Sangareddy
-
వివాహానికి వెళ్తూ అనంత లోకాలకు..
● బైక్ను ఢీకొట్టిన కర్నాటక ఆర్టీసీ బస్సు ● ప్రమాదంలో ఇద్దరు మృతి ● 10 మందికి గాయాలు రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు నంగునూరు(సిద్దిపేట): ఐదుగురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం, సారపాక వద్ద చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్కు చెందిన పులిగిల్ల లింగప్రసాద్, బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, నక్క కుమార్, నర్మేటకు చెందిన చంద్రశేఖర్, అప్పలాయిచెర్వుకు చెందిన సంపత్రెడ్డి హనుమాన్ మాలవేశారు. కారులో బద్రాచలం వెళ్లి మాల విరమణ అనంతరం విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కట్టెల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. లింగప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా మిగతా వారు సిద్దిపేటలో చికిత్స పొందుతున్నారు.న్యాల్కల్(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీదర్ శివారులో బీదర్–జహీరాబాద్ రోడ్డుపై చోటు చేసుకుంది. బీదర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మిర్జాపూర్(బి)కి చెందిన పంచలింగాల నర్సింహులు, నాగన్న అన్నదమ్ములు. నర్సింహులు(50), నాగన్న కుమారుడు వరుణ్ కుమార్(20)తో కలిసి ఒక బైక్పై, నర్సింహులు భార్య లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్ మరో బైక్పై బీదర్ సమీపంలో కౌటలోని బంధువుల వివాహానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న బీదర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న నర్సింహులు, వరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్లిన నర్సింహులు భార్య, కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సులో 13 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. డ్రైవర్ శ్రీమంత్, కండక్టర్ రవి కుమార్తో పాటు 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే బీదర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ సందర్శించారు. ప్రాణాలు కాపాడిన చెట్టు రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను ఓ చెట్టు కాపాడింది. వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన బస్సు వేగం తగ్గి బోల్తాపడింది. ఆ చెట్టు అడ్డు తగలకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం జరగడంతో పాటు అనేక మంది క్షతగాత్రులయ్యేవారు. బైక్ అదుపు తప్పి వృద్ధుడు.. మిరుదొడ్డి(దుబ్బాక): బైక్ అదుపు తప్పి కిందపడటంతో వృద్ధుడు మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన గువ్వాడి సంజీవ రావు (67) సోమవారం బెజ్జంకిలోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ధర్మారం శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొట్టడంతో ఒకరు.. టేక్మాల్(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొడ్మట్పల్లి హైవేపై మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని కోరంపల్లి గ్రామానికి చెందిన తెల్లగొల్ల హన్మంతు(60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హన్మంతుకు ఇద్దరు భార్యలు. కాగా హన్మంతు రెండో భార్య ఇంటి(సాలోజిపల్లి) నుంచి ఈనెల 11న టీవీఎస్పై సంగారెడ్డికి వెళ్లాడు. ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా బొడ్మట్పల్లి వద్ద హైవేపై రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అతివేగంతో హైదరాబాద్ వెళ్తున్న కారు హన్మంతును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడ్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు నర్సింహులు వరుణ్ కుమార్ -
వాహనాలు నిలిపే స్థలంలో అగ్నిప్రమాదం
పటాన్చెరు టౌన్: అగ్నిప్రమాదంలో టిప్పర్లు, కార్లు, ఆటోలు కాలిపోయాయి. ఈ సంఘటన పటాన్చెరు పరిధిలో చోటుచేసుకుంది. పటాన్చెరు శివారులో శ్రీరామ్ మాల్ వాహనాలు నిలిపే స్థలం ఉంది. ఈ సంస్థ ఫైనాన్స్ వివాదాల్లో ఉన్న వాహనాలను ఇక్కడికి తెచ్చి ఉంచుతారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వాహనాలు నిలిపేచోట అగ్ని ప్రమాదం సంభవించి వాహనాలు కాలిపోయాయి. ఇందులో ఐదు టిప్పర్లు, ఒక లారీ, ఐదు కార్లు, 12 ఆటోలు 11కు పైగా బైకులు ఉన్నాయి. కాగా బైకులు, ఆటోలు పోలీస్ కేసులో ఉన్న వాటిని అక్కడ ఉంచడంతో అవి కూడా తగలబడ్డాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఆవరణలో ఎవరో సిగరెట్ వెలిగించి పడేయడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. షార్ట్ సర్క్యూట్తో బ్యాటరీ షాప్.. పెద్దశంకరంపేట(మెదక్): షార్ట్ సర్క్యూట్తో బ్యాటరీ షాప్ దగ్ధమైంది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు... పేటకు చెందిన అబ్దుల్ సోమవారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు. షార్ట్ సర్క్యూట్తో షాపులో ఉన్న బ్యాటరీలు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్ సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ ప్రభుదాస్ పరిశీలించారు. వెంకటాపూర్లో కిరాణా దుకాణం.. నారాయణఖేడ్: మండలంలోని వెంకటాపూర్లో మంగళవారం తెల్లవారు జామున కిరాణా దుకాణం దగ్ధమై రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. వివరాలు.. మదినా పటేల్ ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. సోమవారం రాత్రి రోజూ లాగే దుకాణాన్ని మూసివేసి నిద్రించాడు. తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో మేల్కొని చుట్టుపక్కల వారితో కలిసి ఆర్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఖేడ్ అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే దుకాణంలోని సామగ్రి కాలిపోయింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. -
.........
● పది రోజుల్లోనే రూ.100 పెంపు ● ఎండలకు చనిపోతున్న కోళ్లు ● పెళ్లిళ్ల సీజన్తో ధరల భారం చికెన్ కిలో ధర రూ.360జోగిపేట(అందోల్): కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం రూ.360కి పెరిగింది. పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలు మరో 15 నుంచి 20 రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.తగ్గిన ఉత్పత్తిఎండలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. అధికంగా కంపెనీల యజమానులే షెడ్లలో కోళ్లను పెంచి, వారు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పొచ్చు. స్కిన్లెస్ కిలో రూ.360కి, లైవ్ కోడి రూ.210, స్కిన్తో రూ. 320కి అమ్ముతున్నారు.పెళ్లిళ్ల సీజన్తో డిమాండ్పెళ్లిళ్ల సీజన్తో చికెన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఎండ త్రీవత కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల నుంచి కోళ్ల, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.360కి విక్రయిస్తున్నాం. ధరలు పెరగడంతో కొంతమేరకు విక్రయాలు తగ్గాయి.– ఎండీ. జావీద్, విక్రయదారుడు, జోగిపేట -
నైపుణ్యం పెంచుకుందాం
సెలవులు వాడుకుందాం.. ● డ్రాయింగ్, పేయింటింగ్ తదితర వాటిని నేర్చుకోవడం ● కుటుంబ సభ్యులతో కలిసి ఆటలాడటం, కథలు చెప్పడం నారాయణఖేడ్: వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఆటవిడుపుగా మారుతుంది. ఇన్నాళ్లూ కేవలం పాఠ్యాంశాలతోనే కుస్తీ పట్టిన చిన్నారులు పలు అంశాలను నేర్చుకోవడం, ఇంటి సభ్యులకు సహకరించడం లాంటివి చేయొచ్చు. విజ్ఞానం, ఆరోగ్యం, జీవన నైపుణ్యం, సామాజిక, వ్యక్తిత్వాభివృద్ధి, ఆటలు తదితర అంశాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వేసవి సెలవుల్లో చిన్నారులు చేయాల్సిన కొన్ని పనులు... సృజనాత్మక కార్యక్రమాలు డ్రాయింగ్, పేయింటింగ్, కథలు రాయడం లేదా, కామిక్ తయారు చేయడం, ఫొటోగ్రఫీ నేర్పించడం, బేసిక్ కంప్యూటర్ లేదా కోడింగ్ లాంటివి నేర్చుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లిష్, అబాకస్ లేదా మ్యాథ్స్ గేమ్స్, సైన్స్లో ఎక్స్పరిమెంట్స్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చు. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లేదా స్కేటింగ్, కుటుంబ సభ్యులతో కలిసి క్విజ్ పోటీలు, క్యాంప్ఫైర్ కథలు, కుకింగ్లో చిన్న సహాయం చేయడం. ప్రకృతి బాధ్యత.. మొక్కలు నాటడం, తోటపని, పక్షుల గూర్చి వివరించడం, పెంపుడు జంతువుల సంరక్షణ, నీటి సంరక్షణ గూర్చి అవగాహన, ఉదయం ఆటలు మధ్యాహ్నం క్రాఫ్ట్, సాయంత్రం బయటి ఆటలు, రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి గేమ్స్ లేదా కథలు చెప్పడం. సామాజిక, వ్యక్తిత్వాభివృద్ధి.. పెద్దలకు సహాయం చేయడం, కొత్త స్నేహితులను చేసుకోవడం, పబ్లిక్ స్పీకింగ్ లేదా స్టేజ్ ఫియర్ తగ్గించే కార్యకలాపాలు, ప్రతీ రోజు ఒక మంచి అలవాటు. అభ్యాసం, కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇళ్లకు వెళ్లడం, పర్యటనలు లేదా దగ్గర్లోని ద్రేశాలు చూడటం చేయాలి. వంటలు నేర్చుకోవడం, గది సర్దుకోవడం, వస్తువులు సక్రమంగా పెట్టడం, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, డబ్బు సేవింగ్ అలవాటు నేర్చుకోవడం తదితర కార్యక్రమాలు చేసుకోవచ్చు. సాధన చేసి.. సత్తా చాటుతాం హుస్నాబాద్: వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు చిన్నారులు. హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో చిన్నారుల సందడి నెలకొంది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్ క్రీడాకారుడు, కోచ్ టాగూర్ దిలీప్ సింగ్ చిన్నారులకు షటిల్ బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు 25 మంది పిల్లలకు షటిల్ బ్యాడ్మింటన్లో మెలకువలు నేర్పిస్తున్నారు. వామప్, ఫిట్నెస్పై శిక్షణ ఇస్తున్నారు. మినీ స్టేడియంలో యువతీయువకులు వాలీబాల్ ప్రాక్టిస్ చేస్తూ క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు. చిన్నతనం నుంచే ఫిట్నెస్పై దృష్టి పెడితే శారీరకంగా, మానసికంగా దోహదపడుతుంది. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదో ఒక క్రీడలో తమ పిల్లలు నైపుణ్యం సాధించేలా ప్రోత్సహిస్తూ శిక్షణ శిబిరానికి పంపిస్తున్నారు. వేసవిలో నిర్వహించే సమ్మర్ క్యాంపులో చేరి క్రీడల్లో రాణించాలని చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
చెడ్డీ గ్యాంగ్ హల్చల్
150 లీటర్ల డీజిల్ చోరీజోగిపేట(అందోల్): పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆవరణలోని సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. వివరాలు ఇలా... ఆక్స్ఫర్డ్ పాఠశాల గోడకు దగ్గరగా కారు నిలిపారు. అందులో నుంచి ముగ్గురు యువకులు బయటకు దిగారు. వారంతా చెడ్డీలు ధరించి ఉన్నారు. పాఠశాలలోని ప్రహరిగోడ దూకి పాఠశాల బస్సుల నుంచి సుమారు 50 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. అదే రోజు మరో చోట లారీలో నుంచి 100 లీటర్ల డీజిల్ను అపహరించారు. ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుకు ఉన్న నంబరును పరిశీలించగా అది ఒక ఆటోదిగా గుర్తించారు. -
విద్యార్థికి సీఎం అభినందనలు
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్కు చెందిన ఇంటర్ విద్యార్థి విఘ్నేశ్ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి ల్యాప్టాప్ను బహూకరించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల సంద ర్భంగా విద్యార్థి విఘ్నేశ్ ఐఐటీ జేఈఈ మెయి న్స్లో 87.22 స్కోర్తో ఉత్తమ ప్రతిభతో ఐఐటీ అడ్వాన్స్కు అర్హత సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటాడు. దీంతో ఆ విద్యార్థిని ముఖ్యమంత్రి అభినందిస్తూ ల్యాప్టాప్ అందజేశారు. విద్యార్థి కళాశాలకు, డివిజన్కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంపై ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డిసంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆమెతోపాటు ఎస్సీ సెల్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ రాజ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన కార్యకర్తలు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత్ కిషన్, జిల్లా నాయకుడు రఘు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హనుమంతు యాదగిరి, ఉపాధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు.కల్లు మత్తులో వృద్ధుడి బలవన్మరణం అల్లాదుర్గం(మెదక్): కల్లు తాగిన మైకంలో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన బెస్త వెంకయ్య(69)కు రోజూ కల్లు తాగే అలవాటు ఉంది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే కల్లు తాగిన వెంకయ్య మత్తులో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 09:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి తాడుతో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి పటాన్చెరు టౌన్: విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందింది.ఈ సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ వివరాల ప్రకారం... జనగామ జిల్లా.. జాఫర్ఘడ్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెంది న ఎల్లమ్మ (55), భర్త సమ్మయ్యతో కలిసి సుమారు తొమ్మిదేళ్ల క్రితం అమీన్పూర్కు వల స వచ్చింది. రాజీవ్ గృహకల్ప నర్రెగూడెంలో ఉంటూ జీవనోపాధి కోసం గణేశ్ మండ పం షెడ్ నిర్మాణ పనుల వద్ద కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విద్యుత్ స్తంభం నుంచి చెట్టు మీదుగా విద్యుత్ తీగను వేసి కరెంట్ సరఫరా తీసుకున్నారు. కాగా ఆ విద్యుత్ తీగ తెగిపడి నేలపై ఉండగా, ఎల్లమ్మ నీరు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు దానిపై కాలు పెట్టడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. -
తల్లీ, కూతురు అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. పటాన్చెరులో తల్లీ,ఇద్దరు పిల్లలు.. పటాన్చెరు టౌన్: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
16 నకిలీ ఖాతాలు.. 1.80 కోట్లు స్వాహా
మేనేజర్ నిర్వాకం.. పరారీ ● పని చేస్తున్న బ్యాంకుకే కన్నం ● అతడి భార్యతోపాటు స్నేహితుడి అరెస్ట్మెదక్ కలెక్టరేట్: నకిలీ ఖాతాలతో బ్యాంకులో రూ.1.80కోట్లు స్వాహా చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. మంగళవారం మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన యాదం అనిల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అనిల్ బెట్టింగ్ మోజులో నిండా మునిగాడు. దీంతో బెట్టింగ్ల కోసం భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యంతోపాటు మొత్తం 16 నకిలీ ఖాతాలు తెరిచారు. వారి ఖాతాల ద్వారా వారి ఆధార్, పాన్కార్డులపై బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి రూ.1.80 కోట్లు మేర లోన్లు తీసుకున్నాడు. గతంలో రెండు ఏటీఎంల నుంచి డిపాజిట్ చేసే సమయంలోనూ కొంత నగదును పక్కన పెట్టి, రూ.31.35 లక్షలను వాడుకున్నాడు. ఇతనికి బ్యాంకులో బంగారాన్ని పరిశీలించే వ్యక్తి శ్రీనివాసచారి సహకరించిన ట్లు గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. అనిల్ గతంలో ఏపీ వైలెపాడు పీఎస్ పరిధిలో గ్రామీణ వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాసితులను మోసం చేసి రూ. 11లక్షల 82,487 వాడుకొని జైలు పాలయ్యాడు. ప్రస్తుతం మేనేజర్ అనిల్ పరారీలో ఉన్నాడు. అతని భార్య స్రవంతి, శ్రీనివాసచారి, సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. బయటికొచ్చింది ఇలా.. అనిల్ భార్య స్రవంతి ఖాతా సైబర్ క్రైమ్ అధికారుల పరిశీలనలోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారు బ్యాంకులోని ఖాతాలు, గోల్డ్లోన్లను పరిశీలించగా చాలా వరకు నకిలీ బంగారం ఉన్నట్లు తేలింది. -
చకచకా హౌస్ లిస్టింగ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో జనగణన– హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చకచకా సాగుతోంది. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాకు (హెచ్ఎల్బీ)ల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. సరిహద్దులను గూగుల్ మ్యాప్తో అనుసంధానించారు. కొన్ని చోట్ల ఈ బ్లాకుల సరిహద్దుల విషయంలో ఎన్యుమరేటర్లు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ సమస్య తలెత్తిన చోట్ల ఆయా మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా సరిహద్దులను గుర్తించారు. మండుతున్న ఎండలతో ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరగడంలో అవస్థలు పడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికి తిరిగి సెన్సెస్ నంబర్లు (సీఎన్) వేస్తున్నారు. ఈ ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. ఈ నంబర్లు అన్నీ వేశాక బ్లాకుల మ్యాపులను తయారు చేస్తారు. తర్వాత ఎన్యుమరేటర్లు మరోసారి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో ఉంటున్న వారు.. జిల్లాలో చాలా మంది గ్రామాల నుంచి సమీప పట్టణాలకు వచ్చి నివాసం ఉంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు పట్టణాల్లో ఉంటున్న వీరిలో కొందరు పట్టణాల్లో తమ వివరాలను నమోదు చేసుకుంటుంటే.. మరికొందరు గ్రామాల్లో నమోదు చేసుకుంటామని చెబుతున్నారని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో 2,480 బ్లాకులు హౌస్ లిస్టింగ్ కోసం జిల్లాను మొత్తం 2,562 బ్లాకులుగా విభజించారు. ఇందులో 11 మున్సిపాలిటీల పరిధిలో 798 బ్లాకులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,764 బ్లాకు ఉన్నాయి. మొత్తం 2,428 మంది ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందులో పది శాతం మందిని రిజర్వుగా ఉంచారు. ఉపాధ్యాయులనే ఎక్కువగా ఎన్యుమరేటర్లుగా నియమించారు. ఈ జనగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, ఈ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పలుమార్లు శిక్షణ ఇచ్చింది. మాస్టర్ ట్రైనర్లు శ్రీకాంత్గౌడ్, అమరేందర్రెడ్డిలు ఎన్యుమరేటర్లకు వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. ఈ జనగణనపై జిల్లా వాసుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నుంచి ఐబీ చౌరస్తా వరకు మారథాన్ వాక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనగణనకు జిల్లా వాసులు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు.12 వేల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ హౌస్ లిస్టింగ్ ఎన్యుమరేషన్ను సొంతంగా సెల్ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో 12,212 మంది పౌరులు తమ నివాసాలకు సంబంధించిన ఎన్యుమరేషన్ను సొంతంగా చేసుకున్నారు. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో లాగిన్ అయి తమ వివరాలను సక్సెస్ ఫుల్గా నమోదు చేసుకున్నారు. మరో 1,742 మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసం వివరాలను నమోదు చేసుకున్నప్పటికీ.. ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయలేకపోయారు.నేటితో నమోదు ప్రక్రియ పూర్తి సరిహద్దుల గుర్తింపులో కొంత ఇబ్బందులు మున్సిపల్ వార్డు ఆఫీసర్ల ద్వారా సమస్యకు పరిష్కారం సొంతూర్లో నమోదుచేసుకుంటామంటున్న కొందరు పట్టణవాసులు -
భూసేకరణ గెజిట్ నుంచి నల్లవల్లిని తొలగించాలి
కలెక్టర్కు ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇండస్ట్రీయల్ పార్క్ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ నుంచి గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామాన్ని తక్షణం తొలగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో నిరుపేద రైతులకు అన్యాయం చేయవద్దని అన్నారు. ఈ మేరకు నల్లవల్లి గ్రామ రైతులతో కలిసి మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ను వినతిపత్రం అందజేశారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమలకు కేటాయించడం వల్ల తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు సర్వే నంబర్లను భూసేకరణ గెజిట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
బండి కుమారుడిని తక్షణమే అరెస్టు చేయాలి
జహీరాబాద్: పోక్పో కేసులో నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం డిమాండ్ చేశారు. మంగళవారం వేర్వేరుగా వారు విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిట్ విచారణ పేరిట నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా.. పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించక పోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటని ప్రశ్నించారు. తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుపై బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు నారాయణ, వెంకటేశం, రవీందర్, నర్సింహలు, సర్పంచ్ మచ్చేందర్, కౌన్సిలర్ గౌస్ గౌరి, నాయకులు ప్రవీణ్, రాజ్కుమార్, జగదీష్, రాజుపటేల్, ఆశంఅలీ పాల్గొన్నారు.మంత్రి పదవి నుంచి తొలగించాలిప్రజా సంఘాల డిమాండ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ వాణి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ మంజుల మాట్లాడుతూ.. బాధితురాలు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే.. బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్, జిల్లా కార్యదర్శి సతీష్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, డీవైఎఫ్ఐ నాయకులు దత్తు, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాణిక్రావు డిమాండ్ -
ర్యాంకర్లకు సీఎం ప్రశంస
మునిపల్లి(అందోల్): ఐఐటీజీలో ఉత్తమ ర్యాంకర్లు అయిన అలోక్ కుమార్జా, ఆదిత్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించినట్లు లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య తెలిపారు. వారిద్దరికి ల్యాప్టాప్లు కూడా అందజేసినట్లు చెప్పారు. ఐఐటీజీ మెన్స్లో అలోక్ కుమార్జా 4వ ర్యాంక్ (89.88), పి.ఆదిత్య 10వ ర్యాంక్ (85.50) వచ్చినట్లు పేర్కొన్నారు. తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయండిఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు టౌన్: రాజమహేంద్రవరంలో జూన్ 6, 7 తేదీలలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను కవులతో కలసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలుగు భాషాభివృద్ధి, భాషోద్ధరణకు సాహిత్య సభలు కీలక వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు, స్థానిక కవులు పాల్గొన్నారు. పిల్లల పట్ల శ్రద్ధ వహించాలిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని బాలసదన్, భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణను తోడ్పడాలన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. -
తమ్మీ.. ఒక ఆటేద్దాం రా..!
● పల్లెల్లో జోరుగా పత్తలాట ● వ్యసనంగా మారిన జూదం ● కట్టడి చేయాలని స్థానికుల డిమాండ్ జహీరాబాద్ టౌన్: పల్లెల్లో పత్తలాట జోరుగా సాగుతోంది. సరదాగా ఆడుకునే పేకాట కొందరికి వ్యసనంలా మారుతోంది. సులభంగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గ్రామీణ శివారు ప్రాంతాలనూ లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. జహీరాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లో కొంత మంది పేకాట జూదం ఎక్కువగా ఆడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పంట పొలాలు, చెట్ల పొదలు, తోటలు వేదికగా మార్చుకుంటున్నారు. ఆడేవారికి తప్ప ఇతరులకు ఏ మాత్రం సమాచారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బృందాలుగా ఏర్పడి నిర్ణయించుకున్న స్థలానికి చేరుకుంటారు. మద్యం, మాంసం అక్కడికే తెప్పించుకుని పొలాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. పోలీసుల దాడుల్లో జూదరులు పట్టుబడుతున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. శివారు ప్రాంతాల్లో.. వేసవిలో పొలం పనులు తక్కువగా ఉండటంతో ఖాళీ సమయం దొరుకుతోంది. యాసంగి పంటలు అమ్ముడుపోయే సరికి చేతిలో కూడా డబ్బు ఉంటుంది. దీంతో ఒక ఆటేద్దామని జూదం ఆడుతున్నారు. సామాన్య ప్రజలే కాకుండా వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు కూడా మొగ్గు చూపుతున్నారు. అప్పుపడప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. జూదరులతో పాటు నగదు, పేకాట ముక్కలు, మోటారు బైక్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ జూదానికి అలవాటు పడినవారు ఏ మాత్రం భయపడటం లేదు. పోలీసులకు పట్టుబడినా పెద్దగా శిక్ష లేకపోవడంతో జరిమాన కట్టి బయటకు వస్తున్నారు. జహీరాబాద్, న్యాల్కల్ తదితర గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడి చేసి 15 మందిపై కేసులు నమోదు చేసి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గట్టి నిఘా పెట్టి పేకాటకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బిహారీ కూలీలే దిక్కు
● వారి రాకతో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు ● ఒక్క హత్నూర మండలంలోనే 600 మంది కూలీలు హత్నూర(సంగారెడ్డి): ప్రతి పనికి బిహారీ కూలీలే దిక్కవుతున్నారు. వారు లేకుంటే ఏ పనీ ముందుకు సాగడం లేదు. కొంతకాలంగా బిహారీ కూలీలు లేక ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగిన విషయం తెలిసిందే. హత్నూర మండలంలో 20 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16 సొసైటీ కేంద్రాలను ప్రారంభించారు. వీటిని తూకం వేసేందుకు 600 మందికి పైగా హమాలీల అవసరం ఉంది. కానీ స్థానికంగా కూలీల కొరత వల్ల కొనుగోళ్లు ముందుకు రాకపోవడంతో బిహారీ కూలీలే పెద్ద దిక్కు అయ్యారు. హత్నూర మండలంలో బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన హమాలీ కూలీలు రావడంతో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. క్వింటాలుకు రూ.48 హమాలీ చెల్లిస్తున్నప్పటికీ వీటిలో గుత్తేదారు సగం తీసుకుంటున్నారని తెలిసింది. కూలీలకు మాత్రం సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, నెల రోజులకుపైగా హమాలీ కూలీలుగా పనిచేసి రూ.30 నుంచి 40 వేల వరకు డబ్బులు సంపాదించుకుంటామని కూలీలు పేర్కొన్నారు. -
పాలిసెట్కు పకడ్బందీ ఏర్పాట్లు
సంగారెడ్డి జోన్: పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడేళ్ల పాటు పలు రకాల కోర్సులు కొనసాగుతాయి. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పరీక్ష కొరకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డితో పాటు జోగిపేటలోని పలు కళాశాలలను కేంద్రాలుగా గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 2,068 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అయితే.. నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వరు. పరీక్ష కేంద్రాల వివరాలు సంగారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళా), సెయింట్ ఆంథోనీ హైస్కూల్, విద్యానగర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల (మహిళ), ఎస్.వి. జూనియర్ కాలేజీ, రాజంపేట రోడ్డు, ప్రభుత్వ హై స్కూల్ ఫర్ బాయ్స్, అప్పర్ బజార్, ఓల్డ్ బస్టాండ్,, జోగిపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక అబ్జర్వర్తో పాటు స్పెషల్ అబ్జర్వర్లు ముగ్గురిని నియమించారు. నేటి ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు హాజరు కానున్న 2068 మంది విద్యార్థులునిర్ణీత సమయంలో చేరుకోవాలి పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకోవాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఉండదు. విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. పరీక్ష నిర్వహణ కొరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. – పి.జానకి దేవి, జిల్లా కోఆర్డినేటర్, సంగారెడ్డి -
జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సంగారెడ్డి జోన్: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మారథాన్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 10వ తేదీ వరకు స్వీయ గణన నిర్వహించగా, 11వ తేదీ నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. దీంతో ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మారథాన్ వాక్లో పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు పాండు, సంగీత, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు కలెక్టర్ ప్రతీక్ జైన్ -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎస్డీపీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, మార్క్ఫెడ్, మార్కెటింగ్, డీఆర్డీవో తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. వెంటనే మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ఆలస్యం చేస్తున్న విషయంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అవసరమైన చోట టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఎంపీడీవోలు పాఠశాలలను సందర్శించినప్పుడు టాయిలెట్స్, తాగునీరు, ఇతర కనీస వసతుల పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశం అన్లోడింగ్ ఆలస్యంపై ఆగ్రహం -
రామ్రాజ్ కాటన్ షోరూం ప్రారంభం
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్నగర్లో రామ్రాజ్ షోరూంను మాజీ సర్పంచ్ ఎం.సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్కు సంసంసంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన రామ్రాజ్ కాటన్ షోరూం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రామ్రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కే.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ తమ షోరూంను మొదట 1983లో తిరువూరులో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 370 షోరూంలు ఉన్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల వస్త్రాలు తమ వద్ద లభిస్తాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఇన్స్టా ధోతిలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన షోరూం యాజమానులు భాస్కర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ప్రభాకర్, మహేందర్, శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రెడ్డి మల్లారెడ్డి, రెడ్డి రఘుపతి రెడ్డి, బాలాజీ, లచ్చిరాం నాయక్, దేవేందర్ యాదవ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్పోర్టు.. ట్రబుల్స్
కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్య ఉందని మాదృష్టికి వచ్చింది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైంది. కేంద్రాలకు అవసరమైన లారీలను పంపుతున్నాము. క్షేత్రస్థాయి అధికారులు ఫాలోఅప్ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. –రాజేశ్వర్, పౌరసరఫరాల సంస్థ డీఎం.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారుల తప్పిదాలు అన్నదాతలను అవస్థల పాలు చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించే రవాణా కాంట్రాక్టును అధికారులు కొన్నేళ్లుగా ఒక్కరిద్దరికే కట్టబెడుతున్నారు. ఈ కాంట్రాక్టర్లు కేంద్రాలకు అవసరం మేరకు లారీలు పంపకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు నిలిచిపోతున్నాయి. దీంతో ఎండల్లో సైతం రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించే కాంట్రాక్టును పౌరసరఫరాల సంస్థ అధికారులు తొమ్మిదేళ్లుగా ఒకరిద్దరు గుత్తేదార్లకు కట్టబెడుతున్నారు. 2017 నుంచి వీరే ఈ శాఖలో రాజ్యమేలుతుండటం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఒకరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా, మరొకరు రాజకీయ పలుకుబడి ఉన్న గుత్తేదారు కావడంతో ఏటా వీరి బినామీ పేర్లతో ఉన్న సంస్థలకే ఈ కాంట్రాక్టు దక్కుతోంది. అయినప్పటికీ కనీసం రైతుల అవసరాల మేరకు లారీలను సరఫరా చేయడంలోనూ ఈ గుత్తేదార్లు విఫలమవుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పది రోజులైనా లారీలు రాకపోవడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోల్కు చెందిన లక్ష్మణ్ అనే రైతు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 220కి పైగా కొనుగోలు కేంద్రాలను అధికారులు మూడు క్లస్టర్లుగా విభజించారు. సంగారెడ్డి, ఆందోల్, ఖేడ్ క్లస్టర్లలో ఉన్న కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించే కాంట్రాక్టు కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో పౌరసఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. వరుసగా ఎనిమిదేళ్లుగా ఈ శాఖలో పాతుకుపోయిన ఇద్దరు కాంట్రాక్టర్లకే ఈ సీజను ట్రాన్స్పోర్టు కాంట్రాక్టులను కూడా దక్కించుకున్నారు. మూడింటిలో రెండు క్లస్టర్లు ఒక కాంట్రాక్టరుకు, మరో క్లసర్ మరో కాంట్రాక్టరుకు అధికారులు కట్టబెట్టారు. పౌరసరఫరాల సంస్థ నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్టు దక్కాలంటే సదరు కాంట్రాక్టరుకు 40 లారీలు ఉండాలి. ఇందులో 20 సొంతవి, మరో 20 లీజు లారీలు ఉండేందుకు అనుమతి ఉంటుంది. సొంతంగా 20 లారీలతోపాటు మరో 20 లారీలు లీజుకు తీసుకున్నామని రికార్డుల్లో చూపుతున్న కాంట్రాక్టర్లు తమ సొంత 20 లారీలనే సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లీజు లారీలను తిప్పితే లాభాలు తగ్గుతాయనే కారణంగా సొంత లారీలతోనే సీజనంతా సరిపెడుతుండటంతో కేంద్రాల వద్ద అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఈ కాంట్రాక్టర్ల విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో పౌరసఫరాల సంస్థ అధికారులు విఫలమవుతుండటం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్పోర్టు కాంట్రాక్టరుకు ధాన్యం రవాణా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ భారీ మొత్తంలోనే చార్జీలు చెలిస్తోంది. 8 కి.మీల లోపు ఉంటే టన్నుకు రూ.417ల చొప్పున చెల్లిస్తారు. 8 కి.మీ.ల నుంచి 20 కి.మీ.ల వరకు అదనంగా రూ.3, 80 కి.మీ.ల వరకు టన్నుకు సుమారు రూ.450 వరకు చెల్లిస్తారు. ఇలా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా జరుగుతుంది. రూ.కోట్లలో రవాణా చార్జీలు పొందుతున్న కాంట్రాక్టర్లు అరకొరగా లారీలు పంపుతుండటం గమనార్హం. ఉదాహరణకు గతేడాది సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే సుమారు రూ.6.50 కోట్ల రవాణా చార్జీలు కట్టబెట్టారు. ఈ బిల్లుల చెల్లింపుల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారతాయనే ఆరోపణలున్నాయి.లారీల సమస్య పరిష్కారమైంది -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
4 క్వింటాల గంజాయి స్వాధీనం ● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ● వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీ పటాన్చెరు టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్న టీమ్ కూకట్పల్లి జోన్, పటాన్న్చెరు పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీసీఎంలో 400 కిలోల గంజాయిని లోడ్ చేసి, పైభాగంలో ఖాళీ కూరగాయల ప్లాస్టిక్ ట్రేలను ఉంచి రహస్యంగా తరలిస్తున్నారు. అలాగే డీసీఎంకు ఎర్టిగా కారు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారు మహారాష్ట్రకు చెందిన బాలాజీ గణేశ్ హోన్మాని, రోహిత్ హోవాల్, ఆనంద్ మాయప్ప, ప్రతాప్ హరిదాస్ పవార్, చంద్రశివ్ ఆడుంబర్, చంద్రశివ్ సహిల్,రంజిత్ రాజేందర్ అలియాస్ గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా మహారాష్ట్రకు చెందిన మనీషా పద్వాల్, ఒడిశాకు చెందిన ట్రిబ్యూన్ గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2 కోట్లు 15 లక్షల 60 వేలు ఉంటుందని తెలిపారు. డీసీఎం, ఎర్టిగా కారు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్ఓటి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు, పోలీసు బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు. -
జంటగా ప్రత్యక్షం
యువతీ, యువకుల అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ కేసుల్లో ఎక్కువ భాగం ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిపోయిన యువతీ, యువకులు కొద్ది రోజుల తర్వాత ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని జంటలుగా పోలీస్స్టేషన్లలో ప్రత్యక్షమవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. – పటాన్చెరు టౌన్ఒంటరిగా అదృశ్యం.. తమ పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా, మరోవైపు ప్రేమ వివాహం చేసుకున్న జంటలు తమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరుతున్నారు. దీంతో ఇప్పటికే వివిధ కేసులతో బిజీగా ఉండే పోలీసులకు మిస్సింగ్ కేసులు అదనపు భారంగా మారాయి. ఇలాంటి కేసుల్లో పోలీసులు ముందుగా యువ జంటలను స్టేషన్న్కు పిలిపించి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం ఇరువర్గాల కుటుంబ సభ్యులను రప్పించి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 5 నెలలు.. 77 కేసులు ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మొత్తం 77 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 65 కేసులు పోలీసులు ఛేదించగా, మరో 12 కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వేసవిలోనే ఎక్కువ కేసులు వేసవి సెలవుల సమయంలోనే ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ మధ్య యువతీయువకులు ప్రేమ పేరుతో ఇళ్లను విడిచి వెళ్లిపోతున్నట్లు పేర్కొంటున్నారు. చాలామంది కుటుంబ సభ్యులకు తెలియకుండా వెళ్లి వివాహాలు చేసుకుంటున్నారని వెల్లడించారు.పలు స్టేషన్ల వారీగా పరిశీలిస్తే.. -
భళా.. బాలచిత్రకారులు
దుబ్బాక: బాల చిత్రకారులకు కేరాఫ్ అడ్రస్గా దుబ్బాక పట్టణంలోని మల్లిక్ ఆర్ట్స్ నిలుస్తోంది. పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కాముని మల్లికార్జున్ పిల్లల్లో చిత్రలేఖనంపై ఆసక్తి కనబర్చేందుకు నాలుగేళ్లుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాడు. ప్రతిఏటా వేసవిలో ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ 50 మందికి పైగా పిల్లలను చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్నాడు. రామక్కపేట, దుంపలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డ్రాయింగ్లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఇతని శిక్షణలో రాటుదేలిన ఎంతో మంది చిన్నారులు పలు జాతీయ, రాష్ట్రస్థాయి ఆర్ట్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి చాలా అవార్డులు అందుకోవడం విశేషం. ముఖ్యంగా భగత్సింగ్, గాంధీజీ, స్వామి వివేకానంద, వాజ్పేయ్, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు ప్రముఖుల చిత్రాలు, దేవతలతో పాటు దేశభక్తి పెంపొందించే చిత్రాలు, పక్షులు, ప్రకృతి ప్రతిబింబించే చిత్రాలను వేయడంపై చిన్నారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటాడు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్కు తీసుకెళ్తూ అందులో వీరు వేసిన చిత్రాలను సైతం ప్రదర్శింపజేస్తుండటం విశేషం.ఈ వేసవిలో సైతం చిన్నారులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. -
బండి భగీరథ్పై చర్యలేవి?
టీటీపీసీ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి జోగిపేట(అందోల్): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సోకేసు నమోదై మూడురోజులవుతున్నా పోలీసులు చర్యలెందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులో మాట్లాడారు. సామాన్యుడిపై చిన్న కేసు నమోదైతే గంటల్లో అరెస్టు చేసే పోలీసులు బండి సంజయ్ కుమారుడి కేసువిషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. బండి సంజయ్ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం రేవంత్రెడ్డితో జరిపిన చీకటి ఒప్పందాలను త్వరలోనే ప్రజల ముందు బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్ స్వయంగా భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే ఎఫ్ఐఆర్లో మంత్రి పేరును కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలిసీపీఎం నేత చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించడంతోపాటు జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ..రైతులు అమ్ముకున్న పంటకు ఎదురు చూడకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ద్వారా వర్షాలు పడి రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యాన్ని రైతులకు అందజేయాలన్నారు. కొనుగోళ్లు కేంద్రాలకు వెంటనే సరిప డా సంచులు వెంటనే సరఫరా చేయాలని, హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యద ర్శి జయరాజు, సీపీఎం నాయకులు మల్లేశం, మాణిక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వేసవి శిబిరాలుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ శ్రామీక విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి పిల్లల శిబిరాలు సోమవారంతో ముగిశాయి. ఏప్రిల్ 24న ప్రారంభమై మే 11 వరకు కొనసాగాయి. జహీరాబాద్ నియోజవకర్గంలోని జహీరాబాద్టౌన్, రాయికోడ్, ఝరాసంగం, మొగుడంపల్లి,కోహీర్ మండలాల్లోని 22 గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 600 మంది చిన్నారులు పలు నైపుణ్యాలు నేర్చుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లలో చాటింగ్, వీడియోగేమ్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు బానిసలవకుండా ఉండేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, గణిత నైపుణ్యం, చిత్రకళ, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, మట్టితో బొమ్మల తయారీ, పజిల్స్ పరిష్కారం, పేపర్ ఆర్ట్,ఇంగ్లిష్ బేసిక్స్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు, దేశభక్తి, జానపద గీతాలు వంటి పాటలు నేర్పించారు. ముగింపు సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్ విజయలక్ష్మి చిన్నారులను అభినందించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా శశికళ రామచంద్రాపురం(పటాన్చెరు): తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా శశికళ యాదవ రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులుకంది(సంగారెడ్డి): గ్రామాలన్నింటిలో ఉపాధి హామీ పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి ఆదేశించారు. కంది మండల పరిధిలోని కలివేముల, కాశీపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను సోమవారం ఆయన తనిఖీ చేశారు. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ ప్రతీక్ జైన్సంగారెడ్డి జోన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతీ ఫిర్యాదును స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ తెరిచి ఉండటం ప్రమాదకరమని, ప్రమాదాలు జరగకముందే వాటిని పరిశీలించి వెంటనే మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్ అండ్ బీ రోడ్ల డివైడర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 108 ఫిర్యాదులు వచ్చాయని, అందులో కలెక్టరేట్లో 23, సంగారెడ్డి డివిజన్కు 27, ఆందోల్ 03, ఖేడ్ 27, జహీరాబాద్ డివిజన్కు 29 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జనగణనలో భాగస్వాములవ్వాలి జనగణన–2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం ఉదయం 7:30 గంటలకు కలెక్టరేట్ ఐబీ వరకు మారథాన్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ ఒక్కరు మారథాన్రన్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ నెల 13 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 13,862 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, అందులో మొదటి ఏడాది పరీక్షలకు 9,591 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,271మంది హాజరవుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరామ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
ప్రతిభకు పురస్కారంఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆకుల వర్షిత 594 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆకుల వర్షితకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. –కొండాపూర్(సంగారెడ్డి) -
మౌలిక సదుపాయాలు ముఖ్యమే
తెల్లాపూర్ ప్రాంత పరిసరాలు వేగంగా అభివృద్ధి చెందడం అందరికీ సంతోషమే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం 50ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. – రమణ, తేనా అధ్యక్షుడు యువతకు ఉపాధి తెల్లాపూర్ పరిసరా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో యువతకు ఉపాధి లభిస్తుంది. నిర్మాణ పనులు జోరుగా ఉండటంతో ఎంతో మే లు జరుగుతుంది. తము ఇంటీరియర్ వర్క్స్లో ఉపాధి పొందడంతో పాటు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. – భార్గవ్, ఎల్ఎస్ అసోసియేట్స్ యాజమాని, పటాన్చెరు -
లారీ ఢీకొని రైతు..
రామాయంపేట(మెదక్): రామాయంపేట తండా శివారులో సోమవారం సాయంత్రం బోరుబండి లారీ ఢీకొని రైతు మృతి చెందాడు. వివరాలు ఇలా... మండలంలోని ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు నడిపోల్ల కుర్మ రాములు(45) మోపెడ్పై రామాయంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బోరు బండి లారీ ఢీకొట్టింది. రోడ్డుపైనే ధాన్యం కుప్పలుండటంతో రాములు పక్కకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, టైర్లకింద నలిగిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఎస్ఐ బాల్రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశాడు. -
ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం
● మహిళా కూలీ మృతి చేర్యాల(సిద్దిపేట): తాలు పట్టే యంత్రంలో తల వెంట్రుకలు చిక్కుకొని మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ని కాశగుడిశెలు గ్రామానికి చెందిన షేక్ ఇమాంబీ(55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు పట్టే పనికి వెళ్లింది. ట్రాక్టర్కు అనుసంధానంగా ఉన్న మిషన్ సహాయంతో ధాన్యంలో తాలును శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె తల వెంట్రుకలు యంత్రంలో చిక్కుకొని మిషన్కు తగలడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే మిషన్ ఆప్చేసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ అపూర్వరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలికి భర్త, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గతంలో కుమారుడు కిడ్నీలు చెడిపోయి మృతిచెందగా నేడు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏసీబీకి చిక్కిన కార్యదర్శి, సర్పంచ్ భర్త ● రూ.10వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ● అరెస్టు చేసిన అధికారులు కొమురవెల్లి(సిద్దిపేట): ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజుగౌడ్, సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులు ఏసీబీకి చిక్కారు. సోమవారం ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదు దారుడి ప్లాట్లో గతంలో గ్రామ పంచాయతీ అధికారులు డ్రైనేజీ పైపులైన్ వేశారు. ఆ పైపులైన్ను తొలగించాలని బాధితుడు పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజుగౌడ్ను ఆశ్రయించాడు. దీంతో రూ.25 వేలు లంచం ఇస్తేనే పైపులైన్ను తొలగిస్తామని చెప్పాడు. దీంతో బాధితుడు మొదటగా రూ.10 వేలు పంచాయతీ కార్యదర్శి రాజుకు ఇచ్చాడు. మిగతా డబ్బులు చెల్లిస్తేనే పని అవుతుందనడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఈనెల 4న ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం పక్కా ప్రణాళికతో పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ పద్మ భర్త ఆంజనేయులు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిలో ఏ1గా పంచాయతీ కార్యదర్శి రాజు, ఏ2 గా గొల్లపల్లి ఆంజనేయులుపై కేసు నమోదు చేసి, హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం ● రైస్మిల్లుపై కేసు నమోదు దుబ్బాకటౌన్: రైస్మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ బృందాలు సాయి వీరభద్ర రైస్మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 200 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. ఈ ఘటనపై రాయపోల్ పోలీస్ స్టేషన్లో నిత్యావసర వస్తువుల చట్టం –1955 కింద 6 (ఏ) కేసు నమోదు చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ పాండరి, ఎస్సై వెంకటేశ్వర్లు, రాయపోల్ ఎస్ఐ మానస, పౌరసరఫరాల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోండి
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● పుల్కుర్తి కేజీబీవీ తరగతి నిర్మాణానికి శంకుస్థాపన ● గురుకులంలో మరమ్మతులకు శ్రీకారం నారాయణఖేడ్: మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని వృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని మనూరు మండలం పుల్కుర్తి కేజీబీవీ పాఠశాలలో రూ.44 లక్షలతో అదనపు తరగతి గది నిర్మాణానికి, ఖేడ్ మండలం జూకల్ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులను సోమవారం ఆరంభించారు. మనూరు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బోధనకు అవసరమైన ఎల్ఈడీ టీవీలను ప్రారంభించారు. నిజాంపేట్ మండలం జంబికుంట గ్రామంలో, మనూరు మండలం ఎల్గొయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిధుల సమస్య లేకుండా విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడమే వేసవి శిబిరాల లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖేడ్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సమ్మర్ క్యాంపులను ఆయన ప్రారంభించారు. పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ ప్రతిభ, ఆయా విద్యాసంస్థల ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
మృతురాలు సంగారెడ్డి జిల్లా వాసివర్గల్(గజ్వేల్): రోడ్డు దాటుతున్న డిగ్రీ విద్యార్థినిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన సోమవారం మండలంలోని గౌరారం రాజీవ్రహదారిపై చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం, కుటుంబీకుల వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన జంబిగి విఠల్, పుణ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భార్గవి(21) పెద్దపల్లి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పరీక్షలు పూర్తికావడంతో సొంత గ్రామమైన ఇందూరులో తల్లిదండ్రుల చెంతనే ఉంటుంది. ఆదివారం వర్గల్ గురుకులంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు భార్గవి వచ్చింది. సోమవారం ఇంటికి వెళ్లడానికి భార్గవి బస్సు కోసం రాజీవ్ రహదారి దాటుతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆర్వీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కూతురును తలచుకుంటూ తండ్రి విఠల్ బోరుమన్నాడు. రెండు బైకులు ఢీకొని వ్యక్తి..దుబ్బాకటౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం... మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఈద లాలయ్య బైక్పై దౌల్తాబాద్కు పనికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోనాయిపల్లి గ్రామ శివారులో రామయంపేట నుంచి బైక్పై దౌల్తాబాద్కు వస్తున్న వ్యక్తి ఎదురుగా అతివేగంగా వచ్చి అతడ్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లాలయ్యకు తలకు, కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన లాలయ్యను ప్రైవేట్ వాహనంలో గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
లాంగ్ జంప్లో సాత్వికకు సిల్వర్
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన కట్టెగుమ్ముల సాత్విక లాంగ్ జంప్లో ప్రతిభ కనబరిచింది. హనుమకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 2 స్థానం సాధించి సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడంతో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అల్లి శేఖర్ రెడ్డి, గ్రామస్తులు, క్రీడాకారులు ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్మికులపై తేనెటీగల దాడి హత్నూర(సంగారెడ్డి): పారిశుద్ధ్య కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో సోమవారం చోటుచేసుకుంది. కార్మికులు వాటర్ ట్యాంకు వద్ద పైపులైన్ లీకేజీ మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు కార్మికులపై దాడి చేశాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కార్మికులను సర్పంచ్ ఎల్లయ్యతో పాటు స్థానిక నాయకులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి మజార్ను సాక్షి ఫోన్ ద్వారా సంప్రదించగా.. తమకు సమాచారం అందలేదని, చికిత్స అనంతరం విషయం తెలిసిందని సమాధానం ఇచ్చారు. చిరుతపులి దాడిలో దూడ మృతి కల్హేర్(నారాయణఖేడ్): చిరుతపులి దాడి లో దూడ మృతి చెందింది. ఆదివారం రాత్రి మండలంలోని బీబీపేట్ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జుమ్మ బీర్గోండ పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూడగా దూడ మరణించి ఉంది. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రాములు, బీట్ ఆఫీసర్ కృష్ణగౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడే పంచనామ నిర్వహించారు. కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రేపటి నుంచి సంగారెడ్డిలో వ్య.కా.స. మహాసభలు
జహీరాబాద్ టౌన్: సంగారెడ్డిలో ఈ నెల 12 నుంచి మూడురోజులపాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జరగనున్నాయని వీటిని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్లోని శ్రామీక్ భవనంలో ఆదివారం మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ సమావేశాల్లో వ్యవసాయ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషినారాయణఖేడ్: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. ఖేడ్ మండలం అబ్బెంద చౌరస్తా వద్ద ఎంపీ సురేశ్ షెట్కార్ కోటా నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. నాగల్గిద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్రావు, నాయకులు కొండల్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్లో ఎడ్యుకేషన్ వీక్ప్రిన్సిపాల్ ప్రవీణ వెల్లడి పటాన్చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ‘ఎడ్యుకేషన్ వీక్’ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిగ్రీ ప్రవేశాల పెంపు, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయడం, కళాశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమా లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బస్సులు లేక జనం తిప్పలునారాయణఖేడ్: అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ఆర్టీసీలో చాలావరకు బస్సులను హైదరాబాద్లో జరిగిన ప్రధాని మోదీ సభకు తరలించడంతో బస్సులకోసం ప్రయాణికులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన హైదరాబాద్ రూట్లో నిత్యం అరగంటకు ఒక బస్సు చొప్పున 33 సర్వీసులు నడుస్తుంటాయి. సాధారణంగా ఖేడ్ నుంచి హైదరాబాద్ రూట్లో వెళ్లే ప్రయాణికులు అత్యధికంగా ఉంటారు. డిపో నుంచి 35 సర్వీసులను ప్రధాని మోదీ సభకు తరలించారు. దీంతో 9 బస్సు సర్వీసులు మాత్రమే హైదరాబాద్ రూట్లో నడిపారు. దీంతో బస్టాండ్ జనాలతో కిక్కిరిసి పోయింది. -
చోరీ కేసులో నిందితుడి రిమాండ్
ములుగు(గజ్వేల్): ఆభరణాల చోరీ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆదివారం గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, ములుగు ఎస్ఐ రఘుపతితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న మధ్యాహ్నం వంటిమామిడి చెక్పోస్టు వద్ద ఎస్ఐ రఘుపతి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో చిన్నతిమ్మాపూర్ గ్రామ పరిసరాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడి పేరు పుత్రకొండ బాలకృష్ణ (25) అని, ఏపీ, శ్రీకాకుళం జిల్లా నులకలజోడు గుర్రండి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించాడు. ప్రస్తుతం అతను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం మజీద్పూర్లో నివాసముంటున్నాడు. అయితే శామీర్పేటలోని పెద్దమ్మ కాలనీకి చెందిన మడిగెల బాల్చందర్(25), జవహర్నగర్కు చెందిన ఇప్పలపల్లి నరేశ్(24)తో కలిసి బాలకృష్ణ బైక్పై ఈ నెల 4న చిన్నతిమ్మాపూర్ గ్రామానికి వచ్చారు. నర్సింహులు ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లి నిందితులు ఓ చోట దాచిపెట్టారు. బాలకృష్ణ మళ్లీ చోరీ చేయాలన్న ఆలోచనతో తాళం వేసిన ఇళ్లను గమనిస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఇతనిపై శామీర్పేట, జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకుంటామని తెలిపారు.వివరాలు వెల్లడించిన సీఐ రవిరాజు -
అనుమానాస్పదంగా మహిళ..
హుస్నాబాద్: మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన హుస్నాబాద్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఎల్లంబజార్కు చెందిన దొంతరబోయిన ఎల్లవ్వ (62)కు ముగ్గురు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో ముగ్గురు కుమారుల వద్ద 15 రోజుల చొప్పున ఉంటోంది. శనివారం పెద్ద కుమారుడు వెంకటేశ్ ఇంట్లో ఉన్న సమయంలో బాత్రూమ్లో కిందపడి మృతి చెందింది. కాగా తల వెనుక భాగంలో, కుడి చెవిపై రక్తం గాయాలు ఉన్నాయి. ఎల్లవ్వ మృతిపై అనుమానం ఉందని ఆమె చిన్న కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. -
రెండు బైకులు, ఆటో ఢీ..
నర్సాపూర్ రూరల్: రెండు బైకులు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిలోని ఆనంద్ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిన్న కంజర్ల గ్రామానికి చెందిన యటకాని నర్సింగరావు (29) ఇటీవల తనకు కూతురు పుట్టడంతో అత్తగారి గ్రామమైన నర్సాపూర్ మండలం లింగాపూర్కు బైక్పై నర్సాపూర్ వైపు వస్తున్నాడు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన కోడిగుడ్ల దిలీప్(18) అతని స్నేహితుడు మనోహర్తో కలిసి బైక్పై సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్లోని బంధువుల పెళ్లికి సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అలాగే నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోను సైతం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యటకాని నర్సింగరావు, కోడిగుడ్ల దిలీప్ అక్కడికక్కడే మృతి చెందారు. దిలీప్ బైకుపై వెనకాల కూర్చున్న మనోహర్కు, ప్యాసింజర్ ఆటోలో ప్రయాణిస్తున్న అశోక్, కవిత, రమేశ్, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. వీరిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దిలీప్ అతివేగంగా, అజాగ్రత్తగా బైక్ నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బైకును లారీ ఢీకొట్టడంతో ఒకరు.. మిరుదొడ్డి(దుబ్బాక): బైకును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారి 765డీజీ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా... దుబ్బాక మండలం నర్లెంగి గడ్డకు చెందిన యమ్మ పోచయ్య (70), తన మనవడు మనోజ్తో కలిసి దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన శుభకార్యానికి బైకుపై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ధర్మారం జాతీయ రహదారి వద్ద సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మనోజ్ను అంబులెన్స్లో పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు మెదక్ జిల్లాలో ఘటన -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
పటాన్చెరు టౌన్: రెండు వేర్వేరు కేసుల్లో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 6.118 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ వీణారెడ్డి, ఎస్ఐ యాదయ్య వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం డోయిన్ కమిటీ వెంచర్లో అక్రమ గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్రిజేష్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుంచి 1.48 కిలోల ఎండు గంజాయిని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అలాగే కొల్లూరు లేబర్ క్యాంప్ వద్ద దాడులు నిర్వహించి బీహార్కు చెందిన చందన్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 4.7 కిలోల ఎండు గంజాయిని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 6.188 కిలోల ఎండు గంజాయి రూ.3లక్షల 9 వేలు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితులను ఆదివారం రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు మల్లేశం, విక్రమ్, ప్రహ్లాద రెడ్డి, ఉమారాణి, ముజామిల్ పాల్గొన్నారు. -
స్వీయ జనగణనపై మారథాన్
నారాయణఖేడ్: స్వీయ జనగణనపై ఖేడ్లో ఆదివారం మారథాన్ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, ఎన్యూమరేటర్లు స్థానిక తహసీల్గ్రౌండ్ నుంచి రాజీవ్చౌక్ వరకు మారథాన్ నిర్వహించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో స్వీయ జనగణన చేసుకునే విధానాన్ని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు తమ స్వగృహంలో స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం ఖేడ్ మండలం పంచగామ, మనూరు మండలం తుమ్నూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు. -
వడ్లు ఎప్పుడు కొంటరు?
● రైతులను పట్టించుకోవడం లేదు ● ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్రావు ఫైర్చేగుంట(తూప్రాన్): రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆదివారం మండలంలోని కర్నాల్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదన్నారు. మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు మరికొన్ని జిల్లాల్లో మక్క లు, శనిగలు, సన్ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. సీఎం నిత్యం ఢిల్లీకి వెళ్లి అధిష్టానికి కప్పం కట్టి రావడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాలో ఒక్క మంత్రి అయినా కొనుగోలు కేంద్రాలను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష జరిపారా..? అని ప్రశ్నించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాయకులు ఉన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
ప్రధాని మోదీ ● వర్చువల్గా స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక పట్టణంగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో జహీరాబాద్ స్మార్ట్ సిటీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్లోని నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ ప్రాంతం నిర్మాణం వెనుక ఇదే లక్ష్యం ఉందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ వికసితానికి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల వాటా ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా, అత్యాధునిక హైసిటీ నెట్వర్క్ కూడా ఉండనుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే పరిశ్రమల అవసరాల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ తయారుకానున్నాయని తెలిపారు. ఇలాంటి సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేలకోట్లు అవసరమవుతాయని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రాంతంలోని వేలాది యువకులకు జహీరాబాద్ ప్రాంతం జాబ్ హబ్గా తయారుకానుందని వివరించారు. నిమ్జ్లో తయారయ్యే వాహనాలు, యంత్రాలతోపాటు ఇక్కడ ఉండే ఆహారశుద్ధి ఉద్యోగులకు, తెలంగాణలోని కార్మికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుందన్నారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో స్మార్ట్సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాలు,న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల పరిధిలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక వేగంగా స్మార్ట్సిటీ పనులునిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మార్ట్ సిటీ పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇక పనుల్లో జోరు పెరగనుంది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,369 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్లో భాగంగా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రకటించింది. బర్దిపూర్లో ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, జోనల్ మేనేజర్ విఠల్, రూరల్ సీఐ హనుమంతు, ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేనేజర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు హైదరాబాద్లో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు జహీరాబాద్ ప్రాంతం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. -
క్యూఆర్ కొట్టు.. దారి పట్టు
● ఒక్క స్కాన్తో ప్రయాణం సాఫీ ● టోల్ ప్లాజాలు, కూడళ్లు, సైన్ బోర్డుల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డుల ఏర్పాటు జహీరాబాద్: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇకపై సమాచారం కోసం ఇతరులను అడగాల్సిన అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద నిల్చోని ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) నేషనల్ హైవేల వెంబడి ఉన్న మైలు రాళ్లు, సైన్ బోర్డులు, ప్రధాన కూడళ్లు, టోల్ ప్లాజాల వద్ద క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. మొబైల్ఫోన్తో దీన్ని స్కాన్ చేస్తే చాలు. రహదారికి సంబంధించిన మొత్తం సమాచారం వచ్చేస్తుంది. వెళ్లే మార్గంలో ఎన్ని టోల్ప్లాజాలు ఉన్నాయి?, వాటి మేనేజర్ల వివరాలు, చెల్లించాల్సిన రుసుము తదితర సమాచారం వస్తుంది. పెట్రోల్ బంకులు, పంక్చర్ దుకాణాలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవచ్చు. దగ్గరలో నాణ్యమైన హోటళ్లు, రెస్టారెంట్లు, బస చేసేందుకు వసతి గృహాల వివరాలు కనిపిస్తాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు, వాహనం మొరాయించినప్పుడు సంప్రదించాల్సిన హైవే హెల్ప్ లైన్ నంబర్లు, అంబులెన్స్, సమీపంలోని ఆస్పత్రుల ఫోన్ నంబర్లు, పోలీసు స్టేషన్ల వివరాలు ఆ సమాచారంలో లభిస్తున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయి. కాగా, ఈ జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. -
క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిపటాన్చెరు: పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యత కోసం విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఆదివారం లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పదేళ్లుగా జాతీయ స్థాయిలో కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది క్రీడాకారులు హాజరుకావడం సంతోషకరమన్నారు. పట్టణంలోని మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు..ఏడాది పొడవునా వివిధ క్రీడ అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరాటే పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే రూ.5 లక్షల సొంత నిధులను అందజేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని. డ్రగ్స్కు దూరంగా ఉండి వాటిని తరిమి కొట్టడంలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, దశరథ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రరెడ్డి, మైత్రీ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: కుటుంబ కలహాలతో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన మండలంలోని కొడకండ్లలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తెరాల శ్రీనివాస్(52), విజయ దంపతులు. గతంలో విజయ గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో వారు నివాసముంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇటీవల ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి తోడు కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం అల్వాల్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. నిండు గర్భిణిపై భర్త దాడి గర్భస్థ శిశువు మృతి శివ్వంపేట(నర్సాపూర్): నిండు గర్భిణిపై భర్త దాడి చేయడంతో గర్భస్థ శిశువు మృతిచెందింది. ఈ ఘటన మండల పరిధిలోని దొంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన సునీతకు శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మ్యాదరి రజనీకాంత్తో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. శనివారం ఆమెను వాళ్ల అమ్మ కాడారి నర్సమ్మ నర్సాపూర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్లి దొంతికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లారంటూ మద్యం మత్తులో ఉన్న రజనీకాంత్ అత్త, భార్యను దుషించి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం మరోసారి అత్తపై రజనీకాంత్ దాడికి పాల్పడుతున్న క్రమంలో సునీత అడ్డురావడంతో పొట్ట భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్కు తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేసినప్పటికీ శిశువు మృతిచెందింది. భార్య, అత్తపై దాడికి పాల్పడిన రజనీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వాగులో మునిగి బాలుడి మృతి
మృతుడు సంగారెడ్డి జిల్లా వాసి శంషాబాద్ రూరల్: ప్రమాదవశాత్తు బాలుడు వాగులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ మండలం ననాజీపూర్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చాడు. మరుసటి రోజు చిన్న కుమారుడు శ్రీచరణ్(17) బహిర్భూమికి బైకుపై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్ద బైక్ పార్కు చేసి ఉంది. అదే రోజు తండ్రి హనుమంతు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ననాజీపూర్ గ్రామ శివారులోని వాగు నీళ్లలో మృతదేహం తేలి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని శ్రీచరణ్గా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
మొబైల్ షాపు చోరీ నిందితుడు..
సిద్దిపేటకమాన్: మొబైల్ షాపులో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఎండీ బాబా కమ్యూనికేషన్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న సాయంత్రం షాపును మూసి ఇంటికి వెళ్లాడు. నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన శివరాత్రి దివాకర్ (26) షాప్ షెట్టర్ను తెరిచి కౌంటర్లో ఉన్న రూ.14వేలను చోరీ చేశాడు. షాప్లో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపటిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు రెండు రోజుల క్రితం ఖాతా గ్రామంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి రూ.2వేలు దొంగిలించాడు. నిందితుడిపై పలు పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు 20 చోరీ కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి రూ.12,800 నగదును స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు. -
ఘనపూర్లో దళితుల భూమి కబ్జా
తూప్రాన్: తమ భూమిని అక్రమంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఓ దళిత కుటుంబం గ్రామ పంచాయతీ ఎదుట దీక్ష చేపట్టింది. ఈ సంఘటన మండలంలోని ఘనపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏడేల్లి చిన్న బాలయ్య పేర 30 ఏళ్ల నుంచి సర్వే నం. 157లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. బాలయ్య మృతి చెందడంతో ఆయన పెద్ద కుమారుడు మైసయ్య, చిన్న కుమారుడు దుర్గయ్యలకు రెండు భాగాలుగా చేసుకున్నారు. కాగా మైసయ్య వద్ద అదే గ్రామానికి చెందిన నర్సయ్య 1995లో సాదా బైనామా చేసుకొని కొనుగోలు చేశాడు. కొన్నేళ్ల క్రితం మైసయ్య మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మైసయ్య భార్య సువర్ణ పేరు మీద చేయించి, తిరిగి ఆమెకు కొంత డబ్బు చెల్లించి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా ఆ భూమిని సర్వే చేయించే క్రమంలో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన నర్సయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకు తెలియకుండా తాను సాగు చేస్తున్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేదు. దీంతో ఆదివారం బాధిత కుటుంబం గ్రామ పంచాయతీ ఎదుట టెంటు వేసుకొని తమకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టారు.గ్రామ పంచాయతీ ఎదుట బాధితుల నిరసన దీక్ష -
హోటల్లో అగ్నిప్రమాదం
పటాన్చెరు టౌన్: ఖానావళి హోటల్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, తిరిగి వచ్చిన సమయంలో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే హోటల్లో పనిచేస్తున్న వారిని బయటకు పంపించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. హోటల్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లలో ఒక దానిని సిబ్బంది ముందుగానే బయటకు తరలించగా, మిగిలిన రెండు సిలిండర్లు పేలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.షార్ట్ సర్క్యూట్తో మంటలు -
నేటి నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ
క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు(ఫైల్)నెల రోజుల పాటు శిబిరాలు కొనసాగింపు సంగారెడ్డి: క్రికెట్ నేర్చుకునే వారికి మంచి అవకాశం. క్రికెట్ అంటే చిన్నారులతో పాటు పెద్దవారికి ఎంతో ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ఇంటి వద్ద, మైదానంలో పిల్లలు ఆడుతుంటారు. పిల్లలకు ఆసక్తి ఉన్నా సరైన ఏర్పాట్లు లేక వెనకబడుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలనుకున్నా.. అవకాశం రావడం లేదు. ఇలాంటి వారి కోసం ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మంచి అవకాశం కల్పిస్తుంది. నెల రోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందుకు మైదానాలను ఎంపిక చేసి నేటి నుంచి ప్రారంభిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు చోట్ల క్యాంపులు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి విద్యార్థులకు ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. సంగారెడ్డి, సిద్దిపేటలో 11న, గజ్వేల్లో 12న, మెదక్, జహీరాబాద్లో 13న క్యాంపులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతాల్లో క్రికెట్లో అండర్– 14, 16, 19, 23 క్రీడాకారులు శిక్షణలో పాల్గొనేందుకు అర్హులు. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రెస్ వేసుకురావాల్సి ఉంటుంది. కావాల్సిన సామగ్రి నిర్వాహకులు ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి. క్యాంపుల వివరాలు.. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎంఎస్ క్రికెట్ అకాడమీ, సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ క్రికెట్ మైదానం, మెదక్లో ఇందిరాగాంధీ మైదానం, గజ్వేల్లో ఐవోసీ క్రికెట్ మైదానంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎంత మంది వచ్చినా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.ఉచితంగా క్రికెట్ శిక్షణ.. శిక్షణలో పాల్గొనాలనుకునే వారి పేర్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ప్రతిభ చాటితే రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశముంటుంది. ఎంపికై న వారిని వచ్చే ఏడాది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్– 14, 16, 19, 23 జిల్లాల్లో పాల్గొనే టోర్నీల్లో అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో సైతం పాల్గొనే అవకాశం ఉంటుంది. – రాజేందర్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి -
విద్యుత్ శాఖ ఉద్యోగి అరెస్ట్
హుస్నాబాద్: మహిళల ఫొటోల మార్పింగ్కు పాల్పడిన విద్యుత్ శాఖ ఉద్యోగి(ఆర్టిజన్)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. సీఐ కొండ్ర శ్రీను వివరాల ప్రకారం... హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన శ్రీబద్రి మహేశ్ పట్టణంలోని డీఈ కార్యాలయంలో ఆర్టిజన్గా పని చేస్తున్నాడు. తోటి ఉద్యోగుల బంధువుల స్టేటస్ ఫొటోలు, సోషల్ మీడియాలో వచ్చే ఫొటోలు సేకరించేవాడు. ఫొటో ఎడిటింగ్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నాడని సిబ్బంది ద్వారా డీఈ కృష్ణయ్య తెలుసుకున్నాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి హుస్నాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా, అతడిని సిద్దిపేట జైలుకు తరలించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్రాయికోడ్(అందోల్): పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ చైతన్యకిరణ్ వివరాల మేరకు... మండలంలోని సిరూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఎస్ఐ దాడులు చేశారు. సిరూర్ గ్రామానికి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,520, 52 పేకాట ముక్కలు, ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక వ్యవహారాలు, పేకాట, జూదం తదితరాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. రంగంపేట శివారులో ఆరుగురు.. కొల్చారం(నర్సాపూర్): పేకాట ఆడుతున్న ఆరుగురిని మెదక్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని రంగంపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం... గ్రామంలోని అవుసులవాని కుంటలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న కొమ్ముల రాజాగౌడ్, ఊరడి సత్యం, ఆరట్ల సురేశ్, నిమ్మనగారి చంద్రారెడ్డి, ఎండి చాంద్ పాష, అరిగె నర్సింహులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.4050 నగదుతో పాటు 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి..రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... నార్సింగి మండలం శంకాపూర్కు చెందిన పర్శ శంకర్ (42) ఈనెల 3వ తేదీన బైక్పై రామాయంపేటకు వచ్చి తిరిగి వెళ్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన కోతులను తప్పించబోయి ప్రమాదశాత్తు బైక్పైనుంచి పడి తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో అతడ్ని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మతోపాటు 18 ఏళ్లలోపు కుమారుడు, కూతురు ఉన్నారు. -
రేషన్ దుకాణాల్లో జొన్నలు
తక్కువ ధరకు పంపిణీ ● రైతుల వద్ద మద్దతుధరకు కొనుగోళ్లు ● జొన్న రైతులకు భారీగా లబ్ధి రైతు వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేసి పేదలైన వినియోగదారులకు ప్రజా పంపిణీ ద్వారా తక్కువ ధరకు జొన్నలను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రావతరణ రోజైన జూన్ 2 నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్: ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో భారీగానే జొన్న సాగు జరిగింది. ఈ పంట కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. కేంద్రం జొన్న హైబ్రీడ్ రకానికి రూ.3,699 మద్దతు ధర ప్రకటించింది. రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జొన్న, మొక్కజొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మద్దతు ధర ప్రకటించిన కేంద్రం పంటను కొనుగోలు చేపట్టాలి. కేవలం మద్దతుధర (ఎంఎస్పీ) ప్రకటించి కేంద్రం వదిలేస్తుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్రం కోరినా స్పందన కన్పించడంలేదు. బహిరంగ మార్కెట్లో ధర లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ ద్వారా జొన్నలు సాధారణంగా ప్రభుత్వం సేకరించిన సరుకులను బహిరంగ మార్కెట్లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకునే మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజలకే తక్కువ ధరకు అందించాలని నిర్ణయిచింది. వీరితోపాటు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు పోషకాహారం అందించడంలో భాగంగా జొన్నలను వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. చిరుధాన్యాల వాడకాన్ని పెంచడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.జిల్లాలోని రేషన్ దుకాణాలు 855 రేషన్కార్డుదారులు 4,42,746 రేషన్కార్డుల సభ్యులు 14,93,876 సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం జిల్లాలో సాగవుతున్న పంటలలో వాణిజ్య పంటలే అత్యధికంగా ఉన్నాయి. చిరుధాన్యాల పంటల సాగు అంతంతమాత్రంగానే ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మండలాల్లోనూ చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక మద్దతును అందిస్తుంది. జిల్లాలో 92,497 ఎకరాల్లో సాగు.. జిల్లాలో 92,497.03 ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా ఖేడ్ వ్యవసాయ డివిజన్ పరిధిలో 50,408.07 ఎకరాల్లో సాగు చేశారు. ఆందోల్, చౌటకూర్, హత్నూర, పుల్కల్ మండలాల్లో కలిపి 2,724 ఎకరాల్లో, మునిపల్లి, రాయికోడ్, వట్పల్లి మండలాల్లో కలిపి 15,432 ఎకరాల్లో, కొండాపూర్, సదాశివపేట్, సంగారెడ్డి మండలాల్లో కలిపి 10,538 ఎకరాలు, జహీరాబాద్ డివిజన్లో 13,316 ఎకరాల్లో సాగు చేశారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ విఫలమైందని కలత చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రామునిపట్లలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కర్రె లచ్చవ్వ , జయరావు దంపతులకు నలుగురు కుమారులు. 20 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేస్తూ నలుగురిని పోషించింది. చిన్న కుమారుడు కర్రె వంశీకృష్ణ(32) సిద్దిపేట పట్టణంలోని బైక్ షోరూమ్లో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఇద్దరి మద్య మనస్పర్దలు ఏర్పడి యువతి వివాహానికి నిరాకరించింది. దీంతో వంశీకృష్ణ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం కుటుంబీకులు లేచి చూసే సరికి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సేవ చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
హత్నూర(సంగారెడ్డి): అమ్మ జ్ఞాపకార్థంగా అంబలి కేంద్రం, చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్ తన తల్లిదండ్రులు మచ్చ వీరమ్మ, శంకరయ్య జ్ఞాపకార్థం.. దశాబ్ద కాలంగా అంబలితో పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆకలి, దప్పిక తీరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం సిరిపురం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.సంగారెడ్డి టౌన్: విధి నిర్వహణలో మాతృ సేవలందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తూ విద్యవంతులుగా తీర్చిదిద్దేందుకు పట్టణంలో బాలసదనం ఏర్పాటు చేశారు. సుమారు 73 మంది పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు ఇన్చార్జి నిర్మల. వైద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణతో పాటు తల్లికి సంబంధించిన సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు పదిమందిని చదివించి, పెద్ద చేసి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పించేందుకు కృషి చేశారు. -
41 ఏళ్లుగా అభాగ్యులకు సేవ
సిద్దిపేటజోన్: అమ్మ అనే పదం కమ్మనైనది.. అమ్మ ప్రేమ జీవితాంతం తోడు ఉంటుంది. వివిధ కారణాలతో అమ్మ ప్రేమ దూరమైనా అభాగ్యుల పాలిట కోవెల లాంటిది బాలసదనం. జిల్లా కేంద్రంలో 41 సంవత్సరాలుగా తల్లి ప్రేమ కోల్పోయిన వారందరికీ వసతి ఇస్తుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉన్న వారందరికీ బాలసదనం సిబ్బంది అమ్మ లాగా ప్రేమ, ఆప్యాయతలు పంచుతోంది. ప్రస్తుతం 40మంది అమ్మాయిలు బాలసదనంలో ఉన్నారు. వారి బాగోగులు చూసేందుకు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. బాలసదనంలో ఉండే వారికి వసతి, విద్య, భోజనం ఏర్పాట్లు, అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇక్కడ పనిచేసున్న సిబ్బంది ఎలాంటి లాభపేక్ష లేకుండా అభాగ్యులను తమ సొంత బిడ్డల లాగా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే ప్రతి మహిళ బాలసదనం పిల్లలకు ఒక తల్లి లాంటిదే. -
మరిచిపోయిన ఆభరణాల బ్యాగు అందజేత
హుస్నాబాద్: ఎల్లమ్మ జాతరకు వచ్చిన ఓ భక్తురాలు మరిచిపోయిన బ్యాగ్ను ఆలయ డైరెక్టర్లు తిరిగి అందజేశారు. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్కు చెందిన గంప మౌనిక అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. తన వెంట తెచ్చుకున్న బ్యాగును గర్భగుడిలోనే మరిచిపోయింది. బ్యాగును గమనించిన ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది బ్యాగు ఓపెన్ చేయగా, అందులో 15 తులాల బంగారం, రూ.15వేల నగదును గుర్తించారు. దాదాపు 2 గంటల తర్వాత సదరు మహిళ బ్యాగు పోయిందని ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలుసుకొని బ్యాగు అమెదేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పగించారు. ఆలయ అర్చకుడు పరమేశ్వర్ శర్మ, నిర్వాహకులు ప్రభాకర్, టాకూర్ భగవాన్ సింగ్, వెంకటస్వామి, రాజిరెడ్డి, కిషన్ నాయక్ ఉన్నారు. -
సరికొత్తగా సైక్లింగ్
ఖేలో ఇండియాలో భాగంగా వేసవి శిక్షణ శిబిరంరామాయంపేట(మెదక్): జిల్లాకు చెందిన సైక్లింగ్ క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి రామాయంపేటకు ఖేలో ఇండియా సైక్లింగ్ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కోచ్ దండు యాదగిరి యువకులకు సైక్లింగ్లో శిక్షణనిస్తున్నారు. జిల్లాలో సైక్లింగ్ కేంద్రం ఇదొక్కటే కాగా, ఇక్కడ పలుమార్లు రాష్ట్రస్థాయి పోటీలు సైతం నిర్వహించారు. రామాయంపేట ప్రాంతంలో సైక్లింగ్ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని మంజూరు చేసింది. మండలంలోని దామరచెరువు గ్రామానికి చెందిన జాతీయ సైక్లింగ్ క్రీడాకారుడు దండు యాదగిరిని కోచ్గా నియమించారు. కార్యాలయం ఏర్పాటు నిమిత్తం స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రతిరోజూ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.రామాయంపేటలో ఏరా్ౖపటైన సైక్లింగ్ కేంద్రం -
‘అమ్మ’ సహకారంతోనే విజయం
పటాన్చెరు టౌన్: పోలీస్ ఉద్యోగం అంటే సమయపాలన ఉండదు. ఎప్పుడైనా డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. అయినా కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. కుటుంబ సహకారం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. ఎస్ఐ కావడానికి నా తల్లి సహకారం విజయానికి పునాది. విధులు ముగించుకొని ఇంటికొచ్చాక తల్లి ఇచ్చే ప్రేమ, ఓదార్పు, ఒత్తిడిని దూరం చేస్తాయి. మహిళా ఎస్ఐగా గర్వంగా యూనిఫామ్ ధరించి సమాజానికి రక్షణ కల్పిస్తున్నానంటే , దాని వెనుక నా తల్లి, కుటుంబం అందించిన సహకారం, త్యాగం దాగి ఉన్నాయి. అమ్మ సహకారం లేనిదే మహిళా పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను సాధించడం చాలా కష్టం. – ఎస్ఐ నాగలక్ష్మి, బీడీఎల్ పోలీస్స్టేషన్ -
కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమతుల్యం చేస్తూ..
సిద్దిపేటకమాన్: పోలీసు ఉద్యోగం అంటే 24గంటలు అప్రమత్తంగా ఉండాలి. మహిళ ఉద్యోగి అయితే మాత్రం డ్యూటీలో సమాజాన్ని, ఇంట్లో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ రెండింటినీ కాపాడుకోవాలి. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిద్దిపేట టూటౌన్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ చిత్ర యాదవ్ను ‘‘సాక్షి’’ పలకరించింది. పోలీసు ఉద్యోగం, అమ్మగా నా బాధ్యత నాకు రెండు కళ్లు. ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి డ్యూటీ అయ్యే వరకు ప్రతి నిమిషం ముఖ్యమైనదే. పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంట్లో వంట, ఉద్యోగం ఇలా అన్ని బ్యాలెన్స్ చేస్తూ భర్త శ్రీనివాస్ సహకారంతో ముందుకు వెళ్తున్నాను. అమ్మ ప్రోత్సాహం వల్లే నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. నేను ఉద్యోగానికి వెళ్తే నా ఇద్దరు పిల్లలను అమ్మే చూసుకుంటుంది. లవ్ యూ అమ్మ.. హ్యాపీ మదర్స్ డే. నాలుగు తరాల అమ్మ హుస్నాబాద్రూరల్: నవమాసాలు మోసి కనిపించిన పిల్లలు ప్రయోజకులైతే.. ఆ కన్నతల్లి చూసి మురిసిపోతుంది. కొడుకు పిల్లలతో ముచ్చటించి మురిసిపోయి వృద్ధాప్యానికి చేరుకుంటే ఈ జన్మకు చాలనుకుంటారు. మూడుతరాల మునిమనవళ్లను చూసే అదృష్టం కొందరికి ఉంటే.. నాలుగు తరాల పిల్లలతో ఆడుతూ ఆరోగ్యంగా ఉంది ఓ బామ్మ. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శామంతుల సాయమ్మ 90 ఏళ్ల పైబడిన ఆమె.. మునిమనవరాళ్లతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా ఉంటుంది. సాయమ్మ కొడుకు, కోడలు రాజయ్య, మల్లవ్వ. వీరి కొడుకు రమేశ్, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద మనవడు వెంకటేశ్, సబీనా దంపతులకు హన్సిక, రియాజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయమ్మ మునిమనవడి పిల్లలతో నిత్యం కలిసి ఆడుతూ సంతోషంగా ఉంది. నాలుగు తరాల పిల్లలను చూసిన బామ్మ అంటూ ఊరిలో అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటూరు. -
మంచి ఆహారం తీసుకోవాలి
ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి సిద్దిపేటకమాన్: నేడు ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతాన లేమితో బాధపడుతున్నారు. అనేక రకాల కారణాలతో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత కూడా సంతానం కలగడం లేదు. ప్రతి మహిళకు జీవితంలో అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉంటుంది. ఆధునిక జీవన శైలి, ఉద్యోగ రీత్యా జంక్, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పీసీఓఎస్, ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ వస్తాయి. ఇవి అండం విడుదల కాకుండా చేస్తాయి. అందుకే మహిళలు మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. మాతృత్వ వైద్యంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలి. పాలకూర, బీట్రూట్, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గింజలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తినాలి. రోజూ 30 నిమిషాల నడక, యోగా, 7గంటల నిద్ర అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం, కెఫీన్, ఆల్కహాల్ పూర్తిగా నిషేధించాలి. – డాక్టర్ అరుణ, ప్రముఖ గైనకాలజిస్టు -
నేడు మదర్స్ డే
మాతృస్ఫూర్తితో.. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలు విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ.. ● అమ్మ జ్ఞాపకార్థం సేవాకార్యక్రమాలు ‘అమ్మ’ నడిచే దైవం అంటారు.. ఆమె అందించే ప్రేమ నిస్వార్థమైనది. తల్లి ప్రేమ తోడుంటే ఏదైనా సాధించవచ్చు. ఆ తల్లి అందించిన స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇటు కుటుంబాన్ని, అటు ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ మహిళలు ముందుకెళ్తున్నారు. అభాగ్యుల పాలిట బాలసదనం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు కొందరు. మరికొందరు అనాథలకు ఆశ్రయమిచ్చి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకొందరు అమ్మ జ్ఞాపకార్థం పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ.. ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. అమ్మ అందించిన స్ఫూర్తితో వివిధ రంగాల్లో ముందుకెళ్తున్న వారిపై మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు.విధి నిర్వహణలో మాతృ సేవలుతల్లిపై ప్రేమతో సేవాకార్యక్రమాలుగజ్వేల్రూరల్: అమ్మపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకార్థం నిరుపేదలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఓ తనయుడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్కు చెందిన మర్కంటి కనకయ్య తన తల్లి బాల్లక్ష్మీ జ్ఞాపకార్థం నాలుగేళ్ల క్రితం లక్ష్మీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వంద మందికిపైగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశాడు. గ్రామంలో క్రీడల్లో రాణించే నిరుపేద విద్యార్థులకు, వివాహం చేసుకొనే నిరుపేద వధువులకు ఆర్థిక సాయం అందిస్తూ భరోసానిస్తున్నాడు. అలాగే నిరుపేదలు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించి, మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. అమ్మపై ప్రేమతోనే తాను ఇప్పటి వరకు 100 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టానని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనకయ్య తెలిపాడు.ఆశ్రమంలో మానసిక వికలాంగులకు అన్నం తినిపిస్తున్న సిస్టర్స్శివ్వంపేట(నర్సాపూర్): అనాథలకు ఆశ్రయమిచ్చి వారిని అమ్మలా ఆరాధిస్తూ సేవలందిస్తున్నారు. మండల పరిధిలోని మగ్దుంపూర్లో 12 ఏళ్ల క్రితం ఫాదర్ సజీవ్ వర్గీస్ బేతాని అనాథాశ్రమాన్ని నెలకొల్పారు. ఇక్కడ సుమారు 45 మంది అనాథ, మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. వీరి ఆలనా పాలనా నిత్యం ఆశ్రమంలోని సిస్టర్స్ కార్నాల్, రీతా, మంజు, మిస్సెస్ గ్రేసీ చూస్తున్నారు. రక్త సంబంధీకులే పట్టించుకోని నేటి రోజుల్లో మానసిక వికలాంగులకు అన్ని విధాల సేవలందిస్తూ వారి మానసిక స్థితి మెరుగు పడేందుకు కృషి చేస్తున్నారు.నిరుపేదలకు సాయం చేస్తున్న కనకయ్య -
సర్.. నా భార్య మనీషా కనిపించడం లేదు!
హైదరాబాద్: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్కి చెందిన కైలాష్ కుమార్ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 15 ఏళ్ల బాలుడు.. 26 ఏళ్ల యువతితో ప్రేమ..! -
అత్తపై అల్లుడు అత్యాచారం
జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్లో చోటుచేసుకుంది. సీఐ అనిల్కుమార్ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచి్చంది. నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. -
వివాహిత అదృశ్యం
పటాన్చెరు టౌన్: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్కి చెందిన కై లాష్ కుమార్ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య
రామాయంపేట(మెదక్): తల్లిదండ్రులు మందలించారని ఒకరు, భార్యతో గొడవపడి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ బాల్రాజ్ కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన చిన్నవాలి లక్ష్మణ్(18). రామాయంపేటలోని బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. పని మానుకొని చదువుకోవాలని అతని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో సంఘటనలో దామరచెరువు గ్రామ శివారులో ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిస్సాకు చెందిన మహాదేవ్ (35) అనే కూలీ తన భార్యతో గొడవపడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు కేసులకు సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వ్యాపారి హత్య కేసులో కానిస్టేబుల్ సస్పెండ్
సిద్దిపేటకమాన్: సిద్దిపేటలో వ్యాపారి హత్య, దొంగతనం కేసులో అరెస్టు అయిన కానిస్టేబుల్ ప్రవీణ్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో సీసీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేరాల్లో గానీ, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొన్న వారిపై చట్టప్రకారం, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అత్తపై అల్లుడు అత్యాచారం● ఖాదిరాబాద్లో ఘటన ● నిందితుడి అరెస్టు జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్లో చోటుచేసుకుంది. సీఐ అనిల్కుమార్ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచ్చింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. పాత సామగ్రి దగ్ధం హత్నూర(సంగారెడ్డి): పాత ఇనుప సామగ్రి కొనుగోలు దుకాణం ప్రమాదవశాత్తు దగ్దమైంది. ఈ ఘటన మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులోని సంగారెడ్డి దౌల్తాబాద్ ప్రధాన రహదారి పక్కన శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకొని దుకాణం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు దుకాణం యజమాని తెలిపారు. -
కొనుగోళ్లు వేగిరం చేయాలి
సంగారెడ్డి /సంగారెడ్డి జోన్: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. జోగిపేట మార్కెట్ యార్డుతోపాటు చౌటకూరు మండలం కొర్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీలు, లారీలు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్ ఎంట్రీలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రైతుల ఖాతాల్లో జమ చేసిన చెల్లింపుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టరేట్లో అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రా ల్లో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అకాల వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 233 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) 2026 కార్యక్రమంలో భాగంగా భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 2002 ఓటరు జాబితాలో నమోదైన ప్రతీ అర్హులైన ఓటరు తమ వివరాలను 2025 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం అంబదాస్, డీఆర్డీవో పీడీ జ్యోతి, డీసీఓ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ ప్రసాద్, తహసీల్దారులు పాల్గొన్నారు.కలెక్టర్కు రైతుల ఫిర్యాదు జోగిపేట(అందోల్): ఎలుకలు కొట్టిన టార్పాలిన్లు పంపిణీ చేస్తున్నారని, వర్షం వస్తే ధాన్యమంతా తడిసిపోయే ప్రమాదముందని కలెక్టర్ ప్రతీక్ జైన్ వద్ద రైతులు వాపోయారు. కేంద్రం వద్ద రైతులకు సమస్యలున్నాయా? అని అడగ్గా కొంతమంది రైతులు టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల గూర్చి ఫిర్యాదులు చేశారు. ఈ కేంద్రానికి ఎన్ని గన్నీ బ్యాగులు అవసరమో ఇండెక్స్ పెడితే ఏర్పాటు చేస్తామన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
క్రాంతి పథంలో మహిళ
ఐకేపీతో సాధికారత వైపు అడుగులేస్తున్న వనితలుకంది(సంగారెడ్డి): పేద మహిళల బతుకుల్లో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) వెలుగులు నింపుతోంది. స్వయం సహాయక సభ్యులు బ్యాంక్ లింకేజీతోపాటు సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. వివిధ రకాల స్వయం ఉపాధి పనులు చేపట్టి కుటుంబాల పోషణలోనూ భాగస్వాములవుతూ సాధికారతవైపు అడుగులు వేస్తున్నారు. ఐకేపీ ద్వారా స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి సీ్త్రనిధి నుంచి రుణాలు తీసుకుని అప్పుల్లో ఉన్న తమ కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు. సీ్త్రనిధి అండతో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. రూ.117.33 కోట్ల రుణాలు అందజేత hÌêÏÌZ 26 Ð]l$…yýlÌS çÜÐ]l*-QÅ-Ë$-¯é²Æ‡$$. 413 {V>Ð]l$ çÜ…çœ*Ë$…-yýlV> 16,650 çÜÓĶæ$… çÜà-Ķæ$MýS çÜ…çœ*-Ë$-¯é²Æ‡$$. ÒsìæÌZ 66,820 Ð]l$…¨ çÜ¿¶æ$Å-Ë$¯é²Æý‡$. 2025&౼26Ð]l BǦMýS Hyé¨ÌZ »êÅ…MŠS Í…MóS-i, ï܈°«¨ §éÓÆ> 12,21 çÜ…çœ*-ÌSMýS$ Æý‡*.117.33 Mørϯ]l$ Æý‡$×ê-Ë$V> A…§ýl-gôæÔ>Æý‡$. çÜÓĶæ$… E´ë«¨ ^ólç³sôæt…-§ýl$MýS$ JMøP çÜ¿¶æ$Å-Æ>ÍMìS Æý‡*.50 ÐólÌS ¯]l$…_ ÌS„ýS-Ð]lÆý‡MýS$ Æý‡$׿… CçÜ$¢¯é²Æý‡$. VóS§ðlË$, Ðól$MýSË$, í³…yìl WȲ, ¯]l*¯ðl WȲ, MìSÆ>׿ Úëç³#, ºrtÌS §ýl$M>-×êË$, MýS*Æý‡-V>-Ķæ$ÌS §ýl$M>-׿…, ´ëÌS-ÐéÅ-´ë-Æý‡…, AÇ-òÜÌS ™èlĶæ*-È, OsñæÌS-Ç…VŠæ, ÑçÜ¢-Æ>-MýS$ÌS ™èlĶæ*È Ð]l…sìæ ç³¯]l$Ë$ ^ólç³sìæt iÐ]l¯]l… Mö¯]lÝë-WçÜ$¢-¯é²Æý‡$. ©…™ø õ³§ýl MýS$r$…-»êË$ BǦMýS…V> °ÌSºyìl AÀ-Ð]l–¨® OÐðlç³# ¯]lyýl$-çÜ$¢¯é²Æ‡$$. సీ్త్రనిధి ద్వారా ఎస్హెచ్జీలకుబ్యాంకు లింకేజీ రుణాలు జిల్లాలో 16,650 గ్రూపులు, 66,820 మంది సభ్యులు -
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం పనులు ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కడం లేదు. పలుచోట్ల ఈ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోకపోగా, పనులకు శ్రీకారం చుట్టిన చోట్ల పునాదుల దశను కూడా దాటకపోవడం గమనార్హం. వీటికి స్థలాల కేటాయింపులకే సమయం పట్టడంతో ఈ పనులు బాలారిష్టాలను దాటడం లేదు. దీంతో జూన్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నాటికే కాదు, వచ్చే ఏడాదిలో కూడా ఈ పాఠశాలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : -
‘గంగకత్వ’కు గ్రీన్ సిగ్నల్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిజాంకాలం నాటి సాగునీటి కాలువ గంగకత్వ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువ మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి గతంలో తీసుకెళ్లడంతో ఈ పనులకు మోక్షం లభించింది. నీటి పారుదలశాఖ ఈ కాలువ ఆధునీకరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నీటి పారుదలశాఖ ఈ నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్తో కలిసి జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ గంగకత్వ కాలువ 11 గ్రామాల శివారుల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు పారుతుంది. దీనికి 33 ఫీడర్ చానల్లు ఉన్నాయి. ఈ కాలువను ఆధునీకరిస్తే అదనంగా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువపై అవసరం ఉన్న చోట్ల కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలకు, తూములను మరమ్మతులు చేస్తారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. నిజాంకాలం నాటి కాలువఆధునీకరణకు రూ.42 కోట్లు మంత్రి ఉత్తమ్తో కలిసి ఇరిగేషన్ అధికారులతో జగ్గారెడ్డి సమావేశం -
రవాణాతో ఇబ్బందులు
గత కొన్నేళ్లుగా కూరగాయల సాగు చేస్తున్నా. కూరగాయలతో ఆదాయం ఉన్నప్పటికీ పట్టణాలకు తరలించి అమ్ముకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో వారంతపు సంతలు ఏర్పాటు చేయడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. కుటుంబసభ్యులు అంతా వ్యవసాయం చేయడంతో కూలీల ఇబ్బంది లేదు, ప్రస్తుతం కూరగాయల సాగు బాగుంది. – రమావత్ భజన్, రైతు, గుజిరితండా రైతులను ప్రోత్సాహిస్తున్నాం రైతులకు కూరగాయల సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఉచితంగా మినీకిట్లు, నారు పంపిణీ చేశాం. కూరగాయల సాగు చేసే విధానాలపై, వచ్చే ఆదాయంపై అవగాహన కల్పించాం. ఏ సీజన్లో ఏ కూరగాయలు పండించాలో సూచించాం, కూరగాయల సాగుతో రైతులకు ఆదాయంతో పాటు పంటమార్పిడి జరిగి నేల సారవంతమవుతుంది. అధికారుల అవగాహనతో జిల్లాలో కొంతవరకు కూరగాయల సాగు పెంచగలిగాం. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి -
కూరగాయల సాగు.. ఆదాయం బాగు
చిలప్చెడ్(నర్సాపూర్): కూరగాయల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం వస్తున్నప్పటికీ చాలామంది రైతులు వరి సాగునే ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది రైతులు కూరగాయలు, ఆకుకూరలు పంటలు సాగు చేసి అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయాలను సాగు చేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్ జిల్లాలో కూరగాయల సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతేడాది 3,100 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా.. ప్రస్తుతం 3,250 ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే తక్కువ కాలంలో, మెరుగైన ఆదాయం వస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు మాత్రమే కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సాగవుతున్న ఇతర పంటల సాగుతో పోలిస్తే.. కూరగాయల సాగు చాలా తక్కువ. ఈ కూరగాయలతో దినసరి ఆదాయం ఉన్నప్పటికీ, చాలామంది రైతులు సరైన రవాణా లేక సమయానికి కూలీలు లభించక అకస్మాత్తుగా పండించిన కూరగాయల ధర పడిపోవడం వంటి కారణాలతో రైతులు వరి వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ఈ ఏడాది 700 ఎకరాలకు సరిపడా మినీ కిట్లు (కూరగాయల విత్తనాలు), 210 ఎకరాలకు సరిపోయే కూరగాయల నారును ఉచితంగా పంపిణీ చేశారు.జైరాం తండాలో సాగు చేస్తున్న బీరకూరగాయలు సాగు చేసేటప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి ఏ కూరగాయలకు డిమాండ్ ఉంటుందో గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలానికి అనుగుణంగా పండే కూరగాయలు సాగు చేయాలన్నారు. వేసవిలో టమాట, బెండ, సోరకాయ, బీరకాయ, చిక్కుడు, కాకర వంటి కూరగాయలు సాగుచేయాలని అధికారులు చెబుతున్నారు. మట్టి పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలకు అనుకూలమైన పంటలు చేయడంతో పాటు కూరగాయల సాగులో సైతం తరుచూ పంటమార్పిడి చేయాలన్నారు. అలాగే విత్తనశుద్ధి చేయడంతో తెగుళ్ల నివారణ అరికట్టవచ్చన్నారు. కూరగాయల సాగులో సాంకేతిక పద్ధతులు పాటిస్తే, పంట బాగుండడంతో పాటు దిగుబడి ఆధికం పెరుగుతుందన్నారు. అంతేకాదు నీటి పొదుపు కోసం డ్రిప్ ఇరిగేషన్ వాడాలన్నారు. నేలలో తేమను సంరక్షించడానికి, ముఖ్యంగా కలుపు నివారణకు, నేల ఉష్ణోగ్రతను నియంత్రిచడానికి మల్చింగ్ షీట్లు ఉపయోగించాలన్నారు. సరైన సస్య రక్షణ పద్ధతులు, నీటి యజమాన్యం, వేసవిలో తీసుకోవాల్సి జాగ్రత్తలతో పాటు అధికారుల సలహాలు పాటిస్తే కూరగాయల సాగుకు మించి మరొకటి ఉండదన్నారు. -
ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఖేడ్ సబ్కలెక్టర్ ఉమాహారతి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, డీఎస్పీ వెంకట్రెడ్డిలకు సూచించారు. ఆమె పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాల వద్ద ఆయా అధికారులతో కలిసి శుక్రవారం ట్రాఫిక్ సమస్యలను స్వయంగా చూశారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించారు. వాహనాలు, తోపుడుబళ్లను రోడ్లపై పెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్ల విస్తరణ త్వరలో జరగనుండగా దీంతో ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. డీఎస్పీ, కమిషనర్తోపాటు స్థానిక సీఐ శ్రీనివాస్రెడ్డి, జాతీయ రహదారి విభాగం అధికారులు ఆమె వెంట ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లున్యాల్కల్(జహీరాబాద్): అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేస్తామని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గుంజోటి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రప్ప, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, అశ్వినీ పాటిల్ నాయకులు అడివప్ప పాటిల్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచండిడీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేగం పెంచాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యంపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత కాంటా చేశారని, ఎన్ని లారీలను తరలించారని ఐకేపీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం వెంట వెంటనే కాంటాచేసి రైస్మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం సృజన్రెడ్డి, సీసీ శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. 11న పీఎం నేషనల్ అప్రంటీస్ మేళామెదక్ కలెక్టరేట్: ఈనెల 11న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాలో జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 18యేళ్లు నిండి ఏదైనా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. -
ఈత.. కేరింత
ఎండ నుంచి ఉపశమనంరామాయంపేట(మెదక్): వేసవి సెలవుల్లో చిన్నారులు తమ మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి చెరువులు, కుంటల వద్దకు వెళుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి విద్యార్ధులు స్విమ్మింగ్ పూల్స్ (ఈత కొలను)లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో ఉన్న ఈత కొలనుల్లో సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈత కొట్టడానికి వీలుగా మూడు ఫీట్ల లోతు స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని పక్కనే యువకులు ఈత కొట్టడానికి వీలుగా ఐదున్నర ఫీట్లలోపు ఉన్న మరో ఈత కొలను ఉంది. ప్రతి రోజు కనీసం 50 నుంచి 60 మంది యువకులు వస్తున్నారు. వేసవి సెలవులు ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడుపుతున్నారు. -
రిజర్వాయర్లు, ప్రకృతి అందాలకు నెలవు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రదేశాలు
సిద్దిపేట జిల్లా వేసవి విహారానికి చక్కని ప్రదేశంగా మారుతోంది. ఇక్కడున్న రిజర్వాయర్లు, మరెన్నో ప్రకృతి అందాలు, ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. – గజ్వేల్: జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్ రిజర్వాయర్, 50టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, మరో 15టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన ఈ ఈ రిజర్వాయర్లోకి మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా జిల్లాలోని రంగనాయక్సాగర్, మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మసాగర్లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ రిజర్వాయర్ల వద్ద కట్టపై విహరించడం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. రిజర్వాయర్లలోకి నీటిని పంపుల ద్వారా విడుదల చేసే సమయాల్లో పిల్లాపాపలతో పర్యాటకులు భారీగా ఇక్కడికి చేరుకొని గొప్ప అనుభూతి పొందుతున్నారు. బోటింగ్తో పాటు పర్యాటకులను పసందు చేయడానికి మరెన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపాక మండలం లకుడారం శివారులో 3,400ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్లన్నవనం సహజమైన అందాలతో అలరారుతోంది. అలాగే.. సిద్దిపేటలోని కోమటిచెరువు, గజ్వేల్లోని పాండవుల చెరువులు పర్యాటకులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇకపోతే కొమురవెళ్లి మల్లన్న ఆలయం, కొండపోచమ్మ ఆలయం, వర్గల్లోని విద్యాసరస్వతీ ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
ఏమార్చి.. తస్కరించి..
సిద్దిపేటకమాన్: ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న తల్లీ, ఇద్దరు కూతుళ్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కమిషనర్ పెరుమాళ్ రష్మీ అదనపు డీసీపీ కుశాల్కర్తో కలిసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఆవుల నాగమణి, ఆవుల లక్ష్మి, కంకణాల మరియమ్మ, వారి సమీప బంధువులైన యాతం కోటేశ్వరరావు, గంజనబోయిన దినేశ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ప్రయాణికులన ఏమార్చి బంగారు నగలు తస్కరించేవారు. పది రోజుల క్రితం గుంటూరులో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. గత నెల 30న యాదగిరిగుట్టలో బస్సెక్కిన ఒక మహిళ బ్యాగులో నుంచి నాగమణి, లక్ష్మి ఏడున్నర తులాల బంగారు నగలను తస్కరించారు. చేర్యాలలో దిగి ఇతర ముఠా సభ్యుల సహకారంతో అద్దె ఇన్నోవా కారులో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చుంచనకోట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక వాహనాన్ని, రూ.15 లక్షల విలువైన తొమ్మిదన్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన చేర్యాల సీఐ రమేశ్, ఎస్ఐ జి.అపూర్వరెడ్డి, సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో సీఐ కిరణ్, ఆర్ఎస్ఐ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. తల్లీ ఇద్దరు కూతుళ్లు సహా ఐదుగురు అరెస్టు రూ.15 లక్షల విలువైన బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్ -
నిమ్జ్ ప్రాజెక్టుకు మోక్షం
నిమ్జ్ ప్రాజెక్టు కోసం కేటాయించిన ప్రాంతంజహీరాబాద్: దశాబ్ద కాలం తర్వాత ఎట్టకేలకు జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)కు మోక్షం లభించనుంది. ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాజెక్టు పరిధిలో చేపట్టనున్న స్మార్ట్ సిటీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. 2013లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జె.గీతారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ ప్రాజెక్టును మంజూరు చేయించారు. జహీరాబాద్లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాజెక్టును సుమారు 12,635 ఎకరాల భూమిలో విస్తరించాలని నిర్ణయించారు. తదనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ప్రాజెక్టు పనులు మందగించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్జ్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. మొదటి విడతలో 3వేల ఎకరాలకు పైగా... ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. నిమ్జ్లో కేంద్ర ప్రభుత్వం వాటా 49%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% వంతున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు. పలు పరిశ్రమలకు భూములు నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకుగాను ముందుకు వచ్చిన యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములను కేటాయించింది. ఈవీఎం టెక్నాలజీ సంస్థకు 511 ఎకరాలు కేటాయించారు. దీంతో సంస్థ రూ.వేయి కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ రూ.2,100 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హ్యూండాయ్ మోటారు కంపెనీ(ఈవీ ఆటో మోటీవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి 675 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ సుమారు రూ.8,528 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.స్మార్ట్ సిటీ ఏర్పాటు 10న ప్రధాని మోదీ వర్చువల్గాశంకుస్థాపన రూ.రెండువేల కోట్లతోమౌలిక వసతులుకనెక్టివిటీ పరంగా అనుకూలమైన ప్రాంతం జహీరాబాద్ భౌగోళికంగా, కనెక్టివిటీ పరంగా అనుకూలమైన ప్రాంతం. 65వ జాతీయ రహదారికి సమీపంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల మధ్య ఈ ఇండస్ట్రియల్ సిటీ రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు, విమానాశ్రయం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల భవిష్యత్తులో జహీరాబాద్ ఒక మహానగరంగా విస్తరించే అవకాశం ఉంది. -
ఓమని ఆట.. మెదడుకు మేత
పాపన్నపేట(మెదక్): మండుతున్న ఎండల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనే పురాతన పీటతో ఆడే ఓమని గుంటల (వామని) ఆట అత్యంత ప్రాచీన మైనది. తెలుగు వారి సాంప్రదాయ ఆటగా వినతికెక్కిన ఈ ఆట పిల్లల్లో ఏకాగ్రత.. గణిత నైపుణ్యాలను పెంచుతోంది. ఈ ఆటను సీతమ్మ వారు ఆడినట్లుగా చారిత్రక నేపఽథ్యం ఉంది. ఇద్దరు ఆడే ఈ ఆటలో చెక్కతో చేసిన పీటపై రెండు వరుసల్లో 14 గుంటలు ఉంటాయి. ఒక్కో గుంటలో ఐదు చింత గింజలు వేస్తూ ఆట మొదలు పెడతారు. అనంతరం నచ్చిన గుంటలోని చింత గింజలను తీసుకొని, ఒక్కో గుంటలో ఒక్కో గింజ వేస్తూ వెళ్తుంటారు. చేతిలో ఉన్న గింజలు అయిపోతే , ఆ తర్వాత గుంటలో నుంచి తీసుకొని వేయాలి. ఎక్కడైనా మధ్యలో ఖాళీ వచ్చిందంటే, దాని తర్వాత గుంటలో ఉన్న గింజలు, పంచిన వ్యక్తికి చెందుతాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతుండాలి. చివరికి ఎవరి దగ్గర గింజలు ఎక్కువ ఉంటే, వారే గెలిచినట్లు.ఈ ఆటను నిశితంగా గమనించడం, ఒక్కో చింత గింజ లెక్క పెట్టడం, ఖాళీ రాకుండా చూసుకోవడం వంటివి, మెదడుకు పదును పెడతాయి. వేలి కదలికలను మెరుగు పరుస్తుంది. -
కాటేసిన కరెంట్ తీగ
విద్యుదాఘాతంతో రైతు మృతి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు.ఈ సంఘటన మండల పరిధిలోని కస్తూరిపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పరుమాల మల్లేశం(56) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఈదురు గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ క్రమంలో రోజు మాదిరిగా తన పొలం వద్దకు వెళ్లాడు. తెగిపడ్డ విద్యుత్ వైర్లను గమనించక పోవడంతో వైర్లు కాలుకు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ వైర్లు సరిచేసి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేదని పలువురు అంటున్నారు. -
క్యాటిల్ ఫీడ్ దుకాణాలపై దాడులు
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని క్యాటిల్ ఫీడ్ దుకాణాలపై శుక్రవారం డ్రగ్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్నట్లు అనుమానిస్తున్న సీసాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ శాఖ ఉప సంచాలకులు దాస్ మార్గదర్శకత్వంలో సహాయ సంచాలకులు రాము ప్రత్యక్ష పర్యవేక్షణలో పాశమైలారం డ్రగ్స్ ఇన్న్స్పెక్టర్లు వరప్రసాద్, రవికిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా దాడులు చేపట్టారు. ముందుగా పటాన్చెరు పరిధిలోని పాటి ఎక్స్ రోడ్డులో రేణుక క్యాటిల్ ఫీడ్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా.. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్న 40 సీసాలు గుర్తించారు. అనంతరం సంబంధిత నమూనాలు సేకరించి, మిగిలిన సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చైతన్య నగర్ కాలనీలోని ఎంఎస్ లక్ష్మీ కృష్ణ క్యాటిల్ ఫీడ్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా.. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్నట్లు అనుమానిస్తున్న 250 మి.లీ సామర్థ్యం గల 120 సీసాలు లభ్యమయ్యాయి. వీటి నమూనాలు సేకరించి, మిగిలిన పరిమాణాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.120 సీసాలు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ అధికారులు -
హమ్మయ్య.. కాస్త చల్లబడింది
నారాయణఖేడ్: వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రెండు మూడు రోజులుగా భాను డు శాంతించాడు. ఈ పరిణామంతో ఎండవేడిమితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నిర్మానుష్యంగా మారిన రహదారులు ఇప్పుడు జనాలతో దర్శనమిస్తున్నాయి. ఎండలవల్ల మధ్యాహ్నం వేళ మందగించిన వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. జనాలు మధ్యాహ్నం సమయంలోనూ రాకపోకలు సాగిస్తుండటంతో పట్టణాలు కళకళలాడుతున్నాయి. మూడు రోజులు వర్షాలు! ఎండవేడిమితో అల్లాడుతున్న జనాలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాతావరణమార్పులతో కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు కురవడంతోపాటు ఉరుములు, మెరుపులతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల నేపథ్యంలో ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగొద్దని సూచించింది. రైతుల్లో ఆందోళన.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆలస్యంగా కొనుగోళ్లు సాగుతుండగా తేమ శాతం రాలేదని ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడం కత్తీమీద సాములా మారింది. ఆరుబయట ఎలాంటి రక్షణ లేకుండా ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టారు. టార్పాలిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రైతులే ఎరువుల బస్తాలను కుట్టుకుని పంటలపై కప్పుతున్నారు.వాతావరణంలో మార్పులు తగ్గిన భగభగలు రానున్న మూడు రోజులువర్షాలు కురిసే అవకాశం తగ్గిన వేడి.. వాతావరణ మార్పుల వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. వారం పది రోజుల క్రితం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి ఆపైగా ఉండగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయంలోనూ వేడి తగ్గింది. 35 నుంచి 38 డిగ్రీల సెల్సీయస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -
ప్రజల సమస్యలపై పోరాడాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ సాధన సమయంలో అండగా నిలిచిన ప్రజల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలే కేంద్రంగా రాజకీయాలు జరగడం లేదని, స్వలాభం, స్వార్థం, డబ్బు చుట్టే రాజకీయాలే జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం జనగణన చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే.. కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ట్రిబుల్ఆర్, నిమ్స్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేస్తే బీఆర్ఎస్ వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ధరణి పేరుతో రైతులను ఆగమాగం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కోదండరాం -
ట్రాక్టర్ను ఢీకొట్టిన బస్సు
ఇద్దరికి తీవ్ర గాయాలు మిరుదొడ్డి(దుబ్బాక): ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళుతోంది. ధర్మారం శివారులో వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను బస్సు ఓవర్ టేక్ చేయబోయి డీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. బస్సులో ప్రయాణిస్తున్న ధర్మాజీపేటకు చెందిన మనీషా, రామక్కపేటకు చెందిన కొండ రామానుజానికి తీవ్ర గాయాలు కాగా, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు గాయాల పాలైన ఇద్దరిని దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాపర్ కేటుగాళ్లు ట్రాన్స్ఫార్మర్లలో 20కిలోల కాపర్ వైర్ చోరీ అక్కన్నపేట(హుస్నాబాద్): చీకటి పడితే చాలు.. కాపర్ కేటుగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. గ్రామాల్లో పడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఊడ్చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి ధ్వంసం చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్, దాస్తండా, దుబ్బతండా గ్రామాల పరిధిలో ఈ సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గురువారం మండలంలోని దాస్తండా గ్రామ పరిధిలోని వంకాయతండా సమీపంలోని రైతులు దోమ యాదిరెడ్డి, గుగులోతు మల్చూర్ పొలాల్లో ట్రాన్స్కో అధికారులు ఏర్పాటు చేసిన రెండు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు రాత్రి ధ్వంసం చేసి.. అందులోని కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ హారీశ్రెడ్డి, లైన్మేన్ కిషన్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు ట్రాన్స్ఫార్మర్లల్లో సుమారుగా 20 కిలోల వరకు కాపర్ వైర్ను దొంగలించారని, వీటి విలువ సుమారు రూ.25వేలకుపైగా ఉంటుందని చెప్పారు. -
కావాలనే ఎండలో వదిలారు
● కుక్కలను వదిలేసిన కేసులోనలుగురు అరెస్టు ● ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడిపటాన్చెరు టౌన్: నందిగామ గ్రామ శివారులో 11 సైబీరియన్ హస్కీ కుక్కలు, ఒకటి జర్మన్ షెఫర్డ్ కుక్కలను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఒక హస్కీ కుక్క మృతి చెందగా, మిగిలినవి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పటాన్చెరు మండలం భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆక్సిజన్ కౌంటీ, కేశవనగర్ వెంచర్ ప్రాంతాల్లో కుక్కలను ఇటీవలే ఐదు రోజుల క్రితం వదిలిపెట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా టీఎస్ 07యూజీ 6451 వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. మియాపూర్లోని కల్వరీ టెంపుల్ సమీపంలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చల్లని వాతావరణంలో జీవించే హస్కీ కుక్కలను కావాలనే ఎండలో వదిలేయడంతో ఒక కుక్క మృతి చెందినట్లు, మిగిలినవి అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. కుక్కల వయస్సు పెరగడం, వాటిని ఉంచేందుకు స్థలం సరిపోకపోవడం వల్లే నిందితులు ఈ చర్యకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. రక్షించిన 11 హస్కీ కుక్కలను స్వాన్ ఎన్జీఓకు అప్పగించారు. అలాగే కల్వరీ టెంపుల్కు సంబంధించిన లైసెనన్స్ వివరాలపై జీహెచ్ఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు నీతిపూడి సత్యనారాయణ అలియాస్ మోజేష్, వండలూరి సుధీర్ బాబు, సుందర్ సింగ్, డ్రైవర్, అన్నవరం సత్యనారాయణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన బీడీఎల్ సీఐ విజయ్ కృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
పొద్దు పోతున్నా..పొద్దుతిరుగుడు కొనరేం
ఇరవై రోజులుగా రైతుల పడిగాపులు దుబ్బాకటౌన్: పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను విక్రయించడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి మార్కెట్ యార్డుల్లో పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ఆందోళనకు గురవుతున్నారు. పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, అయినా కాంటా వేయడంలేదని వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా 15 కొనుగోలు సెంటర్లు ప్రారంభమయ్యాయి. అలాగే 16 వేల ఎకరాలలో పొద్దుతిరుగుడు సాగు చేయగా కేవలం 8 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. మార్కెట్లో రక్షణ కరువు మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన పంటకు రక్షణ లేకపోవడం, ఎండలు, వర్షాలు, గాలివానల ప్రభావంతో నాణ్యత దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడానికి అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, రాత్రింబవళ్లు యార్డుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు మరిన్ని అవసరం రాయపోల్, దౌల్తాబాద్ మండలంలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటల సాగు అధికం. అయినా ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఇంకా ఆలస్యం చేస్తే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోయారు. కాగా.. రైతులు ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్నా రైతుల పక్షన అండగా ఉండాల్సిన ఉమ్మడి దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ కనీసం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. పరిమితిని ఎత్తివేయాలి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎకరానికి 6.60 క్వింటాళ్ల వరకే పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తున్నారని, అయితే ఈ సీజన్లో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మిగిలిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక అయోమయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిమితిని ఎత్తివేసి రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంటా కోసం నిరీక్షణ నేను మూడెకరాలలో పొద్దు తిరుగుడు పంట సాగు చేశా. ధాన్యం కోసి ఆరబోసి మార్కెట్కు తీసుకువచ్చా.. సుమారు ఇరవై రోజులుగా కాంటా కోసం నిరీక్షిస్తున్నా. మేము గజ్వేల్ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకవెళ్లి విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అధికారులు రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమస్య తీర్చాలి. – స్వామి, రైతు, తిమ్మక్కపల్లి -
టెక్నాలజీని అలవర్చుకోవాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్ సంగారెడ్డి టౌన్: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకుని పరిస్థితులకనుగుణంగా వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులతోపాటు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలనే సాగు చేయాలన్నారు. పంటల సాగుతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. జహీరాబాద్, సదాశివపేట, వట్పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరగా, ఆ దిశగాచర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న డ్రోన్లు, కట్టర్లు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏవోలు, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ప్రాంతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), మున్సిపల్ శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్–నాందేడ్, అకోలా జాతీయ రహదారి 161పై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్కు చెందిన పొడిచెర నిఖిల్ (23) బైక్పై వెళ్తుండగా.. నిజాంపేట్ సమీపంలో వంతెన సైడ్వాల్ను ఢీకొట్టాడు. సంగారెడ్డి నుంచి జుక్కల్కు బుల్లెట్పై వెళ్తున్న నిఖిల్ హెల్మెట్ ధరించినా.. పూర్తి స్థాయిలో లేకపోవడంతో సైడ్వాల్ తగిలి తీవ్ర గాయాలయఆయయి. వెంటనే ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి హన్మంతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి వివరించారు. చెట్టును ఢీకొట్టిన వ్యక్తి..నర్సాపూర్ రూరల్: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్– సంగారెడ్డి రహదారి పరిధి ఆవంచ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం తమ్మయపల్లికి శ్రీనివాస్రెడ్డి(53) బుధవారం స్కూటీపై జోగిపేట సమీపంలోని సంగయ్యపేటలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్– సంగారెడ్డి రహదారిలోని ఆవంచ సమీపంలోకి రాగానే చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థులపై దాడి దుర్మార్గమైన చర్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులపై దాడికి పాల్పడిన ఏబీవీపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూలో థియేటర్ విభాగానికి చెందిన విద్యార్థులు మే 3న నాటకం ప్రదర్శన నిర్వహించారన్నారు. అయితే కొంతమంది ఏబీవీపీ నాయకులు అల్లర్లు సృష్టించి, విద్యార్థులను బెదిరించడం, ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. మే 4న విద్యార్థులపై దాడి చేసి కరల్రతో హింసకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ నాయకులు గాయపడ్డారన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఉపాధ్యక్షుడు అర్జున్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని బోర్గితండాలో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ముగ్గురు గిరిజనుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. బోర్గితండాలో బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వారు బావివద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లాల్సివచ్చిందని ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో చనిపోయిన సావిత్రిబాయి, ఆమె కూతరు నిఖిత, మరిది కూతురు నందిని కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ, తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో అబ్రహం, బస్వరాజ్పాటిల్, గజానన్, హుల్బారావు పాల్గొన్నారు. -
పది శాతం లోపే కన్వర్షన్ చార్జీలు
ఐలా చైర్మన్ సుధీర్రెడ్డిపటాన్చెరు టౌన్: పారిశ్రామికవాడల్లో భూములకు కన్వర్షన్ చార్జీలు 10 శాతం లోపు మాత్రమే తీసుకోవాలని ఐలా చైర్మన్ సుధీర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేయనున్న హిల్ట్ ఫాలసీకి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. హిల్ట్ ఫాలసీలో అనుసరించవలసిన విధానాలతో పటాన్చెరు ఐలాభవన్లో బుధవారం పటాన్చెరు, రామచంద్రాపురం, ఐడీఏ బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామిక వాడల పారిశ్రామికవేత్తల సంఘ సభ్యులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు భూములు ఇవ్వాలన్నారు. కాలుష్య రసాయన పరిశ్రమలను హైదరాబాద్కు దూరంగా తరలించాలని చెప్పారు. మేజర్ పరిశ్రమలు కూడా తరలించుకునేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించాలన్నారు. కన్వర్షన్ ఫీజు చెల్లించిన నాటి నుంచి ఎంత సమయంలోగా తాగునీరు, యూజీడీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారో ముందుగానే చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కనెక్షన్ల కోసం ఆన్లైన్ ద్వారా అనుమతులు వెంటనే లభించి, అధికారులు వచ్చి అమర్చేలా చేయాలన్నారు. సమావేశంలో ఐలా వైఎస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో కూడా..
మిరుదొడ్డి(దుబ్బాక): తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లిల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మెర శ్రీకర్ ఇంట్లోనే కిరాణాషాపు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళారు. ఈ క్రమంలో ఇంట్లో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. జేసీబీ సహాయంతో కిరాణాషాపు షట్టర్తోపాటు, తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఫర్నీచర్, దుస్తులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. -
రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు తగవు
హుస్నాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగవని, తక్షణం వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ వరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోయి కేటీఆర్కు మతి భ్రమించిందన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ఎక్కడిదన్నారు. రైతులకు బేడీలు వేయడం, మల్లన్నసాగర్, గౌరవెల్లి రైతుల మీద విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెడితే సభ నుంచి తప్పించుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఇది వారికి ఏటీఎంగా మారిందని మోడీ, నడ్డా, అమిత్షా ఆరోపణలు చేసిన విషయం మరిచిపోయారా? అని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ బీఆర్ఎస్తో సంబంధం లేకుంటే తెలంగాణ ప్రభుత్వం వేసిన సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
భూ భారతిలో యూజర్ బాదుడు
● వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్కు అదనంగా రూ.500 ● సమాచారం లేకుండా వసూళ్లు ఏంటని ప్రశ్నిస్తున్న రైతులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి/నిజాంపేట (మెదక్): భూభారతిలో కొత్తగా యూజర్ చార్జీల బాదుడు షురూవైంది. గతంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే యూజర్ చార్జీలు వసూలు చేసేవారు కాదు. అయితే బుధవారం నుంచి ప్రతీ స్లాట్ బుకింగ్పై రూ.500 చొప్పున యూజర్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ చార్జీలు చెల్లిస్తేనే స్లాట్ బుక్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయడమేమిటని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుకింగ్ సమయంలో ఆ భూమి రిజిస్ట్రేషన్ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ చార్జీలు, పట్టాదారు పాసుపుస్తకం (కొరియర్ చార్జీలతో కలిపి) ధర, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, హరిత నిధి కింద ఆయా మొత్తాలను వసూలు చేసేవారు. ఈ చార్జీలతో పాటు యూజర్ చార్జీల పేరుతో రూ.500 అదనంగా రశీదు జనరేట్ అవుతోంది. నిత్యం పది నుంచి 25 రిజిస్ట్రేషన్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి మొత్తం 75 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ప్రతీ రోజు సగటున పది నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన ప్రతీ స్లాట్పై అదనంగా రూ.500 చొప్పున అదనపు చార్జీలు వసూలు చేయడంతో భూములు కొనుగోలు చేసే రైతులపై సుమారు రూ.3.75 లక్షల నుంచి రూ.9.37 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. యూజర్ చార్జీల వసూలు తగదు నేను రెండురోజుల క్రితం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఈ యూజర్ చార్జీలు వసూలు చేయలేదు. మంగళవారం నాటికి స్లాట్ బుక్ చేసుకున్నా. కానీ తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ డౌన్ ఉందని చెప్పడంతో బుధవారం కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాను. అక్కడ సిబ్బంది మీసేవ కేంద్రానికి వెళ్లి రూ.500 చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. మీసేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటే అందులో కొత్తగా యూజర్ చార్జీలు వేశారు. ముందు చెప్పకుండా రైతులపై భారం మోపడం సరికాదు. –రెడ్డి స్వామి, రైతు, నిజాంపేట (మెదక్ జిల్లా) -
ధాన్యం.. కొనుగోళ్లు శూన్యం
ఆర్భాటంగా కేంద్రాల ఏర్పాటు ● హమాలీలు లేక రైతుల ఎదురుచూపులు ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన తర్వాత కూడా రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని హత్నూర పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వారం క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా హమాలీల లేక ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. వారం నుంచి రైతులు తమ ధాన్యాన్ని తూకం వేసేందుకు పడిగాపులు పడుతున్నారు. ఈలోగా అకాల వర్షం పడితే ఆగమైపోతామని ఆందోళన చెందుతున్నారు. హత్నూర (సంగారెడ్డి): హత్నూర పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో 16 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు పలు గ్రామాల్లో సర్పంచులు ప్రారంభించారు. హత్నూర మండలంలోని నాగారం, సాదుల్ నగర్, లింగాపూర్, బోరపట్ల, పల్పనూరు, గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కూలీలు లేకపోవడంతో కుప్పలు కుప్పలుగా రైతులు తెచ్చిన ధాన్యం రాసులు దర్శనమిస్తున్నాయి. ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వద్ద సుమారు 240 మంది కూలీలు అవసరముండగా అధికారులు వీరిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలుగా పనిచేసేందుకు బిహార్తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇంకా బిహార్ నుంచి పూర్తిస్థాయిలో హమాలీలు రాకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయలేని పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం పడితే ధాన్యం తడిచిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.రొయ్యపల్లిలో కేంద్రం ఏర్పాటు చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల ని హత్నూర మండలం రొయ్యపల్లికి చెందిన రైతులు సర్పంచ్ పోచగౌడ్తోపాటు కలసి ఆందో ళన చేశారు. ఇతర గ్రామాలకు తీసుకెళ్లి ధాన్యం విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ధాన్యం తెచ్చి వారం రోజులైంది కొనుగోలు కేంద్రానికి వారం క్రితమే ధాన్యం తెచ్చాం. హమాలీలు రావడంలేదని ఎండిన ధాన్యాన్ని సైతం తూకం వేయడం లేదు. ధాన్యం పూర్తిగా ఎండింది. రోజు ధాన్యం కుప్పల వద్ద కాపలాకాయాలంటే ఇబ్బందిగా ఉంది. –సిద్దుల రాజు, నాగారం, రైతు. 300 బస్తాల ధాన్యం తెచ్చా 300 బస్తాల ధాన్యం తెచ్చాను. ఇంకా కూలీలు రావడం లేదు. ఎండిన ధాన్యం వర్షం వస్తే తడిసిపోతే నష్టపోతాం. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి. –శేఖర్ గౌడ్, నాగారం రైతు. -
గోదాంలలో నిలువ చేస్తాం:
మార్కెట్లో మొక్కజొన్న కుప్పలుసైబర్ మోసాలపై జర జాగ్రత్తఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి: ప్రతీ ఒక్కరికీ సైబర్ మోసాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సైబర్ జాగరూకత దివాస్ పేరుతో రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి నర్సింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో టౌన్ సీఐ రామునాయుడు, సైబర్ సెల్ టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగగౌడ్లు విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో అధికంగా విద్యావంతులే ఉంటున్నారన్నారు. ఐపీఎల్ పేరుతో నకిలీ ఐడీలతో టికెట్స్ పేరిట మోసాలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్, నకిలీ ట్రేడింగ్, పార్ట్టైమ్ ఉద్యోగాల, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, లోన్ అప్ వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పారు. ఆన్లైన్లో తెలియని లింక్స్, ఫైల్స్ ఓపెన్ చేసి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్ గాని, ఎన్సీఆర్బీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుశీల పాల్గొన్నారు. – రామ్మూర్తి, ఆర్డీఓ, హుస్నాబాద్మార్కెట్ యార్డుకు అనుకున్న స్ధాయికి మించి ధాన్యం వస్తోంది. వ్యవసాయ క్షేత్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలని సూచించాం., అయినా రైతులు ధాన్యాన్ని తీసుకురావడంతో కొనుగోళ్లల్లో జాప్యం జరుగుతోంది. లారీల సమస్య, గన్నీ బ్యాగుల కొరత కారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య తీరే వరకు ధాన్యాన్ని కొనుగోళ్లు చేసి గోదాంలకు తరలిస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. -
అదనపు కలెక్టర్గా సంగీత బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి జోన్: అదనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా టి.ఎల్.సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆమెకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సంగీత చెప్పారు. సజావుగా కొనుగోళ్లుఅదనపు కలెక్టర్ పాండు పుల్కల్(అందోల్)ః ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలని అదనపు కలెక్టర్ పాండు నిర్వహకులకు సూచించారు. పుల్కల్, గొంగ్లూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించి పరిశీలించారు. హామాలీల కొరతతో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ధాన్యం రాశులు ఎక్కడికక్కడ కుప్పలుగా పడివున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తూకం, రికార్డుల నిర్వహణ, తేమశాతాన్ని పరిశీలించారు. కళ్లాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా, ధాన్యం రవాణకు వాహనాల కొరత రాకుండా చూడాలని నిర్వహకులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ ఉన్నారు. అథ్లెటిక్స్ మీట్లో అన్నచెల్లెళ్ల ప్రతిభజహీరాబాద్ టౌన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానగ్రౌడ్లో బుధవారం నిర్వహించిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో అన్నచెల్లెళ్లు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఈ మేరకు బుధవారం జాదవ్ ప్రకాశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కోహీర్ మండలంలోని షెడగుట్ట తండాకు చెందిన జాదవ్ ప్రకాశ్ కూతురు జాదవ్ సులోచన జహీరాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో 3వ తరగతి చదువుతుంది. కుమారుడు జాదవ్ దేవాంశ్ హకీంపేట టీజీఎస్ఎస్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. జింఖానాగ్రౌండ్లో జరుగుతున్న సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అన్నాచెల్లెళ్లిద్దరూ పాల్గొన్నారు. అండర్–10 బాలికల 60 మీటర్ల రన్నింగ్లో జాదవ్ సులోచన ప్రతిభచూపి స్వర్ణపతకం, అలాగే లాంగ్జంప్లో కాంస్యం పతకం సాధించింది. అండర్–12 బాలుర విభాగం లాంగ్జంప్లో జాదవ్ దేవాంశ్ రజత పతకాన్ని సాధించారు. అనుమతుల్లేని పాఠశాలలపై క్రిమినల్ కేసులుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ డిమాండ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: అనుమతుల్లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు రాజేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ..జిల్లాలో అనుమతుల్లేని ప్రైవేటు పాఠశాలల యజమానులు ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. జహీరాబాద్ డివిజన్ కేంద్రంలో వుడ్రాక్ వరల్డ్ స్కూల్ యాజమాన్యం నర్సరీ ఫీజు రూ.85 వేల నుంచి 1.50లక్షల వరకు వసూలు చేస్తున్నా విద్యాధికారులు కళ్లుమూసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, జహీరాబాద్ , పటాన్చెరు,నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో కూడా పర్మిషన్ లేని ప్రవేటు నడుస్తున్నాయన్నారు. అనుమతి లేని పాఠశాలలను గుర్తించి మూసేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. -
బోల్తాపడ్డ కారు.. బాలిక మృతి
అల్లాదుర్గం(మెదక్): నేషనల్ హైవేపై రోడ్డు కుంగిపోవడంతో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడి బాలిక మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 161పై బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమాకాంత్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవ్యస్వామి (8), ఉమాకాంత్ అన్న కుమారుడు వైభవ్తో కలసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని డెగూళూరుకు వెళ్లేందుకు కారులో బయల్దేరారు. సరిగ్గా రాంపూర్ గ్రామ శివారులోకి వచ్చేసరికి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికీ తీవ్రగాయాలవ్వగా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ప్రవ్యస్వామి మృతి చెందింది. వైభవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ముగ్గురికి తీవ్ర గాయాలు -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం పారిశ్రామికవాడలోని గ్లోకేం రసాయన పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పరిశ్రమలోని ఓ బ్లాకులో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పవిత్రో అనే కార్మికుడు తీవ్రంగా గాయపడటంతో గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణమని కార్మికులు వాపోతున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో కేవలం ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఘటనపై పోలీసులను వివరణ కోరగా, సమాచారం అందలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కార్మికుడికి తీవ్ర గాయాలు -
26 లక్షలకు తగ్గిన వనమహోత్సవం లక్ష్యం
● గతేడాది కంటే పది లక్షల మొక్కలు కుదింపు ● నాటడానికి ఆసక్తి చూపని ప్రభుత్వ శాఖలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పచ్చదనాన్ని పెంచి..పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వనమహోత్సవం లక్ష్యాల్లో కోతలు పడుతున్నాయి. నాటే మొక్కల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. గతేడాది వనమహోత్సవంలో 36.04 లక్షల మొక్కలు నాటగా, ఈ ఏడాది ఈ లక్ష్యాన్ని 26.98 లక్షలకు తగ్గించారు. ఆయా ప్రభుత్వ శాఖలు నాటే మొక్కల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం ప్రకృతి ప్రేమికులను ఒకింత నిరాశకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భారీ సంఖ్యలో మొక్కలు నాటేవారు. కేవలం నాటుడుకే పరిమితం కావడం, వాటి సంరక్షణను గాలికి వదిలేయడంతో ఆ మొక్కలు ఎండిపోయి, పశువులకు మేతగా మారేవి. దీంతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నప్పటికీ హరితహారం లక్ష్యం నెరవేరేది కాదు. ఇప్పుడు మొక్కలు నాటే లక్ష్యాన్నే ఏటా కుదిస్తుండటం గమనార్హం. గతేడాది మిగిలిన మొక్కలే 18 లక్షలు వర్షాలు కురిసిన తర్వాత వనమహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 613 నర్సరీలున్నాయి. వీటిలో గతేడాది నాటకుండా వదిలేసిన మొక్కలే సుమారు 18 లక్షల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మొక్కలు చాలావరకు పెరిగి పెద్దయ్యాయి. దీంతో చిన్న కవర్ల నుంచి వీటిని పెద్ద కవర్లలోకి మార్చారు. వర్షాలు పడిన వెంటనే ముందుగా గతేడాది మిగిలిపోయిన ఈ 18 లక్షల పెద్ద మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ మొక్కలు పూర్తయ్యాక, ఈ ఏడాది పెంచుతున్న మొక్కలను నాటేలా ప్రణాళిక రూపొందించారు. వనమహోత్సవంలో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు ఏటా ఎన్ని మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాయి. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నాటే మొక్కల లక్ష్యం ఏకంగా ఆరున్నర లక్షలకు తగ్గింది. ఈ శాఖ ద్వారా 2025లో మొత్తం 27 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈసారి ఈ లక్ష్యాన్ని 20.50 లక్షలకు కుదించారు. అటవీశాఖ మొక్కలు నాటే లక్ష్యాన్ని 1.20 లక్షల నుంచి లక్షకు తగ్గింది. ఎకై ్సజ్ శాఖ మొక్కల నాటే లక్ష్యం కూడా దాదాపు 50% తగ్గింది. ఇలా మొత్తం 14 శాఖలకు నిర్దేశిత లక్ష్యాలు తగ్గించారు. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కలిపి నాటే మొక్కల సంఖ్య కూడా దాదాపు 1.35 లక్షలకు కుదించారు. ఇలా మొత్తంగా గతేడాది కంటే ఈసారి మొక్కలు నాటే లక్ష్యం దాదాపు పది లక్షలు కుదించడం గమనార్హం. గత మూడేళ్ల లక్ష్యాలు ఇలా.. సంవత్సరం మొక్కలు నాటే లక్ష్యం 2024 32.86 లక్షలు 2025 36.04 లక్షలు 2026 (ఈసారి) 26.98 లక్షలుఆరున్నర లక్షలు తగ్గిన డీఆర్డీఏ మొక్కల లక్ష్యం -
ఇబ్బందులు తలెత్తొద్దు: ఆర్డీఓ
కొండాపూర్ (సంగారెడ్డి): ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్డీఓ రాజేందర్ పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. కొండాపూర్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ బుధవారం తనిఖీ చేసి ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం, తూకం వేసే విధానాన్ని పరిశీలించడంతో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా లేవా అని పీఏసీఎస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో నమోదు చేయాలని సూచించారు. వరికి ఏ గ్రేడ్ రకానికి రూ 2,389తోపాటు ప్రభుత్వం అదనంగా రూ.500ను బోనస్ రూపంలో అందిస్తుందన్నారు. అకాల వర్షాలున్నాయని వస్తున్న సమాచారం నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు పడేలా చూడాలన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. రైతులు తీసుకొచ్చిన చివరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామన్నారు. రాజేందర్ వెంట వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వైద్యనాథ్, తహసీల్దార్ అశోక్, వ్యవసాయాధాకారి గణేశ్ ఏఈఓ ప్రేమ్రాజ్, పీఏసీఎస్ సీఈఓ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం ఫలితాలు
● ఇప్పటివరకు వైద్యశాఖలో 18 వేల ఉద్యోగాలు భర్తీ ● మంత్రి దామోదర రాజనర్సింహ నారాయణఖేడ్: మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ అధికారుల పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వైద్య, ఆరోగ్య శాఖలో 18వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖేడ్లో రూ.కోటితో నిర్మించిన బాలసదనం భవనాన్ని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మూడుచక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య, మహిళా సాధికారితకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అంగన్వాడీలు, బాలసదనాలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామని చెప్పారు. బాలసదనం బాలికలతో మంత్రి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాలసదనంలో ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ..ఖేడ్లో బాలసదనం ఏర్పాటు చేసినా స్వంత భవనం లేక పడుతున్న ఇబ్బందులు పక్కా భవనం నిర్మాణంతో తీరనుందన్నారు. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్యంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను ప్రొత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, సీడీపీఓ సుజాత, బాలసదనం సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మురళీకృష్ణ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర జోగిపేట(అందోల్): ఆందోల్లో శ్రీ భునీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మురళీకృష్ణస్వామి వారి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాగా, ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ
హత్నూర(సంగారెడ్డి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వసంతరావు పేర్కొన్నారు. హత్నూర, దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ అందించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్వరలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. -
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
మెదక్జోన్: మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కఠినకారాగార శిక్షతో పాటు, రూ.2 వేల జరిమానా విధించారు. ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శుభావల్లి బుధవారం తీర్పు చెప్పారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2019లో తూప్రాన్ మండలంలో మతిస్థిమితం లేని బాలికపై అర్కెల నాగేశ్ అత్యాచారం చేశాడని తెలిపారు. దీంతో ఆమె గర్భందాల్చిందని, తాను తల్లికాబోతున్న విషయం సైతం ఆ బాలికకు తెలియదన్నారు. ఈ విషయంపై అప్పట్లో పోలీసులు పోక్సో కింద కేసునమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారన్నారు. ఐదేళ్ల తరువాత ఈ కేసులో నిందితుడికి న్యాయమూర్తి శిక్ష విధించారని చెప్పారు. కాగా బాధితురాలికి పునరావాసం కింద రూ.2 లక్షల ఆర్థికసహాయం చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కత్తితో దాడి కేసులో మూడేళ్లు..కంగ్టి(నారాయణఖేడ్): మండల పరిధి తడ్కల్ గ్రామానికి చెందిన కటికె యాదుల్కు మూడేళ్ల జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం జిల్లా ఆదనపు సెషన్స్ కోర్టు జడ్జి జయంతి తీర్పునిచ్చినట్లు కంగ్టి సీఐ వెంకట్రెడ్డి చెప్పారు. గ్రామానికి చెందిన యాదుల్కు 2021లో మటన్ దుకాణం వద్ద తండ్రి జాఫర్, అన్న యూసుఫ్లతో గొడవపడ్డాడు. యాదుల్ ఆవేశంలో జాఫర్, యూసుఫ్లపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు యాదుల్పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా సబ్కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. నిందితుడు అప్పీల్కు వెళ్లగా మూడేళ్లు జైలుశిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. -
మాట తప్పిన మీకు మాట్లాడే హక్కు లేదు
పటాన్న్చెరు టౌన్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితమని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట తప్పిన మీకు మాట్లాడే హక్కు లేదన్నారు. ఇందిరా, సోనియా గాంధీ పేర్లు జపిస్తే డబ్బులు వస్తాయా? అని ఎంపీ మాట్లాడడం అర్థరహితమని విమర్శించారు. ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన సమయంలో దూరదృష్టితో బీడీఎల్, ఆర్డినెనన్స్ ఫ్యాక్టరీ, మహీంద్రా, ఆల్విన్ వంటి పరిశ్రమలు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ కంపెనీలతో వేలాది మందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. అదే విధంగా సోనియా యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సమయంలో కంది ఐఐటీ, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, నిమ్జ్ వంటి ప్రాజెక్టులు రావడంతో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి జిల్లాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన విద్యాసంస్థలకు కూడా కేంద్ర బడ్జెట్లో సరైన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు హామీని ఎంపీ రఘునందన్ రావు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, యువరాజ్, శ్రీనివాస్, రతన్ తదితరులు పాల్గొన్నారు. ఇందిర, సోనియాపై ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు అర్థరహితం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
అదనపు కలెక్టర్ మాధురి బదిలీ.. ఆమె స్థానంలో సంగీత నియామకం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో పలు కీలక శాఖల్లో బదిలీలు జరిగాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మూడేళ్లుగా పనిచేస్తోన్న ఆర్.డి.మాధురి నల్లగొండ జిల్లా నీటి పారుదలశాఖ భూసేకరణకు సంబంధించి స్పెషల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల సంస్థలో జిల్లా మేనేజర్గా డిప్యూటేషన్పై పనిచేస్తోన్న రెవెన్యూ శాఖకు చెందిన అంబాదాస్ రాజేశ్వర్కు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న తరుణంలో పౌర సరఫరాల సంస్థ డీఎంనూ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)గా పనిచేసిన బాలశౌరి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఖాళీ అయిన ఈ స్థానంలో ఎన్.సురేందర్ నియమితులయ్యారు. హైదరాబాద్ జిల్లా సీపీఓగా పనిచేస్తున్న సురేందర్కు సంగారెడ్డి సీపీఓగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించారు. ప్రతిష్టాత్మక జనగణన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఈ సీపీఓ పోస్టు ఎంతో కీలకం. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్గౌడ్కు కూడా స్థాన చలనం కలిగింది. జొన్నలు, శనగలు, మక్కలు వంటి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసే ఈ సంస్థ జిల్లా మేనేజర్గా చంద్రశేఖర్ నెలరోజుల క్రితమే జిల్లాకు వచ్చారు. ఇంతలోనే ఆయనకు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా డీఎంగా పనిచేస్తున్న రంజిత్రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్ను వరంగల్ జిల్లాకు..వరంగల్లో పనిచేస్తున్న రంజిత్రెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం. నెల రోజుల్లోనే ఈ బదిలీ కావడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చాలారోజులుగా ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పోస్టు ఎట్టకేలకు ఇటీవలే భర్తీ అయిన విషయం విదితమే. వికారాబాద్ జిల్లాలో పనిచేస్తోన్న మల్లారెడ్డిని సంగారెడ్డి డీపీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. డీపీఓగా పనిచేసిన సాయిబాబాపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఈ పోస్టులో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రెగ్యులర్ అధికారిగా మల్లారెడ్డి నియమితులయ్యారు. ఇలా పలు కీలక శాఖల్లో జరిగిన మార్పులు, చేర్పులు ఆయా శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సంగారెడ్డి జోన్ : జిల్లా అదనపు కలెక్టర్గా సంగీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా డీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సంగీత పదోన్నతిపై జిల్లాకు బదిలీ అయ్యారు. -
గణేశ్గడ్డలో భక్తుల రద్దీ
పటాన్చెరుటౌన్: అంగారక చతుర్థి పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం సమీపంలో గణేశ్గడ్డ దేవస్థానంలో మంగళవారం అంగారక చతుర్థి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా నెలకొంది. ఉదయం నుంచి గణనాథుడికి తేనెతో ప్రత్యేకాభిషేకం, హోమం, గరికపూజ చేసినట్లు ఆలయ అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్స్వామి, చంద్రశేఖర్, సతీష్, అయ్యప్పలు తెలిపారు. భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం కొనసాగుతున్నదని ఆలయ ఈవో లావణ్య,జూనియర్ అసిస్టెంట్లు ఈశ్వర్ తెలిపారు. మొక్కజొన్న కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న సెంటర్ను ఆర్డీఓ దేవూజీ, వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు కేంద్రంలో జరు గుతున్న కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 2,788 క్వింటాళ్ల మొక్కలను కొనుగోలు చేశామని, క్వింటాల్కు రూ.2,400 మద్దతు ధర కల్పిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం 320 క్వింటాళ్ల మక్కలు నిలువ ఉన్నా యని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాంబీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో 2028లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసిన నేపథ్యంలో మంగళవారం పటాన్చెరు డివిజన్లో బీజేపీ శ్రేణులతో కలసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, పటాన్చెరు కన్వీనర్ శ్రీనివాస్గుప్తా, మాణిక్రావు పాల్గొన్నారు. 17న గీతం అడ్మిషన్లకు ప్రవేశ పరీక్షపటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల 17న గీతం అడ్మిషన్ టెస్ట్ (గాట్–2026, మూడో దశ)ను నిర్వహించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 14 వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం హెల్ప్ లైన్ 888498 4000ను సంప్రదించాలని సూచించారు. నర్సాపూర్: ఉద్యాన పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
పైసా కొట్టు.. పట్టా పట్టు!
పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ అక్రమాలు రెక్కలు విప్పాయి లంచాలకు అలవాటు పడిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో కంచే చేను మేసిన చందంగా తయారైంది. రామచంద్రాపురం, గుమ్మడిదల, జిన్నారం మండలాల పరిధిలో విలువైన ప్రభుత్వ, అటవీ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పటాన్చెరు: నిషేధం జాబితాలో ఉన్న భూముల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా అటు పాలకులుగానీ, ఇటు అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఎక్కడో ఉన్న హైడ్రాను ఆశ్రయిస్తున్నారే తప్ప, పక్కనే ఉన్న రెవెన్యూ గడప తొక్కడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాట్లుగా ఉన్న భూములకు పట్టాలను సృష్టిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని కోట్లాది రూపాయల లంచాలను తీసుకుని పట్టాలిచ్చేస్తున్నారు. తప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు పంపి రికార్డులను మార్చి అసైన్డ్ భూములకు సైతం పట్టాలిచ్చేస్తున్నారు. పటాన్చెరు మండల పరిధిలో పాటి, రుద్రారం, ముత్తంగి గ్రామాల పరిధిలో అక్రమ పద్ధతిలో పట్టాపాసు పుస్తకాలు సృష్టించారు. కొన్నేళ్లుగా ప్లాట్లు అని చెప్పుకుంటున్న వారికి అవి ప్లాట్లు కావు, సాగు భూములని రెవెన్యూ అధికారులు రికార్డులు తయారు చేశారు. ముత్తంగిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ చేసేశారు. ముఖ్యమంత్రికి బాగా దగ్గరని చెప్పుకునే ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా పేరున్న ఓ వ్యక్తి పేరిట అసైన్డ్ భూమికి పట్టాలు రావడంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. అమీన్పూర్లో వివాదాస్పద 343 సర్వే నంబర్ భూమిలో ఫెన్సింగ్ వేసి ఓ అసైన్డ్ పట్టాదారు భూమి చదును పనులు చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ప్రతీ పనికి ఓ రేటు రెవెన్యూ కార్యాలయంలో ప్రతీ పనికి ఓ రేటు ఉంది. ఆ పద్ధతిలో కాకుండా నేరుగా వెళితే మాత్రం ఆ ఫైలు కదలడం లేదు. ఇటీవల ఓ పట్టాదారు ఓ ఎంపీతో ఫోన్ చేయించుకున్నా ఫైలు కదల్లేదు. దీంతో ఆ భూ యజమాని తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమవుతున్నారు. ఫౌతి మార్పిడి, ఇతర రికార్డుల సవరణకు మీ సేవలో దరఖాస్తు చేసినా మధ్యవర్తిత్వం చేయకపోతే రికార్డు సవరించడం లేదు. జిల్లా యంత్రాంగం ఇటుగా దృష్టి సారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు చెప్తున్నారు.అటవీ భూముల అన్యాక్రాంతం -
పంచాయతీరాజ్లో కూడా..
● నాలుగేళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి ● నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం సంగారెడ్డి జోన్: కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో ఒకేచోట విధులు నిర్వహిస్తోన్న అధికారులకు స్థానచలనం కలగనుంది. బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధమవుతోంది. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు డీఎల్పీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్య దర్శులు బదిలీ కానున్నారు. ఇప్పటికే వివిధ స్థాయి ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు నివేదికలు పంపారు. నాలుగేళ్లు దాటితే.. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు. 2027 మే 31 నాటికి పదవీవిరమణ చేసే ఉద్యోగులు వారు కోరుకుంటే తప్ప బదిలీ లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో విధులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 40% బదిలీ చేపట్టనున్నారు. 25 మండలాలు.. 613 జీపీలు -
7న టీజేఎస్ ప్లీనరీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సంగారెడ్డిలో ఈ నెల 7న తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్లీనరీని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్లీనరీకి పార్టీ అధినేత కోదండరాంతోపాటు మరికొంతమంది ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. ప్లీనరీలో పార్టీ బలోపేతం, విధి విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పాండు, విజయ్, మధుకర్ పాల్గొన్నారు. -
‘ఫిన్లాండ్’ అనుభవాలతో బడుల్లో మార్పు
పటాన్చెరు టౌన్: పాఠశాలల్లో నూతన మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని, విద్యా నాణ్యతను పెంపొందించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఉపాధ్యాయురాలు రమణీ పేర్కొన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. ఇటీవల ఫిన్లాండ్లో నిర్వహించిన ఎక్స్పోజర్ విజిట్కు వెళ్లి వచ్చిన రమణీ అనుభవాలను పాఠశాలల్లో అమలు చేయడమే లక్ష్యంగా మంగళవారం పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రమణి ఫిన్లాండ్ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు, విద్యార్థి కేంద్రిత బోధన, పాఠశాల వాతావరణం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం
● మంత్రి దామోదర రాజనర్సింహ ● స్మార్ట్ఫోన్లు, స్కూటీల పంపిణీ జోగిపేట(అందోల్): జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా, టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగిపేట– ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో దామోదర రాజనర్సింహ పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. స్కూటీల పంపిణీ జిల్లాలో 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను మంత్రి దామోదర పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఎ.చిట్టిబాబు, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీచర్లు, దివ్యాంగులు ఇతరులు పాల్గొన్నారు. -
సకాలంలో గోనె సంచులు అందించాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్పుల్కల్(అందోల్): ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు గోనె సంచులను సకాలంలో అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ఽ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చే రైతులకు జాబితా ప్రకారం వరుసగా కాంటా వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ ఉన్నారు. ధాన్యం కొనుగోలు వేగిరం చేయాలి జాయింట్ కలెక్టర్ మాధురి హత్నూర (సంగారెడ్డి): రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. హత్నూర, దేవులపల్లి, దౌల్తాబాద్, చందాపూర్, గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మాధురి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతులు తెచ్చిన ధాన్యం వెంటనే తేమ శాతం పరిశీలించి ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. లారీల ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ పర్వీన్ షేక్, ఏపీఎం రాజశేఖర్, పలు గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● ఓవర్టెక్ చేస్తుండగా ప్రమాదం ● 20 మందికి స్వల్ప గాయాలు ● లకుడారం గ్రామ శివారులో ఘటన కొండపాక(గజ్వేల్): ఓవర్ టెక్ చేయబోయి లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి స్వల్ప గాయాలయ్యా యి. లకుడారం గ్రామ శివారులో రాజీవ్ రహ దారిపై సోమవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నుంచి విత్తనాల సంచులను లారీలో లోడ్ చేసుకొని గజ్వేల్ రూరల్ మండలంలోని కొడకండ్ల శివారులో గల కావేరీ సీడ్స్ ఫ్యాక్టరీకి వెళ్తోంది. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కు ప్రయాణికులతో వెళ్తూ.. ఓవర్టెక్ చేయబోయి లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల్లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. విత్తనాల సంచుల లోడ్ లారీ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవరు అఫ్జల్ పాషా ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవరు గుర్రం దినేశ్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నిందితుడికి పది రోజుల జైలు
సిద్దిపేటకమాన్: న్యూసెన్స్ కేసులో నిందితుడికి సిద్దిపేట కోర్టు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణం సాజిద్పూరకు చెందిన ఎండీ ఆసీఫ్ వారం రోజుల క్రితం ఇంటి వద్ద న్యూసెన్స్ చేయగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా ప్రవర్తించగా అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆసీఫ్ను కోర్టులో హాజరుపర్చగా సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి రూ.100 జరిమానాతో పాటు పది రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుళ్లు పరశురాములు, కనకరాజు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
● పిస్తల్, ఎయిర్ గన్, రెండు కత్తులు, రూ. 2 లక్షలు స్వాధీనం ● ఒక రాష్ట్రంలో దొంగతనం.. మరొక రాష్ట్రంలో విక్రయం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: ఒక రాష్ట్రంలో వాహనాలు దొంగిలించి, మరొక రాష్ట్రంలో అమ్ముతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, జాఫర్ అలీ, నదీమ్ ఖాన్, షేక్ ఐజాజ్, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, ఇర్షాద్ అహ్మద్, గులాం రబ్బానీ, సలావుద్దీన్, బాబా, మొహ్సిన్ షా, రేహాన్లు కలిసి గ్యాంగ్గా ఏర్పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దొంగతనాలు చేశారు. చోరీ చేసిన వాహనాలను స్క్రాప్ చేసి ఇంజిన్ భాగాలు ఒకరికి, మిగతా భాగాలు ఇతరులకు అమ్ముతూ పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నేరాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 5, కర్ణాటక 1, మహారాష్ట్రలో ఐదు వాహన దొంగతనాల కేసులు నమోదైనట్లు వివరించారు. డీసీఎం వాహనం చోరీ ఫిర్యాదుతో.... నారాయణఖేడ్లోని మనూర్ చౌరస్తాలో గత నెల 9న మధ్యాహ్న సమయంలో డ్రైవర్ సునీల్కుమార్ పార్కు చేసి వెళ్లాడు. మరుసటి రోజు రాత్రి 9గంటలకు వాహనం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీంతో వాహన యజమాని నాగిల్గిద్దకు చెందిన మాలిపటేల్ దత్తు గత నెల 11న వాహనం పోయినట్లు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ శివకుమార్, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేశారు. ఈ నెల 3న పట్టణంలోని పంచగామ కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఖుర్షీద్, జాఫర్ అలీని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంకేతికల ఆధారంగా దొంగల ముఠా గుట్టురట్టు అయ్యింది. వీరితో పాటు సయ్యద్ సయిద్, షేక్ నిజాం, సలీం, ఇర్షాద్ అహ్మద్లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టల్ (రెండు రౌండ్స్), ఒక ఎయిర్ గన్, రెండు కత్తులు, రూ.2లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, టిప్పర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా వారు పరారీలో ఉన్నట్లు, వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ప్రసాద్రావు, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక జూలైలోనే...
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలరేషన్ ఏప్రిల్లోనే పూర్తి చేసిన నేపథ్యంలో మళ్లీ జూలై వరకు రేషన్ పంపిణీ ఉండదు. ఒకే సారి 58వేల టన్నుల బియ్యం పంపిణీ చేశారు. రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్( ఈ–పీఓఎస్) మెషీన్లో 3 నెలల రేషన్ బియ్యం కోసం మూడు మార్లు థంబ్ను సేకరించారు. దీంతో రేషన్ బియ్యం పంపిణీ కొంత ఆలస్యమైంది. లబ్ధిదారులు రేషన్ షాప్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. జూలై నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్పుడు సైతం మూడు నెలల బియ్యం ఒకే సారి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,041 రేషన్ షాపుల్లో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. మొత్తం 10,18,930 రేషన్ కార్డులు ఉండగా.. 9,25,697 రేషన్ కార్డులకు 58,696.51 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున అందజేశారు. ఈ ఏడాది జనవరిలో 86.35శాతం, ఫిబ్రవరిలో 86.23శాతం.మార్చిలో 87.20శాతం మంది రేషన్ బియ్యాన్ని తీసుకున్నారు.ఏప్రిల్, మే, జూన్లకు సంబంధించి పంపిణీ ఇలా.. జిల్లా మొత్తం కార్డులు తీసుకున్నవారు బియ్యం (టన్నులలో)మెదక్ 2,40,833 2,08,430 13,140.78 సంగారెడ్డి 4,42,746 4,14,400 27,253.54 సిద్దిపేట 3,35,351 3,02,867 18,300.80 -
మనసున్న మాణయ్య
● 29 ఏళ్లుగా అంబలి దాత ● రోజుకు 100 లీటర్ల పంపిణీ ● వేసవిలో ప్రజలకు చల్లని ఉపశమనం జోగిపేట(అందోల్): అసలే వేసవి.. బయటకు వెళితే చాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. దాహంతో అలమటిస్తూ.. గ్లాస్ నీరు దొరికితే చాలు కాస్తంత ఉపశమనం పొందుతారు. అయితే.. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన మాణయ్య.. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు తన వంతు సేవ చేయాలనే దృక్పథంతో అంబలి కేంద్రం నడుపుతారు. ఇలా 29 ఏళ్లుగా దీన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు సుమారు వంద లీటర్ల అంబలిని తయారు చేయగా.. 300 మంది వరకు దీనిని సేవిస్తున్నారు. కూలీలు, కార్మికులు, ప్రయాణికులు, పేద ప్రజలు మాత్రమే కాకుండా కొందరు తమ ఇళ్లకు కూడా తీసుకెళుతారు. మండల పరిధిలోని అన్నాసాగర్, రాంసానిపల్లి, నేరడిగుంట, ఎర్రారం, చింతకుంట గ్రామాలకు వెళ్లే ప్రజలు అంబలి కేంద్రానికి వచ్చి సేవిస్తుంటారు. మాణయ్య అందించే అంబలి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వెల్డింగ్ వృత్తిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆయన.. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం రెండు మాసాల పాటు పంపిణీ చేసే అంబలికి గాను రూ.లక్షకు పైగానే ఖర్చు అవుతుందని అంచనా. పట్టణంలో జరిగే పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవ చేయడంలోనే ఆనందం సేవ చేయడం ద్వారా నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను అని మాణయ్య ‘సాక్షి’కి తెలిపారు. 29 ఏళ్లుగా తాను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని, తనకు శక్తి ఉన్నన్ని రోజులు ఈ కేంద్రాన్ని కొనసాగిస్తానన్నారు. ఆయన సేవలకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం నిజంగా గర్వకారణమని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. -
30 రోజుల్లోపు సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ప్రజావాణిలో 137 అర్జీలుసంగారెడ్డి జోన్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్కు అర్జీలు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లో అందోల్, సంగారెడ్డి, డివిజన్లకు సంబంధించి ప్రజావాణి నిర్వహించారు. నారాయణఖేడ్, జహీరాబాద్, డివిజన్ కేంద్రాలలో ప్రజావాణి నిర్వహించి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 137 అర్జీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని సూచించారు. సంబంధిత పోర్టల్లో అప్ లోడ్ చేసి 30 రోజుల్లోపు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, మాధురి, తదితరులు పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు అందించేందుకు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండి అధికారులకు అర్జీలను అందించారు. ప్రజావాణికి విశేష స్పందననారాయణఖేడ్: సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మొదటిసారి ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సబ్ కలెక్టర్ ఉమాహారతి వినతులను స్వీకరించారు. దివ్యాంగుడైన తనకు స్వయం ఉపాధికోసం వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రుణం ఇప్పించాలని మండలంలోని జుజాల్పూర్కు చెందిన మంజూర్ అహ్మద్ వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను పాతపద్ధతిలోనే ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ వినతిపత్రం అందజేశారు. మరో 12 మంది భూసమస్యలు, పెన్షన్లు ఇతర పౌరసేవలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ తెలిపారు. -
మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్
నర్సాపూర్: ఆర్టీసీ డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు టెస్ట్ చేసి విధుల నుంచి తప్పించారు. మేడ్చల్ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ తిరుమలేశ్ సోమవారం మేడ్చల్ నుంచి నర్సాపూర్ డ్యూటీ చేస్తున్నాడు. మార్గమధ్యలో ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించడంతో పాటు అతడి కదలికలు ప్రయాణికులకు అనుమానాలు కలిగించాయి. బస్సు నర్సాపూర్ రాగానే కొందరు ప్రయాణికులు 100కు ఫోన్ చేసి డ్రైవర్పై ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ సుందర్రాజు ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్కు వెళ్లి డ్రైవర్కు టెస్ట్ చేయగా, మద్యం తాగినట్లు తేలింది. డ్రైవర్కు నోటీసులు ఇచ్చి విధుల నుంచి తప్పించారు. కాగా మేడ్చల్ డిపో అధికారులు మరో డ్రైవర్ను నర్సాపూర్కు పంపి బస్సును డిపోకు తీసుకువెళ్లారు. మహిళ అదృశ్యంజహీరాబాద్ టౌన్: వివాహిత మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మొగుడంపల్లి మండలం మిర్జంపల్లి తండాలో చోటుచేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జంపల్లి తండాకు చెందిన రేఖాబాయి(40) మానసిక పరిస్థితి బాగాలేదు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఏప్రిల్ 27న భర్త పాండు మందుల కోసం హైదరాబాద్కు వెళ్లగా.. రేఖాబాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే రోజు సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె కనపించలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు, భర్త ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: డీఎస్పీ నర్సాపూర్: చట్టాలను ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ హితవు పలికారు. సోమవారం స్థానిక రైతు వేదికలో పోలీస్శాఖ ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీ వద్ద సమాచారం పోలీసులకు చెప్పాలని, తమ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ రంజిత్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ జనార్దన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సాయికుమార్ పాల్గొన్నారు. బాలికపై అత్యాచారం .. ఇరవై ఏళ్ల జైలు సదాశివపేట(సంగారెడ్డి): బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మేథారి శాంసన్కు ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ .8000 జరిమాన విధించారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్. శ్రీలేఖ తీర్పు చెప్పారని సీఐ వెంకటేశ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై కేసు నమోదైంది. మేథారి శాంసన్కు శిక్షపడేలా కృషి చేసిన అధికారులకు ఎస్పీ పరితోష్పంకజ్ అభినందించారు. మేథారి శాంసన్ కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని రాజగిరా గ్రామానికి చెందిన శాంసన్ ఎలక్ట్రీషియన్ సెంట్రింగ్ పనులు చేసేవాడని తెలిపారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా వాదించిన పీపీ సూర్యారెడ్డి, దర్యాప్తు అధికారి నవీన్కుమార్, ప్రస్తుత సీఐ వెంకటేశ్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
లాస్లో ‘ఆర్టీసీ’
ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్ల మేర నష్టాలుమెదక్ కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తోంది. గత ఫిబ్రవరి వరకు రూ.32 కోట్ల మేర నష్టాల్లో ఉంది. సంగారెడ్డి, నారాయణ్ఖేడ్ డిపోల పరిధిలో నష్టం అత్యధికంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 300 కో ట్లు కేంద్ర ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నప్పటికీ గట్టెక్కడం లేదు. ప్రతి కిలోమీటర్కు రూ.62 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 57.52 మాత్రమే వస్తున్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సరిపోను లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా వారు సెలవులు పెడుతున్నారు. దీంతో కొన్ని రూట్లలో బస్సులను నడపడం లేదు. ఆదా యం వచ్చే మార్గాలపైన అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట కలిపి మొత్తం 9 డిపోలు ఉన్నాయి. సమ్మర్ టూర్లు.. తీర్థయాత్రలు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత కోసం టూర్లకు వెళ్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సైతం సమ్మర్ టూర్లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల, ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి, పోచారం అభయారణ్యం లాంటి ప్రదేశాలు చూపించాలని భావిస్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సైతం ఈ ప్రణాళిక కొనసాగింది. ఈ ఏడాది సైతం అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, రామప్ప ఆలయం తదితర ఆలయాలకు సమ్మర్లో ప్రత్యేక ప్యాకేజీలతో సిద్ధం చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా.. డిపోలు 9 బస్సులు 627డ్రైవర్లు 764కండక్టర్లు 1,014ప్రత్యేక ప్రణాళికలుఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాం. సంస్థకు ఆదాయం సమకూర్చే విధంగా పనిచేయాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చాం. వివాహాలు, శుభకార్యాలకు, టూర్లు, పుణ్యక్షేత్రాలకు బస్సులను అద్దెకు ఇస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. – విజయభాస్కర్, రీజినల్ మేనేజర్ రెండు డిపోల పరిధిలో అత్యధికం అధికారుల దిద్దు‘బాట’ -
బడి తెరిచిన రోజే పుస్తకాలు
విద్యార్థులు: వచ్చే విద్యా సంవత్సరానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? విద్యార్థులు: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి? విద్యార్థులు: జిల్లాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏమైనా మంజూరు అయ్యాయా? విద్యార్థులు: ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నారా? ఇప్పటికే 83% చేరుకున్నాయ్ విద్యార్థులు: పదో తరగతిలో విద్యార్థులు ఎంత మంది ఉత్తీర్ణత సాధించారు? పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ‘సాక్షి’ రిపోర్టర్లుగా 9వ తరగతి చదువుతున్న రాచకొండ హంసిక, 8వ తరగతి చదువుతున్న రాదారి ఆదర్శ్కుమార్ వ్యవహరించారు. వీరి ఇంటర్వ్యూలో డీఈఓ శ్రీనివాస్రెడ్డిని పలు అంశాలువెల్లడించారు. – సాక్షి, సిద్దిపేట -
బతికుండగానే చంపేశారు
● రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు ● పెన్షన్ కోసం వృద్ధుడి ఆందోళనహవేళిఘణాపూర్(మెదక్): వ్యక్తి బతికుండగానే అధికారులు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 65 ఏళ్లు నిండిన కీసరి పోచయ్య పింఛన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా, మంజూరైంది. కూచన్పల్లి గ్రామ లిస్టులో పేరు వచ్చింది. వారు ఎక్కడదనే విషయం తెలుసుకోకుండానే అతడు మరణించినట్లు రికార్డు చేసి పంపించారు. దీంతో పోచయ్య ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అడుగగా పింఛన్ వచ్చిన తర్వాత మరణించినట్లు నమోదైందని తెలుపడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని గత కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి విన్నవించగా, అందుకు సంబంధించిన పత్రాలు అందజేయాలని చెప్పడంతో అప్పగించాడు. కానీ ఇప్పటివరకు తనకు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు పింఛన్ వచ్చేలా చూడాలని కోరుతున్నాడు. -
కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి: కలెక్టర్
సంగారెడ్డి జోన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేసి, వారికి సకాలంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు. ధాన్యం రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సరైన ప్రణాళికతో కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. 6న జాబ్ మేళా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యేనారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీని ఆదర్శంగా మార్చేందుకు పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. సోమవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. కో ఆప్షన్ సభ్యులుగా కుర్మ నగేష్, రేష్మాశెట్టి శంకర్, అఫ్రీన్ మోహిద్, ముంతాజ్ ఖయ్యూంలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రశాంతి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్, వైస్ చైర్మెన్ శంకర్, కౌన్సిలర్లు ఎన్నికై న వారిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధిలో తనవంతు సహకారం అందిస్తానన్నారు. జెడ్పీ, మండల పరిషత్, మాజీ కో ఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్అలీ, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సాగర్’లో వ్యాపారి మృతదేహం
● హత్యా?.. ఆత్మహత్యా? ● అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్లో అనుమానాస్పద స్థితితలో వ్యాపారి మృతదేహం ఆదివారం రాత్రి లభ్యమైంది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన బెల్దే విశ్వనాథం(50)కు భార్య వనిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్లో గ్రామం ముంపునకు గిరైంది. కోల్పోయిన భూములకు డబ్బులు రావడంతో ఆ డబ్బులతో సిద్దిపేట పట్టణంలో ఉంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథం ఈ నెల 2న ఉదయం రియల్ ఎస్టేట్ పనినిమిత్తం పెద్దకోడూరు శివారులోని మెట్టుబండల వద్దకు వెళ్తున్నాని బయటకు వెళ్లారు. 10 గంటల తరువాత విశ్వనాథం.. తన భార్యకు ఫోన్ చేసి రామంచ దగ్గర ఉన్నానని చెప్పారు. తరువాత తన భార్య 11 గంటలకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పటి నుంచి తెలిసిన వారికి ఫోన్ చేయగా ఆచూకి లభించలేదు. దీంతో అతని భార్య చిన్నకోడూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రంగనాయక సాగర్లో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాథంను చివరిసారిగా ఒక కానిస్టేబుల్ తన కారులో తీసుకుపోయారని మృతుని భార్య వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొంతు నులిపి హత్య చేసి రిజర్వాయర్లో వేశారని ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. -
జొన్న.. కొనుగోలు సున్నా!
చేతికి వచ్చిన పంట ● కొనుగోలు కేంద్రాలు లేక రైతుల అవస్థలు ● తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు ● మద్దతు ధర కోసం డిమాండ్ జహీరాబాద్ టౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జొన్న పంట చేతికి వచ్చింది. కోతలు జోరుగా సాగుతున్నాయి. పంట ఆశాజనకంగా ఉండడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే.. ఇంత వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధిక వర్షాల కారణంగా ఈ సంవత్సరం ఖరీప్ పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోయారు. దీంతో యాసంగిలో జొన్న, మొక్కజొన్న పంటలను వేశారు. పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. చాలా వరకు రైతులు పంటలను కోసం అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. జొన్నను ఆహారపు అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకని మంచి డిమాండ్ కూడా ఉంది. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో రబీలో జొన్న అధిక విస్తీర్ణంలో సాగువుతుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తుంటారు. గత సంవత్సరం సుమారు 42 వేల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సంవత్సరం 58 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత సంవత్సరం ప్రభుత్వం రూ.3,371 మద్దతు ధర ప్రకటించించగా.. ఈ ఏడాది క్వింటాలుకు రూ.3,664 నిర్దేశించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. డబ్బుల అవసరం ఉన్న రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తే గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్క్ఫెడ్ అధికారులు స్పందించి వెంటనే జిల్లాలో జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని మార్కెఫెడ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి సంగారెడ్డి టౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 90 వేల ఎకరాలలో జొన్న పంట పండించారని, అయితే.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శనగలు కూడా కొనుగోలు చేయాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
వారంలో ఒకరోజు పర్యటిస్తా
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సంగారెడ్డిలోని మంత్రి స్వగృహంలో కలిశారు. వారితో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. నెలలో ఒక వారం పర్యటించేలా ప్రణాళికను తయారు చేసుకుంటానని చెప్పారు. పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ రవీందర్ను మంత్రి ప్రశ్నించగా.. 230 ఆన్లైన్ అయ్యాయని, మరో 140 ఆన్లైన్ సమస్యలు ఉన్నాయని కమిషనర్ వివరించారు. అజ్జమర్రి–జోగిపేట బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించాలని, ఈ పనులు పూర్తయినట్లయితే సుమారుగా 23 గ్రామాల ప్రజలు జోగిపేటకు వివిధ పనుల నిమిత్తం వచ్చే అవకాశం ఉంటుందని దీనివల్ల వ్యాపారాలు పెరిగి, స్థానిక వ్యాపారులకు జీవనోపాధి లభించనుందని మంత్రి తెలిపారు. సీల్డ్కవర్లోనే కోఆప్షన్ సభ్యుల పేర్లు జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి జరగబోయే మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి తాను సీల్డ్ కవర్ను పంపుతానని మంత్రి దామోదర పాలకవర్గ సభ్యులకు సూచించారు. తాను పంపిన పేర్లకు మీరంతా ఆమోదం తెలపాలని, అన్ని విధాలుగా ఆలోచించే కొత్త కోఆప్షన్ సభ్యుల పేర్లను నిర్ణయిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబుతో పాటు కౌన్సిలర్లు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. -
మోదీ సభను విజయవంతం చేయండి
● బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 10న నిర్వహించతలపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణ రూ.8 వేల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నియోజకవర్గం ఇన్చార్జి రాజేశ్వర్రావు దేశ్పాండే, నాయకులు డాక్టర్ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైందవ ధర్మం కోసం పాటుపడాలి● వీహెచ్పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి జహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలికొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, సీఈఓ నవీన్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామున నుంచే పుష్కరణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పెట్టుబడులు సైతం రాని వైనం
తీవ్రంగా నష్టపోతున్న రైతులుఅరటి పంట రైతుకు నష్టాల చేదును తినిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం అరటి రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఎక్కడికక్కడ ఎగుమతులు ఆగిపోయి అరటి ధర దారుణంగా పడిపోవడంతో పంటను కొనే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆ పంట రైతులు పొలాలను దున్నేసి మరో పంటసాగు వైపు మళ్లుతున్నారు. జహీరాబాద్ టౌన్: అరటికి అన్నీ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు పంట సాగు చేయగా గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పడిపోయాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసినా...కోతకు వచ్చే సరికి ధరలు పతనమయ్యాయి. రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. పండించిన పంటకు మద్దతుధర లేకపోగా కొనేవారు కరువయ్యారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అరటి ధరలు ఒక్కసారిగా పతనమైనట్లు తెలుస్తోంది. సొంత పొలం ఉన్న వారికే నష్టాలు వస్తుంటే..ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అరటి కొనేవారు దొరకక గెలలు చెట్లమీదే పండుకు వస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి చేతికిరాక విలవిల్లాడుతున్నారు. సాగుకు అనుకూలమైన వాతావరణం జిల్లాలో అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నల్ల, ఎర్రటి నేలలు పంట సాగుకు అనుకూలం కావడంతో జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్కల్, గుమ్మడిదల, కొండాపూర్ తదితర మండలాల్లో రైతులు అరటి సాగు చేశారు. జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి పంట ఉండగా ఒక్క జహీరాబాద్ డివిజన్లోనే సుమారు 500 ఎకరాల్లో పంట సాగవుతోంది. మేలైన రకాలు టిష్యూకల్చర్ మొక్కలను నాటడంతో పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరానికి 20 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కోతకు వచ్చే సరికి ధరలు పతనం అరటి కోతకు వచ్చే సరికి ధరలు పతనమవడం ప్రారంభమైంది. నవంబర్ నెల నుంచి ధరలు పడిపోగా రంజాన్ మాసంలో పర్వాలేదనిపించింది. నెల రోజుల నుంచి మళ్లీ ధరలు పూర్తిగా పడిపోయాయి. రంజాన్ నెలలో టన్నుకు రూ.15 వేలం నుంచి 18 వేలు ధర పలుకగా ఇప్పుడు ఒక్కసారిగా టన్ను రూ.3 వేలకు పడిపోయింది. మహారాష్ట్రలో ఈసారి పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, అమెరికా–ఇరాన్– ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం మొదలై గల్ఫ్ దేశాలకు విస్తరించడంతో అరటి ఎగుమతులు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో మార్కెట్కు పంట పెద్ద ఎత్తున మార్కెట్కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయి ధరలు పడిపోయాయి. గతంలో వ్యాపారులు పొలం వద్దకు వచ్చి గెలల కోసం ముందే అడ్వాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి తిరగబడి రైతులే వ్యాపారుల వద్దకు వెళ్లి అరటి పంటను కొనాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది రైతులు అరటిపంటను కొనేవారు లేకపోవడంతో పంటను దున్నేస్తుండటం కలచి వేస్తోంది. రూ.3 లక్షల నష్టం బూచినెల్లి గ్రామ శివారులో భూమి కౌలుకు తీసుకుని రెండెకరాల్లో అరటి సాగు చేశా. కౌలుతో పాటు పంట సాగు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశా. పంట కోతకు వచ్చే సమయానికి ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. కొనేవారు లేక పంటను దున్నేశా. దీంతో తనకు రూ.3 లక్షల నష్టం వచ్చింది. అదే బహిరంగ మార్కెట్లో మాత్రం వ్యాపారులు డజను రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వాలు స్పందించి అరటికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – నాగేశ్వర్రావు, కౌలు రైతు,బూచినెల్లి -
ఊరిస్తోన్న అల్లం పంట
జహీరాబాద్: రెండేళ్లుగా అల్లం సాగుపట్ల విముఖంగా ఉన్న రైతులు తిరిగి పంట వేసేందుకు పట్ల ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో ధర పెరుగుతుండటమే కారణంగా తెలుస్తోంది. దీంతో జహీరాబాద్ ప్రాతంలో పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. గత రెండేళ్ల కాలంగా మార్కెట్లో ధరలు లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. క్వింటాల్ ధర రూ.2వేలు మాత్రమే పలికింది. దీంతో పెట్టుబడులు కూడా రాకపోవడంతో సాగు పట్ల నిరాసక్తత చూపుతూ వచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ధర పెరగడంతో భవిష్యత్తులో కూడా ఇదే ధర ఉండే అవకాశం ఉందనే అంచనాతో రైతులు అల్లం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ.4వేల నుంచి రూ.4,500 ధర పలుకుతోందని రైతులు పేర్కొంటున్నారు. ఇంతమేర ధర ఉంటే ఎంతో కొంత గిట్టుబాటవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఎనిమిది నెలల నుంచి... ఎనిమిది నెలల నుంచి క్రమంగా అల్లం ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మే నుంచి జూన్ నెలాఖరు వరకు రైతులు అల్లం పంటను సాగు చేసుకుంటారు. ప్రస్తుతం పంట సాగు కోసం భూములను చదును చేసి, సేంద్రీయ ఎరువులను చల్లి భూములను సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది జిల్లాలో కేవలం 500 ఎకరాల్లో పంట సాగు కాగా, ఈ ఏడాది మాత్రం ఇది 2వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి విత్తనం కొనుగోలు రైతులు కేరళ రాష్ట్రం నుంచి అల్లం విత్తనం కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చే విత్తనం నాణ్యంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. కేరళ నుంచి తీసుకువస్తున్న విత్తనం క్వింటాల్ ధర రూ.7,500లకు కొనుగోలు చేసుకుంటున్నట్లు వారు వివరిస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతానికి ఇప్పటికే కేరళ నుంచి 500 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులు దిగుమతి చేసుకున్నారు. పలువురు రైతులు మాత్రం స్థానికంగా సాగులో ఉన్న పంటలోని కేరళ రకం విత్తనాన్ని సేకరించుకుని విత్తనం కోసం నిల్వపెట్టుకుంటున్నారు. ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చని అల్లం పంటను సాగు చేసుకుంటే రెండేళ్ల వరకు పంటను అమ్ముకునే వీలుంటుంది. మార్కెట్లో ధర లేనప్పుడు నీటి తడులు ఇవ్వడం ద్వారా పంట భూమిలోనే నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న పంటకు తిరిగి మొలకలు వచ్చి పంట విస్తరించి దిగుబడులు రెట్టింపవుతాయి. దీంతో ధర ఉన్నప్పుడు పంటను అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో అల్లం పంటను సాగు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధర పెరుగుదలతోరైతుల్లో ఆశలు ప్రభుత్వం ప్రోత్సాహం అల్లం పంటను వేసుకుంటున్న రైతులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తున్నాం. విత్తనం కోసం కొంతమేర సబ్సిడీ ఇస్తున్నాం. రైతులు విత్తనం బిల్లులు భద్రంగా పెట్టుకుని దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి మంజూరు రాగానే సబ్సిడీ అందజేస్తాం. – సోమేశ్వరరావు, జిల్లా ఉద్యాన వన అధికారి, సంగారెడ్డి -
పారిశుద్ధ్యం పక్కదారి
సంగారెడ్డి జోన్: జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారుల వెంట ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. రోడ్లకిరువైపులా చెత్తను వేస్తుండటంతో ఆ ప్రదేశాలు డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నాయి. ఫలితంగా ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణాలు దుర్గంధాల మధ్య ప్రజలు తమ రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పారిశుద్ధ్య సిబ్బందిగానీ, అధికారులు గానీ అటుగా కన్నెత్తి చూడటంలేదు. రహదారుల పక్కనే చెత్త డంపింగ్ పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల నిర్వాహకులు చెత్తను తీసుకొచ్చి రహదారుల పక్కనే డంపింగ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్ నుంచి ముంబై జాతీయ రహదారి ఉంది. పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు జిల్లా సరిహద్దు ఉంటుంది. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్, జహీరాబాద్ పట్టణ శివారులో ఉన్న జాతీయ రహదారి పక్కన ప్లాస్టిక్ కవర్లు, వ్యర్ధాలు, చెత్తను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కల మధ్య పాలిథిన్ కవర్లు నిండిపోతున్నాయి. అదేవిధంగా చెత్తకుప్పలకు నిప్పు పెట్టడంతో వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భరించలేని దుర్వాసన సంగారెడ్డి, సదాశివపేట పరిధిలో ఉన్న జాతీయ రహదారి పక్కన కూలిన కూరగాయలు, వివిధ రకాల పండ్లు, ఇతర వ్యర్ధాలు పడేస్తున్నారు. వాటిని తొలగించకపోవడంతో భరించలేనిస్థాయిలో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తను తొలగించే పనులు చేయించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రహదారి నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి జిల్లాలో ఉన్న రహదారుల నిర్వహణపై కలెక్టర్ ప్రతీక్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదాల నివారణపై ఇటీవల సమీక్ష నిర్వహించి జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారుల ఇరువైపున చెత్తను తొలగించాలని ఆదేశించారు. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినా ఆయన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుండటం పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికై నా చెత్తను తొలగించి రహదారుల నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. జాతీయ రహదారి పక్కనేచెత్తకుప్పలు డంపింగ్ చేస్తున్నా పట్టించుకోనిఅధికారులు -
సమష్టి కృషితోనే 22 అవార్డులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు -
భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత
గజ్వేల్: భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని భగవాన్ శ్రీసత్యసాయిబాబా మందిరం ఆవరణలో ఆదివారం రాత్రి ‘సనాతన సారధి’ అనే అంశంపై మాట్లాడారు. భగవంతుడిని స్మరించడం వల్ల మానసికశాంతి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న కార్యక్రమాలను పూర్తి చేసేవరకు ఆపవద్దన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు -
7న మామిడి ఫలాల వేలం
ములుగు(గజ్వేల్): ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 7వ తేదీన మామిడి ఫలాలవేలం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు పాటకు ముందుగానే రూ.5వేల నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో నెగ్గిన వారు మొత్తంలో సగం డబ్బులను నగదుగా చెల్లించాలని, లేకుంటే అతని పాటను రద్దు చేసి రెండో వ్యక్తికి అనుమతిస్తామని చెప్పారు. వేలంలో నెగ్గిన వారు మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతనే పంట కోసేందుకు అనుమతిస్తామని చెప్పారు. మామిడి వేలం కాలపరిమితి జూన్ నెల 15 వరకు ముగుస్తుందన్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
మొయినాబాద్రూరల్: ద్విచక్రవాహనాల దొంగలను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెలలో జరిగిన చోరీ కేసుల విషయంలో నిందితులను స్థానిక పోలీసులు గాలిస్తుండగా ఆదివారం మొయినాబాద్–సురంగల్ బైపాస్ వద్ద ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని వాహనంపై మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం గోవింద్పల్లికి చెందిన రామకృష్ణ, అదే మండలానికి చెందిన విజయ్కుమార్ సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. మొయినాబాద్లో నాలుగు, చేవెళ్ల, కూకట్పల్లిలో ఒకటి చొప్పున బైక్లు అపహరించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆరు బైక్లతో పాటు నిందితులను అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు మొయినాబాద్ సీఐ మల్లికార్జున్రెడ్డి, క్రైం సీఐ ఉపేందర్, డీఎస్ఐ సుభాష్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని యూసుఫ్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన శ్రీరాం సాయిలు భార్య అనుసూయ ఏడాది క్రితం క్యాన్సర్తో చనిపోయింది. ఇతనికి కూతురు, కొడుకు ఉన్నారు. ఇటీవలె కూతురు పెళ్లి చేశాడు. అయితే కొంత కాలంగా భార్య లేకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఉదయం పొలం వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. కొడుకు సాయిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో.. వర్గల్(గజ్వేల్): ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని తున్కిఖాల్సా లో చోటు చేసుకుంది. గౌరారం ఏఎస్ఐ రుక్కమ్మ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తుడుం వెంకటేశ్(30)కు భార్య నందిని, తొమ్మిదేళ్లలోపు తేజస్విని, అవంతిక, వెన్నెల ముగ్గురు కుమార్తెలున్నారు. వ్యవసాయం, కూలీపనుల తో దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఏడాది క్రితం వారు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి రూ.10 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు భారంగా మారడం, ఆర్థిక ఇబ్బందులతో వెంకటేశ్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి ఝరాసంగం(జహీరాబాద్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... జీర్లపల్లి గ్రామానికి చెందిన సంగప్ప (52) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వల తీసుకొని వెళ్లాడు. చెరువులో వేసిన వల ప్రమాదవశాత్తు కాలికి తగిలి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. -
పంట మార్పిడితో రోజువారీ ఆదాయం
● ఆసక్తి కనబరుస్తున్న రైతులు ● రైతు బజార్ ఏర్పాటుకు డిమాండ్ సంప్రదాయ పంటలైన వరి, పత్తి తదితరాలు సాగు చేసి దిగుబడులు రాక నష్టపోతున్న రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే రోజువారీ ఆదాయం లభించే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్ల దాడి ఇలా ప్రతికూల పరిస్థితులతో సంప్రదాయ పంటలు నష్టాలు మిగులుస్తుండగా... కూరగాయలు మాత్రం సిరులు కురిపిస్తున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. –అక్కన్నపేట(హుస్నాబాద్)అక్కన్నపేట మండలంలోని ధర్మారం, తుర్కనవానికుంట, కపూర్నాయక్ తండా, మైసమ్మ వాగుతండా, గండిపల్లి, శ్రీరాం తండా, రామవరం, గౌరవెల్లి, గుబ్బడి, పోతారం(జే), గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా శ్రీరామ్ తండా గ్రామపరిధిలోని బోరింగ్తండాకు చెందిన రైతు భూక్య రాజునాయక్ ఎకరంలో ఎనిమిది రకాల కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. టమాట, పచ్చిమిర్చి, వంకాయ, కాకర, బెండకాయ, క్యాబేజీ, సొరకాయలతో పాటు పలురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. మండలంలోని ధర్మారం, మసిరెడ్డి తండా, కపూర్నాయక్ తండా, తుర్కనవానికుంట గ్రామాలు కూరగాయలతో పాటు కొత్తిమీర సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. అయితే, పండించిన కూరగాయ పంటలను హుస్నాబాద్, కరీంనగర్, సిద్దిపేట పట్టణాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకుంటున్నారు. మార్కెట్లకు తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం లేక కొంతమంది రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కాగా అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే చాలా గ్రామాల్లో కూరగాయల పంటలు పండించడానికి రైతులు ముందుకొస్తారని పలువురు రైతులు చెబుతున్నారు. కూరగాయల సాగు మేలు.. నేను ఐదేళ్లుగా ఎకరంలో పలురకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. రోజు రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఆదాయం వస్తుంది. గండిపల్లి, రామవరం, బొత్తలపర్రె, హుస్నాబాద్ వారాంతపు సంతల్లో తీసుకెళ్లి అమ్ముకుంటున్నా. కూలీల ఖర్చు కూడా ఉండదు. మండల కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే అనేక మంది రైతులు కూరగాయల సాగు వైపు అడుగులు వేస్తారు. – భూక్య రాజునాయక్, బోరింగ్తండా, ఉప సర్పంచ్ -
పేకాట రాయుళ్ల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మండల పరిధిలోని రేజింతల్ గ్రామానికి చెందిన పలువురు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారు. విశ్వసనీ య సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురి ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,150, మూడు సెల్ఫోన్లు, పేకాట ముక్కల ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వ్యక్తి అదృశ్యం జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన కోహీర్ మండలంలో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ వివరాల ప్రకారం... వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలాలి నర్సింహులు గౌడ్(45) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సెల్ఫోన్ రిపేర్ చేయించుకుంటానని గత నెల 30న ఉదయం ఇంటి నుంచి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాడు. మధ్యాహ్నం భార్య సత్యమ్మ ఫోన్ చేయగా టౌన్లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. తరువాత ఆయన ఫోన్ కలువకపోగా చీకటి పడినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో భార్య సత్యమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ మెడలో బంగారు చైన్ చోరీరాయికోడ్(అందోల్): మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగుడు తెంపుకెళ్లాడు. ఈ ఘటన మండలంలోని రాయిపల్లి శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకిరణ్ వివరాల మేరకు... ఔరంగానగర్కు చెందిన కే.లక్ష్మి రాయిపల్లి గ్రామ శివారులో గొర్రెలు మేపుతోంది. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆమెతో మాటామాట కలిపి కళ్లలో కారంపొడి కొట్టి మెడలో ఉన్న 30 గ్రాముల తాళిబొట్టు లాక్కొని వెళ్లాడు. సదరు చైన్ స్నాచర్ లైట్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు , సర్జికల్ మాస్క్ ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కారు పల్టీ..ఇద్దరికి స్వల్ప, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు హుస్నాబాద్రూరల్: పందిళ్ల బ్రిడ్జి దగ్గర ఆదివారం ప్రమాదవశాత్తు కారు పల్టీలు కొట్టగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం... రాములపల్లికి చెందిన గంగం శ్రీధర్రెడ్డి కుటుంబంతో హైదరాబాద్లో ఉంటున్నాడు. స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత కారు అదుపుతప్పి రోడ్డు కిందివైపు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రెడ్డి, అతని భార్య దివ్యతేజ, కొడుకు నిహారెడ్డి, కూతురు శ్రీనికకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో హుస్నాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.తీవ్రగాయాలైన దివ్యతేజ, నిహారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. హార్వెస్టర్లో పడి.. తెగిన రైతు కాలివేళ్లు కౌడిపల్లి(నర్సాపూర్): హార్వెస్టర్ మిషన్లో ప్రమాదవశాత్తు రైతు జారి పడటంతో కాలి వేళ్లు కట్ అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని దేవులపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు వరికోత మిషన్ ద్వారా వరి కోస్తుండగా అదేగ్రామానికి చెందిన గడ్డమీది శ్రీశైలం మిషన్ కోసం వెళ్లి హార్వెస్టర్పై కూర్చున్నాడు. ఈ క్రమంలో అతడి కాలు చైన్లో పడటంతో ఐదువేళ్లు కట్ అయ్యాయి. దీంతో బాధితుడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
స్కిల్వేసవి
శ్రామిక జన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలుజహీరాబాద్ టౌన్: వేసవి రావడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది పిల్లలు బంధువుల ఇళ్లకు మరి కొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లారు. ఇంకొందరు వేసవి శిబిరాల్లో చేరి తమ ప్రతిభను మరింత పెంచుకుంటున్నారు. జహీరాబాద్ శ్రామిక జన విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ నిర్వాహకులు ‘వేసవి పిల్లల జాతర’ పేరిట వేసవి శిబిరాలను ప్రారంభించారు. ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తూ పిల్లలకు పలు అంశాల్లో తర్ఫీదును ఇప్పిస్తున్నారు. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 10 వరకు.. ఎప్రిల్ చివరి వారంలో ప్రారంభమైన ఉచిత శిక్షణ శిబిరాలు మే 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. జహీరాబాద్ నియోజవకర్గంలోని జహీరాబాద్ టౌన్, రాయికోడ్, ఝరాసంగం, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లోని 22 గ్రామాల్లో శిబిరాలు నడుస్తున్నాయి. ప్రతి సెంటర్లో 30 మంది వరకు పిల్లలు ఉన్నారు. శిక్షణ తరగతుల్లో ఆర్ట్స్ అండ్ క్రాప్ట్, గణిత నైపుణ్యం, పెయింటింగ్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, మట్టితో బొమ్మల తయారీ, పజిల్స్ పరిష్కారం, పేపర్తో కళాకృతుల తయారీ తదితర అంశాలపై నిపుణులు నేర్పిస్తున్నారు. పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి.. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్కు పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉచిత శిబిరాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించే శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. దీంతో శిక్షణ కేంద్రాలను కూడా పెంచాం. వేసవి శిబిరాల వల్ల పిల్లల్లో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తల్లిదండ్రులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను సెంటర్లకు పంపించాలి. –డాక్టర్ విజయలక్ష్మి, నిర్వాహకురాలు -
పర్కపెల్లి యాదగిరి కథకు బహుమతి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ (అరసం) మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, పెదపరిమి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో జిల్లాకు చెందిన పర్కపెల్లి యాదగిరి రచించిన ‘‘బతుకుసాక’’ కథకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ విషయాన్ని వెన్నెల సాహితీ సంగమం జిల్లా అఽధ్యక్షుడు కొండి మల్లారెడ్డి ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఈ నెల 23, 24తేదీల్లో జరగబోయే అరసం సభలలో బహుమతి అందుకోనున్నారని పేర్కొన్నారు. పర్కపెల్లి యాదగిరి వెన్నెల సాహితీ సంగమం సిద్దిపేట ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆయన కథకు బహుమతి రావడంపై జిల్లా కవులు వంగర నరసింహారెడ్డి, జీడిపల్లి రాంచందర్ రావు, వంగా గాలిరెడ్డి, రాజు, అశోక్ రాజు, మహమూద్ పాషా, మహేందర్ రెడ్డి, మోహన్, త్రివిక్రమ శర్మ, మహిపాల్, ఉమాశంకర్, యేసురాజు, మహేందర్, రాజు అభినందించారు. -
క్రీడల్లో నైపుణ్యం సాధించాలి
● వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం కౌడిపల్లి(నర్సాపూర్): క్రీడల్లో నైపుణ్యం సాధించా లని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వం, యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాల ను ఏర్పాటు చేస్తుంది. ఆదివారం మండల కేంద్రమైన కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఉపసర్పంచ్ శ్వేత ప్రారంభించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించే శిక్షణలో 14 ఏళ్లలోపు పిల్లలు పాల్గొని క్రీడానైపుణ్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య పటేల్, దేవేందర్, నాగరాజు, వీరేశంగౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
చిప్ప చేతపట్టుకొని ఎందుకొస్తున్నారు?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /సంగారెడ్డి ఎడ్యుకేషన్ /మెదక్జోన్: కాంగ్రెస్ మంత్రులు, సీఎం నిధులు ఇవ్వాలని చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. ఇక్కడికి వచ్చి నిధులు ఇస్తలేరని తిడుతున్నారని, కేంద్రం వద్దకు మరి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశం కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని కందిలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో, మెదక్కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో నడుస్తోందన్నారు. దేశంలోనే ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణ నుంచి కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు. అలాగే రాష్ట్రానికే ఎక్కువ యూరియాను కేంద్రం కేటాయిస్తోందని వివరించారు. యుద్ధ సంక్షోభం సమయంలోనూ పెట్రోల్ ధరలు పెంచని ఏకై క దేశం ఇండియానే అన్నారు. మహిళా బిల్లు రావడం కాంగ్రెస్కు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. ఈ నెల 10న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని, పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే బాల్రాజు, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి అబయ్ పటేల్, మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, విజయ్కుమార్, రంజిత్రెడ్డి, శివ, ప్రసాద్ పాల్గొన్నారు. -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి గ్రామ శివారులో గల హేమా ఇండస్ట్రీస్(ప్లైవుడ్)లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రావడంతో ఫైర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్లైవుడ్ రా మెటీరియల్స్, ఫిల్లింగ్, ఫ్లష్ డోర్లు, యంత్రాలతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పక్కనే ఉన్న గ్రీన్ క్రాఫ్ట్స్ కంపెనీకి కూడా మంటలు వ్యాపించి అక్కడి యంత్రాలు, స్టాక్తోపాటు ఇతర సామగ్రి దగ్ధమైంది. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. మల్లుపల్లిలో పూరిగుడిసె దగ్ధం..చిన్నశంకరంపేట(మెదక్): అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం గ్రామానికి చెందిన అరికెల రమేశ్ నివాస గుడిసె షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎగిసిపడిన మంటలతో పూర్తిగా పూరిగుడిసె దగ్ధమైంది. మెదక్ నుంచి ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను పూర్తిగా ఆర్పారు. ఈ సంఘటనలో తులంన్నర బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదు, బియ్యం, బట్టలు, సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంభ సభ్యులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో గడ్డివాము.. మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేక లక్ష్మణ్ పశుగ్రాసం కోసం తన పొలంతో పాటు ఇతర రైతులను నుంచి సేకరించిన గడ్డిని కట్టలు చుట్టి బావి వద్ద పెట్టాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో గడ్డి వాము కాలిపోయింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రత్నించినా అదుపులోకి రాకపోవడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. -
‘మధురమ్మ’ ఇక జ్ఞాపకమే
శతాధిక వృద్ధురాలు మృతి నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తెల్లవారు జామున తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. వందేళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్న మధురమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు. -
పాతాళానికి గంగ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో భూగర్భ జల మట్టం పడిపోయింది. గత నెల మార్చితో పోలిస్తే ఏప్రిల్లో సగటున 1.30 మీటర్ల మేరకు నీటి మట్టం తగ్గింది. మార్చిలో జిల్లా సగటు నీటి మట్టం 10.60 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 11.90 మీటర్ల లోతుకు పడిపోయింది. అత్యధికంగా సదాశివపేట మండలంలో 3.27 మీటర్లు పడిపోయినట్లు తేలింది. అలాగే పటాన్చెరు మండలంలో 2.74 మీటర్లు, రామచంద్రాపురం మండలంలో 2.46 మీటర్ల మేరకు నీటిమట్టం తగ్గినట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, మారుమూల మండలం మనూరులో కూడా 2.21 మీటర్ల తగ్గుదల కనిపించింది. కోహీర్లో 1.95 మీటర్లు తగ్గాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదు.. భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణమని భూగర్భ జలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 44 సెల్సీయస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండల తీవ్రతతో భూమి వేడెక్కి నీటిమట్టాలు పడిపోతున్నట్లు తేలింది. అయితే ఎండాకాలంలో భూగర్భ జలాలు పడిపోవడం సాధారణమేనని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే భూగర్భ జలాలను వృథా చేయవద్దని, ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.రెండు మండలాల్లో పెరుగుదల.. జిల్లాలో ఏడు మండలాల్లో భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. గతేడాదితో పోల్చితే ఈ మండలాల్లో అత్యధిక స్థాయిలో నీటిమట్టాలు తగ్గుతున్నట్లు తేలింది. గుమ్మడిదల, హత్నూర, కల్హేర్, కంగ్టి, నిజాంపేట, పటాన్చెరు, సంగారెడ్డి మండలాల్లో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు పడిపోయాయి. సంగారెడ్డి విషయానికి వస్తే గత నెల మార్చితో పోల్చితే 2.22 మీటర్లు పెరిగినప్పటికీ.. గతేడాది పోల్చితే భారీగా తగ్గడంతో ప్రమాదకరస్థాయి మండలాల జాబితాలోకి చేరింది. అలాగే తీవ్రంగా పడిపోయిన మండలాలు పది ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో పడిపోయిన ఈ ఏడు మండలాల కంటే ఈ పది మండలాలు కాస్త తక్కువ పడిపోయాయి. ఇందులో ఆందోల్, చౌటకూర్, జిన్నారం, కంది, కోహీర్, కొండాపూర్, మొగుడంపల్లి, న్యాల్కల్, రామచంద్రాపురం, సిర్గాపూర్లు మండలాలున్నాయి.జిల్లాలో సగటున 1.30 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలుజిల్లా వ్యాప్తంగా భూగర్భ నీటి మట్టం పడిపోతే సంగారెడ్డి, చౌటకూర్ మండలాల్లో మాత్రం కాస్త పెరగడం గమనార్హం. మార్చితో పోల్చితే ఏప్రిల్లో సంగారెడ్డి మండలంలో 2.22 మీటర్లు పెరిగాయి. మార్చిలో 18.85 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ఏప్రిల్కు వచ్చేసరికి 16.63 మీటర్లకు వచ్చాయి. చౌటకూర్లో 2.41 మీటర్ల మేరకు పైకి వచ్చాయి. చౌటకూర్లో మార్చిలో 14.63 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఏప్రిల్ నాటికి 12.22 మీటర్లకు పెరిగింది. ఇంత ఎండాకాలంలోనూ ఈ రెండు మండలాల్లో నీటిమట్టం పెరగడానికి ప్రధానంగా ఇటీవల కురిసిన అకాల వర్షమే కారణమని చెబుతున్నారు. -
అర్హులకే పథకాలు అందాలి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికే అందేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాసమస్యలపరిష్కారమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రగతి ప్రణాళికను సిద్ధం చేయాలని అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టడంతోపాటు పనులు సైతం నాణ్యతగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ దారం శంకర్, ఖేద్ తహసీల్దార్ హసీనాబేగం, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవల బదిలీ అయిన కమిషనర్ జగ్జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాల
● జోగిపేట ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ● సింగూరు పర్యాటక కేంద్రంగాఅభివృద్ధికి కృషి ● మంత్రి దామోదర రాజనర్సింహజోగిపేట(అందోల్): అందోల్లో రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జోగిపేటలోని శ్రీ రామ గార్డెన్లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ అధ్యక్షత వహించారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యత నిస్తుందన్నారు. ప్రభు త్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అందోలులో తాను విద్య, వైద్య పరంగా హబ్లుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నర్సింగ్ కళాశాల, జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాలలు, 150 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు సింగూరు ప్రాజెక్టు కాలువ గూర్చి పట్టించుకోలేదని, తాను రూ.200 కోట్లతో కాలువల లైనింగ్ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, ప్రతి రోజు కనీసపం 4,5 వేల మంది పర్యాటకులు పర్యటించేలా, దీంతో 100 కుటుంబాలు బ్రతికేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు అందోల్లో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ తెలిపారు. అందోల్కు ఇరువైపులా 30 కి.మీ లోపు రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ లో ట్రామాకేర్ సెంటర్కు తీసుకువచ్చినట్లయితే నిమిషాల్లో చికిత్సలను అందజేస్తారని, 24 గంటలు ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రతీక జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, డిప్యూటీ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, డీఎంహెచ్వో వసంత్ రావునాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
వ్యసనాలకు లోనవ్వద్దు
అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి సంగారెడ్డి జోన్: చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..నేటి యువత రేపటి సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని చెడు వ్యసనాలకు లోనై జీవితాలను మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. బాధిత మహిళలకు సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలు అండగా పనిచేస్తున్నాయని పేర్కొ న్నారు. విద్యాసంస్థలు, పని ప్రదేశాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్లైన్ నంబర్లు 100, 112, 1930, 1098 లేదా జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772 కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ డా.ప్రకాశ్రావ్, సూపరింటెండెంట్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే నీట్
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు సంగారెడ్డి క్రైమ్: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ –2026 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ తెలిపారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా సంచరించవద్దని, పరీక్ష కేంద్రాల 100 మీటర్ల సమీపంలోని జిరాక్స్ షాపులు, స్టేషనరీలు తదితర దుకాణలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖేడ్ కమిషనర్గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణనారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా వి.ప్రశాంతి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్గా ఉన్న జగ్జీవన్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలుటీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సంగారెడ్డి: అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, ఆర్డీఓ రాజేందర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు ,సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దుమార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొప్పుల లక్ష్మి వట్పల్లి(అందోల్): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొప్పుల లక్ష్మి సూచించారు. మండల పరిధిలోని బిజిలీపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి ధ్యాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. క్వింటాలుకు వరి ధన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధరను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంగప్ప, సీసీలు జనార్ధన్, నిరంజన్, మాణెమ్మ, నాయకులు నర్సింహులు, సదానందంతోపాటు తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ పార్లర్లో మహిళలకు ఉచిత శిక్షణసంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్లో ఈ 11వ తేదీ నుంచి 35 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేశ్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం కల్పించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 9490103390 నంబర్కు సంప్రదించాలన్నారు. -
సీఎం కావాలన్న ఆశ లేదు
తెల్లాపూర్ సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ రామచంద్రాపురం(పటాన్ చెరు): ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తనకెప్పుడూ లేదని, జీవితంలో ఒక్కరోజైనా మంత్రి కావాలని అనుకున్నానని మంత్రి వివేక్ అన్నారు. తెల్లాపూర్ పరిధిలో ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల ఆర్థికాభివృద్ధికి ప్రతీ ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. తన వంతుగా విశాఖ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని వెల్లడించారు. నిరుపేద యువతకు వివిధ క్రీడల్లో ఉచిత శిక్షణను అందించాలన్న లక్ష్యంతో కొల్లూరి సత్తయ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడం, ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి దేశంలోని నిరుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ తదితర అంశాలపై ఉచితంగా వసతి కల్పించి శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. జర్మనీలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడి యువతకు జర్మన్ భాషపై పట్టు సాధించే విధంగా శిక్షణ అందించాలని కోరారు. కొల్లూరు సత్తయ్య మాట్లాడుతూ తమ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిరుపేదల విద్యార్థులకు ఉచితంగా వివిధ ఆటల్లో శిక్షణ అందించి క్రీడల్లో రాణించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కె.వి.రాజా, మాజీ కౌన్సిలర్ భరత్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
రూ.2.50 లక్షలు నష్టంన్యాల్కల్(జహీరాబాద్): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని టేకూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సిరూర్ ఈరన్న ఐదెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. కోత కోసిన పంటను రాసి చేసేందుకు ఒక దగ్గర కుప్పగా పోశాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి కుప్పగా పోసిన మొక్క జొన్నకు నిప్పంటుకుంది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పంట పూర్తిగా కాలిపోయింది. మొక్క జొన్నతో పాటు పొలంలో ఉన్న డ్రిప్ పైపులు కూడా కాలిపోయాయి. దీంతో రూ.2.50 లక్షలు నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశాడు. -
డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి
క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇప్పటివరకు జిల్లాస్థాయిలోనే కొనసాగిస్తుండగా తాజాగా ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్స్థాయిలోనూ నిర్వహించేందుకు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్ వరకు రాకుండానే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణిని నిర్వహించాలన్న నిర్ణయం పట్ల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – నారాయణఖేడ్: ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్ రెవెన్యూ డివిజన్లలో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది. నోడల్ అధికారిగా ఆర్డీవో జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండటం తెలిసిందే. కలెక్టర్తోపాటు జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటారు. ఆయా శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. ఇక రెవెన్యూ డివిజన్స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ ప్రజావాణికి డివిజన్ పరిధిలోని అన్ని శాఖల డివిజన్స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి. లేదంటే తిరస్కరణ, పెండింగ్కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి దరఖాస్తుదారుకు రశీదు అందజేస్తారు. దరఖాస్తు పరిస్థితిని ప్రజావాణి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.త్వరలో మండల స్థాయిలో ఇదే విధానం త్వరలో మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లా, రెవెన్యూ డివిజన్స్థాయిలో కొనసాగిన విధంగానే మండల స్థాయి అధికారులు నిర్వహిస్తారు. దీంతో ప్రజలు క్షేత్రస్థాయిలోనే తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలగనుంది. అలా కాని పక్షంలో డివిజన్, జిల్లా స్థాయికి వెళ్లే అవకాశముంది. -
టీఎఫ్టీ లైసెన్సులు మంజూరు చేయండి
సంగారెడ్డి టౌన్: గీత కార్మికులకు టీఎఫ్టీ లైసెన్సులను మంజూరు చేయాలని గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ డిమాండ్ చేసింది. శనివారం నిర్వహించిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆశన్నగౌడ్ హాజరై మాట్లాడారు. రెండేళ్ల నుంచి కల్లుగీత కార్మికులు 50 ఏళ్ల పైబడిన వారు అనేకమంది లైసెన్సులకు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం నేటికీ మంజూరు చేయలేదని మండిపడ్డారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆన్లైన్ మొత్తం బంద్ చేసి పెట్టారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే గీత కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛను రూ.4000కు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ -
ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జీగా తేజశ్రీ
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జీగా పట్లోళ్ల తేజశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు నూతన న్యాయమూర్తిని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. కాగా ఇప్పటివరకు ప్రతి శుక్రవారం కోర్టు కార్యకలాపాలు నిర్వహించేవారు. న్యాయమూర్తి తేజశ్రీ బాధ్యతలు చేపట్టడంతో ఇకపై పూర్తిస్థాయిలో కోర్టు కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో న్యాయవాదులు బాలకిషన్, శ్రీధర్రెడ్డి, మోహన్, కృష్ణస్వామి, వెంకటరామిరెడ్డి, నవరత్న, రఘునాథ్, రంజిత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా హిమబిందు నారాయణఖేడ్: నారాయణఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా హిమబిందు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీధర్ మంథనికి బదిలీకావడంతో ఆయన స్థానంలో హిమబిందును నియమించిన సంగతి తెలిసిందే. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రామచంద్రాపురం(పటాన్చెరు): కొల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ సర్కిల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని రాత్రి కొల్లూరు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తి వయస్సు 30ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతిడి ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, నీలిరంగు జీన్స్ప్యాంట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతిడి ఆచూకీ ఎవరికై నా తెలిస్తే కొల్లూరు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం
ఘనంగా కార్మికుల దినోత్సవం జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, పటాన్చెరు, జోగిపేట, న్యాల్కల్, హత్నూర, జిన్నారం, జహీరాబాద్ మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయుసీ, బీఆర్టీయూ, ఆయా పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యేలు, కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. – సాక్షి నెట్వర్క్:


