Sangareddy
-
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు..
● రోడ్డు ప్రమాదంలో మృతి ● జంగరాయిలో విషాదంచిన్నశంకరంపేట(మెదక్): మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని జంగరాయి గ్రామానికి చెందిన పడాల విఠల్, లక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు వర ప్రసాద్(30) ఆదివారం మధ్యాహ్నం పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. పెళ్లి దగ్గరపడటంతో సమీపంలోని గవ్వలపల్లి, అంబాజిపేట, శంకరంపేటలో పత్రికలు ఇచ్చేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకరంపేట నుంచి మెదక్ వైపు వెళ్తుండగా అంబాజిపేట వద్ద కుక్క అడ్డు రావడంతో స్కూటీ అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టాడు. దీంతో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని మెదక్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 10న వాయిదా పడిన పెళ్లి... ఈ నెల 10న వరప్రసాద్ పెళ్లి జరగాల్సి ఉండగా అమ్మాయి దగ్గరి బంధువు మృతి చెందడంతో వాయిదా పడింది. తిరిగి 23న పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్మెన్ మృతి కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై లైన్మెన్ ప్రాణాలు కోల్పో యాడు. ఈ విషాద ఘటన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హుస్నాబాద్కి చెందిన భూక్య సురేశ్(40) విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలోని వ్యవసా య బావుల వద్ద విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండటంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వరికోతలు పూర్తి కావడంతో ఆదివారం విద్యుత్ తీగలను సరిచేసేందుకు అతడు వెళ్లాడు. లైన్ క్లియరెన్స్ తీసుకొని స్తంభంపై పని చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ రావడంతో షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
డీలిమిటేషన్ బిల్లు సమంజసం కాదు
● అక్రమంగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ నిరసన ● ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ, డీ లిమిటేషన్ బిల్లులను అక్రమంగా ప్రవేశపెట్టిందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ మూడు బిల్లులను అక్రమంగా ప్రవేశపెట్టిందన్నారు. హిందీ రాష్ట్రాల్లో 300 పైచిలుకు ఎంపీ స్థానాలను పెంచుకొని, దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 100 సీట్లు పెంచి.. ఎప్పటికీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండాలన్న తెరవెనుక కుట్రలో భాగమే డీలిమిటేషన్ అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సీఎం మద్దతును కూడగట్టి కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంట్లో వీగిపోయేలా చేయడంలో కీలకపాత్ర వహించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు యువరాజ్, రవి ముదిరాజ్ ,సాయిలు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చల్లదనాన్ని ఇస్తున్నాయి
పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెద్దగా పెరిగి చల్లదనాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నాం. మంచి వాతావరణంలో చదుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ప్రతీక్–విద్యార్థి, జెడ్పీహెచ్ఎస్–చీకూర్తిప్రతీ ఏటా మొక్కలు నాటుతాం ప్రతి ఏటా జిల్లాలోని అన్ని ప్రభుత్వ బడుల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పాడైన మొక్కల స్థానంలో మళ్లీ కొత్త మొక్కలు నాటుతున్నాం. నాటినవి పాడైపోకుండా ఉండేందుకు నీటిని అందిస్తున్నాం. గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాయి. ఆ చెట్ల నీడలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి -
అమ్మో.. నిమ్మ
నారాయణఖేడ్: నిమ్మకాయ ధరలు కొండెక్కాయి. వేసవి కాలం కావడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ధరలు పెరిగాయి. సాధారణంగా కిలో నిమ్మ కాయలు రూ. 30 నుంచి రూ.50 వరకు పలుకగా నారాయణఖేడ్లో ఆదివారం కిలో రూ.200 పలికాయి. ఒక్కో నిమ్మకాయను రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ రూ.10కి రెండు, మూడు చొప్పున విక్రయించిన వ్యాపారులు ప్రస్తుతం రూ.10కి ఒక్కటి చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా చెట్లకు కాత తక్కువగా ఉండటం మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో వీటి ధరలు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నిమ్మకు సైతం ధర అధికంగా ఉండటంతో వ్యాపారులు ధరలను పెంచి విక్రయిస్తున్నారు. -
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సంగారెడ్డి ప్రధాన రహదారిపైఏరులై పారుతున్న మురికినీరుసంగారెడ్డి/నారాయణఖేడ్/ఝరాసంగం: జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేల కూలాయి. సంగారెడ్డిలో భారీ వర్షం కురవగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంబడి మొత్తం నాళాలు ఉప్పొంగి మురికి నీరు రోడ్లపై ప్రవహించింది. ఖేడ్లో ఉదయం ఎండ వేడిమి కనిపించినా ఖేడ్ ప్రాంతంలో మధ్యాహ్నాం 3 గంటలకు వర్షం మొదలైంది. సుమారు అరగంటపాటు ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది. ఖేడ్– హంగిర్గా శివారులో పలు చెట్లు నేలకూలాయి. ఖేడ్ మండలంలోని నాగల్ గిద్దలో 11.5, ఖేడ్లో 4.3, సంగారెడ్డి 29.3, కొండాపూర్ 24, జిన్నారం 20.8, హత్నూర 18.3, అమీన్పూర్ 14.0, కంది 12.5, గుమ్మడిదలలో 6.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఝరాసంగం, జీర్లపల్లి, బొప్పాన్ తదితర గ్రామాల్లో బలమైన ఈదురుగాలులు వీచి భారీ వృక్షాలు నేలకూలాయి. ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. వాతావరణంలో మార్పులు.. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వర్షాలు కురిసినా పలు ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవని పేర్కొంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కురుస్తున్న వర్షం -
రెవెన్యూ లీలలు
‘పేట’తహసీల్ అవినీతిమయంపైసా వసూల్... జిల్లాలో రెవెన్యూలో కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. మండలాల్లో తహసీల్దారు కార్యాలయానికి భూ సమస్యల పరిష్కారం కోసం వెళ్లేవారిని కొందరు ఉద్యోగులు డబ్బుల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ప్రతీ పనికి పైసలు చేతిలో పడితేనే ఫైలు ముందుకు కదులుతోంది. లేదంటే రకరకాల కొర్రీలు పెట్టి నెలల తరబడి ఆ ఫైళ్లు మూలకు చేరిపోవడం బహిరంగ రహస్యమే. గతంలో సదాశివపేటలో పని చేసిన పలువురు రెవెన్యూ అధికారులు భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి రియల్టర్ల వద్ద భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన అధికారుల తీరుతో ప్రస్తుతం మండల, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు కొత్తగా రావడంతో వారు ప్రతీ ఫైల్ను తిరిగి నిశితంగా పరిశీలిస్తుండటం, తిరిగి దరఖాస్తులు చేసుకోమనడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో నకిలీ పౌతి మార్పు జరిగిన నందికంది శివారులోని భూమితప్పు చేయడం... సరిదిద్దడం సదాశివపేట రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. ఎంతమంది పాలకులు మారినా.. రెవెన్యూ శాఖలో అవినీతికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఏ పని జరగాలన్నా ఆయా ఉద్యోగులస్థాయిని, సంబంధిత పనినిబట్టి లంచం డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నా, కేసులు నమోదవుతున్నా. లంచాలు తీసుకోవడానికి మాత్రంజంకడం లేదు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): సదాశివపేట మండలంలోని నందికంది శివారులో ముంబై జాతీయ రహదారికి ఆనుకోని ఉన్న 298(అ) సర్వే నంబర్లో ఉన్న దాదాపు రూ. 100కోట్ల విలువ గల 9.13 ఎకరాల పట్టా భూమిపై భూ మాఫియా కన్ను పడిన విషయం తెలిసిందే. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశతో పట్టాదారు బతికి ఉండగానే మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రాలు, నకిలీ ఆధారాలను సృష్టించి పౌతి మార్పు కూడా చేసేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నకిలీ పౌతి జరిగినట్లు నిర్ధారించి తాజాగా పౌతి మార్పును రద్దు చేసి తిరిగి ఆ భూమిని అసలు పట్టాదారుడైన రవిశంకర్ పేరుమీదికి మార్చారు. గతంలోనూ ఇంతే... సదాశివపేట మండలంలో గతంలోను పలు అక్రమలావాదేవీలు జరిగా యి. ఇందులో మండలంలోని మరో రెండు గ్రామాల్లోను గతంలో నకిలీ పౌతి చేసేశారు. తర్వాత అసలు పట్టాదారులు వచ్చి గోల చేయడంతో దాన్ని సరిచేశారు. ఓ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి పేరిట వ్యవసాయేతర అవసరాల నిమిత్తం మార్పు చేశారు. కాగా, ఓ గ్రా మ పరిధిలో ఓ ఎన్ఆర్ఐకి చెందిన భూమికి నకిలీ వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేయడం జరిగింది. ఇలా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ పౌతిలు, మ్యూటే షన్, నకిలీ భూ యజమానుల పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేశారు. తప్పు చేయడం, సరిదిద్దుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఇ లాంటి అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, అదేవిధంగా భూ మాఫియాకు పాల్పడుతు న్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అక్రమ పౌతినిరద్దు చేసిన అధికారులు గతంలో నకిలీ పత్రాలు సృష్టించిపౌతి మార్పు అధికారులపై చర్యలు శూన్యంఅక్రమార్కులపై చర్యలేవి..? రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న భూ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భూ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నందికంది నకిలీ పౌతి వ్యవహారంలో దాదాపుగా రూ.3కోట్ల వరకు చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవహారంలో క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న జీపీవో(రెవెన్యూ)ను వదిలేసి కేవలం ఆర్ఐను సస్పెండ్ చేయడం, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్పై తూతూమంత్రంగా బదిలీ వేటు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఇంటర్లో అధిక మార్కులు..
విద్యార్థిని సన్మానించిన భవసార్ క్షత్రియ సమాజ్ సదాశివపేట(సంగారెడ్డి): ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి విద్యార్థిని శృతి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెతోపాటు తల్లిదండ్రులు అనిత, సంతోష్కుమార్ను ఆదివారం పట్టణంలోని భవాని మందిరంలో పట్టణ భవసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భవసార్ క్షత్రియ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు మాధురి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, అర్జున్, నర్సింగ్, త్రయంబక్, మాణిక్, తులసిదాస్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గురువులను గౌరవించాలి
ఎమ్మెల్యే చింత ప్రభాకర్సదాశివపేట(సంగారెడ్డి): జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎన్గార్డెన్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన 1982వ పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్ల తర్వాత విద్యార్థులు కలుసుకొని స్నేహితులు, గురువులతో కలిసి సమ్మేళనం నిర్వహించడం అభినందనీమయమన్నారు. అంతకుముందు ఒకరికొకరు చిన్ననాటి ఆటపాటలు స్నేహాన్ని గుర్తు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు శ్రీశైలం, ప్రభాకర్, బస్వరాజ్లను గౌరవించిన పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి సన్మానించి అభినందించారు. -
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
సంగారెడ్డి: మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ బీజేపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా బిల్లుకు, డీ లిమిటేషన్కు సంబంధం లేదని కానీ ఆ రెండింటినీ కలిపి బిల్లుగా పెట్టాలనుకున్న బీజేపీ కుట్రను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించేలా డీలిమిటేషన్ బిల్లు పేరిట బీజేపీ కేవలం ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి -
‘పాడి’తో ఉపాధి
జహీరాబాద్ టౌన్: పాల ఉత్పత్తులు రోజు రోజుకు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇంటి అవసరాలను సమకూర్చుకుంటూ మిగతా పాలను విక్రయిస్తున్నారు. ఆదాయం కూడా వస్తుండటంతో యువత పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమలతో సమూల మార్పు తీసుకొచ్చింది. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా గేదెలను పెంచుకుంటూ పాలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు. జహీరాబాద్లో వందకు పైగా డెయిరీలు.. జహీరాబాద్ ప్రాంతంలో సుమారు వంద వరకు డెయిరీ ఫాంలు ఉన్నాయి. షెడ్లు నిర్మించుకొని 20 నుంచి 30 వరకు పశువులను పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఒకటి రెండు గేదెలను పెంచుకుంటూ పాలను విక్రయిస్తున్నారు. డెయిరీల నిర్వాహకులు, రైతులు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీతో పాటు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు డెయిరీల వద్ద పాలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్క డెయిరీ ఫాంలో ప్రతి రోజు వంద లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. డెయిరీ నిర్వాహకులు లీటరుకు రూ. 70 చొప్పున అమ్మగా వ్యాపారులు లీటరుకు రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. గేదెలకు పచ్చిగడ్డి అవసరం కాగా డెయిరీ నిర్వాహకులు అక్కడే పశుగ్రాసం సాగు చేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు దాణా కూడా పెడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు.. అనేక కారణాల వల్ల పశుపోషణ భారంగా మారిందని, లాభాలు అంతంత మాత్రం వస్తున్నాయని కొంత మంది డెయిరీ నిర్వాహకులు వాపోతున్నారు. పాడి పశువుల ధరలు, పశుగ్రాసం సాగు, దాణ, గేదెల పోషణ, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయని పాడి రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాలు అమ్మినా గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా పోత్సాహకాలు అందడం లేదని డెయిరీ నిర్వాహకులు విష్ణు వాపోయారు. అలాగే స్థానికంగా ఉన్న డెయిరీ కంపెనీలు పాలను తీసుకోవడం లేదని తెలిపారు. లీటర్ పాలు రూ.వందకు అమ్మితే గిట్టుబాటు అవుతుందని చెప్పారు. -
ధర్మస్థాపనకు సంఘటితమవుదాం
పాపన్నపేట(మెదక్): హిందూ ధర్మస్థాపనకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని బ్యాతోల్ తిమ్మాయపల్లి గీతాశ్రమం శాంతానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం పాపన్నపేట లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి విజ్ఞాన భావాలను చూపిన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. యువతలో దేశభక్తి పెంపొందించాలని కోరారు. ధర్మం, సంస్కృతి, సమాజ నిర్మాణం వంటి అంశాలు ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్ మెదక్ జిల్లా కార్యవాహ ఓంకార్, మహిళా ఉపన్యాసకురాలు గంగాభవాని మాట్లాడారు. హిందూసమ్మేళన కార్యనిర్వహణ అధ్యక్షుడు దుర్గేశ్, విభాగ్ కార్యవాహ నాగభూషణం, సంఘ నాయకులు తోట రవి, దుర్గేశ్, మనోజ్, వివిధ గ్రామాలకు చెందిన హిందువులు పాల్గొన్నారు. -
తీవ్రమైన తెగుళ్లు
మిరప పంటకు తీవ్రమైన తెగుళ్లు ఏర్పడటంతో వివిధ రకాల మందులను పిచికారీ చేశాం. మూడు ఎకరాల్లో పంట సాగు చేశాను. పంటకు భారీగా పెట్టుబడి పెట్టినా అంతగా దిగుబడి మాత్రం రాలేదు. మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – రాయిపల్లి శివన్న అధికారుల సలహాలు తీసుకోవాలి మిరప పంటకు తెగుళ్లు రాకుండా ముందస్తుగా సంబంధిత వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పంట దిగుబడి కోసం అధికారులు సూచించిన మందులను వాడాలి. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
వ్యాయామ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
మెదక్జోన్: వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో వ్యాయామ ఉపాధ్యాయ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఈటీ జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల రాష్ట్ర పరిశీలకులుగా విద్యాసాగర్రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాగరాజు వ్యవహరించారు. కాగా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఏ.మధుసూదన్, జిల్లా కోశాధికారిగా, కే.మహిపాల్, మహిళా అధ్యక్షురాలిగా శారదను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి రమేశ్తో పాటు మాధవరెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఓపెన్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్, టెన్త్ ఓపెన్ విద్యార్థులకు సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 20వ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతికి 10 పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్కు 18 కేంద్రాలను కేటాయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 7,757 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు 5,065, పదోతరగతి విద్యార్థులు 2,692 మంది ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా పరీక్ష కమిటీలతోపాటు 03 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మొబైల్ పోలీస్ స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేందుకు అభ్యర్థులకు అవసరమైన తాగునీటి, వైద్య చికిత్సల నిమిత్తం ఏఎన్ఎమ్లతోపాటు వెలుతురులేమి సమస్య తలెత్తకుండా వుండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. పూర్తయిన ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ఇంటర్కు 18,టె న్త్కు 10 పరీక్ష కేంద్రాలు ఇవీ నిబంధనలు ఏర్పాట్లు పూర్తి చేశాం ఓపెన్ పరీక్షలను రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించాం. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ప్రతీ కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి -
మిర్చీకి తెగుళ్ల ఘాటు
భారీగా తగ్గిన దిగుబడి ● ఆదుకోని ప్రభుత్వంమునిపల్లి(అందోల్): వ్యవసాయం చేసే రైతన్న కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన, వాణిజ్య పంటల సాగు చేసినా అన్నదాతకు నష్టమే వస్తోంది. పంట దిగుబడి కోసం చేసిన కష్టమంతా చేనులోనే బూడిదవుతుంది. మిరప సాగు చేసిన రైతన్నలదీ ఇదే పరిస్థితి. తెగుళ్ల దెబ్బకు మిర్చి పంట చిన్నబోయింది. ఓ వైపు దిగుబడి రాక, మరో వైపు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. కష్ట, నష్టాలకు ఓర్చి మిరప సాగు చేస్తే తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు. విత్తనాల నుంచి పైరు సాగు వరకు రైతులు పంటకు వివిధ రకాల మందులను పిచికారీ చేశారు. కానీ పంట ఎదుగుదల ఉన్నా అంతగా పూత, కాత, కాయలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరప పంటకు సోకిన నల్లి తెగులు వల్ల వారానికి రెండు సార్లు రైతులు పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా దిగుబడి సరిగా రాక, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
జహీరాబాద్ టౌన్: దానాల్లో కెల్లా..రక్తదానం గొప్పదని, మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని పలువురు పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్త దానం చేసే దాతలు ఎంతో మంది ఉన్నారు. కొంత మంది అనేక సార్లు రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన రాష్ట్రీయ బసవదళ్ నాయకుడు బిరిదాస్ నగేశ్ ఆదివారం లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు. దీంతో ఆయన ఇప్పటి వరకు 11 సార్లు పైగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సామాజిక బాధ్యతని, తమ రక్తంతో మరొకరి ప్రాణం కాపాడామన్న తృప్తి కల్గుతుందన్నారు. కాగా ఆయనకు ఎమ్మెల్యే మాణిక్రావు సర్టిఫికెట్ అందజేసినట్లు తెలిపారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఎమ్మెల్యే గూడెం పటాన్చెరు: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సునీత కృష్ణం రాజు, కృష్ణంరాజు, శ్రీధర్ చారి, నర్ర భిక్షపతి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. బసవేశ్వరుడు అందరివాడు ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: సమాజంలో అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేసిన బసవేశ్వరుడు అందరివాడని ఎమ్మెల్యే కె.మాణిక్రావు అభిప్రాయపడ్డారు. బసవేశ్వరుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో పట్టణంలో బసవ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...బసవేశ్వరుడు జగత్ గురువని, లింగాయత్ సమాజాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహానుభావుడన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు కలిసిమెలసి ఉంటూ గౌరవించుకోవాలని చెప్పారని ఉద్బోధించారు. నేటి తరానికి బసవేశ్వరుడి చరిత్ర తెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్, రాష్ట్రీయ బసవదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్పాటిల్, మాజీ చైర్మన్ నరోత్తం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్, ఆర్.సుభాష్ పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడు బసవేశ్వరుడు కంగ్టి(నారాయణఖేడ్): వీరశైవ లింగాయత్ సమాజ స్థాపకులు శ్రీ బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడని, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపి సీ్త్ర విద్యకు ప్రాధాన్యమిచ్చిన విశ్వగురు అని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కొనియాడారు. కంగ్టి మండలంలోని చాప్టా(కే) గ్రామంలో ఆదివారం శ్రీబసవేశ్వరుని విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బసవన్న మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆచరణనీయమన్నారు. మహిళలు నిండు కలశాలతో ఆలయం నుంచి విగ్రహావిష్కరణ కూడలికి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చారు. బంజారా నృత్యాలు, బసవేశ్వరుడు, అక్కమాదేవి వేషాలంకరణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.విజయపాల్రెడ్డి, ఎం.భూపాల్రెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లునారాయణఖేడ్: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేదల సొంతింటి కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
చదువులమ్మ చల్లని నీడలో..
న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు పెంపకాన్ని కూడా చేడుతున్నారు. సర్పంచ్లు, గ్రామస్తులు సహకారంతో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బడుల ఆవరణలో మొక్కల పెంపకం చేపట్టడంతో పలు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గతంలో వేసిన మొక్కలు ఏపుగా పెరగడం వల్ల ఆయా పాఠశాలలు అందంగా, ఆహ్లాదకరంగా మారాయి. మొక్కలకు సమృద్ధిగా నీరు అందిస్తుండటంతో పాఠశాలల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగి చల్లదనంతోపాటు విద్యార్థుల శారీక, మానసిక వికాసానికి నిలయాలుగా మారాయి. కంది, రాయికోడ్ మండలాల్లో... జిల్లాలో మొత్తం 1,262 పాఠశాలలు ఉండగా అందులో 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల ఆవరణలో సుమారు 90వేల వరకు మొక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి, ఎద్దుమైలారం, రాయికోడ్ మండలంలోని కర్చల్, రాయికోడ్, కోడూర్, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ఖాన్ పేట్, న్యాల్కల్ మండలంలోని టేకూర్, చీకూర్తి, బసంత్పూర్, మామిడ్గి, ముంగి, చాల్కి, జహీరాబాద్ మండలంలోని రాయిపల్లితండా, మొగుడంపల్లి తదితర పాఠశాలల ఆవరణలో పచ్చని మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈసారి కూడా మొక్కలు నాటే కార్యక్రమం నర్సరీల నుంచి తెచ్చిన జామ, మామిడి, ములక్కాయ, కానుగ, టేకు, కొబ్బరి, దానిమ్మ తదితర రకాల మొక్కను పాఠశాలల ఆవరణలో నాటారు. గతేడాది ఆయా పాఠశాలల ఆవరణలో సుమారు 40వేల మొక్కలు నాటగా, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. చీకూర్తి జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో దాదాపు 350కిపైగా మొక్కలు నాటారు. గత ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రత్యేకశ్రద్ధ తీసుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. వాటికి నిత్యం బోరు ద్వారా నీటిని అందించడంతో అవి ఏపుగా పెరిగాయి. ఖాళీ సమయంలో విద్యార్థులు చెట్ల కింద చదువుకునేందుకు మంచి వాతావరణం నెలకొంది. టేకూర్, బసంత్పూర్, మామిడ్గి తదితర పాఠశాలల ఆవరణలో కూడా పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి విద్యార్థులకు చల్లదనాన్ని పంచుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులకు చల్లగా ఉన్న చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల మాదిరిగానే మిగతా పాఠశాలల్లో కూడా మొక్కలను పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆహ్లాదకరంగా సర్కారీ బడులు మొక్కల పెంపకంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చెట్లకిందే వేసవి తరగతుల నిర్వహణ -
క్రీడాకారులను ప్రోత్సహించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ సైనికులు ఆనంద్ బాబు, ఇస్రో శాస్త్రవేత్త సుధ అన్నారు. రామచంద్రాపురం పట్టణంలో రాధిక, వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే–అంబేడ్కర్ రెజ్లింగ్, పవర్లిఫ్లింగ్ క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షులు అభిలాష్, సామాజిక కార్యకర్త మెహర్ ఫాలిమా, లయన్స్ క్లబ్ కార్యదర్శి తులసి, నాయకులు శ్రీశైలం పాల్గొన్నారు. రైతు వేదికలో చోరీ శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి రైతు వేదికలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి రైతు వేదిక కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి రెండు హౌజా స్వీకర్లు, రెండు ఫ్యాన్లు, ఎక్స్టెన్షన్ బాక్స్ను ఎత్తుకెళ్లారు. ఈఏఓ వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు జననం హుస్నాబాద్: పట్టణానికి చెందిన నూనె సతీశ్ మేకల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాడు. తాను పెంచు తున్న ఒక మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మేకలు సామాన్యంగా ఒకే ఈతలో ఒకటి నుంచి లేదా మూడు పిల్లలకు జన్మనివ్వడం సర్వ సాధారణం. కానీ ఐదు మేక పిల్లలకు జన్మనివ్వడం అరుదైన విషయం. తల్లితో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని సతీశ్ తెలిపాడు. పిడుగు పడి.. ఇద్దరికి గాయాలు నర్సాపూర్ రూరల్: పిడుగుపాటుతో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని గూడెంగడ్డలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తె... గ్రామానికి చెందిన బాల మల్లేశ్, అతని కుమారుడు రవి గేదెలను మేపుతుండగా ఒక్కసారిగా మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు పిడుగు పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభంవట్పల్లి(అందోల్): మండల కేంద్రమైన వట్పల్లిలో ప్రధాన రోడ్డు మార్గం అల్లాదుర్గ్–మెటల్కుంట ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆదివారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గతేడాది నిధులను మంజూరు చేసి పనులు చేపట్టింది. అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో పనులు నత్తనడకనసాగుతుండటంపై ఇటీవల ‘సాక్షి’లో ‘నిలిచిన రోడ్డు విస్తరణ పనులు’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆర్అండ్బీ అధికారులు బీటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. -
అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ
జోగిపేట అగ్నిమాపకశాఖ అధికారి జోగిపేట(అందోల్): చిన్న చిట్కాలతో పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని జోగిపేట అగ్నిమాపకశాఖ అధికారి టి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జోగిపేటలోని నారాయణి షాపింగ్ మాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇళ్లలో గ్యాస్ లీకై మంటలు వచ్చినప్పుడు పారిపోకుండా మంట వచ్చే ప్రదేశంలో వేలు అడ్డుగా పెట్టి ఆర్పివేయాలన్నారు. తడి బెడ్ షీట్ను సిలిండర్ చుట్టూ కప్పినా ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపారు. అలాగే చిన్న ప్లాస్టిక్ బకెట్ను తీసుకొని దానిపై మూసివేస్తే కూడా మంటలు ఆరిపోతాయన్నారు. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ వ్యాపించడం వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుందని, భూమిపై చేతులతో నడుస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల అప్రమత్తత ఎంతో ముఖ్యమని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వాణి, షాపింగ్ మాల్ మేనేజర్ పండరి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తీర్ణత సాధించేలా..
మెదక్ కలెక్టరేట్: ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులకు మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. కళాశాలకు వచ్చే విద్యార్థులకు ఆఫ్లైన్, రాని వారికి ఆన్లైన్లో అధ్యాపకులు పరీక్షలపై మెలకువలు నేర్పుతున్నారు. ఫస్ట్ ఇయర్లో 2,554 మంది.. జిల్లాలో 58 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలుండగా ప్రథమ సంవత్సరం(జనరల్)లో 5,710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,156 మంది ఉత్తీరులయ్యారు. మరో 2,554 మంది ఫెయిలయ్యారు. ఒకేషనల్లో మాత్రం 599 మంది పరీక్ష రాయగా 440 మంది ఉత్తీర్ణత సాధించగా, 159మంది ఫెయిలయ్యారు. దీంతో ఒకేషనల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానం సాధించింది. సెకండియర్లో 1,516 మంది.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం(జనరల్)లో మొత్తం 4,826 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,310 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 1,516 మంది ఫెయిలయ్యారు. ఒకేషనల్లో 539 మంది పరీక్ష రాయగా 460 ఉత్తీర్ణత సాధించగా మరో 79 మంది ఫెయిలయ్యారు. ఒక్కో సబ్జెక్టులోనే... ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,713 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,595 మంది ఫెయిలయ్యారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులోనే ఫెయిల్ కావడం గమనార్హం. మెరుగైన బోధన.. జిల్లాలో విద్యార్థులు 70 శాతం ఒక్కో సబ్జెక్టులోనే ఫెయిలయ్యారు. వారికి ప్రత్యేక తరగతుల ద్వారా మెరుగైన బోధన అందిస్తున్నాం. మే 13 నుంచి జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతుల ద్వారా బోధన చేస్తున్నాం. – మాధవి, ఇంటర్ విద్యాశాఖ అధికారి -
ఖేడ్లో ఎంవీఐ శాశ్వత కార్యాలయం
నారాయణఖేడ్: త్వరలోనే ఖేడ్లో శాశ్వత ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ‘అరైవ్.. అలైవ్’లో భాగంగా శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఖేడ్ పోలీసు ఠాణాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన రక్తదాతలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖేడ్లో లైసెన్స్ డ్రైవ్, ఇన్సూరెన్స్ మేళాలను నిర్వహించునున్నా మని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. తాగునీటి విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐలు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎస్సైలు శ్రీశైలం, రామకృష్ణ, వెంకటేశ్వర్రావు, దుర్గారెడ్డి, లయన్స్ క్లబ్ బాధ్యులు, కౌన్సిలర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుందిఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు హితవు పలికారు. బసవ జయంతి పురస్కరించుకుని లింగాయత్ సమాజ్లో శనివారం పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. బసవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 73 మంది రక్తదానం చేయగా వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్మలారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్,ఆర్.సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కుస్తీమే సవాల్నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. పోటీలను తిలకించేందుకు జనాలు తరలివచ్చారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
హత్నూర(సంగారెడ్డి): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... పటాన్ చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన మంగలి జోగేందర్ (40) కొంతకాలంగా అత్తగారు గ్రామమైన తెల్లాపూర్ ఇంద్రనగర్లో భార్యాపిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తూ కులవృత్తిని చేసుకొని బతుకుతున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైతం భార్య లావణ్యతో గొడవపడిన జోగేందర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బైక్పై మండలంలోని షేర్ఖాన్పల్లి గ్రామ శివారులోని పలుకుమీది నల్ల పోచమ్మ ఆలయం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త మృతి కొండపాక(గజ్వేల్): పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతుల్లో భర్త శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా... కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడెం తార, తాడెం మల్లేశంలకు పదేళ్ల కింద వివాహం కాగా సంతానం కలుగలేదు. దీంతో పాటు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇటీవల భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలించగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో తెల్లవారుజామున భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న గజ్వేల్ కోర్టు జడ్జి ఆస్పత్రిలో మరణ వాంగ్మూలం సేకరించిన విషయం పాఠకులకు తెలిసిందే. -
మద్దతు ధర దక్కేనా
మక్కలకు ప్రైవేట్లో రూ.1,800కు మించని ధర ఎంఎస్పీ రాకపోతే నష్టమంటున్న రైతులువట్పల్లి(అందోల్): ప్రభుత్వం మొక్కజొన్న (మక్కలు) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందా? తమ పంటకు మద్దతు ధర దక్కుతుందా? లేదా? అని మొక్కజొన్న రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్ల క్రితం వరుసగా యాసంగి, వర్షాకాలాల్లో ఒకే వరి పంటను సాగుచేయగా పంట దిగుబడిపై ప్రభావం చూపడంతో గతేడాది నుంచి రైతులు బోరుబావుల వద్ద మొక్కజొన్న పంటను సాగుచేశారు. ప్రభుత్వ మద్దతు ధర దక్కకపోయినా రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతో ఈ ఏడాది కూడా అందోల్ మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. జోగిపేట ఏడీఏ పరిధిలో సుమారుగా 550పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. మద్దతు ధర కోసం ఎదురుచూపు.. ఈ ఏడాది దిగుబడులు బాగున్నా సరైన మద్దతు ధర దక్కుతుందా లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాళుకు రూ.2,400 ఉండగా ప్రస్తుతం వ్యాపారులు ఏ మేరకు ధరను చెల్లిస్తారోనని రైతులు మధన పడుతున్నారు. గతేడాది నుంచి రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ ధరకు విక్రయిస్తే మాత్రం తాము నష్టపోతామంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల మండలాల రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు మద్దతు ధర దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో సదాశివపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడికి పంటను తరలించడంలో దూరాభారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడాల్సివచ్చిందని గుర్తు చేస్తున్నారు.విన్నవించేందుకు రైతులు సిద్ధం అందోల్ మండలంలో అత్యధికంగా కన్సాన్పల్లి గ్రామంలో మొక్కజొన్న పంట సాగువుతోంది. ఇప్పటికే అదే గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు సంగారెడ్డిలోని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ప్రైవేట్లో రూ.1,800 మించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. ప్రైవేట్లో విక్రయిస్తే నష్టపోతాం. జోగిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. – రామన్నగారి కిష్టయ్య, రైతు,కన్సాన్పల్లి మంత్రిని కలిసి వినతి.. జోగిపేటలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహకు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ రైతులు శనివారం జోగిపేటలో మంత్రి పర్యటన సందర్భంగా ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో అధికంగా మొక్కజొన్న పంటను సాగుచేశామని ప్రైవేట్లో తక్కువ ధరకు విక్రయించడం ద్వారా తాము నష్టపోతామని కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా మద్దతు ధరను కల్పించాలని మంత్రిని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్ర ఏర్పాటుపై మంత్రి సానుకూలంగా స్పందించారు. -
మెదక్ ఖిల్లా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ అద్భుత కట్టడాలను కనులారా చూసి తీరాల్సిందే. రోజ్వుడ్ కలప, స్పెయిన్ గ్లాస్పై కరుణామయుని జీవన వృత్తాంతం, అద్భుతమైన రాతికట్టడం దీని ప్రత్యేకత. దీని నిర్మాణం 1914 నుంచి 1924 వరకు పదేళ్లపాటు కొనసాగింది. ఇంగ్లాండ్ దేశస్తుడైన చార్లేస్ వాకర్ పాస్నెట్ ఆధ్వర్యంలో ఈ అద్భుత కట్టడం ఆవిష్కతమైంది. దీన్ని నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2023 డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి ఈ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్ ఖిల్లా చారిత్రక అద్భుత కట్టడం. దీన్ని శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నాటి 2వ ప్రతాపరుద్రుడు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. దానిపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు నిర్మించారు. ఇది పోలీస్ పహారాలో కొనసాగుతుంది. ఇది రాచరికపు చరిత్రకు నిలువుటద్దంగా విరాజిల్లుతోంది. ఇది హైదరాబాద్కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. తుంబురేశ్వరాలయం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వెల్పుగొండలో వెయ్యేళ్ల క్రితం వెలసిన తుంబురేశ్వర (శివాలయాన్ని) కాకతీయుల ఏలుబడిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ గుడి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. -
ఉపాధ్యాయుడికి డాక్టరేట్
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సీహెచ్ విఠల్ ‘తెలుగు సాహిత్యంలో రుద్రమదేవి‘ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను స్థానిక ప్రజలు, మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయులు అభినందించారు. జనగణన పకడ్బందీగా నిర్వహించాలి జెడ్పీ సీఈఓ ఎల్లయ్య కొల్చారం(నర్సాపూర్): వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే జన గణన–2027 పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జన గణనపై ఎన్యుమిరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. జన గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించి సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ శిక్షణ శిబిరం ఈనెల 25వరకు కొనసాగుతుందన్నారు. మే 1 నుంచి ఇళ్ల జాబితా, గణనతో పాటు స్వీయ గణన ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్దన్, ఎంఈఓ ఉమారాణి, సిబ్బంది పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో కిరాణాషాపు దగ్ధం రూ.8 లక్షల ఆస్తి నష్టం కౌడిపల్లి(నర్సాపూర్): ప్రమాదవశాత్తు కిరాణాషాపు దగ్ధం కావడంతో ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావ్పేటగేట్ వద్ద శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆర్ఐ విజయలక్ష్మి, బాధితుడి వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేట గ్రామానికి చెందిన గుండ వీరేశంగుప్తకు వెంకట్రావ్పేటగేట్వద్ద వేంకటేశ్వర హోల్సేల్, రిటైల్ కిరాణాషాపు ఉంది. రోజుమాదిరిగా శనివారం షాపు తెరిచి మధ్యాహ్నం 12గంటల తరువాత కిరాణా సామగ్రి తీసుకొచ్చేందకు షాప్ బంద్చేసి హైదరాబాద్కు వెళ్లాడు. కొద్దిసేపటికి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు షాపు ఓపెన్చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్సిబ్బంది వచ్చి మంటలార్పారు. అప్పటికే షాపులో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సుమారు రూ.8లక్షలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు. -
మెదక్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు
ఏడుపాయల దేవస్థానం మెదక్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం ఉంది. ఒకప్పుడు భీకరమైన కీకారణ్యం అది. రుషులు తప్పస్సు చేసిన వేదభూమి, పుణ్యభూమిగా చరిత్ర చెబుతోంది. రాతిగుహల మధ్య సహజసిద్ధంగా వనదుర్గామాత వెలిసింది. కొలిసిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా మహాశివరాత్రికి మూడు రోజుల పాటు జాతర కన్నుల పండువగా జరుగుతుంది. అలాగే మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడికి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఆది, మంగళవారాల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు. -
జింకలకు నిలయం.. పోచారం
మెదక్ పట్టణానికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో మెదక్–బోధన్ రహదారి పక్కనే పోచారం అభయారణ్యం ఉంది. ఈ అడవిలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతుంది. ఇందులో కృష్ణజింకలతో పాటు, వేలాదిగా కొమ్ముల జింకలు ఉన్నాయి. ఆ అడవిలో నెమళ్లు, నీల్గాయిలు, కొడగొర్లు, జంతువులతో పాటు పక్షులు ఉన్నాయి. పర్యాటకులు తిలకించేందుకు అడవిలో 4.5 కిలో మీటర్లమేర మట్టిరోడ్డు వేశారు. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి, వీటిని తిలకించేందుకు పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 50 చొప్పున చెల్లించాలి. పక్కనే నిజాంపాలనలో పోచారం ప్రాజెక్టును సహజసిద్ధంగా వెలసిన గుట్టల మధ్య నిర్మించారు. -
ఉపసర్పంచ్పై చర్యలు తీసుకోవాలి
అవమానిస్తున్నాడని సర్పంచ్ నిరసనపెద్దశంకరంపేట(మెదక్): పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళా సర్పంచ్ జంగం రేణుక శనివారం నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్ రాజుగౌడ్ పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రతి కాలనీలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్లా కలెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దోమల మందు స్ప్రే చేసి సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి అంతా తానే చేస్తున్నట్లు చెబుతున్నాడని ఽఆరోపించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆమె అక్కడే భోజనాలు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉప సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్ గౌడ్, సుభాష్ తదితరులున్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
సంగారెడ్డి జోన్: ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శనివారం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలకు వెళ్తున్న హోంగార్డులకు మెడికల్, ప్రాథమిక అవసరాల కిట్టులను ఎస్పీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, పోలీసు డ్యూటీ డాక్టర్ జ్యోతి, డానియెల్, తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో నిరసన
తాగునీటి కోసం గిరిజనుల ఆందోళనకొల్చారం(నర్సాపూర్): మండలంలోని వరిగుంతం గ్రామపంచాయతీ పరిధిలోని కుడి చెరువు తండావాసులు నీటి ఎద్దడిని నిరసిస్తూ శనివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీరికి పంచాయతీ వార్డు మెంబర్లు లంబాడి రవి, పెంట్యా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలో కొన్ని రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, వారంలో ఒక్కరోజు మాత్రమే ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తుండటంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామపంచాయతీలో నిధులున్నా.. బోరు వేసి నీటి సమస్య తీర్చాలని అడిగితే, సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుడి చెరువు తండాలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
నిమ్జ్ పనుల అడ్డగింత
● 45రోజుల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ● సర్వే నిర్వహణకు ఆరు ప్రత్యేక బృందాలు ● పనుల పురోగతిపై రోజు వారీగా సమీక్షరూ.2,369 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రహదారులు, వాటర్ ట్యాంకులు, గ్రీనరీ, పరిశ్రమల ఏర్పాటుకు స్థలం, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక అభివృద్ధి పనులు చేపట్టారు. మొదటి దశలో సేకరించిన భూమిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2,369 కోట్ల నిధులతో పనులు చేపడతారు. మారనున్న రూపురేఖలు నిమ్జ్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీ పనులు పూర్తయితే ఇక్కడి ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పరిశ్రమల రాకతో సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సంగారెడ్డి జోన్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు మరింత వేగవంతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరిలో టెండర్ ప్రక్రియ ముగిసింది. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల నిర్వహణకు మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించారు. భూ సేకరణ పూర్తయినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేస్తున్న సమయంలో రైతుల నుంచి వివిధ కారణాలతో వ్యతిరేకత రావటంతో పనులు అంతంతమాత్రంగానే సాగాయి. స్థానిక అధికారులు సరైన చొరవ చూపకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. పనుల జాప్యంపై సీఈఓ అసంతృప్తి ఐదురోజుల క్రితం నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాంతంలోని స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో రజత్కుమార్ సైని, టీజీఐఐసీ, జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. టెండర్ ప్రక్రియ ముగిసి మూడు నెలలు పూర్తి కావస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగకపోవడం పట్ల స్థానిక అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు సాగకపోవడం పట్ల గల కారణాలను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో భూముల సర్వే స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన భూములలో సర్వే పనులు ముమ్మరం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. రెండురోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీస్, సర్వేయర్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో సేకరించిన భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. 45 రోజుల్లో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ వైపు అధికారులు సర్వే పనులు చేస్తుండగా మరోవైపు కాంట్రాక్టర్ భూమిని పూర్తిగా చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పంటలు సాగులో ఉంటే కోత పూర్తి చేసేందుకు గడువు ఇవ్వనున్నారు. ఎక్కువ నెలలపాటు సాగయ్యే పంటలు ఉంటే గుర్తించి పరిహారం అందించి స్వాధీన పరుచుకోనున్నారు. సర్వే నిర్వాహణపై రోజువారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.చదును చేస్తున్న గుట్టభూ సేకరణకు నోటిఫికేషన్ నిమ్జ్ మొదటి విడతలో గుర్తించిన 3,245 ఎకరాల్లో ఎల్గోయి గ్రామ పరిధిలో 194 ఇంకా సేకరణ పూర్తి కాలేదు. అందుకుగాను ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి, భూ సేకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని ముంగి గ్రామ శివారులో కొనసాగుతున్న నిమ్జ్ ఏర్పాటు పనులను శనివారం ముంగి తండా వాసులు అడ్డుకున్నారు. తండా సమీపంలో నిమ్జ్ ఏర్పాటులో భాగంగా అందుకు సంబంధించిన హద్దులు ఏర్పాటు, కంచె నిర్మాణం తదితర పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న తండా వాసులు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పనులు చేస్తున్న వారితో పాటు అధికారులతో తండా వాసులు వాగ్వావాదానికి దిగారు. తహసీల్దార్ ప్రభు, ఆర్ఐ శ్యామ్రావు తదితరులు వారికి ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా అధికారులకు తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో చాందీబాయి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోగా వెంటనే 108లో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అక్కడకు చేరుకుని తండా వాసులతో మాట్లాడారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే రాసి ఇవ్వాలని, పనులను మాత్రం అడ్డుకోవద్దని నచ్చజెప్పారు. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ వెంట హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ సిబ్బంది ఉన్నారు. -
ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శిగా కృష్ణారెడ్డి
చేగుంట(తూప్రాన్): ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శిగా చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి హైదరాబాద్లోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ అదృశ్యం వర్గల్(గజ్వేల్): ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని గౌరారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం... కుకునూర్పల్లికి చెందిన పోల్కంపల్లి సత్యనారాయణ కూతురు అక్షిత(24) గౌరారంలోని ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తుంది. రోజు మాదిరిగా ఆమె సోదరుడు శనివారం ఉదయం 9 గంటలకు స్కూల్ ఎదుట దింపి వెళ్లాడు. కానీ ఆమె స్కూల్కు గాని, తిరిగి ఇంటికి గాని వెళ్లలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రగ్ పట్టివేత జహీరాబాద్ టౌన్: రాష్ట్ర సరిహద్దులో గల చిరాగ్పల్లి చెక్పోస్టు వద్ద డ్రగ్ను పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ.శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. వాహనాల తనిఖీలో భాగంగా గోవా నుంచి వస్తున్న ట్రావెల్ బస్సుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జోద్పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధరాం వద్ద 1.052 కిలోగ్రాముల డ్రగ్(చరాస్) లభించింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ చిలప్చెడ్(నర్సాపూర్): పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... చిలప్చెడ్ చర్చి వెనుక పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 వేలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. -
గుల్‘మోహ’నం
వేసవి తాపం తగ్గేలా..వారం రోజులుగా సంగారెడ్డిలోఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్ వేసుకున్నప్పటికీ కూడా వేడిగాలి వస్తుండటంతో ఉష్ణతాపం భరించలేక కూలర్లు కొంటున్నారు. సంగారెడ్డిలో పలువురు కూలర్లు కొనుక్కుని తీసుకువెళ్తుండగా ‘సాక్షి’క్లిక్ మనిపించింది. – సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్,సంగారెడ్డిపరిమళాలు వెదజల్లకపోయినా విరబూసిన గుల్మోహర్ పూలను చూస్తే మనసు పరవశించాల్సిందే. అల్లాదుర్గం–మెటల్కుంట రోడ్డుకిరువైపులా హద్నూర్, ముంగి గ్రామాల శివారులోని గుల్మోహర్ చెట్లకు కాసిన ఎర్రటి పుష్పాలు రోడ్డుపై రాకపోకలు సాగించే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండి మొక్కలు, చెట్లు ఎండి ముఖం పడుతుండగా ఇక్కడ మాత్రం చెట్లకు పూసిన గుల్మోహర్ పూలను చూస్తూ దారిన పోయే వారు పరవశించిపోతున్నారు. న్యాల్కల్(జహీరాబాద్): -
ఎస్టీపీ ఏర్పాటు ఆపేస్తాం
పటాన్చెరు: అమీన్పూర్లోని కాలనీల మధ్య ఎస్టీపీ (స్యూవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణం ఆపివేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకు ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గానికి మొత్తం ఏడు ఎస్టీపీలు మంజూరయ్యాయని కానీ కాలనీవాసుల ఇబ్బందులను, నిరసనను దృష్టిలో పెట్టుకుని వేరే చోటుకు తరలిస్తామని అమీన్పూర్ వాసులకు ఎమ్మెల్యే హామీనిచ్చారు. అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో అమీన్పూర్ పట్టణంలో ముమ్మర నిరసన కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్టీపీ ఆవశ్యకత, దానిపై ప్రజల్లో ఉన్న అపోహల తొలగింపు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులతో, అమీన్పూర్ గుట్టలో శనివారం అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి హాజరైన వేలమంది ప్రజలు అక్కడ ఎస్టీపీ ఏర్పాటు చేయవద్దని కోరారు. దీంతో ఎమ్మెల్యే గూడెం కల్పించుకుని కాలనీ వాసుల కోరిక మేరకు ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. తిరుమల్రెడ్డి పోటీ చెయ్ రూ.10కోట్లు ఇస్తా ఇదిలాఉండగా సమావేశంలో తొలుత ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తప్పులేదని అయితే అనవసర రాజకీయాలు చేయవద్దని తిరుమల్రెడ్డిని హెచ్చరించారు. దీంతో కాలనీ వాసులకు విస్మయానికి లోనయ్యారు. పటాన్చెరు నియోజకవర్గ పునర్విభజనలో ఎమ్మెల్యే ఇక్కడ ఉండరని పక్షపాతం చూపుతున్నారని తనపై దుష్ప్రచారం చేశారంటూ వ్యా ఖ్యానించారు. తిరుమల్రెడ్డి! ఎన్నికల్లో పోటీ చెయ్.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నవ్ చేయ్వయ్యా ఎన్నికల్లో పోటీచెయ్. రూ.పది కోట్లు ఇస్తా’’అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం తిరుమల్రెడ్డి మాట్లాడుతూ..తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి సమానులైన ఎమ్మెల్యే వ్యాఖ్యలను తాను తప్పుగా భావించడం లేదన్నారు. ఆ తరువాత ఎస్టీపీ రద్దు ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్లు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీ సంఘాల అధ్యక్షులు, మెట్రో అధికారులు, జీహెచ్ ఎంసీ అధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు. జనారణ్యంగా అమీన్పూర్ గుట్టలుఅమీన్పూర్ 993 గుట్టలు జనారణ్యంగా మారాయి. అమీన్పూర్ కాలనీల నుంచి వందలాది మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కొద్దిరోజులుగా ఎస్టీపీ నిర్మాణం కోసం నేల చదును పనులు చేస్తున్నారు. ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. నెల రోజులుగా నిత్యం ఏదో ఒక కాలనీలో రాత్రి పూట లేదా తెల్లవారుజామున ర్యాలీలు జరిగాయి. ఈ ప్రాంతంలోని కాలనీల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉండటంతో వారికి అవకాశం చిక్కినప్పుడల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే చొరవతో మెట్రో అధికారులతో కాలనీవాసులు తమ ఆవేదన చెప్పుకునే అవకాశం కల్పిస్తూ సమావేశాన్ని ఏర్పా టు చేయగా..అనూహ్యంగా వేలాది మంది ప్రజలు ఆ గుట్టల్లోకి తరలి వచ్చారు. వచ్చిన వారిలో అందరూ టెకీలే కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నివ్వెరపోయారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉద్యమాలకు దూరంగా ఉండే తత్వం. బ్యాంకు లోన్ తీసుకుని ఇండ్లు కట్టుకుని ప్రశాంత జీవితాలు సాగించాలనుకునే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పిడుగులా ఎస్టీపీ ఏర్పాటు వార్త వచ్చి పడింది. ఎస్టీపీ ఏర్పాటైతే ఇండ్లు అమ్ముకుని, తా ము కాలనీలు ఖాళీ చేయడం మినహా ఏమీ ఉండద ని భావించారు. దీంతో పిల్లా పాపలతో ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి తరలి వచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
గడ్డి మందుపై గట్టి నిఘా
● ప్యారాక్వాట్ అమ్మకాలు జరగకుండా వ్యవసాయ శాఖ చర్యలు ● విషపూరితం, ప్రాణాంతకంగా మారడంతోనే.. ● పక్క రాష్ట్రాల నుంచి రాకుండా అడ్డుకట్ట ● రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: డీఏఓ జహీరాబాద్: ఆహార ధాన్యాలు, పండ్ల తోటల సాగులో కలుపు నివారణకు వాడుతూ వచ్చిన ప్యారాక్వాట్ గడ్డి మందుపై ప్రభుత్వం నిషేధం విధించడంతో పకడ్బందీగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వం పక్షం రోజుల క్రితం మందు వాడకంపై జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇకపై గడ్డిమందు వినియోగానికి వ్యవసాయ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. జిల్లాలో వర్షాకాలం పంటలు 7.60 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగవుతూ వస్తున్నాయి. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పెసర, మినుము, శనగ, చెరకు, అరటి, అల్లం, బొప్పాయి పంటలతో పాటు కూరగాయల పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండడంతో రైతులు గడ్డి మందును ఆశ్రయిస్తున్నారు. వర్షాలు అనుకూలించని పక్షంలో కలుపు తీయడం రైతులకు శక్తికి మించిన పనిగా మారుతోంది. కూలీలను వినియోగించినా ఖర్చు భారం పడుతోంది. దీంతో రైతులు కలుపు నివారణ మందుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. గ్లైఫోసెట్ రౌండప్ మందుపై నిషేధం ఉన్నా అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి కొనుగోలు చేసుకుని వినియోగిస్తున్నారు. ప్యారాక్వాట్ మొక్కల్లోని ఫోటో సింథసిస్ కణాలను నాశనం చేస్తూ కలుపు నివారిణిగా పనిచేస్తోంది. గ్లైఫోసెట్ మొక్కలను మొత్తం నాశనం చేస్తుంది. ఏ మేరకు అమలు కానుంది? ఇప్పటికే మన రాష్ట్రంలో గ్లైఫోసెట్ గడ్డిమందుపై నిషేధం ఉంది. కానీ పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విక్రయాలకు అనుమతి ఉంది. తాజాగా ప్యారాక్వాట్ మందుపై నిషేధం విధించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు వ్యవసాయ శాఖ అధికారి లేదా సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సదరు అధికారి వ్యవసాయ భూమిని చూసి అనుమతిస్తారు. మందు వినియోగం తప్పని సరి అని ధృవీకరించి సిఫారసుచేస్తే డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గ్లైఫోసెట్ గడ్డిమందు విక్రయాలపై నియంత్రణ లేదు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడి నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలించుకునే అవకాశం ఉంది. రైతులకు తగిన అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తేనే ఫలితాలు సాధించవచ్చు. ప్రాణాంతకంగా మారింది ప్యారాక్వాట్ గడ్డిమందు వినియోగంపై ప్రారంభంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. తదనంతర కాలంలో ఆ గడ్డిమందు అనర్థాలను నిపుణులు గుర్తించారు. ప్యారాక్వాట్ వినియోగంతో పర్యావరణపరంగా నష్టంతో పాటు వర్షాలు పడిన అనంతరం కూడా దీని ప్రభావం భూమి, మొక్కల్లో తగ్గడం లేదు. వీటిని పిచికారీ చేసే రైతులు, కూలీలు సైతం దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడే వారు ప్యారాక్వాట్ సేవిస్తే చికిత్స కూడా అందలేని పరిస్థితి ఉంది. ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణం తప్పనిసరిగా మారింది. దుష్ప్రభావాలకు యాంటీడోస్ లేకపోవడంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వం నిషేధించిన ప్యారాక్వాట్ మందుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఈ కార్యక్రమం చేపట్టాం. మార్కెట్లోకి మందు రానప్పుడు రైతులు కొనుగోలు చేసే అవకాశమే ఉండదు. అయినా దీనిపై గట్టి నిఘా ఉంచుతాం. నిబంధనలు ఉల్లంఘించినా, ఎవరైనా మందు అమ్మ కాలు జరిపినా కఠిన చర్యలుంటాయి. – శివప్రసాద్, డీఏఓ, సంగారెడ్డి -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్ టౌన్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని దత్తగిరి కాలనీకి చెందిన రంజిత కుమార్ భార్య నాగరాణి(21) ఈ నెల 15న రాత్రి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త బంధువులను విచారించినా ఫలితం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో తల్లీకూతురు.. పటాన్చెరు టౌన్: తల్లీకూతురు అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం... సందుగూడెంకు చెందిన అనిల్ మేసీ్త్ర పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కర్ణాటక బీదర్లో ఉండే అతడి కూతురు దివ్యభారతి, భర్తతో గొడవపడి రెండు నెలల క్రితం వచ్చి తండ్రి వద్ద ఉంటుంది. ఈ నెల 6న ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి దివ్యభారతి, కూతురు విజయలక్ష్మి(3)ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. కూతురు, మనవరాలు అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నష్టపరిహారం ప్రకటించండి
సంగారెడ్డి: అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులకు క్రాప్ హాలిడే నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై ఎమ్మెల్యే చింతప్రభాకర్, చంటి క్రాంతికిరణ్లు కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ...సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి అసమాన పంపిణీ కారణంగా అందోల్ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెండేళ్లుగా ఎడమ కాలువ ద్వారా చుక్క నీరు కూడా విడుదల కాలేదని, మరోవైపు దిగువన ఘనాపూర్ ఆయకట్టు ప్రాంతాలకు మాత్రం నీరు అందుతోందని తెలిపారు. సింగూర్ డ్యామ్లో తగినంత నీరు ఉన్నప్పటికీ ‘‘మరమ్మతు పనులు’’పేరుతో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. దీంతో పుల్కల్, అందోల్ మండలాల్లోని విస్తారమైన సాగుభూములు నీటి లేమితో నిర్జీవంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రెండు యాసంగి సీజన్లలో రైతులు పంటలు వేయకుండా భూములను పాడుబడినట్టే ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల డ్యామ్ నీరు ముందస్తు సమాచారం లేకుండా విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్, పుల్కల్, గంగోజిపేట్ గ్రామాల్లో వరదలు వచ్చి వందల ఎకరాల పంటలు మునిగిపోయాయని చెప్పారు. అయినప్పటికీ బాధిత రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని వివరించారు. ప్లాంట్ ఏర్పాటు చేయండిః చింత ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గిర్మాపూర్ సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి వెంటనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజయ్, కనకారెడ్డి తదితరులు ఉన్నారు.కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే -
చోరీ నిందితుడి రిమాండ్
ములుగు(గజ్వేల్): ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ములుగు ఎస్ఐ రఘుపతి కేసు వివరాలు వెల్లడించారు. నెలరోజుల క్రితం మండలంలోని బహిలంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలోని బొల్లు వెంకటేశం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.లక్షా 50 వేలు, మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీలో పసుల సత్తయ్య ఇంట్లో రూ.65వేలు, 3తులాల వెండి, సెల్ఫోన్ను అపరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం ములుగు బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఎస్ఐకి సమాచారం అందింది. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి తండాకు చెందిన అప్పావత్ శ్రీకాంత్(28)గా గుర్తించారు. అలాగే బహిలంపూర్, ఆర్అండ్ఆర్ కాలనీలో చోరీకి పాల్పడింది తానేనని నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద రూ.50 వేలు నగదు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించారు. కేసును ఛేదించిన ఎస్ఐ, సిబ్బందిని గజ్వేల్ రూరల్ సీఐ డి.రవిరాజు అభినందించారు. -
ఐలాపూర్పై విచారణ కమిటీ
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఐలాపూర్ గ్రామ భూముల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ భూములపై తదుపరి చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకి ప్రభుత్వం అప్పజెప్పింది. రెవె న్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ కమిషనర్ చైర్మన్గా.. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్స్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, సర్వే, సెటిల్మెంట్ కమిషనర్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యదర్శి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఆ భూమి స్వభావం ఏంటి? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశాలతో పాటు భూమికి చెందిన రికార్డులను పరిశీలిస్తారు. నిజాం కాలంలో సర్ఫ్–ఎ–ఖాస్, దివాణి భూములుగా వీటిని నిర్ణయించడానికి ఉన్న మూలాలు ఏంటి? ఆ భూములకు ఉన్న చట్టబద్ధత ఏంటి? రెవెన్యూ రికార్డుల్లో ఉన్న హక్కుల నమోదు వివరాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సర్వే, సెటిల్మెంట్కు సంబంధించిన సమస్యలను, ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలపై సమగ్రంగా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సర్ఫ్–ఎ–ఖాస్ భూములు సమకూరిన తీరు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులను పరిశీలిస్తుంది. ఈ భూముల రక్షణకు అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇదీ జరిగింది.. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలోని సర్ఫ్–ఎ–ఖాస్ భూముల ఆక్రమణలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి హైడ్రా ఈ భూములను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 1,263 ఎకరాలకుగాను 861 ఎకరాలకు హైడ్రా కంచె వేసింది. 1998లో, 2013లో హైకోర్టు స్టే విధించినప్పటికీ ముఖీం అనే వ్యక్తి అక్కడ అతిథిగృహాన్ని విలాసవంతంగా నిర్మించుకుని..40 ఎకరాల మేర ఆక్రమించి ఫామ్హౌస్ను ఏర్పాటు చేసుకున్నాడు. అతిథి గృహాన్ని తొలగించి ఫామ్హౌస్ ఆక్రమణలను హైడ్రా క్లియర్ చేసింది. పక్కనే ఉన్న కిష్టారెడ్డిపేటలోని భూమి వివరాలిచ్చి ఐలాపూర్లోని ప్రభుత్వ భూమిలో ముఖీం తమ్ముడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా తొలగించింది. సర్ఫ్–ఎ–ఖాస్ భూముల లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుదాదాపు రూ.6వేలు రావాలి ఉపాధి పనులు చేస్తున్నా డబ్బులు రావడంలేదు. దాదాపు రూ. 6వేలు రావాలి. కూలి డబ్బుల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఇంకా పడలేదు అని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి కూలి డబ్బులు త్వరగా చెల్లించాలి. – ముత్యాలు, ఉపాధి హామీ కూలి,లింగుపల్లి, మిరుదొడ్డి త్వరలో జమ అవుతాయి పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమఅవుతాయి. రోజు పనులకు వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. కూలి పని కి వచ్చిన వారందరికీ తప్పకుండా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీవో, సిద్దిపేటమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలు డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.2.95కోట్లు పెండింగ్లో ఉన్నాయి. డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో ఉపాధి పనులకు కూలీలు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట గ్రామాల్లో రైతులకు, కూలీలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5,69,156 జాబ్ కార్డులుండగా 10,84,409 మంది ఉపాధి కార్మికులున్నారు. అందులో 5,59,118 మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పనిలోకి వచ్చిన కూలీ పేరు, చేసిన పరిమాణాన్ని రోజూ ఫీల్డు అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉదయం 8గంటలకు ఒక సారి ఫొటో దిగితే , మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో దిగాలి. అప్పుడే ఉపాధి కూలీకి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కేవైసీ కొర్రీలతో.. ప్రతి 15 రోజులకు ఒక సారి కూలి డబ్బులు కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమకావాలి. కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డబ్బులు జమ కావడం లేదు. గత రెండు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 2,95,49,000లు పెండింగ్లో ఉన్నాయి. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా పరిహారాన్ని అందించాలి. ఉపాధి కూలీలకు డబ్బులు వెంటవెంటనే అందిస్తే ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. రెండు నెలలుగా నిలిచినడబ్బుల చెల్లింపులు పెండింగ్లో రూ.2.95కోట్లు ఎదురుచూస్తున్న కూలీలు ఉమ్మడి మెదక్ జిల్లాలోజాబ్ కార్డులు 5.69లక్షలు -
ఫలితమివ్వని ప్రణాళిక
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం● ప్రథమ సంవత్సరంలో 31.73 శాతం మాత్రమే.. ● సరైన కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడమే.. ● విద్యార్థులను చేర్పించేందుకు వెనకాడుతున్న తల్లిదండ్రులు సంగారెడ్డిఎడ్యుకేషన్: ప్రతీ విద్యార్థికి ఉన్నతమైన విద్య అందించడంలో భాగంగా ప్రతీ మండల కేంద్రానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అయితే అనుకున్న ఫలితాలను రాబట్టడంలో విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం రోజురోజుకూ తగ్గుతోంది. ఇంటర్మీడియెట్ బోర్డు అఽధికారులు విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ సంవత్సరం ఫలితాలలో కేవలం నాలుగు కళాశాలలు మాత్రమే 50 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో కల్హేర్ 94.52, మనూర్ 78.43, కంగ్టి 63.51, పుల్కల్ 50 శాతం మాత్రమే సాధించాయి. ప్రభుత్వ కళాశాలలో ఎంత నాణ్యమైన విద్య అందుతుందో ఈ ఫలితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. -
ఉపాధిలో చెక్డ్యాంలు
● భూగర్భ జలాల పెంపునకు చర్యలు ● ప్రతీ గ్రామంలో రెండింటికి అనుమతి ● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నిర్ణయం నారాయణఖేడ్: ఉపాధిహామీ పథకం కింద చెక్డ్యాంలు నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్ణయించాయి. చెరువుల్లో మట్టి పూడికతీత, ఇతరత్రా పనులు మాత్రమే కొనసాగుతుండగా.. గ్రామాల్లో వాన నీటి ప్రవాహాన్ని ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఉపాధిహామీ పథకం కింద 14 ఏళ్ల క్రితం వాగులపై చెక్డ్యాంల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటి నిర్మాణం పేరిట నిధులు దుర్వినియోగం జరుగుతోందని భావించి ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ పనుల కోసం తిరిగి చెక్డ్యాంల నిర్మాణాలకు అనుమతినిచ్చింది. ప్రతీ గ్రామంలో రెండింటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రాంజీ చట్టం కిందనే పనులను జాబితాలో చేర్చారు. నాడు వాటర్ షెడ్ ద్వారా.. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు 30 ఏళ్ల క్రితం జిల్లాలో వాటర్షెడ్ పథకం కొనసాగింది. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ తదితర నియోజకవర్గాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో వాటర్షెడ్ పథకం అమలు చేసి చెక్డ్యాంలు నిర్మించారు. గట్టు ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటికి అడ్డుకట్టగా, ఇతర ప్రాంతాల నుంచి ప్రవహించే నీటికి అడ్డుకట్టగా వీటి నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో నిర్మించిన ఈ చెక్డ్యాంలలో వేసవిలోనూ నీరు నిల్వ ఉండి పశుపక్ష్యాదులకు నీటి దప్పిక తీర్చడం, చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా పనిచేసేవి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా అప్పట్లో చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలపై అధ్యయనం గ్రామీణ ప్రాంతాల్లో చెక్డ్యాంల అవసరం, నిర్మాణాల అనుకూలతలపై అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఎంపీడీవోలు మండలాల వారీగా సర్వే చేయించి నివేదికలు సమర్పించారు. వీటి ఆధారంగా 2026– 27 ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఒక్కో చెక్డ్యాంకు గరిష్టంగా రూ.6.50లక్షలు ఉపాధి నిధులు వెచ్చించనున్నారు. ఒక్కో నిర్మాణం ద్వారా కూలీలకు 300 పనిదినాలు కల్పిస్తారు. వాగు ప్రవాహ ప్రాంతాలను బట్టి 5 నుంచి 16 మీటర్ల పొడవుతో చెక్డ్యాంలను నిర్మించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఎంపీడీవో, పంచాయతీరాజ్ ఏఈ, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కమిటీని వేయనున్నారు. చెక్డ్యాంల నిర్మాణం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. చిన్న, చిన్న నీటి అడ్డంకులు కావడంతో వర్షపు నీటిని నిల్వచేసి భూగర్భ జలాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెక్డ్యాంలలో నిల్వ చేసే నీరు మెల్ల మెల్లగా నేలలోకి చొచ్చుకుపోయి బోరు, బావుల్లో నీటి మట్టాలు పెంచడం, రైతులకు వేసవి కాలంలోనూ నీరు అందుబాటులో ఉండేలా చేస్తూ పంట దిగుబడులు పెంచేందుకు దోహద పడతాయి. వర్షపు నీరు వేగంగా ప్రవహించకుండా ఆపి మట్టిని కాపాడటం, అకస్మాత్తుగా వచ్చే వరద నీటి ప్రవాహాన్ని తగ్గించడం, పచ్చదనం పెరిగి చెట్లు, పశుపక్ష్యాదులకు నీటి సదుపాయం కలుగనుంది. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు జరగనుండటంతో ప్రభుత్వాలు సైతం చెక్డ్యాంల నిర్మాణాల పట్ల మొగ్గుచూపుతాయి. -
గవ్వలపల్లిలో భైరవ శిల్పం గుర్తింపు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయుల శైలికి చెందిన అరుదైన తాంత్రిక భైరవ శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిల్పంలో భైరవుడు జ్యాలకేశాలతో కపాలమకుటం ధరించి చెవులకు పెద్ద కుండలాలు, మెడలో సర్పహారం, భుజాలపై కేయురాలు, కపాలమాల, కపాలమేకలు, కాళ్ల కడియాలు, పాంజిబులతో ఎత్తులు కట్టిన పాదుకలతో ఉన్నాడని చెప్పారు. త్రిభంగిమలో వైతస్తిక పాదాలతో నిలబడిన ఈ చతుర్భుజ భైరవుడు పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలం, నిజహస్తాల్లో ఖడ్గం, రస్తపాత్రలతో స్థానక శిల్పంగా కన్పిస్తున్నాడని తెలిపారు. గతంలో అరుదైన వినాయకుడు ఉన్న శివాలయంలోనే భైరవుడి శిల్పాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అస్లాం ఫారూఖీ తెలిపారు. జహీరాబాద్లోని ఫౌండేషన్, సదాశివపేటలోని అరిన్ ఫార్మాస్యూటికల్స్, దిగ్వాల్లోని పిరామల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే మేళాలో మహీంద్రా మోటార్స్, ఫ్లిప్కార్ట్, శ్రీరాంచిట్స్, క్రెడిట్ యాక్సెస్ హెచ్ఆర్ స్వ్కేర్ వంటి సంస్థలు, ఫార్మా బ్యాంకింగ్, లాజిస్టిక్, ఇ–కామర్స్, మార్కెటింగ్ మరియు ఇతర విభాగాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్, కోహీర్, సదాశివపేట, సంగారెడ్డిలోని అన్ని కళాశాలల విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల నుంచి ఉత్తీర్ణులైన వారు కూడా మేళాకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. జహీరాబాద్ టౌన్: మండలంలోని హుగ్గెల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ వివరాల ప్రకారం... సుమారు 50 సంవత్సరాల వయసు కల్గిన మహిళ శవం జాతీయ రహదారి పక్కన ఓ గుంతలో కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భయంతో పరుగులు కౌడిపల్లి(నర్సాపూర్): బైకులో పాము కనిపించడంతో వాహనదారుడు ఆందోళనకు గురయ్యాడు. విషయం ఇతరులకు చెప్పి పామును బైక్ నుంచి వెళ్లగొట్టగా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలం కూకుట్లపల్లిలో జంగ ప్రశాంత్ తన పల్సర్ బైక్ను సాయంత్రం ఇంటిముందు పార్కు చేశాడు. బయటకు వెళ్లేందుకు బైక్ తీసే క్రమంలో నాగుపాము కనిపించింది. దీంతో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో కర్రతో శబ్ధం చేసి నాగుపామును బైకు నుంచి వెళ్లగొట్టారు. -
రెచ్చిపోతున్న కేబుల్ దొంగలు
వరుసగా మోటార్ కేబుల్ వైర్లు చోరీ ● బెంబేలెత్తుతున్న రైతులు ● పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం దుబ్బాక: వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లను చోరీ చేస్తున్నారు. వరుసగా చోరీలతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా దుబ్బాక పట్టణంతో పాటు మునిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్, చీకోడ్ రోడ్డు, దుంపలపల్లి రోడ్డులో సబ్రిజిష్ట్రార్ కార్యాలయం ప్రాంతం, బల్వంతాపూర్ రోడ్డులో వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసుకొని ఎత్తుకెళ్లారు. పదిహేను రోజుల క్రితం పట్టణంలోని దుంపలపల్లి రోడ్డులో ఏదుల్ల చెరువు, నల్ల చెరువు, చీకోడ్ రూట్లలో వరుసగా సుమారు 50 మంది రైతులకు చెందిన మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం దొంగలు కేబుల్ వైర్లు ఎత్తుకెళ్తుండటంతో రైతులకు ఆర్థికంగా నష్టపోతున్నారు. స్టార్టర్ డబ్బా నుంచి బోరు మోటార్ వరకు ఉండే విలువైన కేబుల్ వైర్ను తస్కరిస్తున్నారు. దీంతో రైతులు మళ్లీ మోటార్ను పైకి తీయడం , మళ్లీ కొత్త కేబుల్ వైర్ వేయాల్సి వస్తుండటంతో ఒక్కో రైతుకు రూ.4 నుంచి 5 వేల వరకు ఖర్చు అవుతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకొని చోరీలను అరికట్టాలని కోరుతున్నారు. దొంగలను పట్టుకోవాలి మోటార్ల కేబుల్ వైర్ల దొంగతనాలతో ఇబ్బందులు పడుతున్నాం. నాతో పాటు చాలా మంది రైతుల కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. పోలీసులు దొంగలను పట్టుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – కేసుగారి స్వామి, రైతు, దుబ్బాక -
త్వరలో సబ్జైల్లో ట్రాన్సిట్ హోం
జోగిపేట(అందోల్): విదేశీయుల కోసం జోగిపేటలో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను త్వరలోనే ప్రారంభించనున్నామని అందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. డీసీపీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి శుక్రవారం జోగిపేట పాత సబ్జైల్లో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ సీసీఎస్లో ప్రస్తుతం 9మంది విదేశీయులు ఉన్నారన్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించే విదేశీ పౌరులు, పాస్పోర్ట్, వీసా తేదీ ముగిసిన తర్వాత కూడా దేశంలో తిరుగుతున్న వారు, జైలుశిక్షను పూర్తి చేసినవారు, పేరోల్పై ఉన్నవారు ఇతర రకాల రక్షణ అవసరమైన వారికి తాత్కాలికంగా వసతి కల్పించేందుకు ట్రాన్సిట్హోంను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విదేశీ కేంద్రంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా 70 మంది ఉండేలా వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ 2 దుర్గయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు.హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాస్ -
నేడు అందోల్లో మంత్రి దామోదర పర్యటన
జోగిపేట(అందోల్): అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ. 27 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించడంతోపాటు, కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నియోజకవర్గ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాహుల్ పోరాటానికి మద్దతుగా నిలవాలిటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ఈ బిల్లులో ఉన్న లోపాలను సరిదిద్దాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంట్లో పోరాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన నిరసన కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడారు. బీజేపీ చేస్తున్న హిస్సా చోరీకి వ్యతిరేకంగా రాహుల్ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మహిళా బిల్లును యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియాగాంధీ ప్రవేశపెట్టారని, ఈ బిల్లును తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తూ నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు పడేలా బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై రాజకీయకుట్ర జరుగుతోందని రాహుల్గాంధీ పలు ప్రశ్నలు లేవనెత్తారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీఅనంత కిషన్, చేర్యాల ఆంజనేయులు, రాంరెడ్డి, కూనసంతోష్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే ఎస్ఐఆర్ సర్వే చేస్తాంఅందోలు తహసీల్దార్కు బీఎల్ఓల స్పష్టీకరణ జోగిపేట(అందోల్): 2024 నుంచి పెండింగ్లో ఉన్న బీఆర్ఓల బిల్లులను చెల్లిస్తేనే జూన్లో ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ సర్వే చేస్తామని అంగన్వాడీ ఉద్యోగులు స్పష్టం చేశారు. శుక్రవారం అందోల్ తహసీల్దార్ మధుకర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం తమతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కులగణన చేసిన సర్వే డబ్బులు కూడా పెండింగ్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లులు ఇవ్వకుండా అదనపు భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి బల్దియా కో ఆప్షన్ సభ్యుల ఎంపికసంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ కో ఆప్షన్ అభ్యర్థులను శుక్రవారం ఎంపిక చేశారు. వీరిని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ఎంపిక చేసినట్లు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ వెల్లడించారు. ఎంపికై న ముగ్గురిలో ఇద్దరు మాజీ కౌన్సిలర్లే ఉన్నారు. రాంనగర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్(శివుడు), శివాజీనగర్ మాజీ కౌన్సిలర్ కల్వకుంట యశోద, మైనార్టీ నుంచి రిక్షా కాలనీకి చెందిన మహమ్మద్ సలాద్దీన్ పేర్లు ఖరారు చేసినట్లు తెలిపారు. మినీ హజ్హౌస్కు నిధులు -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
కేవీకే భూసార నిపుణుడు న్యాల్కల్(జహీరాబాద్): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జహీరాబాద్ కేవీకే భూసార నిపుణులు స్వామి అన్నారు. మండల పరిధిలోని మల్గి, రత్నాపూర్, మెరియంపూర్ గ్రామాల్లో భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రసాయన ఎరువుల వాడకం వల్ల తాత్కాలికంగా కొంత మేర దిగుబడులు పెరిగినా అనంతరం నష్టాలను చూడవలసి వస్తుందన్నారు. రైతులు భూసార పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, దీని వల్ల నేలల్లో లోపించిన పోషకాలను తెలుసుకోవచ్చని చెప్పారు. పంట మార్పిడి చేసుకోవాలని శాస్త్రవేత్త రమేశ్ రైతులకు సూచించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని వివరించారు. అనంతరం మట్టి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు అమీనా , పవిత్ర, నాగేశ్వరి, డీడీఎస్ సూపర్వైజర్ వినయ్తో పాటు రైతులు పాల్గొన్నారు. -
ఆకుకూరలు అమ్మేందుకు వెళ్తుండగా..
కారు ఢీకొని వ్యక్తి మృతి చేర్యాల(సిద్దిపేట): కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వీరన్నపేట స్టేజీ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ అపూర్వరెడ్డి వివరాల ప్రకారం... చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన తోడెంగల నర్సింహులు(48) ప్రతి రోజు ఉదయం పరిసర గ్రామాలకు వెళ్లి ఆకుకూరలు అమ్ముతుంటాడు. రోజు లాగానే ఉదయం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్నగర్, కట్కూరు గ్రామాల్లో ఆకుకూరలు అమ్మేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జనగామ వైపు నుంచి సిద్దిపేటకు వస్తున్న కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న నర్సింహులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే..
● వైద్యం వికటించి యువతి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన పటాన్చెరు టౌన్: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన బీరంగూడ డివిజన్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వందనపురి కాలనీకి చెందిన హారిక (28)కు బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో పట్టణంలోని తిరుమల ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు సర్జరీ చేయాలని వివరించారు. సర్జరీ కోసం రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు సరేనని చెప్పడంతో డాక్టర్ అన్విత సర్జరీ ప్రారంభించారు. కొద్దిసేపటికి వైద్యం వికటించడంతో యువతి మృతి చెందింది. విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతిరాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యంగా ప్రదర్శించారని, గతంలోనూ ఆస్పత్రిలో వైద్యం వికటించి మృతి చెందిన ఘటనలున్నాయని ఆరోపించారు. హారిక మృతికి కారకులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హారిక కుటుంబ సభ్యులకు తిరుమల ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరిపి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనివ్వొద్దు
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ పట్టణ శివారులోని కన్వెన్షన్ హాల్లో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ నిధులతోపాటు, ఎంపీ సురేశ్ షెట్కార్, తన నిధులు తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న అర్బన్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుందని సంజీవరెడ్డి తెలిపారు. -
రూ. 135 కోట్ల ప్రతిపాదనలు
● తాగునీటి ప్రాజెక్టుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ● 50ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక ● ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలి సదాశివపేట(సంగారెడ్డి): యాభై ఏళ్ల వరకు పట్టణ ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాగునీటి ప్రాజెక్టుకు రూ.135 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎంజీ బ్యాంకెట్ హాలులో మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు, విద్యుత్, మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్పర్సన్ రేణుక, కౌన్సిలర్లతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సమీక్ష నిర్వహించారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి పట్టణంలోని ఇంటింటికీ మంజీరా తాగునీరు సరఫరా చేసేందుకు ఇంటెక్వేల్, ఫిల్టర్బెడ్, ట్యాంకులు, నూతన పైప్లైన్ నిర్మాణం, ప్రతీ రోజు గంటన్నర తాగునీటి సరఫరాకు రూ.135 కోట్ల నిధుల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని సూచించారు. అందుబాటులోకి 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు 60 వేల పట్టణ జనాభాకు ప్రతీ రోజు 21లక్షల గ్యాలెన్ల తాగునీరు అవసరం కాగా నూతనంగా నిర్మించనున్న ప్రాజెక్టు స్కీమ్లో 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాజకీయాలకతీతంగా కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను అభిప్రాయాలు నమోదు చేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. ఈనెల 18న వ్యక్తిగతంగా ఎంపీ, ఎమ్మెల్యేను కలిసి అభిప్రాయలను తెలుసుకుని 19వ తేదీన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నివేదికను నిర్మలారెడ్డికి అందజేస్తే తాను సీఎం రేవంత్రెడ్డికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరతానని జగ్గారెడ్డి తెలిపారు. నిధులు మంజూరు కాగానే రెండేళ్లలో పనులు పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల ప్లాట్లు, వార్డు రూ.8 కోట్ల నిధులు గురించి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిద్దామని పాలకవర్గ సభ్యులకు సూచించారు. -
మహిళలకు కొనుగోలు కేంద్రాలు
కలెక్టర్ ప్రావీణ్యకంది(సంగారెడ్డి): మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కందిలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డితో కలసి ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా సమావేశాలు నిర్వహించి చట్టాలు, ప్రజలకు బాల బాలికల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈజీఎస్ పథకం ద్వారా మంజూరైన నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు ప్రహరీ గోడలు నిర్మించేందుకు సర్పంచులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం: నిర్మలారెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం సాగు కోసం రైతు భరోసా, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు ఇస్తుందన్నారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీఓ మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాఖాలో జాగ్రత్త
● డాక్టర్లకు డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత సూచన ● జోగిపేట ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ జోగిపేట(అందోల్): ‘ఆరోగ్యమంత్రి ఇలాఖా ఇది..అందరూ బాగా పనిచేయాలి’అంటూ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత వైద్యులకు సూచించారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...మంత్రి స్వంత నియోజకవర్గం కావడం వల్ల ప్రత్యేకంగా జోగిపేట మీదనే అధికారుల దృష్టి ఉంటుందన్న విషయాన్ని మరవకూడదన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రోజు అవుట్ పేషంట్లు ఎంతమంది వస్తుంటారని, ఇన్పేషంట్లు ఎంతమంది ఉన్నారని, ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయని, అందులో నార్మల్ ఎంత? ఆపరేషన్లు ఎన్ని అవుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలువార్డులను డీసీహెచ్ఎస్ పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలను గురించి పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. -
పథకాల ప్రచారంలో విఫలం
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్లు కొండాపూర్(సంగారెడ్డి): సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని పలు గ్రామాల సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్లో గురువారం జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వస్తున్నాయో కనీసం సర్పంచ్లకు కూడా సమాచారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో కూడా సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేశారని, అధికార పార్టీ సర్పంచ్ అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోవడంపై మల్కాపూర్ సర్పంచ్ అనిల్ కుమార్ మండిపడ్డారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, లీకేజీ అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని చెప్పారు. మండల ప్రత్యేకాధికారి వైద్యనాథ్ మాట్లాడుతూ..ప్రభుత్వానికి అధికారులు, ప్రజాప్రతినిధులు బండికి రెండు చక్రాల వంటి వారని, ఈ రెండు సమానంగా ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎంపీకి ప్రొటోకాల్ లేదా? ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది. ఏదైనా ప్రభుత్వం తరఫున సమావేశాలు, సభలు నిర్వహించినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజా ప్రతినిధుల ఫొటోలు ప్రొటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ప్రచురించాల్సి ఉంటుంది. అయితే బ్యానర్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు ఫొటోను ప్రచురించలేదు. అధికారులే స్వయంగా ఎంపీ ఫొటోను బ్యానర్లో ప్రచురించకపోవడంపై సభికులు బహిరంగగానే చర్చించుకున్నారు. -
కుల రహితులు 32 వేలు
జిల్లాలో 1.65 లక్షల జనాభాతో అత్యధికంగా మాదిగలు కులాన్ని వదులుకున్న వారిలో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కులాన్ని వదులుకున్న వారు 32,989 మంది ఉన్నారు. ఇలా ఏ కులమూ లేదని చెప్పిన వారిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో జీహెచ్ఎంసీ ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. కాగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మాదిగలు ఉన్నట్లు తేలింది. మొత్తం 1,65,209 మంది మాదిగ ఉప కులానికి చెందిన వారు ఉన్నారు. రెండో స్థానంలో షేక్లున్నారు. బీసీ–ఈ కేటగిరీ కింద ఉన్న వీరు 1,61,115 మంది ఉన్నట్లు స్పష్టమైంది. మూడో స్థానంలో ఉన్న ముదిరాజ్ల జనాభా 1,55,733గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీల్లో లంబాడాలు 91,327 మంది ఉండగా, మాలలు 85,109 మంది ఉన్నారు. 2024లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో ఆయా ఉపకులాల వారీగా వివరాలను పరిశీలిస్తే.. జిల్లాలో బీసీలు 6.69 లక్షలు, ఎస్సీలు 2.94 లక్షలు జిల్లాలో బీసీల జనాభా 6,69,885 ఉన్నట్లు తేలింది. జిల్లా జనాభాలో వీరు 46.26% ఉన్నట్లు గుర్తించారు. ఈ బీసీ కులాల కుటుంబాలు 1,99,250గా లెక్కగట్టారు. ఎస్సీల జనాభా 2.94 లక్షల మంది ఉన్నట్లు కులగణనలో తేలింది. మొత్తం 86,490 ఎస్సీ కుటుంబాలున్నట్లు తేల్చారు. మొత్తం జనాభాలో 20.35% ఎస్సీలుగా గుర్తించారు. ఎస్టీల జనాభా 1,01,233 ఉన్నట్లు గుర్తించారు. 6.99 శాతం మంది ఎస్టీలు ఉన్నారు. వీరి కుటుంబాలు 27,052గా తేలింది. జిల్లాలో ఓసీలు 1,67,620 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 11.57% ఉన్నట్లు లెక్కగట్టారు. 50,103 ఓసీ కుటుంబాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1.61 లక్షలతో రెండో స్థానంలో షేక్లు 1.55 లక్షలతో మూడో స్థానంలో ముదిరాజులు లంబాడాలు 91,329 ఉప కులాల వారీగా కులగణన లెక్కలు విడుదల చేసిన ప్రభుత్వం -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి ఝరాసంగం(జహీరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంక్షేమాధికారి లలిత కుమారి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీ్త్ర, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు తమ శాఖల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల, డిప్యూటీ తహసీల్దార్రాజు పాల్గొన్నారు. -
రేపు ఉద్యోగుల సమస్యలపై నిరసన
సంగారెడ్డి : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయనున్నట్లు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ తెలిపారు. జిల్లా టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు, జనరల్ సెక్రెటరీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి ఉమాదేవికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ.. పీఆర్సీ, సీపీఎస్, డీఏ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర హెచ్డబ్ల్యూఓ సంఘం అధ్యక్షుడు భాస్కర్, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు బలరాం, జిల్లా ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు నాయకులకు అభినందనలు తెలిపారు.టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ -
భూములు స్వాధీనం చేసుకోండి
● స్మార్ట్ సిటీ పనులు వేగిరం చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంసంగారెడ్డి జోన్: స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని, పనులు ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిమ్జ్, టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశలో 3,245 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. మొదటి విడతలో మిగిలి ఉన్న ఎల్గోయి, సిద్ధాపూర్, చిలేపల్లి, ముంగి, రుక్మాపూర్, హద్నూర్ గ్రామాల్లో భూము లు స్వాధీన పర్చుకొనేందుకు ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బృందంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు పూర్తి కాగానే స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్స్ ప్రత్యేక అధికారి విశాలాక్షి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, డీఎస్పీ సైదులు నాయక్ పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో వేగం పెంచాలి ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల కాంపౌండ్ వాల్స్ , మరుగుదొడ్లు, జీపీ బిల్డింగ్స్, మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులు నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి పనిని నాణ్యతతో చేపట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సూచించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు జిల్లాలో గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ను ఇంటి వద్దకే సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
మత్తు పదార్థాలను నివారిద్దాం
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో మత్తు పదార్థాలను నివారించేందుకు సర్పంచ్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. కొండపాకలోని మండల పరిషత్ కార్యాలయ ఐఓసీ భవనంలో బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిధులు వినియోగించడం వల్ల గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తాయన్నారు. గ్రామాల్లో సమస్య తీవ్రత మేరకు పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మత్తు పదార్థాల అమ్మకాలు, వినియోగాలు పెరిగిపోతుండటంతో యువత పెడదారిన పడుతున్నారన్న విషయాన్ని దృష్టి పెట్టుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. అంతకు ముందు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లికార్జున్, సర్పంచ్లు శివకుమార్, గంగాధర్, వెంకట్గౌడ్, ముత్యాల యాదవ్వ, బాలరాజు,కరుణాకర్రెడ్డి,మానస, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల్లో గుండె సమస్యలు గుర్తించాలి
● సకాలంలో చికిత్స అందించాలి ● సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిద్దిపేటకమాన్: చిన్న పిల్లల్లో గుండె సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స అందించడం వల్ల పరిష్కరించవచ్చని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి చిన్నపిల్లల విభాగ వైద్యులు సురేశ్బాబు, మనోహార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పిడియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో చిన్నపిల్లల్లో గుండె సమస్యలు, చికిత్స విధానం (పిడియాట్రిక్ కార్డియాలజీ సీపీఓ) అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రి నుంచి సీనియర్ కార్డియాలజిస్టు వైద్యులు శ్వేతబక్రు, ఫణిభార్గవి, గణపతి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిన్న పిల్లల్లో ఏమైనా గుండె సమస్యలు ఉంటే ముందుగా పలు రకాల పరీక్షల ద్వారా గుర్తించడం, అధునాతన చికిత్స విధానాలపై వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సంగీత, ఇంచార్జీ సూపరింటిండెంట్ డాక్టర్ చందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, పిడియాట్రిక్ విభాగ వైద్యులు డాక్టర్ టి.సి మనోహార్, వైద్యులు పాల్గొన్నారు. -
మా పాఠశాల భూమిని కాపాడాలి
పటాన్చెరు: పటాన్చెరులోని జెడ్పీహెచ్ఎస్ వివాదాస్పద భూమిలో ఆక్రమణలు తొలగించాలని, పాఠశాలను పునరుద్ధరించాలని కోరుతూ పూర్వ విద్యార్థులు, మేధావులు బుధవారం రోడ్డెక్కారు. పాఠశాలలో చదివిన స్థానిక రాజకీయ వేత్తలు, మీడియా ప్రతినిధులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న వారందరూ తరలి వచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పటాన్చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ, బీజేపీ నాయకురాలు గోదావరి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు బైండ్ల కుమార్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల గదులను రాత్రి పూట కూల్చివేయడాన్ని తప్పు బట్టారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల స్థలానికి ఇలాంటి దుస్థితి రావడం శోచనీయమని పేర్కొన్నారు. విశాలమైన భవనాన్ని అవసాన దశకు చేర్చి కబ్జాదారులకు ఆ ప్రాంతాన్ని అప్పజెప్పే కుట్ర సాగిందన్నారు. సుప్రీం కోర్టు అనుమతితో నిర్మించిన ప్రహరీ గోడను రాత్రికి రాత్రి కూల్చివేయడం దారుణమన్నారు. కాంపౌండ్ వాల్ కూలుస్తుంటే పాత భవనం నేలమట్టమైందని తప్పుడు నివేదిక ఇవ్వడం ఆక్షేపణీయమని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్థుడైన లాయర్ను నియమించి ఆ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ -
ఘన జీవామృతంతో భూమి సారవంతం
తయారీపై రైతులకు శిక్షణతొగుట(దుబ్బాక): ఘన జీవామృతంతో పాటు ఎకరానికి మరో 200 కిలోల ఎరువు వేసుకోవడం మూలంగా భూమిలో సూక్ష్మజీవులు సంఖ్య వృద్ధి చెంది భూమి సారవంతంగా తయారవుతుందని ఏఈవో నాగార్జున అన్నారు. బుధవారం మండలలోని బండారుపల్లిలో ఘన జీవామృతం తయారు చేసే విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ రైతు గునుగంటి రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఘన జీవామృతాన్ని రైతులతో తయారు చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పశువుల పేడ 100 కిలోలు, పశువుల మూత్రం 5లీటర్లు, ద్విదళ పప్పుల పిండి 2కేజీలు, బెల్లం 2కేజీలు, పిడికెడు పుట్టమన్ను లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను కలిపి ఘన జీవామృతం తయారు చేస్తున్నామని వివరించారు. వానాకాలం కోసం ఘన జీవామృతాన్ని రైతులు వేసవిలో తయారు చేసుకుంటే వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. దీనిని ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోలు వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామిగౌడ్, రైతులు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాలో రాణించాలి
నర్సాపూర్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థుల గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకురావాలని పిలుపునిచ్చారు. మూడు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. తాను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్, సీడీపీఓ హేమభార్గవి, కౌన్సిలర్లు నర్సమ్మ, రాజు, సరళ, ప్రాజెక్టు సూపర్వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహతాబేగం, సరళకుమారి, కవిత, వసుమతి, లక్ష్మి, నర్సమ్మ, సంతోష, కుమర్సుల్తానా, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
రూ.10 లక్షలతో పాఠశాలకు కంప్యూటర్లు, ఫర్నిచర్, వీల్చైర్ వితరణములుగు(గజ్వేల్): లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కంప్యూటర్ నైపుణ్యాల కోసం హైదరాబాద్ లయన్స్క్లబ్ జూబ్లీహిల్స్ వైటల్ సభ్యురాలు అనురాధ ఆర్థిక సహకారంతో రూ. 8 లక్షలు వెచ్చించి కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. కాగా ఉపాధ్యాయుల విరాళం ద్వారా ప్రతి నెల జీతం చెల్లిస్తూ వలంటీర్ను నియమించి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తుస్తున్నారు. అలాగే రూ.లక్షా50 వేల వ్యయంతో విద్యార్థుల కోసం అవసరమైన ఫర్నీచర్ను కరీంనగర్కు చెందిన పాస్ట్ కౌన్సిల్ లయన్ చైర్పర్సన్ రాజిరెడ్డి, నల్గొండకు చెందిన మోహన్రావు, హైదరాబాద్కు చెంది సూర్యరాజు, ఓబుల్రెడ్డి సహకారంతో సమకూర్చారు. అలియాబాద్కు చెందిన దివ్యాంగ విద్యార్థికి లయన్స్క్లబ్ సహకారంతో రూ.30 వేల విలువ చేసే వీల్చైర్ను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కనకయ్య, ఎంఈఓ ఉదయ్భాస్కర్రెడ్డి, ఉపసర్పంచ్ కర్ణాకర్రెడ్డి, క్లబ్ సభ్యులు అమర్నాథ్రావు, జ్యోతి, మాధవి, ప్రవీణ్, సంజయ్గుప్త పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి
నారాయణఖేడ్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారి పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి మారుమూల ప్రాంతంలో ఉండడంతో స్థానిక రోగులతోపాటు పక్క నియోజకవర్గాల రోగులకు కూడా వస్తుంటారని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు నిల్వలు ఉండేలా చూస్తూ అధునాతన సేవలు అందించేందుకు తగు పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, డీఎస్పీ వెంకట్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రమేష్, కౌన్సిలర్లు, సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు. వైభవంగా జాతర నిర్వహించండి మనూరు మండలంలోని సుప్రసిద్ధ బోరంచ నల్లపోచమ్మ జాతర ఈనెల 23వ తేదీ నుంచి 7 వారాలపాటు జరగనుంది. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. బోరంచ ఆలయం ఆవరణలో ఆలయం ఈఓ మహా రుద్రప్ప, చైర్మన్ మల్లయ్యలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బందితో కలిసి ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన మనూరు ఏఎస్ఐ గోవింద్ నాయక్ కుటుంబీకులను పరామర్శించారు. -
ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరం
పటాన్చెరు టౌన్: ట్రాఫిక్ నియమాలు పా టిస్తూ.. సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం బుధవారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన తప్పనిసరి అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. అతివేగం క్షణకాలం ఆనందాన్ని కలిగించినప్పటికీ, ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, భానూర్ సీఐ విజయ్ కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని సోమక్కపేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం రోడ్డు భద్ర పై అవగాహన సదస్సు నిర్వహించామని ఎంఈఓ విఠల్ అన్నారు. ముఖ్యఅథితిగా సర్పంచ్ దుర్గాచలం హాజర య్యారు. సర్పంచ్ను సన్మానించిన ఉపాధ్యాయ సిబ్బంది అతనికి హెల్మెట్ను బహూకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ.. అవగాహన లేకుండా వాహనాలు నడిపించడ మూలంగా, కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ తదితర విషయాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ -
అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తం
● జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సందన్న ● సిద్దిపేటలో మాక్ డ్రిల్తో అవగాహనసిద్దిపేటకమాన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి సందన్న తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్, ఆర్టీసీ డిపో వద్ద అగ్నిమాపక సిబ్బంది బుధవా రం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సిబ్బంది స్పందించే తీరు, నీరు ద్వారా ప్రమాదాలను నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నిప్పు రవ్వలను తేలికగా తీసుకోకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కల్పించి పోస్టర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సిద్దిపేట అగ్నిమాపక స్టేషన్ ఇన్చార్జి అధికారి సికిందర్, సిబ్బంది రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో చట్టం.. రక్షణ కవచం
మెదక్జోన్: పోక్సో చట్టం చిన్నారులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో 8 మంది దోషులకు జైలు శిక్ష వేయగా, వారిలో ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. మరో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు పోక్సో 2012లో ఆవిర్భవించగా జిల్లాలో 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది వరకు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కొనసాగించగా, 2025 జూన్లో పోక్సో కోర్టుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించారు. కాగా గడిచిన 2 నెలల్లో 8 మంది నిందితులకు శిక్ష పడగా, అందులో ఆరుగురికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి మూడేళ్లజైలు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎప్పుడూ లేని విధంగా పోక్సో కోర్టు ఇటీవల రెండు నెలల వ్యవధిలో 8 మంది దోషులకు శిక్షలు విధించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన అవసరం మైనర్లపై అఘాయిత్యాల నేపథ్యంలో పోక్సో చట్టం ఏర్పాటు అయింది. ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పరువు అంటూ కొందరు రాజీపడి కోర్టుల్లో సాక్ష్యాలు చెప్పకపోవడంతో దోషులు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చట్టంపై అవగాహన లేకపోవటమే. – బాలయ్య, పోక్సోకోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్భయంగా చెప్పాలి బాలికలపై అఘాయిత్యాలు తగ్గాలంటే బాధితులు కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పి దోషులకు శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే బాలికలపై అఘాయిత్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. – శ్రీనివాసరావు, ఎస్పీపరువు ముసుగులో రాజీ ఏడాది కాలంగా జిల్లాలో 500 పైచిలుకు కేసులు నమోదు కాగా, గడిచిన పది నెలల్లో 350 పైచిలుకు పోక్సో కేసులు ట్రయల్కు వచ్చాయి. వాటిలో కేవలం 8 మందికి శిక్షలు పడగా, మిగితా వారు బాధితులతో రాజీపడి కేసుల నుంచి తప్పించుకోగలిగారు. ఇందులో ప్రధానంగా పరువు పోతుందనే భావనతో నింధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావటం లేదని తెలిసింది. మరికొంత మంది బాధితులకు డబ్బు ఎరవేసి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. 2 నెలల వ్యవధిలో 8 మందికి శిక్ష హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు చట్టంపై అవగాహన అవసరం : న్యాయ నిపుణులు -
వెయ్యి మంది రేవంత్లు వచ్చినా ఆపలేరు
ఎంపీ రఘునందన్రావు మెదక్జోన్: వెయ్యి మంది రేవంత్రెడ్డిలు వచ్చినా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపలేరని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం రాత్రి మెదక్లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్, నారీ సమ్మేళన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందని, అడ్డుకుంటామంటూ సీఎం రేవంత్రెడ్డి అనడం సరికాదన్నారు. మహిళల ఆత్మాభిమానం కాపాడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఇంట్లో టాయిలెట్స్ నిర్మించారని కొనియాడారు. భారత దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించాడు. పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందుతాయన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ నేతలు మల్లేశంగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అమ్ముడుపోని ఫ్లాట్లలో..
● తనవారినే అద్దెకు దించి డ్రామాలు ● ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చిన హైడ్రా ● ‘అమీన్పూర్ కూల్చివేత’లపై అధికారుల వివరణసాక్షి, సిటీబ్యూరో: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ఎంఏ ముఖీం న్యాయవాది ముసుగులో సాగిస్తున్న ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టిందని అధికారులు మంగళవారం వివరణ ఇచ్చారు. అతడి సోదరుడు ఎంఏ అజీం దుబాయ్లో ఉంటున్నారని, షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు పట్టించుకోకుండా తన అనుచరగణంతో కలిసి అనుమతులు తీసుకుకోకుండానే ప్రభుత్వ భూమిలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా... ఐలాపూర్లో అజీం ఇప్పటికే నాలుగు అపార్టుమెంట్లు నిర్మించి విక్రయించారు. శనివారం తొలగించిన భవనం నిర్మాణ దశలోనే హైడ్రా హెచ్చరించింది. దానికి ఎలాంటి అనుమతులు లేవని గత ఏడాది జూన్ 25న షోకాజ్ నోటీసు ఇచ్చింది. గతంలో గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చిందని.. కిష్టారెడ్డిపేటలోకి తన భవనం వస్తుందని అజీం వివరణ ఇచ్చారు. హైడ్రా విచారించగా పంచాయతీ, తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలోనూ అనుమతులు తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదు. దీంతో గత ఏడాది జులై 3న హైడ్రా స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసింది. అజీం కడుతున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేనందున తొలగించాలని సూచిస్తూ, పక్షం రోజుల గడువు ఇచ్చింది. అయినప్పటికీ భవన నిర్మాణాన్ని అజీం పూర్తి చేశారు. హైడ్రా నోటీసుల నేపథ్యంలో ఆ భవనంలోని 45 ఫ్లాట్లలో ఏ ఒక్కటినీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన అనుచరులతో పాటు ఈ విషయాలు తెలియని అమాయకులకు 20 ఫ్లాట్లు విక్రయించారు. నివాసాల జోలికి హైడ్రా వెళ్లదనే ఉద్దేశంతో వీరందరినీ అన్ని అంతస్తుల్లో ఉన్నట్టు చూపించారు. దీంతో హైడ్రా అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయించాలని సూచిస్తూ భవన యజమానికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న అజీం ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో మరికొంతమంది అనుచరులను దించే పనిలో నిమగ్నమయ్యాడే తప్ప అందులో ఉన్నవారిని ఖాళీ చేయించలేదు. దీంతో గత నెల 11న అమీన్పూర్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపూర్లోని 1263 ఎకరాల భూమి స్వరూపం మారకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ ముఖీం గెస్ట్హౌస్తో పాటు 40 ఎకరాల్లో ఫామ్హౌస్ నిర్మించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ముఖీం సోదరుడు నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని తొలగించే పనిని హైడ్రా శనివారం చేపట్టింది. అందులో ఉంటున్న వారికి డీఆర్ఎఫ్ సిబ్బంది సహకరిస్తూ వారి సామాన్లు భద్రంగా కిందకు దించారు. అందులో ఉన్న కొద్దిమందిని ఖాళీ చేయించడానికి, తరలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైడ్రా సమయం ఇచ్చింది. -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్సిద్దిపేటఅర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి వంట సిబ్బందిని, ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మిట్టపల్లి– ఎల్లుపల్లి శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట గదిలో అన్నం, పెరుగు, గుడ్డు, పప్పు, పప్పుచారు మాత్రమే వండారని, మిగతా కూరలు లేవా అని అడిగారు. ఇందుకు కూరగాయలు ఆలస్యంగా రావడంతో వంట ఆలస్యమైందని సిబ్బంది తెలిపారు. త్వరగా పూర్తయ్యే కూరగాయలు వండి విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. వంట వండే వరకు అక్కడే కాసేపు విద్యార్థులతో మాట్లాడి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. రోజు మెనూ తప్పనిసరిగా పాటించాలని చేసిన వంటలు నాణ్యతగా, రుచికరంగా వండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని వంట సిబ్బందిని, ఉపాధ్యాయులను హెచ్చరించారు. -
మరమ్మతులు కరువు
పట్టణంలోని రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జి సైడ్ వాల్ గ్రిల్స్ దెబ్బతిని ఊడి కిందపడుతున్నాయి. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి గుండా ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. సైడ్వాల్ గోడలు ఊడిపడి రోడ్డు సైతం దెబ్బతిని గుంతలుపడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరగక ముందే స్పందించాలని అధికారులను ప్రజలు కోరుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. –జహీరాబాద్ టౌన్ జహీరాబాద్ నుంచి తాండూర్ రహదారిలో పట్టణంలోని బాగారెడ్డి పల్లి ప్రాంతంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కారణంగా రాంనగర్, హోతి(కె), మల్చెల్మ, శేకాపూర్తో పాటు తాండూర్ తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. రెండున్నర దశాబ్దాలు దాటడంతో బ్రిడ్జి దెబ్బతింది. బ్రిడ్జికి ఇరువైపులా సైడ్ వాల్ గ్రిల్స్(గోడలు) దెబ్బతిని పెచ్చులూడి కిందపడుతున్నాయి. బ్రిడ్జి కింద ఉన్న నివాస ప్రాంతాల్లో పడటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. గత సంవత్సరం ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సైడ్ గ్రిల్స్పైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు కింద పడకుండా మధ్యలోనే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సైడ్వాల్ గ్రిల్స్(పిట్టగోడ) కూలిపోవడంతో కాలినడకన వెళే పిల్లలు, వృద్ధులు, పాదచారులు కిందపడే అవకాశాలున్నాయి. కొంత మంది యువకులు ప్రమాదాల నివారణకు సైడ్వాల్ గోడలు కూలిన ప్రాంతంలో కర్రలను అడ్డంగా కట్టారు. రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని ప్రమాదం పొంచి ఉన్నా.. సంబంధింత శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిడ్జి సైడ్ వాల్ గోడలు దెబ్బతిని నెలలు గడుస్తున్న అధికారులు స్పందించడం లేదు. రోడ్డు మధ్యలో పడిన గుంతలను కూడా పూడ్చడం లేదు. బ్రిడ్జికి ఇరుపక్కల గల స్ట్రీట్ లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. రాత్రి ఫూట అంథకారం నెలకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. చినుకుపడితే చాలు బాగారెడ్డి విగ్రహం వద్ద మోకాలి వరకు నీరు నిలుస్తుంది. దీంతో బ్రిడ్జి పైనుంచి ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. -
నేడు మావోయిస్టు భాగ్య అంత్యక్రియలు
ఎన్కౌంటర్తో ముగిసిన దుబ్బాక విప్లవ ప్రస్థానంమిరుదొడ్డి(దుబ్బాక): ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన మండలంలోని ధర్మారంలో బుధవారం జరగనున్నాయి. ఇప్పటికే మావోయిస్టు భాగ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆమె పెద్ద చెల్లెలు కవిత, తమ్ముడు కుమార్తో పాటు గ్రామస్తులు కాంకేర్ జిల్లాకు తరలివెళ్లారు. భాగ్య మృతదేహానికి కాంకేర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తీసుకురానున్నారు. కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు కన్నీటి పర్యంతంతో ఎదురు చూస్తున్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు భాగ్య ఎన్కౌంటర్లో హతమవడంతో దుబ్బాక గడ్డపై పురుడు పోసుకున్న మావోల ప్రస్థానం ముగిసిందన్న చర్చలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
పటాన్చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాల ప్రకారం... బీహార్కు చెందిన సురేశ్రాయ్ ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరంబండ లో డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఎండు గంజాయిని కొనుగోలు చేసి, మూడు నెలలుగా పటాన్చెరులో విక్రయిస్తున్నాడు. కాగా ఒడిశాలోని మల్కనగిరి అటవీ ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తుల నుంచి కిలో గంజాయిని కొనుగోలు చేసి, ఆర్టీసీ బస్సులో పటాన్చెరుకు తిరిగొచ్చాడు. వచ్చే దారిలో దాదాపు 200 గ్రాముల గంజాయిని అమ్మి, ఆ వచ్చిన డబ్బును ప్రయాణ ఖర్చుల కోసం వాడుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం సాయంత్రం రామేశ్వరం డెయిరీ ఫాం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 798 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ను సీజ్ చేసి నిందితున్ని రిమాండ్కు తరలించారు. -
సమ్మె సంకటం
ఆర్టిజన్ల సమ్మెతో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం పనిచేయని ట్రాన్స్ఫార్మర్లు ● ఆందోళనలో రైతులుమెదక్జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్శాఖలో ఆర్టిజన్లుగా 1,570 మంది పనిచేస్తున్నారు. వీరంతా రెగ్యులర్ రైజ్ కోసం వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ సరఫరాలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెగ్యులర్ లైన్మెన్లు, ఇతర ఉద్యోగులు ఉన్నప్పటికీ ఆర్టిజన్లు లేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, లైన్లు తెగిపోయినా, ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయినా పరిష్కారం కాదడం లేదని ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారు. రెగ్యులర్ చేయాలని.. గతంలో సబ్స్టేషన్ల నిర్వహణను కాంట్రాక్టర్స్కు అప్పగించేవారు. వారు సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా ఐటీఐ, డిప్లమా, బీటెక్ లాంటి విద్యార్హతలు గల వారిని ఆపరేటర్లుగా నియమించుకొని కొనసాగించారు. కాగా అప్పట్లో 2 నుంచి 3 నెలలకోసారి వారికి గుత్తేదారు జీతాలు చెల్లించేవారు. అది కూడా వేతనంలో కొంత కోతపెట్టి ఇచ్చేవారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి స్తంభాలు ఎక్కించటం, బిల్లుల వసూళ్లు, విద్యుత్ సమస్యలు వస్తే వారితేనే చేయించేవారు. కాగా బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించే వారిలో కొంత మందిని విద్యుత్శాఖలో విలీనం చేస్తూ ‘ఆర్టిజన్లు’గా తీసుకున్నారు. దీంతో వారి సీనియార్టీని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వేతనం చెల్లిస్తున్నారు. కానీ వీరిని నేటికీ రెగ్యులర్ చేయలేదు. దీంతో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, అన్నిరకాల బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రధాన డిమాండ్స్.. ఆర్టిజన్లకు వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న ఓఅండ్ఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలి టీజీఎస్సీడీసీఎల్లో పనిచేసే ఆన్మన్ వర్కర్లను ఆర్టీజన్లుగా గుర్తించాలి విద్యుత్ సంస్థలో 2016 డిసెంబర్ కంటే ముందు అన్ని అర్హతలుండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలి. 2026 వేతనం అండ్ పీఆర్సీ వెంటనే అమలు చేయాలిఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు పోతరాజు పోచయ్య. ఈయనది చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామం. ఇతనితో పాటు మరో ముగ్గురు రైతులు కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోగా.. దాని ద్వారా నాలుగు బోర్లు నడుస్తున్నాయి. వాటి పరిధిలో 20 ఎకరాల్లో నాట్లు వేశారు. వారం క్రితం గాలిదుమారం రావడంతో ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆర్టిజన్లు సమ్మె చేయటంతో బాగు చేసేందుకు ఎవరు ముందుకు రావటం లేదు. వరి పంటకు మరో తడి నీరు పెడితే దిగుబడి వస్తుందని, కరెంటోళ్లకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించటం లేదు. ఇది ఒక్క పోచయ్య సమస్యే కాదు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులతో పాటు విద్యుత్ వినియోగదారుల పరిస్థితి.హామీ నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగాల్లో నియమిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి నేటికీ రెండున్నరేళ్లు అవుతున్నా సమస్యలను పట్టించుకోలేదు. రెగ్యులర్ చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం. – బీఎన్ స్వామి, ఉమ్మడి జిల్లా ఆర్టిజన్ల సంఘం అధ్యక్షుడు -
ముప్పై ఏళ్లుగా అద్దె ఇంట్లోనే..
ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచిన్నశంకరంపేట(మెదక్): ముప్పై ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నానని, ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో సొంతింటి కల నెరవేరనుందని నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నాగులగారి అశోక్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశాడు. మంగళవారం శేరిపల్లి సర్పంచ్ సంతోష, ఉపసర్పంచ్ విజయ్కుమార్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం అతడికి అందించారు. ఈ సందర్భంగా అశోక్గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో తాను ఆర్సీసీ బిల్డింగ్లో అద్దెకు ఉంటున్నాననే కారణంతో ఇల్లు మంజూరు కాలేదన్నారు. తాజాగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చొరవతో పాటు గ్రామ నాయకుల కృషితో ఇల్లు మంజూరైందని తెలిపాడు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాలాజీ, భరత నర్సింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు విద్యార్థులు ఎంపిక
తూప్రాన్: జాతీయ స్థాయి స్కూల్ గేమ్ పోటీలకు తూప్రాన్ బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. గురుకులంలో చదివే సింధూజ, ప్రసన్న గత నెలలో మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ అండర్ –14 సాఫ్ట్బాల్ 69వ జాతీయ స్కూల్గేమ్స్ పోటీలకు ఎంపియ్యారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ఎంఈఓ సత్యనారాయణ అభినందించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకర్కు సన్మానం నారాయణఖేడ్: ఖేడ్ పట్టణానికి చెందిన సంహిత ఇంటర్మీడియెట్లో 1000కి గాను 992 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ 5, 9వ వార్డుల కౌన్సిలర్లు మహేశ్ చౌహాన్, బాణాపురం రాజు సంహితతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆమె తండ్రి వడ్ల రాజయ్యను ఆదివారం వారి స్వగృహంలో సన్మానించారు. వన్యప్రాణుల దాహార్తికి చర్యలు శివ్వంపేట(నర్సాపూర్): భానుడి ప్రతాపంతో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో గ్రామాల్లో నీటిఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అడవిలో ఉండే వన్యప్రాణుల దాహార్తి తీర్చ డం కోసం అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చడం కోసం అడవిలో ఏర్పాటు చేసిన 10 సాసర్ పిట్స్లో ప్రతిరోజూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి నుంచి మే చివరివరకు నీటిని సమకూర్చుతున్నట్లు బీట్ అధికారులు తెలిపారు. మూగజీవాల దాహార్తిని తీరుస్తున్న అటవీశాఖ సిబ్బందిని జంతు ప్రేమికులు, పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు. పేకాట ఆడుతున్న నలుగురి అరెస్టుమర్కూక్(గజ్వేల్): పేకాట ఆడుతున్న నలుగురిని టాస్క్ఫోర్స్, పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మండలంలోని పాములపర్తి శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ దామోదర్ వివరాల ప్రకారం... జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులకు పాములపర్తి శివారులో మంగళవారం పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు వారు పేకాట స్థావరంపై దాడి చేసి అచ్చంగారి పాండురంగం, లింగాని భాస్కర్, నీరుడి నాగరాజు, సాయిరెడ్డి జింతేందర్రెడ్డిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7,200 నగదు, మూడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామచంద్రాపురం(పటాన్చెరు): బెల్ టౌన్షిప్లోని సీఐఎస్ఎఫ్ యూనిట్లో మంగళవారం జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సోనుసింగ్ సికర్వార్ అగ్నిమాపక కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజల పాటు ప్రజల్లో అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలల్లో మాక్ డ్రిల్, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక ఇన్స్పెక్టర్ బీఎస్ బండారి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం
సిద్దిపేటఅర్బన్: పీడిత వర్గాల అభ్యున్నతికి బీఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రాం విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికి కేబినెట్ ర్యాంకు పదవి, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తనకు ఆహ్వానం పంపించలేదని, కరపత్రంలో పేరు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు సైతం పంపుతున్నారని, కానీ సిద్దిపేట కలెక్టర్ మాత్రం ఆహ్వానించకుండా తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను మాత్రమే కాదు.. కోటి మంది దళితులను అవమానించినట్టేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ సర్పంచ్ రాజయ్య, ఉప సర్పంచ్ కిష్టయ్య, వెంకట్, శ్రీనివాస్, ఎల్లేశ్, తిరుపతి, గుండెల్లి శ్రీనివాస్, రాజయ్య, కుమారస్వామి, అశోక్, బాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాలపై అవగాహన
జోగిపేట(అందోల్): అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 20 వరకు నిర్వహిస్తున్నట్లు జోగిపేట ఫైర్ ఆఫీసర్ టి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బందికి మౌనం పాటించి, వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1944 ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డాక్యార్డ్లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం జరగడంతో 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పనితీరు భేష్వైద్య సేవలపై కమిషనర్ కితాబు నారాయణఖేడ్: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రి రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, మందుల వివరాలను తెలుసుకొన్నారు. అవసరమైన పరికరాలు, సిబ్బంది, తదితర వివరాలతో నివేదికను తయారు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రమేష్కు సూచించారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత ఉన్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ రామచంద్రాపురం(పటాన్చెరు): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బెల్ టౌన్షిప్లో అరైవ్వ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కార్మికులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రధానంగా వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై కఠినంగా వ్యవరిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్ ఈడీ శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంత రావు, రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, ఇన్స్పెక్టర్లు విద్యాసాగర్ రెడ్డి, లాల్ నాయక్, సురేష్ బాబు, ప్రశాంత్, కార్మిక సంఘం నేత కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఎమ్మెల్యే సంజీవరెడ్డి పెద్దశంకరంపేట(మెదక్): కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 24 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం శివాయిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాస్, నాయకులు మధు, నారాగౌడ్, మురళి, రాజేందర్గౌడ్, సంగమేశ్వర్, పెరుమాండ్లుగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, ఏపీఎం శకుంతల పాల్గొన్నారు. -
పాఠ్యాంశంగా రోడ్డు భద్రత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రోడ్డు భద్రతా అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డుభద్రతపై మరింత అవగాహన పెంచేందుకు ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఐఐటీలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయని, కుటుంబాల భవిష్యత్ను చీకటిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రమాదాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులను సాయం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ఏటా దేశంలో 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ 10,081 బస్సులతో దేశంలోనే మూడో అతిపెద్ద రవాణా సంస్థగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్మూర్తి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్పంకజ్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే బోధన జరిగేలా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఐఐటీహెచ్ఓలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం -
పేదింటి ఆడబిడ్డకు సర్కార్ సాయం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్లో మంగళవారం ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 843 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండటానికి ప్రభుత్వం పెళ్లికి ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ప్రభుత్వం పేదలు, మహిళల సంక్షేమ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇంత వరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదని విమర్శించారు. రైతు భరోసా నిధులు కూడా ఇంత వరకు పూర్తిగా విడుదల చేయలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యూనుస్, వైస్ చైర్మన్ శిరీష్, ఆర్డీఓ దేవూజా, తహసీల్దార్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ తులం బంగారం ఏదీ.? : ఎమ్మెల్యే -
మంచు కొండల్లో దక్షిణాది రుచులు
ప్రశాంత్ నగర్ (సిద్దిపేట): కేదార్నాథ్ దర్శనానికి వచ్చే భక్తులకు మంచు కొండల్లో దక్షిణాది రుచులను అందిస్తున్న కేదారినాథ్ అన్నదాన సేవా సమితి సభ్యుల కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కేదార్నాథ్కు వెళ్లే సరుకుల లారీని మంగళవారం శరభేశ్వర ఆలయం వద్ద జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడారు. భక్తులకు ఇక్కడి రుచులతో భోజనం అందించడం తృప్తిగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సహకారంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్, రత్నాకర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలువర్గల్(గజ్వేల్): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మజీద్పల్లి శివారులో తూప్రాన్–గజ్వేల్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, మృతుని కుటుంబీకుల వివరాల ప్రకారం.. మండలంలోని మాదారం గ్రామానికి చెందిన నీరుడి నర్సింహులు(58), తన అన్న కొడుకు పీర్లపల్లికి చెందిన ఎర్ర మల్లేశ్ బైక్పై మంగళవారం తెల్లవారుజామున మజీద్పల్లి శివారు పెట్రోల్ బంకు వైపు నుంచి ఇంటికి వస్తున్నారు. వీరి బైకును తూప్రాన్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైకు వెనక కూర్చున్న నర్సింహులు తల చిద్రమై, మెదడు రోడుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు నడిపిస్తున్న మల్లేశ్ కాలు నుజ్జునుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అంబులెన్స్లో గజ్వేల్కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నర్సింలుకు భార్య లక్ష్మి, కుమారుడు మహేశ్, కూతురు ప్రత్యూష ఉన్నారు. వీరి వివాహాలు అయ్యాయి. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటున్న ఆయన మృతితో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మాదారం, పీర్లపల్లి గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వసతులు లేకపాయె.. నిరీక్షణ తప్పదాయె
● ఎండవేడిమికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయని అధికారులు నర్సాపూర్: నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థానిక బస్టాండులో ఆర్టీసీ అధికారుల ఏర్పాట్లను గమనిస్తే ప్రయాణికుల పట్ల వివక్ష చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండు నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్ మార్గాల నుంచి వచ్చి అటు వైపు వెళ్లే బస్సులు బస్టాండు శాశ్వత భవనంలోని ప్లాట్ ఫాం వైపు వచ్చి వెళ్తుంటాయి. శాశ్వత బస్టాండులో అధికారులు ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్లు అమర్చారు. కాగా శాశ్వత బస్టాండుకు ఎదురుగా ఉన్న షెడ్డుతోపాటు ప్లాట్ఫాం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పటాన్చెరుతో పాటు నియోజకవర్గంలోని వెల్దుర్తి, మానెపల్లి, రత్నాపూర్, ఎల్లమ్మగూడ, గోమారం, వెంకటాపూర్ తదితర గ్రామాల బస్సులు వచ్చి వెళ్తుంటాయి. కాగా తాత్కాలిక షెడ్డులో ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఫ్లోరింగ్పై కూర్చుని బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో మధ్యాహ్నం ఫూట షెడ్డు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు రేకుల షెడ్డు వేడెక్కడంతో షెడ్డు కింద చాలా వేడిగా ఉంటుందని, షెడ్డు లోపలికి సైతం ఎండ వస్తుందని వాపోతున్నారు. ఫ్లోరింగ్ సైతం వేడెక్కడంతో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్డులో ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక షెడ్డు వద్ద కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
అంబేడ్కర్ అందరివాడు
● ఘనంగా జయంతి వేడుకలు ● ర్యాలీలు, రన్, అన్నదాన కార్యక్రమాలు ● నూతన విగ్రహాల ఆవిష్కరణ ● పాల్గొన్న ప్రముఖులుసంగారెడ్డి: అంబేడ్కర్ అందరివాడని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో అంబేడ్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, అదనపు కలెక్టర్ పాండు తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా సంగారెడ్డి మండలం నాగపూర్లో అంబేడ్కర్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. పట్టణంలోని యువజన సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో రన్లు, ర్యాలీలు, మహా ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత నడిచి, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. -
సామాజిక న్యాయం, సమానత్వం
సంగారెడ్డి జోన్: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుచుకుని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ సూచించారు. 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్పన్ నిర్మలారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తోందని, సమాన అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.సర్కార్ ధ్యేయం: మంత్రి దామోదర -
‘స్మార్ట్ సిటీ’ పనులు వేగిరం చేయండి
ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు వేగిరం చేయాలని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ రజత్ కుమార్ సైనీ సూచించారు. మంగళవారం మండలంలోని బర్దిపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి, రుక్మాపూర్ తండా శివారులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు భూములను టీజీఐఐసీ ఎండీ శశాంక, కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న సమయంలో రైతులు ఎందుకు అడ్డుపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మొదటి విడతలో సేకరించిన 3,245 ఎకరాలలో ప్రాజెక్టు నెలకొల్పనున్నట్లు అధికారులు వివరించారు. పలువురు రైతులకు పరిహారం అందకపోవడం, రెండో విడత భూ సేకరణ చేయొద్దని, భూముల కోల్పోయిన రైతులందరికీ ఒకే రకమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం బర్దిపూర్ శివారులో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ రజత్ కుమార్ మాట్లాడుతూ 24 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. భూ ములు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందే విధంగా చూడాలన్నారు. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, తాగునీరు, తదితర మౌలిక వసతుల పనులు నాణ్యత లోపించకుండా చేపట్టాలన్నారు. ఎన్ఐసీడీసీ సీఈఓ రజత్ కుమార్ సైనీ భూముల పరిశీలన.. అధికారులకు సూచనలు -
ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత దాకా ఆపరేషన్ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా అంటోంది. ఐలాపూర్లో ఓ భారీ భవనంపై కూల్చివేతపై కోర్టు సోమవారం స్టే ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భవనం పూర్తిగా కూల్చకుండా వదిలేసింది హైడ్రా. కూల్చకుండా వదిలేస్తే పక్కన ఉన్న భవనంపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా కూల్చాల్సిందేనని అంటున్నారు. కానీ.. హైడ్రా చర్య కోర్టు ధిక్కరణ(కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కిందకే వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఒకవేళ మొండిగా కూల్చివేతలు మొదలుపెడితే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఏం జరిగిందంటే.. శనివారం అమీన్పూర్ మండల పరిధిలో పలు చోట్ల అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. ఆ సమయంలోనూ విపరీతమైన గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత ఆగిందని కాసేపు.. హైడ్రానే కావాలని కాసేపు కూల్చివేతలు ఆపిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఈలోపు ఐలాపూర్ కూల్చివేతలపై ఓ వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతకు దిగారని పేర్కొన్నారు. అయితే.. హైడ్రా తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ.. కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందేనని.. పైగా ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదంటే తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. -
హాస్టల్ గదులు విశాలంగా నిర్మించాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి: నియోజక వర్గంలో విద్యార్థులకు నిర్మిస్తున్న హాస్టల్ భవనాల గదులు విశాలంగా నిర్మించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నూతనంగా హాస్టల్ భవనాలు, అదనపు గదుల నిర్మాణపై సోమవారం జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పాండు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్ తదితరులతో కలిసి వెలుగు ఆఫీసు ప్రాంగణానికి వెళ్లి నిర్మాణంలో ఉన్న బీసీ బాలికల హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలు బస చేసే గదులతోపాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్, భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ...వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న బీసీ గర్ల్స్ హాస్టల్ భవనం తరహాలో సంగారెడ్డి నియోజకవర్గంలో మిగతా హాస్టళ్లూ నిర్మించాలన్నారు. అవసరమైన నిధులను తాను ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని అధికారులకు భరోసా ఇచ్చారు. నిధుల విషయాన్ని త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ విభాగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని అధికారులకు వివరించారు. జాతరకు ర్యాకల్ ఎల్లమ్మ ఆలయం ముస్తాబునారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఈనెల 15వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ర్యాకల్ ఎల్లమ్మకు మొక్కులు తీర్చుకుంటే వివిధ వ్యాధుల బారిన పడ్డ చిన్నారులు కుదుట పడతారని ప్రతీతి ఉండటతో ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈనెల 15న బోనాల ఊరేగిం పు, ఈనెల 16న బండ్ల ప్రదర్శన, 17న పాచిబండ్ల ప్రదర్శన, నిండు జాతర, 18న కుస్తీ పోటీలు, 19న చివరి పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు. పీఆర్సీ అమలు చేయాలిటీఎస్ యూటీఎఫ్ డిమాండ్ నారాయణఖేడ్: ఉపాధ్యాయులకు పెండిగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించి పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 50% ఫిట్మెంట్ను 2023 జూలై 1 నుంచి అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ జాదవ్ డిమాండ్ చేశారు. ఖేడ్లో సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సంఘం ఉద్యమ పతాకాన్ని సీనియర్ నాయకులు సంగయ్య ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..విద్యారంగ అభివృద్ధికి సంఘం ఇతోధికంగా పాటుపడాలన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్ బాధ్యులు ఏశప్ప, నరేశ్, నర్సయ్య, హరిసింగ్, జ్యోతిలింగం, ఏసుదాస్, శ్రీరామ్, మండలాల బాధ్యులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్పై దాడి చేసిన వారికి బెయిల్కంగ్టి(నారాయణఖేడ్): అంగన్వాడీ టీచర్పై దౌర్జన్యానికి పాల్పడిన నిందితులకు కోర్డులో ఊరట లభించింది. మండలంలోని రాసోల్ గ్రామంలో ఇటీవల అంగన్వాడీ టీచర్ పి.వసంతకుమారి(61)దాడి చేసిన కేసులో నిందితులు అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, వైద్యనాథ్, బండెప్ప, రాములుకు సోమవారం ఖేడ్ మున్సిపల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి తెలిపారు. -
నిండుకుంటున్న నిల్వలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్షాపుల్లో బియ్యం నిల్వలు తరచూ నిండుకుంటున్నాయి. ఒక్కో కార్డుదారునికి ఇచ్చే బియ్యం మూడు రెట్లు పెరగడంతో స్టాక్ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే నిల్వలు అడుగంటుతున్నాయి. రేషన్షాపులకు బియ్యాన్ని సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ నిల్వలు లేకుండా పోయాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పించడంలో తలమునకలయ్యారు. జిల్లాలో ఈ సన్నబియ్యం నిల్వలు లేకపోవడంతో పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లారీల రాకకు సమయం పడుతుండటంతో పంపిణీలో కాస్త ఆలస్యమవుతోంది. దీనికితోడు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో గతంలో ఈ బియ్యాన్ని తీసుకునే కార్డుదారులు గణనీయంగా పెరిగారు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో బియ్యం తీసుకునేందుకు గడువు పొడిగించారు. సాధారణంగా ప్రతీనెల 20 తేదీలోపు బియ్యం తీసుకునేందుకు వీలుంటుంది. అయితే ఈ గడవును నెలాఖరు వరకు పొడిగించారు. అయితే జిల్లాలోని పలు పారిశ్రామిక వాడల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉంటారు. యూపీ, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలకు చెందిన కార్మిక కుటుంబాలు ఇక్కడే నివాసముంటాయి. రేషన్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఈ కార్మికులంతా ఇక్కడే బియ్యాన్ని తీసుంటున్నారు. దీంతో ఇతర జిల్లాలతో పోల్చితే సంగారెడ్డి జిల్లాకు కేటాయింపు ఎక్కువగా ఉంటోంది. మరోవైపు జిల్లాలో సన్నధాన్యం సాగు అతిస్వల్పంగా ఉంటుంది. దీంతో జిల్లాలోని రేషన్షాపులకు అవసరమైన సన్న బియ్యం ఇతర జిల్లాల నుంచే రావాల్సి ఉంటుంది.4.45 లక్షల రేషన్ కార్డులు.. జిల్లాలో మొత్తం 4.45 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. ప్రతీనెల సుమారు ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే మూడు నెలల కోటా అంటే సుమారు 24 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా పటాన్చెరు, జహీరాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఎక్కువగా సన్నబియ్యం సరఫరా అవుతోంది. కాగా ఈనెల మొదటి వారం రోజుల పాటు రేషన్షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిచ్చాయి. బియ్యాన్ని తీసుకునేందుకు ఒక్కసారిగా కార్డుదారులు రేషన్షాపుల వద్దకు రావడంతో ఈ షాపులన్నీ కిటకిటలాడాయి. ఒక్కో కార్డు దారుడు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉండటంతో రేషన్ పంపిణీలో కాస్త ఆలస్యమవుతోంది. దీంతో క్యూలో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో.. పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యం సర్దుబాటు మూడు మాసాల కోటాకు 24 వేల మెట్రిక్ టన్నులు అవసరం -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని ఆరూర్లో సదాశివపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి,హెల్మెట్, సీట్ బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డుసైన్లను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదాచారులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతేనే హారన్ను వాడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టాలిపటాన్ చెరు టౌన్: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని డీఎస్పీ ప్రభాకర్ కోరారు. సోమవారం భానూర్, నందిగామ గ్రామాల్లో బీడీఎల్ సీఐ విజయ్కృష్ణ ఆధ్వర్యంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్–అలైవ్’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భానూర్ గ్రామంలో యముడి వేషంలో ఉన్న నటుడితో రోడ్డుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు, వాటి నష్టాలు తెలియజేశారు. హెల్మెట్ లేని వారికి గులాబీ పూలు ఇచ్చి ఇకమీదట హెల్మెట్ ధరిస్తామని హామీ తీసుకున్నారు. గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. అనారోగ్యాలతో మరణించేవారికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. సీఐ విజయ్కృష్ణ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు గ్రామాల్లో కమిటీలు సహకరిస్తాయన్నారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శరీర భాగాల్లో రక్తస్రావం కావడంతో హత్యగా అనుమానం హవేళిఘణాపూర్(మెదక్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొగరి పోచయ్య(40) భార్య నాగలక్ష్మి, పిల్లలతో కలిసి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరిగిరి గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యతో గొడవపడిన పోచయ్య మూడేళ్ల క్రితం స్వగ్రామం బూర్గుపల్లికి వచ్చి ఉంటున్నాడు. సోమవారం ఉదయం బూర్గుపల్లిలోని ఇంటి సమీపంలో ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే భార్యకు సమాచారం అందించగా ఆమె వచ్చి చూసేసరికి కాళ్లు కిందకు వేలాడుతూ కనిపించాయి. దీంతో పాటు అతని పురుషాంగం నుంచి రక్తస్రావం జరిగినట్లు ఉంది. కాగా పోచయ్యను కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తనకు అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం నర్సాపూర్ రూరల్: తల్లీ, ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలోని అహ్మద్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... అహ్మద్ నగర్కు చెందిన కాట్రోత్ నరేశ్ భార్య సునీత, ఇద్దరు పిల్లలు వైష్ణవి(10), మహేశ్(8)ను తీసుకొని గత నెల 16న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. నరేశ్, సునీతకు మధ్య కుటుంబ విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సునీత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కనిపించకుండా పోయింది. భర్త ఇతర కుటుంబ సభ్యులు బంధువులతోపాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాట్రోత్ సునీత, వైష్ణవి, మహేశ్ -
చేపలు పట్టేందుకు వెళ్లి..
చిన్నశంకరంపేట(మెదక్): చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో సోమ వారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ సృజన కథనం మేరకు... గ్రామానికి చెందిన చెప్యాల సురేశ్(28) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంటి వద్దనే ఉండటంతో తల్లితండ్రులకు కల్లు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిన భార్య సుప్రియ సాయంత్రం ఇంటికి వచ్చి భర్త గురించి అత్తామామలను అడగగా కల్లు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడని ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. దీంతో భర్త గురించి ఆరా తీయగా చెరువు వైపు వెళ్లినట్లు చెప్పారు. దీంతో చేపల వేటకు వెళ్లి ఉంటాడనుకుంది. కాగా రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గ్రామ స్తుల సహకారంతో చెరువులో వెతకగా మృతదేహం బయటపడింది. దీంతో తన భర్త సురేశ్ మృతిపై అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తన భర్తపై కల్లు దుకాణం వద్ద దాడి చేసిన బాబుపై అనుమానం ఉందని ఫిర్యా దులో పేర్కొంది. చెరువులో గుర్తు తెలియని మృతదేహం రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట గ్రామ శివారులో ఉన్న కొత్త చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సోమ వారం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడికి 40 ఏళ్ల వయసుఉంటుందని, నాలుగైదు రోజుల క్రితం సదరు వ్యక్తి చెరువులో పడి ఉంటాడన్నారు. మృతదేహం కుళ్లిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ బాల్రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. యాచకురాలు మృతి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో యాచకురాలు మృతి చెందింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపిన వివరాల ప్రకారం... కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో యాచిస్తూ జీవనం గడుపుతున్న మద్దూరు మండలానికి చెందిన మీస లక్ష్మి(80) అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహాన్ని చేర్యాల మార్చురీకి తరలించారు.చెరువులో శవమైన యువకుడు -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
జహీరాబాద్ టౌన్: ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగ్ను అప్పగించి ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న జ్యోతి బస్టాండ్ వెళ్లడానికి సోమవారం ఆటోలో వెళ్లింది. అనంతరం రెండు తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయి వెళ్లిపోయింది. మండలంలోని సత్వార్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.సలాఉద్దీన్ ప్రయాణికురాలు బ్యాగు మరిచిపోయిందని వెంటనే పోలీసుస్టేషన్కు తీసు కొచ్చి ఎస్ఐ వినయ్కుమార్కు ఇచ్చాడు. విచా రణ చేసిన తరువాత ఎస్ఐ బంగారు ఆభరణాలు, మొబైల్ను ప్రయాణికురాలికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ను పోలీసులు సన్మానించారు. మేరా యువభారత్కు విద్యార్థి ఎంపికసిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల విద్యార్థి, ఎన్ఎస్ఎస్ వలంటీర్ టి.సౌమ్య మేరా యువభారత్కు ఎంపికై ంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026లో ఆమె పాల్గొనింది. 12లక్షల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్ డైలాగ్లో పాల్గొనే అవకాశం విద్యార్థినికి లభించినట్లు చెప్పారు. ఇందులో 2026 బడ్జెట్, దేశ అభివృద్ధి, యువత పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ అ యోధ్యరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు. పురాతన శాసనం గుర్తింపు కొల్చారం(నర్సాపూర్): మండలంలోని వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని చరిత్రకారుడు బుర్ర సంతోష్ గుర్తించారు. శాసనానికి సంబంధించి సోమ వారం వివరాలను తెలియజేశారు. శాసనం అచ్చు తీయగా పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారన్నారు. ఎరయప్రోలు పేరు మీద వేసిన దానం గురించి శాసన పాఠం తెలుపుతుందని చెప్పారు. శోభకృత్తు, జ్యేష్ట శుద్ధ సప్తమి శనివారం రోజున వేసిన శాసనమని, ఇప్పటి కాలమానం ప్రకారం సరిపోయే తేదీ 1782 మే 18 అవుతుందన్నారు. అప్పటి హైదరాబాద్ సంస్థానం లేదా దక్కన్ సుబా పరిపాలకుడు నిజాం అసఫ్ జా.మీర్ నిజాం అలీఖాన్ కాలంలో వేయబడిందని పేర్కొన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్జహీరాబాద్ టౌన్: రౌడీ షీటర్లకు సోమవారం జహీరాబాద్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని భవిషత్యను నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీట్ ఉన్నవారు ఎలాంటి కేసుల్లో తలదూర్చరాదని హితవుపలికారు. కార్యక్రమంలో ఎస్ఐ.శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. విషాదం నింపిన రోడ్డు ప్రమాదంజహీరాబాద్ టౌన్: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమా దం ఓ కుటుంబంలో విషాదం నింపింది. రుక్మాపూర్లో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా స్కూటర్ను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన కవిరాజుది నిరుపేద కుటుంబం. ఆయనకు భార్య పావని, కూతురు కీర్తన మరో బాబు ఉన్నాడు. కవిరాజు ప్రైవేట్ ఫైనాన్స్లో ఉద్యోగం చేస్తుండగా భార్య మహీంద్ర అండ్ మహీంద్రలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పని చేస్తుంది. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం స్కూటర్పై భార్యాపిల్లలతో కలిసి వికారాబాద్ జిల్లా రుక్మాపూర్కు వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి సోమ వారం తిరిగి జహీరాబాద్కు వస్తుండగా పెద్దెముల్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కవిరాజు, భార్య పావని, కూతురు కీర్తన అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది. -
ఆనందం పదింతలు
పదవ తరగతి పరీక్షలు ముగియటంతో సంగారెడ్డిలో విద్యార్థుల ఆనందం పదింతలు అయ్యింది. సంవత్సర కాలంపాటు పుస్తకాలతో కుస్తీపట్టి కష్టపడి పరీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం చివరి పరీక్ష ముగియడంతో గాలిలో ఎగిరి గంతులు వేశారు. సబ్జెక్టులన్నీ ఎలా రాశారో చర్చించుకున్నారు. తల్లిదండ్రుల ఫోన్లలో సెల్ఫీలు దిగారు. కాంటాక్ట్ నంబర్లు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. అక్కడే కనిపించిన ఐస్క్రీమ్స్ తిన్నారు. చివరగా మళ్లీ కలుద్దాం అంటూ బై బై చెప్పుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి. -
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నారాయణఖేడ్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు మండలంలోని ఎన్.జీ హుక్రాన గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ప్రేమ్కుమార్ కుమారుడు రమేశ్(17) నల్లవాగు గురుకులంలో ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. మృతుడి తల్లిదండ్రులు సుజాత, ప్రేమ్కుమార్ కర్ణాటకలోని బీదర్లో శుభకార్యానికి ఆదివారం ఉదయం వెళ్తూ పొలం వద్ద ఉన్న పశువులను చూసుకోవాలని రమేశ్కు చెప్పి వెళ్లారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో రమేశ్ ఫెయిల్ కావడంతో చేనువద్ద ఉన్న ఆవును తోలుకొస్తానని వెళ్లి పొలంలోని మేడి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కారాముంగిలో విద్యార్థిని... కాగా నాగల్గిద్ద మండలం కారాముంగి గ్రామానికి అంబీనగర్ రవి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసవెళ్లాడు. అతడి కూతురు నందిని (17) ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఫలితాల్లో 470 మార్కులకు గాను 325 మార్కులు సాధించినా ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. గ్రామంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. సిద్దిపేటలో ఒకరు.. సిద్దిపేటకమాన్: ఇంటర్లో ఫెయిలవ్వడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లయ్య, మంజుల దంపతులు ఇద్దరి పిల్లలతో కలిసి రంగనాయకపురంలో నివాసం ఉంటున్నారు. మెట్టుబండ వద్ద హోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కూతురు ప్రత్యూష (17) అల్లీపూర్ కేజీబీవీలో సీఈసీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సెల్ఫీ వీడియో ఆన్ చేసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. మృతురాలి నానమ్మ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపింది. -
స్టేట్ ర్యాంకు సాధించిన సంజన
జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన శెట్టి సంజన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ ర్యాంక్ సాఽధించింది. గ్రామానికి చెందిన శెట్టి రవికుమార్ కూతురు సంజన ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయిలో టాపర్గా నిలవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఆమె టెన్త్లో కూడా ప్రతిభ కనబర్చింది. సంజనను వీరశైవలింగాయత్ ఉద్యోగుల సంఘం నాయకులు శెట్టి విజయ్కుమార్ తదితరులు అభినందించారు. -
పనుల్లో వేగం పెంచండి
● సింగూరు మరమ్మతు పనుల పరిశీలన ● సాగు తాగునీటికి లోటు రాకూడదు ● మంత్రి దామోదర రాజనర్సింహపుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనుల వేగం పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇంజనీర్లను ఆదేశించారు. మండలంలోని సింగూర్ ప్రాజెక్టు మరమ్మతు పనులను సోమవారం నేషనల్ డ్యామ్ అధికారులు, ఇంజనీర్లు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. డ్యాం కట్ట రివిట్మెంట్ను, కాలువ సిమెంట్ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అతిథిగృహంలో అధికారులతో ఇంజనీర్లతో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ప్రస్తుతం డ్యామ్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉండటంతో పనుల్లో ఆలస్యమవుతుందని అధికారులు, ఇసుక సమస్య ఉందని, కేటాయించిన క్వారీల్లో ఇసుక తక్కువగా ఉందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. డ్యామ్లో నీళ్లు తగ్గుతున్న కొద్దీ పనుల్లో వేగం పెంచుతామని అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ పాండుకు మంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ ఎస్సీ కలిసి సింగూర్ ప్రాజెక్టు కట్ట పనులను, కాల్వ పనులను, సిమెంట్ లైనింగ్ను పరిశీలించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి సాగు,తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాగు, తాగుకు బసపూరం శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి పీఏ హనుమంతుతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ హత్యకేసులో నిందితుడి అరెస్ట్
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 9న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో నిందితుడు షేక్ మౌలానాను అరెస్టు చేశారు. సోమవారం సీఐ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్కు చెందిన పఠాన్జెరీనా(మృతురాలు)కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ మౌలానాకు 2024 ఏప్రిల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తరచు ఫోన్లో మాట్లాడుకుంటూ కలుసుకునే వారు. ఈ క్రమంలో మృతురాలు నిందితుడి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే అతని ఇంటికి వచ్చి వారి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బెదిరించింది. దీంతో నిందితుడు మానసికంగా ఒత్తిడికి గురై, మృతురాలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 8న నిందితుడు తన కారులో మృతురాలిని చేర్యాల శివారులోని గుర్జకుంట వాగు దగ్గర ఎక్కించుకొని వైన్ షాపులో బీర్లు కొనుగోలు చేశారు. తర్వాత చేర్యాల మీదుగా చుంచనకోట దారిలో వెళ్లి ఓ చోట ఇద్దరు బీర్లు తాగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మృతురాలిపై దాడి చేసి, స్కార్ప్తో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం, మృతురాలి ఫోన్ను గుర్తు తెలియని ప్రదేశంలో పడేసి, ఇంటికి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చేర్యాల పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి కారు, ఫోనును స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ రమేశ్నాయక్, ఎస్ఐ అపూర్వరెడ్డి ఉన్నారు. డబ్బులు అడగడంతోనే గొంతు నులిమి.. కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ -
పోషణ్ పక్వాడ విజయవంతం చేయాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో నిర్వహించే 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం పోషణ్ పక్వాడ, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ‘రహ్–వీర్’ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలసి కలెక్టర్ 63 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 23 వరకు కార్య క్రమాలు ఉంటాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ప్రభుత్వం ‘రహ్–వీర్’పథకం కింద రూ.25,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
రేషన్కార్డులపై పిడుగు
ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కడుతున్నారా? అయితే మీ తెల్ల రేషన్ కార్డును తొలగించనున్నారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లించే వినియోగదారుల జాబితాను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి వివరాలు సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. జాబితాలను రేషన్ డీలర్ల వారీగా అధికారులు పంపించారు. పన్ను చెల్లించే వినియోగదారుల రేషన్ కార్డులను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. – హుస్నాబాద్ ఆదాయపు పన్ను చెల్లిస్తే.. రేషన్ కార్డు రద్దురేషన్ దుకాణంలో బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులుహుస్నాబాద్ పట్టణంలో 8 రేషన్ దుకాణాలున్నాయి. రేషన్ డీలర్ల నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు జాబితాలో ఉన్న వారికి సమాచారం అందించారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఆదాయపు పన్ను చెల్లించే వారికి, కార్లు ఉన్నవారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు రేషన్ కార్డుల్లో కోత విధించి అర్హులైన వారికే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా ఏరివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం పొందాలన్నా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలన్నా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. చివరకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత కార్పోరేట్ వైద్యం పొందాలన్న తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారం కోసం బ్యాంకులో రుణం పొందేందుకు చిన్న మొత్తంలో ఐటీ రిటర్న్ చూపించే పేదవారిని, లక్షలు, కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న బడా వ్యాపారులతో జత కట్టడం సరికాదు. చాలా మంది రేషన్ బియ్యం తీసుకోకున్నా తెలుపు రేషన్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలను పొందుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కార్డులను తొలగించాలే కానీ చిన్న అవసరాలకు ఐటీ చెల్లించే నిరుపేదల కార్డులను తొలగించడం సమంజసం కాదని పలువురు వాపోతున్నారు. పట్టణంలో ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిలో 380 మంది ఉన్నట్లు అధికారులు జాబితాలో పేర్కొన్నారు. జాబితాలో ఉన్న వినియోగదారులకు కొందరు రేషన్ డీలర్లు ఫోన్లు చేసి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరికొంత మంది డీలర్లు ఐటీ రిటర్న్స్ చెల్లించే వారి వివరాలు సేకరించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వినియోగదారుల అడ్రస్ తమకు ఎలా తెలుస్తోందని డీలర్లు మిన్నకుండి పోతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు బ్యాంకు రుణం పొందాలంటే ఐటీ రిటర్న్స్ ఉండాలనే నిబంధన ఉంది. ఆదాయం లేకున్నా ఐటీ రిటర్న్స్ చూపించి రుణం పొందారు. వీరిని సైతం ఏరివేత జాబితాలో చేర్చారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల్లోఐటీ గుబులు తహసీల్దార్ నుంచి రేషన్ డీలర్లకు చేరిన జాబితా వివరాలు సేకరిస్తున్న డీలర్లు -
తండ్రి మరణాన్ని దిగమింగుకొని పరీక్షకు..
సిద్దిపేట జిల్లాలో ఘటన దుబ్బాకటౌన్: తండ్రి మరణాన్ని దిగమింగుకొని కూతురు పదవ తరగతి పరీక్షకు హాజరైంది. ఈ హృదయ విదారక ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చందా శ్రీనివాస్(35) గ్రామంలో కరెంటు వర్కర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అతడికి కూతురు ఐశ్వర్య, కుమారుడు ఉన్నారు. కూతురు పదవ తరగతి చదువుతుంది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే, కుటుంబ సభ్యుల ఆవేదన మధ్యలో తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షకు హాజరైంది. కన్నీటితోనే పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె ధైర్యం అందరినీ కదిలించింది. తండ్రి కోరిక మేరకు చదువులో ముందుకు సాగాలని సంకల్పించిన ఐశ్వర్య బాధను పక్కనపెట్టి పరీక్ష రాసింది. ఒకవైపు కుటుంబానికి తీరని లోటు, మరోవైపు కుమార్తె చూపిన మనోధైర్యం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. -
ఏడేళ్లు జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు..
మద్దూరు(హుస్నాబాద్): లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం దూళిమిట్ట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహ్మద్ ఆసిఫ్ వివరాల ప్రకారం... ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన జంగు రమేశ్ లైంగికంగా వేధించాడు. దీంతో సదరు బాలిక విషయాన్ని తన అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయంపై డయల్ 100కు కాల్ చేయడంతో బాధితురాలి ఇంటికి వెళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో కూడా ఇదే మాదిరిగా ఓ బాలికను లైంగికంగా వేధించగా కేసు నమోదు కావడంతో ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి, బెయిల్పై బయటకు వచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.పోక్సో కేసులో మళ్లీ అరెస్టు -
మైకు పట్టుకుంటే.. తిట్ల దండకమే..
మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావుసిద్దిపేటజోన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తుంటే నవ్వొస్తుంది.. సీఎం మాటలు ఇవేనా.. మైకు పట్టుకుంటే తిట్ల దండకం తప్ప ఒక్క మంచి మాట ఉండదు. అన్ని శాపనార్థాలు, తిట్లు తప్పితే ఒక మంచి వార్త ఉండదని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో లైట్ మోటార్ వెహికిల్స్ టాక్స్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటు చూసినా కేసులు, కూల్చుడు తప్ప ఇంకేమీ లేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆటో, టాక్సీ డ్రైవర్లను రోడ్డు మీదకు తెచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన భవనాలను సీఎం రిబ్బన్ కటింగ్ చేస్తున్నారన్నారు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం తాము కష్టపడితే ఇప్పుడు సీఎం వచ్చి ఓపెన్ చేసినట్టు విమర్శించారు. డ్రైవర్ ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణిస్తున్న వారికి రక్షణ ఉంటుందని, అందుకే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు, అద్దాలు, ఆపరేషన్ కూడా చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. సొంత డబ్బులతో లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్లకు రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి పాల్గొన్నారు.సీఎం నోటి నుంచి ఒక్క మంచి మాట రాదు కేసులు, కూల్చుడే తప్పా చేసిందేమీ లేదు మాజీమంత్రి హరీశ్ రావు -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంజిన్నారం (పటాన్చెరు): సామాన్యుల ప్రాణాలతో కాలుష్యం చెలగాటమాడుతున్న పట్టనట్లుగా వ్యవహరించే అధికారుల తీరుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలోని స్థానిక అయ్యమ్మ చెరువును సోమవారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. చెరువు పూర్తిగా కాలుష్యానికి గురైన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పరిశ్రమల యాజమాన్యాలు విచ్చలవిడిగా కాలుష్య జలాలను చెరువులు కుంటల్లోకి వదులుతుండటంతో మనుషులు పశుపక్ష్యాదులు జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాయన్నారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల భరతం పడతామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతిందని కాలుష్యంతో క్యాన్సర్ రోగాలు చుట్టుముడుతున్న చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, టీసీబీఈ కుమార్పాఠక్, మున్సిపల్ చైర్మన్లు సుష్మ, జనార్ధన్, నాయకులు బాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, వెంకటేశంగౌడ్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
మహిళా బిల్లు .. ఆశల ప్రతిబింబం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని కోట్లాది మంది మహిళల ఆశలకు ప్రతిబింబమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కుటుంబాలను చక్కదిద్దే మహిళలకు పాలన పగ్గాలు అప్పగిస్తే దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తారన్నారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చించడమే తప్ప, అమలు చేసి చూపిస్తున్న ధైర్యం ఒక్క ప్రధాని మోదీకే ఉందని నిరూపితమవుతోందన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు మీనాగౌడ్, తేజ, జ్యోత్స్న, కావ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి -
సొంతింటి
సంబురం ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులుగూడులేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగామండల పరిధిలోని భోజ్యానాయక్ తండాలో అర్హులైన శారదాబాయి, వాజీనాథ్ దంపతులకు ఇంటిని కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్, రవి పాటిల్, సుభాష్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి, మారుతి రావు పాటిల్, సంగ్రామ్ పాటిల్, నవీన్ కుమార్, అమృత్, షకీల్, రాజు, తదితరులు పాల్గొన్నారు. ఝరాసంగం(జహీరాబాద్): -
విద్య, వైద్యానికి పెద్దపీట
● మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్)/పుల్కల్(అందోల్): విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మండలంలోని మునిపల్లి, కంకోల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల శుభకార్యాలకు మంత్రి హాజరయ్యారు. అనంతరం పుల్కల్ మండల పరిధిలోని ముదిమానిక్యం చౌరస్తాలో ఏర్పాటుచేసిన టీస్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య కార్డు ఉన్నవారితోపాటు లేనివారికి కూడా ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తుందన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కొత్తకొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధితోపాటు రవాణ, ప్రయాణికుల సౌకర్యం కోసం లింకురోడ్ల అభివృద్ధితోపాటు డబుల్ రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. యువకులు స్వయం ఉపాధితో ఎదగాలని మంత్రి సూచించారు. -
తండ్రి బాటలోనే కూతురు
గజ్వేల్: రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై 26 ఏళ్లుగా అధ్యయనం చేస్తూ వారికి అండగా నిలు స్తున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి రాజు బాటలో ఆయన కూతురు మన స్వి ముందుకు సాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇటీవలే యాక్సెంచరి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన ఆమె తన మొదటి నెల వేతనంలో నుంచి రూ.25 వేలను సాయంగా అందించింది. ఆదివారం గజ్వేల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన తండ్రి పులి రాజుతో కలిసి జిల్లాలోని ఎల్కల్ గ్రామానికి రెండు బాధిత కుటుంబాలకు, వేలూరు, ఏటిగడ్డ కిష్టాపూర్, జాలిగామ గ్రామాలకు చెందిన మరో మూడు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధితుల కుటుంబాలకు సాయం తన మొదటి వేతనాన్ని అందించిన మనస్వి -
పరిశ్రమల్లో విస్తృత తనిఖీలు
జిన్నారం (పటాన్చెరు): నియోజకవర్గంలోని పటాన్చెరు, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి 8 వరకు పారిశ్రామిక వాడల్లో విస్తృతంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోని కేకేఎస్ ఆర్గానిక్స్, మంజీరా రబ్బర్ ఇండస్ట్రీస్ డివిజనల్ ఇంజనీర్ టీజీ ఎస్పీడీసీఎల్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. చట్టబద్ధ అనుమతులు, లైసెన్సుల స్థితి, పర్యావరణ రక్షణ చర్యలు, కార్మిక నియమాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ ఆదాయం, భద్రత నియంత్రణ, సంస్థల పనితీరు, నిర్వహణ పద్ధతులపై సమీక్షించారు. ప్రధానంగా పారిశ్రామిక సంస్థల కీలక లైసెన్సులు ఫైర్ సేఫ్టీ విభాగం లైసెన్స్, కార్మిక శాఖ లైసెన్సులు లేకుండా, భద్రతా చర్యలు పాటించకుండా స్టాక్ ఉత్పత్తి, హాజరు రిజిస్టర్లు నిర్వహణ లేనట్లు గుర్తించారు. టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో 2.65 కోట్ల 19,620 డిఫాల్టర్ల నుంచి పెండింగ్లో ఉందని తెలిపారు. విద్యుత్ దోపిడీ ట్యాంపరింగ్ వాటికి సంబంధించి 4,685 కేసులు ద్వారా 3.88 కోట్లు వసూలు చేయాల్సి ఉందని తనిఖీల్లో గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.పాల్గొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం -
జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శం
రామచంద్రాపురం(పటాన్చెరు): సమాజంలో సమానత్వం, చదువు కోసం మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన సేవలు ఆదర్శణీయమని పలువురు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెల్లా పూర్లో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన పూలే చరిత్రాత్మక సంగీత నృత్య నాటకం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనల్ని ఉన్న త స్థాయికి తీసుకెళ్లేది కేవలం విద్య ఒకటేనని వివరించారు. ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య, మాజీ ఎంపీపీ సి.ప్రభాకర్ రెడ్డి, నాయకులు రవి, శ్రీను, సామ్రాట్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన గురుకులంలో 100 శాతం
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని గిరిజన గురుకుల బాలుర రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియెట్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. సెకండియర్లో మనూరు మండలం మాయ్కోడ్కు చెందిన బి.ఈశ్వర్ సీఈసీలో 928 మార్కులతో టాపర్గా నిలిచాడు. ఫస్టియర్లో జి.కార్తిక్ 450, ఈ.ఈశ్వర్ 443 మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీఈసీ ఫస్టియర్లో 17మంది, సెకండియర్లో 24మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. -
మీ ఉడుత ఊపులకు భయపడం
● అమిత్షాపై కేసు పెట్టాలనడం అవివేకం ● మెదక్ ఎంపీ రఘునందన్రావునర్సాపూర్: మేధావులుగా చెప్పుకుంటున్న వారి ఉడుత ఊపులకు భయపడేదిలేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కేసు పెట్టాలనడం వారి అవివేకమని పేర్కొన్నారు. ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన పలువురు తమకు తాము మేధావులుగా ప్రకటించుకొని ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి అమిత్షాపై కేసు పెట్టాలన్న వారి ప్రకటనను ఆయన ఖండించారు. కాగా ఆయా రాష్ట్రాల శాసనసభలు, శాసనమండలి, లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సభ్యులు తమ సభలో హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులపై సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో నక్సలైట్లను ఏరివేసేందుకు మార్చి 31 డెడ్లైన్గా పెట్టి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ 2011లో సుప్రీం కోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు దేశంలో నక్సలైట్లు పెరిగేందుకు దోహదపడేలా ఉందని సభలో చెప్పారన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తప్పుగా ఉన్నాయని, కేసు పెట్టాలని హైదరాబాద్కు చెందిన కొందరు డిమాండ్ చేయ డం విచారకరమన్నారు. వాస్తవానికి వారంతా అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరిస్తున్నారని, మీడియాను సైతం వారు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చౌకబారు ప్రకటనలు చేసి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ఎంపీ వారికి హితవు పలికారు. విలేకరుల సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి వివేక్ పటాన్చెరు: పటాన్చెరులో రోడ్ల అభివృద్ధ్దికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పటాన్చెరులో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ కౌన్సిలర్లు మంత్రితో మాట్లాడుతూ...మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆ ప్రాంత సమస్యలను వివరించారు. కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ..పటాన్చెరులో గత పదేళ్లుగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల ఖర్చుపై విచారణ చేయాలని మంత్రికి విన్నవించారు. ఎమ్మెల్యే తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్లో ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి తిరిగి చేరారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని మంత్రి వివేక్ను నీలం మధు కోరారు. ఓ మంత్రి పోక.. మరో మంత్రి రాక ప్రమాణ స్వీకారోత్సవంలో వింత పరిస్థితి కనిపించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి దామోదర్ హాజరయ్యారు. ఆయన వెళ్లి పోయిన తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ రావడం కార్యకర్తలను విస్మయానికి లోను చేసింది. దామోదర వెళ్లిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు కనిపించాయి. అంతలోనే వివేక్ రావడం, ఆయన తన ఉపన్యాసం ఇచ్చి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..పార్టీకి కష్టకాలంలో సైనికులుగా పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. దివంగత ప్రధాని ఇందిరమ్మ కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు చక్కటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. పటాన్చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో దామోదరకు పట్టణంలో స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార వేదిక వరకు ర్యాలీ కొనసాగింది. మంత్రి దామోదర మాట్లాడి వెళ్లిన తర్వాత కార్యక్రమం ముగిసిందనుకుని అందరూ వెళ్లిపోయిన తర్వాత మరో మంత్రి వివేక్ వేదికకు చేరుకున్నారు. మొత్తం మీద ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం గందరగోళంగా ముగిసింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, స్థానిక నేత నీలం మధు ముదిరాజ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా పాల్గొన్నారు. -
ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతూ..
సంగారెడ్డిలో చాలామంది వాహనదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ బాధ్యతరాహిత్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిగ్నల్ దగ్గర, ప్రధాన కూడళ్లలో, టర్నింగ్ దగ్గర సైతం ఒకచేతితో ఫోన్ మాట్లాడుతూ మరోచేతితో వాహనాన్ని నడుపుతూ వెళ్తున్నారు. దీనివల్ల ఆకస్మికంగా ఎవరైనా ఎదురొస్తే నియంత్రణ తప్పి కింద పడిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అడ్డొచ్చిన వారిని ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్న వాహనదారులలో మాత్రం మార్పు రావటం లేదు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సంగారెడ్డి -
తాను మరణించి.. మరికొందరికి జీవం
అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి క్రైమ్: /సంగారెడ్డి టౌన్: తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేశాడు ఓ యువకుడు. వివరాలు ఇలా... సంగారెడ్డి మండలం కొతాల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. అతడి కుమారుడు ఉదయ్ కుమార్ (21) బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 4న బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న క్రమంలో అతడు కళ్లు తిరిగి స్పృహతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా గాయం వల్ల అతడికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్దారించారు. కాగా శుక్రవారం కుటుంబ సభ్యుల అంగీకారంతో ఉదయ్ కుమార్కు సంబంధించిన అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఉదయ్ కుమార్ చనిపోతూ కూడా మరో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఆదివారం అతడి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
గ్యాస్ లీకై మంటలు
సంగారెడ్డి క్రైమ్: ప్రమాదవశాత్తు ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని శాంతినగర్కు చెందిన కడియాల సంగమేశ్వర్ (37), వృత్తిరీత్యా పట్టణంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో ప్రమాదవశాత్తు నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ లీకై పేలడంతో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న సంగమేశ్వర్తో పాటు కడియాల మల్లమ్మ(అమ్మ), 13 ఏళ్ల పాప, పనిచేసే వ్యక్తి చిన్నా(22)కు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయపడి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా అక్రమంగా నిల్వ ఉంచిన 6 కమర్షియల్, 7 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పట్టణ సీఐ రామునాయుడు, ఫైర్ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పుల్కల్లో రెండు పూరి గుడిసెలు దగ్ధం పుల్కల్(అందోల్): మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. అవుసలి లక్ష్మణ్ చారి, అవుసలి పాండు రంగం చారి పూరిళ్లు ఆదివారం కాలిపోయాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ సర్పంచ్ లావణ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి పాల్గొన్నారు. నలుగురికి తీవ్ర గాయాలు సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం -
పాఠశాల సేవలు డిజిటలైజ్
నారాయణఖేడ్: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వివిధరకాల సర్టిఫికెట్లు, రికార్డుల సవరణలను ఇకపై పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో అందించేందుకు విద్యాశాఖ యోచిస్తుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు ముమ్మరచర్యలు కొనసాగిస్తున్నారు. ఈ పారదర్శక విధానంతో ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలలు సంగారెడ్డి జిల్లాలో 1,265 ఉండగా ఇందులో 1,02లక్షల మంది విద్యార్థులు, మెదక్ జిల్లాలో 980 పాఠశాలల్లో 98 వేల మంది విద్యార్థులు, సిద్దిపేట జిల్లాలో 941 పాఠశాలల్లో 72వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జాప్యానికి చెక్.. ప్రస్తుతం పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), బోనాఫైడ్ సర్టిఫికెట్ పొందాలన్నా, లేదా విద్యార్థి వివరాల్లో సవరణలు చేయాలన్నా, పదోతరగతి వివరాలు అప్డేషన్ వంటి పనుల కోసం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లయితే ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో ఉన్నతాధికారులు, పాఠశాలల్లో హెచ్ఎంలు లేకపోయినా లేదా సంబంధిత క్లర్క్ సిబ్బంది అందుబాటులో లేకపోయినా సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల తల్లిదండ్రులు స్కూల్స్, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ డిజిటల్ పద్ధతిలో రికార్డుల నిర్వహణ చేపట్టడం ద్వారా నిర్ణీత సమయంలో సేవలు అందించాలని విద్యాశాఖ భావిస్తోంది.మీసేవ కేంద్రాల ద్వారా... ప్రతిపాదిత కొత్తవిధానం ప్రకారం పాఠశాల సేవలను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన సర్వీసు కోసం ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, అక్కడి నుంచి సంబంధిత మండల విద్యాశాఖ అధికారి లేదా పాఠశాల హెచ్ఎం లాగిన్లోకి చేరుతుంది. అధికారులు ఆన్లైన్లోనే వివరాలను ధ్రువీకరించి ఆమోదముద్ర వేయగానే మీ సేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే వీలుండే దిశగా చర్యలు చేపడుతున్నారు. గతంలో డూప్లికేట్ మెమో కావాలంటే విద్యార్థులు నేరుగా బోర్డు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీనిని గమనించిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ) ఇప్పటికే ఈ సేవను ఆన్లైన్ చేసింది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు వస్తుండటంతో ఇదే తరహాలో ఇతర పాఠశాలల సర్వీసులను కూడా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అపార్ ఐడీలో వివరాలను ప్రతీ ఏటా అప్డేట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా అందనున్న సర్వీసులు విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పనున్న తిప్పలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు కసరత్తు ఉమ్మడి జిల్లాలోని స్టూడెంట్స్కు మేలు -
అర్హులైన పేదలకు ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ పట్టణంతోపాటు, మండలంలోని చాప్టా(కె), ర్యాకల్, లక్ష్మణ్నాయక్ తండా, మండల కేంద్రమైన నాగల్గిద్ద గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందన్నారు. అర్హులైన ఇళ్లులేని పేదలు పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహన్, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, యాదవరెడ్డి, హన్మంతు, జ్ఞానేశ్వర్, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 5వ రోజుకు ఆర్టిజన్ల సమ్మెజహీరాబాద్ టౌన్: తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీవీఏఈ జేఏసీ చైర్మన్ ఆండ్రా సంతోష్కుమార్, కన్వీనర్ కృష్ణలు మాట్లాడుతూ.. ఆర్టిజన్లను క్రమబద్దీకరించడం కోసం సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం సంస్థల్లో ఒకే నిబంధన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లను ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, 2026 పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. సమ్మెలో జేఏసీ నాయకులు జైపాల్, జక్కన్న, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎస్టీపీ నిర్మాణం రద్దు చేయాలిఅమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ డిమాండ్ పటాన్చెరు: కాలనీల మధ్య ఎస్టీపీ ప్లాంట్ను నిర్మించవద్దని కాలనీల్లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం పట్టణ పౌరుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంతకాలను తీసుకున్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల్రెడ్డి మాట్లాడుతూ..అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాస ప్రాంతంలో ప్రతిపాదిత ఎస్టీపీ (సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎస్టీపీ నిర్మా ణాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా మార్చా లని గట్టిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, కార్యదర్శి నరేశ్, నర్సింహులు సభ్యులు పాల్గొన్నారు.దుర్గమ్మా.. దీవించమ్మా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎండల నుంచి తీవ్రతకు చెట్ల కింద సేదదీరారు. అక్కడే విందు చేసుకొని బందుమిత్రులతో సరదాగా గడిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఎస్సై శ్రీనివాస్గౌడ్, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. రైతులను ఆదుకోండి ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో తలెత్తిన అనిశ్చితిని తొలగించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. సింగూరు నుంచి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు లేనందున క్షేత్రస్థాయిలో నీటి విడుదల జరగలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు. -
పరికరాల తరలింపు.. అడ్డుకున్న అధికారులు
చేగుంట(తూప్రాన్): మూతపడిన పరిశ్రమకు సంబంధించిన పరికరాల తరలింపును ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రెడ్డిపల్లి శివారులోని జీఎస్ఎన్ పరిశ్రమ 2016లో మూతపడింది. అప్పటికే ఆ పరిశ్రమ విద్యుత్శాఖకు రూ.176 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉంది. కాగా శనివారం నుంచి సదరు పరిశ్రమలోని పరికరాలను లారీల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న విద్యుత్శాఖ అధికారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. విద్యుత్ శాఖకు జీఎస్ఎన్ పరిశ్రమ యాజమాన్యం బకాయి ఉన్నందున పరికరాలను తరలించడానికి వీలు లేదని అధికారులు లారీలను నిలిపివేయించారు. అనంతరం పోలీసులకు విషయాన్ని వివరించి విద్యుత్ శాఖకు పోలీసు శాఖ తరపున తగిన సహకారం అందించాలని ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డిని అధికారులు కోరారు. -
నూతన నియామకం
హవేళిఘణాపూర్(మెదక్): తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జంగం నగేశ్, కార్యదర్శిగా శ్రీనివాస్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల ఆదివారం హైదరాబాద్లో నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శిగా మెదక్ జిల్లాకు చెందిన నర్సింహులు, అసోసియేట్ ప్రెసిడెంట్గా రాజు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా రూపగౌడ్ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ సంపత్స్వామి, రాష్ట్ర కార్యదర్శి యాకుబ్ సభ్యులు పాల్గొన్నారు. -
రాజేశ్వర్ రెడ్డికి అవార్డు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును స్వీకరించినట్లు, జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ కల్లకుంట రాజేశ్వర్రెడ్డి ఆదివారం తెలిపారు. తెలు గు బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో వివిధ కళా సేవా రంగాల్లో పలు అంశాలపై విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. జ్యోతిష్యరంగం, ఆధ్యాత్మిక, సాహిత్య రంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డు రావడంపై రాజేశ్వర్రెడ్డిని జిల్లా ప్రముఖులు, మేధావులు ఆయనను అభినందించారు. యువకుడు అదృశ్యం శివంపేట(నర్సాపూర్): యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సాయిలు వివరాల ప్రకారం.. మండలంలోని బీమ్లాతండా పంచాయతీ పరిధి శంకర్తండాకు చెందిన మాలోత్ జగన్(27) శనివారం రాత్రి ఇంటి నుంచి బైక్పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి ఆచూకీ కోసం బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్● వివరాలు వెల్లడించిన ఎస్ఐ సిద్దిపేటకమాన్: భర్త వేధింపులతో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సిద్దిపేట వన్టౌన్ ఎస్ఐ నవత కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాత ఫిష్ మార్కెట్ ప్రాంతంలో అనంతోజు గోపాల్, శ్రీలత దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గోపాల్ మద్యానికి బానిసై ఏ పని చేయట్లేదు. డబ్బులు సంపాదించాలని తన భార్యను తిట్టి, కొట్టేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక మనస్తాపంతో శ్రీలత ఇంట్లో ఉరి వేసుకుంది. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మృతురాలి భర్త గోపాల్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. పాముకాటుతో వలసకూలీ మృతి తూప్రాన్: బతుకుదెరువు కోసం వలసవచ్చిన కార్మికుడు పాముకాటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని నాగులపల్లిలో చోటు చేసుకుంది. తోటి కార్మికులు, గుత్తేదారు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్కు చెందిన కుంధన్ మురుము(19) నాగులపల్లి శివారులోని నేచురల్ సీడ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా శనివారం పని ముగించుకొని పరిశ్రమ ప్రక్కనే గల షెడ్లో నిద్రించగా నాగుపాము కరిచింది. గమనించిన స్నేహితులు తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కార్మికులను తరలించే గుత్తేదారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంకెన్నాళ్లీ నరకయాతన..! హత్నూర–సంగారెడ్డి–నర్సాపూర్ రహదారి పై అధికలోడుతో రాకపోకలు సాగించడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వివరాలు 9లో u
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తండ్రి చూపిన బాటలో పయనిస్తోంది. వివరాలు 8లోuసోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్లో 88% విద్యార్థులు, ఫస్టియర్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ బైపీసీకి చెందిన డి.భాగ్యవతి 865 మార్కులతో కాలేజీ టాపర్గా నిలవగా, 848 మార్కులతో ఎం.సిద్దేశ్వరీ సెకండ్ టాపర్గా నిలిచారు. కాగా ఫస్టియర్లో ఎంపీసీకి చెందిన వి.సూరజ్ 422 మార్కులతో టాపర్గా, బైపీసీకి చెందిన జి.అశ్విని 390 మార్కులతో సెకండ్ టాపర్గా నిలిచారు. వీరికి కాలేజీ ప్రిన్సిపాల్ రాంప్రసాద్తోపాటు లెక్చరర్లు అభినందనలు తెలిపారు.బాలికలదే పైచేయిసంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ బోర్డు అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గతేడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 60.43%తో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 61.59 ఉత్తీర్ణత శాతం సాధించి 19వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గతంలో 68.85 ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 71.22 ఉత్తీర్ణత శాతం సాధించి 20వ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించడం గమనార్హం. సంగారెడ్డిలోని అక్షయ జూనియర్ కళాశాల విద్యార్థులు అనూష, సింధూజ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 995 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ తుబా తహరిన్ 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. అదేవిధంగా అక్షయ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాలలో కీర్తన 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. బైపీసీ విభాగంలో అయేషా సిద్దిఖా 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. సెయింట్ ఆంథోనీస్ కళాశాల విద్యార్థి శృతి ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో 467మార్కులు, బైపీసీ విభాగంలో సాయి మధురిమ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 437 మార్కులు సాధించి పట్టణంలో టాపర్గా నిలిచింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నందిని 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించింది. ఫస్టియర్లోనూ బాలికలదే.. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షల్లోనూ బాలికల హవా కొనసాగింది. గతేడాది మాదిరిగానే ఈసారి ఫస్టియర్ ఫలితాల్లో బాలురు 49.44%ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.82% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం పరీక్షలకు 15,896మంది హాజరు కాగా 9,791మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 6,861 మంది విద్యార్థులకు 3,392 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 9,035మందికి గానూ 6,399 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఒకేషన్ల్ విభాగంలో 63.25% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచారు. 712 మంది బాలురకు 322 విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలలో 1,152 మందికి గానూ 857మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లోనూ.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలదే హవా కొనసాగింది. గతంలో సెకండియర్ ఫలితాల్లో 68.85%సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలువగా, ఈసారి 71.22% ఉత్తీర్ణత సాధించి 20వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 14,290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,177మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5,827 మందికిగాను 3,575మంది ఉత్తీర్ణులు కాగా, బాలికల్లో 8,463 మందికి గానూ 6,602మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,776 మంది విద్యార్థులకు 1,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 701 మందికి 376 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికల్లో 1,075 మందికి 884 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 19, ద్వితీయ సంవత్సరంలో 20వ స్థానం తగ్గిన ఉత్తీర్ణత శాతం -
గురుకుల బాలికల ప్రతిభ
జహీరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో గురుకుల పాఠశాల బాలికలు ప్రతిభ చాటుకున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మండలంలోని హోతి(కె)లో గల బాలికల గురుకుల పాఠశాలకు చెందిన సెకండియర్ విద్యార్థులు ఎంపీసీలో 1000 మార్కులకు గాను గాయత్రి 992, నిఖిత 991, మహేశ్వరి 990, స్నేహా 989, తపస్విని 988, ఐశ్వర్య, సంజనలు 986 మార్కులను సాధించారు. బైపీసీలో మెర్సీ 989, వైశాలి 988, కిరణ 985, హరిణి 983, భవానీ, నందిని 982 మార్కులను సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకుగాను శ్రావణి, వైశాలిలు 463 మార్కులు సాధించగా, భవానీ 462, అంజలి 461, మనీషా 460 మార్కులను సాధించారు. బైపీసీలో 440 మార్కులకుగాను నందిని 463 మార్కులు, అశ్విత 434, మీనాక్షి 433, మహాలక్ష్మి 431 మార్కులను సాధించారు. స్రవంతి జూనియర్ కళాశాలకు చెందిన సబనురైన్ సెకండియర్ బైపీసీలో 991 మార్కులను సాధించారు. సీఈసీలో సంజన 978 మార్కులను సాధించగా, ఎంపీసీలో సాయిప్రసన్న 966 మార్కులను సాధించింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో నందిని 462 మార్కులను, సీఈసీలో అమెనాజోహా 484లను సాధించారు.INTERMEDIATE RESULT 2026 -
ఒకే ఇంట్లో ఏకంగా 10 గ్యాస్ సిలిండర్లు.. పేలిపోవడంతో..
సంగారెడ్డి: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో చోటుచేసుకుంది. భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోని సంగమేశ్, మల్లమ్మ శ్రీజ, దొడ్డి అమోస్కు గాయాలు అయినట్లు తెలిపారు. గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఇంట్లో దాదాపు 10 డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నట్లు తెలిపారు. ఇంట్లో అన్ని గ్యాస్ సిలిండర్లను ఎందుకు నిల్వ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత వస్తుందన్న వదంతులతో ఇటీవల చాలా మంది అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. కొందరు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను అమ్ముకుంటున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే, సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లోనే గ్యాస్ సిలిండర్లు పేలాయి. గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ అతడి ఇంట్లో అన్ని సిలిండర్లను ఎందుకు నిల్వ చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి ఉంది. -
హైడ్రా భారీ ఆపరేషన్.. 15వేల కోట్ల భూమి స్వాధీనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతల భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని అమీన్పూర్, ఐలాపురంలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ. 15వేల కోట్లకు పైగా విలువైన భూమిని హైడ్రా కాపాడింది.ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చి వేసింది. ఆరు అంతస్తుల ముఖీం గెస్ట్ హౌస్తో పాటు ఫామ్ హౌస్ను అధికారులు కూల్చివేశారు. ఇక, ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా.. నిర్మాణాలు జరిపిన భవనాలను హైడ్రా కూల్చివేసింది.వివరాల మేరకు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో ఒకటి నుంచి 220 సర్వే నంబర్ల వరకూ మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.కాగా, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. స్విమ్మింగ్పూల్తో సహా విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. అలాగే, ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి ఫామ్ హౌస్ కట్టారు. గుర్రాల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం విశేషం. -
నిప్పుల కొలిమి
ముదురుతున్న ఎండలు● నిర్మానుష్యంగా రహదారులు ● ఆరెంజ్ జోన్లో పలు మండలాలు ● బయటకి రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికమధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంసంగారెడ్డి జోన్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. రానున్న రోజుల్లో ఎండలు నిప్పుల కొలిమిలా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శనివారం జిల్లాలో 41 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్, మే నెలలో 45 డిగ్రీల సెల్సీయస్ నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నాలుగు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 37 నుంచి 41 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో హత్నూర, కోహీర్, సిర్గాపూర్, జిన్నారం మండలాలను ఆరెంజ్ జోన్ హెచ్చరికను జారీ చేశారు. మిగతా మండలాల్లో కూడా దాదాపు అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీ, కూలర్లు, ఫ్యాన్లతో ఉపశమనం వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను పగలు రాత్రీ తేడా లేకుండా వినియోగిస్తూ ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. రేకుల ఇళ్లలో ఉన్న ప్రజలు మాత్రం వేడికి తట్టుకోలేక చెట్ల కిందకు వచ్చేస్తున్నారు. ఏప్రిల్ 22 వరకు అధికమే ఆదివారం నుంచి ఏప్రిల్ 22 వరకు జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 45–47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకురావడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పనులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లినప్పుడు స్కార్ఫ్ ధరించడం, తలపై టోపీ పెట్టుకోవడంతో పాటుగా వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు ప్రధాన, గ్రామీణ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలను దృష్టిలో ఉంచుకొని వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు వహించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.గొడుగుతో వెళ్తున్న యువతి(డిగ్రీల సెల్సీయస్లలో)మండలం ఉష్ణోగ్రతలు హత్నుర 40.9కోహీర్ 40.8సిర్గాపూర్ 40.6జిన్నారం 40.4అమీన్పూర్ 39.5కల్హేర్ 39.3మునిపల్లి 39.2 సిర్గాపూర్ 39.2 పటాన్చెరువు 39.1వట్పల్లి 39.0మొగుడంపల్లి 39.0 -
ఔషధాలు మితిమీరి వాడొద్దు
సంగారెడ్డి: ప్రతీ ఒక్కరికీ ఔషధాల వినియోగంపై సరైన అవగాహన తప్పనిసరని, మితిమీరి మందలు వాడటం కూడా ఆరోగ్యానికి హానికరమని డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాము పేర్కొన్నారు. సంగారెడ్డిలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్త్నింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ, కెమిస్ట్ భవన్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఔషధాల దుర్వినియోగం, యాంటీబయాటిక్స్ను సరైన విధంగా వినియోగించడం, చెల్లుబాటయ్యే ప్రిస్క్రిప్షన్తోనే మందుల విక్రయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనుమతి ఉన్న ఔషధ దుకాణాల వద్ద మాత్రమే మందులు కొనుగోలు చేయాలని సూచించారు. నాణ్యతలేని మందులపై ఫిర్యాదులకు హెల్ప్లైన్ను సంప్రదించాలని తెలిపారు. పలు అంశాలపై క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంతరావు, డ్రగ్స్ కంట్రోల్ డీఎస్పీ బి.పుష్పన్కుమార్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు రవికిరణ్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీకాంత్, ప్రవీణ్, వరప్రసాద్, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ణ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి అనుముల సంతోశ్కుమార్, కోశాధికారి ఏదిరే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము -
సంస్థాగత వ్యవస్థ అత్యంత కీలకం
నారాయణఖేడ్: రాజకీయంగా, సామాజికంగా ఏదైనా సాధించాలంటే సుస్థిరమైన సిద్ధాంతంతో పాటు బలమైన సంస్థాగత వ్యవస్థ అత్యంత కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఖేడ్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్– 2026లో భాగంగా మండల స్థాయి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లక్ష్య సాధన కోసం కార్య విస్తరణతో పాటు సంఘటనా బలోపేతం అవసరమని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పనిచేయడం ప్రతీ కార్యకర్తకు గర్వకారణమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా నిలవడం ప్రధాన బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, రవికుమార్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నాయకులు రజినీకాంత్, దశరత్, రాజశేఖర్ గౌడ్, సాయిరాం, అనిల్రెడ్డి, శంకర్పాటిల్, నిజానంద్రెడ్డి, శ్రావణ్, బస్వరాజ్పాటిల్, అరుణ్రాజ్, ప్రశాంత్, సుగుణాకర్, మారుతిరెడ్డి పాల్గొన్నారు. -
చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
రామచంద్రాపురం(పటాన్ చెరు): చెరువులను పరిరక్షించాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందని తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని మేళ్లచెరువును మాస్ మ్యూచువల్ సంస్థ ఉద్యోగులు, తేనా గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో చెరువు పరిసర ప్రాంతంలోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్ మ్యూచువల్ సంస్థ ఉద్యోగస్తులు చెరువు పరిసర ప్రాంతాల పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చెరువులను కాపాడుకొని భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్. రమేశ్, భవాని, తేనా ప్రతినిధులు దీప్తిరెడ్డి, రవి కిరణ్, రామ్కుమార్, లావణ్య, శ్వేతారెడ్డి, దీపక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండుతున్న వరి పంట
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం? ● లబోదిబోమంటున్న కొండాపూర్ రైతులునర్సాపూర్ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కొండాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రి తం సుమారు 20 మంది రైతులు అదనపు ట్రాన్స్ఫార్మర్తో పాటు నాలుగు స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారుల సూచన మేరకు రైతులు డీడీలు చెల్లించారు. అప్పట్లో ఓ కాంట్రాక్టర్కు విద్యుత్ శాఖ అధికారులు పనులు అప్పగించగా.. అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించి స్తంభాలు ఏర్పాటు చేయకుండా వదిలేశాడు. అప్పటి నుంచి కొండాపూర్ రైతులు విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి వద్ద 20 మంది రైతులు కలిసి మొరపెట్టుకోగా మరో కాంట్రాక్టర్కు నాలుగు స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. మరో కాంట్రాక్టర్ కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే వరి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కొండాపూర్ రైతులు కోరుతున్నారు. -
మార్కెట్కు వస్తే కదా బాధ తెలిసేది
● మీరు రారు.. ప్రభుత్వం పట్టించుకోదు ● అధికారులపై హరీశ్రావు ఆగ్రహం ● రెండురోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి సిద్దిపేటజోన్: అధికారులు కొనుగోలు కేంద్రాలకు రారు.. ప్రభుత్వమూ పట్టించుకోదు.. మరి రైతుల బాధ తీర్చేదెవరు అంటూ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం.. రైతుల పడిగాపులు, పేరుకుపోయిన పొద్దుతిరుగుడు రాశులపై ఈనెల10న సాక్షిలో ‘కొంటారా... కొనరా’అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచులు, కోటా, లారీలు, హమాలీ సమస్యల పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్రావు దృషికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా మార్క్ఫెడ్ డీఎం సునీత, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటయ్యలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. యార్డులో రైతులు బాధ పడుతుంటే మీరేమి చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మార్కెట్ యార్డుకు వస్తే కదా రైతుల బాధలు తెలిసేది అంటూ మండిపడ్డారు. కోటా పూర్తి అయిందని, లారీలు, హమాలీ సమస్య ఉందన్నారు. సోమవారం నాటికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. -
పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకం
ఎమ్మెల్యే చింత ప్రభాకర్సంగారెడ్డి: సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావుబా పూలే జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనేఉన్న పూలే విగ్రహానికి కలెక్టర్ ప్రావీణ్యతో కలసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమోఘమన్నారు. మహిళా విద్య, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల దురహంకార హత్యలు ఆపాలి సంగారెడ్డి ఎడ్యుకేషన్: కుల దురంహకార హత్యలను ఆపడంతోపాటు బాలికా విద్యను ప్రోత్సహించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావుబా పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డిలో పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తెలంగాణలో కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. పూలే ఆశయమైన కులనిర్మూలన సాధించాలంటే ముందుగా ఇటువంటి హత్యలను నిరోధించాల్సిన అవసరముందని చెప్పారు. వితంతు పునర్వివాహాలను చేయించడం, బాల్యవివాహాలు రూపుమాపడం, బాలికా విద్య పెంపొందించడం కోసం పూలే నిరంతరం కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కోరారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, జిల్లా కార్యదర్శి సాయితేజ, సింహాచలం, ఆడిట్ కమిటీ కన్వీనర్ చందర్రాథోడ్, జిల్లా కమిటీ సభ్యులు సురేశ్, కృష్ణ, నాయకులు పి.రాజు, మనోహర్ పాల్గొన్నారు. -
18మంది క్రీడాకారులు ఎంపిక
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–25 క్రికెట్ సెలక్షన్స్లో 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్రికెట్ క్రీడాకారు లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల విభాగంలో సెలక్షన్ చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యక్షుడు మధుమోహన్రెడ్డి, కోచ్లు శ్రీనాథ్రెడ్డి, కలీముద్దీన్, ఇనాం, అనిల్ కుమార్, మహేందర్రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పథకాన్ని పునరుద్ధరించాలిడీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కొండపాక(గజ్వేల్): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. కుకునూరుపల్లి మండల పరిధి కోనాయిపల్లి, మేదినీపూర్, చిన్న కిష్టాపూర్, పీటీ వెంకటాపూర్, రాయవరం గ్రామాల్లో కొనసాగుతున్న చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. సరైన వసతులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తూం శ్రీకాంత్రెడ్డి, నాయకులు రవీందర్, సంతోష్రెడ్డి, మహేందర్, నర్సింహ్మచారి, రుషీ, సుధాకర్రెడ్డి, జైపాల్రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. మార్కెట్ పనుల అడ్డగింత రేపటి ప్రజావాణి రద్దుమెదక్ కలెక్టరేట్: ఈనెల 13న మెదక్ కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పా రు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికారుల నిమగ్నమయ్యారని, అందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. -
గల గలా గోదావరి..
హల్దీలోకి జలాలు విడుదల ● యాసంగికి చింతలేదు ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులువర్గల్(గజ్వేల్): హల్దీ పరివాహక ప్రాంతాల్లో యాసంగి పంటలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పంటలు ఎండిపోకుండా కొండపోచమ్మ సాగర్ గోదావరి జలాలు విడుదల చేయాలని వర్గల్ మండలంలోని హల్దీ పరివాహక ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పందించింది. కొండపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ నుంచి నీరు విడుదల చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఈఈ కవితాదేవి పర్యవేక్షణలో డీఈఈ సత్యవాస్, ఏఈఈ మురళీధర్రెడ్డి అవుసులోనిపల్లి ఆఫ్టెక్ తూము (సంగారెడ్డి కెనాల్) నుంచి కొండ పోచమ్మసాగర్ గోదావరి జలాలను హల్దీలోకి విడుదల చేశారు. బంధం చెరువు, వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయచెరువు, అంబర్పేట ఖాన్చెరువు మీదుగా హల్దీలోకి నీరు చేరుతుందన్నారు. మూడు, నాలుగు రోజుల్లో నాచారం వరకు నాలుగు చెరువులు, 5 చెక్డ్యాంలు నిండుతాయన్నారు. రైతుల అభ్యర్థన మేరకు యాసంగిలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. కాగా గోదావరి జలాల విడుదలతో హల్దీ పరివాహకంలోని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. కీలక దశలో వరి తదితర పంటలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చేర్యాలలో అగ్ని ప్రమాదం
చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం స్థానిక 10వ వార్డు పరిధిలోని చావడి వద్ద చెత్తను అంటించే క్రమంలో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉమకు సమాచారం అందించగా.. ఆమె ఫైర్స్టేషన్కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భర్త వేధింపులు తాళలేక.. ● వివాహిత ఆత్మహత్య సిద్దిపేటకమాన్: భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన అనంతోజు శ్రీలత (35), గోపాల్ దంపతులు స్థానికంగా పాత మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల వయసులోపు శ్రీవల్లి, శ్రీలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గోపాల్ గతంలో స్వర్ణకార పనులు చేయగా ప్రస్తుతం ఏ పని చేయకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన శ్రీలత ఇంట్లో ఉరి వేసుకుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ ఎస్ఐ నవత సిబ్బందితో శనివారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం నర్సాపూర్ రూరల్: లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారి, రెడ్డిపల్లి సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ఓ డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డుపై లారీని ఆపాడు. నర్సాపూర్ వైపు వస్తున్న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్, మరో బైక్పై కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన శంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న కారు ఈశ్వర్, శంకర్ను ఢీకొట్టి అదుపుతప్పింది. బైక్పై ఉన్న ఈశ్వర్, శంకర్తో పాటు కారులో ఉన్న కౌడిపల్లి మండలం తునికి తండాకు చెందిన కాట్రోతు సాయికి గాయాలవ్వడంతో అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఈశ్వర్తో పాటు తీవ్ర గాయాలైన శంకర్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. గాయాలపాలైన ఈశ్వర్, శంకర్ -
మెలకువలు
పశుగ్రాసం సాగులో పోషకాలున్న గడ్డితో పాల ఉత్పత్తి అధికంజహీరాబాద్లో సాగు చేస్తున్న పశుగ్రాసంజహీరాబాద్ టౌన్: పశుగ్రాసం అంటే పాడి రైతులకు గుర్తుకొచ్చేది చొప్ప, వరి గడ్డి తదితరవి. కానీ వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు ఉండవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణం కానీ భాగం ఎక్కువ. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం పండించి పశువులకు అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించడంతో పాటు పశుగ్రాసం సాగు ఖర్చు తగ్గించవచ్చు. డెయిరీ ఫారాల నిర్వహణ వ్యయంలో 70 శాతం వరకు పశువుల మేతకే పోతుంది. అందువల్ల మేత ఖర్చును తగ్గిస్తే అంత మేరకు లాభాలు పెంచుకొనే అవకాశం ఉంది. పచ్చిమేతకు అధిక ప్రాధాన్యం ఉంది. పశుగ్రాసం సాగు, ప్రయోజనాల గురించి పశుసంవర్ధక శాఖ అధికారి సునీల్దత్ పేర్కొన్నారు. పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నేపియర్, కో 1, కో 2, ఎస్ఎస్జీ–825 రకాలు. 85 శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా సాగు చేయవచ్చు. ఒకసారి నాటితే 4 నుంచి 5 సంవత్సరాల వరకు దిగుబడులు పొందవచ్చు. జనవరి నుంచి ఆగస్టు వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతరపంటగా సాగుచేసుకోవచ్చు. ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తిన 45 రోజుల తరువాత ఎకరానికి 22 కిలోల మూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలేజీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వచేసి వాడుకోవచ్చు.ఉపయోగాలు సాగు విధానం ఇలా.. శాసీ్త్రయ పద్ధతిసాగుతో ప్రయోజనాలుపచ్చిమేతలో మాంసకృత్తులు ఎక్కువసైలేజ్ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ -
ఘనపూర్కు సింగూరు నీరు
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక గేట్ను ఎత్తి దిగువన ఘనపూర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆయకట్టుకు పంట విరామం ప్రకటించినా, కొందరు రైతులు యాసంగి సాగు వేశారు. దీంతో ఘనపూర్ ఆనకట్టకు నీటి కొరత ఏర్పడింది. పంట చివరి దశలో ఉండటంతో నీటి కొరత ఏర్పడింది. అధికారుల సూచన మేరకు శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. 5వ నంబర్ గేట్ను మీటరున్నర ఎత్తి మంజీరాలోకి నీటిని వదిలారు. అక్కడి నుంచి ఘనపూర్కు నీరు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. -
‘రింగు రోడ్డు’ పనులు పూర్తిచేస్తా
గజ్వేల్: భూ సేకరణ సమస్య వల్ల నిలిచిపోయిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు పనులు పూర్తయ్యేలా చూస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. శనివారం సంగాపూర్ రోడ్డు వైపు నిలిచిపోయిన పనులను బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రామచంద్రం కోర్టుకెళ్లడం వల్ల 151 మీటర్ల మేర భూసేకరణ నిలిచిపోయి, పనులు సైతం పెండింగ్లో ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో సదరు రైతుతో నేరుగా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. రైతు ఒప్పుకుంటే...పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని, లేదంటే చట్టప్రకారం ముందుకువెళ్లి పనులు జరిగేలా చూస్తానన్నారు. గత నెల 22న జిల్లాలోని నర్మెటలో సీఎం రేవంత్రెడ్డి ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో తానూ ఈ విషయంపై విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
పూలే సేవలు చిరస్మరణీయం
సంగారెడ్డి జోన్: మహిళా విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్ పాల్గొన్నారు. -
దశాబ్దాల వివాదమిది
పటాన్చెరు: అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపింది. హైడ్రా కూల్చి వేసిన ప్రాంతం దశాబ్దాలుగా వివాదంలో ఉంది. ఒకప్పుడు ఐలాపూర్ నిజాం సర్ఫేఖాస్త్ భూమిగా ఉండేది. 1,263 ఎకరాల ఆ భూమి పూర్తిగా ప్రభుత్వందేనని కోర్టుల్లో, జిల్లా రెవెన్యూ అధికారుల తీర్పులు వెలువడ్డాయి. ఆ భూమి జిల్లా రెవెన్యూ కస్టోడియన్ పరిధిలో ఉన్నాయి. అయితే 2003 హైకోర్టు తీర్పు ప్రకారం ఆ భూములన్నింటినీ ప్రభుత్వ భూమిగా చెప్తున్నారు. మొత్తంమీద ఆ గ్రామంలోని భూమి క్రయవిక్రయాలు జరిపేందుకు వీలులేదు. ఆ గ్రామంలో స్థానికులు మాత్రం తాము కొన్నేళ్లుగా దున్నుకుంటూ జీవిస్తున్నామని అవి తమకే దక్కుతాయని భావిస్తూ వచ్చారు. రికార్డుల పరంగా వారికి ఆ భూములు దక్కక పోవడంతో వారు కబ్జాలో ఉన్న భూములను తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఆ క్రయవిక్రయాలకు గ్రామంలోని అడ్వొకేట్ ముఖీమ్ సహకరిస్తున్నారు. ముఖీమ్తో రంగనాథ్ వాగ్వాదం ఐలాపూర్లోని రాజ్గోపాల్నగర్తోపాటు ఇతర లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశామని ఆ ప్లాట్లను ముఖీమ్ అనే వ్యక్తి కబ్జా చేశారంటూ అప్పట్లో ఆ కాలనీవాసులు దాదాపు ఏడాది క్రితం రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఆ లేఅవుట్ బాధితుల ఫిర్యాదులకు స్పందించి గ్రామంలోనే రంగనాథ్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయగా..ముఖీమ్కు రంగనాథ్కు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు ఏ చర్య లేకపోవడంతో హైడ్రా కూడా తమకు సాయం చేసే పరిస్థితి లేదని బాధితులు మిన్నకుండి పోయారు. తాజా కూల్చివేతల అనంతరం తమ ప్లాట్ల వద్దకు వచ్చి బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. గుర్రపు శాలలు..ఒకప్పుడు చిన్న గ్రామాలుగా..ఐలాపూర్, ఐలాపూర్ తండాలు చిన్న గ్రామాలుగా ఉండేవి. అవి గ్రామాలుగా ఏర్పడేకంటే ముందుగా అక్కడున్న వారందరూ నిజాం భూములను సాగు చేసేందుకు వచ్చిన శ్రామిక కుటుంబాలని చెప్తుంటారు. నిజాం ఆ గ్రామంలోని 1,263 ఎకరాల భూమిని తన సొంత భూమిగా పేర్కొన్నారని ఆ భూమిలో సాగు చేయగా వచ్చే మొత్తాన్ని నిజాం సర్కారు ఖజానాకు కాకుండా వ్యక్తిగతంగా ఖర్చు చేసేవారని చెప్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ భూమిని సాగు చేసే వారిపై అజమాయిషీ చేసే వ్యక్తి ఒకరు ఆ భూమి తనదేనని చెప్తూ 475 ఎకరాలను కబ్జా చేశాడు. అయితే నిజాం ఆస్తిని తామే సాగు చేస్తున్నామని అవి తమ భూములేనని గ్రామస్తులు యాజమాన్య హక్కులు పొందే ప్రయత్నం చేశారు. అడ్వొకేట్ ముఖీమ్ కుటుంబీకులు కూడా అక్కడే నివసించే వారు. దీంతో సదరు గ్రామస్తులకు ముఖీమ్ పెద్ద దిక్కుగా మారారు. అయితే గ్రామస్తుల భూములన్నీ డీఆర్ఓ కస్టోడియన్ భూములుగా అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారుల ఉదాసీనత కారణంగా ఆ గ్రామంలోని రైతులు ఆ భూములను అమ్ముకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో తమ పరిస్థితులు మారవని పోరాటమే శరణ్యమని భావిస్తూ సదరు గ్రామస్తులు తమ భూములను అమ్ముతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజాం ఆస్తుల పరిరక్షకుడిగా ఉన్న కుటుంబీకుల హత్య కూడా ఇక్కడ ఈ భూవివాదం నేపథ్యంలోనే జరిగింది. అప్పటి నుంచి ఆ గ్రామంవైపు ఎవరు కన్నెత్తి చూడాలన్న భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే రాజగోపాల్నగర్ ప్లాటు ఓనర్లు వివిధ స్థాయిల్లో తమ ఫిర్యాదులను చేస్తూ వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హైడ్రాను కూడా ఆశ్రయించారు. దీంతో హైడ్రా అదనుచూసి పంజా విసిరింది. ఐలాపూర్లో హైడ్రా కలకలం నిజాం సర్ఫే ఖాస్త్గా ఉన్న వేల ఎకరాల భూమి -
ధాన్యం కొంటారా.. కొనరా?
వంగరామయ్యపల్లి కల్లంలో రైతులు ఆరబెట్టిన ధాన్యం హుస్నాబాద్రూరల్: రైతులు వరి కోతలు మొదలు పెట్టి ధాన్యం సమీపంలోనే కల్లాల వద్ద రాశులు పోశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం వంగరామయ్యపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే కల్లాలకు ధాన్యం తెచ్చి ఆరబెట్టారు. గత ఏడాది రైస్ మిల్లు యాజమానులు పచ్చి వడ్లు కొనుగోలు చేయడంతో రైతులు ముందుగా కోసిన వరి ధాన్యంను మిల్లుల్లో విక్రయించేవారు. మిల్లు యాజమానులు పచ్చి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,800 ధర చెల్లించడంతో రైతులు క్వింటాలుకు రూ.560 నష్టపోతున్నామని విక్రయించడం లేదు. ప్రస్తుతం త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవచ్చని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.కల్లాలకు చేరిన ధాన్యం -
రాజీవ్పార్కుకు మహర్దశ
సంగారెడ్డి : పట్టణంలోని రాజీవ్ పార్కు రూపు రేఖలు మారనున్నాయి. 20 ఏళ్లుగా కళావిహీనంగా ఉన్న పార్కు ఇకనుంచి అందరిని ఆకట్టుకోనుంది. మొత్తం పార్కు అభివృద్ధి కోసం రూ.3 కోట్ల సీడీఎంఏ నిధులు మంజూరయ్యాయి. ఇందులో పా ర్కుకు రూ.1.70 కోట్లు, ఫౌంటెయిన్ ఏర్పాటుకు రూ.60 లక్షలు, ఓపెన్ జిమ్ పరికరాలకు రూ.30 లక్షలు, పిల్లల ఆట పరికరాలకు రూ.32 లక్షల నిధులు కేటాయించారు. కాగా అధికారులు రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు. దీంతో పార్కు అందంగా తయారు కావడమే కాకుండా పట్టణ ప్రజలకు విశ్రాంతి, వ్యాయామం, కాలక్షేపం చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చొరవతో తిరిగి రెండోసారి పార్కుకు నిధులు మంజూరయ్యాయి.సంగారెడ్డిలోని రాజీవ్ పార్క్మరమ్మతులకు రూ. 3కోట్లు మంజూరు అభివృద్ధికి రూ.1.70 కోట్లు ఫౌంటెయిన్ ఏర్పాటుకు రూ. 65 లక్షలు త్వరలో ప్రారంభం కానున్న పనులుపూర్తయిన టెండర్ రాజీవ్ పార్కు మరమ్మతుల కోసం టెండర్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. -
‘సామాన్లు సర్దేసుకోండి..’ బ్రేక్ తర్వాతే హైడ్రా కూల్చివేతలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో శనివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా స్పష్టత ఇచ్చింది. కూల్చివేతలకు కాసేపు విరామం మాత్రమే ఇచ్చామని.. ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేసింది. అమీన్పూర్ మండలంలో 1,260 ఎకరాల భూములను పరిరక్షించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పటికే సగం భూముల్లో అక్రమ కట్టడాలు వెలిశాయని.. మిగతా భూముల్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఐలాపూర్, కృష్ణారెడ్డిపేట పరిసరాల్లోని వందల ఎకరాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఏ లాయర్కు చెందిన ఫామ్హౌజ్తో పాటు పలు నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. కూల్చివేత తర్వాత చుట్టూరా.. ఫెన్సింగ్లు ఏర్పాటు చేయించింది. అయితే.. అక్కడి అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నవారికి ఖాళీ చేసేందుకు మాత్రం కాస్త సమయం ఇచ్చింది. కూల్చివేతలకు ముందు మున్సిపాలిటీ అధికారులు నీరు, కరెంట్ను కట్ చేశారు. తమకు ముందస్తు సమాచారం లేదని కొందరు నివాసితులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాము బిల్డర్స్కు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. తమకు ఏం తెలియదని కొందరు వాపోగా.. కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చి ఖాళీ చేయాలని సూచించారు. దీంతో సామాన్లు సర్దేసుకుని బయటకు వెళ్లిపోతున్నారు. కాసేపు విరామం తర్వాత కూల్చివేతలు కొనసాగనున్నాయి. -
మల్లయ్య తిన్న ముక్క.. మల్లయ్యనే ఇబ్బంది పెట్టింది!
మెదక్ జిల్లా: ఓ శుభకార్యానికి వెళ్లిన వ్యక్తికి భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీహెచ్సీ సూపరింటెండెంట్ అమర్సింగ్ వివరాల ప్రకారం... మాసాయి పేట మండలం హాకీంపేట గ్రామానికి చెందిన పి.మల్లయ్య తూప్రాన్లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యాడు. అక్కడ భోజన సమ యంలో చికెన్, చపాతి తింటున్న క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ స భ్యులు, బంధువులు వెంటనే పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సూపరింటెండెంట్ అమర్సింగ్ వైద్య సిబ్బందితో కలిసి రెండు గంటలు శ్రమించి ‘హెంబ్లిక్ పద్ధతి’తో చికెన్ ముక్కను గొంతులో నుంచి బయటకు తీశారు. దీంతో మల్లయ్యకు ప్రాణాపాయం తప్పింది. వైద్యుల చేసిన కృషిని కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. -
అమీన్పూర్లో ఆగిన హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు బిగ్ ఝలక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో చేపట్టిన భారీ ఆపరేషన్ను ఆపేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కూల్చివేతలను నిలిపి వేసి హైడ్రా అధికారులు వెనుదిరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో శనివారం ఉదయం నుంచి భారీ ఎత్తున ఆపరేషన్ను చేపట్టింది హైడ్రా. హైకోర్టుకు చెందిన ఓ లాయర్కు చెందిన ఫామ్హౌజ్తో పాటు ఓ ఆరంతస్తుల భవనం, పలు నిర్మాణాలను కూల్చేసింది కూడా. అయితే కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కొందరు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఐలాపూర్ పరిధిలో 1,260 ఎకరాల నిజాం, ప్రభుత్వ భూములు ఉన్నాయని.. వీటిలో చాలా వరకు అక్రమ కట్టడాలు వెలిశాయని, మరికొంత భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ కూల్చివేతలకు దిగింది హైడ్రా. ఈ క్రమంలో ఘర్షణలు తలెత్తకుండా సుమారు 2,000 మంది హైడ్రా, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కూల్చివేతలను మొదలుపెట్టింది కూడా.జస్ట్ బ్రేక్ ఇచ్చాంఅయితే హైడ్రా మాత్రం కూల్చివేతలు కొనసాగుతాయని అంటోంది. మేం పేదల ఇళ్ల జోలికి పోవడం లేదు. అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నవాళ్లకు 2 గంటల సమయం ఇచ్చాం. ఆ తర్వాత కూల్చివేతలు కొనసాగుతాయి అని అంటోంది. అమీన్పూర్ పరిణామాలపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.సేవ్ ఐలాపూర్ ఫ్లకార్డులతో..ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు అనూహ్యంగా స్థానికుల్లో కొందరి నుంచి మద్దతు లభించింది. ఈ ఉదయం నుంచి పలువురు సేవ్ ఐలాపూర్ అంటూ హైడ్రా ఆపరేషన్కు మద్దతుగా ఫ్లకార్డులతో ర్యాలీలు నిర్వహించడం గమనార్హం. -
ఉద్యానసాగు.. సబ్సిడీ బాగు
● రూ.5.60కోట్ల సబ్సిడీతో ప్రణాళికలు ● పెరగనున్న కూరగాయల సాగు విస్తీర్ణం జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గతేడాది రూ.3.25 కోట్ల మేర రైతులకు సబ్సిడీని అందించింది. ఈ ఏడాది మాత్రం రూ.5.60 కోట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏయే పంటలకు సబ్సిడీ ఇవ్వాలనేది నిర్ణయిస్తాం. కూరగాయల సాగును భారీగా పెంచే దిశలో ప్రయత్నం చేస్తాం. –సోమేశ్వరరావు, జిల్లా ఉద్యానవన అధికారి–సంగారెడ్డిజహీరాబాద్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. గతేడాది కంటే ఈసారి రెట్టింపు నిధులు ఇచ్చే విధంగా ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి పండ్ల తోటలతోపాటు అన్ని రకాల కూరగాయల పంటలకు ప్రోత్సాహకాలను అందజేసి సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ.5.60 కోట్లతో ఉద్యాన శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కూరగాయల పంటల సాగుపై ఎకరానికి రూ.10వేల వరకు సబ్సిడీ ఇవ్వనుంది. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల్లో కూరగాయల సాగును చేయించాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కంటే వేయి ఎకరాల సాగును పెంచే ప్రయత్నం చేస్తోంది. పీఏసీఎస్ల సహకారంతో 37 మంది విద్యావంతులైన రైతులను వలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించింది. ఒక వలంటీర్తో 100 ఎకరాల కూరగాయలను సాగు చేయించాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది 500 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాలని ఉద్యాన శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకుగాను సబ్సిడీని సైతం అందించనున్నారు. రైతులవైపు నుంచి అరటి, బొప్పాయి, మామిడి పంటల సాగుకు సానుకూలత వస్తోంది. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామ తోటలకు సైతం సబ్సిడీ అందించనున్నారు. సాగుచేసిన పంటలపై సబ్సిడీ ఇలా... రైతులు సాగు చేసిన ఉద్యానపంటల సాగుపై సబ్సిడీ అందించనున్నారు. అరటి సాగుపై ఎకరానికి రూ.18వేల చొప్పున బొప్పాయికి రూ.7వేలు, అల్లంకు రూ.9వేలు, పసుపునకు రూ.8వేలు, ఉల్లిగడ్డపంటపై రూ.6వేల వంతున రైతులకు సబ్సిడీని అందించనున్నారు. రైతులు పంటను సాగు చేసుకుని, బిల్లులు అందజేసిన తర్వాత అధికారులు పంటల సాగును పరిశీలించిన అనంతరమే సబ్సిడీని మంజూరు చేస్తారు. -
సబ్కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, అంగన్వాడీ కంగ్టి కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో డాక్టర్ నారాయణరావు, వైద్యాధికారి డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్లో భాగంగా నిర్వహిస్తున్న యోగా క్యాంప్ను పరిశీలించారు. ఆస్పత్రిలోని రిజిష్టర్లు, మందులు తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటలు పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శైలజా కులకర్ణి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో నిర్మిస్తున్న బ్లూ లియో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యానికి గ్రామ కార్యదర్శి స్వప్న శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పరిశ్రమ నిర్మాణానికి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేవని గ్రామ ప్రజలు ఆరోపిస్తూ ఇటీవల ప్రజావాణి కార్యక్రమంలో పరిశ్రమపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయగా.. అక్కడ నిర్మాణాల పనులను నిలిపివేశారని, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించినట్లు స్వప్న వెల్లడించారు. హత్నూర(సంగారెడ్డి): తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈ నెల 19న జరగనుంది. ఈ మేరకు హత్నూర మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి (2026–27) ప్రవేశ పరీక్ష 19 ఏప్రిల్ (ఆదివారం) నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి: ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు: మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈనెల 10వ తేదీ నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో చదువుతోపాటు అంతర్గత నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కళాశాలలో కంప్యూటర్, సైన్స్ విభాగాలకు సంబంధించి ప్రత్యేక ల్యాబోరేటరీ సదుపాయాలున్నాయని, టీఎస్ కేసీ ద్వారా ఆంగ్లభాష అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, అధ్యాపకులు డాక్టర్ సరోజినీ చక్రవర్తి, డాక్టర్ సుజాత, డాక్టర్ సుచిత్రసింగ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. -
వ్యర్థాలతో ఇంధనం!
నర్మేటలో రూ.250 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్బయో గ్యాస్ ప్లాంట్ నమూనా, నర్మేటలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న స్థలం ఇదేసాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కోసం వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ఈ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వ్యవసాయ, పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరాల స్థలాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కోసం కేటాయించారు.. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జూనో జౌల్ బయో ప్యూయల్స్ కంపెనీ వారు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న నర్మేటలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో గ్యాస్ రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డి, వివిధ పంటల మొదళ్లను తగులబెడుతుంటారు. దీంతో భూమి సారం కోల్పోవడంతో పాటు గ్రీన్హౌస్ వాయువు విడుదలవుతోంది. అదే వ్యవసాయ వ్యర్థాలు, వడ్లపొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా తయారు చేయనున్నారు. సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది.రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ సిద్దిపేటలో రూ 250కోట్ల వ్యయంతో 10 సీబీజీ (కంప్రెషడ్ బయో గ్యాస్) ప్లాంట్లతో రాష్ట్రంలో ఇదే తొలి ప్రాజెక్టు. ఒక్కో ప్లాంట్ రోజుకు 10 టన్నుల టీపీడీ (టెన్స్ పర్ డే) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మొత్తం వంద టీపీడీ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో బయో–ఎనర్జీ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి, రెండో దశల్లో మూడు ప్లాంట్లు చొప్పున, మూడో దశలో నాలుగు ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఈ మొత్తం క్లస్టర్ 2029–2030 నాటికి పూర్తి కానుంది. ఇది భారతదేశం తక్కువ కార్బన్ ఉద్గారాల ఇంధన వ్యవస్థల వైపు సాగించే ప్రయాణానికి తోడ్పడుతుంది. అలాగే దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 12న మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడతో ప్లాంట్ నిర్మాణం 10 ప్లాంట్లు.. ఒక్కో ప్లాంట్ 10 టన్నుల టీపీడీ సామర్థ్యం


