Sangareddy
-
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేడ్లోని చారిత్రక గాంధీచౌక్లో సబ్ కలెక్టర్ ఉమాహారతి,జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. దీంతో పాటు కంది, పటాన్చెరు, జహీరాబాద్, న్యాల్కల్, సంగారెడ్డి, మునిపల్లి, హత్నూర మండలాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు చౌరస్తాలు, కార్యాలయాలపై జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అలాగే పోలీస్స్టేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద అధికారులు, ఉపాధ్యాయులు.. పంచాయతీ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. – సాక్షినెట్వర్క్ -
తహసీల్దార్గా హసీనా బేగం
కంది(సంగారెడ్డి): మండల తహసీల్దార్గా హసీనా బేగం నియామకమయ్యారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన తహసీల్దార్ రవికుమార్ ములుగు డీఆర్ఓగా బదిలీపై వెళ్లారు. దీంతో నారాయణఖేడ్ తహసీల్దార్గా పనిచేస్తున్న హసీనా బేగం కందికి బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం నారాయణఖేడ్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ సభ్యత్వ నమోదు ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. పట్టణంలో మంగళవారం సభ్యత్వ నమోదు, జనగణనపై మండల సమన్వయకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైనందున ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. కూలీలకు ఓఆర్ఎస్, జ్యూస్ పంపిణీ న్యాల్కల్(జహీరాబాద్): ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు, కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని గుంజోటి సర్పంచ్ దెశెట్టి పాటిల్ కోరారు. మంగళవారం పంట పొలాల వద్ద పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన ఆయన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్యూస్ అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక పూజలు మునిపల్లి(అందోల్): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఉన్న ఇస్మాల్ ఖాదీర్ దర్గాలో మంగళవారం మాజీ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. కాగా, ఇస్మాల్ ఖాధీర్ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మల్చెల్మలో వారాంతపు సంత జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మలో వారాంతపు సంతను మంగళవారం సర్పంచ్ పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి వారాంతపు సంత భాగమేనని చెప్పారు. గ్రామంలో వారాంతపు సంత నిర్వహించడంతో ప్రజలు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాల క్రితం గ్రామంలో సంత జరిగేదని గుర్తు చేశారు. హరీష్ రావును కలిసిన మాజీ కార్పొరేటర్ రామచంద్రాపురం(పటాన్చెరు): మాజీ మంత్రి హరీష్రావును ఆయన నివాసంలో భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ మేరకు సింధు రెడ్డి దంపతులు హరీష్రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావును కలిసి పుట్టికరోజు శభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు. -
విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించండి
కలెక్టర్ ప్రతీక్జైన్ సంగారెడ్డిజోన్: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో మంగళవారం ఆయన వీడియో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీవర్షాల సమయంలో ప్రమాదాలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. నిరు అధికంగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి సర్ ఓటరు జాబితా, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగుచేయాలో ముందుగానే సూచించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిన్నారం (పటాన్చెరు): స్థానిక పట్టణ కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ, ఎంపీసీ మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలన్నారు. -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
సంగారెడ్డి జోన్: ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వస్త్ర, కాగితం సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల వినియోగం, ఘన, ద్రవ వ్యర్థాల వేర్వేరు సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎన్ విజయలక్ష్మి, పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు సంగీత, పాండు -
ఉపాధి కూలీలకు తాగునీటి తిప్పలు
హత్నూర(సంగారెడ్డి): ఎండలు తీవ్రం కావడంతో ఉపాధి కూలీలు నీటి కోసం తలడిల్లుతున్నారు. ఉపాధి కూలీలకు పని వద్ద నీటి సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్న క్షేత్రస్థాయిలో నీటి కోసం ఎండలో కూలీలు విలవిలలాడుతున్నారు. ఈ మేరకు మండలంలోని బోరుపట్ల ఉపాధి హామీ పథకం కూలీలు నీటి సౌకర్యం కల్పించడం లేదంటూ ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లను చూపిస్తూ నిరసన తెలిపారు. అధికారులు ఎవరూ పని వద్దకు రావడంలేదని, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి పటాన్చెరు టౌన్: సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం హెఎండబ్ల్యూఎస్ఎస్బీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా పోటీలో చేస్తున్న రాజిరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తూ జూన్ 1న రాష్ట్రంలోని కోటి పది లక్షల మందికి నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ వేతనాలు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, నాయకులు విజయ్ కుమార్ యువరాజ్, రవి, మహేందర్ లాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఐఐఐటీకి ఎంపిక న్యాల్కల్(జహీరాబాద్): బాసరలోని ఐఐఐటీకి ఎంపికై న రేజింతల్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు పవిత్ర, భార్గవి, అబ్బు ఉస్మాన్, అక్షరలకు మంగళవారం ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకుడు అరుణ్రెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం మేనేజర్ సునీల్ విద్యార్థులకు శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. -
హుండీ పగులగొట్టి చోరీ
నారాయణఖేడ్: ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును చోరీ చేశారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా... వెంకటాపూర్ చౌరస్తా సమీపంలోని భక్తమార్కండేయ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించి ఎత్తుకెళ్లి ఆలయం పక్కనగల వెంచర్లో దాన్ని పగులగొట్టారు. అనంతరం అందులోని నగదు, కానుకలను అపహరించారు. మంగళవారం ఉదయం ఆలయ కమిటీ బాధ్యులు విషయాన్ని గుర్తించారు. దాదాపు ఏడాది కాలంగా భక్తులు వేసిన రూ.లక్ష వరకు నగదు, కానుకలు చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా హుండీ పారవేసిన స్థలం, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ జహీరాబాద్: మండలంలోని హుగ్గెల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రూరల్ ఎస్ఐ కాశీనాథ్, హుగ్గెల్లి సర్పంచ్ విమలారెడ్డిలు బైక్పై వెళ్తున్న వారికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం సర్పంచ్ విమలారెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ లక్ష్యాల కోసమే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేలా ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్ తెలంగాణకు ఒక భగవద్గీతలాంటిదని, ఇది రాష్ట్రం రూపురేఖలు మార్చే అభివృద్ధి, బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమం, సమగ్ర విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక, జవాబుదారితనంతో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఇప్పటికే వెల్ఫేర్, సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, టూరిజం పాలసీలను సిద్ధం చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మహలక్ష్మి పథకం కింద మహిళలు 5.32 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. రూ.239 కోట్ల మేరకు లబ్ధి జరిగింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ద్వారా 1.76లక్షల మంది వినియోగదారులకు రూ.21 కోట్ల సబ్సిడీని అందించాం. గృహజ్యోతి పథకం ద్వారా రెండు లక్షల గృహ వినియోగదారులకు రూ.180 కోట్లు కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. రైతు భరోసా పథ కం కింద 2025 వానాకాలం సీజన్లో 3.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.422 కోట్లు జమ చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు 1,794 ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారులకు రూ.203 కోట్ల మేరకు లఇ్ధ చేకూరింది. 2.24 లక్షల ఎస్హెచ్జీ మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.79.60 కోట్లు రుణాలు ఇచ్చాం. 3.33 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేశాం. రైతుబీమా పథకం కింద 2.48 లక్షల మంది రైతుల పేర్లను నమోదు చేశాం. 2025–26 సంవత్సరంలో మరణించిన 698 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.34.90 కోట్ల పరిహారం అందించాం..’అని మంత్రి వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ. ‘‘వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 7,800 మంది రైతులకు రూ.6 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయనున్నాం. సంగారెడ్డి, అందోల్లలో నర్సింగ్ కాలేజీ భవనాలు, కొత్త పీహెచ్సీలను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 27 అందుబాటులోకి వచ్చాయి. జేఎన్టీయూహెచ్లో ఫార్మాసుటికల్ సైన్సెస్ అభివృద్ధికి రూ.57 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతి మంజూరైంది. రాజీవ్ ఆరోగ్య పథకం కింద జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈరోజు వరకు 47,833 మందికి శస్త్ర చికిత్సలు చేయగా రూ.134 కోట్ల బిల్లులు చెల్లించాం ’అని దామోదర తెలిపారు. 132 ప్రీప్రైమరీ పాఠశాలలు ‘‘ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 132 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూరు చేశాం. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెల ఉచితంగా 9,485 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇస్తున్నాం. 74 మంది దివ్యాంగులకు రిట్రో పిట్టేడ్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్స్, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా పంపిణి చేశాం. 16 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి రూ. 3.90 కోట్లు రైతులకు చెల్లించాం. సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.159కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు,, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆరైవ్ అలైవ్, కమ్యూనిటీ పోలిసింగ్, సోషల్ మీడియా ద్వారా పోలీసుశాఖ ప్రజలను చైతన్య పరుస్తోంది. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 57 మంది బాల కార్మికులను పని నుంచి విముక్తి లభించింది..’’అని రాజనర్సింహ చెప్పారు. ఇది తెలంగాణ భవిష్యత్కు భగవద్గీత లాంటిది సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలతో సర్వతోముఖాభివృద్ధి నర్సరీ నుంచి ఇంటర్ వరకు సమగ్ర విద్యావిధానం మంత్రి దామోదర రాజనర్సింహ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు -
అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం
నారాయణఖేడ్: అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు కేటాయించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే పనులు ప్రారంభించిందన్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు మిగులు రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుతో అప్పగించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు విమర్శలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం పాత బిల్లులు చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలోనే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల వరకు మంజూరు చేయించగా.. మరో రూ.100 కోట్ల వరకు త్వరలోనే మంజూరు కానున్నాయన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్అలీ, నాయకులు వినోద్పటేల్, రమేష్ చౌహాన్, ముంతాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అయ్యో పాపం..
న్యాల్కల్(జహీరాబాద్): అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాస్పత్రి సమీపంలోని పొదల్లో వదిలివెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపులు వినిపించడంతో స్థానిక మహిళ ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వైద్య సిబ్బందికి, హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది శిశువును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 108లో జహీరాబాద్కు తరలించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు విహార్కు తరలించారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొదల్లో మగ శిశువును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స సంగారెడ్డిలోని శిశు విహార్కు తరలింపు -
ప్రధానోపాధ్యాయులకు ఘన సత్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలందించిన పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి దామోదర సత్కరించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం సంగారెడ్డి పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ పరితోష్ పంకజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ జాతీయ హరిత దళం సంయుక్త ఆద్వర్యంలో పీఎంశ్రీ పాఠశాలలో వేసవి శిబిరాలను నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యతను పెంపొందించేందుకు వివిధ నాటికలు, నృత్యాలు తదితర సృజనాత్మ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ మేరకు శిక్షణ అందించిన జెడ్పీహెచ్స్ తెల్లాపూర్ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, నారాయణఖేడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు మన్మద కిషోర్, శివంపేట జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు వేద శ్రీలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీసీ జిల్లా పర్యావరణ అధికారి విజయలక్ష్మి, ఇన్చార్జి డీఈఓ శంకర్, హరితదళం కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి, జిల్లా నోడల్ అధికారి లింబాజి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిది
సంగారెడ్డి: ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తొలిదశ తెలంగాణ పోరాట యోధులను వైఎస్సార్ భవన్లోని బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్ అధ్యక్షతన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తొలి దశ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తొలి దశ ఉద్యమకారులైన సుభాష్, సుధాకర్, నరసింహులు, సీతారామతీర్థం, కృష్ణారావు, జయప్రకాష్, శ్రీనివాస్, సర్జిత్ కౌర్, జయలక్ష్మిలను ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కష్ణ, నాగరాణి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శులు సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, పాండురంగం, శ్రీధర్ మహేంద్ర, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల గౌడ్, మంగా గౌడ్ శతి గౌడ్, లతా, మానస, మౌనిక, వీరమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ను కలిసిన గుంతపల్లి సర్పంచ్
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి కేటీఆర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా యువకుడిగా ఉంటూ గ్రామాభివృద్ధితో పాటు పేద ప్రజలకు అనంత్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. కష్టకాలంలో పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికే రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గుంతపల్లి గ్రామాభివృద్దికి తన వంతు సహాయ, సహాకారాలు అందిస్తానని తెలిపారన్నారు. -
వినతులపై తక్షణ చర్యలు తీసుకోండి
నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది వినతులు వచ్చాయి. అయితే 40 ఏళ్ల కిందట ప్రభుత్వం తనకు 4.18 ఎకరాల భూమిని పంపిణీ చేయగా.. సర్వే నిర్వహించి తనకు భూమి చూపాలని కోరుతూ కరస్గుత్తికి చెందిన ఇస్మాయిల్ వినతిపత్రం అందజేశారు. అలాగే తనభూమి 161బీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తన భూమి కోల్పోతున్నా.. తనకు పరిహారానికి సంబంధించిన నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని డీఎన్టీ తండాకు చెందిన మారుతి కోరారు. అంబోజీ కాలనీలో రహదారి వెంట కంచెలు వేసి మొక్కలు నాటిన వారిపై చర్యలు తీసుకొని రహదారి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. -
ఈసారైనా నిధులు వచ్చేనా?
3న సీఎం రేవంత్ రాకకొన్యాల– చౌటకూర్ లింకు రోడ్డు దుస్థితిదశాబ్దాలుగా నలుగుతున్నదౌల్తాబాద్ – కాసాల శివారు పంచాయితీమట్టిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు బోరపట్లకు రానున్న సీఎంపైనే ప్రజల ఆశలుమండలానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 3న రానుండడంతో మండలంలోని దశాబ్దాల నాటి సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఇద్దరు సీఎంలు పర్యటించినా తీరని సమస్యలు.. ఇప్పుడు మూడో సీఎం రాకతోనైనా పరిష్కారమవుతాయా అని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. హత్నూర (సంగారెడ్డి) కాసాల–దౌల్తాబాద్ గ్రామాల సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ’రాజీవ్ పల్లె బాట’ బస్సు యాత్రలో దౌల్తాబాద్ మీదుగా వెళ్లినప్పుడు రెండు గ్రామాల ప్రజలు ఈ శివారు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో పరిష్కారం లభించకపోవడంతో ఇప్పటికీ తరచూ రెండు గ్రామాల మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సైతం నర్సాపూర్ బహిరంగ సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీగా మారుస్తామని ప్రకటించినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా తరచూ తై బజార్ వసూళ్లు, వ్యాపార సంస్థల అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాకతోనైనా ఈ పంచాయితీకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఇరు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. కొన్యాల – చౌటకూర్ లింక్ రోడ్డు దుస్థితి కొన్యాల గ్రామ శివారులోని మంజీరా నదిపై స్వర్గీయ వైఎస్సార్ హయాంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, కొన్యాల–చౌటకూర్ లింక్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో వాహనదారులు మట్టిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే జోగిపేటకు వెళ్లే ప్రజలకు ప్రయాణ దూరం భారీగా తగ్గనుంది. మరోవైపు సంగారెడ్డి నుంచి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ అనేది కేవలం కలగానే మిగిలిపోయింది. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారి ధ్వంసమయ్యాయి. పెరిగిన నిరుద్యోగం.. కాలుష్య కోరల్లో మంజీరా హత్నూర మండలంలో 16 భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ, స్థానిక యువతకు ఉపాధి దక్కడం లేదు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగు లు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న రసాయన కాలుష్యంతో నక్కవాగు, మంజీరా పరివాహక ప్రాంతాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. విషపూరిత జలాలతో మూగజీవాలు, వాగులోని చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ కాలుష్య జలాలు నక్కవాగులో కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మార్కెట్ యార్డుగా దౌల్తాబాద్ ఉప మార్కెట్ ప్రస్తుతం ఉన్న దౌల్తాబాద్ ఉప మార్కెట్ యార్డును పూర్తిస్థాయి మార్కెట్ యార్డ్గా అప్గ్రేడ్ చేసి, దానికి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయాలని స్థానిక రైతు నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి మండల పరిధిలోని బోరపట్లకు రానున్న నేపథ్యంలో ఈ దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ సీఎం సానుకూల నిర్ణయంతో మోక్షం కలిగిస్తారని మండల ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
వట్పల్లి(అందోల్): ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి అన్నారు. సోమవారం జోగిపేట్ ఏరియా ఆస్పత్రి, తాలేల్మ, నేరడిగుంట పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ విభాగాలను సందర్శించారు. గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచరాదని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. వైద్యులు సిబ్బంది సమయం పాలన పాటించాలని స్పష్టం చేశారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి లలితాదేవి తాలెల్మ, నేరడిగుంట పీహెచ్సీలఆకస్మిక తనిఖీ -
చెరువులో మునిగి యువకుడి మృతి
హత్నూర(సంగారెడ్డి): చెరువులో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం... హైదరాబాద్ ఫతేనగర్కు చెందిన మేకల రాఘవేందర్(18) మరో 13 మంది స్నేహితులతో కలిసి షేర్ఖాన్పల్లి గ్రామ శివారులోని పలుగుమీది నల్ల పోచమ్మ ఆలయ దర్శనానికి ఆదివారం వచ్చారు. దావత్ చేసుకొని సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో నీటిలో ఆటలాడుతున్న క్రమంలో రాఘవేందర్ నీటిలో మునిగిపోయాడు. వెంటనే తోటి స్నేహితులు, అక్కడ ఉన్న కొంతమంది అతడ్ని చెరువులో నుంచి బయటకు తీసినప్పటికీ మృతి చెందాడు. అనుమానాస్పద స్థితిలో రైతు..సంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చౌటకూర్ మండల శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన రైతు శ్రీశైలం(50) రెండు రోజుల కింద అదృశ్యమయ్యాడు. కాగా మండల శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలానికి స్థానిక తహసీల్దార్ కిష్టయ్య వెళ్లి పరిశీలించారు. శ్రీశైలంను కొందరు కొద్ది రోజులుగా భూ తగాదాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అభివృద్ధి పనుల ప్రారంభం
హత్నూర(సంగారెడ్డి): మండలంలోని గుండ్ల మాచునూర్లో సీసీ రోడ్డు నిర్మాణం, చెరువులో ఉపాధి పనులను సోమవారం సర్పంచ్ శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద చెరువులో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఉడికతీత పనులతో చెరువు లోతు కావడంతో పాటు ఆ మట్టిని పొలాల్లో వేసుకున్నట్లయితే సారవంతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గునుకుంట్ల శంకర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు బద్రేశ్, శివకుమార్, మల్లమ్మ, అంకిత ప్రభాకర్, జలీల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పదవీ బాధ్యతల స్వీకరణ జహీరాబాద్ టౌన్: స్థానిక మున్సిపల్ కమిషనర్గా ప్రభాకర్ సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. కమిషనర్గా ఉన్న జైత్రాం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభాకర్ను కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన చైర్మన్ యూనూస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల్రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. రావి ఆకుపై రాష్ట్ర ఆవిర్భావ శోభ నారాయణఖేడ్: త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన పత్ర చిత్రకారుడు శివకుమార్ రావి ఆకుపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాగునీటి ప్రగతి, రైతు శక్తి, నాయకత్వం, కాకతీయ కళాతోరణం, భగీరథ, కాళేశ్వరం, బంగారు బతుకమ్మ, సీఎం రేవంత్రెడ్డి చిత్రాలను మలచి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
మునిపల్లి(అందోల్): మేడ్చల్కు చెందిన శ్రీనివాస్ గానుగపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా లింగంపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు కారు ఇంజిన్లో నుంచి మంటలు వచ్చాయి. వివరాల ప్రకారం 65వ నంబర్ జాతీయ రహదారి కంకోల్ టోల్ ప్లాజా సమీపంలోని లింగంపల్లి చౌరస్తా సమీపంలో సోమవారం భోజనం చేయడానికి కారునుంచి కిందకు దిగారు. అయితే కొద్దిసేపటికే కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. జాతీయ రహదారిపై తిరుగుతున్న వివిధ రకాల వాహనదారులు కాసేపు అక్కడే ఆపేశారు. బుదేరా పోలీస్లకు విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
నారాయణఖేడ్: అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పోతనపల్లి (ఎం)లో సోమవారం ఐదు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తాగునీటి అవసరాల కోసం తన ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద నూతనంగా తవ్వించిన రెండు బోర్లను ప్రారంభించారు. అలాగే నిజాంపేట్ మండలంలోని మునిగేపల్లి, రాంచెందర్నాయక్ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని గ్రామస్తులను కోరారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కంది(సంగారెడ్డి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కౌలంపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి తుల్జా నాయక్, ఎంపీడీఓ శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ సుమ, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, సర్పంచ్ స్వాతి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి
జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కోరారు. సోమ వారం పట్టణానికి వచ్చిన సందర్భంగా పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములు నేత, రాంచందర్ భీంవంశీ, గడ్డం జనార్థన్, నారాయణరెడ్డి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి -
క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రాన్ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత నెల 23, 24వ తేదీలలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్లో దేశం తరపున జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్కు చెందిన 14 మంది క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 52 పతకాలు సాధించగా.. వీటిలో బంగారు పతకాలు 27, వెండి పతకాలు 11, కంచు పతకాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంగా సోమ వారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గత 20ఏళ్లుగా తమ క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 80, 90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఫహీం ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఉపాధ్యక్షుడు బాలయ్య, నరేందర్ రెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు. పచ్చదనమే ప్రజారోగ్యానికి పునాది రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు, అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్నగర్, తెల్లాపూర్ హూడా కాలనీలో పార్కుల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ సరస్వతి, ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాలాజీ, నాగారాజు, శ్రీశైలం, నాయకులు మాల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, ఉమేష్, శ్రీకాంత్ రెడ్డి, సాయిచరణ్ గౌడ్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
స్వచ్ఛ గౌవ్పై అవగాహన
పటాన్చెరు టౌన్: మండల పరిధిలోని నందిగామ రైతు వేదికలో స్వచ్ఛ గౌవ్. సురక్ష జల వాయు కార్యక్రమంలో భాగంగా సోమవారం గూగుల్ మీట్ ద్వారా మండల స్థాయి అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల వేరు చేయడం, సేకరణ, శాసీ్త్రయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదిగిరి, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, సర్పంచ్లు విక్రమ్ గౌడ్, శాంతయ్య, సంగీత, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిరసన నారాయణఖేడ్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ మేరకు ఎర్ర బ్యాడ్జిలు ధరించి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దు.. విలీనమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో జేఏసీ ఛైర్మన్ నెహ్రూ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కార్మికుల దశాబ్దాల కల అని తెలిపారు. సంఘం ఎన్నికల కన్నా కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల నిరంతర శ్రమకు గుర్తింపునివ్వాలని కోరారు. జేఏసీ ఇతర బాధ్యులు బీఎన్ రెడ్డి, బీరప్ప, రాజు, కార్మికులు పాల్గొన్నారు. నాలాలపై నిర్లక్ష్యం తగదు జహీరాబాద్ టౌన్: పట్టణంలోని 27వ వార్డులో నాలాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్ స్రవంతి ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం నాలాలను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి నుంచి వచ్చే పెద్ద నాలా 27వ వార్డులో ప్రవహిస్తుందన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నాలా పూర్తిగా చెత్తతో నిండిపోయిందన్నారు. వేసవిలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కలిసి నాలాను శుభ్రం చేస్తుండగా.. గత ఏడాది నుంచి ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. వర్షాకాలంలో నాలా పొంగి మురుగుంతా ఇళ్లలోకి వస్తుందన్నారు. కొంత మంది నాలాను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. అధికారులు స్పందించి చెత్తతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆమె కోరారు. బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం మియాపూర్ డిపో మేనేజర్ సుధను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మియాపూర్, పటాన్చెరు తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నప్పటికీ, నేరుగా బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. దీంతో ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటాం జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారని కిష్టయ్యపల్లి భూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్టయ్యపల్లి సర్వేనెంబర్ 42లో గతంలో ప్రభుత్వం 91 మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేసిందన్నారు. ప్రస్తుతం ఆ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతమంది ఆ స్థలంలో కంచెను వేశారని బాధితులు కౌన్సిలర్ ఇంద్రసేన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలకు భూములు దక్కే విధంగా కృషి చేస్తామన్నారు. -
పటాన్చెరును ప్రగతిబాట పట్టిస్తా
పటాన్చెరు: నియోజకవర్గాన్ని ప్రగతిబాట పట్టిస్తానని, అందులో భాగంగానే జాతీయ రహదారి నుంచి అమీన్పూర్కు నేరుగా వెళ్లేందుకు నాలాపై బ్రిడ్జ్డి నిర్మాణానికి నిధులు మంజూరుకావడమేకాక.. పనులు కూడా ప్రారంభమయ్యాయని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అమీన్పూర్ ప్రజలు బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ క్రమంలో లింగంపల్లి చౌరస్తాలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను ఇక్కడకు రప్పించి ఈ ప్రాంతంలో రోడ్డు ఆవశ్యకతను వివరించానని గుర్తు చేశారు. ఆ తర్వాతే జీహెచ్ఎంసీ అధికారులు రూ.3.5 కోట్లు కేటాయించి నిధులను మంజూరు చేశారన్నారు. అమీన్పూర్కు నేరుగా రోడ్డు కావాలని స్థానికులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. లింగంపల్లి జంక్షన్ వద్ద ఉన్న కాల్వపై బ్రిడ్జి నిర్మించి నేరుగా శ్రీదేవి థియేటర్ వైపు ఉన్న రోడ్డునకు కలపాలని ఆయన సూచించారు. పటాన్చెరు ప్రజల ఆశీస్సుల వల్లే తాను ఎంపీగా గెలిచానని, అభివృద్ధి చేపడుతూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన వివరించారు. అలాగే ముత్తంగి, కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సాకి చెరువు అభివృద్ధికి కృషి పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. సాకి చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ నాయకులు రవియాదవ్, మహిపాల్రెడ్డి, నర్సింగ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం ఈ ప్రాంత ప్రజల ఆశీస్సుల వల్లే ఎంపీగా గెలిచా ఎంపీ రఘునందన్రావు -
నర్సింగ్ విద్యకు అధిక ప్రాధాన్యం
జోగిపేట(అందోల్): రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోలు మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. అందోలు వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణ పనులను, నూతనంగా మంజూరైన ఫార్మసీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నర్సింగ్ కళాశాల విద్యార్థినిలతో ముఖాముఖిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హమీనిచ్చారు. నర్సింగ్ కళాశాల భవనం, వసతి గృహాలను త్వరలో ప్రారంభించేందుకు సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. అజ్జమర్రి వంతెన పనుల పరిశీలన రూ.80 కోట్లతో చేపడుతున్న అజ్జమర్రి వంతెన పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జోగిపేటలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్తో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వట్పల్లి(అందోల్): పేద ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోల్ మండల పరిధిలోని మన్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు పాల్గొన్నారు. మూడు మాసాల్లో పనులు పూర్తి మంత్రి దామోదర రాజనర్సింహ -
అటకెక్కిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సాగు నీటి రంగం అభివృద్ధి జరుగుతుందని భావించారు. కానీ రైతుల ఆశలు ఇంకా నెరవేరలేదు. కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందిన దాఖలాల్లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగినా.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. కాంగ్రెస్ సర్కారు కూడా ఈ పథకాలను పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ రెండు పథకాల నిర్మాణం పూర్తయితే దాదాపు 3.84 లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తుందని రైతులు భావించారు. కానీ రైతుల ఆకాంక్షలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. -
అక్షయపాత్రకు అప్పగించ వద్దు
కలెక్టర్కు మంత్రి దామోదర ఆదేశం జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్కు ఫోన్ చేశారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకస్మాత్తుగా తొలగిస్తే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కాంగ్రెస్ నేతలు ఉజ్వల్రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే ఫోన్లో కలెక్టర్తో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల సభ్యులతోనే వంటలు చేయించాలని, అక్షయ పాత్రకు అప్పగించరాదని ఆదేశించారు. సీఎం రాక కోసం ఏర్పాట్లు హత్నూర(సంగారెడ్డి): ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్నూర మండలం బోరపట్లకు రానున్న నేపథ్యంలో అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు, ఆర్డీవో రాజేందర్, డీఎస్పీ ప్రభాకర్, రెవెన్యూ, పోలీసులు హెలిప్యాడ్, సభాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. రేవంత్రెడ్డి వస్తారా.. లేదా వర్చువల్గా పరిశ్రమను ప్రారంభిస్తారా అనేది సస్పెన్స్గానే ఉంది. జీలుగు కోసం ఎగబడిన రైతులుహత్నూర(సంగారెడ్డి): పచ్చి రొట్టె ఎరువుల (జీలుగు) కోసం రైతులు ఎగబడ్డారు. సోమవారం రైతు వేదిక వద్ద 450 క్వింటాళ్ల జీలుగు (1500 బస్తాలు) 30 క్వింటాళ్ల జనుము (75 బస్తాలు) వచ్చినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మూడు క్లస్టర్లలో వీటిని రైతులకు అందించనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా రైతులు జీలుఉ జిలుగుల కోసం ఎగబడటంతో రైతు వేదికల వద్ద గందరగోళం నెలకొంది. అవసరం ఉన్న మేరకు ఇంకా జిలుగులు తెప్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో బయోమెట్రిక్ తొలగించాలిబీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి సంగారెడ్డిటౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు వల్ల రైతులు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రైతులు సంఘం నాయకులు పాల్గొన్నారు. 3న జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలుసంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలను సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్, జిల్లా పర్యావరణ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఎన్. విజయలక్ష్మి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇంటర్మీడియెట్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. -
అవతరణ’ వేడుకలకు సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్ సంగారెడ్డి జోన్: రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సర్వం సిద్ధమైంది. మంగళవారం నిర్వహించే వేడుకల ఏరాట్లను ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో పోలీసు సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. అమరవీరుల స్తూపం అలంకరణ, స్టాల్స్ ఏర్పాట్లు, పోలీసు భద్రత తదితర ఏర్పాట్లు పరిశీలించారు. వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. ముందుగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులచే గౌరవ వందనం స్వీకరిస్తారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్ టాప్, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లను సందర్శిస్తారు. -
వేతనంలో కోత విధించడం సరికాదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య పథకం అమలు చేయడం కోసం ప్రభుత్వం విధివిధానాలు విడుదల చేయకుండా మే నెల వేతనం నుంచి కోత విధించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్, రాంచందర్ మాట్లాడుతూ.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పేరిట మే నెల వేతనం నుంచి 1.5 శాతం ప్రభుత్వం కోత విధించడం సరికాదన్నారు. ఆరోగ్య పథకాన్ని అన్ని రకాలుగా తయారు చేసిన తర్వాతనే కోత విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరోగ్య పథకానికి సంబంధించి అమలు, విధివిధానాలు, మార్గదర్శకాలు వెంటనే ప్రకటించాలని కోరా రు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి ఆరోగ్య పథకంలో చేరాలా వద్దా అనే ఆప్షన్ కూడా ఇవ్వాలని కోరారు. ఆస్పత్రి జాబితా ప్రకటించడంతో పాటు ఏ వ్యాధులకు అవకాశం ఉందో తెలపాలన్నారు. ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అమౌంట్ పరిమితి తెలియజేయాలని, భార్యాభర్తల విషయంలో ఇద్దరి నుంచి కాకుండా ఒకరి నుంచే కోత విధించాలని కోరారు. వేతన సవరణ కమిటీ రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు లక్ష్మయ్య యాదవ్, శ్రీనివాస్, కమ్రుద్దీన్, సంజీవయ్య , నాజర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.టీపీటీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన -
టిప్పర్ లారీ ఢీకొని ఒకరు మృతి
జిన్నారం (పటాన్చెరు): టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని అన్నారం జాతీయ రహదారిపై అశోక్ లీలాండ్ (ఆటో) వాహనాన్ని వెనకాల వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. బాలానగర్ వైపు నుంచి వస్తున్న రెండు వాహనాల్లో అశోక్ లీలాండ్ వాహనం అన్నారం ప్రకృతి నివాస్ ఎదుట ఉన్న డివైడర్ను దాటే క్రమంలో వెనకాల ఉన్న టిప్పర్ లారీ అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో అశోక్ లీలాండ్ వాహనం బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటు చేస్తుంది. అశోక్ లీలాండ్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగరాజు (40)పై వాహనం పడడంతో మృతి చెందాడు. డ్రైవర్ రిజ్వాన్, తోటి ప్రయాణికుడు చిన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల సొంతింటి కల సాకారం
నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి అయిదు మంది లబ్ధిదారులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, కౌన్సిలర్లు స్వప్న అభిషేక్ షెట్కార్, వివేకానంద్, రాజు, మహేష్, గోపాల్రెడ్డి, మైతాబ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాహెర్అలీ పాల్గొన్నారు. ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడికి సన్మానం కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన మనూరు మండలం శెల్గిర్గాకు చెందిన మాజీ ఎంపీటీసీ మేటి పురంజన్ను ఖేడ్లోని తన స్వగృహంలో ఎంపీ సన్మానించారు. పీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్, కౌన్సిలర్లు వివేకానంద్, మైతాబ్, మాజీ జెడ్పీటీసీ నిరంజన్, ఖేడ్, మనూరు, నాగల్గిద్ద మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు తాహెర్అలీ, సుభాష్ పటేల్, మాణిక్రావు పాల్గొన్నారు. కాగా, ఖేడ్ పట్టణంలోని మహాతి జ్యోతిష్యాలయ ఆవరణలో అధికజ్యేష్ట మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం పురోహితులు, స్మార్త జ్యోతిష్య చండీ ఉపాసకులు గురురాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన యాగంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఉమాదేవి షెట్కార్ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ సురేష్ షెట్కార్ ఖేడ్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం -
‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్బావం అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. ప్రధానంగా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోంది. ఔషధ, బల్క్డ్రగ్, కెమికల్, మాన్ఫ్యాక్చరింగ్ తదితర రంగాలకు సంబంధించి జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. పటాన్చెరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఉత్పత్తి అవుతున్న వైద్య పరికరాలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. గుండెకు వేసే స్టెంట్లు, రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే కిట్లు, ఆపరేషన్ థియేటర్లలో వాడే పరికరాలు, క్యాథెటర్లు, దంతాలకు సంబందించిన ఇంప్లాంట్లు, ఆర్థో, కంటి వైద్య పరికరాలు, కరోనా వంటి ఆపత్కాళంలో అవసమైన కిట్లు వంటివి ఈ పార్కులోని పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో ఏర్పాటైన ఈ పార్కుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వైద్య పరికరాల రంగంలో పరిశోధనలకు కూడా బాటలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నిమ్జ్లో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. వెమ్ టెక్నాలజీ వంటి పరిశ్రమల రాకతో యుద్ధాల్లో వినియోగించే డ్రోన్లు వంటి రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమలు ఈ నిమ్జ్లో కొలువుదీరనున్నాయి. ఆ రెండు జాతీయ రహదారులు నాందేడ్–అకోలా జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా దశ దిశ మారుతోంది. మహారాష్ట్రలోని ఉత్తరాది ప్రాంతానికి అనుసంధానిస్తూ సుమారు 430 కి.మీ.ల పొడవున్న ఈ రహదారి జిల్లాలో సుమారు 70 కి.మీ వరకు ఉంటుంది. భారత్ మాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ జాతీయ రహదారిని ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. కంది నుంచి నిజాంపేట్ మండలం వరకు ఉంది. పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ రహదారి ఎంతో కీలకంగా మారింది. జిల్లా పారిశ్రామికంగానే కాకుండా, వ్యవసాయ పరంగా అభివృద్ధికి బాటలు వేసింది. మరోవైపు ముంబై హైవే ప్రాంతం కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందింది. అందుబాటులోకి ఉన్నత వైద్యం సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంతో జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఉన్నత వైద్యం చేరువైంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకలకు అప్గ్రేడ్ అయింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆయా విభాగాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకంతో అనుబంధ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సదుపాయం అందుతోంది. అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరు కావడంతో జిల్లా వాసులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభించింది.సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల161 జాతీయ రహదారి161 జాతీయ రహదారి నిర్మాణంతో అభివృద్ధికి బాటలు మెడికల్ కళాశాల ఏర్పాటుతో చేరువైన ఉన్నత వైద్యం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రగతి దిశగా పయనం నెరవేరని సాగునీటి ఆకాంక్షలు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సంగారెడ్డి జోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఅని కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి నివేదికలో భాగంగా ఈనెల 12 వరకు నిర్వహించే పర్యావరణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలలో క్విజ్ పోటీలు, పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన సదస్సులు, ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనమహోత్సవం, అధిక సాంద్రతతో మిశ్రమ మొక్కల నాటకం, గృహావసర మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, కమలాపూర్ సరస్సు ప్రాంతాల్లో ప్రకృతి సందర్శన కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న జరిగే ముగింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పాఠశాలలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం కోసం కృషి చేస్తామని అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో 73 అర్జీలు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. కలెక్టరేట్లో 38, సంగారెడ్డి డివిజనన్కు 05, ఆందోల్ 01, నారాయణఖేడ్ 9, జహీరాబాద్ 20 అర్జీలు అందాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్ 12 వరకు పర్యావరణ వారోత్సవాలు -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
పటాన్చెరు టౌన్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కు క్వారీకి ఐడీఏ బొల్లారానికి చెందిన ప్రదీప్(16)తో ఏడుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు శనివారం వెళ్లారు. అయితే ప్రదీప్కు ఈత రాకపోవడంతో థర్మోకోల్ సహాయంతో నీటిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అతనితో పాటు మధు అనే యువకుడు కూడా నడుముకు థర్మకోల్ కట్టుకొని నీటిలోకి వెళ్లాడు. అయితే నీటిలో ఉండగానే ఇద్దరి నడుములకు కట్టుకున్న థర్మకోల్ ఊడిపోయింది. మధు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ప్రదీప్ మాత్రం లోతైన నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఘటన -
వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యమయ్యారు. పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో వివాహిత మహిళ, హవేళిఘణాపూర్లో తల్లీ, ఇద్దరు కుమారులు, మెదక్ మండలంలో మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించకుండా పోయారు. వివరాలు ఇలా... ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత.. పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్కు చెందిన శాంతి గత నెల 29న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ ఇంట్లోనే ఉంది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై భర్త ధర్మరాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ సీటు కోసం వెళ్లిన తల్లీ,పిల్లలు.. హవేళిఘణాపూర్(మెదక్): తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మే 27న మాచవరం గ్రామానికి చెందిన గోవిందపురం అశోక్ భార్య శిల్ప, తన ఇద్దరు కుమారులు మనోజ్, శశాంక్తో కలిసి పదవ తరగతి పూర్తి కావడంతో ఇంటర్ కాలేజీలో సీటు కోసం హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం భర్త అశోక్ బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మెదక్రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి.. మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన రాజు మే 24 నుంచి కనిపించడం లేదు. పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో అతడి తల్లి కొత్తపల్లి మల్లమ్మ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. -
ఎండు గంజాయి పట్టివేత
నారాయణఖేడ్: ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ శంకర్ వివరాల ప్రకారం... కర్ణాటకలోని బీదర్ నుంచి గంజాయిని తీసుకొస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శంకర్, ఎస్ఐలు అనుదీప్, హన్మంతు సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారు జామున ఖేడ్– వాసర్ల మధ్య తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఖేడ్ మండలం శేరితండాకు చెందిన చవాన్ ప్రభు, మున్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ పర్లాల్ రెండుబస్తాల్లో 30 కిలోల ఎండు గంజాయిని బీదర్ నుంచి తీసుకొస్తూ పట్టుబడ్డారు. గంజాయి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టుచేసి, గంజాయితోపాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని ఖేడ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించారు. న్యాల్కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మల్గి గ్రామానికి చెందిన పలువురు గ్రామ శివారులో గోవిందు పొలం వద్ద పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, ఐదు సెల్ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. టేక్మాల్ మండలంలో.. టేక్మాల్(మెదక్): మండలంలోని సర్మోనికుంట శివారులో కోళ్లఫాం వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఎస్ఐ అరవింద్కుమార్ సిబ్బందితో శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో ధర్మావత్ నరేశ్, ధర్మావత్ నితిన్, మహ్మద్ అతిక్, మహ్మద్ ఇమ్రాన్, మేఘావత్ శంకర్, జర్పుల పండిత్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.22150 నగదు, ఫోన్లు, 3బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మాసాన్పల్లిలో ఆరుగురు.. వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై జోగిపేట పోలీసులు ఆదివారం దాడిచేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న గడ్డమీది మల్లేశ్, ఊస నరేందర్, డాకూరు రమేశ్, వావిలాల లక్ష్మయ్య, చింతకుంట వెంకటేశం, ఎర్రొళ్ల నరేశ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పాండు తెలిపారు. వారి నుంచి రూ. 28,430 నగదుతో పాటు 2 మోటార్ సైకిళ్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పందిరి, సొప్పతోపాటు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన లచ్చపేట సురేశ్ పొలం వద్ద సమీప ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి పందిరి అంటుకుంది. అక్కడే ఉన్న స్ప్రింక్లర్ పైపులు, వ్యవసాయ సామగ్రి, మొక్కజొన్న సొప్ప పూర్తిగా కాలిపోయింది. గమనించిన రైతు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అప్పటికే పూర్తిగా కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతు బోరున విలపించాడు. మరో చోట బైక్ దగ్ధం జోగిపేట(అందోల్): గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను తగులబెట్టారు. ఈ ఘటన మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న రాజిరెడ్డికి చెందిన ద్విచక్రవాహనాన్ని శనివారం తన ఇంటి ప్రక్కన పార్కు చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని తగులబెట్టి పారిపోయారు. ఒక్కసారిగా మంటలు రావడంతో బయటకు వచ్చి చూసే సరికి వాహనం కాలిపోయింది. అనుమానితులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పుస్తెలతాడు చోరీ అంటూ హంగామా..తొగుట(దుబ్బాక): దొంగలు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారని ఓ మహిళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా... గ్రామానికి చెందిన సీత బాలమ్మ, మల్లయ్య దంపతులు రాత్రి భోజనం చేసి ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి బాలమ్మ దొంగలు పడ్డారని అరిచింది. తన నోట్లో గుడ్డలు కుక్కి పుస్తెలతాడును ఎత్తుకెళ్లారని విలపించింది. వెంటనే స్థానికులు 100కు కాల్చేయగా రాత్రి 1.30 గంటల సమయంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్రావు ఘటనాస్థలానికొచ్చారు. పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా ఆదివారం ఉదయం మరోమారు ఎస్ఐ వెళ్లి ఇంట్లో వస్తువులను పరిశీలించాడు. ఈక్రమంలో పుస్తెలతాడు సగభాగం దేవుని ఫొటో వెనకాల, మరో సగం సమీప పొలంలో లభించింది. అయితే ఎత్తుకెళ్లింది బయటి వ్యక్తులా లేక కుటుంబీకులా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సీ్త్రలను గౌరవించాలి
నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరూ సీ్త్ర జాతిని గౌరవించాలని ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి నైనా జైస్వాల్ పేర్కొన్నారు. మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న ఏడువారాల జాతరకు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులతోపాటు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. అమ్మవారిని నమ్ముకుంటే ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, శ్రద్ధ, తేజస్సును ప్రసాదిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లయ్య, ఈవో శివరుద్రప్ప, పూజారులు సిద్దుస్వామి, నగేశ్ స్వామి, శ్రీకాంత్స్వామి, ప్రవీణ్, సిబ్బంది శేఖర్ పాల్గొన్నారు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ -
అసైన్డ్పై రియల్ కన్ను
కొండాపూర్(సంగారెడ్డి): అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు పంజా విసురుతున్నారు. ఏదో ఒక సాకుతో ఆ భూములను ఆక్రమిస్తున్నారు. భూములకు ధరలు కోట్లలో పలుకుతుండడంతో రాజకీయ నాయకుల అండదండలతో అధికారులకు సైతం కొంత ముట్టజెప్పి కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల్లో అక్రమార్కుల పాగా.. మండల పరిధిలోని కుతుబ్షాహీపేటలో సర్వే నం.16లోని రెండెకరాల అసైన్డ్ భూముల్లో ఓ అక్రమార్కుడు ఏకంగా బోరు వేసి తన పరిశ్రమకు సంబంధించిన వాహనాలు వెళ్లేలా రోడ్డును ఏర్పాటు చేశాడు. అలాగే అక్కడే ఉన్న ఓ పరిశ్రమకు ఆనుకొని ప్రహరీ గోడనూ సైతం నిర్మించాడు. అలాగే సర్వే నం.20లో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూములకు ఆనుకొని ఉన్న ఓ వెంచర్కు వెళ్లేందుకు రోడ్డు నిమిత్తం ఆ రైతులకు అధిక మొత్తంలో డబ్బులు ఆశ జూపి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రెండెకరాల భూమిని అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు సమాచారం. సాధారణ రైతులకు అమ్ముకునేందుకు ఎన్ఓసీ ఇవ్వని అధికారులు రియల్ వ్యాపారులకు ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. సైదాపూర్లో ఆక్రమించి కౌలుకు.. మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన భూమి పక్కనే ఉన్న సర్వే నం.15లో రెండెకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించి ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ప్రస్తుతం ఆ భూమిలో బోరు వేయడంతో పాటు జొన్న పంటను కూడా సాగు చేస్తున్నాడు. ఈ అసైన్డ్ భూమి గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉన్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేసిన బోరు కుతుబ్షాహీపేట సర్వే నం.16లో ఆక్రమించిన అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేసిన రోడ్డు వక్ఫ్ భూములతో దందా! వక్ఫ్ భూములనూ వదలని ఘనులు పట్టించుకోని రెవెన్యూ అధికారులు మండల పరిధిలోని సైదాపూర్ తండాలో గతంలో ప్రభుత్వం గిరిజనులకు సర్వే నం.78లో 197 ఎకరాల 32 గుంటల భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం పంపిణీ చేసింది. ధరణి వచ్చిన తరువాత ఆ భూములు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవని తేలాయి. ఇదే అదనుగా భావించిన రియల్ వ్యాపారులు ఎకరాకు రూ.27 లక్షల చొప్పున చెల్లించి, ఆ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూములున్న కొండాపూర్, మాందాపూర్, మునిదేవునిపల్లి, మల్లెపల్లి తదితర గ్రామాల్లోనూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ వారిని మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములను పరిరక్షించడంతోపాటు పాటు అమ్మకాలు, కొనుగోళ్లను నివారించి రైతులను కాపాడాలని కోరుతున్నారు. -
పరీక్ష రాసేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థిని మృతి ● బైక్ను ఢీకొట్టిన లారీ కల్వర్టును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్.. చేర్యాల(సిద్దిపేట): లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అడవిటక్కలపాడుకు చెందిన షేక్ మౌలాలి(51), కరీముల్లా ఇద్దరు గుంటూరు నుంచి సిరిసిల్లకు లారీలో సబ్బులు, సర్పులు లోడు చేసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మండల పరిధిలోని వీరన్నపేట గ్రామశివారులోకి రాగానే వాహనం నడుపుతున్న మౌలాలి నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కరీముల్లా లారీలో నుంచి కిందకు దూకాడు. కాగా డ్రైవర్ ముందు ఉన్న అద్దం పగిలి మౌలాలి కిందపడగా అతడిపై లారీ క్యాబిన్ పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కరీముల్లాను ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. అందోల్ మండల పరిధిలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి, చిన్న కోడూరు మండలంలో యువకుడు, చేర్యాలలో లారీ డ్రైవర్, నారాయణఖేడ్ పరిధిలో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా... వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందింది. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ శివారులో నాందేడ్ –అకోలా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు కథనం ప్రకారం... అల్లాదుర్గ్ మండలం మందాపూర్ గ్రామానికి చెందిన పాముల స్రవంతి(20) హైదరాబాద్లోని బాచుపల్లి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు ఆదివారం ఉదయం తన మేనబావ వరాల సాయితో కలిసి బైక్పై కళాశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కన్సాన్పల్లి గ్రామ శివారులో నాందేడ్ జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్రవంతి బైక్ పైనుంచి కింద పడిపోగా లారీ ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సాయికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వ్యక్తులు లారీని వెంబడించి, ఫొటోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న స్రవంతిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ పాండు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీతోపాటు డ్రైవర్ జగదీష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. లారీ, బైక్ ఢీకొని యువకుడు.. చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన కావటి మల్లయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు ఎల్లం(31), కూతురు రేణుక ఉన్నారు. ఇద్దరి వివాహం జరిపించారు. కాగా ఎల్లం భార్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఎల్లం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సిద్దిపేటలో ఉంటున్నాడు. గ్రామంలో జరుగుతున్న పోచమ్మ బోనాల పండుగకు వచ్చాడు. పండుగ సామాను తేవడానికి ఉదయం 6 గంటలకు బైక్పై సిద్దిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామునిపట్ల శివారులోకి రాగానే అతివేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్ను ఢీకొట్టడంతో ఎల్లం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రమోహన్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. లారీ ఢీకొట్టడంతో ఒకరు.. నారాయణఖేడ్: రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్కు చెందిన దుర్గయ్య (60) తన కుమారుడు దుర్గేశ్తో కలిసి బైక్పై బాన్సువాడ వైపు వెళ్తున్నాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతిరెడ్డి శివారులో వేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన దుర్గేశ్ను స్థానికులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
పిల్లలు పుట్టడం లేదని.. మహిళ ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: సంతానం కలగడం లేదని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కట్ట రామయ్యతో కొన్నేళ్ల క్రితం పెద్దలు ఊర్మిళకు వివాహం జరిపించారు. ఏండ్లు గడిచినా పిల్లలు పుట్టక పోవడంతో ఆమె తరచూ బాధపడేది. శనివారం పొలం వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఊరకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారుల జోష్..
సంగారెడ్డి: సమ్మర్ వచ్చిందంటే చాలు విద్యార్థులకు ఎనలేని ఆనందం, సంతోషం. సెలవుల్లో టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉండేందుకు సెలవులను ఉపయోగకరంగా, సృజనాత్మకంగా మలచాలనే ఉద్దేశంతో చౌటకూర్ మండలంలోని శివ్వంపేట పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. క్యాంపులో ఆటలు, యోగా, మెమొరీ గేమ్స్, క్రీడా కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యోగాసనాలు, వ్యాయామాలు, గ్రూప్ యాక్టివిటీస్, సంగీతం, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఆకట్టుకుంటున్నారు. సమూహాలుగా పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, పరస్పర సహకార నైపుణ్యాలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే వ్యాయామాలతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాంపులో బాలికలు సంప్రదాయ ఆటల్లో, వాలీబాల్ వంటి క్రీడల్లో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఇటీవల విద్యా ర్థుల్లో ఒత్తిడి, ఏకాగ్రత లోపం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. నృత్యంలో ఆసక్తి నృత్య పోటీల్లో పాల్గొని, అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలనే ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నాను. స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక ఉంది. – మానస, విద్యార్థిని డ్యాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ అంటే ఇష్టం. మెలకువలు నేర్పుతూ డ్యాన్స్లో శిక్షకులు శిక్షణనిస్తున్నారు. డ్యాన్న్స్తో మైండ్ ప్రశాంతంగా ఉంది. – రవళి, విద్యార్థిని నృత్యం, యోగా, సంగీతం , క్విజ్ తదితర పోటీల్లో.. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి
బలి తీసుకున్న అనారోగ్యంకల్హేర్(నారాయణఖేడ్): గంటల వ్యవధిలో తండ్రి,కొడుకు ఒకే రోజు మరణించారు. ఈ ఘటన మండలంలోని మార్డిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోమ్మల పోచయ్య(69), బోమ్మల రాజు(39) ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. బోమ్మల పోచయ్య ఇంట్లోనే మంచం పట్టాడు. రాజు హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుదిశ్వాస వరకు చూసుకోవాల్సిన కొడుకు రాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో మనోవేదనకు గురైన పోచయ్య ఇంట్లోనే మరణించాడు. తండ్రి పోచయ్య మరణవార్త తెలిసిన రాజు రాత్రి మృతి చెందాడు. తండ్రీ, కొడుకు ఒకే రోజు మరణించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు. ఆదివారం సాయంత్రం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. -
అంగన్వాడీ ఖాళీల భర్తీ!
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ ఆయా పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ మేరకు భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి. 79 టీచర్.. 416 ఆయా పోస్టులు జిల్లావ్యాప్తంగా ఖేడ్, సదాశివపేట, జహీరాబాద్, అందోల్, పటాన్చెరు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో 79 టీచర్, 416 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 98,450 మంది ఉన్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. త్వరలో కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చిన్నారులకు కేంద్రాల వద్ద నాణ్యమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ అందించేందుకూ రూపకల్పన చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీకి కలెక్టర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసి మార్గదర్శకాలకనుగుణంగా నియామకాలు చేయనున్నారు. నియామకాలకు సంబంధించి విద్యార్హతల్లో పలు మార్పులు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేంద్రాల్లో ఇతర సిబ్బందితో కొనసాగిస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ జిల్లాలో 79 టీచర్, ఆయా పోస్టులు ఖాళీ నేటి నుంచి కేంద్రాల పునఃప్రారంభంప్రభుత్వ ఆదేశాల మేరకు -
టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: హెల్త్ కార్డుల పేరిట ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకుండానే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్, తపస్, యూటీఎఫ్, టీటీయూ సంఘాల ఉపాధ్యాయ నాయకులు ఆదివారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రులతో సమావేశం నిర్వహించకుండానే ఆరోగ్యకార్డులు, విధివిధానాలు తెలియజేయకుండానే ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసే ప్రీమియం రక్షణ టీచర్లను మోసగించే విధంగా ఉందన్నారు. విధివిధానాలు విడుదల చేసిన తర్వాత ప్రీమియం సంబంధించిన డబ్బులు జీతాల నుంచి కోత విధించాలని స్పష్టం చేశారు. ఈ పథకం ఇష్టంలేని వారికి మినహాయింపునివ్వాలని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ తపస్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విధివిధానాలు లేకుండా కోతలా?? నారాయణఖేడ్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఆరోగ్య పథకం అమలు కోసం మార్గదర్శకాలు లేకుండానే వేతనంలో కోత పెట్టడం సరైందికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఖేడ్ మండలం తుర్కాపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య పథకం విధివిధానాలు, మార్గదర్శకాలు, ఆస్పత్రుల జాబితా, వ్యాధుల ప్రస్తావన ప్రకటించకుండానే జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించడం శోచనీయమన్నారు. మార్గదర్శకాలను వెంటనే ప్రకటించాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కౌన్సిలర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, ప్రధానకార్యదర్శి రాంచందర్, స్థానిక బాధ్యులు పాల్గొన్నారు. -
లింగంపల్లి గురుకులానికి రూ.14 కోట్ల నిధులు
మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): మునిపల్లి మండలంలోని లింగంపల్లి బాలుర గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రి ఆదివారం లింగంపల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురుకుల పాఠశాల హాస్టల్ భవనం, డార్మెట్ గదులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం మంత్రి బుధేరాలోని మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాటిపల్లి కేజీఏబీ పాఠశాలను కూడా మంత్రి సందర్శించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.61 లక్షలు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తక్కడపల్లి బ్రిడ్జి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. -
132 బడుల్లో ప్రీ ప్రైమరీలు
ప్రభుత్వం సర్కారీ స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు అనుభవమున్న ఉపాధ్యాయులతో బోధన చేస్తున్నప్పటికీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తరగతులు ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది. అందులోభాగంగానే ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీలు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది మరిన్ని ప్రీప్రైమరీల ఏర్పాటుకురంగం సిద్ధమైంది. న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో 860 ప్రాథమిక, 197 ప్రాథమికోన్నత, 205 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నప్పటికీ ప్రీ ప్రైమరీలు లేకపోవడంతో అధికశాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గతేడాది జిల్లాలో 59 ప్రీ ప్రైమరీలను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలలో ఇన్స్ట్రక్టర్తోపాటు ఆయాను నియమించింది. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు వేతనంగా ఇస్తోంది. ఆట పాటల ద్వారా సుమారు 38 రకాలుగా వివిధ రూపాల్లో చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. దీంతో గతేడాది 750 మంది చిన్నారులు ప్రీ ప్రైమరీల్లో చేరారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రీప్రైమరీలు మంచి ఫలితాలనివ్వడంతో ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాకు మరో 132 ప్రీ ప్రైమరీలను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో 22 ప్రీ ప్రైమరీలు, నాన్ కోర్ పరిధిలో 110 ప్రీ ప్రైమరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్స్ట్రక్టర్లతోపాటు ఆయాలను నియమించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. వీటి ఏర్పాటుతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. గతేడాది 59 మంజూరు సర్కారీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి -
ఖేడ్ అభివృద్ధికి నిధులివ్వండి
సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సంజీవరెడ్డి వినతిపత్రం అందజేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, కీలక ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ, గ్రామీణ, ప్రధాన రహదారుల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను కేటాయించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం వీలైనంత త్వరగా నిధులను విడుదలచేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామ ని హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా విద్యాధికారిగా రోహిణిసంగారెడ్డి ఎడ్యుకేషన్: హైదరాబాద్ జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రోహిణి బదిలీపై సంగారెడ్డికి రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా డీఈఓగా బదిలీ అయ్యారు. మూడేళ్లుగా జిల్లా విద్యాధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లు జిల్లాలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న డీఈఓ వెంకటేశ్వర్లను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. అపాయింటెడ్ డే ప్రకటించాలిజహీరాబాద్ టౌన్: టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు అధికారికంగా జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆర్టీసీ డిపోవద్ద జేఏసీ నేతలు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాణిక్ మాట్లాడుతూ...ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే అపాయింటెడ్ డేట్ను ప్రకటించాలని కోరారు. పలుమార్లు నోటీసులిచ్చినా..సమ్మె చేసినా అపాయింటెడ్ డేకు మోక్షం కలగడంలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, శివకుమార్, ఆర్వీ రావు, సోఫియా, నరేశ్,కాశీంలు పాల్గొన్నారు. లారీల కోసం రైతుల నిరసనజిన్నారం (పటాన్చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు దాదాపు 15 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైస్ మిల్లర్ల దౌర్జన్యం, అధికారుల నిర్లక్ష్యం తోడై తాము నిలువునా మునిగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రం వద్ద నిరసనకు దిగారు. అదనంగా 30 సంచులు ఇస్తేనే కాంటా వేస్తామంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక్కో లారీకి అదనంగా 30 సంచుల ధాన్యం తరుగు పేరుతో ఇస్తేనే కాంటా పెట్టుకుంటామని మిల్లర్లు తెగేసి చెప్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బోర్పట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతం
హత్నూర(సంగారెడ్డి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బోర్పట్ల రానున్న నేపథ్యంలో గ్రామంలోని ధాన్యం కొనుగోలు అధికారులు స్వయంగా దగ్గరుండి ఆదివారం వేగవంతం చేశారు. బోర్పట్ల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 35 లారీలకు పైగా ధాన్యం నిల్వలు ఉండటంతో జిల్లా ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. లారీలను పంపిస్తూ ధాన్యాన్ని రెండురోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైస్మిల్లులకు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.సీఎం రానున్న నేపథ్యంలో రెండు రోజుల్లో పూర్తికానున్న కొనుగోళ్లు -
మారిన బుల్లెట్ రైలు మార్గం
జహీరాబాద్: హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబైకు బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్వే బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా రూటు మార్చి డీపీఆర్లో వికారాబాద్కు చోటు కల్పించినట్లు సమాచారం. రైలు రూటు మార్చడం పట్ల జహీరాబాద్ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరి మొదటివారంలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్టెట్లో జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడిపేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు అంశం పెండింగ్లో పెట్టినా బడ్జెట్లో మాత్రం బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జహీరాబాద్కు చోటు కల్పించారు. జాతీయపెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టుతో జహీరాబాద్ ప్రాంతం పెద్ద పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో డీపీఆర్లో వికారాబాద్కు చోటు కల్పించడంతో ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నిర్ణయం పారిశ్రామికాభివృద్ధికి అవరోధంగా పలువురు పేర్కొంటున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలును దారిమళ్లించే ప్రయత్నాలు జరగడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జహీరాబాద్ను పక్కనబెట్టి వికారాబాద్ను తెరపైకి తేవడం వెనుక రాజకీయ శక్తులున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 కిలోమీటర్ల వ్యత్యాసంతోనే... హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా నడిపేందుకు మంజూరైన బుల్లెట్ రైలును వికారాబాద్ మీదుగా మళ్లించడం వల్ల కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుంది. ఇంత తగ్గడాన్ని పరిగణలోకి తీసుకుని డీపీఆర్ మార్చడం సరైంది కాదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న ప్రయాణ వ్యవధి కొత్త కారిడార్ కారణంగా ప్రయాణ వ్యవధి తగ్గనుంది. హైదరాబాద్ నుంచి పుణెకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా రెండు గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ముంబైకు 14 గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైలు వల్ల కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు గరిష్ట వేగం 350 కి.మీ సామర్థ్యం కాగా, ఆపరేషనల్ వేగం 320కి.మీ ఉంటుంది. ఎలివేటెడ్, అండర్గ్రౌండ్తో కలిపి కారిడార్ ఉంటుంది. ఈ రైలులో 750 మంది ప్రయాణీకులు ప్రయాణం చేసే వీలుంటుంది. ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి ఒరిజినల్ డీపీఆర్(పాతరూట్)తోనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జహీరాబాద్ ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే స్పందించి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చించి డీపీఆర్ మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త రూట్మ్యాప్ను అడ్డుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మంజూరై పూర్తయిన డీపీఆర్ హైదరాబాద్–ముంబై ప్రాజెక్టును రెండుగా విభజించారు. గతంలో హైదరాబాద్–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్గా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్–పుణె, పుణె–ముంబైగా మార్చారు. ప్రాజెక్టు మంజూరు కాగానే అప్పట్లోనే డీపీఆర్ పూర్తి చేశారు. ఆయా రైల్వేస్టేషన్ల మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్ను నిర్మించనున్నారు. ఇందులో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, 457కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లోని 11 స్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు ప్రతిపాదించారు. అందులోభాగంగా హైదరాబాద్, జహీరాబాద్, కల్బుర్గి, షోలాపూర్, పండరీపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కంప్లెక్సు, బాంద్రా, ముంబై స్టేషన్ల మీదుగా ప్రయాణించనుందని అప్పట్లో ప్రకటించారు. వికారాబాద్కు బదులు జహీరాబాద్ మీదుగా అయితే 20 కిలోమీటర్లు మాత్రం అధికం అవుతుంది. రైజింగ్ తెలంగాణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–ముంబై భారీ ప్రాజెక్టులో 20 కిలోమీటర్ల దూరం పెద్ద సమస్య కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తాజా డీపీఆర్లో వికారాబాద్కు చోటు రాజకీయ ఒత్తిళ్లే కారణమా? హైదరాబాద్ నుంచి పుణెకు, అక్కడి నుంచి ముంబైకు ఎంపీ దృష్టి సారించాలని ప్రజల విన్నపం -
ఇళ్లు
10ఇందిరమ్మవేలరెండో విడతలో జిల్లాకు కేటాయింపు నియోజకవర్గానికి 2వేల చొప్పున.. ● ఈ నెలలోనే లబ్ధిదారుల ఎంపిక, ప్రారంభంనిర్మాణాలిలా.. జిల్లాలో 1,143 ఇళ్లు పూర్తవగా వాటికి గృహ ప్రవేశాలు పూర్తి చేశారు. అర్హులుగా గుర్తించి వారిలో మొదటివిడత కింద 16,559మందిని గుర్తించగా వారిలో 15,773మందికి కలెక్టర్ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 3,124మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆన్లైన్లో క్యాన్సిల్ అవ్వగా 12,649మంది లబ్ధిదారులను గుర్తించారు. 8,758 మందికి మర్కోట్ ఇవ్వగా 7,136మందికి గ్రౌండింగ్ పూర్తి చేశారు. బేస్మెంట్ (బీఎల్) స్థాయిలో 1,140, రూఫ్లెవల్ స్థాయిలో 880, ఆర్సీసీ స్థాయిలో 3,673 ఉండగా 1,143 ఇళ్లు పూర్తయ్యాయి. 3,891మంది లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. వివిధ స్టేజీల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.195.74 కోట్లను చెల్లించింది. 1.36 లక్షలు అర్హులు.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సందర్భంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 ప్రకారం దరఖాస్తులను తీసుకుని వారి దరఖాస్తుల ఆధారంగా మూడు కేటగిరీల కింద విభజించింది. ఎల్–1 కింద సొంత స్థలాలున్న లబ్ధిదారులు, ఎల్–2 కింద సొంత స్థలం లేని, ఇల్లు లేని వారు, ఎల్–3 కింద ఇతరులుగా నిర్ధారించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని జిల్లాలో 3,18,435 మంది దరఖాస్తులు సమర్పించగా, ఇందులో 1,36,821మందిని అర్హులుగా అధికారులు నిర్ధారించారు.వేగవంతానికి చర్యలు -
బీజేపీకి కార్యకర్తలే బలం
మెదక్జోన్: బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పా టు చేసిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షు డు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కలిసికట్టుగా ముందుకు సాగుదామని, క్షేత్రస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్రెడ్డి, నందారెడ్డి, నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
విహాన్రామ్కు అవార్డు
మద్దూరు(హుస్నాబాద్): యువ అంతర్జాతీయ పర్వతారోహకుడు మాస్టర్ జాటోత్ విహాన్రామ్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ తెలంగాణ అవార్డ్స్ –2026 కార్యక్రమంలో భాగంగా ఆయనకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును ప్రముఖ నటి హెబ్బా పటేల్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విహాన్రామ్ మాట్లాడుతూ... తన విజయాలకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించి, భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రపంచ అత్యున్నత శిఖరాలపై ఎగురవేయడమే తన లక్ష్యమని తెలిపారు. చిన్నారికి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్ర ప్రసాద్ కూతురు చిన్నారి ప్రాణ్యకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కింది. ఈ విషయాన్ని శనివారం చిన్నారి తండ్రి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో నిర్వహించిన కీబోర్డు ప్రతిభ పోటీల్లో ప్రాణ్య పాల్గొని గంట పాటు కీబోర్డును ఆపకుండా వాయించి రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి 2వేలు మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొనగా, ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి రికార్డుల్లో చోటు లభించిందని వివరించారు. ఈనెల 29న హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. మహిళ మృతదేహం లభ్యంసంగారెడ్డి క్రైమ్: పట్టణంలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని ఫైర్ శాఖ ఆఫీస్ ఎదురుగా ఈ నెల 27న ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ(55) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా, చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన వడ్డే ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య మర్కూక్(గజ్వేల్): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చేబర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్, గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దేశమైన లక్ష్మి(60) కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో దూకింది. శవమై కనిపించడంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. -
చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి
చిన్నశంకరంపేట(మెదక్): చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టూరిజం శాఖ జిల్లా అధికారి రమేశ్ కోరారు. శనివారం మండలంలోని చందంపేట గ్రామంలో చారిత్రక చందమ్మ కోటదుర్గం, మెట్లబావిని టూరిజం శాఖ అధికారులతో కలిసి హెరిటేజ్ డెక్కన్ మీర్ఖాన్ బృందం సభ్యులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చారిత్రక పరిశోధకులు సందీప్, రమేశ్, హెరిటేజ్ డెక్కన్ మీర్ఖాన్ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాలోనే 90శాతం వైద్య సేవలు
సంగారెడ్డి జోన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రజలకు 90% వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసే పరిస్థితి రాకుండా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శనివారం విద్య, వైద్యం, ధాన్యం కొనుగోళ్లు, సీఎస్ఆర్ నిధుల వినియోగంతోపాటు అభివృద్ధి పనులపై వేర్వేరుగా అధికారులతో మంత్రి దామోదర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించి, ప్రతీ రోగికి సకాలంలో మెరుగైన చికిత్స అందించడం వైద్య సిబ్బంది బాధ్యతన్నారు. కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు, సంగారెడ్డి నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించాలన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష -
కొమురవెల్లిలో దొంగల బీభత్సం
కొమురవెల్లి(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు వివరాల ప్రకారం... స్థానికంగా ఉంటున్న సార్ల సురేశ్, భార్య భానుప్రియతో ద్విచక్రవాహనంపై పని మీద బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనం చేద్దామని సురేశ్ ఇంటికి రాగా అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ.లక్షా50 నగదు, మూడున్నర తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపరించారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
మున్సిపల్ కౌన్సిలర్ల ఉదారత
రామాయంపేట(మెదక్): స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఎరుకల విజయకు నా అనేవారు ఎవరూ లేరు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే గుడిసె వేసుకొని జీవిస్తుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మృతి చెందింది. దీంతో మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, దేవుని రంజిత్, పుట్టి సందీప్, రవి నాయక్లు మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు చింతల యాదగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గణేశ్, స్వామి, యాదగిరి, విరాట్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.అనాథ మృతదేహానికి అంత్యక్రియలు -
3న జిల్లాకు సీఎం రేవంత్
హత్నూర(సంగారెడ్డి): వచ్చేనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామశివారులోని నూతనంగా నిర్మించిన తెరానియం బయోలాజిక్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లను శనివారం జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే పరిశ్రమను పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాలు, సభ ఏర్పాట్లు చేసే హాలును, హెలీప్యాడ్ను ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఖాళీ స్థలాన్ని కూడా హెలీప్యాడ్ స్థలం కోసం ఎస్పీ పరిశీలించారు. పరిశ్రమ వెనుకభాగంలోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవీందర్, ఎస్సై శ్రీధర్రెడ్డి, ఆర్ఐ హరిబాబు, పరిశ్రమ ప్రతినిధులు అధికారులున్నారు. పొగాకుకు దూరంగా ఉండాలిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి దీప్తి సంగారెడ్డి టౌన్: పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో క్షయ, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలున్నాయని దానికి ప్రతీ ఒక్కరు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి దీప్తి సూచించారు. సంగారెడ్డిలోని కంది జైలులో పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యువత వ్యసనానికి దూరంగా ఉండాలని అనారోగ్యాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం జైలులోని సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడ్డపోతారం కమిషనర్పై సస్పెన్షన్ వేటు!జిన్నారం (పటాన్చెరు): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. కమిషనర్ వెంకటరామయ్య ఇటీవల పలు వ్యాపార సంస్థలకు నోటీసులు జారీచేయడంపై వేటు పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో గుమ్మడిదల కమిషనర్ దశరథ్ శనివారం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఉద్యోగ విరమణ సహజమేఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: జీవితంలో ప్రతీ ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజమేనని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. శనివారం పదవీ విరమణ పొందిన ఎస్సై అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలను ఎస్పీ, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తుంటాయన్నారు. పోలీసు శాఖ తరఫున వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ముగిసిన టీజీపీఎస్సీ పరీక్షలు వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు శని వారం ముగిశాయి. -
ట్రిపుల్ ఐటీకి విద్యార్థినుల ఎంపిక
రేగోడ్(మెదక్): రేగోడ్ మోడల్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై నట్లు ఎంఈఓ గుర్నాథ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థినులు తూర్పు హర్షవర్ధిని, నిక్షితలను వారు అభినందించారు. టేక్మాల్ మోడల్ స్కూల్ నుంచి ముగ్గురు.. టేక్మాల్(మెదక్): బాసర త్రిపుల్ ఐటీ మొదటి లిస్టులో మండల మోడల్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలు శనివారం తెలిపారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించిన సంకీర్తన, 565 మార్కులు సాధించిన కంకర ప్రవీణ్, అలేఖ్య ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సాయిలుతో పాటూ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. -
నమ్మించి.. వృద్ధురాలి నగలు దోచేసి
వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలిని బెదిరించి దుండగులు బంగారు కమ్మలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు ఇలా... మండలంలోని రామాయిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రాజమ్మ పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు మండలంలోని సెంట్రల్ బ్యాంక్కు వచ్చింది. సోమవారం డబ్బులు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఆరెగూడెం గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో బ్యాంకు బయటే ఉన్న ఓ ఆటో డ్రైవర్ తాను అదే రూట్లో వెళుతున్నానని, ఆరెగూడెం వద్ద దిగబెడతానంటూ నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నాడు. కానీ ఆరెగూడెం గేట్ దాటి బస్వాపూర్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి చెవులకు ఉన్న బంగారు కమ్మలను ఆటోడ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో వ్యక్తి బలవంతంగా లాక్కున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి దవడ, రెండు చెవులకు గాయాలయ్యాయి. అనంతరం మహిళను ఆటోనుంచి బయటకు గెంటివేసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలి ఏడుపులు విని చుట్టుపక్కల వారు విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరిరక్షణపై పట్టింపేది?
కబ్జాలు, మురుగునీటితో ఉనికి కోల్పోతున్న చెరువులు ● ఫిర్యాదులొచ్చినప్పుడే నామమాత్రపు చర్యలురామచంద్రాపురం(పటాన్చెరు): ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చెరువులు నేడు మురికి గుంటలుగా మారుతున్నాయి. రామచంద్రాపురం మండల పరిధిలోని ప్రధాన చెరువులు ఉనికిని కోల్పోతున్నాయి. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు చర్యలు.. రామచంద్రాపురం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరువులపై ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే రానున్న రోజుల్లో చెరువులు పూర్తిగా మాయమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాడు సాగునీరు.. నేడు మురికి గుంటలుగా.. ఒకప్పుడు ఈ చెరువుల కింద వందల ఎకరాల్లో సాగు జరిగేది. పరిసర ప్రాంతాల భూగర్భ జలాలకు ఇవే ప్రధానంగా ఆధారంగా ఉండేవి. వేగంగా విస్తరిస్తున్న అభివృద్ధి కారణంగా ఆక్రమణలు, కాలువలను మూసివేయడంతో చెరువులు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. చెరువుల ఇన్లెట్, ఔట్లెట్ కాలువలు కబ్జాలకు గురికావడంతో వర్షాకాలంలో సైతం నీరు చేరని పరిస్థితి నెలకొంది. రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్ర చెరువు, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని అనేక చెరువుల్లోకి కొన్నేళ్లుగా భారీ ఎత్తున మురుగునీరు చేరుతోంది. దీంతో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమైపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ హద్దుల ఏర్పాటేది? రామచంద్రాపురం మండల పరిధిలోని చెరువులను పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ హద్దులను ఏర్పాటు చేయాల్సి ఉండగా దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలను ప్రారంభించాలని కోరుతున్నారు. మురుగునీరు రాకుండా చేయడంతోపాటు చెరువుల్లోని మురుగునీటిిని తొలగించి స్వచ్ఛమైన నీటిని నింపాలని డిమాండ్ చేస్తున్నారు.హైడ్రాకు ఫిర్యాదు.. కబ్జాకు గురవుతున్న చెరువులపై ఇప్పటికే పలువురు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. పలుమార్లు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి చెరువులను పరిశీలించి వెళ్లారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. -
ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్
● కలెక్టర్ ప్రతిమా సింగ్ ● సభాపతులుగా, మంత్రులుగా మారిన విద్యార్థినులుమెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా మాక్ పార్లమెంట్ నిర్వహించామని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో డీఆర్డీఏ, స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలల హక్కులు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు మండలాల నుంచి ఎంపికై న బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలను పోషిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలు, సమస్యలను విశ్లేషించే దృక్పథం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. బాలికల రక్షణ, సంరక్షణ కింద బాల్య వివాహల నిర్మూలనకు 1098, ఇంట్లో ఏమైనా సమస్య తలెత్తితే సఖీ సహాయ కేంద్రం 181, డయల్ 100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీడబ్ల్యూఓ హేమాభార్గవి , అదనపు డీఆర్డీఓ సరస్వతి, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కిశోర బాలికలు పాల్గొన్నారు. -
దివ్యాంగులు స్వయం ఉపాధిలో రాణించాలి
కొండాపూర్(సంగారెడ్డి): దివ్యాంగులు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ ఆనంద్ నాయక్ అన్నారు. శనివారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, సెర్ప్ సంస్థ సహకారంతో దివ్యాంగులకు కొండాపూర్లోని మహిళా సమాఖ్య కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, మార్కెటింగ్ పద్ధతులు, చిన్న వ్యాపారాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆనంద్ నాయక్ మాట్లాడుతూ.. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ దివ్యాంగుల సంక్షేమమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ శిక్షణ ద్వారా దివ్యాంగులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై కూడా వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఏపీఎం మాణిక్యంతో కలిసి దివ్యాంగులకు గ్రాంట్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ గ్రాంట్లు వారి స్వయం ఉపాధి వ్యాపారాల ప్రారంభానికి ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా క్లస్టర్ మేనేజర్ రవిప్రకాశ్ , క్లస్టర్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ , మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు భూ కబ్జాపై విచారణ
వట్పల్లి(అందోల్): సింగూర్ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలోని వందల ఎకరాల భూమిని ఆక్రమించి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని, దీనిపై విచారణ చేపట్టి సింగూరు భూములను కాపాడాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఖాదిరాబాద్ గ్రామ శివారులో సింగూరు భూములు కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న ఆయన శనివారం అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సింగూరు ముంపు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేయడాన్ని ఆసరగా చేసుకుని మంత్రి దామోదర బావమరిది ముంపు ప్రాంతంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే ఖాదిరాబాద్, సాయిపేట గ్రామాల శివారులో 70 ఎకరాల భూమి కలిగిన మంత్రి బావమరిది టూరిజం, రిసార్ట్, బోటింగ్ వ్యాపారం పేరిట ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే భూములను యంత్రాలతో చదును చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు మంత్రి బావమరిది తన ఫాంహౌస్ నుంచి లోపలికి కిలోమీటర్ దూరం వరకు బండరాళ్లతో నింపి, దానిపై మట్టితో అక్రమంగా రోడ్డు వేస్తున్నారన్నారు. ఈ క్రమంలో కోరివికుంట, నల్లకుంట చెరువుల కట్టలను పూర్తిగా తవ్వేశారని తెలిపారు. విద్యుత్శాఖ అనుమతి లేకుండానే ముంపు ప్రాంతంలో కిలోమీటరు మేర విద్యుత్లైన్లు వేశారన్నారు. ప్రాజెక్టులో గుడి కడతామనే నెపంతో అక్కడ జెండాలు పాతి, భవిష్యత్తులో ఈ కబ్జాను క్రమబద్దీకరించుకునేందుకు కుట్రలు చేస్తున్నా స్థానిక అధికారులు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని తక్షణమే రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్శాఖ అధికారులతో ఉమ్మడి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ వందల ఎకరాల భూ కబ్జాకు మంత్రి దామోదర్ బావమరిది యత్నం! -
బాధితుల నష్టపరిహారం దిగమింగి..
సంగారెడ్డి: తాజా బదిలీపై వెళ్లిన మాజీ డీఎంహెచ్ఓ వసంతరావుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది నవంబర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతిచెందగా సదరు కుటుంబ సభ్యులు వైద్యుల వైఖరిపై ఆందోళన చేశారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్ఓ మధ్యవర్తిత్వం వహించి ఆస్పత్రి యాజమాన్యం నుంచి రూ.25లక్షలకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులకు తొలివిడతగా రూ.15లక్షలు ఇవ్వగా మిగతా రూ.10లక్షలను డీఎంహెచ్ఓకు ఇచ్చేశారు. అయితే బాధిత కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారాన్ని డీఎంహెచ్ఓ వసంతరావు తన సొంతానికి వాడేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు డీఎంహెచ్ఓను నిలదీయగా ఈ రోజు రేపు అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. శనివారం వసంతరావు బదిలీ అవుతున్నట్లు తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లి నష్టపరిహారం డబ్బులు ఇవ్వాలని గొడవ చేశారు. దీంతో వారికి రూ.5లక్షలే ఇచ్చి మిగతా రూ.5లక్షలు తర్వాత ఇస్తానని చెప్పి వెళ్లిపోయారు. డీఎంహెచ్ఓ పనితీరు సరిగా లేకపోవడంతో కలెక్టర్ పలుమార్లు నోటీసులు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. అయినా ఆయన వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో బదిలీ చేసినట్లు సమాచారం. -
మూతపడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం
పటాన్చెరు టౌన్: మూతబడిన పీఓపీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన పటాన్న్చెరులో శనివారం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల ప్రకారం... పటాన్న్చెరు అబ్కారీ కార్యాలయం సమీపంలో గతంలో ఒక పరిశ్రమ కార్యకలాపాలు నిర్వహించేది. ప్రస్తుతం ఆ పరిశ్రమ మూతబడటంతో ఆ స్థలం ఖాళీగా ఉంది. ఇందులో డెకరేషన్ పనులు చేసే వారు పీఓపీతో తయారు చేసిన వస్తువులను నిల్వ ఉంచేవారు. శనివారం అకస్మాత్తుగా పీఓపీ వస్తువులకు మంటలు అంటుకున్నాయి. మంటలు వ్యాపించి దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కాగా, ఎవరో నిర్లక్ష్యంగా సిగరెట్ను వెలిగించి పడేయడంతోనే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. -
రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం
గజ్వేల్రూరల్: ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానంతో పాటు జనాభా లెక్కల్లో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ వైస్చైర్మన్ తుమ్మ శ్రీనివాస్, స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్రావు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బత్తుల రమేశ్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఇటీవల విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి చెందిన 26కులాలకు అవకాశాలు లేకపోవడం, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవడం, విద్యార్థులకు సీట్లు తగ్గడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వివరిస్తూ... హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, దేవేందర్, స్వామి, శివకుమార్, శ్రీనివాస్, గిరి, స్వామి పాల్గొన్నారు.మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ -
జీలుగ సాగు.. ఫలితాలు బాగు
ఇప్పటికే జిల్లాలో విత్తనాల పంపిణీచిలప్చెడ్(నర్సాపూర్): అధిక మొత్తంలో రసాయన ఎరువులు వినియోగించడం మూలంగా నేల భూసారాన్ని కోల్పోవడంతో పాటు, ప్రకృతికి సైతం హాని జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,285 క్వింటాళ్ల జీలుగ, 1030 క్వింటాళ్ల జనుము విత్తనాలను అధికారులు పంపిణీ చేశారు. కాగా ఇవి రెండు కలిపి మరో 715, 180 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీలుగ 30 కేజీల బస్తా ధర రూ.2452 ఉండగా ఎకరాకు 12 నుంచి 16 కిలోలు, జనుము 40 కేజీల బస్తా ధర రూ.3110 ఉండగ.. ఎకరాకు 16 నుంచి 20 కిలోల వరకు చల్లుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జీలుగతో భూసారం పెరుగుదల జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. 35 నుంచి 45 రోజుల వరకు పెరిగిన జీలుగ మొక్కలను నేలలోనే కలియదున్నితే సుమారు 12 టన్నుల జీవపదార్థం నేలలో చేరుతుంది. దీంతో సేంద్రియ కర్బనం పెరిగి భూమి సారవంతమవడంతో పాటు, సూక్ష్మజీవుల పెంపకం, తెగుళ్ల నివారణ, నీటి నిల్వ సామర్థ్యం పెరగుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పంట దిగుబడిని కొంతవరకు పెంచుతుంది. జనుము ప్రయోజనాలు పర్యావరణ అభివృద్ధికి జనుము కీలక పంట అని, పూత దశకు వచ్చిన తర్వాత నేలలో కలియదున్నడం మూలంగా పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. కాగా పంట ఏపుగా పెరగడంతో కలుపు మొక్కలను సైతం అణిచి వేస్తుంది. తర్వాత వేరే పంట సాగు చేస్తే కలుపు నివారణ సులభం అవుతుంది. ఈ పంట పశుగ్రాసానికి సైతం వినియోగించుకోవచ్చు. సాగు వల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గి, భూసారంతో పాటు పంట దిగుబడి సైతం పెరుగుతుంది. -
జిల్లా వైద్యారోగ్య బదిలీ శాఖ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ప్రాతినిధ్యంవహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లాలో డీఎంహెచ్ఓ (జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి) పోస్టు నియామకం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.వసంత్రావును ఆకస్మికంగా బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు రావడం..ఆయన స్థానంలో డాక్టర్ కె.లలితాదేవికి పోస్టింగ్ ఇవ్వడం..ఆమె శనివారమే ఆగమేఘాలపై జిల్లాకు వచ్చి బాధ్యతలు తీసుకోవడం..ఇలా 24 గంటల్లోనే నిర్ణయాల అమలు చకచకా జరిగిపోవడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా డీఎంహెచ్ఓగా నియమితులైన లలితాదేవి చార్మినార్ జోన్ డీఎంహెచ్ఓగా పనిచేస్తున్నారు. మరోవైపు వసంతరావుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ను ఆశాఖ డైరెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వసంతరావు 2025 నవంబర్ 14న డీఎంహెచ్ఓగా బాధ్యతలు తీసుకోగా ఏడు నెలల్లోనే ఆయన్ను మార్చుతూ ఆదేశాలు రావడం గమనార్హం. నాలుగు నెలలకే నాగనిర్మల మార్పు.. డీఎంహెచ్ఓ పోస్టు నియామాకం ప్రతీసారి ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. గతంలో డీఎంహెచ్ఓగా నియమితులైన డాక్టర్ కె.నాగనిర్మలను కూడా ఐదు నెలల్లోనే మార్చేశారు. నాగనిర్మల 2025 జూలై 26 డీఎంహెచ్ఓ (ఇన్చార్జి)గా బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు నాలుగు నెలల్లోనే ఆమెను ఈ పోస్టు నుంచి తొలగించారు. ఆమె స్థానంలో వసంతరావును నియమిస్తూ 2025 నవంబర్ 13న ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా నాలుగు నెలల్లోనే నాగనిర్మలను తొలగించగా..ఇప్పుడు వసంతరావును కూడా ఆరు నెలల్లోనే మార్చడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ శాఖలో కొన్ని ఉద్యోగాల నియామకాల విషయమే నాగనిర్మల మార్పునకు దారితీసిందనే చర్చ అప్పట్లో జరిగింది. 2021 నుంచి ఇన్చార్జి పాలనే.. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పోస్టులో గత ఐదారేళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగింది. 2021లో మోజీరాం రాథోడ్ తర్వాత డాక్టర్ సునీల్ కుమార్ కొన్ని రోజులే ఇన్చార్జిగా పనిచేశారు. తర్వాత 2021 మార్చి 30న డాక్టర్ గాయత్రీదేవి ఇన్చార్జి డీఎంహెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె 2025 జూలై 25 వరకు దాదాపు ఐదేళ్లుగా ఇన్చార్జిగానే కొనసాగారు. ఆ తర్వాత రెగ్యులర్ అధికారులు నియమితులైనప్పటికీ వారు తరచూ మారుతుండటంతో ఆ శాఖలో పాలన ప్రశ్నార్థకంగా మారింది.డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టే కారణమా? వసంతరావుకు ఆకస్మిక బదిలీ వెనుక కారణాలేంటనే అంశంపై ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. రోగుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ఈ ప్రక్రియ మంత్రి సొంత జిల్లాలోనే నత్తనడకన సాగుతోంది. వసంతరావు బదిలీ వెనుక ఇది కూడా ఓ కారణమై ఉండవచ్చని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వైద్యరోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లా పర్యటన సందర్భంగా వసంతరావు సెలవుపై వెళ్లిపోవడం కూడా ఆయన ఆకస్మిక బదిలీకి దారి తీసిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద వైద్యారోగ్యశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర సొంత జిల్లాలో సొంత శాఖలో అధికారుల తరచూ మార్పులు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఏడు నెలల్లోనే డీఎంహెచ్ఓ వసంతరావుకు స్థానచలనం అంతకుముందు నాగనిర్మలకు నాలుగు నెలల్లోనే.. హెల్త్ మినిస్టర్ సొంత జిల్లాలో డీఎంహెచ్ఓ పోస్టింగ్ల తీరిది అధికార వర్గాల్లో సర్వత్రా చర్చ -
రైతు డిస్కం పేరిట ఉరితాడు
మాజీ మంత్రి హరీశ్రావునంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం ఉచిత విద్యుత్కు ఉరితాడులా మారుతుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాత మోటార్లు ఆన్ అయి, సాయంత్రం 5 గంటలకు ఎండపోగానే బంద్ అవతాయని ఆరోపించారు. శనివారం పాలమాకులలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ముండ్రాయిలో రైతులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ పాలనలో చిన్న సమస్య వచ్చినా మెసేజ్ పెట్టగానే పరిష్కారమయ్యేదని, నేడు పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు నేలచూపు చూస్తుండటంతో పిల్లల ఫీజులు కట్టలేక అల్లాడుతున్నారన్నారు. రైతు డిస్కంకు సోలార్ పవర్ మాత్రమే కేటాయించడంతో రోజుకు 7, 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రైతులను ఆదుకుంటామని గొ ప్పలు చెప్పిన ప్రభుత్వం రైతుబంధుకు ఎగనామం పెట్టిందని ఎద్దేవా చేశారు. -
ప్రతి ఏటా సాగు చేస్తా
నాకున్న ఐదెకరాల పొలంలో ప్రతి యేటా జనుము సాగు చేస్తా. ఈ సారి సైతం విత్తనాలను కొనుగోలు చేశా. జనుము వేసిన 40 నుంచి 45 రోజుల్లో పూత దశకు రాగానే నేలలో కలియదున్నుతా. తర్వాత వరి సాగు చేసేందుకు సులభంగా ఉండటంతో పాటు, రసాయన ఎరువులు తక్కువ మోతాదులో వినియోగిస్తా. కలుపు మొక్కలు సైతం తక్కువగానే ఉంటాయి. దిగుబడి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. – ప్రవీణ్, రైతు, అజ్జమర్రి అవగాహన కల్పించాం జీలుగు, జనుము విత్తనాల వల్ల కలిగే లాభాల గురించి జిల్లా వ్యాప్తంగా రైతులకు, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. ఈ రెండింటితో మంచి ప్రయోజనాలు ఉన్న, ఎక్కువ మంది రైతులు వాటిని సాగు చేయకుండా తమదైన శైలిలో నేరుగా ప్రధాన పంట సాగు చేస్తున్నారు. భవిష్యత్లో నేల సారవంతంగా ఉండాలంటే రసాయన ఎరువులు తగ్గించడంతో పాటు, వ్యవసాయానికి, పర్యావరణానికి మేలు చేసే జీలుగ, జనుము సాగు చేయాలి. – దేవ్కుమార్, డీఏఓ -
స్తంభాన్ని ఢీకొట్టిన ధాన్యం ట్రాక్టర్
చిలప్చెడ్(నర్సాపూర్): ధాన్యం లోడ్తో రైస్మిల్లుకు వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన మండలంలోని గంగారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామానికి చెందిన రైతు రమేశ్ తాను పండించిన ధాన్యాన్ని, హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో గల ఓ మిల్లుకు తరలిస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ స్తంభం విరగడంతో మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ సిబ్బంది మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. -
స్విమ్మింగ్పూల్లో పడి ఎఫ్ఎస్ఓ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): ప్రమాదవశాత్తు వెల్దుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ స్విమ్మింగ్ పూల్లో పడి మృతిచెందాడు. వివరాలు ఇలా... కామారెడ్డిలో ఉంటున్న శ్రీనివాస్ గురువారం సాయంత్రం తన కొడుకుకు ఈత నేర్పించడానికి స్థానికంగా ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ఎఫ్ఎస్ఓ మృతి పట్ల ఫారెస్ట్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): పని చేసే స్థలంలోనే అస్వస్థతకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పురుమాండ్ల ఇంద్రసేనారెడ్డి(56) రోజు మాదిరిగా ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే సమయంలో పని ప్రదేశంలో అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కుమారులు ఉన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలువురిని గుర్తించి శుక్రవారం బైండోవర్ చేసినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. వివరాలు ఇలా... మండలంలోని గాగిళ్లాపూర్కు చెందిన 11 మంది యువకులు దాచారం శివారులో అక్రమంగా ఇసుకను అక్రమంగా డంప్ చేశారు. వారిలో 10మందితో పాటు సిద్దిపేటకు తరలిస్తున్న ఒక్కరిని బైండోవర్ చేశామని తెలిపారు. మిగితా ఒక్కరిని త్వరలోనే బైండోవర్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ● క్రిమినల్ కేసు నమోదు ● కౌన్సిలింగ్.. తహసీల్దార్ ఎదుట బైండోవర్ వట్పల్లి(అందోల్): ప్రధాన రహదారిపై ఘర్షణ పడుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగించిన ఆరుగురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన శుక్రవారం జోగిపేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం... అందోల్ మండల పరిధిలోని సంగుపేట అండర్పాస్ బ్రిడ్జీ వద్ద ప్రధాన రహదారిపై ఈనెల 26న రెండు గ్రూపులుగా ఉన్న ఆరుగురు యువకులు కొట్లాడుతూ గొడవలు సృష్టించి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయమై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాసాన్పల్లి, పోతిరెడ్డిపల్లి, సదాశివపేట ప్రాంతాలకు చెందిన బంటు వంశీకృష్ణ, మన్నె అనిల్, విష్ణు, జోగిపేటకు చెందిన ముద్దసి అహ్మద్, మహ్మద్ అబ్దుల్, మహ్మద్ అస్లాంను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. యువకుల తల్లిండ్రులను పిలిపించి మళ్లీ ఎలాంటి గొడవలకు వెళ్లవద్దని వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అందోల్ తహసీల్దారు మధుకర్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో శుక్రవారం పంపిణీ చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సరైన సౌకర్యాలు లేక గందరగోళం నెలకొంది. 104 మంది లబ్ధిదారులకు ఇరుకై న సమావేశ మందిరంలో పంపిణీ చేయడంతో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీట్లు సరిపోలేదు. దీంతో చాలా మంది బయటే నిల్చున్నారు. ఒక వైపు మండే ఎండలు, మరో వైపు ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడ్డారు. నిర్వహణలో రెవెన్యూ అధికారులు విఫలమాయ్యరని పలువురు మండిపడ్డారు. -
బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల మూడు నెలల బకాయిలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామపంచాయతీ కార్మికులు కష్టపడి గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేస్తున్నారని, ప్రతినెల వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు రాకుంటే వారు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు రెగ్యులర్గా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, దశరథ్, నాయకులు పోచయ్య, యాదమ్మ ,నగేశ్ , ఆనంద్, బాలయ్య, శంకర్, లక్ష్మణ్, రాములు, ఎల్లయ్య పాల్గొన్నారు. -
18 శాతం బడ్జెట్ కేటాయించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. టీపీటీఫ్ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని సంగారెడ్డిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జెండాను జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం అశోక్కుమార్ మాట్లాడుతూ...ఉపాధ్యాయ లోకంలో టీపీటీఫ్ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, ప్రాధాన్యత కలిగిన సంఘమన్నారు. ఉపాధ్యాయుల సేవల కోసమే కాకుండా, ‘బాధ్యతలకు నిలబడు – హక్కులకై కలబడు’నినాదంతో సమాజంలో పేద పిల్లలందరికీ నాణ్యమైన, శాసీ్త్రయమైన ఉచిత విద్య అందాలనే నిబద్ధతతో పనిచేసే ఏకై క సంఘం మనదని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను ఉపాధ్యాయలోకం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిధుల కొరత, మౌలిక వసతుల లేమి వల్ల పేద ప్రజలకు ఉచిత విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం జరిగే వరకు, సీపీఎస్ రద్దయ్యే వరకు, ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక భద్రత కల్పించే వరకు మరిన్ని క్షేత్రస్థాయి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య, భూమి శ్రీనివాస్, కంరోద్దీన్, జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రి ప్రశాంతి, విజయ్ భాస్కర్, జిల్లా కార్యదర్శులు జగన్నాథం, బానోత్ రవీందర్, సుమలత, అకడమిక్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ -
త్వరగా ధాన్యం తరలించండి
నర్సాపూర్ రూరల్: ధాన్యం త్వరగా తరలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని కాగజ్మద్దూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించారు. గోనె సంచులు, లారీల కొరత కారణంగా వడ్లు తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడవడంతో పాటు నిద్రాహారాలు మాని ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ ప్రతిమాసింగ్కు ఫోన్ చేశారు. కాగజ్మద్దూర్, నత్నయపల్లి, కొండాపూర్ తదితర గ్రామా లకు గోనె సంచులు, లారీలను పంపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నాయకులు శేఖర్, మాజీ సర్పంచ్లు పరమేశ్వర రాజు, శంకరయ్య, రైతులు ఉన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
● నాలుగు దూడలు మృతి ● బూడిదైన గడ్డి కట్టలు అక్కన్నపేట(హుస్నాబాద్): అగ్నిప్రమాదంలో పశువుల పాకలో కట్టేసిన ఆవు దూడలు చనిపోగా, గడ్డికట్టలు కాలిపోయాయి. ఈ సంఘటన మండలంలోని మల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు కోల చంద్రయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పశువులను కట్టేశాడు. అయితే షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగాయి. దీంతో పశువుల పాకతో పాటు నాలుగు దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. అలాగే 500గడ్డి కట్టలు సైతం కాలి బూడిదయ్యాయి. 10గుంటల వ్యవసాయ భూమితో పాటు తనకున్న పశువులపై ఆధారపడి రైతు జీవిస్తున్నాడు. ఈ ఘటనతో దాదాపుగా రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ హరీశ్రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత రైతుకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. -
గిన్నిస్ బుక్ ప్రశంసాపత్రం అందజేత
దుబ్బాకరూరల్: మండలంలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన నాగరాజ్, శశిరేఖ దంపతుల కుమారుడు నిహిత్ కీబోర్డు వాయించడంలో ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన కీబోర్డు వాయిద్యా పోటీల్లో 22 దేశాల నుంచి 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. గంటకు పైగా కీ బోర్డు వాయించడంలో 777మంది విద్యార్థులు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకు ఎంపికయ్యారు. ఎంపికై న నిహిత్ను హైదరాబాద్లోని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్ పాఠశాల యాజమాన్యం గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రం అందజేసి సన్మానించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిద్దిపేటఅర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక బాల్య వికాసం (ఈసీడీ) కార్యక్రమాల అమలును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలనేగి పేయింటింగ్స్, పిల్లల అభ్యాసానికి అనుకూలంగా రూపొందించిన విద్యా వాతావరణం, ఆటల ద్వారా నేర్చుకునే విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల మెదడు వికాసం, ప్రీ–స్కూల్ విద్య, స్కూల్ రెడినెస్, మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
తూప్రాన్: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి డీలర్లకు సూచించారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను డివిజన్ టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూరియా బ్లాక్ చేయకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీఐ వెంకటరాజుగౌడ్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డీలర్ రోజువారీ క్రయవిక్రయాలను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు స్టాక్ బోర్డు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. -
సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలి
● అగ్రి హార్టి సొసైటీ కార్యదర్శి వీరభద్రరావు ● ములుగు వర్సిటీలో అడ్వైజరీ కమిటీ సమావేశం ములుగు(గజ్వేల్): ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని అగ్రి హార్టి సొసైటీ కార్యదర్శి, ఐసీఏఆర్ పాలక మండలి సభ్యుడు కె.వీరభద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ డాక్టర్ రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జోనల్ రీసెర్చ్, ఎక్స్టెన్సన్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో పాడైన పాలిహౌస్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ఎన్హెచ్బి, నాబార్డు, సీఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. కాలిఫోర్నియా వంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉండటంతో రాష్ట్రంలో పలు ఉద్యాన పంటలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. బాలానగర్ సీతాఫలం, ద్రాక్ష తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చే పండ్లుగా అభివర్ణించారు. కోతుల సమస్య రైతులకు ఇబ్బందిగా మారిందని, దీనిపై శాసీ్త్రయ పరిష్కారాలు అవసరమన్నారు. వర్సిటీ వీసీ డాక్టర్.రాజిరెడ్డి మాట్లాడుతూ.. జీవ నియంత్రణ పద్ధతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ అత్యంత అవసరమని తెలిపారు. అనతరం వీరభద్రరావు వర్సిటీ అధికారులతో కలిసి పరిశోధన కేంద్రాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంయుక్త ఉద్యాన సంచాలకులు సంగీత లక్ష్మి, జిల్లా ఉద్యానశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. -
యోగా అద్భుతమైన ఔషధం
సిద్దిపేటజోన్: మానసిక వికాసానికి యోగా ఒక్కటే అద్భుత ఔషధమని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సిద్ధిపేట కోమటి చెరువు రుబి నెక్లెస్పై యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా న్యాయనిర్ణేతల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి విధ్వంసంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కాలుష్యాలు, చెడు ఆహార అలవాట్లు, అవాంఛనీయ జీవనశైలి మనుషులను రోగాలకు దగ్గర చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా సాధన తప్పనిసరి చేశారన్నారు. మనిషి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. బాల్యం నుంచే యోగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన యోగా సాధకులతో సామూహిక సూర్య నమస్కారాలు చేయించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, యోగా గురువు సతీశ్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామ్రెడ్డి, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్, అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి -
ఆయిల్పామ్ సాగుతో ఆదాయం
● కోతుల బెడద ఉండదు ● ఏఓ స్వప్న కౌడిపల్లి(నర్సాపూర్): ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని, కోతుల బెడద ఉండదని ఏఓ స్వప్న తెలిపారు. శుక్రవారం మండలంలోని నాగ్సాన్పల్లిలో ఆయిల్పామ్సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతులు కోతుల బెడద కారణంగా పంటమార్పిడి చేయడం లేదని చెబుతున్నారని తెలిపారు. కాగా ఆయిల్పామ్ సాగుకు కోతుల బెడద ఉండదని, ఒక్కసారి సాగుచేస్తే నాలుగేళ్ల నుంచి ఏళ్ల తరబడి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ అందజేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, మాజీ సర్పంచ్ ఎల్లం, ఏఓ నరేందర్, ఆయిల్పామ్ మేనేజర్ కృష్ణారావ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్, ఉదయ్, రైతులు కృష్ణ, రాములు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
జెత్రం తండాలో తాగునీటి కష్టాలు
చేగుంట(తూప్రాన్): మండలంలోని జెత్రం తండాలో రెండు వారాలుగా మిషన్ భగీరథ నీటిని సరఫరా జరగకపోవడంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరవై రోజుల క్రితం భగీరథ ప్రధాన పైపులైన్లో మరమ్మతులు చేస్తున్నారని, గ్రామాల్లో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ నీటి సౌకర్యాలను వినియోగించుకోవాలని అధికారులు అన్ని గ్రామాల సర్పంచులకు సూచించారు. కానీ నాటి నుంచి తండాకు భగీరథ నీరు సరఫరా కావడం లేదు. గిరిజనుల సౌకర్యం కోసం సర్పంచ్ సుభాష్నాయక్ ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా తండావాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగీరథ నీటిని సరఫరా చేయాలని, లేకుంటే మండల కేంద్రంలో బిందెలతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
చివరి గింజవరకు కొంటాం
నారాయణఖేడ్: రైతులు పండించిన పంట ఉత్పత్తులను చివరిగింజ వరకు కొంటామని, రైతులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ధైర్యం చెప్పారు. ఖేడ్ మండలం లింగాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం, మనూరులో జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ధాన్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈసారి 35% వరకు అధిక దిగుబడి వచ్చిందన్నారు. గోడౌన్లలో ఖాళీలేక, లారీల కొరత, మిల్లుల్లో పాతవడ్లు ఉండటం తదితర వాటివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. నిబంధనలను సడలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు. రెండేళ్లుగా జొన్నలు గోడౌన్లలో మగ్గుతుండగా తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తామన్నా కొనేవారు లేరన్నారు. జొన్నలు పండించవద్దని చెప్పినా పండిస్తున్నారన్నారు. పంట మార్పిడికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రెవెన్యూ భవనంకు రూ.12కోట్లు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లో రెవెన్యూ భవనం కోసం రూ.12 కోట్లు, పర్యాటక శాఖ ద్వారా బోరంచ, నల్లవాగు, కమలాపూర్లలో బోటింగ్ కోసం రూ.2 కోట్లు, బోరంచలో ఎకోపార్కు కోసం రూ.2 కోట్లు, ఖేడ్లో ఏటీసీ కేంద్రానికి రూ.47 కోట్లు మంజూరుకాగా టెండర్కు ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. మంజీరా నీటిని ఎత్తిపోతల ద్వారా నల్లవాగుకు తరలించడానికి రూ.74 కోట్లతో డీపీఆర్ సిద్ధంకాగా త్వరలో జీవో వెలువడనుందని చెప్పారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం
రామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు: నిత్యం కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన క్రీడాకారులను మహిపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 23,24తేదీల్లో శ్రీలంకలో జరిగిన క్రీడాపోటీల్లో రామచంద్రాపురానికి చెందిన క్రీడాకారులు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. పెద్దకంజర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జునస్వామి దేవాలయం, బీరప్పస్వామి దేవాలయాల నిర్మాణాలను సొంత నిధులతో త్వరలోనే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐనోలు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని..త్వరలో గ్రామంలో పర్యటించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్రీడాకారులు మల్లారెడ్డి, గంగాధర్రెడ్డి, అనుశ్రీ, యోగిత, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
కేతకీ హుండీ ఆదాయం రూ.31లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీలోని సంగమేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.31,46,891లు వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ మంటపంలో శివకేశవ సేవా సమితి, శ్రీరామ శివ సమితి సభ్యులు, గత 67 రోజులుగా వివిధ ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని హుండీలో సమర్పించిన నగదును లెక్కించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు రంగారావు, ఆలయ ఈవో శివ రుద్రప్ప, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వివాదాస్పద భూమిపై సర్వేపటాన్చెరు: ముత్తంగి పరిధిలోని పాటిలో వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 239లో చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. కొన్నేళ్లుగా ఆ భూమిలో తమకు ప్లాట్లు ఉన్నాయని పేర్కొంటూ ప్లాట్ యజమానులు అధికారులను ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం పోలీసుల భద్రత మధ్య సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్లాట్లుగా ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బౌన్సర్లు, పోలీసుల సమక్షంలో సర్వే కొనసాగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలిఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: విద్యార్థులు లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పార్క్ కార్యక్రమంలో పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో ఎస్పీ మాట్లాడారు. పోలీసు కుటుంబాల పిల్లలకు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ స్పార్క్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఖాకీ కిడ్స్కు విద్య ప్రాముఖ్యత, లక్ష్యసాధనకు కృషి చేయాల్సిన విషయాలను వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ నారాయణఖేడ్: రైతులు ఆధార్కార్డు, పట్టా పాసుపుస్తకం, మొబైల్ నంబరుతో మీసేవ కేంద్రాలకు వెళ్లి లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి ఈనెల 31వ తేదీ లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల్లో లబ్ధికిగాను ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరని తెలిపారు. రెండు రోజులే గడువు ఉన్నందున రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.రోడ్లపై జొన్న సంచులుమునిపల్లి(అందోల్): మార్క్ఫెడ్లో జొన్నలను అమ్మడానికి తెస్తుండగా ట్రాక్టర్ల నుంచి రోడ్డుపై జొన్న బస్తాలు పడిపోయాయి. గార్లపల్లి, పిల్లోడి గ్రామాల నుంచి శుక్రవారం రైతులు మేళసంగ్యం గ్రామ శివారు కల్కి పత్తిమిల్లుకు, తాటిపల్లి గ్రామంలోని జొన్నల కొనుగోలు కేంద్రాలకు తెస్తుండగా రోడ్లపై లోడ్ ఎక్కువై కింద పడిపోయాయి. ట్రాక్టర్ల నుంచి జొన్నల సంచులు కింద పడి పగిలిపోవడంతో జొన్నలు నేలపై రాలిపోయాయి. కిందపడిన జొన్నలను మళ్లీ శ్రమకోర్చి సంచుల్లో నింపి ట్రాక్టర్లో ఎక్కించారు. -
నాణ్యతలో మేటి భారతి సిమెంట్
చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ నాగేశ్వరరావ్కౌడిపల్లి(నర్సాపూర్): భారతి సిమెంట్ నాణ్యతలో మేటి అని చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ నాగేశ్వర రావ్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావ్పేట గేట్ వద్దగల సాయి తిరుమల ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ, సెంట్రింగ్ మేసీ్త్రలకు సమావేశం నిర్వహించి భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్మాణ రంగంలో భారతి సిమెంట్ అత్యంత ఉత్తమమైనదన్నారు. వికాట్ గ్రూప్ కంపెనీ ప్రపంచంలోని 12దేశాల్లో విస్తరించి ఉందని చెప్పారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. పిల్లర్లు, స్లాబులు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి భారతి సిమెంట్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఇన్సూరెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్, సేల్స్ ఆఫీసర్ గంగాధర్, భారతీ సిమెంట్ డీలర్లు రాజశేఖర్రెడ్డి, మల్లేశ్, కార్మికులు పాల్గొన్నారు. -
కూలిన మట్టిదిబ్బలు
● నలుగురు ఉపాధి మహిళా కూలీలకు గాయాలు ● సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు సిద్దిపేటరూరల్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై మట్టిదిబ్బ కూలగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రూరల్ మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామంలో రోజువారీగా కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న మట్టి కుప్ప కూలింది. దీంతో నలుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కూలీలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యం అనంతరం సర్పంచ్, తదితరులు వారిని ఇంటికి తీసుకువచ్చారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్గజ్వేల్: వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమ నిర్మాణాలు చేసిన వారికి గతంలో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని, అయినా వాటిని ఉల్లఘించినందువల్ల కూల్చివేత చర్యలు చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. -
సబ్సిడీ ఆశలు ఆవిరి!
వర్షాకాలంలో 7.60 లక్షల ఎకరాల్లో పలు పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో సగం మేర పత్తి పంట వైపే రైతులు మొగ్గుచూపే అవకాశమున్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. రైతులు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నా ఈ ఏడాది కూడా అవి అందే అవకాశం లేనట్లు తెలుస్తోంది. జనుము, జీలుగ విత్తనాలు మినహా వానాకాలంలో సాగు చేసుకునేందుకు అవసరమైన ఇతర రకాల విత్తనాలు రైతులు బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.జహీరాబాద్: ఐదేళ్ల కాలంగా ఆయా ప్రభుత్వాలు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు అందుతాయనే విషయంలో ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్ఎఫ్ఎస్ స్కీం కింద మాత్రమే సోయాబీన్ విత్తనాలు పరిమితంగా ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్ పంట జహీరాబాద్, ఖేడ్ నియోజకవర్గంలోనే అత్యధికంగా సాగవుతూ వస్తోంది. దీంతో వ్యాపారులు పలు కంపెనీలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటుగా సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేయాలన్నా క్వింటాల్కు రూ.12వేలకు పైగా చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. జనుము, జీలుగ విత్తనాలే సరఫరా.. రైతులు తమ భూములను సారంలోకి తెచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈ విత్తనాలు పచ్చిరొట్టగా ఉపయోగపడతాయి. జిల్లా వ్యాప్తంగా 7వేల క్వింటాళ్ల మేర అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5వేల క్వింటాళ్ల మేర అందుబాటులో ఉన్నాయి. ఇంకా రెండు వేల క్వింటాళ్ల మేర రావాల్సి ఉంది. ఆయా పంటల సాగు అంచనా.. జిల్లాలో వానాకాలంలో 7.60లక్షల ఎకరాల్లో వర్షాధారం కింద ఆయా పంటలు సాగు కానున్నాయి. ఇందులో సుమారు 3.60లక్షల ఎకరాల్లో ప్రధానంగా పత్తి పంటనే సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 1.50 లక్షల ఎకరాల్లో వరి, 70వేల ఎకరాల్లో సోయాబీన్, 70 వేల ఎకరాల్లో కంది, 20వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో మినుము, 10వేల ఎకరాల్లో పెసర పంట సాగయ్యే అవకాశం ఉంది. పత్తి విత్తనాలు అందుబాటులో.. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద పత్తి విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. అవసరం మేరకు విత్తనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులో ఎరువులు రైతులకు జూలై మాసం వరకు అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 20వేల టన్నుల యూరియా, 30వేల టన్నుల డీఏపీ ఉన్నట్లు చెబుతున్నారు. కాంప్లెక్సు ఎరువులు సరిపడా ఉన్నట్లు వివరిస్తున్నారు.ప్రైవేటుగానే సోయాబీన్, మినుము, పెసర, పత్తి, మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు! 50% సబ్సిడీపై కేవలం జనుము, జీలుగ విత్తనాలు అవసరం మేరకు అందుబాటులో ఎరువులు సాగు అంచనా 7.60 లక్షల ఎకరాలు 3.60 వేల ఎకరాల్లో పత్తి పంట!ఆందోళన చెందనవసరం లేదు వానాకాలం పంటలను సాగు చేసుకునేందుకు వీలుగా రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఏ మాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పత్తి విత్తనాలు ఎంఆర్పీ ధర కంటే తక్కువకు లభించే అవకాశం ఉంది. ఇతర విత్తనాలు కూడా అవసరం మేరకు అందుబాటులో ఉంచుతాము. ఎరువుల విషయంలోనూ ఎలాంటి ఆందోళన పడవద్దు. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి–సంగారెడ్డి -
పారదర్శకంగా సర్ ప్రక్రియ
సంగారెడ్డి జోన్: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు సంగీత, పాండు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ..పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతి, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్జైన్ -
బొలెరోకు అంటుకున్న మంటలు
తప్పిన ప్రమాదంనారాయణఖేడ్: బొలెరో వాహనానికి విద్యుత్తు తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఖేడ్ మండలం పీర్లతండాకు చెందిన రైతు రాజు పశువుల మేత కోసం శుక్రవారం తుర్కాపల్లికి చెందిన రైతు భూపాల్ రెడ్డి నుంచి గడ్డిమోపులను కొనుగోలు చేసి బొలెరో వాహనంలో తరలిస్తున్నాడు. అక్కడ డ్రైవర్ పైనున్న హైటెన్షన్ విద్యుత్తు తీగలను గమనించకుండా వాహనాన్ని తీశాడు. దీంతో గడ్డిమోపులు తీగలకు తగిలి షార్ట్సర్క్యూట్ అయి మంటలంటుకున్నాయి. సమీపంలో ఉన్న రైతులు ఖేడ్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కాగా సమీపంలోని బోరుమోటారుతో గడ్డిమోపులపై బిందెలతో నీళ్లు చల్లారు. మరోవైపు వాహనంలో ఉన్న గడ్డిని కిందకు తీశారు. అంతలోనే అగ్నిమాపక శకటంతో వచ్చిన సిబ్బంది మంటలార్పారు. వాహనానికి ఎలాంటి నష్టం జరగకపోగా రూ.10 వేల విలువచేసే గడ్డిమోపులు దగ్ధమయ్యాయి. -
ఇరిగేషన్లో పైరవీల ప్రవాహం!
నీటి పారుదలశాఖలో కీలక పోస్టింగ్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయా..? కాసులు కురిపించే కొన్ని సబ్ డివిజన్ల పోస్టులు దక్కించుకునేందుకు కొందరు అధికారులు తెరవెనుక పావులు కదిపారా? ఇందుకోసం ఓ అమాత్యుని స్థాయిలో సిఫార్సుల తతంగం నడిచిందా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగల బదిలీల ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా నీటిపారుదల శాఖలోనూ ఈ బదిలీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే కాసుల పంట పండించే కొన్ని కీలక పోస్టులు జిల్లాలో ఉన్నాయి. ఈ పోస్టులు దక్కించుకుంటే సదరు అధికారి అక్రమార్జన రూ.కోట్లలో ఉంటుంది. చెరువులు, కుంటల ఎన్ఓసీలు జారీ చేస్తే పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతుంటాయి. అలాగే చెరువులు, కుంటల భూములు కబ్జా జరుగుతుంటే ఆపకుండా కళ్లు మూసుకున్నందుకు కూడా కాసుల వర్షం కురుస్తుంది. ఇలా ఎన్ఓసీలు, కబ్జాల జాతర ఉండే సబ్ డివిజన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టింగ్లకు భలే డిమాండ్ ఉంటుంది. అయితే జిల్లాలో ఓకే చోట పాతుకుపోయిన ఇద్దరు అధికారులు ఇలాంటి కీలక సబ్ డివిజన్ల పోస్టులను దక్కించుకుంటున్నట్లు ఆశాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో ఆరితేరిన ఈ అధికారులు ఇప్పటికే రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. ఈ అధికారులు ఈ బదిలీల్లో మళ్లీ కాసులు కురిపించే పోస్టులకు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ అమాత్యుని స్థాయిలో సిఫార్సులు చేయించుకున్నారంటే వీరి పైరవీలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నేడో రేపో ఉత్తర్వులు.. ఈ బదిలీలకు సంబంధించి నేడో రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. మార్గదర్శకాల ప్రకా రం జూన్ 3వ తేదీలోగా బదిలీ అయిన స్థానాల్లో అధికారులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నేడు (శనివారం)గానీ, సోమవారం గానీ బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.లొసుగులను ఆసరాగా చేసుకుని.. జిల్లాలో నీటిపారుదలశాఖలో ఒక సర్కిల్ కార్యాలయంతోపాటు, నాలుగు డివిజనల్ కార్యాలయాలు, 17 సబ్ డివిజనల్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో ఎస్ఈతో పాటు నలుగురు డీఈలు, 17 మంది డిప్యూటీ ఈఈలు, 29 ఏఈలు పనిచేస్తున్నారు. బదిలీల మార్గదర్శకాల ప్రకారం ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారందరిని తప్పకుండా బదిలీ చేయాలి. ఈ నిబంధనల ప్రకారం ఒక డిప్యూటీ ఈఈని అదే డివిజన్లో పోస్టింగ్ ఇచ్చేందుకు వీలు లేదు. కానీ కొందరు డిప్యూటీ ఈఈ పోస్టింగ్ల విషయంలో ఈ మార్గదర్శకాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కాసులు కురిపించే సబ్ డివిజన్ పోస్టులను పదిలం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.కాసులు కురిపించే పోస్టులకు పెద్ద ఎత్తున లాబీయింగ్ అమాత్యుని స్థాయిలో సిఫార్సులు..!? నీటిపారుదలశాఖలో ట్రాన్స్ఫర్ల వ్యవహారం తీరు -
ఆహా.. ఆవకాయ
సంగారెడ్డి క్రైమ్ / హత్నుర(సంగారెడ్డి): వేసవిలో అటు గ్రామంలో.. ఇటు పట్టణంలో.. ఎక్కడ చూసినా మామిడికాయ పచ్చళ్ల తయారీతో సందడి నెలకొంది. పచ్చళ్లు నేటికి మన సంస్కతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుచిని పెంచడమే కాక ఆహారాన్ని సంరక్షించే సంప్రదాయ పద్ధతిగా కూడా పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండటమే ఆశ్చర్యం. బెల్లం – మామిడికాయ, మెంతి – ఆవకాయ పచ్చడి, పులిహోర ఆవకాయ పచ్చడీ వంటి రకాలు ప్రాంతాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ పచ్చళ్ల తయారీ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణతోపాటు పాత తరం నుంచి కొత్త తరానికి జ్ఞానాన్ని అందించడం వంటి సంస్కృతి, సంబంధాలను బలపరుస్తాయి. పచ్చడి తయారీ చేసే విధానం.. గట్టిగా, పుల్లగా ఉన్న పచ్చి మామిడికాయలను ఎంచుకొని లోపల టెంకలు తీసి ముక్కలుగా కోయాలి. ఆగపిండి. ఎండు కారం, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల నూనె వంటి ప్రధాన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. కొన్ని రకాల్లో బెల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. ఆ తర్వాత జాడీలో లేదా కుండల్లో కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలతో పొరలు పొరలుగా అమర్చి పైన నూనె పోస్తారు. ఇది పచ్చడిని పాడవకుండా కొన్ని నెలలు సంరక్షిస్తుంది. 34 రోజులపాటు గాలి చొరబడకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత తినడానికి తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. మామిడికాయ పచ్చళ్లు రుచికరమైనవే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. పచ్చి మామిడిలో పొటాషియం ఇతర ఖనిజాల వల్ల వేసవిలో డీ హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో పచ్చడి మామిడికి డిమాండ్ సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు ఏడాదికి సరిపడా కుటుంబంతో కలిసి తయారీ -
శరవేగంగ తగ్గి..
ఒకప్పుడు పచ్చనిపొలాలు..నిండుకుండలా బావులు, చెరువులు..కొద్ది అడుగుల్లోనే ఉప్పొంగే బోర్లతో తెల్లాపూర్ కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోతోంది. అభివృద్ధి పేరిట వేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలు భూమి అడుగున ఉన్న భూగర్భజల సంపదను మింగేస్తున్నాయి. రామచంద్రాపురం(పటాన్చెరు): ఔటర్ రింగ్ రోడ్డు పుణ్యమంటూ తెల్లాపూర్ ప్రాంత రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆకాశానికి అంటుకునేలా టవర్ల నిర్మాణం, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద ఎత్తున విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు తెల్లాపూర్ అంటే రియల్ ఎస్టేట్కు హబ్గా మారిపోయంది. మహానగరంగా విస్తరించడంతో జీవనోపాధికే ఇతర రాష్ట్రాల నుంచి వలసపెరగడంతో జనాభా రోజురోజుకు పెరుగుతుంది. దాని కారణంగా నీటి వినియోగం ఒక్కసారిగా పెరిపోయింది. ఒకప్పుడు 150 నుంచి 200 అడుగుల్లో నీరు పడేది. ప్రస్తుతం కొన్ని చోట్ల 1,200 అడుగులలోతులో కూడా నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. చెరువులే ముఖ్యమైన వనరులు.. తెల్లాపూర్ పరిధిలో మేళ్ల, వనం చెరువు, చెలికుంటలున్నాయి. చెరువులే ఒకప్పుడు ప్రధాన జలవనరులుగా ఉండేవి. వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భజలాలను అభివృద్ధి చేసేవి. దీంతో బావులు, బోర్లు నీటితో నిండుగా ఎండేవి. కానీ ప్రస్తుతం చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరగడం, భారీ నిర్మాణాలు, మురుగునీటి కారణంగా చెరువుల విస్తీర్ణం తగ్గిపోయాయి. ఈ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలు మూసుకుపోయాయి. ట్యాంకర్ల రాజ్యం..? తెల్లాపూర్ పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా నడుస్తోంది. నిత్యం వందలాది ట్యాంకర్లతో లక్షలాది లీటర్ల నీరు తరలిపోతున్నా దీనిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తెల్లాపూర్ భవిష్యత్ ఏంటి..? నీటి సంరక్షణపై ఇప్పటికై నా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తెల్లాపూర్ ప్రాంతంలో తీవ్ర త్రాగునీటి సంక్షోభం ఎదురయ్యే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువులను పరిరక్షించుకోక, వర్షపు నీటిని సంరక్షించక, అక్రమ బోర్లను నియత్రించకపోతే బెంగళూరులో నీటి ఎద్దడి పరిస్థితులే భవిష్యత్లో ఎదురయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. పాలకులు ఇప్పటికై నా స్పందించి చెరువుల ఆక్రమణలను పూర్తిస్థాయిలో నియంత్రిడంతోపాటు ఎఫ్టీఎల్ పరిధి హద్దులను ఏర్పాటు చేయాలి. ప్రతీ అపార్ట్మెంట్లో, ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలి. అక్రమ నీటి వ్యాపారం అరికట్టాలి. ప్రధానం వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి.భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదా? ఒకప్పుడు 150 అడుగుల్లోనే నీళ్లు ఇప్పుడు 1500 అడుగులకు వెళ్లినాలభించని వైనం ఆకాశహార్మ్యాలతో కాంక్రీట్జంగిల్గా మారుతున్న ప్రాంతం నీటి సంరక్షణపై అవగాహనపెంచాలంటున్న నిపుణులు -
పంట వ్యర్థాలను కాలిస్తే జరిమానా
నారాయణఖేడ్: పంట అవశేషాలను కాల్చవద్దని ఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ రైతులకు సూచించారు. పంట సాధారణ వ్యర్థాలను కాల్చితే రూ.5 వేలు, భారీ స్థాయిలో వ్యర్థాలు కాల్చితే రూ.25 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఎర్రరాయి లారీ పట్టివేతన్యాల్కల్(జహీరాబాద్): కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్న ఎర్రరాయి లారీని గురువారం హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతం బీదర్ నుంచి లారీలో సుమారు 400 ఎర్రరాళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు న్యాల్కల్ తండా వద్ద కాపుకాశారు. లారీ అక్కడకు చేరుకోగానే లారీని తనిఖీ చేయగా ఎటువంటి అనుమతుల్లేకుండా ఎర్రరాళ్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. డ్రైవర్ రాథోడ్ శ్రావణ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించినట్లు ఎస్సై దోమ సుజిత్ వివరించారు. Ķ欧ýl®-{´ë-†-ç³-¨-MýS¯]l «§é¯]lÅ… Mö¯]l$-Vøâ¶æ$Ï: MýSÌñæMýStÆŠḥæ మెదక్ కలెక్టరేట్: అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో తడిసిన సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 62,103 మంది రైతుల నుంచి 2,85,054.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. 30 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందన్నారు. రైతులు ధాన్యం సమస్యలపై 9391942254 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అన్లోడింగ్ వేగవంతం కొల్చారం(నర్సాపూర్): రైస్ మిల్లులకు ధాన్యం లోడుతో వచ్చిన లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం మండలంలోని వరిగుంతం శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. గోదాంలో అన్లోడింగ్ చేసే సమయాన్ని రాత్రి 10 గంటల వరకు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ అయిన లారీలను అవసరమైన కొనుగోలు కేంద్రాలకు వెళ్లేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ వై్స్ చాన్సలర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావుకు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ చాన్సలర్ జీ.భాస్కర్రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురువారం హర్యానాలోని ఎంపీహెచ్యూ వేదికగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్సింగ్షైనీ చేతుల మీదుగా సీహెచ్ఏఐ(చాయ్) హానరరీఫెలో –2026, అమిత్ కృషి రుషి అవార్డు–2026 లను వీసీ ప్రవీణ్రావు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులు వర్సిటీకి గర్వకారణమన్నారు. వ్యవసాయ, ఉద్యాన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు వరించాయన్నారు. -
రాజకీయకక్షతోనే ఈడీ దాడులు
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సాయిలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్పై రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ దాడులు జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అపవిత్ర కూటమిల బురదజల్లే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్పై ఈడీ దాడులను నిరసిస్తూ సంగారెడ్డిలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సాయిలు పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు రాజ్యంగ సంస్థలను ఉపయోగించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కూడా బీజేపీకి అనుసంధానంగా పని చేస్తుందని విమర్శించారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్లోని ఆయన కుటుంబ నివాసంలో ఏకకాలంలో ఈడీ సోదాలు చేశాయని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలసి తీసుకున్న నిర్ణయమే ఈడీ చర్యకు కారణమని మండిపడ్డారు. ఈ కుట్రలకు సీపీఎం బెదిరేదిలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొండాపూర్లో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలతో రైతుల ధాన్యం వర్షార్పణం కావడం బాధగా ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పాటు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే కొనుగోలు ఆలస్యం అయ్యిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు సకాలంలో ఎరువులను పంపిణీ చేయా లని కోరారు. రైతు సంఘం జిల్లా ఇన్చార్జి దశరథ్, జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, రాంరెడ్డి, బ్రహ్మం, బాల్రాజ్, నర్సింహులు, శివరాములు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
అదే వేదన.. పదే పదే!
కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉంచిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా ప్రతీ చోటా ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు రోడ్లెక్కి ఆందోళన చెందుతున్నారు. –జిన్నారం (పటాన్చెరు) జిన్నారం గుమ్మడిదల మండలాల్లో ఐకేపీ పీఏసీఎస్ సెంటర్లలో నిలువ ఉంచిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం నీట మునిగింది. ఆరుగాలం రైతులు చెమటోర్చి పండించిన ధాన్యం హమాలీలు, రవాణా సౌకర్యం లోపంతో తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిన్నారం మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించిన వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు 15 రోజుల క్రితమే ధాన్యం చేరుకున్నా రైస్ మిల్లులకు తరలింపులో నిర్లక్ష్యం వహించడమే ప్రధాన కారణమని తెలిపారు. కనీసం టార్పాలిన్ సంచులు కూడా తామే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తి వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. రోడ్డెక్కిన రైతన్నలు... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతన్నలు రోడ్డెక్కారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో బుధవారం గుమ్మడిదల జాతీయ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. రైతులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు మద్దతిస్తూ రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క రైస్మిల్లు వల్లే జాప్యం ఉమ్మడి జిన్నారం మండలానికి సంబంధించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్వీకరించేందుకు ఒకే రైస్ మిల్లు ఉంది. ఉన్న ఒక్క మిల్లుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవడంతో స్థానిక రైతుల ధాన్యాన్ని తీసుకోవడం నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. –ఆంజనేయులు, రైతు సకాలంలో తరలించకపోవడంతో.. రోజుల తరబడి ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సమయానికి తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో చేతికందిన పంట నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. –లక్ష్మీనారాయణ, రైతు తడిసిన ధాన్యం.. కొనుగోలు చేయాలని రైతుల ధర్నా వెంటాడిన రవాణా లేమి, హమాలీల కొరత, అధికారుల నిర్లక్ష్యంతోనే పంట నీటపాలు -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
చెట్టు కొమ్మలు కోస్తుండగా..కొండపాక(గజ్వేల్): మేకల మేత కోసం చెట్టు ఎక్కి కొమ్ములు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మి(40) దినచర్యలో భాగంగా ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లింది. పని ముగిశాక తోటి కూలీలతో ఇంటికి వస్తుండగా ఇంటి వద్దనున్న మేక పిల్లల మేత కోసం రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఎక్కింది. అయితే పక్కనే విద్యుత్ వైర్లు చెట్టుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. తోటి కూలీలు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. విద్యుత్ అధికారులు ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఆరేళ్ల క్రితమే భర్త మృతి భర్త శివులు మొదటి భార్య చనిపోవడంతో ముగ్గురు పిల్లలను చూసేందుకు లక్ష్మిని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల అనంతరం శివులు చనిపోయాడు. దీంతో కుటుంబ పోషణ భారమంతా లక్ష్మి పైనే పడింది. ఇప్పుడు లక్ష్మి కూడా మృతి చెందడంతో ముగ్గురు పిల్లల్ని పోషించేదెవరని బంధువులు, గ్రామస్తులు విలపిస్తున్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ వెంకట్గౌడ్ కోరారు. -
పసుపులేరును తవ్వేస్తుండ్రు
మెదక్ జిల్లాలో వాగులను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రావాణాకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు కలెక్టర్ హెచ్చరించినా అక్రమార్కులు ఇసుక దందాను దర్జాగా సాగిస్తున్నారు. కొందరు ఏకంగా వృత్తిగా మార్చుకుని రాత్రీపగలూ రవాణా చేస్తుండటం గమనార్హం. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్జోన్ వెుదక్ పట్టణం సమీపంలో తిమ్మక్కపల్లి తండా ఉంది. ఆ తండాలో సుమారు 25 నివాసగృహాలు ఉన్నాయి. ఆ తండా పక్కనే పసుపులేరు వాగుతో పాటు బొల్లారం మత్తడి ఉంది. వేసవి కాలం వస్తే వాటిలో నీరు తగ్గడంతో ఇసుక దందా కొనసాగుతుంది. ఆ తండావాసులు ఇంటికో ఎడ్లబండిని కొనుగోలు చేసి వాగు నుంచి నిరంతరంగా ఇసుకను తరలిస్తున్నారు. మరోవైపు తండా చుట్టూ రాశులు పోసి ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.4వేల నుంచి రూ. 5వేల చొప్పున విక్రయిస్తున్నారు. నిత్యం 30 నుంచి 40 ట్రాక్టర్ల ఇసుకను విక్రయిస్తున్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు.. మెదక్ పట్టణ శివారు పిల్లికొట్టాల్ ప్రాంతంలోని ఎంసీహెచ్ పక్కన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటికి అవసరమయ్యే ఇసుకను తండా వాసులే సరఫరా చేస్తున్నారు. రోజూ 30 నుంచి 40 ట్రిప్పుల ఇసుకకు సరఫరా చేస్తూ రోజూ సుమారు రూ.1.50 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారంతా ఇసుకను తరలించే వృత్తిగా మార్చుకున్నారు. రైతుల్లో ఆందోళన పసుపులేరు వాగుతో పాటు బొల్లారం మత్తడిలో మో టార్లు బిగించి పరిసర ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటిలో నిత్యం ఇసుకను తోడేస్తుండటంతో నీటి ఊ టలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారని, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించటంలేదని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. నిత్యం 30 నుంచి 40 ట్రాక్టర్లలో తరలింపు రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం కళ్లప్పగించి చూస్తున్న ఉన్నతాధికారులు తండా చుట్టూ ఇసుక కుప్పలే.. తిమ్మక్కపల్లి తండా చుట్టూ, ఏఇంటి ముందు చూసినా ఇసుక కుప్పలే దర్శనం ఇస్తాయి. అయినా అధికారులు దృష్టి సారించడంలేదంటే మామూళ్లకు ఆశపడి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మల్లన్నసాగర్ కాలువలో మృతదేహం
కొండపాక(గజ్వేల్): మల్లన్న సాగర్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ శివారులోని మల్లన్న సాగర్ కాలువలో మృతదేహం ఉందన్న విషయాన్ని స్థానికులు పోలీస్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలోంచి సుమారు 35 ఏళ్ల వయస్సున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని ఒంటిపై బ్లూ కలర్ బనియన్, బూడిదరంగు షర్టు ఉందన్నారు. గుండ్రటి ముఖం 5.3 ఫీట్ల ఎత్తు, కుడి చేతికి స్టీల్ కడియం, ఎడమ కాలికి నల్లటి దారం కట్టిందన్నారు. మృత దేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పర్చామన్నారు. మరిన్ని వివరాల కోసం పోలీస్టేషన్ నంబరు 87126 67466ను సంప్రదించాలన్నారు. పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తంగి డివిజన్ పరిధి పాటీ సమీపంలోని వివేకానంద స్టేడియంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే బీడీఎల్ పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పటాన్చెరుటౌన్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం ఎస్ఎన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహిన్ (51) బుధవారం తన కుమారుడు పనిచేస్తున్న జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని చికెన్ షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా, లింగంపల్లి వైపు నుంచి పటాన్చెరు వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మోహిన్ను చికిత్స నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరిగి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాపన్నపేట(మెదక్): చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. చివరకు తాను వేసిన వలలో చిక్కుకుని మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని చెలిమల కుంటలో గురువారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. నాగ్సాన్పల్లికి చెందిన గుండు కిష్టయ్య(48) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం చెలిమల కుంట వద్దకు వెళ్లి కొన్ని చేపలు పట్టుకున్నాడు. మరికొన్ని చేపల కోసం వల వేసి కుంటలోనికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ వల అతని కాళ్లకు చుట్టుకొని నీట మునిగి పోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. కుంట వైపు వెళ్లిన గ్రామస్తులకు కిష్టయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పటాన్చెరు టౌన్: ఇంటికి కావాల్సిన కిరాణా సామగ్రి తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఒక యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్ పరిధికి చెందిన శాంతి కుమార్తె శ్రేయ (21) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం కిరాణా సామన్లు తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె.. ఎంత సమయం గడిచినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లతోపాటు స్థానికంగా వెతికినా శ్రేయ ఆచూకీ లభించలేదు. కూతురు అదృశ్యంపై తల్లి శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దోసె.. పూరీ.. మిల్లెట్ ఇడ్లీ
మెదక్ అర్బన్: ఇక ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకో రకం టిఫిన్తో పాటు మధ్యా హ్న భోజనం ఇవ్వనున్నారు. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. జూన్ 12 నుంచి పథకం ప్రారంభించేందుకు ఇంటర్ విద్యాశాఖ సమాయత్తం అవుతుంది. జిల్లాలో 16 జూనియర్ కళాశాలలు ఉండగా, సుమారు 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ‘తెలంగాణ బ్రేక్ఫాస్ట్’ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలన్నీ మండల కేంద్రాల్లో ఉన్నాయి. అయితే సుమారు 90 శాతం విద్యార్థులు సమీప గ్రామాలు, తండాల నుంచి వస్తున్నారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఉదయం విద్యార్థులు సరిగా తినకుండానే కాలేజీకి వస్తున్నారు. సాయంత్రం 4.30 వరకు అర్ధాకలితో గడుపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యేక తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాఠాలు కూడా సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో సమయాను కనుగుణంగా పోషకాహరం లేక, బల హీనంగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని చాలా కాలంగా విద్యారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల నమోదు.. హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.రోజుకో రకం టిఫిన్.. పాలు, జావ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో రకం టిఫిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దోసె, చట్నీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు) సాంబారు, బుధవారం పూరీ(రెండు), మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, గురువారం బోండా– చట్నీ, శుక్రవారం ఇడ్లీ–చట్నీ, శనివారం ఉప్మా– చట్నీని మెనూగా నిర్ణయించారు. వీటితో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా మొదట కేంద్రీకృత కిచెన్ల ద్వారా వీటిని అందించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ జూన్ 12 నుంచి ప్రారంభం జిల్లాలో 16 కళాశాలలు సుమారు 6 వేల మంది విద్యార్థులు -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో గడ్డి కట్టలు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుత్ తీగలు ఒకదానికితో ఒకటి తాకటం వల్ల చెలరేగిన మంటల్లో గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని కేశనాయక్తండా పరిధిలోని లచ్చానాయక్తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లావుడ్య తిరుపతికి చెందిన పొలంలో పశువుల కోసం సుమారు 300 గడ్డికట్టలను నిల్వచేసి వాటిపై కవర్ కప్పి ఉంచాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు, పలువురు రైతుల సహాయంతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే సగానికిపైగా గడ్డికట్టలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. -
చోరీ జరిగిన మూడు గంటల్లోనే..
● ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా నేరస్తుల అరెస్ట్ ● అపహరించిన ఆభరణాలు స్వాధీనం ● పోలీస్ సిబ్బందికి ప్రశంసలు రామాయంపేట (మెదక్): పట్టణంలోని బస్టాండ్లో మహిళా ప్రయాణికురాలిని టార్గెట్ చేసి క్షణాల్లో నగలు కొట్టేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా కిలాడీ దొంగలను రామాయంపేట పోలీసులు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా సుద్దాల దేవలక్ష్మి పనిచేస్తుంది. బుధవారం తన తల్లితో కలిసి అక్కన్నపేటలోని కూతురు వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు రామాయంపేట బస్టాండుకు చేరుకుంది. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దేవలక్ష్మి బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను కొట్టేయగా.. ఆమె వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్ఐ బాల్రాజ్ బస్టాండులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు మహిళలు ఆభరణాలు అపహరించినట్లు తేలింది. చోరీ అనంతరం నిందితులు అక్కడి నుంచి మెదక్ వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బోధన్ డిపో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే ఎస్ఐ బాల్రాజ్ ఆ బస్సు కండక్టర్కు ఫోన్ చేసి సమాచారం అందించగా.. అలర్ట్ అయిన కండక్టర్ నిందితులకు అనుమానం రాకుండా బస్సును నేరుగా హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. బాధితురాలు దేవలక్ష్మిని వెంట పెట్టుకుని బోయిన్పల్లి స్టేషన్కు చేరుకున్న పోలీసులు.. నిందితులను కర్ణాటకకు చెందిన శ్వేత కాలే, మహారాష్ట్రకు చెందిన శిల్పా వేలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. విచారణలో పట్టుబడిన ఇద్దరు మహిళలకు గతంలో సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట ప్రాంతాల్లో జరిగిన పలు దొంగతనాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే కేసును ఛేదించిన ఎస్ఐ బాల్రాజ్, ఎస్ఐ–2 నరేశ్, పీసీలు భాస్కర్, సూర్యప్రకాశ్లను ఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసించారు. -
నర్సాపూర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత
● ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ● తెల్లవార్లూ పోలీసుల గస్తీ! ● గోరక్షకులు, ముస్లిం యువకుల మధ్య ఘర్షణ నర్సాపూర్: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే... బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసులు స్థానిక చౌరస్తాలో సుమారు నెల రోజుల క్రితమే చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి కౌడిపల్లి వైపు నుంచి ఒక వాహనంలో ఆవులను తరలిస్తున్నారనే సమాచారంతో కొందరు గోరక్షక దళ సభ్యులు రాత్రి 12 గంటల సమయంలో స్థానిక చౌరస్తాకు చేరుకుని నిఘా పెట్టారు. అదే సమయంలో గోరక్షక దళ సభ్యులు చౌరస్తాలో గుమిగూడారనే విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు చౌరస్తాలో రెండు గుంపులుగా ఏర్పడి, ఒకరి కదలికలను మరొకరు నిశితంగా గమనించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ రంజిత్రెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల యువకులతో మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ వారు వినలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. అయినప్పటికీ, కొందరు యువకులు చౌరస్తా నుంచి వెళ్ళిపోయి వాహనాలపై పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో సీఐ, ఎస్ఐలు తమ పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున 5 గంటల వరకు పట్టణంలో ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై లాఠీలకు పని చెప్పి ఇళ్లకు పంపించేశారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ రంజిత్రెడ్డిని వివరణ కోరగా.. చౌరస్తాకు రెండు వర్గాలు రావడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడిందని తెలిపారు. సీఐ జాన్రెడ్డి ఆధ్వర్యంలో అందరిని అక్కడి నుంచి పంపించి, పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చామని చెప్పారు. తెల్లవారుజాము వరకు పట్టణంలో గస్తీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
తిమ్మాపూర్ గేట్వద్ద రైతుల రాస్తారోకో
కౌడిపల్లి(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. మండలంలోని తిమ్మాపూర్గేట్ వద్ద 765డి జాతీయ రహదారిపై తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తూకం, బస్తాల తరలింపు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అవుతుందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అమరేందర్రెడ్డి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపచేశారు. చిట్కుల్లో రైతుల ధర్నా చిలప్చెడ్(నర్సాపూర్): చిలప్చెడ్ మండల పరిధి చిట్కుల్ గ్రామంలో తడిసిన ధాన్యం కొనడం లేదని గురువారం రైతులు మెదక్– జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, జీపీఓలు ఘటనా స్థలానికి వచ్చి, తప్పకుండా ధాన్యాన్ని కొనేలా చూస్తామని హామీ ఇచ్చారు. నేడు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రేగోడ్(మెదక్): మండలానికి రెండు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రేగోడ్, గజ్వాడ గ్రామాల్లో నేడు శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని పీసీసీ సభ్యుడు కిషన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్ గురువారం వేర్వేరుగా తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 14న సాక్షి దినపత్రికలో ‘జొన్నల కొనుగోలు కేంద్రం ఏదీ’ అనే కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. -
సబ్ కలెక్టర్ ఎదుటే రైతుల ఘర్షణ
కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం బోక్కస్గాం పీఏసీఎస్లో అక్రమాలు జరిగిన ఆరోపణలపై విచారణకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఎదురుగానే రైతులు రాజకీయ పార్టీల పరంగా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పీఏసీఎస్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో విచారించేందుకు సబ్ కలెక్టర్ ఉమాహారతి పీఏసీఎస్ను సందర్శించారు. అప్పటికే చుట్టుపక్క గ్రామాల నుంచి భారీగా రైతులు అక్కడకు చేరుకున్నారు. ఉమాహారతి విచారణకు ఉపక్రమించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొసైటీ పర్సన్ ఇన్చార్జి గుండు వెంకట్రాములు తరఫున కొందరు రైతులు పీఏసీఎస్ తరఫున వరి ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాలు వద్దని నినాదాలు చేశారు. పీఏసీఎస్ తరఫున వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండు చేశారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరికొందరు రైతులు మద్దతుగా నిలిచి పీఏసీఎస్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణవాతావరణం ఏర్పడింది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని చెప్పినా సబ్ కలెక్టర్ చెప్పినా ఎవరూ శాంతించలేదు. దీంతో ఉమాహారతి జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో విచారణ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పీఏసీఎస్ అక్రమాల విచారణ అంశం పక్కదారి పట్టింది. ఈ నెల 26న తహసీల్దార్ కిరణ్కుమార్ విచారణ జరిపిన విషయం విదితమే. పీఏసీఎస్లో నాసిరకంగా గోదాం నిర్మాణం, పెట్రోల్ పంపు ఏర్పాటు చేయకుండానే నిధులు దుర్వినియోగం, తదితర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పీఏసీఎస్ నుంచి సబ్ కలెక్టర్ వెళ్లిపోయాక కూడా ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. బోక్కస్గాం పీఏసీఎస్ అక్రమాలపైవిచారణకు వచ్చిన ఉమాహారతి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన అక్రమాలపై విచారణ చేయాలనికాంగ్రెస్ పట్టు ఇరువర్గాలు బాహాబాహీ స్వల్ప లాఠీచార్జ్తో అదుపు చేసినపోలీసులు -
ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. స్థానిక నాయకత్వంతో మమేకమై ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమన్వయంతో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు ప్రతీ కార్యకర్తకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించామని, ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. స్పాట్లో లైవ్ ఫొటో తీసుకుని ఓటరు వివరాలు కూడా వెంటనే నమోదవుతాయన్నారు. తద్వారా ఈ సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో పదికి పది చోట్ల విజయం సాధించేలా పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో ఆన్లైన్ సభ్యత్వ నమోదు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, శశిధర్రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మెంబర్షిప్ డ్రైవ్ జిల్లా ఇన్చార్జి బాలమల్లు పాల్గొన్నారు. ప్రతీ కార్యకర్తకు సమయం ఇవ్వండి నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలి సభ్యత్వ నమోదు సన్నాహకసమావేశంలో హరీశ్రావు -
ఆన్లైన్ షాపింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: నకిలీ ఆన్లైన్ షాపింగ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్ బుక్, వాట్సాప్, టెలీగ్రాం వంటి సోషల్ మీడియా వేదికగా నకిలీ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గ్యాడ్జెట్లు, లగ్జరీ వస్తువులను భారీ డిస్కౌంట్లతో అందిస్తున్నట్లు యాడ్స్ రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ మోసాలకు గురైనట్లు తెలిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేసిగాని, నేషనల్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. చదువు ప్రతీ ఒక్కరి హక్కు నారాయణఖేడ్: చదువు ప్రతీ ఒక్కరి హక్కు అని ఖేడ్ మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి తెలిపారు. ఖేడ్ మున్సిపల్ సమావేశ మందిరంలో వయోజన విద్యాశాఖ సౌజన్యంతో మున్సిపాలిటీని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం ‘ఉల్లాస్ నవభారత్ సాక్షరతా’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వలంటీర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కోసం వలంటీర్లు సేవాభావంతో పనిచేస్తూ ఖేడ్ పట్టణాన్ని పూర్తి అక్షరాస్యత పట్టణంగా తీర్చిదిద్దేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఆర్పీలు మౌనిక, పద్మ శిక్షణనిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా వయోజన విద్య డిప్యూటీౖ డైరెక్టర్ వెంకట్రెడ్డి, మెప్మా టీఎంసీ అనిత తదితరులు పాల్గొన్నారు. బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: రైతు సమస్యలపై ధర్నాలు చేస్తే ప్రజలు స్పందించడం లేదని, గుర్తింపు రావాలంటే కార్యాలయాలు తగలబెట్టాలని, రైల్వే పట్టాలు తొలగించాలని, పేల్చివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఐఎన్టీయూసీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పటా్న్చెరు పోలీస్స్టేషన్లో బుధవారం వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలిగించే విధంగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, కార్మిక నాయకులు రాజు, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. మక్కల డబ్బులు ఖాతాల్లో జమ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు -
‘సురభి’లో అరుదైన సర్జరీ
సిద్దిపేటఅర్బన్: మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాల అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం అరుదైన పైలో ప్లాస్టీ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తిరావు తెలిపారు. బుధవారం ఆయన సర్జరీ వివరాలు వెల్లడించారు. కొమురవెళ్లి మండలం మర్రిముస్త్యాల గ్రామానికి చెందిన చక్రధర్ (7)కు కిడ్నీ, మూత్రనాళం కలిసే ప్రాంతం మూసుకుపోయి కిడ్నీ వాచిపోతుండటంతో ఈ నెల 23న ఆస్పత్రికి వచ్చారు. యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీలో పైలోప్లాస్టీ సర్జరీ చేసి కిడ్నీ పాడవకుండా కాపాడినట్టు తెలిపారు. చైర్మన్ హరీందర్రావు ఆశయం మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రమీలకు పీహెచ్డీ బెజ్జంకి(సిద్దిపేట): మండల కేంద్రానికి చెందిన లెక్చరర్ రొడ్డ ప్రమీల మధ్యప్రదేశ్లోని శ్రీకృష్ణ యూనివర్సిటీ నుంచి వీసీ అమిత్ కుమార్ జైన్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు అనే అంశంపై ఆమె సమర్పించిన ప్రాజెక్టుకు గాను పీహెచ్డీ వరించింది. కాగా ఆమె సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమీలను స్నేహితులు, విద్యావేత్తలు అభినందించారు. ఎల్లంపల్లిలో విగ్రహాల ధ్వంసంటేక్మాల్(మెదక్): మండలంలోని ఎల్లంపల్లి గ్రామం ఆలయంలోని నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. కాగా గ్రామానికి చెందిన సండ్రు శాంతం బుధవారం ఉదయం నవగ్రహ పూజ చేసేందుకు వెళ్లగా రెండు విగ్రహాలు కిందపడవేసి ధ్వంసం చేసినట్లు ఉన్నాయని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ రవాణాదారుల బైండోవర్ బెజ్జంకి(సిద్దిపేట): ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని మండల శివారులో బుధవా రం అరెస్ట్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ శ్రీకాంత్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లికి చెందిన బొద్దుల రాకేశ్, కరీంనగర్ జిల్లా రేణికుంటకు చెందిన ప్రవీణ్కుమార్ రేణికుంట పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తూ పట్టుబడనట్లు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లంపట్ల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గుండెగోని రాజుగౌడ్(35) కల్లు తీయడానికి రోజు మాదిరిగానే చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
మహిళలను కోటీశ్వరులు చేస్తాం
● రూ. 93 లక్షలతో వీధి దీపాల పనులకు శంకుస్థాపన ● టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డిసదాశివపేట(సంగారెడ్డి): మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రూ.93 లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన వీధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ సమావేశం మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సదాశివపేటలో మహిళలకు పెట్రోల్ పంపు మంజూరు చేయిస్తానని తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సిద్దాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శివాజీ, మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ, వైస్చైర్ పర్సన్ రేణుక, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, కౌన్సిలర్లు అనిత, సెజ్జీ, అరుణ్కుమార్, వాజీద్, కోఆప్షన్ మెంబర్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కృష్ణ, డైరెక్టర్ చిరు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజ్గౌడ్, కాంగ్రెస్ నాయకులు తుల్జరామ్, శరత్గుప్త, రమేశ్, విష్ణువర్ధన్రెడ్డి, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోయిని రాజయ్య(45) తన పొలంలో బోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పులను తీర్చేందుకు భార్య ఎల్లవ్వ, నడిపి కుమారుడు మణికంఠతో కలిసి జీడిమెట్లలో నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు మహేశ్ పెయింటింగ్ పని చేస్తుండగా, చిన్న కుమారుడు ముఖేశ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన రాజయ్య అప్పుల బాధతో బాధపడుతూ ఎలా తీరుస్తామని పలుమార్లు పెద్ద కుమారుడు మహేశ్కు చెబుతూ బాధపడేవాడు. బుధవారం మహేశ్ పనికి వెళ్లగా, చిన్నకుమారుడు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రాజయ్య ఇంట్లో ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు గమనించి సోదరుడికి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధ తాళలేక యువకుడు.. మిరుదొడ్డి(దుబ్బాక): అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి (32)కి 12 సంవత్సరాల క్రితం స్వప్నతో వివాహం జరిగింది. వీరికి పది సంవత్సరాలలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా యాదగిరి తాగుడుకు బానిసగా మారడంతో అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బతుకు దెరువు కోసం కొట్కూర్ అనే గ్రామానికి వలస వెళ్లాడు. కాగా ఈ నెల 26న మిరుదొడ్డిలో యాదగిరి మేనమామ అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తాగుడుకు బానిసవ్వడంతో, అప్పులెక్కువయ్యాయని మదన పడుతూ బుధవారం తన సొంతింట్లో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిరాణం డబ్బాలో చోరీ
శివ్వంపేట (నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు కిరాణం డబ్బాతో పాటు టీ స్టాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... చండీ– గోమారం ప్రధాన రహదారి పక్కన రెడ్యా తండా వద్ద అదే తండాకు చెందిన బీమా కిరాణం డబ్బా ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బా షట్టర్ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి అందులోని నగదు, సిగరెట్లు, కిరాణం సామగ్రిని ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న టీస్టాల్లో కూడా కొంత నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు చోరీ ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఎస్సీ హాస్టల్లో పాముల కలకలంమెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్కు నిత్యం పాములు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం సైతం రెండు పాములు రావడంతో చంపేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు వార్డెన్కు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాత్రూమ్లోకి పాములు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు అటు వైపు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ స్పందించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు గణేశ్, చింటూ, విష్ణు, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
అభివృద్ధి పనులకు తీర్మానం
చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో జంతు వధశాల ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అరుణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పాలకవర్గ సభ్యులు పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా పట్టణంలో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, జేసీబీ రిపేర్ చేయడంతో పాటు బకెట్ పెట్టించడం, వర్షాకాలం సీజన్ కావడంతో అవసరమైన బ్లీచింగ్ పౌడర్, సున్నం, దోమల నివారణ మందుల కొనుగోలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నూతన జంతు వధశాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమ్ రిజిస్ట్రేషన్తో ప్రయోజనాలు
మెప్మా పీడీ హన్మంతరెడ్డిమెదక్ కలెక్టరేట్: చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చునని మెప్మా పీడీ హన్మంతరెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడో రోజు మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలను సందర్శించామని చెప్పారు. ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్న్ల ద్వారా ఉద్యమ్ రిజిస్ట్రేషన్న్ పోర్టల్లో వారి వ్యాపా రాలను రిజిస్ట్రేషన్న్ చేయించినట్లు తెలిపారు. తద్వారా చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చునని వివరించారు. కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్లు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. -
ఐదుగురు అదృశ్యం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యమయ్యారు. టేక్మాల్(మెదక్): వివాహిత అదృశ్యమైన సంఘటన మండలంలోని చంద్రుతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ అరవింద్కుమార్ కథనం ప్రకారం... తండాకు చెందిన రమావత్ సర్దార్, రాణి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయంతో పాటు మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నిత్యం మాదిరిగానే మంగళవారం సర్దార్ మేకలను మేపెందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆయన కుమారుడు ఫోన్ చేసి ఇంటి వద్ద అమ్మలేదని చెప్పాడు. సర్దార్ ఇంటికి వచ్చి పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఖాజాపూర్లో తల్లీముగ్గురు పిల్లలు.. చిన్నశంకరంపేట(మెదక్): ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శివానందం కథనం ప్రకారం... గ్రామానికి చెందిన యాడారం స్వామికి శిరీషతో 2010లో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నెల 24న స్వామి గ్రామంలో పోచమ్మ పండుగ విషయం మాట్లాడేందుకు వెళ్లగా, శిరీష తన ముగ్గురు పిల్లలు స్పందన, సంజన, ఆధ్యశ్రీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. స్వామి ఇంటికి వచ్చి చూడగా కన్పించకపోవడంతో ఫోన్చేయగా తాను ఊర్లో ఉన్నానని ఇంటికి వస్తున్నానని చెప్పింది. తీరా ఇంటికి రాకపోగా ఫోన్కూడా స్విచ్చాఫ్ అయింది. దీంతో తెలిసినవారి ఇళ్లలో, బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. భర్త బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
● బంగారు ఆభరణాలు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీహుస్నాబాద్రూరల్: ఆభరణాల చోరీ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఏసీపీ సదానందం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పోతారం(ఎస్)కు చెందిన బొయిని మంజుల రాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రించారు. కాగా ఆమె మెడలోని పుస్తెలతాడు, బంగారు చైన్ను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మంజుల చెల్లెలు బోయిని విజయభారతిని అదుపులోకి తీసుకొని విచారించారు. తన అక్క మెడలోని పుస్తెలతాడు, బంగారు చైన్ను వైర్ కట్టర్తో కట్ చేసి చోరీ చేసినట్లు ఒప్పుకుంది. ఎవరికి అనుమానం రాకుండా తన అక్క కూతురు చెవి కమ్మలను తీసి, దొంగిలించిన నగలతో కలిపి ఇంటి ముందు గోళం కింద దాచిపెట్టి ఇంట్లో దొంగతనం జరిగినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
మహిళల రక్షణే ప్రభుత్వ లక్ష్యం
● ప్రతి కార్యాలయంలో కంప్లయింట్ కమిటీ తప్పనిసరి ● అదనపు కలెక్టర్ నగేశ్మెదక్ కలెక్టరేట్: మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా జిల్లాలో మహిళా భద్రత, రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. బుధవారం వారోత్సవాల్లో భాగంగా సమీకృత కలెక్టరేట్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013పై మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించటానికి ఏర్పడ్డ చట్టమని తెలిపారు. ప్రతీ కార్యాలయంలో మహిళలకు భయరహితమైన, సమానమైన, గౌరవప్రదమైన పని వాతావరణం ఉండాలన్నారు. ప్రతీ ఆఫీస్లో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండాలన్నారు. ఒకవేళ సంస్థలో అంతర్గత కమిటీ లేకపోతే లేదా ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాల్సి వస్తే, భారత ప్రభుత్వం షీబాక్స్ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించిందన్నారు. సమావేశంలో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ , ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి స్వరూప, వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
తాగి నడిపితే.. అంతే
మెదక్జోన్: మందు తాగి వాహనం నడిపి డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వారికి న్యాయస్థానం రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తోంది. తాగి ఒక్కసారి దొరికారా? రెండోసారా అనే లెక్కలు పక్కన పెట్టి.. తాగి వాహనం నడిపితే చాలు పదివేలు కట్టాల్సిందే. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 60 మంది మందుబాబులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున కోర్టు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అలాగే గడిచిన మూడేళ్లలో జిల్లాలో 26, 826 మంది డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడగా, వారిలో 25,455 మందికి రూ.1,87,57,939 జరిమానా రూపంలో కోర్టు విధించింది. కాగా గతంలో తాగి మొదటి సారి డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడితే రూ.వెయ్యి , రెండోసారి రూ.2 వేలు, ఆ తరువాత మళ్లీ పట్టుబడితే జరిమానాతో పాటు స్వల్ప జైలు శిక్షను సైతం అమలు చేశారు. కానీ ఇప్పుడు తాగి పట్టుబడితే చాలు రూ. 10 వేలు కట్టాల్సిందే. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు! రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలు మద్యం మత్తులోనే వాహనాలు నడపటం వల్లే అవుతున్నాయని, సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంతో మంది చనిపోతున్నారని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలవుతున్నట్లు పోలీసుల సర్వేలో తేలింది. దీన్ని కట్టడి చేసేదుకు పోలీసు అధికారులు విస్తృతంగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన మందుబాబులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. దీంతో కోర్టు కొన్ని నెలలుగా రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తోంది. దీంతో తాగి వాహనం నడపద్దు అనే చర్చ ప్రజల్లో మొదలైంది. కాగా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. పట్టుబడితే రూ.10 వేల జరిమానా తాగి వాహనం నడపవద్దు మద్యం తాగి వాహనం నడిపితే ఎవరినైనా ఉపేక్షించేదిలేదు. మద్యం మత్తులో వాహనం నడిపి ఎదుటివారిని ఢీకొట్టడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు డ్రంకెన్డ్రైవ్ టెస్టులు విస్తృతంగా చేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ, మెదక్ జిల్లా -
ఐదు తులాల బంగారు ఆభరణాలు చోరీ
ప్రయాణికురాలి బ్యాగులోనుంచి అపహరణ రామాయంపేట(మెదక్): ప్రయాణికురాలి వద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం స్థానిక బస్టాండులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన దేవలక్ష్మి తన తల్లితో కలిసి అక్కన్నపేటలో ఉంటున్న కూతురు వద్దకు వచ్చింది. తిరిగి స్వగ్రామం వెళ్లడానికి స్థానిక బస్టాండులో బస్సు ఎక్కుతుండగా, ఆమె బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బ్యాగును చూసుకున్న ఆమె ఆభరణాలు కనిపించకపోవడంతో బస్సు డ్రైవర్, కండక్టర్కు చెప్పింది. దీంతో వారు బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు బస్సులో ఉన్న ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు బస్టాండులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి పక్కనే ఉన్న గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. -
ఇటువైపు రాకోయి అతిథి
శిథిలావస్థలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ● పెచ్చులూడి పడుతున్న వైనం ● 80 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రతిపాదనల్లోనే నూతన భవనం పట్టించుకోని అధికారులుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): గతంలో ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రముఖులెందరికో ఆతిథ్యం ఇచ్చిన అలనాటి ఆర్అండ్బీ అతిథి భవనం నేడు శిథిలావస్థకు చేరి కళ తప్పింది. సదాశివపేట పట్టణ పరిధిలో ఉన్న ఈ భవనం నిర్మించి దాదాపు 80 ఏళ్లు అవుతోంది. తరుచుగా పైకప్పు, గోడల పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. 18 సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడంతో భవనం ఆవరణ చుట్టూ పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. అలాగే రాత్రి అయితే చాలు మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక రాత్రికి విశ్రాంతి తీసుకొని వెళ్దామన్న వెళ్లలేని పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పాలకులకు ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చిన ఈ భవనం నేడు కళావిహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు, ప్రభుత్వం మేల్కొని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా నూతన గెస్ట్హౌస్ను నిర్మించి సకల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. నూతన భవనానికి ప్రతిపాదనలు శిథిలావస్థకు చేరిన భవనాన్ని పూర్తిగా తొలగించి, నూతన భవనం నిర్మించడానికి రూ.3.80కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధుల మంజూరుకు పరిపాలన పరమైన అనుమతి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అతిథి గృహం శిథిలావస్థకు చేరిన విషయంపై దృష్టి సారించాం. నిధులు మంజూరు కాగానే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. – రామకృష్ణ, ఆర్అండ్బీ డీఈఈ, సంగారెడ్డి -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ కమిషనర్హత్నూర(సంగారెడ్డి): ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ మనోజ్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని వడ్డేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యంను వెంటనే రైస్ మిల్లుకు పంపించాలని చెప్పారు. డీఎస్ఓ అనుదీప్, మహేశ్, కమిటీ సభ్యులు, రైతులు ఉన్నారు. -
జల్సాలకు అలవాటై చోరీలు
● నిందితుడి అరెస్ట్ ● రూ.50 లక్షల బంగారం రికవరీ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్ పటాన్చెరు టౌన్: చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అమీన్పూర్లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. అమీన్పూర్ పరిధిలో హిల్టాప్ కాలనీలో నివసించే వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఏప్రిల్లో ఊరికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. అలాగే అమీన్పూర్లో మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నరేశ్, క్రైమ్ సీఐ సత్యనారాయణ బృందం దర్యాప్తును ప్రారంభించింది. బాధితుడి ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలో నిందితుడిని గుర్తించారు. అనంతరం ఈనెల 16న ఎల్బీనగర్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నాగర్ కర్నూల్కు చెందిన మండ్ల శివ అలియాస్ ఎర్ర శివ ప్రస్తుతం మీర్పేట్లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అతడి వద్ద నుంచి 45 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ద్వారా శనివారం పోగొట్టుకున్న బంగారాన్ని బాధితులు వెంకటరమణకు బంగారం అందజేశారు. అనంతరం నిందితుని రిమాండ్కు తరలించారు. నిందితుడిపై మొత్తం 24 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కూలి పని చేసే శివ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఎస్ఐ ప్రభాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా కూలీ..
సంగారెడ్డి క్రైమ్: ఓ హోటల్లో కూలీ పనులు చేసే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... కంగ్టి మండలం చింతామణి తండాకు చెందిన శ్రీకాంత్ (22), కొన్ని రోజులుగా పట్టణంలో ఓ హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హోటల్ గదిలో శ్రీకాంత్ మృతదేహం కనిపించడంతో సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హోటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులను వివరణ కోరగా.. ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. -
చెరుకు సాగుకే మొగ్గు
● ఆదుకుంటుందని రైతుల నమ్మకం ● గత ఖరీఫ్లో ఇతర పంటలతో నష్టం ● అందుకే చెరుకుపై అన్నదాతల ఆసక్తి గణనీయంగా పెరిగిన పంట విస్తీర్ణంజహీరాబాద్ టౌన్: చెరుకు సాగుపై రైతులు ఆసక్తి చూపడంతో జిల్లాలో విస్తీర్ణం పెరిగింది. గత ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి, ఆలు, అల్లం తదితర పంటలు వర్షాలకు చాలా వరకు దెబ్బతిన్నాయి. మద్దతు ధర కూడా లేక పండిన పంటను కొనేవారు కరువై నష్టపోయిన రైతులు ఈ సారి చెరుకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు పంట సాగుకు అనుకూలంగా ఉంది. మూడు సంవత్సరాల నుంచి బంద్ ఉన్న ట్రైడెంట్ చక్కర కర్మాగారంలో క్రషింగ్కు సిద్ధమవుతుంది. రాయికోడ్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి–గంగా చక్కర కర్మాగారంలో రెండు సీజన్ల నుంచి క్రషింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. పంటకు గిట్టుబాటు ధర కూడా దక్కడంతో ఆదుకుంటుందన్న భరోసాతో రైతులు పంటను వేశారు. జిల్లాలో చెరుకు, పత్తి, అల్లం, అరటి, ఆలుతో పాటు కంది, సోయాబిన్, పెసర, మొక్కజొన్న, శనగ పంటలను పండిస్తారు. రెండు సంవత్సరాల నుంచి నెలకొన్న అతివృష్టి వల్ల ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. అదే చెరుకు పంట సాగు చేసిన రైతులకు పెద్దగా నష్టం కలగలేదు. దీంతో ఈ సంవత్సరం రైతులు చెరుకు సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. 45 వేల ఎకరాల్లో... జిల్లాలో గత ఏడాది 36 వేల ఎకరాల్లో రైతులు చెరుకును సాగు చేశారు. ఈ సంవత్సరం సుమారు 45 వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 43 వేల ఎకరాల్లో పంట వేసినట్లు తెలిసింది. జూన్ నెలాఖరు వరకు ప్లాంటేషన్ కొనసాగుతుందని, సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు చెరుకు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. 2026–27వ క్రషింగ్ సీజన్ ఈ సంవత్సరం అక్టోబర్లోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వేరే పంటలతో నష్ట పోయా.. గత సంవత్సరం పది ఎకరాల్లో పత్తి పంట వేయగా భారీ వర్షాలకు దెబ్బతింది. పెట్టుబడులు కూడా రాకా నష్టపోయాను. చెరుకు పండించిన రైతులు నష్టపోలేదని తెలుసుకొని ఈ సంవత్సరం ఆరు ఎకరాల్లో సాగు చేశా. నా మాదిరిగా చాలా మంది రైతులు చెరుకు పంటను వేశారు. –శివాజీ రాథోడ్, రైతు -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
సంగారెడ్డి: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, గూడెం మహిపాల్రెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్ను కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కలసి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ..జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కొత్త బోర్వెల్స్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే కోట కింద 40% ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిపాల్రెడ్డి తన నియోజకవర్గంలో నెలకొన్న ఇరిగేషన్ సమస్యలను కలెక్టర్కు వివరించారు. సాగునీటి ఇబ్బందులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తోందన్నారు. కనీసం ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ..సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్రెడ్డి, తట్టు నారాయణ, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్, సర్పంచ్ హరివర్ధన్ ఉన్నారు.కలెక్టర్ను కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేలు -
తాళం వేసిన ఇంట్లో చోరీ..
బంగారు ఆభరణాలు, నగదు అపహరణన్యాల్కల్(జహీరాబాద్): ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలోని ముంగి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మోహీన్, సలీమా దంపతులు శుభకార్యానికి వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. సలీమా తన మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసుతో పాటు చెవుల కమ్మలు తీసి బీరువాల్లో పెట్టి తాళం వేసింది. ఇంట్లో బాగా వేడిగా ఉండటంతో ఇంటికి తాళం వేసి అందరూ మేడపై పడుకున్నారు. ఈ క్రమంలో రాత్రి గుర్తు తెయని వ్యక్తులు మేకుతో తాళాలను తీసి ఇంట్లోకి వెళ్లి బీరువాను పగులగొట్టకుండా అందులో ఉన్న ఆభరణాలు, రూ.4 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఎస్ఐ సుజిత్ ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీం, సిబ్బందితో వివరాలు సేకరించారు. చేర్యాలలో ఇల్లు, మార్ట్లో.. చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంటితో పాటు ఓ మార్ట్లో చోరీ జరిగింది. ఈ ఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ జి.అపూర్వరెడ్డి కథనం ప్రకారం... పట్టణానికి చెందిన యాంసాని కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి హైదరాబాద్లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన పనిమనిషి యజమానికి సమాచారమిచ్చింది. వెంటనే వారు వచ్చి చూడగా కబోర్డులో దాచిన రూ.90వేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. అలాగే రోడ్డు ప్రక్కనే ఉన్న శ్రీమార్ట్లో దొంగలు కౌంటర్లోని రూ.15వేల నగదును ఎత్తుకెళ్లారు. మరో మార్టు షట్టర్ను తీసేందుకు యత్నించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. -
శాపమైన తండ్రి ముందు చూపు!
● అన్నదమ్ముల పంతం.. తల్లి అంత్యక్రియలకు దూరం ● నాన్నను పెట్టిన చోటే అమ్మను పెట్టాం: కూతురు ● చివరి చూపు చూడలేదన్న బాధలో చిన్న కొడుకు చిన్నశంకరంపేట(మెదక్): దివ్యాంగుడైన చిన్న కుమారుడి రక్షణ కోసం తండ్రి చూపిన ముందు చూపు ఇప్పుడు శాపమైంది. మండలంలోని మండ లం భాగీర్థిపల్లికి చెందిన రెడ్డి నర్సయ్య, చంద్రమ్మ దంపతులకు కూతురు, ముగ్గురు కుమారులు. కాగా పెద్ద కుమారుడు భిక్షపతి మృతి చెందగా, నాగరాజు, గోపాల్, భిక్షపతి కుమారులు ఉన్నారు. అయితే ఇందులో గోపాల్ దివ్యాంగుడు భవిష్యత్లో బతుకుదెరువు కష్టమైతదని భావించిన తండ్రి ముందు చూపుతో అతడి పేరు మీదున్న మూడెకరాల్లో ఎకరం పొలం అతడికి రాశాడు. ఇప్పుడిదే వివాదంగా మారి ఉన్న మూడెకరాల భూమిని సమానంగా పంచాలనే పంతం తల్లి చంద్రమ్మ అంత్యక్రియలకు శాపంగా మారింది. ఒకే చోట పెట్టామన్న తృప్తి.. మా అన్నదమ్ములు భూ వివాదంతో పంతానికి పోయిన్రు. కానీ నాన్నను బొందపెట్టిన చోటే అమ్మను పెట్టామని తృప్తి మిగిలింది. తమ్ముడు రాలేదనే బాధున్న.. నాన్న, అమ్మను ఒక చోట పెట్టామనే తృప్తి మిగిలింది. అన్నదమ్ములు భూ వివాదంతో నాన్నను ఒక చోట, అమ్మను మరో చోట బొంద పెట్టడం నచ్చలేదు. అందుకే తమ్ముడు నాగరాజును ఒప్పించి అమ్మ మృతదేహాన్ని భాగీర్థిపల్లికి తీసుకువచ్చాం. అన్నదమ్ముల భూమి పంచాయితీ ఇలాగే ఉంటే తాను వాటా అడగాల్సి వస్తది. – పెంటమ్మ, మృతురాలి కూతురు చివరి చూపునకు నోచుకోలేదు.. తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు సపర్యలు చేసి రుణం తీర్చుకున్నాననే తృప్తి ఉంది. కానీ చివరి చూపునకు నోచుకోలేదనే బాధ ఉంది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాలే, అమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు స్పందించలేదు అన్న. చివరికి తల్లి శవం తీసుకెళ్లి తనను అంత్యక్రియలకు దూరం చేశాడనే బాధ మరవలేకపోతున్నాను. నాన్న చూపిన ముందుచూపుతో నా పేరు మీద రాసిన ఎకరం పొలం.. ఇదే వివాదం అయితదని అనుకోలేదు. చివరికి ఇదే తనను తల్లి అంత్యక్రియలకు దూరం చేసింది. తన ముగ్గురు చిన్నారుల సహాయంతో అమ్మను కంటికి పాపలా చూసుకున్నా. అదే తృప్తితో మిగతా కార్యం పూర్తిచేస్తా. – గోపాల్, మృతురాలి చిన్న కుమారుడు -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
హుస్నాబాద్: బస్ స్టేషన్లో తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం హుస్నాబాద్ బస్టాండ్లో చోటుచేసుకుంది. బస్టాండ్లో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతుండటం గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన గొల్లెన అనిరుధ్గా గుర్తించారు. ఈక్రమంలోనే బస్ స్టేషన్కు చేరుకు బాలుడి తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆధారాల ను పరిశీలించారు. అనంతరం కంట్రోలర్ మహేందర్, సిబ్బంది బాలుడిని అప్పగించారు. యువకుడిపై దాడిపటాన్చెరు టౌన్: ఓ యువకుడిపై ఇద్దరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ముత్తంగి డివిజన్కు చెందిన వెంకటరెడ్డి ఈ నెల 22న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్ సమీపంలోని స్వీట్ హార్ట్ హోటల్కు టీ తాగేందుకు వెళ్లాడు. అక్కడ నలుగురు యువకులు గొడవ పడుతుండగా ఎందుకు గొడవ పడుతున్నారని అడిగాడు. దీంతో నీకెందుకంటూ ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం వెంకటరెడ్డి తన బైక్పై ఇంటికి బయలుదేరగా, కారులో వెంబడించిన సంగారెడ్డికి చెందిన ప్రదీప్, చేతన్ అతడిని అడ్డగించి బేస్బాల్ స్టిక్స్తో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరెడ్డికి ముఖం సహా శరీరం మొత్తం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ప్రదీప్, చేత న్లను అదుపులోకి తీసుకున్నారు. -
పాలిసెట్లో అమీన్పూర్ విద్యార్థి ప్రతిభ
స్టేట్ ఫస్ట్ వచ్చిన హరికృష్ణ పటాన్చెరు టౌన్: పాలిసెట్ పరీక్షల్లో అమీన్పూర్ గణేశ్ నగర్కు చెందిన అన్నం గంగాధర్(ప్రైవేట్ టీచర్), భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు హరికృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ స్ట్రీమ్లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించిన హరికృష్ణను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థి హరికృష్ణ -
ట్రాన్స్ బర్నర్లు
● కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు ● మరమ్మతుల్లో జాప్యంపెరిగిన విద్యుత్ వినియోగంబోరు బావుల కింద రైతులు పంటలు వేయడం వల్ల విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఎండలతోపాటు ఓవర్ లోడ్, విద్యుత్ సరఫరాలో లోపాలు, సాంకేతిక ఇబ్బందులు వంటి సమస్యల వల్ల అగ్రికల్చర్తోపాటు సింగల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాలిన ట్రాన్స్ఫార్మర్లు పెద్ద సంఖ్యలో రిపేరింగ్ సెంటర్కు రావడంతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ టౌన్: రైతులకు తప్పని తిప్పలు -
మహిళను కడతేర్చిన నిందితురాలి అరెస్టు
● దొంగతనంగా చిత్రీకరించే యత్నం ● బంగారు పుస్తెలతాడు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన సీపీసిద్దిపేటకమాన్: మహిళను హత్య చేసి, బంగారం కాజేసి..దొంగతనంగా చిత్రీకరించే యత్నం చేసిన కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేశారు. శనివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్లో సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలు వెల్లడించారు. అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ గ్రామంలో బోయిని కనకయ్య ఇద్దరు భార్యలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కనకయ్య మొదట రాజ్యలక్ష్మి అలియాస్ రాజవ్వ(48)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో రాధను రెండో వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం రాత్రి కనకయ్య హమాలి పనుల కోసం వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి పెద్ద భార్య రాజ్యలక్ష్మిపై దాడి చేసి, బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారని రెండో భార్య రాధ భర్తకు చెప్పింది. తీవ్ర గాయాలైన రాజ్యలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానంతో రెండో భార్య రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజ్యలక్ష్మి పెత్తనం చేస్తుందని, చాలా కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. రాజ్యలక్ష్మి మెడలో బంగారు పుస్తెలతాడు ఉందని, తనకేమో మాములు పసుపుతాడు ఉందని రాధ అసూయ పడేది. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, నిద్రిస్తున్న రాజ్యలక్ష్మి తల, మొహంపై రాధ కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసింది. మెడలోని బంగారు పుస్తెలతాడును చోరీ చేసి వంటింట్లో భద్రపర్చింది. కాగా ఘటనను దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. టీవీలో సీరియల్ చూసి హత్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకొని నిందితురాలు రాధను రిమాండ్కు తరలించారు. సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రశాంత్ పాల్గొన్నారు. -
రాయికుంటలో అగ్ని ప్రమాదం
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్ రాయికుంటలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎండిన గడ్డి, చెత్త ఉండటంతో మంటలంటుకొని పొగలు వ్యాపించాయి. చెరువు సమీపంలోని ఇండ్లకు మంటలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ మంటలు ఆర్పేందుకు యువకులు ప్రయత్నించారు. సర్పంచ్ జానకి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్తో మంటలార్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాలి బూడిదైన మోటార్ కేబుల్స్, పైపులు దుబ్బాకరూరల్: ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో పొలంలో స్తంభం మీదుగా ఉన్న కరెంట్ వైర్లు ఒక దానికొకటి తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో పొలంలో ఉన్న గడ్డి దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టు పక్కల ఉన్న పొలాలకు వ్యాపించాయి. బోర్ మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లు, స్టార్టర్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. రైతులకు కొంత మేర ఆస్తి నష్టం వాటి ల్లింది. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్
27 నుంచి పాలీసెట్ స్లాట్ బుకింగ్ ప్రారంభం జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణ సమీపంలోని శ్రీసంగమేశ్వర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పాలీసెట్ తదితర పరీక్షల కౌన్సిలింగ్ కోసం హెల్ప్లైన్ మంజూరైందని ప్రిన్సిపాల్ మునిగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్, ఈసెట్, ఏపీ సెట్, ఐసెట్ తదితర తదితర పరీక్షల కౌన్సిలింగ్కు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 27న పాలీసెట్ మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియతో హెల్ప్లైన్ సెంటర్ ప్రారంభమవుతుందని తెలిపారు. పాలీసెట్కు అర్హత పొందిన విద్యార్థులు మొదటి విడత కౌన్సిలింగ్కు ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. 29 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకొని జూన్ 3 నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవాలని వివరించారు. జూడో పోటీల్లో విద్యార్థికి కాంస్యం కొండపాక(గజ్వేల్): మండలంలోని జప్తినాచారం గ్రామానికి చెందిన విద్యార్థి చింతల హర్షిత్గౌడ్ రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. శనివారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ఆ విద్యార్థిని సన్మా నించారు. స్థానిక తెలంగాణ మోడల్ స్కూలులో విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన క్రీడోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో సీఎం కప్ జూడో 60 వెయిట్ విభాగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హర్షిత్గౌడ్ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావని, సిద్దిపేట జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగార్జునసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పశువులకు వడదెబ్బ జాగ్రత్తలు జిల్లా పశుసంవర్ధక అధికారి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ పాడి పఽశువులపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సిద్దిపేట జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోపాల కృష్ణమూర్తి తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాడిపశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, చల్లటి తాగునీరు అందించాలన్నారు. పశువుల పాకలపై తాటికమ్మలు, గడ్డి కప్పాలని, షెడ్ చుట్టూ గోనె సంచులు కట్టి వాటిని నీటితో తడపాలని సూచించారు. షెడ్లలో ఫ్యాన్లు, కూలర్లు పెట్టాలన్నారు. పశువుల దాణాలో తగినంత ఖనిజ లవణాల మిశ్రమాలను కలపాలని చెప్పారు. అత్యవసర సేవలకు 1962కు ఫోన్ చేసి సేవలు పొందాలన్నారు. మట్టి అక్రమ రవాణా.. 4 టిప్పర్లు పట్టివేత వర్గల్(గజ్వేల్): అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను గౌరారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఆరోగ్యం కథనం ప్రకారం... శుక్రవారం రాత్రి గౌరారం పీఎస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా మట్టిలోడ్తో నాలుగు టిప్పర్లు కన్పించాయి. తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆరెపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా గండిమైసమ్మ ప్రాంతానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు. -
అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేత
అదనపు కలెక్టర్ పాండుసంగారెడ్డి జోన్: నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికై న 137 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లో జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం తుల్జారాం నాయక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అఖిలేశ్ రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు. -
పరిహారం మూడింతలు!
ట్రిపుల్ఆర్ బాధితులను ఒప్పించేందుకు ప్రయత్నాలుట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులనుప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ..గజ్వేల్ కాలా(కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్) పరిధిలో పరిహారంపంపిణీని పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో వేసిన లెక్కలతో పోలిస్తే..రెండు నుంచి మూడింతలు పరిహారం ఇవ్వడానికి హామీలు ఇస్తున్నారు. ఇక్కడ 960ఎకరాలకు సంబంధించి సుమారుగా రూ.130కోట్ల పరిహారం అందజేయాల్సి ఉన్నదని లెక్కలు వేస్తుండగా ఇందులో ఇప్పటికే రూ.40కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. మరో రూ.35కోట్లు త్వరలోనే అందజేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్ గజ్వేల్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు) భూసేకరణ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)ల పరిధిలో రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా(కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులోభాగంగానే చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4,832.5 ఎకరాల భూసేకరణ లక్ష్యం పూర్తయ్యింది. ఇక రైతులకు పరిహారం పంపిణీపై అధికారులు దృష్టి పెట్టారు. గరిష్టంగా రూ.60లక్షలు.. కనిష్టంగా రూ.25లక్షలు గజ్వేల్ కాలా పరిధిలో ప్రస్తుతం అధికారులు వేస్తున్న లెక్కల ప్రకారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల కొన్ని సర్వే నంబర్ల భూములకు రూ.60లక్షలకుపైగా గరిష్టంగా పరిహారం అందుతుందని, రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో కనిష్టంగా రూ.25లక్షలకుపైగా పరిహారం అందుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఆయా గ్రామాల భూముల విలువలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం గజ్వేల్ కాలా పరిధిలో రైతులకు ఇవ్వాల్సిన రూ.130కోట్ల పరిహారంలో ఇప్పటికే రూ.40కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెల్సింది. మరో రూ.35కోట్ల పంపిణీకి సైతం సిద్ధమైనట్లు సమాచారం. మిగతా పరిహారం కూడా సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్లో కాలా పరిధిలో రూ.130కోట్లకుపైగా పరిహారం ఇప్పటికే రూ.40కోట్ల మేర పంపిణీ మరో రూ.35కోట్లు పంపిణీకి సిద్ధం!! స్పీడ్ పెంచిన అధికారులుగతంతో పోలిస్తే... మూడింతల పరిహారం!గతంలో అధికారులు ట్రిపుల్ఆర్ బాధితులు కోల్పోతున్న భూములకు ప్రభుత్వ విలువపై మూడింతల పరిహారం అందజేస్తామని చెబుతూ వచ్చారు. కానీ ఈ ప్రతిపాదనపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. వారి లెక్కల ప్రకారం గజ్వేల్ ప్రాంత పరిధిలో ఎక్కడా కూడా రైతులకు ఎకరాకు రూ.12లక్షల నుంచి రూ.20లక్షల పరిహారం అందే పరిస్థితి కనిపించలేదు. బహిరంగ మార్కెట్లో కోట్లల్లో విలువ పలుకుతున్న తమ భూములను అతి తక్కువ ధరలకు గుంజుకుంటారా...? అంటూ పలుమార్లు ఆందోళనలకు దిగిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో గతంలో వేసిన లెక్కలతో పోలిస్తే రెండు నుంచి మూడింతల పరిహారం ఇచ్చి రైతులను ఒప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో 44వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కుకునూరు రాజులు(48) తూప్రాన్ నుంచి బైకుపై చేగుంట వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో మాసాయిపేట గ్రామంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో రాజులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వేట్రాక్పై మృతదేహం రామచంద్రాపురం(పటాన్చెరు): రైల్వేట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదులనాగులపల్లి, తెల్లాపూర్ రైల్వేస్టేషన్ మధ్యలోని రైల్వే అప్లైన్ ట్రాక్పై శనివారం తెల్లావారుజామున గుర్తు తెలి యని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వయస్సు 25నుంచి 35మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతుడి కుడి చేతి జబ్బపైన ఎద్దుతల టాటో ఉన్నట్లు పేర్కొన్నా రు. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా
పచ్చిరొట్ట సాగుతో భూసారం వృద్ధి సబ్సిడీపై జనుము విత్తనాలు అందజేత మాజీ సర్పంచ్ రూ.3 కోట్ల భూమి విరాళంసదాశివపేట రూరల్ (సంగారెడ్డి): గజం స్థలం కోసం గొడవలు పడే ఈరోజుల్లో దాదాపుగా రూ.3 కోట్లు విలువ చేసే 30 గుంటల భూమిని ప్రభుత్వానికి ఉచితంగా గిఫ్ట్ డీడ్ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అమరేందర్రెడ్డి. ఆత్మకూర్లో ప్రజా వైద్యశాలకు తన పూర్వీకులు 30 గుంటల భూమిని అందజేశారు. అయితే నాడు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తన పూర్వీకులు ఆశయాన్ని నిలబెడుతూ..ఆస్పత్రి పేరిట శనివారం గిఫ్ట్ డీడ్ చేసి జిల్లా వైద్యాధికారి వసంత రావుకు విరాళంగా అందజేశారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి అందజేసిన అమరేందర్రెడ్డిని గ్రామ, మండల ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సత్యం పంతులు, రమేశ్, ప్రభు, వీరన్న, సదాశివుడు, జగదీశ్వర్, శివ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓఎస్ల పదోన్నతికి కృషిచేయాలిసంగారెడ్డి: ఓఎస్లకు ప్రమోషన్లు కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకిరెడ్డిని తెలంగాణ పంచాయతీ రాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఉద్యోగులను 40%తో బదిలీలు చేసినందుకు ఉద్యోగుల సంఘం నాయకులు జానకిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, ప్రధాన కార్య దర్శి రాహుల్, పంచాయతీ రాజ్ మినిస్తియ్రల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు. -
20రోజులు.. రూపాయి జమకాలే!
● ఎదురుచూస్తున్న మొక్కజొన్న రైతులు ● 960మంది రైతుల నుంచి 22వేలక్వింటాళ్ల ధాన్యం కొనుగోలువట్పల్లి(అందోల్): మొక్కజొన్నల డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నగదు చెల్లింపులు ఉంటాయన్న అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు కార్యరూపం దాల్చడం లేదు. మొక్కజొన్న మంచి దిగుబడి రావడంతో తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులు ధాన్యం విక్రయించి దాదాపుగా ఇరువై రోజులు గడుస్తున్నా నగదు చెల్లింపులు జరుగకపోవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారుగా 8,700 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సాగైంది. దీంతో జిల్లాలో నాలుగుచోట్ల జోగిపేట, తాలెల్మ, జహీరాబాద్, కోహీర్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించకుండా ఎక్కువ మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. 960 మంది రైతుల నుంచి 22 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోల్లు చేసినట్లుగా మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. దీంతో సుమారుగా 5.28 కోట్ల నిధులు బకాయిలు పడ్డాయి. రైతులు ఎదురు తెన్నులు.. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో తిరిగి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిచాల్సి ఉన్నా మొక్కజొన్న ధాన్యం డబ్బులు జమ కాకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓవైపు రోహిణి కార్తెలో వరి పంటకు నారు మడులు సిద్ధం చేయాల్సి ఉండగా ఎరువుల ధరలు పెరుగుతుండటంపై రైతులు ముందుగానే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు. 15రోజులవుతోంది మొక్కజొన్న పంటను విక్రయించి 15 రోజులవుతోంది. ఇంకా డబ్బులు జమ కాలేదు. వరి ధాన్యం కొనుగోళ్లు కూడా ఆలస్యం కావడంతో వరి పంటను విక్రయించలేదు. దీంతో పంట కోతల సంబందించి ట్రాక్టర్ల, మిషన్ల డబ్బులు కూడా చెల్లించలేదు. ఎరువుల బస్తాల ధర పెరుగుతుందని చెప్పడంతో ముందుగానే ఎరువులు కొనుగోలు చేద్దామంటే డబ్బులు లేక కొనుగోలు చేయలేదు. – కాల్వమీది రమేశ్, రైతు, కన్సాన్పల్లి రెండు మూడు రోజుల్లో చెల్లిస్తాం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – చంద్రశేఖర్గౌడ్, మార్క్ఫెడ్ డీఎం -
ఆఫ్రికాలో విత్తన ధ్రువీకరణకు అవకాశాలు
● ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి ● నైజీరియా ప్రతినిధులకు అంతర్జాతీయ విత్తన శిక్షణములుగు(గజ్వేల్): ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న కారణంగా సేంద్రియ విత్తన ధ్రువీకరణకు అపారమైన అవకాశాలున్నాయని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని వర్సిటీలో సీడ్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అంశంపై తరాబ, ప్రసాద్ సీడ్స్ లిమిటెడ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 30 మంది నైజీరియా ప్రతినిధులకు అంతర్జాతీయ విత్తన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విత్తన రంగంలో ప్రపంచానికే పాఠాలు నేర్పిన తెలంగాణ రాష్ట్రం మోడల్గా ఆఫ్రికా దేశాలు విత్తన రంగంలో మరింత ప్రగతి సాధించవచ్చునని తెలిపారు. కూరగాయల విత్తనోత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక విజయాలను సాధించిన విశ్వవిద్యాలయం అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. శిక్షణ అనంతరం నైజీరియా బృందం ప్రతినిధులు మండలంలోని క్షీరసాగర్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ రైతులు అనుసరిస్తున్న కూరగాయల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తనోత్పత్తి విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో నైజీరియా టీఏజీఐఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. జోషువా మార్కు మాకు, వ్యవసాయ శాఖ పర్మినెంట్ సెక్రటరీ అలీసారా సాబో డాంజుమా, సీఈఓ దిలీప్కుమార్, క్షీరసాగర్ సర్పంచ్ బాల్రెడ్డి, వర్సిటీ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
మెడలోంచి బంగారు గొలుసు, కమ్మలు అపహరణఅక్కన్నపేట(హుస్నాబాద్): నిద్రిస్తున్న మహిళపై కర్రతో ముఖం, తలపై దాడి చేసి బంగారు గొలుసు, కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు ఇద్దరు భార్యలు. కనకయ్య హమాలీ పనికి కట్కూర్ గ్రామానికి వెళ్లి ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్లింది. దీంతో రాత్రి రాజలక్ష్మి(48)భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఇదే అదనుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమైపె దాడి చేసి మెడలోంచి సుమారు 3తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. తరువాత ఇంటికి వచ్చిన రెండో భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న రాజలక్ష్మిని చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పింది. వెంటనే అంబులెన్స్లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. అయితే, మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడారా? లేదా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా? అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. అలాగే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
నర్సాపూర్ రూరల్: పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎల్లాపూర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... కౌడిపల్లి మండలం సలాబత్పూర్ పంచాయతీ పరిధిలోని పీర్ల తండాకు చెందిన నునావత్ రాజు, జ్యోతి దంపతులు, పెద్ద కుమారుడు మహేశ్(14), చిన్న కుమారుడు రాకేశ్తో కలిసి నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లోని మామిడి తోటలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. రోజులాగే గురువారం రాత్రి భోజనం చేసి రూమ్ ఎదుట నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి పెద్ద కుమారుడు మహేశ్ కాలుకు ఏదో కరిచిందని తండ్రిని నిద్రలేపి చెప్పాడు. వెంటనే రాజు అదే మామిడి తోటలో పనిచేసే డ్రైవర్ సహాయంతో సంగారెడ్డి ఆస్పత్రికి బైక్పై తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాముకాటు వేయడం వల్లే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఏడుపాయల్లో నీటిలో మునిగి.. పాపన్నపేట(మెదక్): దుర్గమ్మ దర్శనానికి ఏడుపాయలకు వచ్చిన ఓ యువకుడు స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా నవాబ్పేటకు చెందిన కంకరి నాగరాజు(31)కు అపుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఏడుపాయల్లో చెక్ డ్యాం వద్ద స్నానం చేస్తుండగా నీటిలో మునిగాడు. అక్కడి నుంచి వెళ్తున్న భక్తులు, ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ ఉండటం చూసి అనుమానించి,ఇతరులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు వచ్చి వెతకగా మృతదేహం లభ్యమైంది. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏడీఈ
నర్సాపూర్: ఓ కాంట్రాక్టరు నుంచి విద్యుత్ శాఖ ఏడీఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం నర్సాపూర్లో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు చెందిన ఓ కాంట్రాక్టరు 2023 నుంచి 2025 మధ్య కాలంలో నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలో 11 పనులు చేయగా అతనికి రూ.3లక్షల 13,882 బిల్లు ఆ శాఖ నుంచి రావాల్సి ఉంది. కాగా సదరు బిల్లును ఉన్నతాధికారులకు పంపడానికి స్థానిక ఏడీఈ రమణారెడ్డి రూ.30వేలు ఇవ్వాలని కాంట్రాక్టరును డిమాండు చేశాడు. అతను బతిమిలాడటంతో రూ.25వేలకు అంగీకరించాడు. కాగా శుక్రవారం ఏడీఈకి అతని కార్యాలయంలో కాంట్రాక్టరు లంచం ఇవ్వగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. పట్టుబడిన ఏడీఈని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. రమణారెడ్డి నివాసాల్లో సైతం తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. స్థానిక దాడుల్లో తనతో పాటు ఇన్స్పెక్టర్లు వెంకటేశం, రమేశ్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
పురాతన బావికి మెరుగులు
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో స్వామి బావిని తుది మెరుగులతో పర్యాటక శోభ సంతరించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని దాయరవీధిలో గల పురాతన కట్టడాలైన స్వామి బావి, దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తుది మెరుగులతో భావితరాలకు తెలిపేలా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్ పాల్గొన్నారు. -
ట్యాంకర్, ఆటో ఢీకొని మహిళ మృతి
నలుగురికి గాయాలుకంది (సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన కంది పరిధిలోని కంది–శంకర్పల్లి రోడ్డుపై చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... సదాశివపేట మండలం నాగసాన్పల్లికి చెందిన అలివేణి(54) ఐదు రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో ఉంటున్న తమ కూతురు ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ఉండడంతో కూతురు దుర్గ, అల్లుడు మల్లేశం, మనువడు అభి, మనవరాలు అక్షరను తీసుకొని శుక్రవారం నాగసాన్పల్లికి ఆటోలో బయలు దేరారు. ఈ క్రమంలో కంది పరిధిలో గల ఆర్డీఏ కార్యాలయం సమీపంలో కంది–శంకర్పల్లి రోడ్డుపై కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అలివేణి అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు,అల్లుడు,మనుమడు, మనుమరాలుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లావాసి.. భిక్కనూరు : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం... మెదక్ జిల్లా, నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన వీరబోయిన కార్తీక్ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇస్సానగర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శిరీష, ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో పశుగ్రాసం దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో జీల ఓదెయ్య పశువుల పాక వద్ద షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రెండెకరాల పశుగ్రాసంతో పాటు పొలంలో ఉన్న ఐదెకరాల గడ్డి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం పొంచి ఉందని భావించిన రైతులు పశువుల పాకలో ఉన్న పశువులను ఎల్లమ్మ గుడి మర్రిచెట్టు కింద కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే గ్రామపంచాయతీ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కృష్ణనాయక్, తిరుపతినాయక్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. శివ్వంపేట(నర్సాపూర్): బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని నవాబుపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంద్రేశంలో బాలుడు.. పటాన్చెరు టౌన్: పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా, అల్లదుర్గానికి చెందిన పోచయ్య బతుకుదెరువు కోసం వచ్చి ఇంద్రేశంలో ఉంటూ కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. అతడి కుమారుడు రాజు (17) ఈనెల 18న ఇంద్రేశం నుంచి పటాన్చెరుకు పని కోసం వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనికోసం వచ్చి.. ఏగుంట(తూప్రాన్): పని కోసం వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం ప్రకారం... రాజస్తాన్కు చెందిన విజేందర్ సింగ్ ఈనెల 1న చేగుంట జీవిక పరిశ్రమ క్వార్టర్స్కు వచ్చాడు. అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అతడి ఆచూకీ తెలియక పోవడంతో పరిశ్రమ మేనేజర్ అశోక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● 64 కేసుల్లో ఏడుగురు నిందితులు ● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య నిజామాబాద్అర్బన్: ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగితీగల(కాపర్ కాయిల్స్)ను చోరీ చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య కేసు వివరాలు వెల్లడించారు. రెంజల్ మండలం సాటాపూర్ బైపాస్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మూడు బైకులపై ఉన్న ఐదుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగులో ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ లభించాయి. విచారించగా 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ను చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. కాగా వీరు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్లలోని కాయిల్స్ను చోరీ చేసినట్లు తెలిపారు. కాగా నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల్లో మెదక్ టౌన్కు చెందిన వనం సాయిలు, సారయ్య, బోధన్కు చెందిన వనం పోశెట్టి, మెదక్కు చెందిన ధన కిరణ్, దాసరి పోచయ్యగా గుర్తించారు. చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసిన బోధన్లోని రాకాసిపేటకు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, గూపన్పల్లికి చెందిన షేక్ మహబూబ్, మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప, తాయప్ప దంగల్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, మూడు బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. -
రోళ్లు పగుల్తున్నాయ్!
నారాయణఖేడ్: రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని నానుడి. ఈ కార్తె ప్రవేశించగానే విపరీతమైన ఎండలు ప్రారంభమవుతాయి. అయితే అందుకు భిన్నంగా భరణి కార్తె నుంచే ఎండలు ముదిరిపోయాయి. ఇక కృత్తిక కార్తె వచ్చేనాటికి ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు జనాలు తల్లడిల్లుతున్నారు. ఈనెల 11 నుంచి కృత్తిక కార్తె ప్రారంభమై ఈనెల 24వరకు కొనసాగనుంది. 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమై జూన్ 7వ తేదీవరకు ఉంటుంది. వేసవి కాలం మొత్తంలో అత్యధికంగా రోహిణి కార్తెలోనే ఎండలు మండిపోతాయి. కానీ, ఈ ఏడాది మాత్రం భరణి కార్తె చివరి నుంచే ఎండల ఉధృతి పెరిగి కృత్తిక కార్తెలోనే రోహిణి నాటి ఎండల తీవ్రత చూపించింది. మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కాగా ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు ఎండల తీవ్రతపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోనూ ఎండల తీవ్ర అధికంగా ఉందంటూ జనాల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాన్ని చేరవేసింది. జిల్లాలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. వేసవిలో వడగాడ్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. మండే ఎండలతో ప్రాణాంతక వడదెబ్బ సోకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై తీవ్ర ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యం పాలే... ఎండ ధాటికి వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతుంది. జ్వరం, వాంతులు, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, సొమ్మసిల్లి పడిపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే వడదెబ్బకు గురైనట్లు గుర్తించి తక్షణ వైద్యం అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు నీడపట్టున ఉండాలని, ప్రతీ రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు నీటిని సేవించాలని సూచిస్తున్నారు. పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి బొండాలు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు. రోహిణికి ముందే పెరిగిన ఉష్ణోగ్రతలు కృత్తిక కార్తెలోనే రోహిణి వేడి మున్ముందు మరింత ఆందోళనే ఎన్డీఎంఏ హెచ్చరికలు ఎండల తీవ్రత ఉదయం 10గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4గంటలవరకు కొనసాగుతోంది. ఈ సమయంలో జిల్లాలో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జన సంచారం కన్పించడంలేదు. అత్యవసరమైతే తప్ప మిగతావారు బయటకి రావడానికి జంకుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగానే వస్తాయని భావించిన నైరుతి రుతుపవనాలు ఆగమనం ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఎండలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. -
కొత్త పింఛన్లు!
నారాయణఖేడ్: ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న 50 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు చేయూత పేర నూతన పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పింఛన్లు అందజేయాలని యోచిస్తుండగా జిల్లాలో కూడా అర్హులైన వారికి పెన్షన్లు దక్కనున్నాయి. దాదాపు మూడేళ్లుగా నూతన పింఛన్లు మంజూరు కావడంలేదు. మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పింఛను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 2న నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో నూతన పింఛన్ల కోసం సుమారు 22వేల మంది దరఖాస్తులు సమర్పించారు. లాగిన్కు అనుమతులు కొత్త చేయూత పింఛనుదార్ల మంజూరు నేపథ్యంలో ప్రభుత్వ శాఖలకు వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికై తే ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలి. ఎంపీడీఓ, ఇటు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. చేయూత పేర పంపిణీకి చర్యలు -
ఉల్లాసం.. ఉత్సాహం
స్విమ్మింగ్ ఫుల్!● రోబోటిక్స్, ఏఐతో పాటు పలు అంశాల్లో శిక్షణ ● జిల్లాలో 25 పాఠశాలల్లో 1500 పైగా విద్యార్థులు ● ఉక్కపోతతో ఉపశమనం ● చిన్నారులతో స్విమ్మింగ్పూల్లో కిటకిట పటాన్చెరు: ఎండలు మండుతున్నాయి. చల్లదనం కోసం జనం పరితపిస్తున్నారు. చిన్నారులైతే మరీ ఎక్కువగా అల్లాడిపోతున్నారు. సెలవులున్నాయి కానీ ఆడుకునేందుకు మైదానాలు లేవు. అపార్ట్మెంట్లలో ఇరుగుపొరుగుతో కలసి ఆడుకుందామంటే అల్లరి చేస్తున్నారంటూ పెద్దల అరుపులు. దాంతో కొందరు తమ పిల్లలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలకు ఈత నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లను ఆశ్రయిస్తున్నారు. వేడి తక్కువగా ఉండే ఉదయం సాయంత్ర పూట స్విమ్మింగ్ పూల్లకు తీసుకెళ్లున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యంగా అమీన్పూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో డజనుకు పైగా స్విమ్మింగ్ పూల్లను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ప్లాట్లు అద్దెకు తీసుకుని స్విమ్మింగ్ పూల్లను ఏర్పాటు చేశారు. వాటికి గిరాకీ బాగా పెరిగింది. పటాన్చెరు పట్టణం నుంచి కూడా ప్రజలు అమీన్ఫూర్లోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వస్తున్నారు. గతంలో తాము సాకి చెరువు, ఇతర చెరువుల్లో ఈత కొట్టే వాళ్లమని చెబుతూ.. ఇప్పుడు ఆ చెరువులు కాలుష్య క్యాసారాలుగా మారాయని దాంతో తాము తమ చిన్నారులను స్విమ్మింగ్ పూల్లకు తెస్తున్నామని పేర్కొంటున్నారు. స్విమ్మింగ్ పూల్లకు తరలివచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహాకుడు సత్య తెలిపారు. దుబ్బాక: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ఆలోచనతో ప్రభుత్వం సమ్మర్క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 25 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు శారీరక దృఢత్వం పెంచేందుకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున రూ.12.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. సమ్మర్ క్యాంపుల్లో 1500 పైగా విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏఐతో పాటు పలు అంశాల్లో శిక్షణ వేసవి శిక్షణ శిబిరాల్లో ఏఐపై అవగాహన కల్పించడంతో పాటు కంప్యూటర్, రోబోటిక్స్, సైన్స్ ప్రయోగాలు, చిత్ర లేఖనం, గణితం సులభంగా ఎలా చేయడంపై ప్రత్యేకంగా నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా చెస్, క్యారమ్ వంటి ఇండోర్ గేమ్స్తో పాటు, జానపద, శాసీ్త్రయ నృత్యం, పాటలు, సంగీతం, వాయిద్యాలతో పాటు బాల్ బ్యాడ్మింటన్తో పాటు పలు ఆటలపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాగా దుబ్బాక పట్టణంలోని పీఎంశ్రీ జడ్పీజీహెచ్ఎస్ పాఠశాలలో 70 మందికి పైగా విద్యార్థులు రోబోటిక్స్, డ్రాయింగ్, కంప్యూటర్తో పాటు పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. సులభంగా గణితం.. సులభంగా గణితం ఎలా చేయాలో, క్లిష్టమైన వాటిని ఎలా ఛేదించడం వంటి అంశాలను నేర్చుకున్నాం. ఈ సమ్మర్ క్యాంపుతో మానసికంగా ,శారీరకంగా చాలా ఉపయోగంగా ఉంది. ఉపాధ్యాయులు పలు అంశాల్లో శిక్షణ ఇస్తుండ్రు. ఈ క్యాంపులో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. – విద్య, పదోతరగతిఏఐపై అవగాహన సమ్మర్ క్యాంపులో ఏఐపై అవగాహన కల్పించారు. ఇప్పుడు ఏఐ ఉపయోగాలు తదితర అంశాలపై అవగాహన వచ్చింది. ఉపాధ్యాయులు చాలా చక్కగా శిక్షణ ఇస్తుండ్రు. –అఖిల, 9వ తరగతి భవిష్యత్తుకు పునాది భవిష్యత్తుకు సంబంధించి చాలా చక్కటి మార్గం ఏర్పడింది. ఫ్యూచర్లో ఎలా ముందుకు పోవాలనే దానిపై తెలుసుకున్నాం. నైపుణ్యం ఉన్న ఆటలతో పాటు పలు అంశాలపై మంచిగా శిక్షణనిస్తున్నారు. –రేణుశ్రీ, పదోతరగతి అభిరుచి ఉన్న అంశాల్లో.. వేసవి శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దుబ్బాకలో తమ పాఠశాలతో పాటు చుట్టు ప్రక్కల పాఠశాలకు చెందిన 70 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి ఇలాంటి క్యాంపులతో వెలికితీయవచ్చు. వారికి అభిరుచి ఉన్న అంశాల్లో రాటుదేలుతున్నారు. –పట్నం భూపాల్, హెచ్ఎం, పీఎంశ్రీ జెడ్పీజీహెచ్ఎస్, దుబ్బాక -
ప్రగతిని పరుగులు పెట్టిస్తా
పటాన్చెరు/పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతీ కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డులలో శుక్రవారం అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ జీఎంఆర్ మార్గ్లో నూతనంగా నిర్మించిన చర్చిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డు శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ సహకారం, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా 30 పైగా చర్చిలు నిర్మించి ఇచ్చినట్లు గుర్తు చేశారు. నూతన చర్చి నిర్మాణానికి సైతం ప్రభుత్వంతో చర్చించి భూమిని కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చర్చి ఫాదర్ ఆండ్రూస్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
బడిలోనే బ్రేక్ఫాస్ట్
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు మెదక్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది. విజయ డెయిరీ పాలు సర్కార్ బడుల్లో 10వ తరగతి వరకు విద్యార్థులకు రోజుకో టిఫిన్, పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి, మరో మూడు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ ఇవ్వాలని నిర్ణయించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ.8తో, 6 నుంచి 10 తరగతుల వారికి రూ.12 ఖర్చుతో అల్పాహారం అందించనున్నారు. ఇక పౌష్టికాహారంగా పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిబంధనల మేరకు 150 నుంచి 200 మి.లీ వరకు టెట్రా ప్యాక్లలో పాలు ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు విజయ డెయిరీకి ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. కాగా గతంలో ఇచ్చే రాగి జావాను మూడు రోజుల పాటు, మరో మూడు రోజులు పాలు ఇవ్వాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై మెదక్ డీఈఓ రాజును వివరణ కోరగా.. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అయితే ఇంకా ఉత్తర్వులు రాలేదని చెప్పారు.జిల్లా పాఠశాలలు విద్యార్థులు మెదక్ 881 68,219 సిద్దిపేట 935 80,541 సంగారెడ్డి 1,222 1,06,2992,55,059 విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది.


