిరి అక్కడే ఉండటంతో ఎస్ఐ ఆధ్వర్యంలో టికెట్ ఆధారంగా బ్యాగును అప్పగించారు. కాగా నిజాయితీని చాటుకున్న జీపీపీ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్తో పాటు డిపో మేనేజర్ పవన్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించి సన్మానించారు. -
భూ భారతితోనే పరిష్కారం
కలెక్టర్ వల్లూరు క్రాంతి పటాన్చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు విశేష చర్యలు చేపట్టామని కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. పటాన్చెరు మండలం, క్యాసారం గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ...జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందు కు విరివిరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రజల భూ సమస్యలు తీర్చేది భూ భారతి చట్టమేనని స్పష్టం చేశారు. నేడు దివ్యాంగుల ప్రజావాణి సంగారెడ్డి జోన్: నేడు దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించే ఈ ప్రజావాణిలో దివ్యాంగులు తమ సమస్యలు, అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
అర్ధరాత్రి ఆగడాలకు చెక్
ఇకపై ఆకతాయిల పనిపడతాం ● శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి ● 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ● పాత నేరస్తులపై పటిష్ట నిఘాసంగారెడ్డి క్రైమ్: పట్టణంలో ఆకతాయిల ఆటలకు ఇకపై పోలీసులు చెక్ పెట్టనున్నారు. అర్ధరాత్రి దొరికితే జైలుకే. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇప్పటికే అర్ధరాత్రి తర్వాత ప్రధాన రహదారులు, పబ్లిక్ ప్రదేశాల్లో యువకులు బర్త్డే అంటూ కొందరు, రెస్టారెంట్కి వెళ్తామని మరికొందరు, ఏ పని లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా నిత్యం 24 గంటలు పెట్రోలింగ్ వాహనంతో పాటు, బ్లూ కోర్ట్సు పోలీస్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనదారులు, కార్లలో తమ ఇష్టానుసారంగా పబ్లిక్ ప్రదేశాల్లో వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. స్నేహితులతో కలిసి ఇక ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరగడం కుదరదు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పలు కాలనీల్లో రాత్రి 12 తర్వాత తిరుగుతున్న వారిని పట్టుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి వద్ద నుంచి ఫింగర్ప్రింట్ , సంబంధిత వివరాలు తీసుకుంటున్నారు. కొన్ని ఘటనలు... సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏప్రిల్ 15న అర్ధరాత్రి ఓ కుటుంబం ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమాధ్యలో గుర్తుతెలియని యువకులు బైకుపై వచ్చి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. తన కళ్ల ముందే అడ్డుకోబోయిన భర్తపై తీవ్రంగా దాడి చేశారు. ● కొద్ది నెలల క్రితం మెడికల్ దుకాణాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతూ ఓ దొంగ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు 20రోజుల్లో నిందితుడిని పట్టుకున్నారు. వరుస చోరీలు పాల్పడుతున్న పాత నేరస్తుడైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించి, అరెస్టు చేసి జైలుకు పంపించారు. ● కొంతమంది యువకులు అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత కూడా మహబూబ్ సాగర్ చెరువు కట్టపై, అకారణంగా రోడ్లపై సంచరిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. పండుగల నేపథ్యంలో పట్టణంలోని పలు కాలనీల నుంచి అర్ధరాత్రి పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదులు అధిక మొత్తంలో అందుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు పోలీసులు అలాంటి వారిని పట్టుకుని వారి వద్ద నుంచి ఫింగర్ ప్రింట్, వారి వ్యక్తిగత వివరాలు తీసుకొని, వారి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ చేస్తున్నారు. కొందరిని మైనర్లుగా భావించి వదిలేస్తున్నారు. ఇకపై పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే యువకుల ఆగడాలకు చెక్ పెట్టడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. రానున్న పండుగల నేపథ్యంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న పాత నేరస్తులపై కూడా తనిఖీలో భాగంగా వారిపై ప్రత్యేక బృందం నిఘా పెట్టింది.ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలే జిల్లా హెడ్ క్వార్టర్స్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా పనిచేస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి 12 తర్వాత అనవసరంగా ఎవరైనా పట్టణంలో గాని, రోడ్లపై గాని తిరిగితే కఠిన చర్యలు తప్పవు. మహిళలపై గాని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల దృష్ట్యా పెట్రోలింగ్తో పాటు సిబ్బందితో గస్తీ చేడుతున్నాం. రమేష్, సంగారెడ్డి పట్టణ సీఐ -
భవిష్యత్లో 2800 ఈవీ బస్సులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జహీరాబాద్: భవిష్యత్లో కేంద్రం సహకారంతో 2800 పీఎం ఈవీ బస్సులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సులు రాగానే ప్రస్తుతం నడుస్తున్న 2500 బస్సులను ఓఆర్ఆర్ అవతలి వైపు ఉన్న గ్రామాలకు నడపుతామని పేర్కొన్నారు. గురువారం జహీరాబాద్లో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడుపుతామన్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకువచ్చామన్నారు. లాభాల బాటలో ఆర్టీసీ నడుస్తోందన్నారు. 150 బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పెండింగ్ బిల్లులు, డీఏ, పాత పీఎఫ్లతో సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం ఆయన పల్లవి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, పార్లమెంట్ కార్యాలయ ఇన్చార్జి జి.శుక్లవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
అమీన్పూర్ ఇక మహానగరమే
● తాజాగా జానకంపేట, వడకపల్లి గ్రామాలు విలీనం ● రికార్డులు సమర్పించిన పంచాయతీ సిబ్బంది పటాన్ చెరు: అమీన్పూర్ మండల పరిధిలో మిగిలిన రెండు గ్రామాలను కూడా మున్సిపాలిటీ పరిధిలోకి విలీనం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఆ రెండు గ్రామాల కార్యదర్శులు సిబ్బంది అందరూ మున్సిపాలిటీకి రికార్డులను సమర్పించారు. ఒకప్పుడు పటాన్చెరువు మండలంలో అంతర్భాగంగా ఉన్న అమీన్పూర్ 2018 ఆగస్టులో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఆ తర్వాత కొత్త మండలాల ఏర్పాటు క్రమంలో పటేల్ గూడ, కిష్ణారెడ్డిపేట, వడక్పల్లి, జానకంపేట, ఐలాపూర్, ఐలాపూర్ తాండ గ్రామాలను అమీన్పూర్లో విలీనం చేసి మండలంగా రూపొందించారు. తాజాగా గురువారం అమీన్పూర్ మండల పరిషత్ పరిధిలో ఉన్నటువంటి జానకంపేట, వడకపల్లి గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పాలన పరిధిలోకి వచ్చాయి. దీంతో అమీన్పూర్ మండల పరిషత్ కార్యాలయం కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. కొన్ని నెలల క్రితం కిష్ణారెడ్డిపేట, పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తాండ సుల్తాన్పూర్, దాయర, గండిగూడ గ్రామాలను అమీన్పూర్ పట్టణంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీ పరిధిలోకి పారిశుద్ధ్య కార్మికులు అమీన్పూర్ మండల పరిధిలో ఒక్క గ్రామం కూడా జిల్లా పరిషత్ పరిధిలో లేకుండా పోయింది. ఇదే విషయంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ‘సాక్షి’తో మాట్లాడుతూ..మున్సిపల్ పరిధిలోకి విలీనమైన పంచాయితీ కార్యదర్శులను మాత్రమే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న ఖాళీల్లో భర్తీ చేస్తామన్నారు. ఇక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, కారోబార్లు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తారని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ జానకిరామ్ మాట్లాడుతూ...అమీన్పూర్ ఎంపీడీవో ఆఫీసు పరిధిలోని సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు పంపించామని వారి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ పరిధిలోనే ఉన్న ఖాళీల్లో వారిని భర్తీ చేస్తామని వివరించారు. అయితే అమీన్పూర్ ఎంపీడీవో ఆఫీస్ కార్యకలాపాలు ముగిసినట్లేనని స్పష్టం చేశారు. అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ జానకంపేట వడకపల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ ముగిసిందన్నారు. ఆ పంచాయతీల రికార్డులను స్వాఽధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
వైద్యులు అందుబాటులోనే ఉండాలి
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి హత్నూర( సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని గాయత్రీదేవి అన్నారు . గురువారం మండల కేంద్రమైన హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చేవారం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని స్థానిక వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం వెంటనే అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యురాలు రజిని, సిబ్బంది ఉన్నారు -
ఇక జోన్ల వారీగా పారిశుద్ధ్యం
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రోజువారీగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టడంతోపాటు పర్యవేక్షణకు ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. ఇంటింటికీ చెత్తసేకరణ, మురికి కాలువల నిర్వహణ, రహదారుల పరిశుభ్రతతో పాటు తడి, పొడి వేరు చేయడం, సేకరణ మరింతగా మెరుగుపరచనున్నారు. 631గ్రామపంచాయతీలు..1,464 జోన్లు జిల్లాలో 26 మండలాలు ఉండగా 631 గ్రామపంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 2,32,670 ఇండ్లు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఇండ్ల సంఖ్య, జననివాసం, మార్కెట్లు, సంస్థలు, వ్యాపార సంస్థల ఆధారంగా జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రామపంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు విభజించారు. ప్రతీ జోన్కు సంబంధిత పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. ప్రతీరోజు ఆ జోన్లో చెత్త సేకరణతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్య జోన్ల ద్వారా మెరుగైన ఫలితాలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. జనాభా, ఇండ్ల ఆధారంగా విభజన మల్టీపర్పస్ వర్కర్లకు బాధ్యతలు ఇన్చార్జిలుగా వ్యవహరించనున్న కార్యదర్శులు, ఎంపీఓ ప్రత్యేక యాప్లో నమోదు జోన్ల వారీగా ప్రతీరోజు చేపట్టిన పారిశుద్ధ్య పనుల నిర్వహణ తదితర అంశాలను నమోదు చేసేందుకు మానిటరింగ్ యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు చేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల హాజరు, సేకరించిన చెత్తను తూకం వేయడం, పారిశుద్ధ్య పనుల ఫొటోలు తదితర వివరాలు పొందుపరచాలి. ఒక గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన జోన్లకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీఓ, ఎంపీడీఓ, డీఎల్పీఓ, డీపీఓతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అయితే జిల్లాలో జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ మాత్రం చేపట్టడం లేదు. -
రామకృష్ణకు గ్రీన్ చాంపియన్ అవార్డు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. వనరుల సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణ , పరిసరాల పరిశుభ్రత అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సత్ఫలితాలు సాధించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా రామకృష్ణను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సెక్టోరియల్ అధికారి వెంకటేశం, ఏఎంఓ బాలయ్య , జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, మండల విద్యాధికారి శంకర్, నోడల్ అధికారి సుధాకర్ అభినందించారు. -
ఉల్లాస్తో అతివకు అక్షరకాంతి
సంగారెడ్డి టౌన్ : ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళల సాధికారితకు, అభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుంది. అయితే జిల్లాలో మహిళలు మాత్ర అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు. కనీసం సంతకం కూడా చేయడం రాని వారు లక్షల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు ‘న్యూ ఇండియా లిటరసీ’కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటుండగా, ముందుగా పొదుపు సంఘాల మహిళల్లో అక్షర కాంతులు నింపాలని నిర్ణయించింది. విద్యాశాఖ సహకారంతో ‘సెర్ప్’అధికారులు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్న్ఇన్ సొసైటీ) పేరిట కార్యచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఏపీడీ, డీపీఎంలకు రాష్ట్రస్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించగా జిల్లాలో త్వరలో కార్యక్రమాలు చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి... ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులపై దృష్టిసారించింది. వారిలో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా చేపడుతున్న ఉల్లాస్ కార్యక్రమంలో నిరక్షరాస్యులను గుర్తించేందుకు ఇప్పటికే సర్వేను ప్రారంభించారు. ముందుగా గ్రామైఖ్య సంఘాల్లో చదువు రాని వారిని గుర్తిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 45,352 మంది మహిళలను గుర్తించారు. సంఘంలోనే చదువు వచ్చిన వారిని వాలంటీరుగా నియమించి అక్షరాలు నేర్పిస్తారు. జిల్లాలోని ఆయా గ్రామాలలో సర్వే పూర్తిచేసి ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారని తేల్చనున్నారు. వీరిలో ఐదు మందికి ఒక వాలంటీరును నియమించమన్నారు. ఆర్డీఓ, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉల్లాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డీఆర్జీడీవోతోపాటు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ ఏపీఎం, గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీఏవో అధ్యక్షురాలు, కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. సర్వే వివరాలను అందులో పొందుపరచనున్నారు. పదో తరగతిలోపు మానేసిన వారిని ఓపెన్్ పది, పదో తరగతితో ఆపేసిన వారిని ఓపెన్ ఇంటర్ చదివేలా ప్రోత్సహిస్తారు. ఇంటర్ పూర్తిచేసిన వారిని డిగ్రీ చేయించాలని నిర్ణయించారు. ఒకవేళ సంఘాల్లో చదివేవారు లేకపోతే సభ్యుల పిల్లలతో ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు. సర్వే పూర్తవగానే వాలంటీర్ల సాయంతో కార్యక్రమం షురూ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చదువు నేర్చుకుంటాను చదువు నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న నాకు చదువు నేర్పించడానికి జిల్లా మహిళా సంఘం మంచి నిర్ణయం. నాతో పాటు చాలామంది చదువులు రాని వాళ్లం నేర్చుకుంటాం. –అమృత, ఇస్మాయిల్ ఖాన్ పేట సంఘం సభ్యురాలు గ్రామంలో మహిళలకు శిక్షణ ఇస్తాం గ్రామాలలోని చదువురాని మహిళలకు ప్రతీరోజు కొంత సమయం కేటాయించి చదువు నేర్పిస్తాం. చదువుతోపాటు రాయడానికి వచ్చే విధంగా శిక్షణను కల్పిస్తాం. వారి సాధికారతకు నేను కూడా కృషి చేస్తా. –రేణుక, సంగారెడ్డి మహిళా సంఘం అవగాహన కల్పిస్తున్నాంమహిళా సంఘంలోని సభ్యులకి నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యాశాఖ అధికారులు, డీఆర్డీవో ఆధ్వర్యంలో సమష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటాం. –జంగారెడ్డి, అదనపు డీఆర్డీఓ పొదుపు మహిళలకు చదువులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న అధికారులు జిల్లాలో 45,352 మంది మహిళా నిరక్షరాస్యులు త్వరలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు -
కారు, బైక్ ఢీ.. రెవెన్యూ ఉద్యోగి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి శ్రీరేణుక ఎల్లమ్మదేవి ఆలయం సమీపంలో 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్నబీ(27) మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో ఏడాదిన్నరగా జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం తన బైక్పై తిమ్మాపూర్ నుంచి మెదక్ బయలుదేరాడు. కౌడిపల్లి రేణుకాఎల్లమ్మదేవి ఆలయ సమీపంలో ముందు వెళ్తున్న కారు యూటర్న్ తీసుకోవడంతో కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న షేక్ అబ్దుల్నబి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న రైతులు గమనించి అదేకారులో కౌడిపల్లి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి షేక్ సలీమా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే షేక్ అబ్దుల్నబీ చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి జనవరిలో వివాహం అయింది. -
గ్రీన్ సిద్దిపేట
సిద్దిపేటజోన్: పర్యావరణ పరిరక్షణకు సిద్దిపేట మున్సిపాలిటీ గత పదేళ్లుగా అలుపెరుగని కృషి చేస్తోంది. ● 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కింద తొమ్మిది విడతల్లో సిద్దిపేట మున్సిపాలిటీలో సుమారు పదిలక్షల మొక్కలు నాటారు. ● గ్రీన్ సిద్దిపేట అవార్డును సొంతం చేసుకుంది. ● ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా మార్చే దిశలో 2020 జూన్లో బల్దియాలో వినూత్న రీతిలో ఇప్పటివరకు 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ● ఐదేళ్ల క్రితం సిద్దిపేట బల్దియాలో రుతు ప్రేమ పేరిట శానిటరీ ప్యాడ్స్ స్థానంలో మహిళలకు ప్రత్యేకంగా క్లాత్ ప్యాడ్స్ ఉచితంగా పంపిణీ చేసింది. పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం ప్రకటించి, పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించింది. -
అవయవదానం మరొకరికి ప్రాణదానం
జిన్నారం (పటాన్చెరు): మరో మనిషి ప్రాణాలను బతికించే అవయవదానం గొప్పది. ఈ నెల 1న సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామానికి చెందిన పార్థసారథి (37)అనే వ్యక్తి జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామ శివారు రైస్మిల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అంబులెన్స్లో సురారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్డెడ్ అయి మృతి చెందినట్లు వెల్లడించారు. మరొకరి ప్రాణాలు కాపాడేందుకు భర్త అవయవాలు ఉపయోగపడతాయని తెలుసుకున్న భార్య మమత అయవయ దానానికి అంగీకరించింది. భర్త కళ్లు, గుండె, కిడ్నీలను దానం చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది. మృతుడి పార్థివదేహానికి సెల్యూట్ చేశారు. -
వృత్తి వైద్యం.. ప్రవృత్తి చైతన్యం
సిద్దిపేటజోన్: ఆయన వృత్తి దంత వైద్యం.. ప్రవృత్తి మాత్రం పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకుని పట్టణ ప్రజలకు పరిచయమయ్యాడు డాక్టర్ డీఎన్ స్వామి. రసాయనిక ఎరువుల కూరగాయల వల్ల కలిగే అనర్థాల గూర్చి ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛ బడిలో చెత్త పునర్వినియోగం, సేంద్రియ ఎరువుల తయారీ గూర్చి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా ఇంట్లో కూరగాయల పెంపకం గూర్చి చైతన్యపరిచారు. మిద్దె తోటల పెంపకం పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి ఒక ప్లాట్ పామ్ ఏర్పాటు చేశారు. -
ఊరూరా.. ఉద్యమంలా
వర్గల్(గజ్వేల్): ప్లాస్టిక్ వినియోగం పెచ్చుమీరితే పర్యావరణానికి హానికరం. ఆకు విస్తర్లు కుడుతూ ‘ప్లాస్టిక్ వాడకం వద్దు..ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన విస్తరాకులు వాడుదామని సందేశమిస్తున్నారు వర్గల్ మండల మహిళలు. గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ‘పర్యావరణ పరిరక్షణకు మేము సైతం’ అంటూ ఆకు విస్తర్లు కుట్టి సిద్ధం చేసి పనిలో నిమగ్నమయ్యారు. సగటున ఒక్కో గ్రామపంచాయతీ నుంచి కనీసం 50 విస్తరాకుల చొప్పున సిద్ధం చేసి ఈ నెల 6 నుంచి హుస్నాబాద్లో జరగనున్న రైతు సదస్సులో వీటిని వినియోగించి ‘ప్లాస్టిక్ ప్లేట్లు వద్దు, పర్యావరణ హితం కోసం ఆకు విస్తర్లే ముద్దు’ అని సందేశం పంపాలన్నది అధికారుల సంకల్పం. బుధవారం ఊరూరా విస్తర్లు కుట్టించే కార్యక్రమం చేపట్టామని వర్గల్ పంచాయతీ కార్యదర్శి సందీప్కుమార్ తెలిపారు. -
మొక్కలు పెంచుతూఆహ్లాదాన్ని పంచుతూ
● ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికులు ● వినూత్నంగా ప్రచారం చేస్తూపర్యావరణానికి మేలు ● ప్లాస్టిక్ వాడితే కలిగే అనర్థాలపైవిస్తృత అవగాహననేడు ప్రపంచ పర్యావరణ దినం ఆ హెచ్ఎం పర్యావరణ ప్రేమికుడు నేడు అవార్డు అందుకోనున్న రామకృష్ణ సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఇంటరాక్టివ్, ప్రాజెక్ట్ , ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా బోధిస్తున్నాడు. అలాగే స్టాప్ సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, వాటర్ కన్సర్వేషన్, కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్పై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పర్యావరణ అవార్డుకు ఎంపిక చేసింది. నేడు హైదరాబాద్లో పీసీబీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నారు. -
పదికిలోల ప్లాస్టిక్ తెచ్చి..వెండి నాణెం తీసుకోండి
ములుగు (గజ్వేల్ ) : ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చైత్యన్య పరుస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాడు. ఆయనే ములుగు మండలం క్షీరసాగర్కు చెందిన కొన్యాల బాల్రెడ్డి. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామం వైపు నడిపించేందుకు కేబీఆర్ పౌండేషన్ ద్వారా 2023 ఏప్రిల్లో 10 కిలోల ప్లాస్టిక్ తెచ్చివ్వండి..10 గ్రాముల వెండి నాణెం తీసుకెళ్లండి అంటూ గ్రామస్తుల నుంచి సుమారు 1000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాడు. అందరి చేత భేష్ అనిపించుకున్నాడు. ఉపాధిహామీ కూలీలతో 60 వేల విస్తరాకులు హుస్నాబాద్రూరల్: రైతులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)దేవకి దేవి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో హుస్నాబాద్లో జరిగే కిసాన్ మేళాకు వచ్చే రైతులకు మోదుగ ఆకుల విస్తరిలో భోజనాలు పెట్టి పర్యావరణ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లోని స్వశక్తి సంఘాల మహిళలు, ఉపాధిహామీ కూలీల సహకారంతో 60 వేల మోదుగ విస్తర్లను తయారు చేయిస్తున్నారు. కిసాన్ మేళాకు వచ్చే రైతులు, అతిథితులకు ప్లాస్టిక్కు బదులుగా మోదుగ ఆకుల విస్తర్లు, స్టీల్ ప్లేట్స్ను వాడనున్నారు. ప్లాస్టిక్ గ్లాస్లకు బదులు స్టీల్ గ్లాస్లను వినియోగించడంతో 2లక్షల ప్లాస్టిక్ గ్లాస్ల వాడకం తగ్గించనున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల వద్ద ఉన్న స్టీల్ బ్యాంకును కిసాన్ మేళాల్లో వినియోగించడానికి సిద్ధమవుతున్నామని డీపీఓ తెలిపారు. -
సేంద్రియ కూరగాయల సాగు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పర్యావరణాన్ని కాపాడే దిశలో జిల్లా కేంద్రంలోని రాదారి నాగరాజు–కవిత దంపతులు ప్రయత్నిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఇల్లు ఒక చిన్నపాటి పంట చేను. పక్షులకు నీరు, తిండిగింజలు పెట్టడం, ఇంటి ముందు, టెర్రస్పై మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. దంపతులిద్దరూ పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రికల్ వాహనాలనే వాడుతున్నారు. నాగరాజు దుబ్బాక మండలం లచ్చపేట మాడల్ స్కూలులో పీజీటీ ఆధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తుండగా, కవిత గృహిని. సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారు. అలాగే వీరికి ఇద్దరు పిల్లలు. వారి పుట్టిన రోజున, ఇతర ప్రత్యేక రోజుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు. -
అక్క ఇంట్లో వేడుకకు వచ్చి..
● కారు ఢీకొనడంతో తమ్ముడు మృతి ● తుక్కాపూర్లో ఘటన ● ఆందోళనకు దిగిన బంధువులు తొగుట(దుబ్బాక): అక్క ఇంట్లో జరుగుతున్న వేడుకకు వచ్చి తమ్ముడు మృత్యువాత పడిన విషాద ఘటన మండలంలోని తుక్కాపూర్లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన గంట కనకయ్య (34) తుక్కాపూర్లో తన అక్క దర్గవ్వ ఇంట్లో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ పండుగకు ఉదయం వచ్చాడు. సాయంత్రం భోజనాల తర్వాత బయటకు వెళ్లిన కనకయ్య తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కనకయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కారులోని గుర్తు తెలియని యువకుడు కనకయ్య మృతదేహాన్ని సమీపంలోని ఓ ఇంటి ముందు ఉంచి అక్కడి నుంచి కాన్గల్ గ్రామం వైపుకు వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న కొందరు అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుని అక్క దర్గవ్వ, భావ మైసయ్యతో పాటు బంధువులు అక్కడి చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తొగుట సీఐ అప్రమత్తమై పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తన తమ్ముడికి న్యాయం జరిగే వరకు శవాన్ని ఇక్కడి నుంచి కదిలించబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. కారులో పెద్ద ఎత్తున మద్యం తరలిస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. మద్యం సేవించి కారు నడిపి తన తమ్ముడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
వైద్యుడికి మెమో జారీ
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 1న రాత్రి ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తిపై వచ్చిన ఫిర్యాదుపై డీసీహెచ్ విచారణ జరిపి బుధవారం వైద్యుడికి మెమో జారీ చేశాడు. మెమోను స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్ వైద్యుడికి అందజేశాడు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు జారీ చేసిన మెమో వైద్యుడికి అందించామని, దీనిపై సదరు వైద్యుడు ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చేగుంట(తూప్రాన్): చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మాసాయిపేట మండలం కొప్పులపల్లి వాగులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... తూప్రాన్ పట్టణానికి చెందిన జోగు బాబు(30) కొప్పులపల్లి వాగులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చేపల వల బాబుకు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతి కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాజీపేటలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన బక్తుల యాదాగౌడ్ రోజు మాదిరిగా గేదెలను బుధవారం ఉదయం సైతం మేతకు వదిలాడు. గ్రామ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్ తెగిపోయి ఉండటంతో అటుగా వెళ్లిన పాడిగేదె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.60వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కాగా వాటిని కాస్తున్న వ్యక్తి గమనించి దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వ్యక్తి అదృశ్యం నర్సాపూర్ రూరల్: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం.. మండల పరిధిలోని తుల్జారంపేటకు చెందిన పాతులోత్ సంతోష్ను తండ్రి గోపాల్ పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వాలని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు మార్చి 9వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మరుసటి రోజు అతడు స్నేహితులకు ఫోన్ చేసి కొన్ని రోజులపాటు ఇంటికి వెళ్లనని చెప్పడంతో కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడులే అనుకొని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతోపాటు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టుచేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ నీరేష్తో కలిసి సీఐ ఎల్.శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, చేర్యాల పోలీసులు రైడ్ చేసి సింగసారం మహేష్, రంగు రాజు, సార్ల నవీన్లను అరెస్టు చేశారు. వారిని విచారించగా హైదరాబాద్ దూల్పేటకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, మూడుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్ తరలించినట్లు తెలిపారు. -
రాళ్ల భూములు.. నల్ల రేగళ్లు
● పూడిక మట్టి వేసుకుంటున్న రైతులు ● ఆర్థికంగా భారమైనా ముందడుగేస్తున్న అన్నదాతలు ● భూసార పరీక్షలు చేయించి వేస్తే మేలు ● మారుతున్న భూముల రూపురేఖలుకంగ్టి(నారాయణఖేడ్): రాళ్లతో కూడిన గట్టు భూములు, చెలుక మట్టి, ఎర్ర రేగడి భూములు పూడిక మట్టితో నల్లరేగడి భూములుగా మారుతున్నాయి. ఖేడ్ డివిజన్లో కంగ్టి, సిర్గాపూర్, నాగల్గిద్ద, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో అధికంగా రాళ్లు రప్పలతో కూడిన భూములున్నాయి. గతంలో పూడిక మట్టి తోడాలంటే భయపడే రైతులు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని వచ్చిన అవకాశం వదులు కోకుండా భూముల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఎకరాకు దాదాపు లక్ష ఖర్చు.. చెరువులోని పూడిక మట్టి కోసం దూరాన్ని బట్టి, జేసీబీతో లోడింగ్ సహా ప్రతీ ట్రిప్పు టిప్పర్కు రూ.2500 నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎకరా విస్తీర్ణంలో దాదాపు 35 నుంచి 40 ట్రిప్పులు వేయిస్తున్నారు. ఇది వ్యవసాయాధికారులు సూచించిన దాని కంటే దాదాపు ఐదింతలు అధికంగా ఉంటుంది. దీంతో భూములకు లక్షల రూపాయలు ఖర్చు చేసి సారవంతంగా మారుస్తున్నారు. మండలంలోని దామర్గిద్ద కాకివాగు ప్రాజెక్టు, ముర్కుంజాల్ సాములు వాగు ప్రాజెక్టు, తడ్కల్ పెద్ద చెరువు, ఘన్పూర్ చెరువు, చాప్టా కొత్త చెరువులలోని పూడిక మట్టిని రాళ్ల భూములకు తరలిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా పూడిక మట్టి వేసుకోవాలి రైతులు భూముల్లో పూడిక మట్టి వేసే ముందు భూసార పరీక్షలు చేయించుకొని పోషకాలకు అనుగుణంగా వేసుకోవాలని ఏడీఏ తెలిపారు. రైతులకు కింది సూచనలు చేశారు. చెరువు మట్టి చేనుకు బలమే అయినా ఎకరాకు 20 నుంచి 25 ట్రాక్టర్ ట్రిప్పులు మాత్రమే వేసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలం మే నెలలో మాత్రమే పూడిక మట్టి చెరువులో రెండు నుంచి మూడు అడుగులు మాత్రమే తోడాలి. విచ్చలవిడి రసాయన ఎరువుల వాడకంతో భూమిలో పోషకాల లోపం విపరీతంగా కన్పిస్తుంది. రసాయన ఎరువుల కన్నా పూడికలో పోషకాలు మెండు. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం 4 నుంచి 7 శాతం పెరుగుతుంది. పూడిక వేయడంతో పంటలకు రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు మిత్ర పురుగులు పెరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయి.లోపిస్తున్న పోషకాల సమతుల్యత పంటలకు కావాల్సిన ప్రధాన పోషకాలు భాస్వరం, నత్రజని, పొటాష్ నిల్వలు చెరువు పూడిక మట్టిలో పుష్కలంగా ఉన్నాయి. రైతులకు పూడిక మట్టి అందుబాటులో ఉండటంతో తమ ఇష్టానుసారంగా రాళ్లు, చెలుకలు, చౌడు భూముల రూపు రేఖలు మారుస్తూ నల్లరేగడి నేలలుగా మారుస్తున్నారు. మండలంలో గట్టు భూములు అధికంగా ఉండటంతో తేమను నిల్వ ఉంచే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీంతో పంటల దిగుబడి సక్రమంగా రావడం లేదని రైతులు భూముల్లో రెండు అడుగుల ఎత్తు వరకు రేగడి పూడిక మట్టిని వేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పోటీ పడటం మంచి పరిణామం. అయినా అధిక మోతాదులో పూడిక మట్టి వేయడం వల్ల పోషకాల సమతుల్యత లోపించి పంటలకు నష్టం కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. – నారాయణఖేడ్, ఏడీఏ నూతన్కుమార్ -
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
సంగారెడ్డి జోన్: వానాకాలం సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్తో ఈనెల 6న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు. తేదీ : 06–06–2025 సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 9949992039, 9505872923 -
సాగును ఆదాయాధారితంగా మలచుకోవాలి
ఏడీఏ భిక్షపతి జహీరాబాద్: రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి తమ వ్యవసాయాన్ని ఆదాయాధారితంగా మలుచుకోవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి సూచించారు. మండలంలోని హుగ్గెళ్లి గ్రామ రైతు వేదికలో బుధవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మట్టి పరీక్షల అవసరం గురించి వివరించారు. భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్టె ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని పంటల నిర్వహణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త అరుణ, మండల వ్యవసాయాధికారి లావణ్య, కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, స్నేహలత, గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
ఆ సీటు మాకొద్దు బాబోయ్!
నీటి పారుదల శాఖ ఎస్ఈ పోస్టుపై అధికారుల అనాసక్తి ● బాధ్యతలిస్తే సెలవుపెడతానంటున్న ఓ అధికారి ● ఏసీబీ దాడులు.. రాజకీయ ఒత్తిళ్లే కారణమా? ● సీఈ ధర్మపై ఇటీవల వేటు వేసిన ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లే కారణమా? నీటిపారుదలశాఖ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రధానంగా చెరువులు, కుంటలకు ఎన్ఓసీల జారీల విషయంలో నేతల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. మరోవైపు చెరువుల్లో మట్టి తవ్వకాల అనుమతుల కోసం కూడా ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. మరోవైపు సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ ధర్మపై ఇటీవల బదిలీవేటు పడిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలకమైన ఎస్ఈ పోస్టులో పనిచేసేందుకు ఆ శాఖ అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న అధికారిని ఇటీవల ఏసీబీ ట్రాప్ చేసింది. ఓ నిర్మాణానికి ఎన్ఓసీ జారీ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏఈని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా నీటిపారుదల శాఖలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో ఎస్ఈ పోస్టులోకి వచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న అధికారులకే ఈ బాధ్యతలు ఇస్తారా..? లేదా పక్క జిల్లాలో పనిచేస్తున్న అధికారిని ఇక్కడి ఎస్ఈగా నియమిస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ)గా పనిచేసేందుకు ఆ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఈ సీటు మా కొద్దు బాబోయ్ అంటే మాకొద్దని ఇన్చార్జి బాధ్యతలు తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారు. దీంతో వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ పోస్టులో ఏ అధికారికీ ఇన్చార్జి బాధ్యతలు గానీ, ఎఫ్ఏసీగానీ ఇవ్వలేదు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన ఏసయ్య ఐదు రోజుల క్రితం (మే 31)న పదవీ విరమణ చేసిన విషయం విదితమే. దీంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఇప్పటివరకు ఈ పోస్టులో ఎవరినీ నియమిస్తూ ఉత్తర్వులు రాలేదు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి ఇన్చార్జిగా నియమించాలని భావించారు. కానీ, ఆయన కూడా పోస్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యతలు ఇస్తే సెలవుపై వెళ్లిపోతానని సదరు అధికారి తేల్చి చెప్పినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సంగారెడ్డి సీఈ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారి పేరు ఎస్ఈ పోస్టుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, ఆశాఖ ఈఎస్సీ కార్యాలయం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో వివిధ డివిజన్లలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, నారాయణఖేడ్ డివిజన్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందులో ఓ ఈఈ ఇప్పటికే హైదరాబాద్కు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్ఈ పోస్టులో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కొనసాగుతున్న సింగూరు కాలువల పనులు ఎస్ఈ కార్యాలయం పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉన్నాయి. సంగారెడ్డితోపాటు, జహీరాబాద్, నారాయణఖేడ్, దౌల్తాబాద్ డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం నీటి పారుదల శాఖలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సింగూరు కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.200 కోట్లతో ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు సంగమేశ్వర, బసవేశ్వర పనులు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు ఉండగా ప్రస్తుతానికి ఈ రెండు ఎత్తిపోతల పథకాల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పనులను ఎస్ఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఎస్ఈ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. -
సొంతింటి కల నెరవేరుస్తాం
ఎమ్మెల్యే సంజీవరెడ్డికల్హేర్(నారాయణఖేడ్): ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. కల్హేర్, మార్డి, బీబీపేట్, ఫత్తేపూర్, పోమ్యనాయక్ తండాలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తుందని తెలిపారు. ఎవరైనా మిగిలి ఉంటే ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్బాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బూర్గుల పోచయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ, నాయకులు తుకారాం, దేవదాస్, వీర్శెట్టి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ కంగ్టి(నారాయణఖేడ్): ఇళ్లు లేని ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి పేర్కొన్నారు. కంగ్టి మండలంలోని రాంతీర్థ్, ఎన్కెమూరి గ్రామాల్లో ఎమ్మెల్యే అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేశారు. గూడు లేని పేదలందరికి ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అనంతరం పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, ప్రత్యేకాధికారి నూతన్కుమార్, ఏఈ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతు మహోత్సవానికి రారండి..
రేపటి నుంచి హుస్నాబాద్లో కిసాన్ మేళా●● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుస్నాబాద్: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను హుస్నాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హాజరుకానున్నారు. 108 స్టాళ్లు.. కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు సంబందించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫైస్టిసైడ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్పామ్, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటలల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. సద్వినియోగం చేసుకోండి మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి -
వామ్మో.. జూన్!
జోగిపేట(అందోల్): జూన్ వచ్చిందంటే చాలు సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులకు గుండె గుబేలుమంటుంది. ఈ నెలలోనే విద్యాసంస్థలు తెరచుకుంటాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల పెనుభారంగా మారుతున్నాయి. పిల్లలకు యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలు ఇతరత్రా అవసరాల కొనుగోలు లెక్కలు వేసుకుంటున్నారు. స్కూల్ ఫీజులు ఎంత?, యూనిఫామ్స్ ఖర్చు ఎంతవుతుంది? ఏ పాఠశాలలో చేర్పించాలి? యూనిఫామ్ కొనుగోలు, ఇంటినుంచి పాఠశాలకు పిల్లల రవాణా వంటి ఖర్చులతో సతమతమవుతుంటారు. తమ బిడ్డలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలన్న అత్యాశతో ఆయా వర్గాల తల్లిదండ్రులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి. కిండర్ గార్డెన్స్కే వేలకు వేలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు వేలకు వేలు చెల్లించాల్సి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోకపోతుండటంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిలో తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఎల్కేజీ, యూకేజీలల్లో చేర్పించాలంటే రూ.వేలకువేలు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు అధిక ధరలను భరించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫీజుల కోసం అప్పులు పిల్లల ఫీజుల కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. చేబదులు, వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో నర్సరీలోనే రూ.35 వేలకు పైగా చెల్లించాల్సి ఉండగా..కొంచెం పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెనుభారంగానే మారాయి. ఇద్దరు పిల్లలకు ఫీజులు చెల్లించాల్సి వస్తే రూ.లక్ష పైగానే జూన్లో సమకూర్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. వీటికి తోడు ఇతరత్రా ఖర్చులు ఉండనే ఉన్నాయి. పిల్లల చదువు ఖర్చులకు తల్లిదండ్రులు బెంబేలు పేద, మధ్య తరగతికి భారంగా ఉన్న ప్రైవేటు స్కూలు ఫీజులు ఫీజుల నియంత్రణపై కొరవడిన పర్యవేక్షణఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,351 పాఠశాలలున్నాయి. 423 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నా ప్రైవేట్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. –వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు
మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నిష్పక్షపాతంగా, అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అమలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతితో పాటు వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యుత్ వినియోగంలో నిర్దిష్ట పరిమితికి లోబడి వినియోగించిన కుటుంబాలకు విద్యుత్ బిల్లును మాఫీ చేయాలన్నారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, గ్యాస్ కనెక్షన్లపై అందించే రాయితీలను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. పేదలకు సన్నబియ్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పక్కా ఇల్లు ప్రతీ కుటుంబానికి ఉండాలన్న లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం యువతను సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం అర్హులైనవారికి వెంటనే సేవలు అందించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్తు సీఈఓ జానకీరెడ్డి, వివిధ శాఖల అధికారులు జ్యోతి, జగదీశ్, చలపతిరావు, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మ్యాప్ రూపొందించాలి
పోలింగ్ కేంద్రాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డికి కొత్త కమిషనర్సంగారెడ్డి జోన్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల భౌగోళిక సమాచారం, సౌకర్యాలు, రవాణా మార్గాల భౌగోళిక మ్యాప్ (నజరీ నక్ష) రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పడే పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించాలని స్పష్టం చేశారు. ఓటర్ల ఇంటింటి సర్వే నిర్వహణ, పోలింగ్ కేంద్రాల పెంపు వివరాలు, కుటుంబ సభ్యులు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుని వాటిని ప్రభుత్వానికి అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పటాన్చెరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి దేవుజా, నియోజవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.సంగారెడ్డి : ప్రస్తుతం సంగారెడ్డి కమిషనర్గా పనిచేస్తున్న ప్రసాద్ చౌహన్ను ప్రభుత్వం సరెండర్ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం దుబ్బాక కమిషనర్గా పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి నియమించింది. దీంతో శ్రీనివాస్రెడ్డి రాత్రికి రాత్రే హడావుడిగా సంగారెడ్డి కొత్త కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. బల్దియా సిబ్బంది కోరిక మేరకు వారందరినీ మంగళవారం మహారాష్ట్రలోని తుల్జాపూర్ దేవాలయానికి తీసుకెళ్లారు. అయితే పనిదినాల్లో కొంతమంది సిబ్బంది కార్యాలయంలో లేకపోవడంతో విధులకు ఆటంకం కలిగినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దృష్టికి రాగా, ఈ విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. పనిదినాల్లో సిబ్బందిని టూర్కు తీసుకెళ్లిన కమిషనర్ ప్రసాద్ చౌహన్ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియాలో ఒక్కరోజులో హైడ్రామా పాత కమిషనర్ సరెండర్ హడావుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్ -
భూ బాధితులకు బాసట
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల భూ బాధితులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు పొన్నాల శ్రీనివాసరెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి వివాహ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన తేనేటి విందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మడిదల పరిధిలోని సర్వేనంబర్ 109 భూ బాధితులు వారి సమస్యలను హరీశ్రావుకు విన్నవించారు. భూ సమస్య పరిష్కారానికి తన సంపూర్ణ సహకారం అందిస్తామని భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్గౌడ్, బాల్రెడ్డి, సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
అరుణాచలంకు ప్రత్యేక బస్సులు
నారాయణఖేడ్: ఈనెల 11న పౌర్ణమిని పురస్కరించుకుని ఖేడ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యలోని మరోమూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైనన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బస్సులు ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ఖేడ్ నుంచి అరుణాచలంకు బయలుదేరుతాయన్నారు. 10వ తేదీ ఉదయం కాణిపాకం, సాయంత్రం గోల్డెన్టెంపుల్ దర్శించుకుని అక్కడి నుంచి బయల్దేరి 11న పౌర్ణమినాడు ఉదయం అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. గిరి ప్రదక్షణ అనంతరం 12న ఉదయం జోగుళాంబ తల్లి అమ్మవారి శక్తిపీఠం దర్శించుకున్నాక బయల్దేరి అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఖేడ్కు చేరుకుంటాయని తెలిపారు. రాను పోనూ ఒకొక్కరికీ రూ.4,500 చార్జీ ఉంటుందన్నారు. టికెట్లు బుక్ చేసుకునేందుకు 9959223170, 9441071134, 9676667703, 9063417294 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కొనసాగుతున్న భూభారతి సదస్సులు జిన్నారం (పటాన్చెరు): ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో భూభారతి సదస్సులు రెండవ రోజు కొనసాగుతున్నాయి. జిన్నారం మండలంలోని అండూర్, బొల్లారం మున్సిపాలిటీలో తహసీల్దార్ దేవదాసు ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలంలో అనంతారం గ్రామాల్లో తహసీల్దార్ పరమేశం రైతుల సమక్షంలో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా భూసమస్యలపై రైతుల నుంచి జిన్నారం మండలంలో 96, గుమ్మడిదల మండలంలో 16 అర్జీలు అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై విచారణరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూర్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వం ఇళ్లను కేటాయించి లబ్ధిదారుల్లో ఎంతమంది ఇళ్లలోకి వచ్చారు? ఎవరైనా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను అద్దెకిచ్చారా? వంటి అంశాలపై ఆరా తీశారు. అదే విధంగా ఎంతమంది లభ్ధిదారులు ఇప్పటి వరకు కేటాయించిన ఇళ్లలోకి రాలేదన్న విషయంపై విచారణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఓ వెంకటరామయ్య, ఆర్ఐ శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
6 నుంచి బడి బాట
19 వరకు నిర్వహణ ● బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠ శాలల్లో బడీడు పిల్లలను బడిలో చేర్పించడం కోసం ఈనెల 6 నుంచి ‘బడి బాట’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు మూడు విడతలుగా ఐదురోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందకు పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సౌకర్యాలు తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరిస్తూ వారి పిల్లలు సర్కారు బడుల్లో చేర్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పిల్లలకు, తల్లిదండ్రులకు స్వాగత కార్యక్రమాలు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా ఆ రోజున పాఠశాలలను ప్రత్యేకంగా అలంకరించి పండగ వాతావరణంలో తల్లిదండ్రులు, ప్రజలకు స్వాగతం పలకాలని ఉపాధ్యాయులు యోచిస్తున్నారు. అదేరోజు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తూ పేరెంట్స్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలని అధికారులు సూచించారు. టీఎస్ యూటీఎఫ్ ప్రచార జాత.. ‘బడిబాట’కు ముందే టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే ఐదు రోజులపాటు ప్రచార జాత నిర్వహించారు. సంఘం నాయకులు ప్రత్యేక వాహనాలతో గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని, పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గూర్చి వివరిస్తూ చైతన్యవంతులను చేశారు. జిల్లాలో ‘బడిబాట’ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కార్యక్రమాలు ఇలా.. 6వ తేదీన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ 7న ఉపాధ్యాయులు ఇంటింటి సందర్శనతోపాటు బడీడు పిల్లలను గుర్తించడం, 8,9,10తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు. అదేరోజు అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడి మానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేకావసరాల పిల్లలను అందుబాటులోని భవిత కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించడం చేస్తారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలపై 11న సమీక్ష, 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం, పిల్లలకు పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయనున్నారు. 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. -
సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ నర్సాపూర్ రూరల్/పాపన్నపేట(మెదక్)హవేళిఘనపూర్ (మెదక్): భూ సమస్యలున్న ప్రతీ ఒక్కరు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని మంతూర్, గొల్లపల్లి, పాపన్నపేట మండలం ముద్దాపూర్, మెదక్ మండలంలోని పేరూర్ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరికై నా భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసిందని తెలిపారు. ఫిర్యాదులపై తహసీల్దార్ విచారణ జరిపి,తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అక్కడ పరిష్కారం లభించక పోతే ఆర్డీఓకు, ఆపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మంతూర్లో 57, గొల్లపల్లిలో 47, ముద్దాపూర్, కొంపల్లి గ్రామాల్లో 68 భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
ఇక గ్రామాలే విత్తన బ్యాంకులు
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: రైతుల సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇక నుంచి గ్రామాలే విత్తన బ్యాంకులుగా పనిచేస్తాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని రైతువేదికలో మంగళవారం అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన బస్తాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ఝరాసంగం ఆలయకమిటీ నూతన బోర్డుసభ్యులుగా నియమితులైన ఈశ్వరప్పను ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి సన్మానించారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ... గతప్రభుత్వం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై రాయితీని ఎత్తివేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి గ్రామస్థాయిల్లోనే విత్తన బ్యాంకులు ఏర్పాటు జరిగేలా శ్రీకారం చుట్టిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట లక్షలాదిమంది రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపింఆరు. అన్యాయాన్ని సరిద్దిడానికి భూ భారతి చట్టం తీసుకువచ్చి రైతుల భూసమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందకు పక్కా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం బాణాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, ఏవో శంకర్, నాయకులు రమేశ్చౌహన్, తాహెర్ అలీ, పండరీరెడ్డి, శంకర్ ముదిరాజ్, నెహ్రూనాయక్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు దృష్టికి తీసుకురండి
రెవెన్యూ సదస్సులో కలెక్టర్ వల్లూరు క్రాంతి బియ్యం కోసం బారులుసంగారెడ్డి టౌన్/సంగారెడ్డి జోన్/ సంగారెడ్డి ఎడ్యుకేషన్ : నూతన రెవెన్యూ చట్టం భూ భారతి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతీ చిన్న సమస్యను ఈ సదస్సుల్లో తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు మహిళలకు రుణాలపై కలెక్టరేట్లో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ‘ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం’తో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తారన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ..గతంలో ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు కార్యాలయాల చుట్టూ,కోర్టుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి రైతుల చుట్టమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఖాసీం బేగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
చెరువు కట్టలు భద్రమేనా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వర్షాకాలంలో చెరువులు, కుంటల నిర్వహణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కట్టలు తెగిపోవడం, బుంగలు పడటం, కాలువలు ధ్వంసం కావడం వంటి జరిగే అవకాశాలుండటంతో ఆ శాఖ అప్రమత్తమైంది. గతేడాది వర్షాకాలంలో 75 శాతానికి మించి నిండిన చెరువులు, అలుగులు పారిన చెరువుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ చెరువుల కట్టలు ఎక్కడైనా బలహీనంగా ఉన్నాయా? తూములు మరమ్మతులు అవసరం ఉంటాయా? అలుగుల పరిస్థితి ఎలా ఉంది? 75 శాతానికి మించి నీళ్లు చేరితే కట్టలు తెగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. ఆయా మండలాల ఏఈఈలు, డీప్యూటీఈఈలు ఈ చెరువులను వెంటనే పరిశీలించాలని ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడైనా బుంగలు పడితే తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 75%కు మించి నిండిన చెరువులు 748 నీటిపారుదలశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1,769 చెరువులున్నాయి. ఇందులో 100 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చిన్న చెరువులతోపాటు, వంద ఎకరాలకు మించి ఆయకట్టున్న చెరువులు కూడా ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సెప్టెంబర్లోనే సుమారు 748 చెరువులు నిండాయి. ఇందులో 218 చెరువులు అలుగు పారగా, 75 శాతానికి మించి నిండిన చెరువులు 530 వరకు ఉంటాయి. ఇలా 75% నిండిన చెరువుల్లోకి ఈ వర్షాకాలంలో కూడా వరదనీరు వచ్చి చేరే అవకాశాలుండటంతో ఈ చెరువులపై ఈ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా చెరువుల కట్టలు ధ్వంసమైతే తక్షణం మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆ శాఖ ఆదేశించింది. అలాగే అలుగులు, తూములను మరమ్మతులు చేయాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం మరమ్మతులు చేపట్టాలి క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలునదీ పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడైనా ముంపునకు గురైతే ఆ ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రధానంగా మంజీర, నక్కవాగు వంటివి ఉన్నప్పటికీ..ఈ పరీవాహక ప్రాంతాల్లో ముంపు ముప్పు పెద్దగా ఉండదు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో మంగళవారం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మాజీమంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ...హరీశ్రావు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విమర్శించడం తప్ప కాంగ్రెస్ నాయకులకు పనేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని భూభారతి ద్వారా భూ సమస్యలను వెంటనే 100% పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రవికుమార్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హత్నూర మండలం గుండ్ల మాచనూర్ పీఏసీఎస్ డైరెక్టర్ బేగరి సాయిలు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సునీతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంమైన హత్నూరలోని మాజీ జెడ్పీటీసీ ఆశయ్య అనే గ్రామపంచాయతీ కార్మికుడు గుండెపోటుతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రహదారులు ముఖ్యం అని, రహదారులు అనుసంధానం చేస్తే విద్య ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందులు నిల్వ ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఇసుక కొరత లేదని తేల్చి చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, మాధురి, జెడ్పీసీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష -
అటవీ సిబ్బందిపై దాడికి యత్నం
శివ్వంపేట(నర్సాపూర్): B{MýSÑ$…_¯]l ArÒ ¿¶æ*Ñ$° VýS$Ç¢…_ ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$° ^èl$r*t MýS…§ýlMýS… 糯]l$Ë$ ^ólçÜ$¢¯]l² ArÒ íܺ¾…-¨Oò³ §éyìlMìS Ķæ$†-²…-^éÆý‡$. D çœ$r¯]l Ð]l$…yýlÌS ç³Ç-«¨ÌZ° ¿ZfÅ ç³…^éĶæ$¡ gñæ…V>Å ™èl…yéÌZ Ð]l$…VýSâýæ-ÐéÆý‡… ^ør$ ^ólçÜ$-MýS$…-¨. A«¨-M>-Æý‡$ÌS ÑÐ]lÆ>ÌS {ç³M>Æý‡…... ÕÐ]lÓ…õ³r òÜ„ýS¯ŒS ç³Ç«¨ §ö…† MýS…´ëÆý‡Šెr-Ã…-sŒæÌZ° 348ÌZ ArÒ ¿¶æ*Ñ$° ™èl…yéMýS$ ^ðl…¨¯]l ÐéÆý‡$ MýS»êj ^ólíÜ §ýl$¯]l²MýS… ^ólç³-sêtÆý‡$. ÑçÙĶæ$… ™ðlË$-çÜ$MýS$¯]l² ArÒ íܺ¾…¨ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ™èl…yéMýS$ ^ólÆý‡$MýS$° MýS»êjMýS$ ´ëÌSµ-yìl¯]l ÐéÇMìS AÐ]lV>-çßæ¯]l MýSÍ-µ…_ ¿¶æ*Ñ$° ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… B ¿¶æ*Ñ$ÌZ gôæïÜ-½-ÌS™ø MýS…§ýlMýS… ™èlÐ]lÓMýS… 糯]l$Ë$ ^ólç³-sêtÆý‡$. D {MýSÐ]l$…ÌZ 糯]l$Ë$ ^ólçÜ$¢¯]l² ArÒ íܺ¾…¨Oò³ ™èl…yéMýS$ ^ðl…¨¯]l MøÌS _sìæt VöyýlzÍ™ø §éyìl ^ólõÜ…-§ýl$MýS$ {ç³Ä¶æ$-†²…_…§ýl° ÕÐ]lÓ…õ³r òÜ„ýS¯ŒS A«¨M>Ç }«§ýl-ÆŠ‡-MýS$Ð]l*ÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$. _sìæt ¿ýæÆý‡¢ Æ>k ArÒ íܺ¾…-¨™ø VöyýlÐ]l ç³yézÆý‡° ^ðl´ëµÆý‡$. ArÒ ¿¶æ*Ñ$° B{MýS-Ñ$…-^èl$-MøÐ]l-yýl…™ø ´ër$ íܺ¾…¨Oò³ §éyìlMìS Ķæ$†²…_¯]l ¿êÆ>Å-¿ýæ-Æý‡¢ÌS¯]l$ ´ùÎ-çÜ$ÌSMýS$ Aç³µW…-_-¯]lr$Ï ™ðlÍ-´ëÆý‡$. ½sŒæ A«¨M>Ç MýS$Ð]l*ÆŠ‡ íœÆ>ŧýl$ Ðól$Æý‡MýS$ ´ùÎ-çÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. -
పొలానికి నీళ్లు పెట్టి వస్తుండగా..
కౌడిపల్లి(నర్సాపూర్): పొలం దగ్గరికీ వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తునికిగేట్ సమీపంలోని దేవులతండావద్ద 765డి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. దేవలతండాకు చెందిన కోల రమేష్(38) వ్యవసాయంతోపాటు గేదెలను పెంచుతున్నాడు. వీటి మేత కోసం పొలంలో పచ్చిగడ్డి సాగు చేశాడు. సోమవారం రాత్రి మడికి నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న కారు రమేష్ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుడికి భార్య నీల, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మహిళ.. కొండపాక(గజ్వేల్): రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కుకునూరుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని మంగోల్ గ్రామానికి చెందిన లగిశెట్టి మణెమ్మ(50) మనవడు అశ్విత్తో కలిసి ఆటోలో కుకునూరుపల్లికి మిరపకాయలు పట్టించడానికి బయలు దేరారు. ఈ క్రమంలో ఆటో దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళ్తున్న సెంట్రల్ పోలీస్ లైన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్న బుర్కి దేవానంద్ మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కానీ ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని ఆపకుండా సుమారు కిలో మీటరు దూరం వరకు వెళ్లాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు ద్విచక్ర వాహనదారున్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహం వద్ద నానమ్మ, నానమ్మ అంటూ 12 ఏళ్ల మనవడు అశ్విత్ రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. వాహనం ఆపకుండా వెళ్లడం పట్ల మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు పోలీస్టేషన్కు వెళ్లి గొడవకు దిగారు. పోలీసులు సర్ది చెప్పి, కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైతును ఢీకొట్టిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి -
కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య
మునిపల్లి(అందోల్): కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దగోపులారం గ్రామంలో చోటు చేసుకుంది. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బేగరి రమేశ్కు 13 సంవత్సరాల క్రితం కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది. వీరికి ముగ్గురు సంతానం. రమేశ్ తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో మూడు నెలల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు గొడవపడి ఇంట్లో ఐరన్ రాడ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐ వెంకటేశం, క్లూస్ టీం సిబ్బంది వచ్చి పరిశీలించారు. భార్య కాపురానికి రావడం లేదని భర్త.. కౌడిపల్లి(నర్సాపూర్): భార్య కాపురానికి రావడం లేదని భర్త గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని రాజీపేట గ్రామానికి చెందిన బాంచ శ్రీకాంత్(30)కి శివ్వంపేట మండలం గంగాయిపల్లికి చెందిన స్వాతితో ఏడాది క్రితం వివాహం అయింది. పదిహేను రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా స్వాతి పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి శ్రీకాంత్ వెళ్లగా ఇక్కడికి రాలేదని చెప్పి పంపారు. అనంతరం 31న మరోసారి అతడు వెళ్లగా భార్య కుటుంబ సభ్యులు కాపురానికి పంపమని, విడాకులు తీసుకుంటామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఇంటికి వచ్చి గడ్డి మందు తాగాడు. అనంతరం అన్న బాలకృష్ణతో విషయం చెప్పడంతో బాధితుడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. చెరువులో దూకి వృద్ధురాలు.. హవేళిఘణాపూర్(మెదక్): అనారోగ్యంతో ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్రూరల్ పోలీస్స్టేషన్ పరిఽధిలోని అవుసులపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగారం రామవ్వ(80) కుమారుడు సిద్దిరాంలుకు స్వగ్రామంలో ఇళ్లు లేకపోవడంతో మెదక్ పట్టణం పిల్లికొట్టాల్ వద్ద గల ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లో నివాసముంటున్నారు. సోమవారం రామవ్వ స్వగ్రామం అవుసులపల్లి గ్రామానికి వెళ్తానని చెప్పింది. రాత్రి వరకు రాలేదు. ఉదయం గ్రామ శివారులో ఉన్న చెరువులో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతుడి కుమారుడు సిద్దిరాంలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల సదనం నుంచి కూతురును పంపబోమన్నందుకు..పాపన్నపేట(మెదక్): బాల్య వివాహమై బాల సదనంలో ఉన్న కూతురును ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు అధికారులను కోరగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని ఏడుపాయల్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... శివ్వంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికకు 15 రోజుల క్రితం ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకునితో వివాహం జరిగింది. ఈ విషయం బయటకు రావడంతో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు బాలిక తల్లిదండ్రులు, పెళ్లి కుమారునిపై కేసు నమోదు చేసి బాలికను మెదక్ బాల సదనంకు తరలించారు. మంగళవారం బాలికను చూసేందుకు బాలసదనం వెళ్లిన తల్లిదండ్రులు తమ కూతురును ఇంటికి పంపించాలని ఐసీడీఎస్ అధికారులను కోరారు. ఆమెను ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామని ఐసీడీఎస్ డీపీపీఓ కరుణ స్పష్టం చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక తల్లిదండ్రులు ఏడుపాయలకు వచ్చి, విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం వారు తమ సోదరులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాఽధించవచ్చని సీడీసీ చైర్మన్ రాంరెడ్డి రైతులకు సూచించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని మద్దికుంట రైతువేదికలో డీఏఓ శివప్రసాద్,వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్తో కలిసి రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు సన్నరకం వరి,పెసర,కంది విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి దిగుబడిని సాధిం ంచాలన్నారు. రోహిణి కార్తిలోనే వరి నార్లు పోసుకోవడం ద్వారా బలంగా పెరిగి చీడపీడలను తట్టుకుని ముందుగా పంట చేతికి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటలక్ష్మి,ఏఎంసీ చైర్మన్ కుమార్,ఏఓ రమేశ్,ఏఈఓలు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. మూల విత్తనాల పంపిణీ జరగాలి సంగారెడ్డి టౌన్: విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా రైతులకు విత్తనాల పంపిణీ సజావుగా జరగాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బాలాజీ నాయక్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి రైతువేదికలో మంగళవారం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు దివ్యజ్యోతి, ఝాన్సీలక్ష్మి, శ్రావణ్కుమార్, గాయత్రీసౌజన్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాయికోడ్ మండలంలో.. రాయికోడ్(అందోల్): మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల సాగుపై శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి కంది, పెసర విత్తనాలను ఎంపిక చేసిన రైతులు మొగులప్ప, బక్కప్ప తదితరులకు అందజేసినట్లు ఏఈఓ నికిలేశ్ తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు నాగిశెట్టి పాటిల్, హన్మంగొండ, ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏసయ్య, నాయకులు ఉన్నారు.సీడీసీ చైర్మన్ రాంరెడ్డి -
బాలికా విద్యకు.. మరింత భరోసా
ఏడు కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం ● 360 మంది బాలికలకు ప్రయోజనం ● సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులున్యాల్కల్(జహీరాబాద్): విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రై వేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంగ్ల మాధ్యమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. సక్సెస్ పాఠశాలల మాదిరిగా కేజీబీవీలో ఇంటర్ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఆంగ్ల బోధన వైపు మొగ్గు చూపుతుండటంతో పాటు ఆడ పిల్లల విషయంలో భద్రతను కూడా కోరుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు జిల్లాలోని 7 కేజీబీవీలను ఇంటర్(ఆంగ్ల మాధ్యమం) వరకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఎలిమెంటరీ స్థాయి నుంచే బాలికలకు విద్య నందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ విద్యా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాని ఆ కార్యక్రమం వల్ల సరైన ఫలితాలు రాలేవు. దీంతో బాలికలకు పూర్తి స్థాయి విద్య నందించేందుకు సిబ్బందితో కూడిన హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించింది. మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్న బీద కుటుంబాలతో పాటు ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు చెందిన (ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందిన బాలికల కోసం మండలానికి ఒకటి చొప్పున మొదట సంగారెడ్డి జిల్లాలో 17 కేజీబీవీలను ఏర్పాటు చేసింది. మూడేళ్ల క్రితం మరో ఐదు కేజీబీవీలకు శ్రీకారం చుట్టింది. విద్యనభ్యసిస్తున్న 5వేల మంది ఆరో తరగతి నుంచి 10వ వరకు గల విద్యాలయాల్లో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన బాలికలకు, మిగతా 25 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఆయా విద్యాలయాల్లో సుమారు 5వేల మంది బాలికలు చదువుకుంటున్నారు. జిల్లాలో నాగిల్గిద్ద కేజీబీవీలో 8వ తరగతి వరకు, మొగుడంపల్లి, గుమ్మడిదల, చౌటకూర్లో 9వ తరగతి వరకు ఉంది. అందోల్, నారాయణఖేడ్, కొండాపూర్, ఝరాసంగం, రాయికోడ్, సదాశివపేట్, సిర్గాపూర్, సుల్తాన్పూర్, జిన్నారం, హోతి(కె) కేజీబీవీల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఏడు కేజీబీవీల్లో ఇంటర్ వరకు.. ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని న్యాల్కల్, అత్నూర, కంగ్టి, కాశీంపూర్, తాట్పల్లి, హుస్మాన్ నగర్, పుల్కూర్తి ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అప్గ్రేడ్ చేసిన విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందని అధికారులు తెలిపారు. రెండు కేజీబీవీల్లో రెండు గ్రూప్లు(ఎంపీసీ, బైపీసీ) గ్రూప్నకు 40 మంది చొప్పున 160 మంది, మిగిలిన విద్యాలయాల్లో ఎంఎల్టీలో గ్రూప్కు 40 చొప్పున 200 మంది బాలికలకు అడ్మిషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కేజీవీబీల్లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ వరకు అప్గ్రేడ్ పొందిన విద్యాలయాల్లో అధ్యాకుల నియామకానికి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. సంతోషంగా ఉంది 10వ తరగతి వరకు ఉన్న విద్యాలయాన్ని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషంగా ఉంది. పదో తరగతి పూర్తయిన తర్వాత బయటకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థికంగా కష్టం. ఇక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేందుకు అవకాశం కల్పించడం బాలికలందరికీ వరం. – మేరీ, విద్యార్థిని, కేజీబీవీ, న్యాల్కల్ సిబ్బందిని త్వరలోనే నియమిస్తాం జిల్లాలో ప్రస్తుతం 10 కేజీబీవీల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏడు కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. బోధనా సిబ్బందిని త్వరలోనే నియమిస్తాం. తరగతులు త్వరలో ప్రారంభమవుతాయి. – వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి -
నిరుపేద కుటుంబానికి చేయూత
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి చెందిన నామ రవికిరణ్ పేదవారికి చేయూతనిస్తున్నారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లికి చెందిన మక్కల రాములు ఐదుగురు సంతానంతో చాలాకాలం నుంచి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. భార్య చనిపోవడంతో పాటు ఐదుగురు పిల్లలతో తలదాచుకునేందుకు గూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గుహ లాంటి రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాములు కుటుంబ పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ నాయకుడు, నామ సుభద్రమ్మ ట్రస్టు అధ్యక్షుడు నామ రవికిరణ్ సొంత ఖర్చుతో ఇల్లు కట్టించాడు. హరీశ్ రావుకు అభిమాని అయిన రవికిరణ్ ఆయన పుట్టినరోజున ఎమ్మెల్యే మాణిక్రావు చేతుల మీదుగా ప్రారంభించి ఇంటి తాళాలను రాములుకు అప్పగించారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ రవికిరణ్ పేద కుటుంబానికి ఇల్లు కానుకగా ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొంత డబ్బులతో ఇల్లు కట్టించిన నామ రవికిరణ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్రావు -
ఏటీఎం చోరీకి యత్నం
నిందితుడి రిమాండ్ జిన్నారం (పటాన్చెరు): ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం... నిందితుడు మాలి గణేశ్ మహారాష్ట్ర నుంచి వలస వచ్చి బీరప్ప బస్తీలో నివాసముంటున్నాడు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బీరప్ప బస్తీలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంను గడ్డపారతో ధ్వంసం చేసే క్రమంలో అలారం మోగడంతో వెంటనే పారిపోయాడు. ఏటీఎం సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి గతంలో కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. -
భూ భారతితో రైతులకు న్యాయం
ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ న్యాల్కల్(జహీరాబాద్): రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణి పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. మండలంలోని మిర్జాపూర్(ఎన్)గ్రామంలో మంగళవారం భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ధరణిని తొలగించి భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలు సాధ్యమైనంత వరకు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతుల కోసం చెరకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీజీఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్ అహ్మద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్రెడ్డి, తిరుపతిరెడ్డి, కేతకీ ఆలయ చైర్మన్ శేఖర్, నాయకులు ్డ పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన గిరిపుత్రులు
హుస్నాబాద్రూరల్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు మెరిశారు. సోమవారం ప్రకటించిన ఈ ఫలితా ల్లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో బీ. సునీల్ 572 ర్యాంకు, ఎల్. ప్రవీణ్ 1,750 ర్యాంకు సా ధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. మొగుడంపల్లి విద్యార్థి ప్రతిభ జహీరాబాద్ టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల కేంద్రమైన మొగుడంపల్లి విద్యార్థి తుడం స్టాలిన్ ప్రతిభ కనబర్చాడు. ఆల్ ఇండియా ర్యాకింగ్లో 8,589 స్థానం సాధించగా జాతీయ స్థాయిలో ఎస్సీ కేటగిరీలో 205 ర్యాంక్ సాధించాడు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడంతో తండ్రి సిరోమణి హర్షం వ్యక్తం చేశారు. నాడు అనారోగ్యంతో తల్లి.. నేడు తండ్రి ● ఇద్దరి మృతితో అనాథలుగా మారిన పిల్లలు గజ్వేల్రూరల్: ఏడాది కిందట తల్లి, నేడు తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(పల్లెపహాడ్)లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్కు చెందిన గూడూరి రమేశ్(40), పద్మ దంపతులకు 9 ఏళ్ల లోపు ఇద్దరు కుమారులు పవన్, వరుణ్లు ఉన్నారు. వీరి గ్రామం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురికావడంతో ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో ఓపెన్ప్లాట్ను తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షల పరిహారంతో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారు. ఏడాది కిందట పద్మకు గుండెపోటు రావడంతో భర్త రమేశ్ ఆ రూ. 5 లక్షలతోపాటు మరికొంత డబ్బుతో వైద్యం చేయించినప్పటికీ మృతి చెందింది. భార్య మృతితో మానసికవేదనకు గురైన రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చందాలు వేసుకొని సోమవారం రమేశ్ అంత్యక్రియలను నిర్వహించారు. దాతలు ఎవరైనా ఉంటే పిల్లలను ఆదుకోవాలని 95029 56642 నంబరులో సంప్రదించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. భార్యను చంపిన కేసులో భర్త రిమాండ్ కొండపాక(గజ్వేల్): భార్యను కొట్టి చంపిన కేసులో భర్తను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. తొగుట సీఐ లతీఫ్ కుకునూరుపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కొండపాకకు చెందిన యశోదపై భర్త మల్లేశం అనుమానం పెంచుకొని గొడవపడి ఇనుప పారతో తలపై కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోగా భయంతో పారిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యశోద ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. మల్లేశం అదే రోజు రాత్రి హైదరాబాద్కు పారిపోయేందుకు కుకునూరుపల్లి బస్టాప్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్ఐ శ్రీనివాస్తోపాటు కలిసి అక్కడికి వెళ్లి నిందితుడు మల్లేశంను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నేరం ఒప్పుకోగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
మానవత్వం చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
జగదేవ్పూర్(గజ్వేల్): బంగారు ఆభరణాలు, నగదును బస్సులో మర్చిపోయిన వ్యక్తికి ఆర్టీసీ ఉద్యోగులు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బంటు యాదగిరి కూతురు పెళ్లికి సంబంధించి ఏడు తులా ల బంగారం, రూ.2.5 లక్షల నగదును బ్యాగులో పెట్టుకొని సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో భువనగిరి నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ఇంద్రానగర్కు బయలుదేరాడు. ఇంద్రానగర్ వెళ్లే ఆటో ఎక్కడానికి జగదేవ్పూర్ రాగానే బ్యాగును బస్సులోనే వదిలి హడావిడిగా దిగిపోయాడు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ సలీం, కండక్టర్ ఓం ప్రకాశ్ స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. కొద్దిసేపటికి యాదగిరి జగదేవ్పూర్కు వచ్చి పోలీస్స్టేషన్కు విషయాన్ని చెప్పాడు. ఎస్ఐ చంద్రమోహన్ బంగా రం, నగదు బ్యాగును బాధితుడికి అప్పగించారు. -
బాల్య వివాహం.. ముగ్గురిపై కేసు నమోదు
బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలింపు శివ్వంపేట(నర్సాపూర్): బాలికకు పెళ్లి చేసినందుకు ఆమె తల్లిదండ్రులతోపాటు పెళ్లి కుమారుడిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి, ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికను వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ములుగు మండలానికి చెందిన వ్యక్తితో గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కాగా విషయం తెలియడంతో ఐసీపీఎస్ కో ఆర్డినేటర్ శంకర్గౌడ్, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోష, పంచాయతీ కార్యదర్శి గాయత్రీ గ్రామంలో విచారణ చేశారు. బాల్య వివాహం చేయడం సరికాదని తల్లిదండ్రులకు చెప్పి బాలికను మెదక్ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. -
మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. జగదేవ్పూర్కు చెందిన రాయారం కనకయ్య(40) సుజాత దంపతులు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొద్ది రోజులుగా కనకయ్య మద్యానికి బానిస కావడంతో భార్య తల్లిగారి ఇంటికెళ్లి అక్కడే ఉంటుంది. ఆదివారం పీర్లపల్లిలో అక్క ఇంటికి వెళ్లి వస్తానని తండ్రితో చెప్పి ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. పీర్లపల్లికి కాలినడకనా వెళ్లి గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన కొమురయ్య వ్యవసాయ బావి వద్ద మద్యం సేవిస్తున్నాడు. కొమురయ్య చూసి పలకరించగా అక్క వెంకటమ్మ ఇంటికొచ్చానని చెప్పారు. అనంతరం బావి దగ్గర కాలకృత్యాలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. వెంటనే కనకయ్య వెంకటమ్మకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే రాత్రి కావడంతో సోమవారం ఉదయం బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. డివైడర్ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు గజ్వేల్రూరల్: డివైడర్ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ మార్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన ముత్యాల పరశురాములు(32)కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల కిందట బొంబాయికి వెళ్లారు. పిల్లల ఆధార్కార్డుల కోసం వారం రోజుల కిందట పరశురాములు దంపతులు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(లక్ష్మాపూర్)లో ఉండే అత్తగారింటికి వచ్చారు. ఆదివారం రాత్రి ఒక్కడే బైక్పై గజ్వేల్ నుంచి లక్ష్మాపూర్ వైపు వస్తుండగా మార్గమధ్యలో రింగురోడ్డు వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పరశురాములు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ను డీసీఎం ఢీకొట్టడంతో వ్యక్తి గజ్వేల్రూరల్: డీసీఎం వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మర్కూక్ మండలం పాతూరుకు చెందిన కొక్కండ వెంకటేశ్(38)కు భార్య హంస, కుమారుడు, కూతురు ఉన్నారు. కూరగాయ పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కూరగాయలను తెంపుకొని బైక్పై పాతూరు కూరగాయల మార్కెట్కు వచ్చాడు. తిరిగి పొలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని మహాలక్ష్మీ రబ్బర్ పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం వెంకటేశ్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంకటేశ్ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు పాపన్నపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో పొందుతూ మృతి చెందాడు. మండల పరిధిలోని పోంలా తండాకు చెందిన లునావత్ సూర్య(30) నార్సింగి గ్రా మానికి చెందిన దుర్గయ్య బైక్పై 28న పాపన్నపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంకు వద్ద ముందుగా వెళ్తున్న టీవీఎస్ మోపెడ్ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘనటలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. సూర్యకు బలమైన గాయాలు కావడంతో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
‘మహీంద్ర’లో పోరు రసవత్తరం
జహీరాబాద్: జహీరాబాద్లోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో కార్మిక సంఘం ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 5న ఎన్నికలను నిర్వహించేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో అధికార సీఐటీయూ, ఐఎన్టీయూసీ యూనియన్లు విజయం కోసం శథ విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలను ఆయా యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 1983–84 సంవత్సరంలో 150 మంది పర్మనెంట్ కార్మికులతో ప్రారంభమైన కర్మాగారంలో ప్రస్తుతం 543 మంది కార్మికులు ఉన్నారు. 1985 నుంచి కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఆరు పర్యాయాలు, సీఐటీయూ ఆరు పర్యాయాలు, హెచ్ఎంఎస్ రెండు పర్యాయాలు, టీఎంఎస్ రెండు పర్యాయాలు విజయం సాధించాయి. ఇప్పటికే గేట్ మీటింగ్లు పూర్తి కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్న సీఐటీయూ, ఐఎన్టీయూసీలు ఇప్పటికే గేట్ మీటింగ్లను నిర్వహించి గెలిపిస్తే తాము చేయబోయే ప్రధాన పనుల గురించి కార్మికులకు సందేశం ఇచ్చారు. ఇప్పటి వరకు తాము మంచి అగ్రిమెంట్ చేసి పెట్టామని సీఐటీయూ నేత చుక్క రాములు చెబుతున్నారు. ఐఎన్టీయూసీ తరఫున పోటీ చేస్తున్న రాష్ట్ర నేత జనక్ప్రసాద్ మాత్రం రాష్ట్రంలో తమ యూనియన్ అధికారంలో ఉన్నందున కార్మికుల సమస్యలను పరిష్కరించడం సులభవుతుందంటున్నారు. ఆయా యూనియన్ నాయకులు కార్మికుల ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. 4వ వరుస విజయం కోసం సీఐటీయూ వ్యూహం పూర్వ వైభవం కోసం ఐఎన్టీయూసీ కసరత్తు కార్మిక సంఘం ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా యూనియన్ల నాయకులు -
గుంతలోకి దూసుకెళ్లిన బస్సు
మనోహరాబాద్(తూప్రాన్): అదుపుతప్పి బస్సు గుంతలోకి దూసుకెళ్లిన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ము ప్పిరెడ్డిపల్లి పరిశ్రమల వాడలోని లాంకో పరిశ్ర మలో పని చేసే ఉద్యోగులు, కార్మికులను పరిశ్రమ కు చెందిన బస్సులో నిత్యం ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సోమవారం హైదరాబాద్ నుంచి సుమారు 20 మందిని బస్సులో తీసుకొని వస్తున్నారు. మండలంలోని కూచారం వద్ద జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ సాయికి తీవ్రగాయాలు కాగా, మిగితా వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. -
మా భూమిలోకి మమ్మల్ని రానివ్వడం లేదు
సిద్దిపేటజోన్: డబ్బులు పెట్టి కొన్న మా భూమిలోకి రానివ్వడం లేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక వద్ద చోటు చేసుకుంది. బాధితులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు. బాధితు ల కథనం ప్రకారం.. రాఘవేంద్రనగర్ పరిధిలో 1996లో 21 మంది ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. 2023లో అశోక్, మహేందర్ ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా అక్కడికి రాకుండా అడ్డుకోవడం, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఎదుగుదల ఓర్వలేక కుట్ర.. రాజకీయ ఎదుగుదల ఓర్వలేక తనపై కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు మహేందర్ విమర్శించారు. సోమవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ వెంచర్లో ప్లాట్లు కొని కొందరు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 2000లో రికార్డుల ప్రకారం 4 ఎకరాల్లో కాకుండా 18 ఎకరాలు ఉన్నట్లు తప్పుడు పత్రాలతో రియల్ వ్యాపారులు కబ్జా చేసినట్లు ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసి ఫ్ల కార్డులతో నిరసన చేసిన వారిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. న్యాయం చేయాలని మంత్రికి వినతి ఫ్ల కార్డులతో బాధితుల నిరసన -
కూరగాయలకు వెళ్లొస్తుండగా..
మర్కూక్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలు అయ్యా యి. ఈ ఘటన మర్కూక్ మండలంలోని పాములర్తి గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్ఐ దామోదర్ కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొండారెడ్డి చెరువు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య(33), కుమారుడు కర్రె జీవన్ (13) ఇద్దరూ వ్యాపారం నిమిత్తం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్కు వచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తుండగా మండలంలోని పాములపర్తి గ్రామ శివారులో ముందుగా వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జీవన్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కనకయ్యను మెరుగైన వైద్యం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ను ఢీకొట్టిన బైక్ కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు -
సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు
సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాతే పోస్ట్లు పెట్టాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాజీత్ పుర, కరీంనగర్ రోడ్, అంబేడ్కర్ నగర్, సంజీవయ్య నగర్, తదితర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసుల సలహాలు, సూచనలు పాటించి శాంతి భద్రతలో ప్రజలు, యువకులు భాగస్వామ్యం కావాలన్నారు. డయల్ 100, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 67100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.