Sangareddy
-
లేబర్ కోడ్ తెస్తే తిరుగుబాటు తప్పదు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య పటాన్చెరు టౌన్: లేబర్ కోడ్ తీసుకొస్తే తిరుగుబాటు తప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య హెచ్చరించారు. శనివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రామిక భవన్లో జరిగిన పార్లే ఆగ్రో పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు వస్తే బానిసలుగా మారడం తప్పదన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, రాజశేఖర్ సుజిత్, సుధాకర్, శ్రీకాంత్, కిరణ్, రాములు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం మాతోనే సాధ్యంఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. శనివారం ఐఎన్టీయూసీ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐఎన్టీయూసీ మూడు కోట్ల 30 లక్షల మంది కార్మికులు సభ్యత్వం ఉన్న అతిపెద్ద కార్మిక సంఘమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, వారికి కార్మిక వర్గం అండగా ఉంటుందన్నారు. కార్మిక నాయకులు విజయ్, రాజశేఖర్ రెడ్డి, కుమార్, ప్రదీప్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. అధిక సాంద్రతతో అధిక దిగుబడులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ ఝరాసంగం(జహీరాబాద్): అధిక సాంద్రత విధానంతో పంటలు అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఝరాసంగం రైతు వేదికలో అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పత్తి సాగులో తాజా మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఎక్కువ విత్తనాలు వేసి తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుందన్నారు. బయోచార్ ఎరువులో అధిక పోషకాలు నీటిని నిలిపే సామర్థ్యం పెంచుతుందన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్, అరణ్య సంస్థ ప్రతినిధి పద్మ, నూజివీడు సీడ్స్ ప్రతినిధి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఖైదీలకు ఉచితన్యాయ సేవలు అందిస్తాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: జైలులోని ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం కందిలోని సెంట్రల్ జైలును ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని, సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. ఖైదీల కోసం కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం జైలు అధికారులతో, ఖైదీలతో మాట్లాడారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. -
లంపిస్కిన్ కలకలం
జీర్లపల్లిలో లేగదూడ మృతి ఝరాసంగం(జహీ రాబాద్): పశువుల్లో ప్రాణాంతక వ్యాధి లంపిస్కిన్ మండలంలో కలకలం రేపింది. జీర్లపల్లిలో శుక్రవారం రాత్రి లేగదూడ మృతి చెందింది. వివరాల ఇలా.. గ్రామానికి చెందిన శ్రీశైలం తన లేగదూడ శరీరంపై దద్దుర్లు, మెడ కింది వాపు, కాళ్ళువాపు లక్షణాలు కనిపించడంతో పశువైద్యుల ను సంప్రదించారు. చికిత్స ప్రారంభించడంతో దూ డ మృతి చెందింది. దీంతో గ్రామంలోని పశుపోష కులు ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన పోషకుడి వద్ద ఉన్న మరో దానికి లక్షణాలు ఉ న్నా యని తెలిపారు. దీంతో పశువైద్య శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామంలో ప్రత్యేక వైద్య శిబి రం నిర్వహించి తెల్లజాతి పశువులకు టీకాలు వేశారు. -
కాంగ్రెస్లో ‘మార్కెట్’ రగడ
● ఎటూ తేలని ఖేడ్, పటాన్చెరుఏఎంసీల పాలకవర్గాలు నియామకం ● నేతల మధ్య ఆధిపత్య పోరుకారణమంటున్న పార్టీ వర్గాలు ● పీసీసీ వద్దకు పటాన్చెరు‘మార్కెట్’ పంచాయితీ ● ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించుకుంటేనే ‘ఖేడ్’ కమిటీపై స్పష్టత ● సర్కారు వచ్చి 16 నెలలైనాతేలని పంచాయితీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధికార కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీల పాలకవర్గాల రగడ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకాలు జరిగినప్పటికీ నారాయణఖేడ్, పటాన్చెరు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఖరారు కావడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈ పాలకవర్గాలు ఎటూ తేలడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, వట్పల్లి, జోగిపేట, రాయ్కోడ్ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు నియామకం జరిగి ఆరు నెలలు గడుస్తోంది. కానీ, నారాయణఖేడ్, పటాన్చెరు కమిటీల పంచాయితీ మాత్రం ఎటూ తేలడం లేదు. గూడెం ప్రతిపాదించి రెండు నెలలైనా.. పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల పదవులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కొందరు నాయకుల పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రతిపాదిత లేఖను ఫిబ్రవరిలోనే అధికారులకు అందజేశారు. ఆ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న కా టా శ్రీనివాస్గౌడ్ అభ్యంతరం తెలపడంతో గూడెం ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. రెండు నెలలుగా ఈ పంచాయితీ ఎటూ తేలడం లేదు. ఈ చైర్మన్, సభ్యుల పదవులను తన వర్గీయులకు ఇచ్చేందుకు గూడెం మహిపాల్రెడ్డి ప్రతిపాదించగా, కాటా శ్రీనివాస్గౌడ్ తన అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గత ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదు. పీసీసీకి మార్కెట్ కమిటీ పంచాయితీ పటాన్చెరు మార్కెట్ కమిటీ నియామకాల క్లిష్టంగా మారడంతో ఈ పంచాయితీ పీసీసీ వద్దకు వెళ్లింది. ముఖ్యనేతలే ఈ పంచాయితీని తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘ఖేడ్’లో సమన్వయం కుదిరితేనే.. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవులను కూడా తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు అక్కడి ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తన అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నించగా, స్థానికంగా ఉండే జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ కూడా తన వర్గీయులకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో ఈ మార్కెట్ పంచాయితీ కూడా ఇంకా ఎటూ తేలడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిరితేనే ఈ పదవులు తేలే అవకాశాలు ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో జహీరాబాద్లోనూ లొల్లే.. జహీరాబాద్ మార్కెట్ కమిటీ నియామకం గతంలోనే పూర్తయిన విషయం విదితమే. ఈ కమిటీ చైర్మన్ పదవిని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తన కుమారుడిని నియమించుకున్నారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం వచ్చాక పదవులు దక్కుతాయనుకుంటే తమకు నిరాశే ఎదురైందని స్థానిక సీనియర్ నాయ కులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక టర్మే దగ్గర పడుతుండే... ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఈ మార్కెట్ చైర్మన్లు, సభ్యుల పోస్టులు ముఖ్యమైనవి. సాధారణంగా ఈ పోస్టుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 16 నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు నారాయణఖేడ్, పటాన్చెరు మార్కెట్ కమిటీల పోస్టులు ఎటూ తేలకపోవడంతో ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఈ పదవులను నియమించి ఉంటే ఒక టర్మే దగ్గర పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మెడికల్ షాపు ఎదుట సొంత ఖర్చుతో..
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి చెందిన రతన్ సరడా ఒక్కడే ఆరేళ్ల నుంచి చలి వేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని భవానీ మందిరం రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి వచ్చిన వారికి మంచి నీళ్లు అందించాలన్న ఉద్దేశ్యంతో తన మెడికల్ షాపు ఎదుట చలివేంద్రం ఏర్పాటు చేసి కూలింగ్ మినరల్ వాటర్ అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ప్రతీ ఆదివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నామని, అందుకని ఈ సంవత్సరం చలివేంద్రాన్ని నగర సంకీర్తన పేరు పెట్టామన్నారు. పరిస్థితుల బట్టి అవసరం మేరకు కూలింగ్ వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. -
జేఎస్ఆర్ ఔదార్యం.. చలివేంద్రం
ప్రతీ నెలా రూ.15 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు హుస్నాబాద్: వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి. జేఎస్ఆర్ అన్న పేరిట 5 ఏళ్లుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు. హుస్నాబాద్ పట్టణంతోపాటుగా అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల కేంద్రాలతోపాటుగా పెద్ద గ్రామాల్లో మొత్తం 19 చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతీ చలివేంద్ర కేంద్రంలో వాటర్ ఫ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలకు కూల్ వాటర్ను అందిస్తున్నాడు. 24 గంటల పాటు కూల్ వాటర్ను అందుబాటులో ఉంచుతున్నారు. కరెంటు బిల్లు, వర్కర్లు, చలివేంద్రాల నిర్వాహణ దాదాపు ప్రతి నెలా రూ.15 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. -
మహిళా కళాశాలలో సమస్యలు ఉండొద్దు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి: మహిళా డిగ్రీ కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో అదనపు వసతి గదులతో పాటు మూడు వందల మంది విద్యార్థినులకు సరిపోయేలా కిచెన్, డైనింగ్ గదులు మూడు అంతస్తుల్లో ఏర్పాటు అయ్యేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మినీ ఆడిటోరియం, హాస్టల్ భవనం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో కావాల్సిన అన్ని మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డీఈ రాజు, ఏఈలు రాజ మల్లయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
ఆరేళ్లుగా బస్టాండ్ వద్ద ఏర్పాటు
సీఐటీయూ ఆధ్వర్యంలో చలివేంద్రం దుబ్బాక: దుబ్బాక పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అంబలి కేంద్రంతోపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డు బర్ల భాస్కర్ ప్రత్యేక కృషితో మార్చిలో బస్టాండ్ వద్ద చలి వేంద్రంను ఏర్పాటు చేసి ప్రతి రోజూ వెయ్యిమందికి పైగా చల్లటి మినరల్ వాటర్ అందిస్తు దాహార్తి తీరుస్తున్నారు. ఆరేళ్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా భాస్కర్ సాక్షితో తెలిపారు. మండుటెండలో ఎక్కడో సుదూరప్రాంతాలకు చెందిన వారు ఈ చలివేంద్రంలో చల్లని నీరు తాగి దాహార్తి తీర్చుకోవడం చూస్తుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. -
పర్యావరణ ఇంజినీర్ తొలగింపు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్విరాల్మెంట్ ఇంజినీర్గా పని చేస్తున్న దిలీప్రెడ్డిని తొలగిస్తూ మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ సిద్దిపేట, గ్రీన్ సిద్దిపేట లక్ష్యంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మున్సిపాలిటీలో పర్యావరణ ఇంజినీర్గా దిలీప్ రెడ్డి నియామకం అయ్యా రు. కొంతకాలంగా విధులపట్ల నిర్లక్ష్యం, పలు ఆరోపణలు, కౌన్సిల్ తీర్మానం నేపథ్యంలో అతడిని తొలగిస్తూ, అందుకు సంబంధించి సురక్ష ఏజెన్సీతో చేసుకున్న దిలీప్ నియామకం రద్దు చేస్తున్నట్టు వారికి లేఖ రాశారు. మట్టి టిప్పర్లు పట్టివేతముగ్గురిపై కేసు నమోదు, రూ.15 వేలు జరిమానా వట్పల్లి(అందోల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనాలను వట్పల్లి పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. జోగిపేట సీఐ అనిల్కుమార్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి గుట్టుగా వట్పల్లి గ్రామ శివారులో నుంచి కొందరు టిప్పర్ వాహనాల ద్వారా రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఫంక్షన్ హాలు నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ శ్రీనివాస్కు సమాచారం అందించి వారి సమక్షంలో వాహనాలకు ఒక్కొక్కదానికి రూ.5 వేల చొప్పున మూడింటికి రూ.15 వేలు జరిమానాలు విధించారు. టిప్పర్ వాహనాల డ్రైవర్లు జాన్సన్, మహ్మద్ మోసిన్, జీ.మల్లేశంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం చిన్నశంకరంపేట(మెదక్): వివాహమైన రెండు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వట్టెపు రాజయ్య కుమారుడు మహేశ్కు రెండు నెలల కిందట వెల్దుర్తి మండలం షేరిలా గ్రామానికి చెందిన పూజను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలోనే యువతి అత్తింట్లో ఉ రేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యువతి తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు అత్తింటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అత్తింటి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్ తమ సిబ్బందితో వచ్చి యువతి బంధువులను సముదాయించారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశం సంగారెడ్డి జోన్: ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్పై జిల్లా ప్రజలలకు, విద్యాసంస్థలలో అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శనివారం జిల్లా తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు పేరుతో ఆన్లైన్లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరని స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్టులు ఉండవు, ఫిజికల్ అరెస్టు మాత్రమే ఉంటుందన్నారు. వాణిజ్య పరంగా 20 కిలోల బరువు కలిగిన గంజాయిని అక్రమ రవాణా చేసిన స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
18 ఏళ్లుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో..
తూప్రాన్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని డ్రైవర్, ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. ఉగాది పండుగ రోజున పచ్చడితో ప్రారంభించి మృగశిర వరకు కొనసాగిస్తామన్నారు. నిత్యం నాలుగు డ్రమ్ముల మినరల్ నీటిని (2 వేల లీటర్లు) ప్రజలు తాగుతారన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం చాలా సంతోషంగా ఉందని, అందరం కలిసి ప్రజల కోసం ఓ మంచి పని చేస్తున్నామన్న ఆనందం కలుగుతుందన్నారు. -
మద్యం మత్తులో పోలీసులపై దాడి
ఐదుగురు యువకులపై కేసుశివ్వంపేట(నర్సాపూర్): మద్యం మత్తులో యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట పోలీసులు తూప్రాన్– నర్సాపూర్ హైవే పై పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో శనివారం సాయంత్రం డ్రంకై న్ డ్రైవ్లో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు బైక్లపై ఐదుగురు యువకులు హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో శివ్వంపేట వైపునకు వస్తుండగా పోలీసులు ఆపారు. మా బైక్లనే ఆపుతారా అని ఆ యువకులు పోలీసులను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులను పోలీస్స్టేషన్కు తరలించినప్పటికీ అక్కడ కూడా పోలీసులను దూషిస్తూ హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు బిజ్లిపూర్ గ్రామ శివారులో ఉన్న శ్రీవాస్ లైప్ సైన్స్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోమారం గ్రామానికి చెందిన ఎండీ రషీద్, గుంటూరు ప్రాంతానికి చెందిన బానావాత్ సైదానాయక్, బుక్య భీమానాయక్, గగ్లోత్ గోపినాయక్, బనావాత్ నందునాయక్ గా గుర్తించినట్లు చెప్పారు. -
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు
● మండు వేసవిలో ప్రజల దాహాన్ని తీరుస్తున్న నిర్వాహకులు ● బస్టాండ్లు, రోడ్లు, ప్రధాన చౌరస్తాలు, రైతు బజార్లు, తదితర చోట్ల ఏర్పాటు ● స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నిర్వహణ ● కుటుంబీకుల జ్ఞాపకార్థం, ప్రజాసేవకై మరికొందరు ● రూ.లక్షలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ అందజేత మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. మనిషి తన సంపాదనలో కొంతైనా మానవ సేవకు ఖర్చు పెడితే.. ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏముంటుంది. అన్నదానం, నేత్రదానం, అవయదానం, నీటిదానం ఇలా అనేక రూపాల్లో ప్రజలకు సేవ చేస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు అనేక మంది నీటి దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆస్పత్రులు, బస్టాండ్లు, రైతు బజార్లు, మార్కెట్లు, పాఠశాలల, షాపులు తదితర ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమ కుటుంబీకుల జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా చాలా ఏళ్ల నుంచి ప్రజల దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -
భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి
పెద్దశంకరంపేట(మెదక్): వంతెనపై నుంచి దూకడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దశంకరంపేట పెద్ద చెరువు వంతెనపై చోటు చేసుకుంది. పేట శిక్షణా ఎస్ఐ అరవింద్ కథనం మేరకు.. అల్లాదుర్గం మండలం రాంపురం గ్రామానికి చెందిన బేగరి అనూప్ (30)కు భార్య, కూతురు ఉన్నారు. అనూప్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి పెద్దశంకరంపేట నుంచి రాంపురం వైపు బైక్పై వెళ్తున్నాడు. అతడి ముందు బైక్పై చిల్వర గ్రామానికి చెందిన రాములు వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన అనూప్ రాములు వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఢీకొట్టినందుకు తనను ఏమైనా అంటారేమో అని భయంతో అనూప్ వంతెన పక్కన రహదారి ఉందనుకొని చీకట్లో దూకేశాడు. ఈ క్రమంలో కిందపడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి చేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్ శేర్ పంజాబీ దాబా సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం మేరకు.. రాజస్థా న్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా కౌడా గ్రామానికి చెందిన ప్రహల్లాద బగ్రియా(39) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. లారీని పంజాబీ దాబా వద్ద పార్కింగ్ చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపుకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొనగా ప్రహల్లాదకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఢీకొని మహిళ జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. జహీరాబాద్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సత్వార్ గ్రామానికి చెంది న మేతరి కమలమ్మ(55) శుక్రవారం పట్టణంలోని లిక్కర్ కోర్టు సమీపంలో కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. బైక్ ఢీకొన్న ప్రమాదంలో రైతు.. కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్న ఘనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాగం శ్రీనివాస్ (45) వరిగుంతం గ్రామ శివారులోని తన పొలం సమీపంలో గల రోడ్డు పక్కన ధాన్యాన్ని ఆరబెట్టాడు. బుధవారం సాయంత్రం ధాన్యం కుప్పల వద్ద టార్పాలిన్లను సరి చేస్తున్నాడు. ఇదే సమయంలో మెదక్ వైపు నుంచి బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి శ్రీనివాస్ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, కుమారుడు ఉన్నారు.స్నానానికి వెళ్లి యువకుడు జిన్నారం (పటాన్చెరు): స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, బాధితుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన మిరియాల శివ, అతడి తమ్ముడు ప్రసాద్ (20) రెండేళ్లుగా బొంతపల్లి గ్రామంలో చెత్తడబ్బాలు ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 1న కటింగ్ చేయించుకుంటానని వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం 8 గంటలకు గ్రామ శివారులోని అల్కా చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఒడ్డున ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించారు. స్నానం చేసేందుకు బట్టలు మెట్లపై పెట్టి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని తమ్ముడి మరణంలో ఎలాంటి అనుమానం లేదని పోలీసులకు తెలిపారు. -
ప్రజల దాహం తీర్చాలన్న ఉద్దేశంతోనే..
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: వేసవిలో పనుల నిమిత్తం గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్కు వచ్చే ప్రజల దాహం తీర్చాలన్న లక్ష్యంతోనే చలివేంద్రం నిర్వహిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. తన భర్త దివంగత వాకిటి లక్ష్మారెడ్డి స్మారకార్థం వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 20 ఏళ్ల నుంచి స్థానిక చౌరస్తాలో వేసవి సీజన్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు నెలలపాటు రోజుకు సుమారు 200 నుంచి 250 లీటర్ల చల్లటి నీళ్లు అందుబాటులో ఉంచుతామన్నారు. తన భర్త స్మారకార్థం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి పేద ప్రజల దాహం తీర్చడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు): అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నూతన రిజర్వాయర్ను, అలాగే.. ఉస్మాన్నగర్లో భగీరథ తాగునీటి రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన కాలనీలకు సైతం తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే బంధంకొమ్ములో రూ.10 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల పైపులైన్ సామర్థ్యంతో 30 వేల మంది జనాభాకు మంచి నీటిన అందించేందుకు రిజర్వాయర్ నిర్మించామని చెప్పారు. అలాగే.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.30కోట్లతో రిజర్వాయర్ను నిర్మించామని, త్వరలో 55 కాలనీలకు సురక్షితమైన తాగునీటి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు రిజర్వాయర్లను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీజీఎం చంద్రశేఖర్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్ పాల్గొన్నారు. త్వరలో రెండు రిజర్వాయర్లు ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
నీట్ పరీక్షకు సర్వం సిద్ధం
● హాజరు కానున్న 3,320 మంది అభ్యర్థులు ● కలెక్టర్ క్రాంతి వెల్లడిసంగారెడ్డి జోన్: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనుందని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,320 మంది పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు ఉంటాయన్నారు. పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో మూడు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు ఇతర సమస్యలపై కూడా ఒక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ పాల్గొన్నారు. -
రోజూ 300 నుంచి 350 లీటర్లు
దుబ్బాకలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం దుబ్బాక: పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీయేటా వేసవికాలంలో చలి వేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నారు. ప్రతిరోజూ 300 నుంచి 350 లీటర్ల చల్లని మినరల్ వాటర్ను అందిస్తూ 1,000 నుంచి 1,200 మందికి నీటిని అందిస్తున్నామని సివిల్ క్లబ్ అధ్యక్షుడు ఎర్రగుంట ప్రసాద్ సాక్షికి తెలిపారు. తమ వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. తమ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సైతం దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్నారని తెలిపారు. -
కుటుంబ సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని నార్సింగిలో శనివారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడ యాదయ్య(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో కొంత కాలంగా మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెంది యాదయ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జహీరాబాద్లో యువకుడు జహీరాబాద్ టౌన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్లో చోటు చేసుకుంది. శాంతినగర్కు చెందిన చాకలి తుకారాం(30) కుటుంబ కలహాల కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.కాశీనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.200 కోట్లతో లింగంపల్లి వంతెన
5న ప్రారంభోత్సవం ● మెదక్ ఎంపీ రఘునందన్ రావు రామచంద్రాపురం(పటాన్చెరు) : రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లి చౌరస్తాలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం పలు శాఖల అధికారులతో కలసి ఫ్లై ఓవర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా లింగంపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ నాయకత్వంలో జాతీయ రహదారిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ రహదారిని ఆరు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. మెదక్, చేవేళ్ల పార్లమెంట్ను కలుపుతూ సంగారెడ్డి జిల్లాకు ముఖద్వారంగా ఉన్న ఈ ఫ్లై ఓవర్ హైదరాబాద్లోనే ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. 5న సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ ప్రాంగణానికి చేరుకుంటారని అక్కడ నుంచి 4 గంటలకు రోడ్డు మీదుగా ఫ్లై ఓవర్ వద్దకు చేరుకొని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇక్రిశాట్లోని హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ నేతలు రవికుమార్, నర్సింగ్ గౌడ్, రాంబాబు గౌడ్, సుధాకర్, సంతోష్, ఎండ్ల రమేశ్, జాతీయ రహదారుల రీజనల్ అధికారి కృష్ణప్రసాద్, ఇన్స్పెక్టర్ జగన్నాథ్, ఉప కమిషనర్ సురేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డిలు పాల్గొన్నారు. -
49,559
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తులువెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం ● ఎంపీడీఓలకు బాధ్యతలుఅప్పగించిన ప్రభుత్వం ● లబ్ధిదారుల ఎంపిక కోసంజిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ● జూన్ 2న లబ్ధిదారులకుప్రొసీడింగ్స్ పంపిణీకి చర్యలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం కోసం నిరుద్యోగ యువత పెట్టుకున్న ధరఖాస్తుల క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ఈ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించింది. నిరుద్యోగ యువత తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయూత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. మొత్తం ఆరు రకాల యూనిట్లకు ఈ పథకం కింద సబ్సిడీల రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 49,559 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా బీసీ కార్పొరేషన్కు సంబంధించి 22,264 దరఖాస్తులు రాగా, ఎస్సీ కార్పొరేషన్కు 13,735 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్కు 4,004, మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించి 8,653 దరఖాస్తులు, మిగిలిన 903 దరఖాస్తులు క్రిస్టియన్, ఈబీసీ కేటగిరీల దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించి.. ఇందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉన్న వారు అర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కమిటీల్లో బ్యాంకర్లు ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో మండల స్థాయి కమిటీ లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తుంది. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీల్లో ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంకర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. జూన్ 2న ఈ పథకం ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈలోగా ఈ ప్రక్రియలన్నింటిని పూర్తి చేసేలా అధికారులను ఆదేశించింది.ఆరు క్యాటగిరీల్లో సబ్సిడీ సాయం లబ్ధిదారులకు ఆరు క్యాటగిరీల్లో ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. రూ.50 వేల యూనిట్లకు వంద శాతం సబ్సిడీ ఇస్తుండగా, రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు యూనిట్లకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల యూనిట్లకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ఇస్తారు. లబ్ధిదారులు మొత్తం 118 రకాల స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేందుకు వీలు కల్పించింది. చిన్న యూనిట్లు, ఇండస్ట్రీయల్ సర్వీస్ యూనిట్లు, ఆగ్రో బేస్డ్ యూనిట్లు, పశుసంవర్థకం, చిన్ననీటి పారుదల, హార్టికల్చర్, ట్రాన్స్పోర్టు వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. -
ఉచిత పాలీసెట్ శిక్షణ
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ జానకి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ఈనెల 5 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ నెల 13వ తేదీన పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన యువకుడికి డాక్టరేట్ పుల్కల్(అందోల్): మండల పరిధిలోని లాల్ సింగ్ నాయక్ తండాకు చెందిన ర మావత్ ప్రకాశ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా సాధించాడు. క్రీడల విభాగంలో ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ పర్యవేక్షణలో మేల్ ఖోఖో ప్లేయర్స్ మోటార్ ఫ్లయింగ్ ఎబిలిటీ తదితర అంశాలపై పరిశోధన చేసి పుస్తకాన్ని రాశాడు. నిరుపేద కుటుంబం నుంచి క్రీడల విభాగంలో నూతన ఆవిష్కరణ చేసిన ప్రకాశ్ను గ్రామస్తులు అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలను మండలిలో ప్రస్తావిస్తాఎమ్మెల్సీ అంజిరెడ్డి జహీరాబాద్ టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్లో ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ డీఏ, పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, ఈ బిల్లుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయమై శాసనమండలిలో మాట్లాడుతానని చెప్పారు. విద్యా, వైద్యం కీలకమైన శాఖలని, వీటికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. దేశహితం కోసం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్రావు, సురేష్, జహీరాబాద్ నాయకులు మల్లయ్యస్వామి, తుక్కప్ప, మొగులయ్య, మల్లయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతిజహీరాబాద్ టౌన్: నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు పొందారు. హద్నూర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మాణిక్, ఝరాసంగంకు చెందిన సుభాష్, జహీరాబాద్ టౌన్ పీఎస్లో పనిచేస్తున్న రాథోడ్ మోతిరాం. చిరాగ్పల్లికి చెందిన బాలకృష్ణలు హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. డీఎస్పీ రామ్మోహన్రెడ్డి శుక్రవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి వల్ల విధుల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్ఐలు పాల్గొన్నారు. పిల్లలపై శ్రద్ధ వహించాలి● జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. సంగారెడ్డిలోని శిశు గృహ, సఖి, భరోసా కేంద్రాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి బాగోగులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగించాలని, పిల్లలకు సరైన వసతులను అందించాలని చెప్పారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. -
అంగన్వాడీల బలోపేతం
జవాబుదారీకోసం ట్యాబ్లునారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పైమరీ ప్రారంభించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉండడం, దీనికి తోడు కనీస సౌకర్యాల లేమితో అంగన్వాడీలు కొనసాగుతుండడంతో వాటిపై దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించాని సంకల్పించింది. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు అక్షరజ్ఞానం నేర్పుతున్నారు. దీనితోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య సలహాలు అందజేస్తున్నారు. కానీ కేంద్రాలు కనీస మౌలిక సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రానున్న విద్యా సంవత్సరం లోపు కనీస సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. పక్కా భవనాలు లేని కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నారు. అలాగే.. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట్, సదాశివపేట్, పటాన్చెరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 1,04,106 మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నారు. జిల్లాలో 359 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా వాటిలో కొన్ని పక్కా భవనాలు కాగా మరికొన్ని పాఠశాల, పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు అన్ని కేంద్రాల్లోనూ మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలన్నింటినీ ఒక్కో కేంద్రానికి రూ.లక్ష ఖర్చుతో కల్పించనున్నారు. పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు ఒక్కో కేంద్రానికి రూ.లక్ష కేటాయింపు సదుపాయాలు కల్పిస్తున్నాం మౌలిక సదుపాయాలు లేని కేంద్రాల వివరాలు తయారు చేసి కలెక్టర్కు సమర్పించనున్నాం. వచ్చే అకాడమిక్లోగా మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల సెలవులు ప్రకటించారు. కేంద్రాల్లో భోజనం వండడం జరగదు. నేరుగా చిన్నారులు, లబ్దిదారుల ఇళ్ళకే నెలకు సరిపడా సరుకులను అందజేస్తాం. సెలవు రోజుల్లో టీచర్లు, ఆయాలు రిపోర్టులు సమర్పించడం, ఫీల్డ్ వర్క్, పిల్లల సర్వే చేపట్టడం జరుగుతుంది. – లలితకుమారి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, సంగారెడ్డి అంగన్వాడీ టీచర్లు ఇదివరకు మొబైల్ ఫోన్లు సఫరా చేశారు. తక్కువ సామర్థ్యం ఉన్న ఫోన్లు కావడంతో వాటిద్వారా వివరాల నమోదు ఇబ్బందికరంగా మారింది. దీన్ని నివారించేందుకు వారికి 5జీ నెట్వర్క్గల ట్యాబ్లను ఇవ్వనున్నారు. ఒక్కో ట్యాబ్కు రూ.20వేలను ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ ట్యాబ్ల ద్వారానే టీచర్లు, విద్యార్థులు, గర్భిణిలు, బాలింతల రోజు వారీ హాజరు, సరుకు రవాణా, చిన్నారుల బరువు, ఎత్తు, ఆరోగ్య సమచారం నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా జవాబుదారీ తనం పెరుగుతుందని భావిస్తున్నారు. -
క్షుద్రపూజలు కావు.. శాంతి హోమం
● బాలిక బలియత్నం అవాస్తవం ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని బీరువాలు తయారు చేసే కార్ఖానాలో క్షుద్ర పూజలు, బాలికను బలిచ్చే ప్రయత్నం జరిగిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని డీఎస్పీ సత్తయ్యగౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం సీఐ మహేశ్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ధర్మేంద్ర 25 ఏళ్ల క్రితం వలస వచ్చి బీరువాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా జరగక, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. దీంతో తమ రాష్ట్రానికి చెందిన మున్సిల్ అనే స్వామిజీని సంప్రదించగా.. శాంతిపూజ, లక్ష్మీపూజ నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. దీంతో గత నెల 29న రాత్రి 8 గంటలకు పూజకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయం తన స్నేహితుడు బట్కరి ప్రభుకు తెలుపగా.. అతను కూడా తన కూతురితో కలసి పూజలో పాల్గొన్నాడు. శాంతిపూజకు సంబంధించిన వస్తువులు సకాలంలో చేరకపోవడంతో పూజ ఆలస్యం ప్రారంభమైంది. అయితే.. పూజల గురించి శబ్ధాలు రావడంతో కొందరు ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు పంపించారని తెలిపారు. సీఐ మహేశ్గౌడ్ అదే రోజు రాత్రి సంఘటన స్థలానికి వెళ్లి పూజ హోమం చేస్తున్న వారిని విచారించగా.. క్షుద్రపూజలు కావని శాంతి హోమం చేస్తున్నట్లు తేలిందన్నారు. -
5 నుంచి రెవెన్యూ సదస్సులు
● పైలెట్ ప్రాజెక్టుగా ఒక మండలం ● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశంసంగారెడ్డి జోన్: ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ చలపతిరావు పాల్గొన్నారు. ప్రణాళిక బద్ధంగా ఓటరు జాబితా తప్పులు లేని ఓటరు జాబితా ప్రణాళిక బద్ధంగా రూపొందించాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమీక్షలె ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఫామ్7, చిరునామా మార్పు, పేరు సరిదిద్దేందుకు ఫామ్ 8 లను పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబంలో ఉండే, ఒకే గేటెడ్ కమ్యూనిటీ లో ఉండే వారందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉండేలా ప్రణాళిక చేయాలని కోరారు. నీట్ పరీక్ష కేంద్రాల పకడ్బందీ ఏర్పాట్లుజిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాల్లో 3,320 అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. శుక్రవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. రవాణా, తాగునీరు, పార్కింగ్, టాయిలెట్, వైద్య శిబిరాలు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇస్తారన్నారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. ఒకవేళ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నట్లయితే వెంటనే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 56739కు సమాచారం అందించాలని కోరారు. వడదెబ్బ నివారణపై అవగాహన వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
కలిసిరాని యాసంగి
● ఖరీఫ్తో పోల్చితే తగ్గిన పంట దిగుబడి ● ఎకరాకు 25 క్వింటాళ్లు కూడా రాని వైనం ● ఆందోళనలో అన్నదాతలు వట్పల్లి(అందోల్): ఈసారి యాసంగి సీజన్ అన్నదాతలకు కలిసి రాలేదు. నాట్లు వేసిన రోజు మొదలుకొని పంట చేతికొచ్చేదాకా వరిపై చీడపీడలు దాడులు చేశాయి. కాండం తొలుచు పురుగు వంటి తెగుళ్లు పంటను దెబ్బతీశాయి. పంటను కాపాడుకోవడానికి రైతు పరిమితికి మించి మందులు పిచుకారి చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. మందులు కొనుగోలు చేయడానికి అన్నదాతలు అప్పుల పాలయ్యారు. వ్యవసాయ పెట్టుబడులు పెరగడం రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం పంట చేతికి వస్తుండడంతో జిల్లా అంతటా వరి కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..ఎకరానికి 28 క్వింటాళ్లు రావాల్సిన ధాన్యం కేవలం 20– 22 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. నాలుగైదు క్వింటాళ్లు నష్టపోతున్నామని వాపోతున్నారు. 95వేల ఎకరాల్లో సాగు జిల్లాలో 95,690 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి పంటను సాగుచేశారు. తెగుళ్లు దాడి చేయడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. వరి పంట సాగు చేయడంలో ఒక్కో రైతు ఎకరానికి రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గడంతో వరి సాగు చేసిన రైతులకు పెట్టుబడి ఖర్చులు తలకు మించిన భారంగా మారి నష్టాలే మిగిలాయని రైతులు పేర్కొంటున్నారు. వరి సాగు ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి అయ్యేది. ఇప్పుడు దుక్కి మొదలుకొని మడి తయారీ విత్తనాలు చల్లడం, నాట్లు, ఎరువుల వేయడం, పురుగు మందుల పిచికారీ నుంచి పంట కోత వరకు ఎకరానికి రూ.22 వేల వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పెరిగిన ఖర్చులో అధిక శాతం ఎరువులు, పురుగు మందులు, కూలి రేట్లు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత దిగుబడులను బట్టి పెట్టుబడుల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
స్పందించకుంటే సమ్మెకు దిగుతాం
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ సంగారెడ్డి డిపో జేఏసీ చైర్మన్ ఎక్బాల్ పాషా తెలిపారు. శుక్రవారం సమ్మెకు సంబంధించిన వాల్పోస్టర్ను జేఏసీ రాష్ట్ర నాయకుడు పీకే మూర్తితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని చెప్పారు. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి ఎంపీ గుర్రాజ్, ప్రచార కార్యదర్శి విక్రమ్, అడ్వైజర్ భూపాల్రెడ్డి, కోకన్వీనర్ ఎండీ అత్తర్ అలీ, తులసీ, అనిల్ కుమార్ అంజయ్య ఏడీసీ ఎన్ ఎం దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకుల హెచ్చరిక -
పర్యావరణం.. బోధన వినూత్నం
రామకృష్ణ కృషి అభినందనీయం పర్యావరణ కాలుష్యంతో కలిగే అనర్థాలపై ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్, ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా విద్యార్థులకు బోధిస్తూ వారిని చైతన్య పరచడం అభినందనీయం. పర్యావరణ పరిరక్షణకు బాధ్యతతో కృషి చేస్తున్న హెచ్ఎం రామకృష్ణ, తోటి ఉపాధ్యాయులు సునీత, నవనీతలను అభినందిస్తున్నాను. – వెంకటేశ్వర్లు, డీఈఓ సంగారెడ్డి ● ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్,ప్రయోగాత్మకంగా వివరణ ● కాలుష్యంతో కలిగే అనర్థాలపై సూచనలు, సలహాలు ● నీటి వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ వాడకంపై అవగాహనలు ● పాఠశాలలో విరివిగా మొక్కలు నాటిస్తూ పలువురికి ఆదర్శం మన భావితరాలకు సురక్షితమైన నివాసయోగ్యమైన భూమిని అందించడం మన కర్తవ్యం.. పర్యావరణానికి(భూమికి) హాని చేసే పనులు చేయకుండా పరిరక్షణకు కృషి చేయడం మనందరి బాధ్యత అంటున్నారు మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రామకృష్ణ. ఆ దిశగా అడుగులు వేస్తూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్, ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా బోధిస్తున్నారు. విద్యార్థులను నిత్యం చైత్యనపరుస్తూ తల్లి లాంటి భూమిని కలుషితం చేయకుండా కాపాడాలని తన వంతు ప్రయత్నం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. – సదాశివపేట రూరల్(సంగారెడ్డి) పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ విద్యార్థులు స్వయంగా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు సైతం పర్యావరణంపై కార్యకలాపాలు, అసైన్మెంట్లను రూపొందించేలా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణానికి హాని కల్గించే అంశాలను పరిశోధించి, సమస్యను ఎంచుకొని, పరిష్కారం కోసం ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. పర్యావరణానికి సంబంధించిన ప్రదేశాలకు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న విషయాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పర్యావరణంపై వినూత్నంగా చేస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. స్టాప్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ను వాడేటప్పుడు 5ఆర్ ఐనా రిఫ్యూజ్, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రోట్లను గుర్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, కవర్లు, పేపర్లు బదులుగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, బట్టలు వాడమని ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని చూపిస్తూ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. ఆల్టర్నేటీవ్ ఎనర్జీ రిసోర్సెస్.. అంతరించని శక్తి వనరులైన పవన, సూర్యరశ్మి శక్తులను ప్రత్యామ్నాయ శక్తి వనరులుగా విరివిగా వాడుకోవాలని తద్వారా తరిగి పోయే శక్తి వనరులను కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు. కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్.. గాలి కాలుష్యం వల్ల కలిగే నష్టాలు, కాలుష్యానికి గల కారణాలను తెలిపి అదుపులో ఉంచడానికి అవసరమయ్యే సూచనలు తెలియజేస్తున్నారు. ఎక్కువగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల గాలి కాలుష్యం జరుగుతుందని చెబుతున్నారు. కాలుష్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి నడక, సైకిల్, బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణం చేయాలని, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు కార్ పూలింగ్ ద్వారా వెళ్లాలని, పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తున్నారు. మొక్కలు నాటించడం పాఠశాల తనిఖీ, సందర్శనకు వచ్చే అధికారులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిస్తూ అందులో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో విద్యార్థులతో మొక్కల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లినప్పుడు ప్రకృతి మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న హెచ్ఎం రామకృష్ణ నీటి వృథాను అరికట్టేలా.. నీటిని వృథా చేయకుండా ప్రతీ ఇంటిలోనూ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటిని మరలా వాడుకోవటానికి నీటిని నిల్వ చేసే నిర్మాణం, ఇంటిలో ఉన్న నల్లాల ద్వారా నీరు వృథా కాకుండా ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతలు ఎలా నిర్మించాలో వివరిస్తున్నారు. పంట పొలాలు, తోటల్లో డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటర్ను వాడుకోవాలని తెలిపారు. తడి, పొడి చెత్త వేరు విధానం రోజువారి ఇంటిలో నుంచి వెలువడే చెత్తలో ఉండే పేపర్లు, ప్లాస్టిక్, ఆర్గానిక్, ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులను అంశాల వారీగా వేరు చేసి చెత్త బుట్టల్లో ఎలా వేయాలో తడి,పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా వివరిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
హత్నూర(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హత్నూర మండలం గుండ్ల మార్చిన గ్రామానికి చెందిన జక్కుల ఎల్లయ్య(65) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం పోలీసులు దౌల్తాబాద్ శివారులో జక్కుల ఎల్లయ్య మృతి చెంది ఉన్నట్లు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి మృతదేహాన్ని గుర్తించి బోరున విలపించారు. అనుమానాస్పద స్థితిలో ఎల్లయ్య మతి చెందడంతో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ధూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు సంజన, మేఘన, శ్రావణి, ప్రణతి, సింధు ఎంపికై య్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులు 2 నుంచి 4 వరకు జగిత్యాల జిల్లాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపికకు కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ సతీశ్ను పలువురు అభినందించారు. మృతుడి ఆచూకీ లభ్యం వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ధర్మారం గ్రామశివారులో గురువారం లభ్యమైన మృతదేహం ఆచూకీ లభ్యమైంది. మృతుడు మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన రాజుల ఎల్లయ్యగా పోలీసులు నిర్ధారించారు. తూప్రాన్ పట్టణానికి చెందిన ఓ పండ్ల వ్యాపారి వద్ద పని చేస్తున్నాడని, వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో కాపలాగా ఉంచినట్లు గుర్తించారు. 29న మామిడి తోట నుంచి బయటకు వెళ్లి వడదెబ్బ కారణంగా ధర్మారం గ్రామ శివారులోని ఓ చెట్టు వద్ద మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. కుక్కల దాడిలో జింక మృతి నిజాంపేట(మెదక్): కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండల పరిదిలోని చల్మెడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం కుక్కలు జింకను వెంబడిస్తూ చల్మెడ గ్రామానికి చెందిన రైతు సంతోష్ రెడ్డి మామిడి తోటలోకి ప్రవేశించాయి. గమనించిన రైతు జింకను కుక్కల నుంచి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఇంటి ఎదుట పార్కు చేసిన స్కూటీ దహనం దుబ్బాకటౌన్: ఇంటి బయట పార్కు చేసిన స్కూటీని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు కథనం మేరకు.. చెల్లాపూర్ వార్డుకి చెందిన రాళ్లపేట శివ దినేశ్ తన స్కూటీని రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఇంటి బయట పార్కు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి బయట పెద్ద శబ్ధం రావడంతో కుటు ంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా స్కూటీ మంటల్లో కాలిపోయింది. కుటుంబ సభ్యులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే స్కూటీని దహనం చేశారని ఆరోపిస్తూ బాధితుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శామీర్పేటలో తిమ్మాపూర్ వాసి మృతి జగదేవ్పూర్(గజ్వేల్): జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామవాసి మేడ్చల్ జిల్లా మండల కేంద్రమైన శామీర్పేటలో మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోచంపల్లి హనుమంతు(48) మృతదేహం శుక్రవారం మేడ్చల్ శామీర్పేట కట్ట మైసమ్మ ముందు బ్రిడ్జి కింద లభ్యమైంది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు శామీర్పేటకు వెళ్లి మృతదేహాన్ని చూసి విలపించారు. హనుమంతు మృతిపై అనుమానం ఉందని విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతికి కాలుకు గాయాలు కావడంతో శామీర్పేట పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో శుక్రవారం సెల్ఫోన్ భద్రపరుచుకునే లైసెన్సు హక్కు కోసం, సీసీ కెమెరాల నిర్వహణ, షాపింగ్ కాంప్లెక్స్లో తాత్యాలికంగా వ్యాపారం చేసుకునేందు, పాత ఇనుప సామగ్రి విక్రయించేందుకు సీల్ట్ టెండర్ కమ్ బహిరంగ వేలములు నిర్వహించారు. టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్లో 2వ నంబర్ గల షాపునకు నెలకు ఒక్కింటికి రూ.7,400 హెచ్చుపాట పాడి పీ.నర్సింహులు దక్కించుకోగా, సెల్ఫోన్ భద్రపరుచుకునే లైసెన్స్ హక్కును అయినాపూర్కు చెందిన దండు రవి రూ.15,20,000 హెచ్చు పాట దక్కించుకున్నారు. ఆలయంలోని పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసేందుకు రాజు కిలో ఒక్కింటికి రూ.28 హెచ్చు పాటపాడి దక్కించుకోగా సీసీ కెమెరాల నిర్వహణ హక్కును రఘుపతి ఆలయ అధికారుల ఎస్టిమేట్ పై 4 శాతం తక్కువ కోడ్ చేసి హక్కును దక్కించుకున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఉద్యోగులు ,టెండర్దారులు తదితరలు పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వాస్పత్రులు
దుబ్బాక : కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం అందించేలా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు పక్కనే ఉన్న రైతుల పొలాల్లోకి నీరు వెళ్తుండటాన్ని గమనించి నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ డాక్టర్తోపాటు చాలా ఖాళీలు ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, అలాగే పలు సమస్యలను సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ కమిషనర్ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించి త్వరలోనే భర్తీ చేస్తామని హామీనిచ్చారు. రోగులు ప్రైవేట్కు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. డెలివరీల శాతం పెంచాలన్నారు. ఆస్పత్రి కార్పొరేట్కు దీటుగా ఉందని ప్రత్యేకంగా ప్రశంసించారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఆస్ప త్రి సమస్యలను వైద్యశాఖమంత్రి దామోదర్ రాజ నర్సింహ దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి సూచన మేరకు కమిషనర్ రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ అన్నపూర్ణ పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ దుబ్బాకలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి తనిఖీ -
దళిత యువకుడిపై దాడి అమానుషం
చేర్యాల(సిద్దిపేట): మతి స్థిమితం లేని దళిత యువకుడిపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐకి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. మండల పరిధిలోని వేచరేణి శివారు ఎల్లదాసునగర్ బేడ బుడగ జంగాల కులానికి చెందిన ఊపిరి అజయ్కుమార్కు మతి స్థిమితం సరిగాలేదన్నారు. ఇటీవల యువకుడిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్కు సంబంధించిన వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా కాళ్లు చేతులు కట్టి, కర్రలతో కొడుతూ, నగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం దారుణమన్నారు. అలాంటి వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మల్లిగారి యాదగిరి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామగళ్ల నరేశ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూమిగా రాజేందర్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బక్కెల్లి బాలకృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సనవాల ప్రసాద్, అంబేడ్కర్ సంఘం నాయకులు జేరిపోతుల పరుశరాములు, మల్లిగారి రాజు, షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి నాయకుడు బుట్టి భిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొండ్ర మల్లేశ్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మల్యాల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షుడు మధుకర్, ప్రేమ్కుమార్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి పోలీసులకు దళిత సంఘాల నాయకుల ఫిర్యాదు -
మంజీరా వాగులో దూకి యువకుడు ఆత్మహత్య
చిలప్చెడ్(నర్సాపూర్): మంజీ రా వాగులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిలప్చెడ్ మండలం చిట్కుల్ శివారులో చోటు చేసుకుంది. శుక్రవారం స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని చండూర్ గ్రామానికి చెందిన గుట్టమీది నవీన్ (28) కౌడిపల్లిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్లేది. భార్య (క్యాన్సర్) అనారోగ్యంతో బాధపడుతుండగా మనస్తాపం చెంది మంజీరా వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్ట్మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ నర్సింలును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. భార్య కాపురానికి రావడం లేదని.. చేగుంట(తూప్రాన్): భార్య కాపురానికి రావడం లేదని ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన చేగుంట జీవిక పరిశ్రమలో చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం మేరకు.. బీహార్ రాష్ట్రం వైశాలీ జిల్లా కై జూ గ్రామానికి చెందిన నందూలాల్ చౌదరీ(28) ఇటీవల చేగుంట జీవిక పరిశ్రమలో పని చేసేందుకు వచ్చాడు. పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన లేబర్ గదిలో ఉంటున్నాడు. నందూలాల్కు ఏడాది కిందట వివాహం కాగా భార్య కాపురం చేయడం లేదని తరుచూ బాధ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి నందూలాల్ పరిశ్రమలోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేగుంటలో నివాసం ఉంటున్న మృతుడి పెద్దనాన్న కుమారుడు విరుజ్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ తెలిపారు. -
భళా.. హస్త కళా మేళా
సంగారెడ్డి : జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిర్వహించిన చేనేత హస్త కళా మేళా పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేయగా వివిధ కాల చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచారు. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, వరంగల్, ఉప్పాడ, కంచి, ధర్మవరం, సిద్దిపేట, వెంకటగిరి చీరలు, కాటన్ చీరలు, చేనేత కాటన్, పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, కాటన్ ప్రింటెడ్ చీరలు, దుప్పట్లు, కర్టన్లు, భారీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. హస్త కళ వస్తువులైన కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు, మైసూర్ రోజ్వుడ్ వస్తువులు, వరంగల్ లెదర్స్, బంజారా ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ పెరల్స్, బ్యాంగిల్స్, చెక్క వస్తువులు, బ్లాక్ మెటల్స్, పెంబర్తి, ఇత్తడి వస్తు వులు, ఖాదీ గ్రామోద్యోగ్, హెర్బల్ ఉత్పత్తులు, మైసూర్ ఆగర్భత్తి, బెంగాలీ జూట్ బ్యాగులను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. వస్తువులను కొనేందుకు మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. -
దుకాణాల సముదాయం.. ప్రారంభమే తరువాయి
రూ 10 కోట్ల వ్యయంతో నిర్మాణం ● డీసీఎంఎస్కు భారీగా ఆదాయం! ● వ్యాపారులకు ప్రయోజనం జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.10 కోట్లతో నిర్మించిన దుకాణ సముదాయం వల్ల సొసైటీకి ఆదాయం రానుండగా వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది. పట్టణంలో డీసీఎంఎస్కు చెందిన 1.30 ఎకరాల స్థలం ఉంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఈ స్థలంలో రైస్మిల్, గోదాంలు నిర్మించారు. వాడకంలో లేక శిథిలమై పైకప్పు గోడలు, తలుపులు, కిటికీలు ఎక్కడిక్కడే దెబ్బతిన్నాయి. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ నిర్ణయించారు. శిథిలావస్థకు చేరిన కట్టడాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయించారు. రూ. 10 కోట్లడీసీఎంఎస్ నిధులతో బహుళ అంతస్థుల్లో 84 దుకాణాలు, రైతు సేవా కేంద్రం, రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. మూడు ఫ్లోర్లలో 120 దుకాణాలను నిర్మించాలని నిర్ణయించి మొదటి విడత 40 దుకాణాల పనులు ప్రారంభించారు. నిర్మాణం పనులు శరవేగంతో పూర్తి చేయించారు. దాదాపు పనులు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.అద్దెకు దుకాణాల కేటాయింపు వృథాగా ఉన్న డీసీఎంఎస్ స్థలంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెన్స్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం తరువాత అద్దెకు దుకాణాలను కేటాయిస్తాం. షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి వస్తే సొసైటీకి ఆదాయం పెరుగుతుంది. – ఎం.శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ -
‘నీట్’ కేంద్రాల వద్ద బందోబస్తు
సంగారెడ్డి జోన్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఈ నెల 4 జరుగనున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రభుత్వం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో 3,320 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మధ్యాహ్నం 2 గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 125 బీఎన్ఎస్ సెక్షన్ (144) అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకురాకూడదన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్తోపాటు గుర్తింపు కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. బంగారు, వెండి తదితర ఆభరణాలు షూస్, సాక్స్ ధరించకూడదని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, జోగిపేట్ సీఐ అనిల్ కుమార్, సంగారెడ్డి రూరల్ ఎస్.ఐ క్రాంతికుమార్ ఉన్నారు.ఎస్పీ పరితోశ్ పంకజ్ -
ప్రయోజనాలేవి?
పదవీ విరమణ..● బెనిఫిట్స్ డబ్బులు చెల్లింపుల్లో జాప్యం ● న్యాయపోరాటానికి రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా ట్రెజరీ కార్యాలయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జోగిపేట్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అయితే రావాల్సిన డబ్బులు ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అందలేదు. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగోలేక వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు రావాల్సిన డబ్బులను అధికారులు విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. తమకు రావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న వారు జిల్లాలో క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటివరకు సుమారు 50 మంది వరకు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారిలో విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి పైగా ఆలస్యం.. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 12 వేల మంది వరకు పనిచేస్తున్నట్లు అనధికారిక అంచనా. ఇందులో ప్రతీనెల సుమారు వంద మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. ఇందులో అత్యధికంగా ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్శాఖ, రెవెన్యూ, పోలీసుశాఖల ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. విద్యుత్, ఆర్టీసీ, మార్కెటింగ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కాకుండా మిగిలిన వారు ట్రెజరీ ద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందుతుంటారు. ఇలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ఫార్వర్డింగ్ అథారిటీ అధికారులు ఈ బెనిఫిట్స్కు సంబంధించిన పత్రాలను ట్రెజరీలకు పంపుతారు. ఈ ట్రెజరీ అధికారులు వాటిని ఆర్థికశాఖకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిచి ఆ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా పదవీ విరమణ చేసిన వారి ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే గత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో 2024 మార్చి వరకు పెద్దగా ఉద్యోగులు రిటైర్డ్ కాలేదు. మళ్లీ ఇప్పుడు పదవీ విరమణలు అవుతున్నాయి. అయితే వీరికి ఏడాదికిపైగా రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు అందకపోతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. రూ.20 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకురిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఈ డబ్బులు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలను అందిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. – చంద్రశేఖర్, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడుపదవీ విరమణ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాలం, బేసిక్పే, వారి కేడర్ ఆధారంగా రిటైర్మెంట్ డబ్బులు వస్తుంటాయి. కనిష్టంగా రూ.20 లక్షల నుంచి రూ.1.40 కోట్ల వరకు వారికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్క్యాష్మెంట్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇలా వివిధ రూపాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించాలి. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మొత్తాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
సానబెడుతూ.. సాధన చేయిస్తూ
● తెలంగాణ రైజింగ్ పేరుతోవేసవి శిక్షణ శిబిరాలు ● విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతీ మండల కేంద్రంలో ఏర్పాటు ● వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ● విద్యార్థుల నుంచి స్పందన భేష్ సంగారెడ్డి జోన్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అందుకనుగుణంగా ప్రతీ మండలంలో వీటిని నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా వివిధ అంశాల్లో శిక్షణనివ్వనున్నారు. సెలవులు సద్వినియోగం చేసుకునే దిశగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే దిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 7 నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న బాల బాలికలకు క్యాంపులలో 15రోజులపాటు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతీ మండల కేంద్రాల్లో ఈ శిక్షణ శిబిరాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 22 మండలాల్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతుండగా...మిగతా మండలాల్లో కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 1,348 ప్రభుత్వ పాఠశాలలో ఉండగా ఆయా పాఠశాలల్లో 1.35లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరితోపాటు ప్రైవేట్ పాఠశాలలు చదువుకునే విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నారు. పలు అంశాలపై శిక్షణ క్యాంపులో భాగంగా బాలబాలికలకు కుట్లు, అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, చిత్ర లేఖనం, డ్యాన్స్, కంప్యూటర్ శిక్షణ, యోగ, చేతిరాత అభివృద్ధి పరుచుకోవడం, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా మండలాల్లో స్థానికంగా ఉన్న వనరులను దృష్ట్యా ఆయా అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మండలాలలో శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపులో ఒక రోజులో సుమారు 400 మంది విద్యార్థుల వరకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ప్రతీ శిబిరానికి రూ.50 వేలు కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మర్ క్యాంపునకు జిల్లాలో తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణ శిబిరంగా పిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసి క్యాంపు నిర్వహణకు ప్రతి కేంద్రానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలోని 28 క్యాంపులకు రూ.14లక్షలు మంజూరయ్యాయి. మంజూరయిన నిధులతో శిక్షణ అందించే వారికి వేతనం, స్నాక్స్, అవసరమయ్యే సామగ్రి కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చిత్రలేఖనం నేర్చుకుంటున్నా ఈ శిబిరంలో నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నా. క్యాంపులో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. చదువుకోవటంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. – గాయత్రి, చేర్యాల గ్రామం, కంది మండలంవిద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో క్యాంపులు కొనసాగుతున్నాయి. అర్హులైన బాలబాలికలు సద్వినియోగం చేసుకుని రాణించాలి. వేసవి శిబిరాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ మండలంలో క్యాంపు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి -
కేతకీలో భక్తుల సందడి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి, గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయన పూజారులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీకాలపై రైతులకు అవగాహన కల్పించాలిజేడీఏ వసంతకుమారి కంది(సంగారెడ్డి): గాలికుంటు టీకాలపై రైతులకు అవగాహన కల్పించాలని పశువైద్య శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి సూచించారు. మండల కేంద్రమైన కందిలో గల పశువైద్యశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ...పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉండేందుకు వేసే టీకాలను ఆవులు,గేదెలకు తప్పకుండా వేయించాలన్నారు. రోగాల బారిన పడిన పశువులకు జాప్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలన్నారు. అనంతరం రికార్డులను జేడీఏ పరిశీలించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి జీనత్భానుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలిసంగారెడ్డి: చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని కేంద్రం ఆమోదించాలన్నారు. దేశ వ్యాప్తంగా కులగణనపై పోరాడిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, బాలు ఉన్నారు. వైద్య సేవలపై ఆరాజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై గాయత్రీదేవి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీలక్స్ బస్సులలో రాయితీనారాయణఖేడ్: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ చార్జీల్లో 10% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నెలవారీ సీజన్ టికెట్పై 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఖేడ్ నుంచి జేబీఎస్కు రూ.230 చార్జీకి గాను రాయితీతో రూ.210లు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఖేడ్ నుంచి లింగంపల్లికి రూ.210కిగాను రూ.190, ఖేడ్ నుంచి సంగారెడ్డికి రూ.160కి గాను రూ.140 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అదేవిధంగా ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు గల వివిధ స్టేజీలకు మంత్లీ సీజన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు డీఎం చెప్పారు. -
నిజమైన ప్రేమకు అర్థం
దుబ్బాకటౌన్ : ఏడడుగులు నడవడమే కాదు.. జీవితంతాం తోడుగా ఉంటారనడానికి ఈ దృశ్యమే నిదర్శనం. మానవత్వాలే మంటలో కలుస్తున్న నేటి సమాజంలో వృద్ధాప్యంలో సైతం నాకు నువ్వు, నీకు నేను అని ప్రేమతో తన భార్యకు తినిపిస్తున్న దృశ్యం దుబ్బాకలో ‘సాక్షి’ కంటపడింది. భార్యాభర్తల అనే పదానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరం కోహెడరూరల్(హుస్నాబాద్): గతంలో తండ్రి.. రెండు రోజుల కిందట తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర ఘటన మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఉత్కం బాలయ్య 13 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భార్య ఉత్కం కవిత(40) కూలీ పని చేసుకుంటూ కూతురు వైష్ణవి(17), కుమారుడు రామ్చరణ్(15)ను పోషించుకుంటుంది. కవిత బుధవారం ఉపాధి హామీ కూలీకి వెళ్లి వడదెబ్బతో రాత్రి మృతి చెందింది. దీంతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. అమ్మమ్మ కూడా వృద్ధురాలు కావడంతో పిల్లలు ఎలా బతకాలి దేవుడా అని ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆ చిన్నారులను ఆదుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు దాతలను కోరుతున్నారు. సాయం చేయాలకునే వారు ఫోన్పే నంబర్ 98489 24347 పోలు శ్రీనివాస్, గుగూల్ పే నంబర్ 96663 38616 బండిపెల్లి శ్రీకాంత్కు పంపగలరని కోరారు. -
రక్త దాతలు.. ఈ కవలలు
జహీరాబాద్ టౌన్: అన్నిదానాల్లో కెల్లా.. రక్తదానం గొప్పది. మనమిచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతోంది. రక్తం అందక చనిపోయే వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్త దానం చేసే దాతలు చాలా మంది ఉన్నారు. కొంత మంది అనేక సార్లు రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే జహీరాబాద్ పట్టణానికి చెందిన ఈ ఇద్దరు అన్నాదమ్ముళ్లు. జహీరాబాద్ పట్టణంలోని విద్యుత్ కాలనీకి చెందిన జయప్రకాశ్, విజయ్కమార్ ఇద్దరూ కవలు. ఇద్దరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. పేదరికం కారణంగా తండ్రి చాలా కష్ట పడి పిల్లలను చదవించారు. బీహెడ్ పూర్తి ఒకరు 2008, మరొకరు 2012 సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు. వీరికి దేశ భక్తి, దైవ భక్తి ఎక్కువే. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జహీరాబాద్ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారని తెలిస్తే చాలా రక్తదానం చేయడానికి ముందుంటారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. ఇప్పటి వరకు 20 సార్లకు పైగా రక్తదానం చేశారు. జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీలో బసవ మండపంలో రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. 20 సార్లకు పైగా రక్తదానం ఆదర్శంగా నిలుస్తున్న జహీరాబాద్ పట్టణానికి చెందిన అన్నాదమ్ముళ్లు -
నిర్వహణ బరువు ఆహ్లాదం కరువు
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి పట్టణంలోని 10వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొదట్లో చిన్నారులు ఆడుకునేందుకు వస్తువులు, పెద్దలు వాకింగ్, జాగింగ్ చేయడానికి నడక దారి ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో జనంతో వనం కళకళలాడుతుండేది. వృద్ధులు కూడా కొంత సేపు సేదతీరేవారు. పలువురు యోగా సనాలు వేసుకునేవారు. ప్రస్తుతం మాత్రం వనం నిర్వహణ అధ్వానంగా మారింది. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. చుట్టుపక్కల వారు చెత్త వేయడంపాటు పార్కులో ముళ్లపొదలు పెరిగి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారింది. వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పార్కుకు వచ్చేవారు. కానీ అక్కడ వసతులు లేక అటువైపు చూడటం లేదు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. వెంటనే అధికారులు పార్కును శుభ్రం చేయించి, చెత్త కుప్పలను తొలగించి పాడైన వస్తువులను బాగు చేయించాలని కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
వట్పల్లి(అందోల్): అను మానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన అందోలు మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్, ఏసయ్యకి చెందిన మామిడి తోటను పుల్కల్ మండలం సింగూరు గ్రామానికి చెందిన దాసరి సురేశ్ (32) లీజుకు తీసుకున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం తోటలో మామిడి చెట్లకు నీరు పట్టేందుకు వెళ్లాడు. సురేశ్ చీకటైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భార్య శిరీష గురువారం మామిడి తోటకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పక్కన ఉన్న పొలాల వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త మృతిపై అనుమానంగా ఉందని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.చికిత్స పొందుతూ మరో యువకుడుమద్దూరు(హుస్నాబాద్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నజీర్ కుమారుడు ఇర్ఫాన్(20) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మూడు సబ్జెక్ట్ల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మస్తాసాపానికి గురై 29న ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్నాడు. తీవ్ర గాయాలైన యువకుడిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.సంగారెడ్డి పట్టణంలో మహిళసంగారెడ్డి క్రైమ్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని మార్చ్నగర్ కాలనీకి చెందిన చాకలి దశరథ్, మాధవి దంపతులు. దశరథ్ సంగారెడ్డి మున్సిపాలిటీలో వృత్తిరీత్యా కాంట్రాక్ట్గా పని చేస్తున్నాడు. మూడేళ్ల కిందట మాధవి తన భర్తతో గొడవ తల్లిగారిల్లు కంది మండలంలోని ఇంద్రేశం గ్రామానికి వెళ్లింది. తన దగ్గర ఉన్న బంగారం, డబ్బుతో హోటల్ పెట్టింది. తల్లి 3 నెలల కిందట చనిపోయింది. బిజినెస్లో నష్టాలు రావడం, తల్లి మరణంతో మనస్తాపానికి గురై 15 రోజుల కిందట భర్త వద్దకు వచ్చి ఉంటుంది. గురువారం దంపతుల మధ్య బంగారం విషయమై గొడవలు జరిగాయి. దశరథ్ పనికి వెళ్లి ఇంటికొచ్చేసరికి భార్య ఇంటి ఎదుట గల రేకుల షెడ్డుకు ఉరేసుకొని కనిపించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యక్తి పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్ఐ కోటేశ్వర్ రావు కథనం మేరకు.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింపోని పార్క్ హోమ్స్కు చెందిన కిరణ్ కుమార్ గత నెల 28న ఇంటి నుంచి స్కూటీ తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై భార్య అనిత గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పనికెళ్లి మరో వ్యక్తి మెదక్ మున్సిపాలిటీ: మెదక్ వెంకట్రావునగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల షేక్ మౌలానా గత నెల 29 నుంచి కనిపించకుండా పోయినట్లు పట్టణ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేసీ్త్రగా పని చేసే మౌలానా పని కోసమే వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య సీమా ఫాతిమా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరులో వివాహిత పటాన్చెరు టౌన్: వివాహిత అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కంగ్టి మండలానికి చెందిన సౌందర్యకు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ తండాకు చెందిన కేతావత్ రామచందర్ తో వివాహం జరిగింది. వివాహం అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్కి వచ్చి నివాసం ఉంటున్నారు. గత నెల 24న సౌందర్య కనిపించడం లేదని రామచందర్ అత్తామామలకు చెప్పాడు. సౌందర్య కుటుంబ స భ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. మద్యానికి బానిసైన రామచందర్ నిత్యం తమ కూతురిని హింసించేవాడని, అతడిపై అనుమానం ఉందని బాధితురాలి తల్లి బుజ్జి బాయి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నంగునూరు(సిద్దిపేట): రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు గట్టమల్యాల ఉన్నత పాఠశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. గురువారం వారు మట్లాడుతూ.. పాఠశాలకు చెందిన ఈశ్వరి, వైష్ణవి, కిరణ్వి, షణ్ముఖ ప్రియ, డీ.అను, అశ్విని, హరిణి ప్రియ, అఖిల మంచి ప్రతిభ కనబర్చారన్నారు. 2 నుంచి జగిత్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. విద్యార్థుల కోరిక మేరకు గట్లమల్యాలలో వారం రోజులపాటు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి సాఫ్ట్బాల్ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించామన్నారు.ట్రాన్స్ఫార్మర్ ధ్వంసంచిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్వైరుతోపాటు ఆయిల్ను చోరీ చేశారు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో చోటు చేసుకుంది. సూరారం గ్రామ శివారులోని పంట పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో ధ్వంసం చేశారు. విలువైన కాపర్ వైరు, ఆయిల్ చోరీ చేసినట్లు గుర్తించిన రైతులు ట్రాన్స్కో లైన్మెన్ భిక్షపతి దృష్టికి తీసుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి చోరీ చేసిన ఘటనపై పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.8న పుస్తకాల ఆవిష్కరణసిద్దిపేటకమాన్: ప్రముఖ కవి అలాజ్పూర్ కిషన్ రచించిన ‘పేగు తెగిన పాట’, ‘వడిసెల’ కవిత్వం పుస్తకాల ఆవిష్కరణ 8న పట్టణంలో జరుగనున్నట్లు మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కె.రంగాచారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రెస్క్లబ్లో జరగనున్న ఈ సభకు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. సాహితీ ప్రియులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, శ్రీనివాస్, అశోక్, రాజ శేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంవెల్దుర్తి(తూప్రాన్) : మండలం పరిధి ధర్మారం అటవీ ప్రాంతంలోని నముండ్ల కుచ్చలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన సాయిరాం అనే వ్యక్తి గమనించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ రాజు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని, తలపై తెలుపు రంగు వెంట్రుకలు, ఒంటిపై ఎరుపు రంగు బనియన్, నలుపు రంగు ప్యాంటు ఉందన్నారు. కుడి చేతిపై ఇటికె అంజయ్య అనే పేరుతో పచ్చబొట్టు ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెల్దుర్తి పోలీ స్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించండితూప్రాన్: మున్సిపల్ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, నీటి పారుదల శాఖ వద్ద ఉన్న మొత్తం 173 పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లై ఓవర్పై నుంచి దూకి కూలీ ఆత్మహత్య
రామచంద్రాపురం(పటాన్చెరు): ఫ్లై ఓవర్పై నుంచి దూకి కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని లింగపల్లి చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన చంద్రప్ప(38) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి వెంకటమ్మ పది రోజుల కిందట తెల్లాపూర్లో నివాసముండే పెద్ద కుమారుడు అంజప్ప వద్దకు వచ్చింది. గత నెల 29న ఫోన్ చేసి నేను కూడా అన్న ఇంటి వద్దకు వస్తానని చెప్పాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో చంద్రప్ప లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించి ఫ్లై ఓవర్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రప్ప కొంతకాలంగా అప్పులు చేసి తీర్చలేకపోవడం, ఒంటరితనం వల్ల మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కంటే ముందు లింగంపల్లి చౌరస్తాలో వేగంగా వస్తున్న బస్సు ముందుకు చంద్రప్ప దూసుకుపోగా డ్రైవర్ బ్రైక్ వేసినట్లు స్థానికులు తెలిపారు. తర్వాత ఫ్లై ఓవర్పై నుంచి దూకినట్లు పేర్కొన్నారు.మానసిక వేదనతో వ్యక్తి..వర్గల్(గజ్వేల్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. వర్గల్కు చెందిన దాచ నాగరాజు(34)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయి గురువారం ఉదయం పెంట్ హౌజ్ రేకుల షెడ్లో స్నానం చేసి వస్తానని వెళ్లాడు. అక్కడే పైపునకు ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.కుటుంబ కలహాలతో ఉరేసుకొనిహత్నూర (సంగారెడ్డి): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర మండలం మంగాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగాపూర్ గ్రామానికి చెందిన మాదారం దుర్గయ్య (36) అతడి తమ్ముడు ఆగు భాస్కర్ కుటుంబీకులు వేర్వేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ తరచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. బుధవారం దుర్గయ్య –భాస్కర్ కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. గ్రామ పెద్దలు మాట్లాడి ఇరువురికి నచ్చజెప్పారు. గురువారం గ్రామ శివారులోనే ఓ వ్యవసాయ పొలం వద్ద వెళ్లిన దుర్గయ్య చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానికులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు. -
మేం మళ్లీ రాలేం..
రెవెన్యూ శాఖపై ఆసక్తి చూపని పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3,386 మంది ● జీపీవోలుగా వెళ్లేందుకు 562 మంది దరఖాస్తు ● అర్హత సాధించింది 481 మంది ● పాత సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్సాక్షి, సిద్దిపేట: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పాలనను మళ్లీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో పని చేసిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలు తిరిగి మాతృశాఖలోని వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి గత నెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో, ఫిజికల్గా కలెక్టరేట్లలో దరఖాస్తులను స్వీకరించారు. పాత సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం, జాబ్ ప్రమోషన్ చాట్ను ప్రకటించకపోవడంతో జీపీవోలుగా వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. 562 మంది దరఖాస్తు ఉమ్మడి మెదక్ జిల్లాలో పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు 3,386 మంది విధులు నిర్వర్తించేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టంను తీసుకొచ్చింది. అందుకోసం క్షేత్రస్థాయిలో రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున జీపీవో పోస్టును మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,365 రెవెన్యూ గ్రామాలున్నాయి. తిరిగి రెవెన్యూ శాఖలోకి వెళ్లేందుకు 562 మందే దరఖాస్తు చేశారు. వీఆర్ఏలు అయితే ఇంటర్ పాసై ఉండటంతోపాటు ఐదేళ్ల సర్వీస్/డిగ్రీ ఉంటే ఎలాంటి సర్వీస్ అవసరం లేదు. దరఖాస్తుల్లో పొందుపరిచిన అర్హతలను పరిశీలించగా 81 మందివి రిజక్ట్ కాగా 481 మంది పరీక్షకు అర్హత సాధించారు. పాత సర్వీసు పరిగణించకపోవడంతో వీఆర్వో, వీఆర్ఏగా చేసిన సర్వీసు, ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ సర్వీసులను పరిగణలోకి తీసుకోమని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జీపీవోలకు జాబ్ చార్ట్ ప్రకటించారు. కానీ ప్రమోషన్ చార్ట్ ప్రకటించలేదు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలో మూడేళ్లుగా జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయా శాఖలలో ప్రమోషన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీపీవోలుగా పని చేసేందుకు తక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారని తెలుస్తోంది. సర్వీసు పరిగణలోకి తీసుకోవాలి వీఆర్వో, వీఆర్ఏ పాత సర్వీసుతోపాటు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సర్వీసును పరిగణలోకి తీసుకుంటే చాలా మంది వచ్చే అవకాఽశం ఉండేది. అలాగే జీపీవోలకు సంబంధించి ప్రమోషన్ చార్ట్ను సైతం ప్రకటించాలి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పాత సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి. – ఆకుల రవీందర్, అధ్యక్షుడు, పూర్వపు వీఆర్వోల సంఘం సీసీఎల్ఏకు పంపించాం పాత వీఆర్వోలు, వీఆర్ఏలు జీపీఏలుగా వచ్చేందుకు దరఖాస్తు చేసిన వాటిని పరిశీలించాం. సీసీఎల్ఏ తెలిపిన ప్రకారం అర్హతలు ఉన్న వారి పేర్లను సీసీఎల్ఏకు పంపించాం. – అబ్దుల్ రహమాన్, ఏవో, కలెక్టరేట్ -
సమ్మర్ క్యాంపునకు అపూర్వ స్పందన
విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. నిన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ప్రస్తుతం సమ్మర్ క్యాంపులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు.బెజ్జంకిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఏప్రిల్ 24 నుంచి 3 తేదీ వరకు ఎంఈఓ మహతీ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, డ్రాయింగ్, కరాటే, కాలీగ్రాఫీ, ఎథిక్స్, అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు వేసవిలో బయట తిరగకుండా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని, సృజనాత్మకతని పెంపొందిస్తారని తల్లిండ్రులు సైతం ఆసక్తిని కనబరుస్తూ పిల్లలను పంపుతున్నారు.180 మంది హాజరుబెజ్జంకితోపాటు కల్లెపెల్లి, ముత్తన్నపేట, వీరాపూర్, పోతారం, రేగులపల్లె, దాచారం గ్రామాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు 180 మంది హాజరవుతున్నారు. మరింత మంది ఎన్రోల్ చేసుకుంటారని కో ఆర్డినేటర్ వడ్లకొండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాద్యాయులు శిక్షణ ఇస్తున్నారు. -
తొలి ప్రయత్నంలోనే జడ్జిగా..
నంగునూరుకు చెందిన మల్యాల సాహితీ ప్రతిభ నంగునూరు(సిద్దిపేట): తెలంగాణ హైకోర్టు జడ్జి కోసం నిర్వహించిన వివిధ ప్రక్రియలో నంగునూరుకు చెందిన మల్యాల సాహితీ విజ యం సాధించింది. సిద్ది పేట జిల్లా నంగునూరుకు చెందిన మల్యాల అన్నపూర్ణ, రాజు పెద్ద కూతురు మల్యాల సా హితీ బెంగళూర్లోని రేవా యూనివర్సిటీలో లా విద్య పూర్తి చేసింది. తెలంగాణ హైకోర్ట్ జడ్జి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దర ఖాస్తు చేసుకుంది. వివిధ దశల్లో జరిగిన ప్రక్రియలో విజయం సాధించడంతో తొలి ప్రయత్నంలోనే జడ్జిగా నియామకమైంది. సాంస్క ృతిక పోటీల్లో యువకుడి ప్రతిభకౌడిపల్లి(నర్సాపూర్): తెలంగాణ యువత ఆధ్వర్యంలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో కౌడిపల్లి యువకుడికి సోలో డ్యాన్స్లో ప్రథమ బహుమతి లభించింది. 26, 27 తేదీల్లో కరీంనగర్ జమ్మికంటలో వివిధ విభాగాలలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ పోటీలు నిర్వహించింది. ఇందులో కౌడిపల్లికి చెందిన సంధ్యగల్ల లోకేశ్ సోలో డ్యాన్స్ సీనియర్ విభాగంలో పోటీల్లో పాల్గొనగా ప్రథమ బహుమతి సాధించాడు. దీంతో జబర్దస్త్ ఆర్టిస్ట్ వెంకీతోపాటు నిర్వాహకుల నుంచి బహుమతి అందుకున్నట్లు లోకేశ్ తెలిపాడు. లోకేశ్ ప్రస్తుతం ట్రిపుల్ఈ డిప్లొమా పూర్తిచేశారు. ఉత్తమ సేవలకు ఆర్టీసీ ప్రగతి చక్రం పురస్కారాలుజహీరాబాద్: ఉత్తమ సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. బుధవారం స్థానిక బస్డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ క్యాష్ అవార్డులతోపాటు ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. ప్రథమ బహుమతి కింద రూ.800, ద్వితీయ బహుమతి కింద రూ.600, తృతీయ బహుమతి కింద రూ.400 అందజేశారు. ఉద్యోగ విరమణ పొందుతున్న మొగులప్ప, వెంకన్న, వహీద్, ప్రమీలలకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్కుమార్, గ్యారేజీ ఇన్చార్జి తిరుమలేశ్, సిబ్బంది పాల్గొన్నారు. బసవేశ్వరుడి ఆశయ సాధనకు కృషి చేయాలి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి సంగారెడ్డి జోన్: బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా రెడ్డి సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో బసవేశ్వర 892వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీజీఐఐసీ చైర్పర్సన్తో పాటు అధికారులు లింగాయత్ సభ్యులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవకు అహర్నిశలు పాటుపడిన మహానీయుడని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజ రాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, జిల్లా లింగాయత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్నారిపై కుక్కల దాడి అల్లాదుర్గం(మెదక్): మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన అల్లాదుర్గంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు.. అల్లాదుర్గానికి చెందిన మస్తాన్ భేరేషి కూతురు పాతీయ (3) ఇంటి ఎదుట ఆడుకుంటున్న తరుణంలో గుంపులుగా వచ్చిన కుక్కలు చిన్నారి పై దాడి చేశాయి. కుటుంబీకులు, కాలనీవాసులు వచ్చి కుక్కలను తరమివేశారు. అప్పటికే చిన్నారి తలపై, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జేసీబీ, బైక్ ఢీకొని యువకుడు తూప్రాన్: జేసీబీ, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని నర్సంపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి గ్రామానికి చెందిన బాలక్రిష్ణ(22) మేసీ్త్ర పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నర్సంపల్లి మీదుగా గజ్వేల్కు బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న జేసీబీ ఢీకొని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. మినీ వ్యాను బోల్తా పడి ఒకరు..చేగుంట(తూప్రాన్): మినీ వ్యాను బోల్తాపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మాసాయిపేట మండలం బొమ్మారం గేటు సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ముక్రా గ్రామానికి చెందిన ఖలీల్బాషా(38) మినీ వ్యాను డ్రైవర్గా పని చేస్తున్నాడు, బుధవారం తెల్లవారు జామున బాలానగర్లో సరుకులు లోడ్ చేసుకొని భీంగల్కు వస్తున్నాడు. ఈక్రమంలో బొమ్మారం గేటు వద్ద వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాను నడుపుతున్న ఖలీల్బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ను ట్రాక్టర్ ఢీకొని మరొకరు ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం కొత్తురు గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. మండలంలోని కొక్కొండ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు(40) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. బుధవా రం బైక్పై మేడ్చల్కు పెయింటింగ్ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికొస్తున్నాడు. మార్గమధ్య లో కొత్తూరు బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమ్మరి రాజు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచారం కేసులో.. రామచంద్రాపురం(పటాన్చెరు): బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం బుధవారం తీర్పు నిచ్చింది. కొల్లూరు పోలీసుల కథనం మేరకు.. 2023 సెప్టెంబర్లో ఝరాసంగం మండలం భోజ్యనాయక్ తండాకు చెందిన బానోత్ శ్రీను డాన్స్ అసిస్టెంట్ మాస్టర్గా పని చేస్తున్నాడు. తెల్లాపూర్లోని విల్లాస్లో పిల్లలకు డాన్స్ నేర్పించడానికి వచ్చి డాన్స్ గ్రూపులోని ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాటి ఇన్స్పెక్టర్ సంజయ్, ప్రస్తుత ఇన్స్పెక్టర్ రవీందర్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సుభాష్, కోర్టు కానిస్టేబుల్ నర్సింహులు, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి సరైన సాక్షాధారాలను సేకరించి సంగారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ కేసును విచారించిన ఫస్ట్ అదనపు డిస్టిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి కే.జయంతి నిందితుడు భానోత్ శ్రీనుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.సూరరెడ్డి వాదించారు. నిందితుడికి శిక్ష పడేలా చూసిన పోలీస్ అధికారులను మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. -
ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో గుర్తు తెలియ ని ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్ఐ గాలయ్య కథనం మేరకు.. దుర్గమ్మ ఆలయం ముందు ఉన్న మంజీరా పాయల వద్దకు సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి బయటికి తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ నిక్కర్ మాత్రమే ఉందని, మద్యం మత్తులో స్నానానికి వెళ్లి నీట మునిగి ఉంటాడని అనుమానిస్తున్నారు. మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 87126 57920 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
● హైదరాబాద్ నుంచి కర్ణాటకకు తరలింపు ● పోలీసుల అదుపులో నిందితుడు జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. చిరాగ్పల్లి సమీపంలో గల సహారా దాబా వద్ద 65వ జాతీయ రహదారిపై సీసీఎస్ బృందంతో కలిసి మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఇండిగో కారును తనిఖీ చేయగా డిక్కీలో గోధుమ రంగు కవర్ చుట్టి 40 ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితుడు, కారు డ్రైవర్ జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్ గ్రామానికి చెందిన జీ.తిరుమలేశ్గా గుర్తించారు. నిందితుడి దూరపు బంధువైన బీదర్కు చెందిన గుండప్ప చెప్పినట్లుగా రూ.50 వేలకు ఆశ పడి కారులో గంజాయిని బగ్దల్లో ఉన్న వినోద్కు ఇచ్చేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు 80 కిలోల వరకు ఉంటుందని, రూ.20 లక్షలు విలువ చేస్తుందని ఎస్ఐ వివరించారు. కారుతోపాటు సెల్ఫోన్ సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. -
పేదింటి సరస్వతీ పుత్రులు
బుధవారం విడులైన పదవ తరగతి ఫలితాల్లో పేదింటి సరస్వతీ పుత్రులు మెరిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. ఇంట్లో కష్టాలు ఉన్నా ఎదుర్కొని అత్యుత్తమ మార్కులు సాధించారు. రైతు బిడ్డ మండల టాపర్ చిన్నశంకరంపేట(మెదక్): నిరుపేద రైతుబిడ్డ పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్గా నిలిచింది. చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన క్రిష్ణ, భాగ్య కూతురు రాజేశ్వరీ రోజు రెండు కిలోమీటర్లు కాలినడకన వచ్చి మడూర్ జెడ్పీపాఠశాలలో చదివింది. కష్టం ఎదురైనా చుదువును ఇష్టంగా చేసుకొని పదవ తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాంధించి మండల టాపర్గా నిలిచింది. తన కూతురిని ట్రిపుల్ ఐటీ చదివించాలనే కల ఉందని విద్యార్థి తండ్రి కృష్ణ తెలిపారు. హోంగార్డు కూతురు.. కౌడిపల్లి(నర్సాపూర్): పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.రాజేశ్వరీ 576 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. స్వగ్రామం కిష్టాపూర్ కాగా వెల్మకన్నలో అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటూ చదువుతుంది. తండ్రి ఫైర్ స్టేషన్లో హోంగార్డుగా, తల్లి గృహిణిగా ఉన్నారు. బాసర ట్రిబుల్ఐటీలో సీటు వస్తే ఇంజనీరింగ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి మండల టాపర్గా నిలవడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.తండ్రి కార్పెంటర్.. కూతురు టాపర్ రామాయంపేట(మెదక్): ప్రగతి ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కమ్మరి ప్రశాంతి పదవ తరగతిలో 600 గాను 560 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ఆమె స్వగ్రామం చేగుంట మండలం కిష్టాపూర్ . తండ్రి కమ్మరి మహేందర్కు గ్రామంలో కార్పెంటర్గా పనిచేస్తాడు. అతడి కష్టంతోనే ఆ కుటుంబం సాగుతుంది. మహేందర్ పెద్ద కుమారుడు ఇంటర్ పూర్తి చేయగా, కూతురు పదో తరగతి చదువుతుంది. తన తండ్రి కష్టం చూసి బాధ కలుగుతుందని, దీనితో తాను చదుపుపై దృష్టి సారించి రాత్రింబవళ్లు కష్టపడి చదివి ర్యాంక్ సాధించినట్లు ప్రశాంతి తెలిపింది. తనకు డాక్టర్ కావాలని కోరిక ఉందని ఆమె పేర్కొంది.కష్టాలు పక్కన పెట్టి.. లక్ష్యాన్ని గురి పెట్టి నారాయణఖేడ్: తండ్రి లేడన్న బాధ.. తల్లి కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కష్టం.. అయినా మొక్కవోని ధైర్యంతో ఆ చిన్నారి చదువుపై దృష్టి సారించింది. పదవ తరగతి ఫలితాల్లో ఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న శ్రీలేఖ 581 మార్కులతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో టాపర్గా నిలిచింది. సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన అవుటి యాదవులు, మౌనిక ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురే శ్రీలేఖ. యాదవులు కొన్నేళ్ల కిందట మరణించారు. కుటుంబ భారం, కష్టాలు పైన పడటంతో మౌనిక కండక్టర్గా విధుల్లో చేరారు. తమ పిల్లలకు కష్టాలు రాకూడదని చదివిస్తుంది. ఉపాధ్యాయురాలు కావాలనేదే తన లక్ష్యమని శ్రీలేఖ చెబుతుంది.తండ్రి దినసరి కూలీ.. తల్లి బీడీలు చుడుతూ.. చేగుంట(తూప్రాన్): చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే కొటారి శ్వేత పదో తరగతిలో 564 మార్కులు సాధించి మండల స్థాయి లో ఐదో స్థానంలో నిలి చింది. శ్వేత తండ్రి కుమార్ ఓ ప్రైవేటు పరి శ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తల్లి జ్యోతి బీడీలు చుడుతూ కూతురిని చదివిస్తున్నా రు. రోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగుంట పాఠశాలకు వచ్చి చదువుకునేది.తండ్రి చనిపోయాడనే దుఃఖాన్ని దిగమింగుకొని నంగునూర్(సిద్దిపేట): మండలంలోని నర్మెట ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న గంధమల్ల సిరి చందన పరీక్షలు రాస్తున్న సమయంలో తండ్రి యాదగిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి రాగానే తండ్రి చనిపోయాడని తెలియడంతో మనో వేదనకు గురైంది. దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షలు రాసిన సిరి చందన 471 మార్కులు సాధించింది. మట్టిలో మాణిక్యం నందిని కొల్చారం(నర్సాపూర్): మండలంలోని వరి గుంతం ఉన్నత పాఠశాలలో చదువుతున్న నందిని 554 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. నందిని కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలే. తండ్రి 2023లో అనారోగ్యంతో మృతి చెందడంతో ఆడపిల్లల భారం తల్లి దుర్గమ్మపై పడింది. నందిని రెండవ సోదరి ఇంటర్ చదివి కుటుంబ పోషణ భారం కావడంతో తల్లితో పాటు వేరే చోట కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నందిని నానమ్మతో కలిసి గ్రామంలోని ఉంటూ చదువుతుంది. తోబుట్టువులు ఇచ్చిన ప్రోత్సాహంతో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి వారి నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సత్యనారాయణ రావు, సిబ్బంది విద్యార్థినిని అభినందించారు. -
దార్శనికుడు బసవేశ్వరుడు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి : బహుజన వర్గాలను రాజ్యాధికారానికి చేరువ చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. బసవ జయంతిని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్లోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...కుల మతాలకతీతంగా మహిళలందరికీ సమానత్వం కావాలని కోరుకున్న మహనీయుడు బసవేశ్వరుడు అని అన్నారు. కష్టంలోనే సుఖం స్వర్గం ఉందని చెప్పిన మహనీయుడని ఆయన చూపిన మార్గం భావితరాలకు ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నాయకులు శివరాజ్ పాటిల్, జిల్లా అధికారి జగదీశ్వర్, రామప్ప, చీల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వరుడి బోధనలు ఆదర్శనీయం: గూడెం రామచంద్రాపురం(పటాన్చెరు): విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో బసవేశ్వరుడి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం బీరంగూడ కమాన్ వద్ద బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వరుని బోధనలు ప్రతీ ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో బీరంగూడ కమాన్ వద్ద సొంత నిధులు రూ.30 లక్షలతో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయన అనుసరించిన మార్గాన్ని భావితరాలు ఆచరించాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ పుష్ప, నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్టినేటర్ వి.ఆదర్శ్రెడ్డి బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నెలలోనే పింఛను పత్రాలుప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అగర్వాల్ పటాన్చెరు టౌన్: పదవీ విరమణ పొందిన నెలలోనే పింఛను ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించి నెలలోనే వారికి సంబంధించిన పత్రాలు (పీపీఓ) అందేలా చర్యలు తీసుకున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందిన 56మంది చందాదారులకు పీపీఓలను జారీ చేసి అందులో 26 మందికి కార్యాలయంలో బుధవారం అందజేశారు. అనంతరం లబ్ధిదారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్–2 ప్రశాంత్ ప్రియదర్శి, అకౌంట్ ఆఫీసర్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు. సీఐటీయూ పోరాట ఫలితమేసంగారెడ్డి : సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం తెలియజేయడం సంతోషకరమన్నారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు వేసవి సెలవుల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ సిబ్బంది సిద్ధం కావాలని కోరారు. -
పదిలో సర్కారీ బడుల సత్తా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటుగా దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. వివరాలు 13లో u
ఆర్టీసీ జేఏసీ చైర్మన్గా మల్లికార్జున్జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్గా మల్లికార్జున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కో చైర్మన్గా బస్వరాజ్, కోశాధికారిగా కిషన్ రాథోడ్, కన్వీనర్లుగా మానిక్(ఈయూ),హన్మయ్య(టీఎంయూ), నర్సింలు(టీజేఎంయూ), తుల్జయ్య (ఎస్డబ్ల్యుఎఫ్), జీవన్,వీరన్న,ఎఎస్.రెడ్డి, అనిల్కుమార్, సలహాదారులుగా నర్సింలు, సుందర్రాజ్, అక్బర్, లక్ష్మి, సౌజన్యలు ఎన్నికయ్యారు. ఈ నెల 7న నిర్వహించతలపెట్టిన సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు.వేసవి శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో రాజు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి పిల్లల శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయని, వారిని ఆడించడం, చదివించడం వంటి చేయించాలని చెప్పారు. వేసవి శిబిరాల వల్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. కేవలం రూ.100 ఫీజుతో 13 ఏళ్లగా వేసవి శిబిరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు రాజు మాస్టర్ను అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి సంగారెడ్డి : ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వాసవీ మాఇల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలను సంస్థ అధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్తో కలిసి ఆమె ప్రారంభించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ వీరాంజనేయులు, డైటీషియన్ బాలస్వామి, సిబ్బంది రాజు వాసవీ మా ఇల్లు సభ్యులు తోపాజి హరీష్, సంతోష్ గుప్తా, మధుమోహన్, శ్రీహరి, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఐదు పీహెచ్సీలకు నిధులు
సంగారెడ్డి : జిల్లాలో నూతనంగా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని అందోల్ మండలం నేరడిగుంట, రాయికోడు మండలం సంగీతం, ఝరాసంగం మండలం బర్దీపూర్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామాల్లో రూ.2.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలాగే నూతనంగా ఏర్పడ్డ చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో రూ.2.60కోట్ల నిధులు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదింటిలో బర్దీపూర్, కంకోల్, సింగీతంలలో టెండర్లు పూర్తయి పనులు కొనసాగుతున్నాయి. నేరేడుగుంటలో టెండర్ దశ పూర్తయింది. నూతనంగా ఏర్పడ్డ చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో ఈ రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలువనున్నారు. జిల్లాలో నూతనంగా ఐదు ఆస్పత్రులు మంజూరు కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఉండటం ఆయన చొరవతోనే ఈ ఐదు ఆస్పత్రులు వచ్చాయని చెబుతున్నారు. ఇదేవిధంగా జిల్లాకు మరిన్ని పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహను జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం జిల్లాకు జేఎన్టీయూ తేవడం ఆయన కృషే అంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాతో పాటు అందోల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనులు ప్రారంభం మరో రెండింటికి టెండర్లు ఖరారు మంత్రి దామోదర చొరవతోనే..త్వరగా పూర్తయ్యేలా చర్యలు జిల్లాలో మంజూరైన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఐదు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – గాయత్రీదేవి. జిల్లా వైద్యాధికారి -
ఉపాధిలో రాణిస్తున్నారు
● స్వయం ఉపాధిలో గ్రామీణ మహిళలు ముందంజ ● కొత్త సంఘాల ఏర్పాటుకుమహిళల ఆసక్తి ● జిల్లా టార్గెట్ రూ.927 కోట్లు రూ.911 కోట్లు మంజూరు మునిపల్లి(అందోల్): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహిళల స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. దీంతో మహిళలు కూడా స్వయం ఉపాధి కోసం వారే బాటలు వేసుకుంటున్నారు. చిరు వ్యాపారాల్లో ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతూ తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరి ప్రభుత్వం ఇస్తున్న రుణాలతో ఉపాధి పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. కొత్త సభ్యుల చేరిక...సంఘాల ఏర్పాటు పొదుపు చేస్తూ ఆర్థిక సాధికారత సాధించేందుకు మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాలలో చేరుతున్నారు. కొత్తగా చేరిన వారు వారి సంఘం తరఫున బ్యాంకు ఖాతాలను తెరిపించి రుణాలు కూడా అందిస్తున్నారు. మండలంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళా సభ్యులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. లక్ష్యం రూ.927కోట్ల రుణాలు ఆయా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో చేసుకున్న పొదుపు, తీసుకుంటున్న రుణాలను అనుసరించి 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మొదటగా రూ.911 కోట్లను మంజూరు చేసింది. అందులోనే సీ్త్ర నిధి ద్వారా రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోనే మొత్తం రూ.927 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా ఇచ్చినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇక బ్యాంకులో రుణాలు పొందిన లబ్ధిదారులు తిరిగి బ్యాంకులలో జమ చేస్తున్నారు.గ్రామ సమైఖ్య సంఘాలు స్వయం సహాయకసంఘాలుసంఘంలో సభ్యులు రుణాల మంజూరు లక్ష్యంఇప్పటి వరకుమంజూరైనవిసీ్త్ర నిధిఎంతో ఉపయోగంగా ఉంది డ్వాక్రా గ్రూపు సంఘంలో తీసుకున్న రుణంతో బుట్టలు, చాటలు అల్లుకుని వాటిపై వచ్చే డబ్బులతో కుటుంబం జీవనోపాధి పొందుతున్నాను. గ్రూపులలో చేరని వారంతా డ్వాక్రా గ్రూపులలో సభ్యత్వం తీసుకుని బ్యాంకు రుణాలతో కొంత వరకు ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. – మెదరి దుర్గారాణి కొత్త సంఘాలు ఏర్పాటు.. కొత్తగా డ్వాక్రా గ్రూపు సంఘాలను ఏర్పాటు చేసి సంఘం సభ్యులకు రుణాలు మంజూరు చేస్తాం. రుణాలు పొందిన సభ్యులు వివిధ రకాల షాపులు, పని ముట్లు, కుట్టుమెషీన్లు, బట్టల వ్యాపారం ఇలా రక రకాల వ్యాపారాలు చేస్తూ తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులలో జమ చేస్తున్నారు. – జ్యోతి (డీఆర్డీఓ పీడీ)●695 1,98,154 రూ.911 కోట్లు -
భూసమస్యలకు భూ భారతితో చెక్
● పది ఫలితాల్లో 99.09 ఉత్తీర్ణత శాతం ● ఉత్తీర్ణతలో బాలికల హవా● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● ఉమ్మడి జిన్నారం మండలాల్లోఅవగాహన సదస్సుసంగారెడ్డి ఎడ్యుకేషన్: పదోతరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఒక్కో పాఠశాలను ఒక్కో జిల్లా అధికారికి దత్తత ఇవ్వడంతో ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. పదో తరగతి ఫలితాలలో 99.09 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా 22,374 మంది పరీక్షలు రాయగా 22,170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 11,663 మంది బాలురకుగానూ 11,538 ఉత్తీర్ణత సాధించగా 125మంది బాలురు మాత్రమే ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా 10,711 మంది బాలికలకుగానూ 10.632మంది ఉత్తీర్ణత సాధించగా 79మంది బాలికల ఫెయిల్ అయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 98.93 కాగా, బాలికల శాతం 99.26గా నమోదైంది. మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వర్షిక 590 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వడ్ల గాయత్రి 588 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో అందోల్ గురుకుల పాఠశాల విద్యార్థి మంగళి రిషిత, కంది మండలం చెర్యాల ఉన్నత పాఠశాల విద్యార్థి దృషిక 586 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు జిల్లాలో 13 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారు. 368 ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు జిల్లావ్యాప్తంగా మొత్తం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు 467 గానూ 368 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. వీటిలో 158 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 149 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలో 149 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 08 మోడల్ స్కూల్, 16 కస్తూర్బా పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాల, ఎనిమిది బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 10 సోషల్ వెల్ఫేర్, ఆరు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, రెండు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, 9 మైనార్టీ గురుకుల పాఠశాలలున్నాయి.తృతీయ స్థానంలో నిలిచిన చేర్యాల జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్థి దృషికకు మిఠాయి తినిపిస్తున్న తండ్రిరెండు వారాల దగ్గును నిర్లక్ష్యం చేయకండి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.అరుణ నారాయణఖేడ్: రెండు వారాల పాటు దగ్గుతో బాధపడుతుంటే క్షయవ్యాధి లక్షణాలకు సంకేతాలని అందువల్ల అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ అరుణ సూచించారు. క్షయవ్యాధి నివారణకు సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఖేడ్లో ఆమె స్థానిక ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...క్షయవ్యాధి పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. సకాలంలో మందులు వాడితే నయమవుతుందని తెలిపారు. జిన్నారం (పటాన్చెరు): నిర్ణీత గడువులోపు భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కరించవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో బుధవారం ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామాలకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గ్రామాల్లోని రైతులకు భూసమస్యలపై ఉన్న అనుమానాలను నివృతి చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నంబర్ను కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకుని భూ సమస్యలు ఉంటే గ్రామసభలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్లు భిక్షపతి, పరమేశం, ఆర్ఐలు జయప్రకాశ్ నారాయణ, శ్రీనివాస్రెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలన..జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గోనె సంచుల కొరత లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు ధాన్యాన్ని ఎక్కువ రోజులు కేంద్రాల వద్ద నిల్వచేయవద్దని నిర్వాహకులకు సూచించారు. 695 1,98,154 రూ.911 కోట్లుదత్తత తీసుకోవడంతోనే.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఒక్కో పాఠశాలకు ఒక్కో జిల్లా అధికారిని కేటాయించాం. దీంతో సంబంధిత అధికారులు ఆయా గ్రామాలకు పర్యటనలకు వెళ్లినప్పుడు పాఠశాలలను సందర్శించడం, ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులతో రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహించడం వలనే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండవ స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉంది. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి -
రోడ్లపైనే వడ్లు
కనిపించని కల్లాలు.. రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్న రైతులు ● కల్లాల కొరతతో నానా అవస్థలు ● వాహదారులకు తప్పని ఇబ్బందులు ● నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం ● పట్టించుకోని అధికారులు చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై పోసిన పంట కుప్పలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తారు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంట దిగుబడుల్లో తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్నారు. ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. వాహనదారులకు ముప్పు.. యేటా సీజన్ రాగానే రైతులు రోడ్లపై ఇరువైపులా పంట కుప్పలు పోయడంతో రహదారులు కల్లాలుగా మారాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. నిత్యం పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ కల్లాలు లేకనే రోడ్లపై పంటను ఆరబెట్టాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కలగానే కల్లాలు.. గతంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై కల్లాల నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించింది. కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు రాలేదని, కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయని రైతులు వాపోతున్నారు. గత మూడేళ్లుగా కల్లాల పథకం నిలిచిపోవడంతో అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు రైతుల కష్టాలు గుర్తించి పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దు దుబ్బాక : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు రోడ్లపై పోయకుండా కల్లాల్లో ఆరబెట్టుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని రోడ్లపై పోయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పటికే రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలను వాహనాలు ఢీ కొట్టి మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. రోడ్లపై ధాన్యం పోసి రైతులు ప్రమాదాలకు కారణం కావొద్దన్నారు. ఇప్పటికే రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దంటూ రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్లపై ధాన్యం పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి రైతులు సహకరించాలని సీఐ కోరారు. –సీఐ శ్రీనివాస్ -
ప్రత్యేక శిబిరం.. ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం
నర్సాపూర్ రూరల్: మండలంలోని అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ ప్రత్యేక శ్రద్ధతో వేసవి శిబిరం నిర్వహిస్తున్నాడు. 24 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో తన పాఠశాలలో చదువుకుంటున్న పేద మధ్య తరగతి పిల్లలను ప్రైవేటు పాఠశాలలు దీటుగా చదివించాలన్న లక్ష్యంతో తానే చొరవ తీసుకొని ఈ శిబిరాన్ని ప్రారంభించాడు. సుమారు 40 మంది విద్యార్థులు ఈ శిబిరానికి హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరంలో గణితం, ఇంగ్లిష్, తెలుగు, చేతి రాతతో పాటు సంస్కతీ సాంప్రదాయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. వేసవి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు రావడంతో ఇతర ఉపాధ్యాయులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా శిబిరం కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు సైతం శ్రద్ధతో శిబిరానికి వచ్చి శిక్షణ పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సేవలు అభినందనీయం: ఎంఈఓ తారా సింగ్ అచ్చంపేట పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ శిబిరాన్ని పలుమార్లు సందర్శించాను. ఇతర ఉపాధ్యాయులు సైతం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. ప్రైవేటుకు దీటుగా విద్య : లక్ష్మీనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన కల్పించాలన్న లక్ష్యంతోనే అచ్చంపేట పాఠశాలలో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాను. అచ్చంపేట గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు గణితం, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతి సాంప్రదాయాల శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ శిబిరంలో వెలికి తీసి వారిని ప్రయోజకులను చేసేందుకు కృషి చేస్తున్నా. ఆట, పాటలు, డ్రాయింగ్, ఉపన్యాస, వ్యాస రచన, క్విజ్, జనరల్ నాలెడ్జ్ లో సైతం శిక్షణ ఇస్తున్నాం. అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహణ గణితం, ఇంగ్లిష్, తెలుగు చేతి రాతతోపాటు సంస్కృతి సంప్రదాయాలపై శిక్షణ హెచ్ఎం లక్ష్మీనారాయణను అభినందిస్తున్న గ్రామస్తులు -
అరుదైన ‘వీరగల్లు’ శిల్పాలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని గౌరయపల్లి గ్రామంలో పులివేట వీరగల్లుల రాతి శిల్పాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వాటిని పరిశీలించి 17 శతాబ్దానికి చెందినవిగా పేర్కొన్నారు. కన్నడ భాషలో హళిబేటె అని పిలిచే ఈ పులివేట వీరగల్లుల శిలా రూపాలు తెలంగాణలో మూటకోడూర్, నిజామాబాద్, గోనేపల్లి, అమ్మనబోలు వంటి ప్రదేశాల్లో గతంలో లభించాయని పేర్కొన్నారు. గ్రామం మీద పెద్ద పులిదాడి చేసిన సమయంలో వీరుడు వాటితో పోరాడి ప్రజల్ని కాపాడి మరణం పొందిన సందర్భంగా వేసిన వీరశిలలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు రాతి శిల్పాల్లో రెండు పులితో వేటాడుతున్నవి, మూడవది శైవ భక్తుడు తన సిగముడిని వంచిన వెదురుగడకోసకు కట్టుకొని అంజలిపట్టి యోగా సనం కుర్చున్నట్లు తెలిపారు. వీటి శిల్పశైలీని బట్టి రాష్ట్ర కుటుల కాలం నాటి శిల్పాలుగా పేర్కొన్నారు. ఆయన వెంట కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన హరగోపాల్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలుగులోకి పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీనివాస్ -
అధికారుల నిర్లక్ష్యం.. సంచారం లేని వాహనం
కలెక్టరేట్ ఆవరణలో నిరుపయోగంగా 104 వాహనాలు సీజనల్ వ్యాధుల కాలంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వారధిలా ఉన్న 104 సంచార వాహనాలు మూలనపడ్డాయి. కలెక్టరేట్లోని ఐదు వాహనాలు నిరుపయోగంగా మారాయి. చిన్నపాటి మరమ్మతులు చేసే వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తుప్పు పట్టి పనికి రాకుండాపోతున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
వరి కోత యంత్రం దహనం
కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వ్యక్తులు వరి కోత యంత్రంకు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లగిశెట్టి వెంకటేశం, ఎస్డీ జహీర్ కలిసి కొన్నేళ్ల కిందట అప్పులు చేసి వరి కోత యంత్రంను కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి వరకు మద్దూరి నారాయణరెడ్డి వరి పంటను కోసి సమీపంలో మరి కొందరి రైతుల పంటను కోసేది ఉండటంతో యంత్రంను నారాయణరెడ్డి బావి వద్దే ఉంచారు. మరుసటి రోజు వెళ్లే సరికి యంత్రం పూర్తిగా కాలిపోయి ఉంది. వ్యవసాయ బావి యజమానికి, గ్రామస్తులకు సమాచారం అందించారు. వరి కోత యంత్రంను దహనం చేసేందుకు డిజిల్ ట్యాంకరుపై ఎండుగడ్డిని వేసి నిప్పంటించగా డిజిల్ ట్యాంక్ పేలి కాలిపోయినట్లుగా నిర్ధారించారు. సుమారు రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ విషయమై కుకునూరుపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పుస్తెలతాడు అపహరణ
కొమురవెల్లి(సిద్దిపేట): మహిళ మెడలో పుస్తెల తాడు అపరించుకెళ్లిన ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో మంగళవారం చోటు చేసుకుంది. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన వనపర్తి భాగమ్మ ఆలయ పరిసరాల్లో కిరాణం, జనరల్ స్టోర్ను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. రోజూ మాదిరిగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వామి వారిని దర్శించుకొని వచ్చి షాప్ను ఓపెన్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలోంచి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. దీపం అంటుకొని ఇల్లు దగ్ధం తొగుట(దుబ్బాక): దీపంతో ఇల్లుకు నిప్పంటుకొని కాలిబూడిదైన ఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాయిని ఎల్లవ్వ ఉదయం ఇంట్లో దేవుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లింది. ఈ ప్రమాదవశాత్తు దీపం కిందపడి బట్టలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై సిద్దిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలార్పివేశారు. ఈ ఘటనలో రూ.3 వేలు నగదు, బట్టలు, బియ్యం, వంట సామగ్రితోపాటు కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు చేయించుకున్న దర్వాజ లు, కిటికీలు కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య వర్గల్(గజ్వేల్): కడుపునొప్పి భరించలేక తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం అంబర్పేటలో చోటు చేసుకుంది. గౌరారం పోలీసుల కథనం మేరకు.. అంబర్పేటకు చెందిన మన్నె శ్రీనివాస్, రేణుక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి ఏడాదిన్నర కిందట వివాహం కాగా చిన్న కూతురు జ్యోతి(17) మెదక్ జిల్లా కూచారం కస్తూర్బా గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇటీవలె ఫస్టియర్లో 439 మార్కులు సాధించింది. సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటుంది. కొంత కాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న జ్యోతి మంగళవారం సాయంత్రం నొప్పి తాళలేక గ్రామ సమీప తోటలో మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మందలించాడని యువకుడు మద్దూరు(హుస్నాబాద్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బచ్చల చంద్రకాంత్(24) కొద్ది రోజులుగా ఏ పని చేయకుడా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బలరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్(20) మంగళవారం మధ్యాహ్నం ఇంటి పరిసరాల్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర రిసోర్స్ పర్సన్గా మర్కూక్ పాఠశాల ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మండలంలోని దారకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య, ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఓంకార్ రాధాకృష్ణ గురువారం ఎంపికయ్యారని మండల విధ్యాధికారి వెకట్రాములు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో 641 మంది దరఖాస్తు చేసుకోగా 27న రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు హైదరాబాద్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. 152 మంది ఎంపికయ్యారని మర్కూక్ మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారని తెలిపారు. పాఠశాలల ఉపాధ్యాయుల వారికి అభినందనలు తెలిపారు. -
కోతలు మొదలు.. ధాన్యం బారులు
కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు సంగారెడ్డి జిల్లాలో ఇటీవలె ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వరి కోతలు ప్రారంభం కావడంతో సంగారెడ్డి, కంది పరిసర ప్రాంతాల్లోని రైతులు ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దానితో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలతో ట్రాక్టర్లు బారులు తీరాయి . – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు
నర్సాపూర్ : పింఛన్ కోసం వృద్ధులు నానా పాట్లు పడుతున్నారు. నర్సాపూర్కు చెందిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు స్థానిక పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రతి నెల పింఛన్లను పంపిణీ చేస్తారు. కాగా పోస్ట్ ఆఫీసు వద్ద నీడ, కూర్చునేందుకు బెంచీలు లాంటి వసతులు లేకపోవడంతో ఎండలోనే నిలబడ్డారు. అరుగులపై , చెట్టు కింద కూర్చొని నిరీక్షించారు. అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం మార్చి నెల పింఛన్ ఇస్తున్నారని తెలిసి వచ్చామని వృద్ధులు చెప్పారు. ఈ విషయమై స్థానిక పోస్ట్ మాస్టర్ హరిప్రసాద్ను వివరణ కోరగా సోమవారం సాయంత్రం ఫండ్ వచ్చిందని, ఈరోజే పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. -
ఆరోగ్య పరిరక్షణకు ‘రుతు ప్రేమ’
కోహెడరూరల్(హుస్నాబాద్): మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీఓ దేవకీదేవి అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో రుతుప్రేమ కార్యక్రమంలో భాగంగా మెన్స్ట్రువల్ కప్, క్లాత్ప్యాడ్ల వినియోగంపై మహిళకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని రుతు చక్రం లేకపోతే జీవనమే లేదని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కెమికల్స్ కలిగిన ప్యాడ్ వల్ల మహిళల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ప్రమాదమేనని అన్నారు. క్లాత్ ప్యాడ్స్ మెన్ స్ట్రువల్ కప్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మెన్స్ట్రువల్ కప్ 8 నుంచి 10 ఏళ్ల వరకు వాడొచ్చని ఇవి సురక్షితమైనవని, ఆరోగ్యకరమైనవని అన్నారు. నెలనెలా ప్యాడ్స్ కొనాల్సిన అవసరం లేదని, అలా ప్రతీ మహిళకు ఏటా రూ.1,200 వరకు ఆదా అవుతుందన్నారు. అనంతరం మహిళలు, యువతులకు ఉచితంగా మెన్ స్ట్రువన్ కప్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెట్విన్ కో ఆర్డినేటర్ అమీనా, ఇన్చార్జి ఎంపీఓ శోభ, పంచాయతీ కార్యదర్శులు నిహారిక, నజియా, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు. డీపీఓ దేవకీదేవి -
చేయూతపై చిగురిస్తున్న ఆశలు
కొత్త పెన్షన్ల మంజూరుకు కసరత్తు ● దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యం ● మూడేళ్ల తర్వాత మంజూరు సంగారెడ్డి జోన్: కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేయా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలలో వివిధ పథకాలతో పాటు పింఛన్ల కోసం అధికంగానే దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న సెర్ప్ కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో మొదటగా దివ్యాంగులతోపాటు వితంతువులకు అందించేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారి జాబితాలను పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు సిద్ధం చేయనున్నారు. జిల్లాలో 1,55,837 మంది పింఛనుదారులు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి చేయూత పథకం ద్వారా ప్రతి నెలా పింఛను అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, చేనేత వారికి పింఛన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016లను అందిస్తుంది. ఈ మేరకు జిల్లాలో వివిధ కేటగిరీలలో 1,55,837 మంది చేయూత ద్వారా రూ.36,15,19,230లు లబ్ధిపొందుతున్నారు. ఆయా లబ్ధిదారులకు పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయి. జిల్లాలో పింఛన్ వివరాలు దివ్యాంగులు 14,465 వృద్ధులు 59,083 వితంతువులు 70,673 ఒంటరి మహిళలు 7,475 చేనేత కార్మికులు 683 కల్లుగీత కార్మికులు 813 బీడీ కార్మికులు 112 ఇతరులు 2,533 మూడేళ్లుగా కొత్త పెన్షన్లు లేవు అర్హులైన వారు చేయూత పథకం లబ్ధిపొందేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 2022 ఆగస్టు 31న నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు కాలేదు. దీంతో వందల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు. తాజాగా పెన్షన్ల మంజూరు ప్రక్రియ ఊపందుకోవడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు గతంలో పింఛను వచ్చేదని గత కొన్నేళ్లుగా రావటం లేదని, అన్ని అర్హతలు కలిగి ఉన్నా పింఛను మంజూరు కావటం లేదని తదితర కారణాలతో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సందర్భాలున్నాయి. త్వరితగతిన మంజూరు చేయాలని పింఛనుదారులు కోరుతున్నారు. -
‘బసవ జయంతి’కి సీఎం రేవంత్కు ఆహ్వానం
జహీరాబాద్ టౌన్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించే విశ్వగురువు మహా మానవతావాది మహాత్మ బసవేశ్వరుడి జయంతి వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రీయ బసవదళ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు ఈ సంఘం తెలంగాణ అధ్యక్షుడు శంకర్పాటిల్, ఎంపీ సురేశ్ షెట్కార్, లింగాయత్ సమాజ్ నాయకులతో వెళ్లి హైదరాబాద్లోని సీఎం నివాసంలో రేవంత్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ...బసవేశ్వరుడి 892వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్ల నుంచి రాష్ట్రీయ బసవదళ్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యేకల్హేర్(నారాయణఖేడ్): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీబీపేట్లో పీఎసీఏస్ ఆధ్వర్యంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జొన్నలను ఈ కేంద్రాల్లో కొనుగోలు చేయడం ద్వారా రైతులు మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. ధరణిలో తప్పుల కారణంగా ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టం తెచ్చిందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నరేందర్రెడ్డి, పీఎసీఏస్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ గుండు మోహన్, నాయకులు వినోద్ పాటిల్, కిషన్రెడ్డి పాల్గొన్నారు. మేడేను జయప్రదం చేయండిసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పటాన్చెరు టౌన్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రామికభవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 1886 మే 01న అమెరికాలోని చికాగోలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె జరిపితే కార్మిక వర్గం పై ఆనాటి పాలకులు కుట్రలు కుతంత్రాలతో విచ్ఛిన్నం చేసిందని, ఆ పోరాటంలో నలుగురు కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జయరాం, దుర్గా, చంద్రకిరణ్సింగ్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయీబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలిసంగారెడ్డి: నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని సర్పంచుల ఐక్య వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు అందోల్ కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చౌటకూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దశబ్దాల తరబడి నాయీబ్రహ్మణులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వృత్తి జీవనంలోనే జీవితాలు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో నాయీబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. -
నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోండి
న్యాల్కల్(జహీరాబాద్): ఇందిరమ్మ ఇళ్లను నిబంధనల ప్రకారమే నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లబ్ధిదారులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని లేకుంటే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, అనంతరం సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌస్ను పరిశీలించారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మండలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్కు సూచించారు. ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉందా?అని అడిషనల్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీఓ వనజ, ఏపీఓ రంగారావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు
శాంతి సమావేశంలో ఎస్పీ పరితోశ్ పంకజ్జిన్నారం(పటాన్చెరు): చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిన్నారం మండల కేంద్రంలోని తాబేలుగుట్ట శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విగ్రహధ్వంసం ఘటనపై మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాల సమక్షంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు. విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేసినట్లు సీసీటీవీ ఆధారంగా ఈ సమావేశంలో నిర్ధారించారు. విగ్రహ ధ్వంసం ఘటనలో 28 మందిపై కేసులు నమోదు చేయగా 18 మందిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..పటాన్చెరు ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా ఉండేదని ఇటువంటి ఘటనతో ఈ ప్రాంతం వెనకబడటమేకాకుండా అభివృద్ధికి భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని చూసి వాస్తవాలు తెలుసుకోకుండా విద్వేషాలు రెచ్చగొట్టవద్దని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దాడికి సంబంధం లేని కొందరి వ్యక్తులను అరెస్ట్ చేశారని వారిని విడుదల చేయాలని స్థానిక నాయకులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐలు నయీముద్దీన్, నరేశ్, జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి, స్థానికనాయకులు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
సొంత విత్తనంతోనే మనుగడ
● ప్రపంచ విత్తన వారోత్సవంలో విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ ● ప్రదర్శనకు అరుదైన విత్తన రకాలు ● జన్యుమార్పిడి హైబ్రీడ్ రకాలతో ముప్పు ● అధికంగా విత్తనాలు ప్రదర్శించిన మహిళా రైతులకు ప్రోత్సాహకాలు ఆకట్టుకున్న అరుదైన విత్తన ప్రదర్శన అంతర్జాతీయ విత్తన వారోత్సవాలను పురస్కరించుకుని మహిళా రైతులు ప్రదర్శించిన అరుదైన చిరుధాన్యాల రకాలు ఆకట్టుకున్నాయి. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాలకు చెందిన రైతులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న రైతులకు సంబంధించి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఝరా సంగం మండలంలోని బిడకన్నె గ్రామానికి చెందిన జడల చంద్రమ్మ 58 విత్తన రకాలు ప్రదర్శించి మొదటి బహుమతి అందుకుంది. న్యాల్కల్ మండలంలోని గుంజోటి గ్రామానికి చెందిన కర్నె నర్సమ్మ 56 విత్తన రకాలను ప్రదర్శించి రెండో బహుమతి, ఝరాసంగం మండలంలోని పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మ 55 విత్తన రకాలను ప్రదర్శించి మూడో బహుమతిని అందుకున్నారు.జహీరాబాద్: నేడు ప్రపంచం అంతా వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో పోగొట్టుకున్న విత్తనాలు, పద్ధతులను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ పేర్కొన్నారు. సొంత విత్తనాలతోనే వ్యవసాయ మనుగడ ఆధారపడి ఉందన్నారు. మనం సొంత విత్తనాలు దాచుకోవడం, వాటి విశిష్టతను ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని తెలిపారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లోని డీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రపంచ విత్తన వారోత్స కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ పద్ధతులు కాపాడుకుంటూ వస్తోన్న డీడీఎస్ మహిళల నుంచి స్ఫూర్తిని అందుకుని అందరూ ఈ వీరి బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్య మాట్లాడుతూ...చాలా దేశాల్లో విత్తనాలు దాచుకునే హక్కులు లేవన్నారు. జన్యుమార్పిడి విత్తనాలతో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదర్శనకు అరుదైన రకాలు దేశీయ విత్తనాలలో అరుదైన రకాలైన అత్తా కోడళ్ల జొన్నలు, నల్ల తొగరి, బుర్క తొగరి, తెల్ల శనగలు, నల్ల బెబ్బర్ల వంటి అంతరించిపోతున్న అరుదైన విత్తనాలను ప్రదర్శించారు. వీటితోపాటు కొర్ర, సజ్జ, సామ, మినుము, పెసర, సామ, ఉలవ, గడ్డి నువ్వు, తైద, పచ్చజొన్న, ఎర్రజొన్న తదితర రకాలు ప్రదర్శలో ఉంచారు. 58 రకాల ప్రదర్శించా తనవద్ద నిల్వచేసి పెట్టుకున్న 58 రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టాను. అందులో అరుదైన రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా విత్తనాలు వేసుకుని పంట వచ్చాక వాటిలో నాణ్యమైనవి ఎంపిక చేసి విత్తనంగా నిల్వ చేస్తాను. –చంద్రమ్మ, రైతు,బిడకన్నె రెండెకరాల్లో అనేక రకాలు రెండెకరాల్లో 55కు పైగా రకాల చిరుధాన్యాలను పండిస్తున్నా. వాటినే విత్తనాలుగా ఉపయోగించుకుంటున్నాను. రైతులు తన దగ్గరకు వచ్చి విత్తనాలు తీసుకెళ్తారు. వానాకాలం, యాసంగి విత్తనాలు నిల్వపెట్టుకుంటాను. –మొగులమ్మ, రైతు, పొట్పల్లి సొంత పొలంలో సాగు చేస్తున్నా తనకు ఉన్న సొంత పొలంలో చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, కూర గాయలు సాగు చేస్తున్నా. 60 రకాల వరకు విత్తనాలు, 15 రకాల వరకు దేశీ కూరగాయలు పండిస్తున్నా. న్యాల్కల్, హద్నూర్ తదితర అంగళ్లకు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటున్నా. విత్తనాలు నిల్వపెట్టి సాగు చేస్తున్నా. మిగతావి తోటి రైతులకు ఇస్తున్నా. –నర్సమ్మ, రైతు–గుంజోటి -
భూ భారతిపై అవగాహన ఉండాలి
● ఖేడ్లో ఆర్వోఆర్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు: కలెక్టర్ క్రాంతి నారాయణఖేడ్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరుచుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్లో మంగళవారం నిర్వహించిన భూ భారతిపై అవగాహన సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోగా భూ భారతి పోర్టల్ ద్వారా దర ఖాస్తులు చేసుకోవాలన్నారు. నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కారమవు తాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డీఓ, కలెక్టర్కు అధికారాలు కల్పించారని చెప్పారు. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకుంటే సీసీఎల్ఎతో పాటు ల్యాండ్ ట్రిబ్యునల్కు సైతం అప్పీల్ చేసుకునే అవకాశముందని తెలిపారు. రుణమాఫీ, ఇళ్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, లబ్ధిదారులకు సన్నబియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతీ సంవత్సరం ప్రదర్శనకు రికార్డులు జోగిపేట(అందోల్)/వట్పల్లి (అందోల్): ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి ఏటా గ్రామాల్లో రికార్డులను ప్రదర్శనకు ఉంచుతారని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో పరిపాలనా అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భార తి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించదని తెలిపారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడతాయని చెప్పా రు. అనంతరం జోగిపేట, వట్పల్లిలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడుతూ...భూముల సరిహద్దులను సైతం జీపీఎస్ సిస్టమ్తో భూభారతి ద్వారా హద్దులు తెలుసుకునేందుకు వీలుందన్నారు. భూ భారతిలో రికార్డుల సవరణ, మ్యూటేషన్కు ముందే మ్యాప్ తయారు చేయడం, పాసు బుక్కులోనే భూమి పటం వంటి నూతన అంశాలు ఉన్నా యని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఖేడ్ ఆర్డీఓలు, అశోక చక్రవర్తి, పాండు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. -
తాటి ముంజల బజ్జీ.. క్రేజీ
● హుస్నాబాద్ నోరూరిస్తున్న బజ్జీలు ● ఇష్టంగా తింటున్న కల్లు ప్రియులు ● రూ.100కి ఆరు చొప్పున విక్రయం ● ఎండాకాలంలో తాటి ముంజలతోశరీరానికి చల్లదనంహుస్నాబాద్: బజ్జీలు రకరకాలుగా ఉంటాయి. సామాన్యంగా బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ లు, హెగ్ బజ్జీలు పేర్లే విన్నాం. ఇక్కడ మాత్రం ముంజకాయల బజ్జీలు ఫేమస్. ఈ బజ్జీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకవు. కేవలం భగ భగ మండే ఎండాకాలంలో ముంజల సీజన్లోనే దొరుకుతాయి. పచ్చి ముంజలతోపాటుగా తాటి ముంజల బజ్జీలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు. హుస్నాబాద్ పట్టణ శివారులోని పందిల్ల రోడ్డామ్ సమీపంలోని హుస్నాబాద్, సిద్దిపేట హైవేలోని తాటి వనంలో ఆంజనేయులు కల్లు తాగే వారి కోసం స్టఫ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఇతడు అమ్మే వాటిలో తాటి ముంజల బజ్జీలు ఫేమస్. బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆంజనేయులు దగ్గర కల్లు ప్రియులు రోడ్డు నుంచి వెళ్లే వారు కొనుక్కుంటారు. తాటి వనంలో అమ్మే స్టఫ్కు బదులుగా ముంజల బజ్జీలను ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. ఈ తాటి ముంజలను శనగపిండిలో కారం, ఉప్పు, సోడా వేసి కలుపుతాడు. తర్వాత ముంజలను పిండిలో ముంచి నూనె కడాయిలో వేస్తాడు. సామాన్యంగా బజ్జీలను ఎలా తయారు చేస్తారో అదే విధంగా ముంజలను బజ్జీలుగా తయారు చేస్తాడు. ఎర్రగా బాగా కాలిన తర్వాత బజ్జీలను తీసి అమ్ముతుంటాడు. రూ.100కి ఆరు చొప్పున అమ్ముతాడు. మోదుగాకులో పెట్టి మరీ ఇస్తాడు. కల్లు ప్రియులు కల్లు తాగుతూ లోట్టలు వేసుకుంటూ తింటున్నారు. కల్లు తాగని వారు ఇంటికి తీసుకెళ్తారు. ఆర్డర్ పై కూడా ముంజల బజ్జీలు తయారు చేసి ఇస్తున్నాడు ఈ ఆంజనేయులు. ముంజుల విక్రయం ఎక్కువే..ఎండాకాలంలో పండ్ల రసాలు, జ్యూస్లు, నిమ్మరసం తాగితే శరీరానికి మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది. ఈ రసాలు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. కానీ ఎండాకాలంలో తాటి ముంజకాయలకు భలే గిరాకీ ఉంటుంది. తాటిముంజలు తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో చల్లగా ఉండి శరీరానికి మంచిదని చాలా మంది తాటి ముంజలను అమితంగా ఇష్టపడుతారు. చిరు వ్యాపారులు తాటి గెలలను గీత కార్మికుల నుంచి కొనుగోలు చేసి ముంజలు తీసి అమ్ముతుంటారు. రూ.100కి 12 చొప్పున విక్రయిస్తుంటారు. -
క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్
రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్నగర్లో జరుగుతున్న జాతీయస్థాయి కలరిపయట్టు క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేరళలో పుట్టిన కలరిపయట్టు క్రీడకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇప్పటికీ అనేక మంది ఈ క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుంచే ఈ క్రీడలో శిక్షణ అందిస్తే ఎంతో రాణిస్తారని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిలువేరి నరేశ్ గౌడ్(30) తల్లిదండ్రులు లక్ష్మీ, వెంకట్ గౌడ్ అనారోగ్యం (పక్షపాతం)తో కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు మంచం పట్టడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు, కుటుంబం అవసరాల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మద్యానికి బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురై నరేశ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
మేలుకో.. ధ్రువపత్రం ముందే తీసుకో
సెలవులని ఆలస్యం చేయొద్దు● విద్యార్థులకు ఇదే సరైన సమయం ● సెలవులు ముగిస్తే మీ సేవాకేంద్రాల వద్ద పెరగనున్న రద్దీ ● ధ్రువపత్రాల జారీలో ఆలస్యం అయ్యే అవకాశం ● ముందే జాగ్రత్త పడితే మేలుఇటీవల పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలు 63,877 పదో తరగతి 10,388 ఇంటర్ ఫస్ట్ ఇయర్ 6,153 సెకండియర్ 5,572 మొత్తం 85,990 మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు ఉన్నత తరగతుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన ధ్రువ పత్రాలు పొందడానికి ఇదే మంచి సమయం. వేసవి సెలవులు ముగియగానే విద్యార్థులందరూ ఒకేసారి సర్టిఫికెట్ల కోసం మీసేవల వద్దకు గుమిగూడుతారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమవుతుంది. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ప్రతీ దరఖాస్తు పరిశీలించడంతో ధ్రువపత్రాల జారీ జాప్యం జరుగుతుంది. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవుల్లోనే నూతన విద్యా సంవత్సరానికి కావాల్సిన ధ్రువ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొని తీసుకోవడం ఉత్తమం. ప్రతీ విద్యార్థికి అవసరం విద్యార్థులకు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు, స్కాలర్షిప్లకు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కుల, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 1 నుంచి 10 తరగతుల విద్యార్హత సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు. ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతోపాటు విద్యాపరంగా గ్యాప్ ఉంటే దానికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసే పత్రం అవసరం ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు తమ పరిధిలోని ఠాణా నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ, నివాస ధ్రువపత్రాలను అవసరం మేరకు ప్రతీ సంవత్సరం తీసుకోవాల్సి వస్తుంది. 22న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. త్వరలో పదో తరగతి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పై చదువులు చదవడానికి విద్యార్హత పత్రాలతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దరఖాస్తు ఇలా చేసుకోవచ్చు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్, రేషన్కార్డులతోపాటు బోనఫైడ్లు, ఫొటోలు జత చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులు ఆధార్, రేషన్కార్డుతోపాటు న్యాయవాది అఫిడవిట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల హామీ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఈ విద్యార్థుల కుటుంబాలకు 100 చదరపు అడుగుల స్థలం కూడా ఉండకూడదు. మండల రెవెన్యూ అధికారి, ఉప తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం దరఖాస్తును ఆన్లైన్ ద్వారా రిపోర్టును తహసీల్దార్ లాగిన్కు చేరవేస్తారు. అన్ని పత్రాలను తహసీల్దార్ పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత విద్యార్థి దరఖాస్తు ఫారమ్లో ఇచ్చిన ఫోన్ నంబర్కు మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ వచ్చిన వెంటనే మీ సేవా ద్వారా విద్యార్థులు ధ్రువ పత్రాలను పొందవచ్చు.రెండు రోజుల్లో అందిస్తాం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తున్నాం. అత్యవసరమైతే తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మణ్బాబు, తహసీల్దార్, మెదక్ -
పొన్నంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో పని చేయలేక స్వదేశం రావడానికి చేతిలో డబ్బులు లేక అక్కడే ఉండిపోయాడు. స్వదేశానికి రావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయం చేయాలని కోరాడు. స్పందించిన మంత్రి టికెట్కు డబ్బులు ఇచ్చి ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ చైర్మన్ వినోద్కుమార్ను లింగయ్య దగ్గర పంపించి భరోసా కల్పించి ఇంటికి పంపించాడు. సోమవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. చెక్డ్యాం ధ్వంసం చేశారని రైతుల ఆందోళన బెజ్జంకి(సిద్దిపేట) : శనిగరం ప్రాజెక్టు నుంచి ముత్తన్నపేట, దాచారం గ్రామాలకు సాగునీరు వచ్చే కాల్వ చెక్డ్యాం ధ్వంసం చేయడంపై ఆగ్రహించిన ముత్తన్నపేట రైతులు సోమ వారం నర్సింహుపల్లె శివారులోని వైట్ ఫీల్డ్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. వ్యర్థ జలాలు కాల్వలోకి వదలడానికి కంపెనీ వారే కాల్వ, చెక్ డ్యాంలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాల్వ నీటిని కాలుష్యం చేసేలా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసి రైతులు వెనుదిరిగి వెళ్లారు. -
తల్లీకూతురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీకూతురు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్ రావు కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన సమీర్ రాణా బతుకుదెరువు కోసం రెండు నెలల కిందట వచ్చి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మంజీరా స్కూల్ సమీపంలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 26న డ్యూటీకి వెళ్లిన సమీర్ రాణా రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య కీయా రాణా, కూతురు సేయా(6) కనిపించలేదు. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య, కూతురి అదృశంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నా భర్త ఆచూకీ తెలపండి హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి శ్రీను 16 నుంచి నుంచి కనిపించడం లేదని, తెలిస్తే ఆచూకీ తెలపాలని అతడి భార్య లత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరైనా ఆచూకీ లభిస్తే హవేళిఘణాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
అవగాహన ఒప్పందంపై సంతకాలు
ములుగు(గజ్వేల్) : ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వ విద్యాలయం, హైదరాబాద్కు చెందిన శ్రీ ఫౌండేషన్ మధ్య సోమవారం పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ములుగు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్. దండా రాజిరెడ్డి, శ్రీ ఫౌండేషన్ ప్రతినిథి శ్రీనివాస్రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతులు, మహిళలు, యువతకు వినూత్న శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా శక్తివంతం చేయడంలో శ్రీ ఫౌండేషన్ దోహదపడుతుందన్నారు. అంతే కాకుండా ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్ట్లు, ఆన్– ఫామ్ ట్రయల్స్, విస్తరణ కార్యకలాపాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్ అనితాకుమారి, వీణాజోషి, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ బాలుడు మృతి
● వైద్యం వికటించడం వల్లేచనిపోయాడని కుటుంబీకుల ఆరోపణ ● మా తప్పేమీ లేదన్న వైద్యులుసిద్దిపేటజోన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సోమవారం మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే బాలుడు చనిపోయాడని బాలుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక పట్టణానికి చెందిన అనిల్, భవానీ దంపతుల 8 నెలల బాలుడు(నిహాన్)ను ఆదివారం సాయంత్రం పట్టణంలోని సంరక్ష పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో తెమడ(బ్రాంకిటిస్ న్యూమేనియా)గా గుర్తించి ఐసీయూలో చేర్పించి చికిత్స ప్రారంభించారు. సోమవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం వికటించడం వల్లే బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారు జామున నర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే పల్స్ రేటు పడిపోయి బాబు చనిపోయాడని తల్లి భవానీ విలపిస్తూ పేర్కొంది. బ్రాంకిటిస్ న్యూమేనియాతో బాధపడుతున్న బాబుకు చికిత్స అందిస్తుండగా సోమవారం పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండగా సీపీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, ఇందులో మా తప్పు ఏమీ లేదని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. -
మెరుగైన వైద్య సేవలతోనే గుర్తింపు
ములుగు(గజ్వేల్) : గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్యులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్. నందకుమార్రెడ్డి అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్.యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విద్య గ్రాడ్యుయేషన్తో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిశోధన, ఉత్తమ పద్ధతి, పురోగతితో జ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. గ్రాడ్యుయేట్ వైద్యులు నిత్య విద్యార్థిగా భావిస్తూ ఆరోగ్య నిపుణుల సలహాలను స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్రెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.కేఎన్ఆర్ యూహెచ్ఎస్వైస్ ఛాన్స్లర్ డాక్టర్.నంద కుమార్రెడ్డి -
మొక్కలేని సంకల్పం!
మొక్కలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న మట్టి బ్యాగులు హత్నూర మండలం మధుర గ్రామ నర్సరీలోని చిత్రమిది. సరైన సమయంలో బ్యాగుల్లో విత్తనాలు వేయకపోవడం, అవసరం మేరకు నీళ్లు పట్టకపోవడంతో సగానికి పైగా మొక్కలు మొలకెత్తలేదు. నిజానికి ఒక్కో బ్యాగులో రెండేసి విత్తనాలు వేస్తారు. ఒకటి మొలక రాకపోయినా.. ఇంకో విత్తనం మొలకెత్తుతుంది. కానీ నిర్వహణ లోపం కారణంగా బెడ్లలో సగానికిపైగా బ్యాగులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఒక్క మధుర గ్రామంలోని నర్సరీదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నర్సరీల్లోనూ ఇదే పరిస్థితే నెలకొంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డినర్సరీల్లో మొక్కల పెంపకం విషయంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా డిసెంబర్ చివరి వారం వరకు పాలిథిన్ కవర్లలో మట్టిని నింపి (బ్యాగ్ ఫిల్లింగ్) చేసి విత్తనాలు పెట్టుకుంటే జర్మినేషన్ 100 శాతం ఉంటుంది. కానీ అప్పట్లో గ్రామపంచాయతీల కార్యదర్శులకు సర్వే, ఇతర పనుల పేరుతో ఈ నర్సరీలను పట్టించుకోలేదు. డిసెంబర్ నెలాఖరులోగా విత్తుకోవాల్సి ఉండగా, చాలా నర్సరీల్లో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా విత్తనాలు వేసుకోలేదు. ఇప్పుడు మొక్కల జర్మినేషన్ తగ్గడానికి ఆలస్యంగా విత్తుకోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నర్సరీల నిర్వహణను కూడా కొన్ని గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొందనే వాదన కూడా ఉంది. 38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కాగా.. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 619 చోట్ల ఉన్న నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇందులో సుమారు 19 లక్షల మొక్కల కోసం కొత్తగా విత్తనాలు వేసుకోగా, గత ఏడాది నాటకుండా మిగిలిపోయిన మరో 19 లక్షల మొక్కలను ఈ ఏడాదికి సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జర్మినేషన్ తగ్గడంతో ఈసారి వనమహోత్సవానికి సరిపడా మొక్కలు పెరగడం ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్మినేషన్ 11 శాతం తగ్గిందంటున్న అధికారులు 40 శాతానికి మించి నాటుకోలేదని అనధికారిక అంచనా నర్సరీల నిర్వహణను గాలికొదిలేసిన గ్రామ కార్యదర్శులు వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం కావడం ప్రశ్నార్థకమే గతంలో మాదిరిగానే.. గత ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో ఏటా వర్షాకాలంలో విరివిగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా లక్షల్లో మొక్కలు నాటినప్పటికీ.. వందల్లో కూడా మొక్కలు పెరగకపోవడంతో ప్రజాధ నం చాలా మట్టుకు వృథా అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వనమహోత్సవం పేరుతో వర్షాకాలం రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అయితే గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు కూడా సరైన నిర్వహణ లోపం కారణంగా ప్రజాధనం వృధా అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సరిపోను మొక్కలను సిద్దం చేస్తున్నాంఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమానికి 38 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాం. ఈ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. అయితే ఈసారి కొన్ని నర్సరీల్లో మాత్రమే జర్మినేషన్ తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. లక్ష్యానికి సరిపోను మొక్కలను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ -
100 శాతం పరిష్కారం
● భూభారతితో రైతులకు మేలు ● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించం ● ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ● చట్టంలో కొన్ని సవరణలు చేయాలి ● ఎంపీ రఘునందన్ రావు హత్నూర(సంగారెడ్డి): భూ సమస్యల పరిష్కారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, వంద శాతం భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ చట్టం పనిచేస్తుందన్నారు. భూదాన్ చట్టం కూడా సరిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భూదాన్ చట్టాన్ని మరింత పటిష్టంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. దేశంలోని సివిల్ కోర్టుల వద్ద ఐదువేల కోట్ల కేసులు పెండింగ్లో ఉంటే మూడు వేల కోట్ల కేసులు భూ సమస్యలే ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ఐదు లక్షల విలువ ఉన్న భూమి సమస్యలను ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం అవుతుందన్నారు. ఉచిత న్యాయ సేవ కూడా రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు అందిస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన మండల కేంద్రమైన హత్నూరలో తహసీల్దార్ నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. హత్నూర అంబేద్కర్ గురుకుల కళాశాలలో రూ.63 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లు, రూ.2కోట్లతో నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాలలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.పదేళ్లు సొల్లు కబుర్లు చెప్పావా?అసెంబ్లీ సమావేశాలను సొల్లు కబుర్లు అని సంబోధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేశారని విమర్శించారు. అసెంబ్లీని కించపరిచిన కేసీఆర్.. మరి పదేళ్ల మీ పాలనలో సొల్లు కబుర్లు చెప్పారా అంటూ నిలదీశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. -
భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● గుమ్మడిదలలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం ● భూసేకరణ వేగవంతం చేసిన అధికారులు ● భూమికి భూమి ఇవ్వాలి.. లేదా ప్రత్యామ్నాయం చూపాలి ● బాధిత రైతుల డిమాండ్ మినీ ట్రాక్టర్తో మందులను పిచికారి చేసే విధానంపై నిర్వహించిన ప్రదర్శన వ్యవసాయ భూములు లాక్కోవద్దు ఎన్నో ఏళ్లుగా మేమంతా భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పార్కు పేరిట మా భూములు కావాలంటుంది. ముందుగా మాకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. వేరేచోట భూములు ఇచ్చినా సరే.. లేదంటే రోడ్డున పడతాం. భద్రయ్య, రైతు, గుమ్మడిదల భూమికి భూమి ఇవ్వాలి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రైతులకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఈ భూముల్లో ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట రైతుల భూములు సేకరిస్తున్న ప్రభుత్వం.. బాధిత రైతులకు న్యాయం చేయాలి. రవీందర్, రైతు, గుమ్మడిదల జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కాలుష్యరహిత ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు నిర్ణయం రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. గుమ్మడిదలలో సర్వే నంబర్ 109లో 157.29 ఎకరాలలో ఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ విషయమై అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల గ్రామ సభను ఏర్పాటు చేశారు. టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి భూసేకరణపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అయితే.. భూములు తీసుకుంటున్న అధికారులు.. భూమికి బదులు భూమి ఇస్తారా..? లేక ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపుతారా? అనేది ప్రకటించలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘‘మా తాతల కాలం నుంచి భూములను నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్కు పేరిట మా భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భూములు లాక్కుంటే మేం ఎట్లా బతకాలి. భూమికి భూమి ఇవ్వాలి. లేదా అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261లో వెయ్యి గజాలు చొప్పున పట్టాలు చేసి ఇవ్వాలి’’అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా బతుకుదెరువునిచ్చిన భూములను అప్పగించేందుకు మాత్రం వారు వెనుకడుగు వేస్తున్నారు.బాధిత రైతులకు న్యాయం చేస్తాం గుమ్మడిదల మున్సిపాలిటీలో గ్రీన్, ఆరెంజ్ జోన్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో పార్కు ఏర్పడితే కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపిస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి కేంద్రబిందువుగా ఉంటుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. – ఆర్డీఓ రవీందర్ రెడ్డిన్యూస్రీల్ -
చిరు ధాన్యాల భాండాగారం
● 40 గ్రామాల మహిళా రైతుల విత్తనాల ప్రదర్శన ● డీడీఎస్ సంఘాల సభ్యులు చిరుధాన్యాలే సాగు నేటి నుంచి విత్తన వారోత్సవాలుజహీరాబాద్: మహిళా రైతులు తమ పొలాల్లో నాటుకునేందుకు సొంత విత్తనాలే వాడుతారు. పంట చేతికి రాగానే అందులోని నాణ్యమైన పంటను విత్తనంగా సేకరించి నిల్వ పెట్టుకున్నారు. విత్తనాలు వేసే సమయానికి వాటిని బయటకు తీస్తారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) సంఘంలోని మహిళా రైతులు తమకు అవసరమైన మేరకు ప్రతి ఏటా చిరుధాన్యాల విత్తనాలు నిల్వ పెట్టుకుంటారు. ఎంపిక చేసుకున్న విత్తనాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు గాను బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోసి మట్టితో మూసి వేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసి ఉపయోగిస్తారు. సుమారు 50 నుంచి 70 రకాల వరకు విత్తనాలను నిల్వచేసి పెట్టుకుంటారు. సాయిజొన్న, పచ్చజొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోక జొన్న, సజ్జ, కొర్ర, తైద, సామ, శనగ, ఆర్గులు, పెసర, మినుము, అవిశ, కందులు, కోడి సామ, ఎవ్వలు ఇలా అనేక రకాల విత్తనాలను సేకరించి పెట్టుకుంటారు. ఆయా పంటలన్నీ వర్షాకాలంలో వర్షాధారంగా, యాసంగిలో తేమ ఆధారంగా పండే పంటలను సాగు చేసుకుంటారు. నేడు ప్రపంచ విత్తన వారోత్సవం 29న (మంగళవారం) డీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ విత్తన వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ చివరి వారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విత్తన వారోత్సవంగా జరుపుకొంటారు. అందులో భాగంగా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఉ. 11.30 గంటలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 40 గ్రామాల నుంచి మహిళా రైతులు తమ వద్ద ఉన్న పలు రకాల చిరుధాన్యాల విత్తనాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎంపికయిన ఉత్తమ రైతులకు బహుమతులను అందజేస్తారు.మాచ్నూర్లో విత్తన బ్యాంకుఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. ఈ విత్తన బ్యాంకులో 60 రకాల వరకు విత్తనాలు రైతులకు అన్ని రకాలు కలిపి సుమారు 20 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచుతారు. అవసరం అయిన రైతులు విత్తన బ్యాంకును సంప్రదించి విత్తనాలు పొందుతారు. పంట చేతికి రాగానే విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాన్ని తిరిగి అందజేస్తారు. 10 కిలోల విత్తనం పొందితే తిరిగి ఇచ్చే సమయంలో 15 కిలోలు అప్పజెపుతారు. -
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు సహకారం అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్ చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచాలన్నారు. అనంతరం విజేతలకు సొంత నగదు రూ.2 లక్షలతో బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అరవ రామకృష్ణ, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రేణుక, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్పై కేసు నమోదు
నర్సాపూర్ రూరల్: చిన్నచింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై లింగం ఆదివారం తెలిపారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని బైక్పై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురిపై నుంచి లారీ దూసుకెళ్లిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు మాల గోపాల్ అతడి కుమారుడు అనుదీప్, తోడళ్లుడు కూతురు సహస్ర మృతి చెందారు. వీరికి మృతికి కారణమైన సూర్యాపేటకు చెందిన లారీ డ్రైవర్ చంద్రబాబును అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గడ్డి మోపులు దగ్ధం నర్సాపూర్ రూరల్: గడ్డి మోపులతో వెళ్తున్న ట్రాక్టర్కు మంటలు అంటుకున్న ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లి గిరిజన తండాకు చెందిన రమేశ్ నాయక్ ట్రాక్టర్లో గడ్డి మోపులను లోడ్ చేసుకొని గ్రామంలోకి వస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్య్కూట్తో మంటలు చెలరేగి అంటుకున్నాయి. రమేశ్ నాయక్ చాకచక్యంగా వ్యవహరించి ట్రాలీ హైడ్రాలిక్ లేపడంతో కాలుతున్న గడ్డిమోపులు రోడ్డుపై పడ్డా యి. దీంతో బ్రాహ్మణపల్లి రోడ్డులో ఇరువైపు లా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గడ్డిమోపులు కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మొగుడంపల్లి మండలం గుడ్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గుడ్పల్లికి చెందిన వడ్డె నాగన్న (55) రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కరెంట్ సరఫరా జరగడంలేదని సర్వీస్ వైర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిరాగ్పల్లి పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొట్టినతుఫాన్ వాహనం ● కూలి పనులకు వెళ్లొస్తూ ఇద్దరు మృతి నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం నంగు నూరు మండల రాంపూర్ క్రాస్రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన తాడెం సారయ్య (36), అదే గ్రామానికి చెందిన బండోజు గణేశ్ సిద్దిపేటలో కూలి పనులు ముగించుకొని రాత్రి మోటర్ సైకిల్పై స్వగ్రామానికి బయలు దేరారు. ఇదే సమయంలో వరంగల్ మీటింగ్కు నుంచి సిద్దిపేట వైపునకు తుఫాన్ వాహనం వెళ్తుంది. మార్గమధ్యలో రాంపూర్ క్రాస్ వద్దకి రాగానే తుఫాన్ వాహనం బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడు రమేశ్ను రాజపాల్పేట ఎస్ఐ ఆసీఫ్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను పోలీస్ వాహనంలో సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఎన్నేళ్లు ‘గడీ’చినా చెదరని ఇల్లు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మండు వేసవిలో చల్లదనం పంచుతుంది దొర వారి గడీల ఇల్లు. సుమారు 400 ఏళ్ల కిందట మర్పడగ గోపాల్ రెడ్డి అనే దొర ఎకరం స్థలంలో ఈ గడిని కేవలం సుమారు రూ. 500తో నిర్మించినట్లు ఆయన వారసత్వంగా వస్తున్న కుటుంబ సభ్యులు చెప్పారు. మీటర్ వెడల్పు గోడల మందంతో ఒక అంతస్తు వరకు మట్టి ముద్దలతో గోడలను నిర్మించారు. పై కప్పులో మొత్తం విలువైన టేకు దూలాలతో పాటు కలపను పేర్చారు. కలపపై వేప ఆకులను పరిచి వాటిపై అర పీట్ మందంతో మట్టిని అమర్చారు. మట్టిపై నుంచి కుమ్మరి గూన పెంకులతో కప్పేశారు. దీంతో ఎంతటి వేసవి కాలం అయినా చల్లగానూ, మరీ ఎంతటి చలి, వర్షాకాలం అయినా వెచ్చగా ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎకరం స్థలంలో నిర్మించిన ఆ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసించేలా గదులను నిర్మించారు. ఏసీలు లేకున్నా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్లు ప్రస్తుతం ఆ ఇంటిలో నివసిస్తున్న శశిరేఖా దేవి, లక్ష్మీ నర్సమ్మ, శ్రీమతి, నిర్మల వెల్లడిస్తున్నారు. తమ పిల్లలు హైదబాద్లో స్థిరపడ్డారని, ప్రతీ వేసవి సెలవుల్లో తమ మనవళ్లు, మనవరాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి వేసవి అయిపోయే ఇక్కడే ఉంటారని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు రానున్నారని, వారితో ఈ ఇంటి చల్లదనాన్ని ఆస్వాదిస్తామని చెప్పుకొచ్చారు. -
నమాజ్ కోసం వెళ్లి బాలుడు అదృశ్యం
పటాన్చెరు టౌన్: బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్కి చెందిన హమీద్(11) శనివారం నమాజ్కి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బాలుడి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి వెళ్లి మహిళ శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృమైన ఘటన మండల పరిధి చండీ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సందిగాని కల్యాణికి ఆరేళ్ల కిందట వివా హం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా చండీ గ్రామంలోని అమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంబులెన్స్కు దారి
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఆదివారం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం చౌరస్తా వద్ద ఎల్కతుర్తికి వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. దీంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ యువ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా ఉన్న బారీ కేడ్లను తొలగించి, దారి ఇవ్వండి అని వాహనాలకు చెబుతూ అంబులెన్స్ వెళ్లేలా చేశారు. అక్కడ ఉన్న వారు అందరూ యువకులను అభినందించారు. – ఫోటో : సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సిద్దిపేట -
చల్లని పొదరిల్లు
మండు వేసవిలోనూ కూల్ కూల్.. ● చెక్కు చెదరని గడీల ఇల్లు, పెంకుటిళ్లు ● తాతల కాలం నాటి ఇళ్లనుకాపాడాకుంటున్న వారసులు ● సీజన్ ఏదైనా ఆహ్లాదకరం ● పర్యావరణహితం..పాతకాలం నాటి భవనం ఎండలు మండిపోతున్నాయి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.. వేడిమిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు.. చాలా మంది ఇంట్లోనే ఉంటూ ఏసీలు, కూలర్లు వాడుతూ చల్లదనాన్ని పొందుతున్నారు. ఇవి ఎంత వాడినా న్యాచురల్గా వచ్చే గాలి వేరు. ప్రస్తుతం కొన్ని ఇళ్లు ఎంత ఎండ కొట్టినా చల్లదనాన్ని పంచుతున్నాయి. మట్టి గోడలతో నిర్మితమైన అతి పురాతన ఇళ్లు, ఇంటి పైకప్పులో పేర్చిన కలప, చెక్క వంటి వాటితో ఇళ్లు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. పెంకుటిళ్లు కూడా ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరకుండా కూల్గా ఉంటాయి. కొందరైతే తాతల కాలం నుంచి వచ్చిన ఇళ్లను రూ.లక్షలు ఖర్చు చేసి మోడ్రన్ ఇల్లుగా మార్చుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ఎలాంటి వాతావరణంలోనైనా చల్లదనాన్ని పంచే ఇళ్లపై ప్రత్యేక కథనం..పర్యావరణ హితం.. ఆ ఇల్లు చిన్నకోడూరు(సిద్దిపేట): పర్యావరణ హితం.. వాతావరణ అనుకూలం లక్ష్యంగా మట్టి, ఇసుక, సిమెంట్, డంగ్ సున్నంతో కలిసి చేసిన ఇంటి నిర్మాణం ఆహ్లాదాన్ని అందిస్తుంది. మండు టెండలో సైతం చల్లదనాన్ని ఇస్తుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన కొండం లక్ష్మారెడ్డి రిటైర్డ్ ఉద్యోగి. తన ఇంటిని వినూత్న రీతిలో నిర్మించారు. కేరళ ప్రాంతంలో అధికంగా ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. తెలంగాణలో మొదటి సారిగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ ఇళ్లు ఏడాది కాలం పాటు వర్షాకాల, శీతాకాల, వేసవికాలాలకు అనుగుణంగా ఉంటుంది. తక్కువ డబ్బులతో వాతావరణ, వాయుకాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుంది. ఏసీలు, కూలర్లు అవసరం లేదు. ఆరోగ్యపరంగా ఇంటి నిర్మాణం బహుళ ప్రయోజనం. మోడ్రన్ పెంకుటిల్లు సొబగులు అద్ది.. చల్లగా తీర్చిదిద్ది రూ.లక్షలు వెచ్చించి ఇంటిని పునర్నిర్మాణం సిద్దిపేటరూరల్: ఎండాకాలం పెంకుటిల్లును మించిన చల్లదనం ఉండదు. ఇలాంటి క్రమంలో ఎంతమంచి బిల్డింగ్ కట్టుకున్నా ఎండాకాలం వేడిని నుంచి సాధారణ ఉపశమనం పొందడం వీలుకాదు. అలాంటి ఇబ్బందులను తొలగించుకుంటూ చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరి గౌడ్, కొత్తపల్లి చంద్రం పాత ఇల్లునే అందంగా నిర్మించుకొని మోడ్రన్ పెంకుటిల్లుగా మార్చుకున్నారు. బయట నుంచి చూస్తే పెంకుటిల్లు మాత్రమే కాని లోపికి వెళ్లి చూస్తే ఇంద్రభవనం, బిల్డింగ్ వంటి అనుభూతిని పొందేలా అధునాతన పద్ధతిలో నిర్మించుకున్నారు. తన తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు కాబట్టి దానిని కూల్చేందుకు మనసు రాక రూ.40 లక్షలకు పైగా వెచ్చించి మోడ్రన్ ఇంటిని నిర్మించారు. చల్లని గాని, వెలుతురు వచ్చేలా విశాలమైన గదులు, బెంగుళూరు పెంకులు, టేకు కర్రతో, అందమైన కళాకృతులతో తలుపులు బిగించారు. ప్రస్తుతానికి ఇల్లు పెంకుటిల్లా.. భవంతి ఇల్లా అన్నట్లుగా చూపరులను ఆకర్శిస్తుంది. ఎండాకాలం అయినా చల్లని వాతావరణం కలిగి ఉండడం విశేషం. -
పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య
మద్దూరు(హుస్నాబాద్): పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్ మహబుబ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడపట్ల బాలరాజు(29) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదేళ్లుగా బాలరాజుకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఎక్కడా కుదరకపోవడంతో మానసింగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. 23న తమ్ముడు బోడపట్ల రాజేందర్కి పెళ్లి కావడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంటుబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో వివాహిత కొండపాక(గజ్వేల్): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. కుకునూరుపల్లి మండలంలోని కోనాయిపల్లికి దున్నపోతుల కలవ్వ (36) కొన్నేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో కలిసి కోనాయిపల్లిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. 26న రాత్రి తల్లి కిష్టవ్వ, పిల్లలతో కలిసి భోజనం చేసి వేసవి కాలంలో కావడంతో అందరూ కలిసి ఇంటి బయట నిద్రించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కలవ్వ మనస్తాపానికి గురై రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పుట్టిన రోజు నాడే బాలుడి అంత్యక్రియలు
చిలప్చెడ్(నర్సాపూర్): ఆనందంగా జరగాల్సిన ఆరేళ్ల బాలుడి పుట్టిన రోజు వేడుకలకు బదులుగా అంత్యక్రియలు జరిగాయి. బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు కేరళకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా చిలప్చెడ్ మండలంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కొండారెడ్డిగారి దిలీప్ రెడ్డి, చందనల కుమారుడు నవీన్రెడ్డి(6) పుట్టిన రోజు ఆదివారం ఉంది. బాలుడి జన్మదిన వేడుకలు కేరళలోని వయనాడ్లో చేసేందుకు తల్లిదండ్రులు, మిగితా కుటుంబ సభ్యులు 23న విహారయాత్రకు వెళ్లారు. శనివారం వయనాడ్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి నవీన్రెడ్డి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులు చిట్కుల్ చేరుకోగానే బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరగాల్సిన నవీన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు, అదే కుటుంబ సభ్యుల రోదనలతో అంత్యక్రియలు జరిగాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి బాలుడికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. వేడుకలు జరిపేందుకుకేరళ వెళ్లిన కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో పడి మృతి చిలప్చెడ్ మండలంలో విషాదం -
కుక్కను తప్పించబోయి.. మృత్యుఒడికి
బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వ్యక్తి మృతి చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి శివారులో చోటు చేసుకుంది. పేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన సందిగల్ల ఎల్లం(48) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం మడూర్ నుంచి మెదక్ బయలుదేరిన ఎల్లం గవ్వలపల్లి దాటిన తర్వాత మెదక్ రోడ్డుపై కుక్క అడ్డుగా రావడంతో తప్పించేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి పడిపో వడంతో గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అయ్యో ట్రాన్స్‘ఫార్మర్లు’
● రాయపోలు మండలంలోట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ● కరువు కాలంలో ఇదేందనిరైతుల ఆందోళనదుబ్బాకటౌన్ : అసలే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీళ్లు అందక రైతులు నానా తంటాలు పడుతున్నారు. దీనికి తోడు రాయపోల్ మండలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు హల్చల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాయిల్స్ దొంగిలించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాయిల్స్ దొంగిలించి రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం అర్థరాత్రి మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి దానిలోని కాయిల్స్, ఆయిల్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 50 వేల విలువ గలవి ఎత్తుకెళ్లారని విద్యుత్ అధికారులు చెప్పారు. పంటలు చివరి దశకు వచ్చాయని ఈ సమయంలో నీటిపారుకం ఎంతో అవసరమని రైతులు రోదిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో దొంగల ముఠా అరెస్టు ఐదు నెలల కిందట రాయపోల్ మండల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తొగుట సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో రాయపోల్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు ఆగకపోవడంతో రైతులు భయందోళనకు గురవుతున్నారు.వ్యవసాయం చేసేదెట్లా.. ట్రాన్స్ఫార్మర్ దొంగలు రైతులను ఆగమాగం జేస్తుర్రు. నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. ఉన్న నీళ్లతో పంట పండిదామంటే ఇప్పుడు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇట్లయితే వ్యవయసాయం ఎట్లా చేయమంటారు. అధికారులు దొంగలను పట్టుకోవాలి. – నిరుడి మల్లమ్మ, మహిళా రైతు -
బైక్ను ఢీకొట్టిన కారు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు హత్నూర(సంగారెడ్డి): బైక్ను కారు బలంగా ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో దౌల్తాబాద్ హత్నూర రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్ కథనం మేరకు.. మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం అజమర్రి గ్రామానికి చెందిన అమృత, కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలుతో కలిసి కుమారుడి బైక్పై దౌల్తాబాద్ వైపు వెళ్తున్నారు. దేవులపల్లి శివారులోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమృత(45) అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు కృపాకర్, కోడలు అనూష, రెండేళ్ల మనవరాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలన ఇక పారదర్శకం
● మేరీ పంచాయతీ యాప్తో సమగ్ర సమాచారం ● నిధులు, ఖర్చులతో పాటు పనుల వివరాలు ● అభివృద్ధి పనులకు ముందస్తు ప్రణాళికలు ● జిల్లాలో గ్రామ పంచాయతీలు 633 పంచాయతీ పూర్తి సమాచారం గ్రామపంచాయతీకి సంబంధించి పూర్తి సమాచారం యాప్లో పొందుపరుస్తారు. యాప్లో ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామపంచాయతీలను ఎంచుకోవాలి. పంచాయతీకి సంబంధించిన పూర్తి అంశాలు కనిపిస్తాయి. పంచాయతీలో నివసిస్తున్న జనాభా, ఓటర్లు, నివాసం ఉంటున్న ఇండ్ల సంఖ్య, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చేపట్టిన నిధుల ఆడిట్ వివరాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ యాప్లో మరిన్ని వివరాలు అప్డేట్ కానున్నాయి. సంగారెడ్డి జోన్: మారుతున్న పోటీ ప్రపంచంలో కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగిస్తూ అభివృద్ధిపథం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ని 633 గ్రామపంచాయతీల సమగ్ర సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్లో గ్రామ పంచాయతీల స్వరూపంతోపాటు అన్ని రకాల వివరాలు పొందుపరచనున్నారు. పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ నిధులు ఎంత మేర ... మేరీ పంచాయితీ యాప్ ద్వారా గ్రామ పంచాయతీ పాలకమండలి (సర్పంచ్ ఉప సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు), సంబంధిత పంచాయతీ కార్యదర్శి వివరాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన వివిధ రకాల నిధులు ఎంత మేర విడుదల చేశారు? విడుదల అయిన నిధులతో ఏయే రకాల పనులు చేపట్టారు? ఎంత మేర ఖర్చు పెట్టారు? అనే విషయాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతోపాటు పంచాయతీ కార్మికులకు అందించిన వేతనాలు, తదితర ఖర్చుల వివరాలను పొందుపరచనున్నారు. పనుల్లో తగ్గనున్న అవినీతి గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే మేరీ పంచాయతీ యాప్ ద్వారా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు, ఖర్చు చేసిన వాటి వివరాలు లభ్యమవుతాయి. ఖర్చు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయడంతో పాలనలో పారదర్శకత మెరుగు పడనుంది. దీంతో చేపట్టిన పనుల్లో నాణ్యతతో పాటు అవినీతికి పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి? వాటిలో ఉన్న నిల్వలు అనే వివరాలు లభ్యమవుతాయి. అభివృద్ధి పనులు యాప్లో నమోదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు సంబంధించి సిద్ధం చేసిన ప్రణాళికలు సైతం అందుబాటులో ఉంటాయి. గ్రామ పంచాయతీలో ఏ పనులు చేపట్టబోతున్నారు? పంచాయతీ పరిధిలో ప్రతిపాదించిన పనుల వివరాలు, కేటాయించిన నిధుల వివరాలు తెలుసుకోవచ్చు. ఏడాది కాలానికి సంబంధించిన ఖర్చుల వివరాలను అంచనా వేసి ఈ యాప్లో నమోదు చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకునే సౌకర్యం మేరీ పంచాయతీ యాప్ ద్వారా పాలనలో పారదర్శకత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో యాప్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పంచాయతీకి కేటాయించిన నిధులతో పాటు ఖర్చుల వివరాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు వివరాలు అందుబాటులో ఉంటాయి. –సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడదాం
ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతామని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం సునీతారెడ్డి పూలమాలలు వేసి వరంగల్ సభకు వెళ్లే వారికి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తామని స్పష్టం చేశారు. వరంగల్ రజతోత్సవ సభ ప్రభుత్వానికి చెంప పెట్టన్నారు. గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సభకు ప్రజలు తరలిరావడం ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వం ఎన్నడూ ముందుకు సాగదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పలు గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
స్కార్ఫ్, కర్చిఫ్లే శ్రీరామరక్ష
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లాలో వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసర పనుల మీద ఎవరైనా మధ్యాహ్నం బయటకు వస్తే మాడు పగిలేలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండ నుంచి రక్షణ పొందేందుకు మహిళలు చున్నీలు, స్కార్ఫ్లు ముఖానికి చుట్టుకుంటుంటే పురుషులు కర్చ్చిఫ్లు, రుమాళ్లు కట్టుకుని బయటకు వస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుండటంతో ‘సాక్షి’తన కెమెరాతో క్లిక్ మనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డిన్యూస్రీల్ -
తాగునీటి సరఫరాకు మరమ్మతులు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని రాజారాంతండా గ్రామపంచాయతీ పరిధి లోని సాధుతండాలో తాగునీటి సరఫరాకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో 40కి పైగా పైపులు వేసి నీటిని వాడుకోవడానికి గిరిజనులు పడుతున్న తంటాలపై ‘తాగునీటికి తండా వాసుల తంటా’శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. రెండు ప్రధాన పైపులు వేసి వాల్వ్లు బిగించడంతోపాటు ఇంటింటికీ ఫ్లో కంట్రోల్ వాల్వ్లు బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచా యతీ రాజ్ అధికారుల సమన్వయంతో నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు రూరల్ వాటర్ సప్లై కంగ్టి ఏఈ జైపాల్ తెలిపారు. రేపు వట్పల్లిలో భూ భారతి సదస్సువట్పల్లి(అందోల్): మండల కేంద్రమైన వట్పల్లిలో ఈ నెల 29న మంగళవారం ఉదయం 11 గంటలకు వట్పల్లిలోని వెంకటఖ్వాజా దర్గా ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ అవగాహన సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, అందోలు ఆర్డీఓ పాండు, మండల ప్రత్యేక అధికారితోపాటు ఇతర శాఖల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ముందుగా చెల్లిస్తే 5 శాతం పన్ను రాయితీఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆస్తిపన్నును ఈ నెల 30వ తేదిలోపు చెల్లించి 5% పన్ను రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక ఏడాదికి చెందిన పన్ను అడ్వాన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏటా ప్రజలు సహకరించడంతో నారాయణఖేడ్ ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికై దన్నారు. ప్రజలు పన్ను చెల్లింపు ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి రాయితీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాంపియన్షిప్కు కల్పన మునిపల్లి(అందోల్): 54వ రాష్ట్ర హ్యాండ్ బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు బుదేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని బి.కల్పన ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బీబీఏ సెకండియర్ చదువుతున్న బి.కల్పన ఈ నెల 29న సికింద్రాబాద్లో జింఖానా గ్రౌండ్, 30న ఆదిలాబాద్లోని మందమర్రి సింగరేణి స్కూల్ గ్రౌండ్ వేదికగా జరిగే క్రీడాపోటీల్లో కల్పన పాల్గొంటారు. భగీరథా.. తాగునీరు వృథా జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మిషన్భగీరథ పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. అస్తవ్యస్తంగా పైపులైన్ను ఏర్పాటుచేయడంతో లీకేజీ ఏర్పడి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు వృథాకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉగ్రవాదులను శిక్షించాలిడీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనపటాన్చెరు టౌన్: ఉగ్రదాడులకు పాల్పడ్డ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు హరినాథ్రెడ్డి, హాసన్లు డిమాండ్ చేశారు. కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ దగ్గర ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. -
కేతకీ భక్తజన సంద్రం
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. భక్తుల సౌకర్యం కోసం ధర్మదర్శనంతోపాటు ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ శివారుద్రప్ప, పాలకమండలి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.అమావాస్య పూజలు చేసిన భక్తులు -
కుట్టు.. ఆదాయం పట్టు
చేతి నిండా పనితో మహిళలు ● పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుడుతూ ఉపాధి ● వేసవిలో మహిళలకు ఆర్థిక భరోసా ● ఆదాయం పొందుతున్న మహిళలు సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇంటి వద్దనే ఉంటూ వివిధ రకాల పథకాల రూపంలో స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తూ..స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) తయారీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ వేసవిలో ఇంట్లోనే ఉంటూ దుస్తులు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని ఇంటి వద్దనే ఉంటూ బాలబాలికల దుస్తులను కుడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటికే కుట్టు పనులు ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో.... యూనిఫామ్లు కుట్టే ప్రక్రియను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులుండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాల్లో గ్రామ సంఘాల్లోని మహిళలున్నారు. అందులో ప్రస్తుతం 948 మంది దుస్తులు కుడుతున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ కుట్టే దుస్తులను ఆన్లైన్లో నమోదు చేయిస్తారు. ఆన్లైన్ విధానంలోనే వారికి డబ్బులను అందజేస్తున్నారు. అయితే మహిళా సంఘాల సభ్యులు కుట్టిన దుస్తులను అధికారులు పాఠశాలలకు అందజేయనున్నారు. ఆ సమయనికల్లా అందజేత... పాఠశాలలను తెరిచే సమయానికి అందించాలని జిల్లాలోని అన్ని పాఠశాలలకు దుస్తులు చేరే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. సంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రతీఒక్కరు రోజుకు 10 జతల చొప్పున ఈ సభ్యులంతా కలసి రోజులో 7,584 జతలు యూనిఫాం దుస్తులు కుడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కుట్టిన ప్రతీ యూనిఫాం జతను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గడువులోపు అందిస్తాం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు ఉపయోగించుకోవాలి. మహిళలకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. పాఠశాలలు ప్రారంభం నాటికి దుస్తులు కుట్టడం పూర్తవుతుంది. గడువు లోపే అన్ని పాఠశాలలకు యూనిఫాం దుస్తులను అందిస్తాం. –జంగారెడ్డి, జిల్లా అదనపు డీఆర్డీవో -
ఉగ్రవాదుల పిరికిపంద చర్య
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ సంగారెడ్డి రూరల్: ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేకే భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు జరిపిన కాల్పులను ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల, రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేశంలో సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఆర్మీని నిఘా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతోపాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నాయకులు సాయి, శివ, ప్రశాంత్ శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, దేవదాస్, అమీర్ పాల్గొన్నారు. -
18 ఏళ్లు నిండిన వారికి సైటీబీ పరీక్షలు
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సంగారెడ్డి: క్షయ వ్యాధి సోకిన వారితో ఉండే 18 ఏళ్లు నిండిన వారందరికీ సైటీబీ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి వెల్లడించారు. సంగారెడ్డి మార్క్స్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధి ఉన్న రోగులతో కాంటాక్ట్ అయిన 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఈ సైటీబీ నిర్ధారణ పరీక్ష చేసి లేటెంట్ టీబీ వ్యాధిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సైటీబీ పరీక్షలు సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి సీహెచ్ అరుణకుమారి, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శశికర్, సూపర్ వైజర్ శ్రీనివాస్, సీహెచ్ నర్సారెడ్డి, డాక్టర్ కరుణకుమారి పాల్గొన్నారు. -
ఆర్టీసీకి జవసత్వాలు!
ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం జహీరాబాద్ టౌన్: ఆర్టీసీలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శాశ్వత నియామకాల ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు డ్రైవర్ల సమస్యను అధిగమించి ఆర్టీసీని బలోపేతంతో చేసే చర్యలకు సంస్థ ఉపక్రమించింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున్న రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం చేపట్టి వారికి శిక్షణనిస్తున్నారు. త్వరలో వీరంతా విధుల్లో చేరనున్నారు. నియామకాలు నిలిచిపోవడంతోనే... ఆర్టీసీలో చాలాకాలంగా నియామకాలు లేకపోవడంతో క్రమంగా డ్రైవర్ల కొరత పెరుగుతూ వచ్చింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పెరిగిపోతోంది. డ్రైవర్ల కొరత కారణంగా సకాలంలో బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బస్సు సర్వీసులు రద్దు కూడా అవుతున్నాయి. వేసవిలో రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో కొత్త డ్రైవర్లు వస్తే కొంత సమస్య తొలగిపోనుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, ఖేడ్,మెదక్, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్ డిపోలు ఉండగా మొత్తం 585 బస్సులున్నా యి. మెదక్ రీజియన్లో 119 మంది డ్రైవర్ల అవసరం ఉంది. ఇప్పటికే 70 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో భర్తీ చేయనున్నా రు. భారీ వాహనాల డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి డ్రైవర్లకు 3 నెలలపాటు శిక్షణనిస్తున్నారు. వీరికి నెలకు జీతం రూ.22 వేలు చెల్లించనున్నారు. -
ఉగ్రదాడులను ఉపేక్షించం
సదాశివపేట(సంగారెడ్డి): ఉగ్రదాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించేదిలేదని, హిందువుల సహనాన్ని పరీక్షించొద్దని హిందూ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సదాశివపేటలో హిందూ జేఏసీ ప్రతినిధులు శనివారం భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేవాలయాల కమిటీ సభ్యులు యువకులు భారీ ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుమందిరం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ...ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఆశ్రయమిస్తున్న బంగ్లాదేశ్లు హద్దులు దాటాయని ఇక ఇలాంటి ఘటనలకు ప్రతి చర్యలు తప్పవన్నారు. హిందువులంతా ప్రపంచ శాంతిని కోరేవారని తెలిపారు.సదాశివపేటలో హిందూ జేఏసీ శాంతి ర్యాలీ -
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలు పరిశ్రమలు వాతావరణంలోకి విష వాయువులను విడుదల చేశారు. దీంతో పారిశ్రామిక వాడ ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. విషవాయువులు లీఫార్మా పరిశ్రమ నుంచి విడుదలైనట్లు స్థానికులు గుర్తించారు. నిత్యం ఉదయం సాయంకాల వేళలో పరిశ్రమ గొట్టాల నుంచి విషవాయువులను విడుదల చేస్తున్నారని వీటిని పీల్చడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. పీసీబీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఓరుగల్లుకు గులాబీ దండు
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 202525గులాబీ శ్రేణులు, జిల్లా ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. వారం పది రోజులుగా ఆ పార్టీ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడు తూ... ఈ సభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ముందునుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా నిలుస్తోంది. ఎల్కతుర్తికి సమీప జిల్లాల నుంచి తరలించే సంఖ్యకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడి నుంచి జనాలను తరలించేందుకు హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లనున్న పార్టీ శ్రేణులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓరుగల్లు భారీ బహిరంగసభకు తరలివెళ్లేందుకు గులాబీ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో జనాలను ఈ సభకు తరలించేందుకు ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు ఆదివారం ఉదయం బయలుదేరనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందిని తరలించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు నాయకులు ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. వీటికితోడు ప్రైవేటు వాహనాల్లో కూడా ఈ సభకు తరలివెళ్లాలని భావిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. సంగారెడ్డి జిల్లాకు బహిరంగసభ స్థలం చాలా దూ రం. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలు ఎక్కువ దూరం ఉంటాయి. అయినప్పటికీ వీలైనంత ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేయాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కాగా, ఉమ్మడి మెదక్ గులాబీ పార్టీకి మంచి పట్టున్న జిల్లా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా ఈ పార్టీ తన పట్టును నిలుపుకున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏమాత్రం తగ్గకుండా జన సమీకరణ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఈ బాధ్యతలను తీసుకున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ బాధ్యతలను గ్రామాల వారీగా నియమించిన ఇన్ చార్జిలకు అప్పగించారు. మండలాలు, పట్టణాల వారీగా పర్యవేక్షకులను నియమించుకున్నారు. న్యూస్రీల్హరీశ్రావు దిశానిర్దేశం.. నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున తరలింపు జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి పక్షం రోజులుగా ప్రణాళిక.. ప్రచారంఎల్కతుర్తి బహిరంగసభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ నాయకులు గత పక్షం రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వయంగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు గోడలపై రాతలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండలాలు, పట్టణాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు జరిపారు. ఆయా మండల కమిటీలు, పట్టణ కమిటీల్లోని బాధ్యులకు ఈ జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు. -
28న భూ భారతి అవగాహన సదస్సు
హాజరుకానున్న మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ హత్నూర (సంగారెడ్డి): ఈ నెల 28న భూ భారతి చట్టంపై దౌల్తాబాద్ సమీపంలో జరగనున్న అవగాహన సదస్సుకు జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నట్లు తహసీల్దార్ పర్వీన్ షేక్ వెల్లడించారు. హత్నూర తహసీల్దార్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పర్వీన్షేక్ మాట్లాడుతూ... హత్నూర తహసీల్దార్ నూతన భవన నిర్మాణం కోసం మంత్రులు శంకుస్థాపన చేయనున్నారన్నారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రూ.రెండు కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డార్మెటరీ భవనం కూడా మంత్రులు కలెక్టర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూ భారతి అవగాహన సదస్సుకు మండలంలోని అన్ని గ్రామాల రైతులు హాజరు కావాలని కోరారు. 29న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాజహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫారూఖీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే జాబ్మేళాలో ఎంఆర్ఎఫ్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఎస్ఎన్ లేబోరేటరీస్, పేటీఎం తదితర కంపెనీల హెచ్ఆర్లు, ,మేనేజర్లు హాజరవుతున్నారని చెప్పారు. 500పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9959845076 నంబర్ను సంప్రదించాలన్నారు. కీబోర్డ్ వాయిద్యంలో గిన్నిస్ రికార్డ్రామచంద్రాపురం(పటాన్చెరు): భారతీనగర్ డివిజన్ పరిధిలో ఎంఐజీ కాలనీ చెందిన వాగుల మధురవాణి, ఆమె కుమార్తెలు పెర్లి క్రిస్టీన్, క్యాథీలకు కీబోర్డ్ వాయిద్యంలో గిన్నిస్బుక్ రికార్డ్ను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పటాన్చెరు ప్రభుత్వ మైనార్టీ కళాశా ల వైస్ప్రిన్సిపాల్ మధురవాణి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్లో విజయవాడకు చెందిన హలేల్ సంగీత పాఠశాల నిర్వాహకులు అగస్టీన్ ఆధ్వర్యంలో 1,046 మంది ఒకేసారి కీబోర్డ్ ప్లేయింగ్ ప్రదర్శనను చేపట్టారన్నారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు తన కుమార్తెలు క్రిస్టీన్, క్యాథీలు కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో గిన్నీస్ బుక్ వారు పరిశీలించి రికార్డుల్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను ఈనెల 14న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు తెలిపారు. ఈదురు గాలులు.. భారీ వర్షం నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమైంది. వర్షం వల్ల మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. కోతలు కోసిన వరి పొలాల్లో నీరు నిలవడంతో నష్టం సంభవించనున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని భూమయ్య కాలనీలో విద్యుత్ వైర్లపై రేకులు ఎగిరి పడటంతో రెండు గంటలపాటు సరఫరా నిలిచిపోయింది. జిన్నారం మండలంలో.. జిన్నారం (పటాన్చెరు): ఉమ్మడి జిన్నారం, గుమ్మడిదల మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ప్రభావంతో మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. -
ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఘనంగా సన్మానించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గురుకుల కళాశాలలకు చెందిన ఐదుగురుకి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశే ఖర రావు దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, అందులో చదివిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధిస్తున్నారని కొనియాడారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు మోహీయోద్దీన్, తులసీదాస్గుప్త, విజయ్కుమార్, అలీ, జాఫర్ అలీలు పాల్గొన్నారు. -
భూ భారతితో అధికార వికేంద్రీకరణ
పటాన్చెరు: భూ భారతి (భూమి హక్కుల చట్టం–2025)ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం, బీరంగూడలో శనివారం నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పారదర్శకత జవాబుదారీతనమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. ఈ చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలని ఆకాక్షించారు. భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రైతులు, ప్రజల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు. పూర్తిస్థాయి అవగాహన కోసమే... ఈ చట్టంపై పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపా రు. ప్రభుత్వం భూ భారతి చట్టంతోపాటు, నియ మ నిబంధనలు ఒకేసారి తయారు చేసిందని, రికార్డుల నిర్వహణ, సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామ,పౌతి వంటి అంశాలను వివరించా రు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం మండలాల తహసీల్దారు లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు రైతు సంఘ నాయకులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి అమీన్పూర్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. అమీన్పూర్లో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అమీన్ పూర్ మండలం పరిధిలోని 993 సర్వే నంబర్ ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములలో బోర్డులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుర్తించిన ప్రభుత్వ భూముల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డిఓ రవీందర్రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ క్రాంతి వల్లూరు -
ఏమైనా ఇబ్బందులున్నాయా!
రోగులను ఆరా తీసిన న్యాయమూర్తి జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శనివారం సీనియర్ సివిల్ జడ్జి జి.కవితాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే గద్వాల్ నుంచి జహీరాబాద్కు బదిలీపై వచ్చిన కవితాదేవి ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియదిరిగారు. రోగులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మహిళా వార్డుకు వెళ్లి గర్భిణీలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. దత్తగిరిలో శాంతి ర్యాలీ ఝరాసంగం(జహీరాబాద్): పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శనివారం రాత్రి ఆశ్రమంలో మహామండలేశ్వర్ డా.సిద్దేశ్వర్ స్వామి, వైదిక పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ
జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నం.3లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అంగన్వాడీ కేంద్రం తలుపులను గుర్తు తెలియని దొంగలు పగులగొట్టి 17 ట్రేల గుడ్లు, 4 పప్పు ప్యాకెట్లు, 6 లీటర్ల పాలు, బాలమృతం ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. అంగన్వాడీ టీచర్ మధుమతి శనివారం కేంద్రం వద్దకు వెళ్లగా తలుపులు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా సరుకులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీచర్ తెలిపారు. పిచ్చి కుక్క దాడిలో ఏడుగురికి గాయాలు మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్లు ఏడుగురిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిరుదొడ్డిలో శుక్రవారం రాత్రి ఓ పిచ్చి కుక్క యువకుడితోపాటు, ముగ్గురు బాలురు, ఇద్దరు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఇందులో చిన్నారి ఫక్కీరుగల్ల లోకేశ్, పుల్లూరి ప్రశాంత్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొగుళ్ల రాజు, ఎం.ఎల్లవ్వ, పెద్ద కుర్మ సత్తవ్వ, మనోజ్ కుమార్, ర్యాకం భానోదయ్ మిరుదొడ్డి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కను గుర్తించిన గ్రామస్తులు శనివారం ఉదయం చంపేశారు. ఊరిలో కుక్కలను కట్టడి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధం బెజ్జంకి(సిద్దిపేట): ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధమైన ఘటన మండలంలోని పెరుకబండలో చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పులు చెలరేగి గ్రామానికి చెందిన గౌరి నర్సయ్య వరి పంట దగ్ధమైంది. అది గమనించిన రైతు నీళ్లు చల్లి మంటలార్పివేశారు. మూడు ఎకరాల వరి పొలంలో సుమారు 5 గుంటల వరకు దగ్ధమైంది. తమ వరి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలిగించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికై నా తొలగించాలని కోరారు. మహిళ అదృశ్యం రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు శనివారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన మతం ఎల్లవ్వ, ఆమె కూతురు మతం రాజేశ్వరీ ఐదు నెలల కిందట వరంగల్ నుంచి రామాయంపేటకు వచ్చి తల వెంట్రుకల వ్యాపారం చేసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన రాజేశ్వరీ తిరిగి రాలేదు. బంధువుల వద్ద, ఇతర చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఎల్లవ్వ శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. -
పౌష్టికాహారంతోనే పిల్లల ఎదుగుదల
దౌల్తాబాద్(దుబ్బాక): పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం చాలా ముఖ్యమని తహసీల్దార్ చంద్రశేఖర్, సీడీపీవో ఎల్లయ్య చెప్పారు. స్థానిక అంగన్వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను ఏఆర్ గార్డెన్స్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మ మ్మ, మెడికల్ ఆఫీసర్ నాగరాజు, రిలయన్స్ జిల్లా కోఆర్డినేటర్ రాజలింగం, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్, రిలయన్స్ ప్రతినిధులు భాస్కర్, సరిత, నాగరాజు సూపర్వైజర్ గిరిజ, చంద్రకళ, అంతుల్, రేణుక, స్వరూప, రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్లుగా రొట్టెల విక్రయం
మాది మాసాయిపేట మండలం, చెట్ల తిమ్మాయిపల్లి గ్రామం. నేను ఎనిమిదేళ్ల నుంచి తూప్రాన్ పట్టణంలో రోడ్డు పక్కన రోటీ సెంటర్ను నిర్వహించుకుంటున్న. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రొట్టెలు చేసి అమ్ముతుంటా. కిలో పిండికి ఏడు నుంచి ఎనిమిది రొట్టెలు వస్తాయి. కిలోకు రూ.55 ఖర్చు అయితే ఒక్కో రొట్టె రూ.15 లెక్కనా రూ.105 నుంచి రూ.120 వరకు వస్తాయి. రోజుకు 60 రొట్టెల వరకు అమ్ముతా. ఖర్చులు పోగ రూ.500 రూ.600 వరకు ఆదాయం లభిస్తుంది. – సునీత, రొట్టెల తయారుదారు, తూప్రాన్ రోజు 2 రొట్టెలు తింటాను ఆరోగ్యానికి జొన్న రొట్టెలు మంచివి. రోజు రాత్రి రెండు రొట్టెలు తింటాను. ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లో రొట్టెలు తయారు చేసుకోలేని వారికి ఈ రోడ్డు సైడ్ జొన్న రొట్టె కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాయామంతోపాటు జొన్న రొట్టె ఆహారంగా తీసుకోవడంతోపాటు వాటిలో ఉండే పోషకాలు ఉండటం శ్రేయస్కరం. – చెలిమిల బాబు, తూప్రాన్ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్న ఐదేళ్లుగా తూప్రాన్లో నివాసం ఉంటున్నాను. ఆయుర్వేద ఆస్పత్రి ఎదుట తోపుడి బండి ఏర్పాటు చేసుకొని జొన్న రొట్టెలు విక్రయిస్తున్న. నిత్యం సుమారు 60 నుంచి 70 రొట్టెలు రూ.15 చొప్పున అమ్ముతాను. ఖర్చులు పోను రోజుకు రూ.500 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.17 వేలకు వరకు మిగులుతాయి. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. – రుక్మీణి, రొట్టెల వ్యాపారి, తూప్రాన్ఆహార నియంత్రణతోనే సాధ్యం ఆహార నియంత్రణతోనే ఊబకాయం, మధుమేహం అదుపు చేసుకోవచ్చు. సమతుల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేస్తే ఈ సమస్యలను అధిగమించొచ్చు. బయట లభించే జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, చాట్ బండార్ పదార్థాలు, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఊబకాయం అంటే ఉండాల్సిన శరీర బరువు కంటే 20 శాతం ఎక్కువగా ఉండటం. – డాక్టర్ అమర్సింగ్, సీహెచ్సీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
ఈతకెళ్లి నీట మునిగి యువకుడు మృతి
మద్దూరు(హుస్నాబాద్): ఈతకు వెళ్లి బావిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సలాఖపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చేర్యాల పట్టణంలోని పెద్దమ్మగడ్డకు చెందిన బింగి అఖిల్(19) మండలంలోని మర్మాముల గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న పండుగకు వచ్చాడు. శనివారం ఉదయం మర్మాముల పక్క గ్రామమైన సలాఖపూర్ గ్రామంలోని గూడ శ్రీనివాస్రెడ్డి రైతుకు చెందిన వ్యవసాయ బావిలోకి బంధువులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత సరిగా రాక నీట మునిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్ మహబూబ్ ఘటనా స్థలానికి చేరుకొని గజతగాళ్ల సాయంతో అఖిల్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంటర్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య
హుస్నాబాద్రూరల్: ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన దండవేణి శ్రీనివాస్, లావణ్య దంపతులకు కూతురు సంజన (16), కుమారుడు ఉన్నారు. సంజన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో సంజన ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెంది మానసిక ఒత్తిడికి లోనైంది. శనివారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోకి వెళ్లిన సోదరుడు ఉరేసుకున్న అక్కని చూసి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఎస్ఐ మహేశ్ను వివరణ కోరగా విద్యార్థిని ఆత్మహత్య విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.హుస్నాబాద్లో ఉరేసుకున్న విద్యార్థిని -
ఉపాధి అదరగొట్టె
జొన్న రొట్టె..పోషక ఆహారంపై ప్రజల దృష్టి ● మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం ● మహిళలకు వరంగాజొన్న రొట్టె కేంద్రాలు ● ఒక్కో రొట్టె రూ.15 లెక్కన విక్రయం ● రోజుకు సగటునరూ.500 సంపాదన ● జిల్లా వ్యాప్తంగా సుమారు200 కుటుంబాలకు ఆధారంతూప్రాన్ మండలం ఘనపూర్లో సాగు చేస్తున్న తెల్లజొన్న పంటతూప్రాన్: జొన్న రొట్టె ఒకప్పుడు పేదల ఆహారం క్రమ క్రమంగా వరి భోజనానికి ప్రజలు అలవాటు పడటంతో జొన్నల కొనుగోలు క్రమక్రమంగా తగ్గిపోయింది. కాలక్రమేణ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతుండటంతో మళ్లీ జొన్న రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో జొన్న రొట్టెల తయారీ కేంద్రాలు పెరిగాయి. పలు గిరిజన మహిళలు వాటిని తయీరు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలకు ఉపాధిగా జొన్న రొట్టె.. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కుంటుంబాలు జొన్న రొట్టె తయారీని ఉపాధిగా మల్చుకున్నారు. ఇందులో గిరిజన మహిళలు అధికంగా కనిపిస్తారు. రోజుకు సగటున రూ.500 సంపాదిస్తున్నారు. రుచి, ఆరోగ్య విలువలు కలగలిసి ఉండటంతో ఇవి రోడ్డు మార్గంలోని ప్రయాణికులను, ఇతర ప్రజానీకాన్ని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో ఎందరో మహిళలకు ఇది ఉపాధిగా మారింది. తూప్రాన్, మెదక్, చేగుంట, రామాయంపేట, నర్సాపూర్, తదితర రోడ్డు పక్కన తోపుడు బండ్లపై ఇవి లభిస్తున్నాయి. ఈ రొట్టెలను తయారు చేసి విక్రయిస్తూ వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇందులో అనేక గిరిజన తండాలకు చెందిన మహిళలు ఉన్నారు. జొన్న రొట్టె పోషక విలువల సమ్మేళనం జొన్న రొట్టెలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇది నెమ్మదిగా గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. 100 గ్రాముల జొన్న పిండిలో 10.4 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. మానవ శరీరానికి ప్రతి రోజూ అవసరమైన ఫైబర్లో 40 శాతం సమకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ బీ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలం చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడుతాయి. మధుమేహాలకు ఇది చక్కటి ఆహారం. కడక్.. సాఫ్ట్ రోటీలు కడక్, సాఫ్ట్ రొట్టెలను అప్పటికప్పుడే సిద్ధం చేసి ఇస్తారు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడవదు. దీనిని సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. తయారీ ఇలా.. జొన్న పిండిని కలపడానికి వేడి నీళ్లను ఉపయోగించాలి. నీళ్లు మరిగేటప్పుడు కాస్త నూనె, రుచికి సరిపడా ఉప్పు కలిపితే రొట్టెకు పగుళ్లురావు. కలిపిన పిండి ముద్దపై పది నిమిషాలు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. వీటిని చపాతీ కర్రతో కాకుండ చేత్తో చేస్తేనే చక్కగా వస్తాయని రొట్టెలు తయారు చేసే మహిళలు చెబుతున్నారు. కాగా కొందరు యంత్రాల సహాయంతో వివిధ రకాలు, మొక్కజొన్న. తెల్లజొన్న, రాగిజొన్న, గోధుమ రొట్టెలు తయారు చేస్తూన్నారు.యంత్రంతో క్షణాల్లో రొట్టెలు నా పేరు కవిత. మాది తూప్రాన్. రొట్టెల తయారీ కోసం అప్పు చేసి రూ.3 లక్షల వ్యయంతో యంత్రం కొనుగోలు చేశాను. యంత్రం ద్వారా రొట్టెలతో పాటు వివిధ రకాల పిండి వంటలు చేస్తున్నాను. జొన్నరొట్టె, మొక్కజొన్న రొట్టె, రాగి జొన్నరొట్టె, గోధుమ రొట్టెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తుంది. దీనిద్వారా ఉపాధి లభిస్తుంది. – కవిత, రొట్టెల తయారుదారు, తూప్రాన్ వ్యాయామం.. సమతుల ఆహార లోపం వ్యాయామం, సమతుల ఆహారం మానవుడికి ఆరోగ్యాన్ని పంచుతాయి. అవి కొరవడటంతో ఊబకాయులు పెరిగిపోతున్నారు. మితిమీరిన ఆహారం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. ఊబకాయం అందరినీ వేధిస్తున్న సమస్యగా మారింది. దీంతో మంచి ఆరోగ్యానికి వాకర్స్, ఊబకాయులు, మధుమేహం ఉన్న వాళ్లు జొన్న రొట్టెలను జోరుగా విక్రయిస్తున్నారు. -
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన తుడం సుధాకర్(35)తో నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామానికి చెందిన అరుణకి నాలుగేళ్ల కింట వివాహమైంది. మూడేళ్లుగా హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో చల్మెడ గ్రామంలో తెలిసిన వారి వద్ద అవసరానికి అప్పులు చేశారు. ఏడాది కిందట అరుణ తల్లిదండ్రులు మృతి చెందడంతో జప్తిశివనూర్ గ్రామానికి వచ్చి జీవిస్తున్నారు. చల్మెడలో ఎకరం, జప్తిశివనూర్లో మరో ఎకరం పొలం ఉండగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. పెళ్లి జరిగి నాలుగేళ్లు అయినా పిల్లలులేరు. దీనికి తోడు శుక్రవారం చల్మెడ గ్రామంలో అప్పు ఇచ్చిన వారు జప్తిశివనూర్కు వచ్చి అప్పుకట్టాలని అడిగి వెళ్లారు. మనస్తాపానికి గురైన సుధాకర్ శనివారం కోత మిషన్ వస్తుందని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య అరుణ పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. భార్య కళ్లెదుటే ఉరేసుకొని భర్త సంగారెడ్డి క్రైమ్: భార్య కళ్లెదుటే భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన మన్నె వినోద్ (25) స్థానికంగా ఆటో డ్రైవర్. నాలుగేళ్ల కిందట కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మౌనిక వృత్తిరీత్యా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. భర్త మీద కోపంతో మౌనిక 3న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 24న తన భర్త నిత్యం వేధిస్తున్నాడని కొండాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యను అతడి వెంట సంగారెడ్డిలోని ఇంటికి పంపించారు. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. తీవ్ర మనోవేదనకు గురై వినోద్ భార్య కళ్లెదుటే గదిలోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ : ఒకరి మృతి
రామాయంపేట(మెదక్): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్కు చెందిన వంక లింగం (55) బైక్పై రాత్రి రామాయంపేట వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై నుంచి దామరచెరువు తండా వైపు బైక్ను మలుపు తిప్పగా, వేగంగా హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై లింగం అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్టీవాపై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ బాల్రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పటాన్చెరు టౌన్: బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. పటాన్చెరు బస్టాండ్ వద్ద శనివారం 42 నుంచి 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది కనిపించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఉంటే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
షాపింగ్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ ● కిందపడ్డ వారిపై నుంచి వెళ్లిన లారీ ● తండ్రితోపాటు కుమారుడు,మరో చిన్నారి మృతి ● నలుగురికి గాయాలు ● నర్సాపూర్ మండలంలో ఘటననర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తితోపాటు అతడి కుమారుడు, సమీప బంధువైన చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మాల గోపాల్(32), భార్య పూజ, కూతురు ఆద్యశ్రీ, కుమారుడు అనుదీప్(5), అతడి తోడళ్లుడి కూతురు సహస్ర(8) ఐదుగురు కలిసి శనివారం ఒకే బైక్పై ఇంటి నుంచి బయలు దేరి నర్సాపూర్లో షాపింగ్ చేసేందుకు వెళ్తున్నారు. అలాగే కౌడిపల్లి మండలం కంచన్పల్లికి చెందిన దుంపల కరుణాకర్ భార్య వరలక్ష్మీతోపాటు నర్సాపూర్ నుంచి తమ గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గేట్ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల్ బైక్పై ఉన్న వారందరూ కిందపడ్డారు. వీరి వెనుకాలే మెదక్ నుంచి వస్తున్న లారీ గోపాల్, అనుదీప్, సహస్ర మీది నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. గోపాల్ భార్య పూజ ఎడమ కాలు విరుగగా, కూతురు ఆద్యశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్పై ఉన్న కరుణాకర్, వరలక్ష్మీకి స్వల్ప గాయాలయ్యా యి. స్థానిక ఎస్ఐ లింగం ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని అదుపులోకి తీసుకున్నారు.కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణ మృతుడు మాల గోపాల్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతోపాటు కుమారుడు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గోపాల్ తోడళ్లుడు సుధాకర్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం బొంతపల్లి గ్రామంలో ఉంటున్నాడు. ఇతడి కూతురు సహస్ర పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో వెంకట్రావ్పేటలోని బంధువుల ఇంటికొచ్చి మృత్యువాత పడింది. -
లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం
గజ్వేల్రూరల్: విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలిగినపుడే లక్ష్యాన్ని చేరుకోగలమని సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, నిజాం ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ అన్నారు. శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అనిత అబ్రహం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుమితరాయ్, మరో అతిథి జార్జ్ మార్షల్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు నరేశ్బాబు, లక్ష్మణ్, శైలజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన
ఎస్డబ్ల్యూజీ కార్యదర్శి అలుగు వర్షిణిబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర సాంఘీక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు పాలన అనుమతులు ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నుంచి వచ్చినట్లు తెలిపారు. పది రోజుల్లో సంబంధిత భూమిని కలెక్టర్ అందిస్తారన్నారు. మే నెలలో 47 కోట్లు వెచ్చించి కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులకు ఈ కళాశాలలో 75 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణం పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
వట్పల్లి(అందోల్): బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన డప్పు గీత(15) అందోలు రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వార్షిక పరీక్షల అనతరం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి తన కుటుంబీకులతో కలిసి భోజనం చేసి అందరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారు జామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు లేచి చూసే సరికి కూతురు కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. జహీరాబాద్ టౌన్: కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... పట్టణంలోని అహ్మద్నగర్కు చెందిన ఎండీ షమీమ్కు ఇద్దరు కొడుకులు, ఐదుగురు ఆడపిల్లలు. ఐదో కూతురు షాహీదా ఖుతున్(20) స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 23న అక్క ఆయేషా ఖుతున్తో కలిసి కళాశాలకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అప్పులు.. ఆపై కుటుంబ కలహాలు
వ్యక్తి ఆత్మహత్యమిరుదొడ్డి(దుబ్బాక): కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని అల్వాలలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ పరశురామ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పొగాకు స్వామి (31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. ఇటీవల అందినకాడికి అప్పులు చేసి రూ. 11 లక్షలతో బొలేరో వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనం కొన్న నాటి నుంచి సరైన గిరాకీలు లేక తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోయాడు. దీనికి తోడు ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య పాపన్నపేట (మెదక్): గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... పాపన్నపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉండటాన్ని శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయస్సు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఒంటిపై కుంకుమ రంగు షర్టు, నలుపు గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బట్టి, సుమారు పది– పదిహేను రోజుల క్రితం ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. మునిపల్లి(అందోల్): ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... ఈ నెల 23న ఉదయం శ్రీనివాస్(40) ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులో చెట్టుకు ఊరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో వ్యక్తి... రామాయంపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఝాన్సీలింగాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్వాల రాజు (35) మిషన్ భగీరథ వాటర్మెన్గా పనిచేస్తున్నాడు. తన భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామంలో ఓ రైతు పంట చేను వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కష్టాల ‘విజయ’కు ఊరట
● సాత్విక భవిష్యత్తుకుఎమ్మెల్యే హరీశ్ రావు భరోసా ● ఆయన చొరవతో వ్యాపారి చేయూతసిద్దిపేటజోన్: ఇటీవల విద్యార్థుల అవగాహన సదస్సులో తన తల్లి విజయ పడుతున్న కష్టం తలుచుకొని ఏడ్చిన సాత్వికకు దాతలు చేయూతనందిస్తున్నారు. సాత్విక ఆర్థిక పరిస్థితిపై సాక్షిలో ఈనెల 23న ప్రచురితమైన కష్టాల కడలిలో విజయ తీరం వైపు కథనానికి దాతలు ముందుకు వచ్చారు. సాత్విక కుటుంబ పరిస్థితుల గూర్చి ఆరా తీసిన ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో ఆర్థిక సాయం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి చిన్నారి సాత్విక, తల్లి విజయను పిలిపించి వారితో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం తన మిత్రుడి సహాయంతో హైదరాబాద్ వ్యాపారి తిరుమల్రెడ్డి ద్వారా రూ.2 లక్షల చెక్కును విజయకు అందించారు. అమ్మ ప్రేమ చాలా గొప్పదని, మంచిగా చదివి భవిష్యత్తులో ఉద్యోగం సాధిస్తే అమ్మ కష్టాలు తీరినట్టేనని సాత్వికతో ఎమ్మెల్యే ఆత్మీయంగా అన్నారు. భవిష్యత్తులో విద్యాపరంగా అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన పర్సును కండక్టర్ గుర్తించి డీఎంకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం మోడ్రన్ బస్టాండ్లో శుక్రవారం చోటు చేసుకుంది. సిద్దిపేట డిపో మేనేజర్ టి.రఘు వివరాల ప్రకారం... డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు నీరజ బస్సులో వస్తున్నది. ఆమె ముస్తాబాద్లో బస్సు దిగే క్రమంలో పర్సు మరిచిపోయింది. దీంతో సిద్దిపేటకు వచ్చిన తరువాత బస్సులో ఉన్న పర్సును కండక్టర్ వేణుగోపాల్ గుర్తించి డిపో మేనేజర్కు అందజేశాడు. అనంతరం పర్సులో ఉన్న 10గ్రాముల బంగారం, రూ.10వేలను సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్లో ప్రయాణికురాలికి డీఎం, స్టేషన్ మేనేజర్ బాలకిషన్, సెక్యూరిటీ సురేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికురాలు డీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఆర్టీసీ బస్సులో తాను ప్రయాణం చేయకుండా ఉంటే నష్టం జరిగేదని ఆమె పేర్కొన్నారు.పర్సును ప్రయాణికురాలికి అందజేసిన డీఎం -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఘటనా స్థలంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరునర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... సంగారెడ్డి జిల్లా చౌటకురు మండల కేంద్రానికి చెందిన ఎల్లపోల్ల బాలరాజ్ (32) సొంత పనిపై హైదరాబాద్కు బైక్పై వెళ్లి తిరిగి నర్సాపూర్ మీదుగా స్వగ్రామానికి వస్తున్నాడు. నర్సాపూర్కు చెందిన చింతకుంట నవీన్ (26) బైక్పై సంగారెడ్డి వైపు నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా వస్తున్న బాలరాజు బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బాల్రాజు అక్కడికక్కడే మృతి చెందగా నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు నవీన్ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మృతి చెందాడు. బాలరాజ్ భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలరాజుకు భార్య, పిల్లలు ఉన్నారు. మరో ఘటనలో వ్యక్తి.. చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పులిమామిడి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దొంగల ధార్మరం గ్రామానికి చెందిన గఫార్(40) దౌల్తాబాద్కు బైకుపై డీజిల్ తీసుకురావడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో గాయపడిన అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళల రక్షణకు పెద్దపీట
● సమావేశంలో సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్లో హుస్నాబాద్ డివిజన్ పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్ డాటా ప్రకారం క్రైమ్ రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన టెక్నాలజీ ఉపయోగించడం, నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. రౌడీలు, అనుమానితులను తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై రైతులు ధాన్యం ఆరబెట్టకూడదని సూచించారు. అడవిపందుల నుంచి పంట రక్షణ కోసం చుట్టూ కరెంటు వైర్లు ఏర్పాటు చేస్తున్నారని రైతులను పిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐలు శ్రీనివాస్, శ్రీను, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీట మునిగి వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): దర్శనానికి వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికెల్ గ్రామానికి చెందిన వీరస్వామి (40) తన భార్యాపిల్లలతో కలిసి బంధువుల విందులో పాల్గొనడానికి ఽఽశుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు చెక్డ్యాంలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఏడుపాయల్లో మృతదేహం గుర్తింపు ● కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం ● అనంతరం పూడ్చివేసిన పోలీసులు హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్(37)ను గత నెల 26న నగల కోసం తీసుకొచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పాపన్నపేట మండలం ఏడుపాయల శివారులోని మొదటి బ్రిడ్జి వద్ద హత్య చేసినట్లు అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి మహేశ్ మృతదేహంగా గుర్తించారు. శవం కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. వ్యక్తి మృతదేహం లభ్యం చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... చేగుంట శివారులోని మక్కరాజీపేట బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు. మృతుడు గోధుమరంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ గోదాం ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు కొండపాక(గజ్వేల్): అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం... కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామ శివారులో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంను ఏర్పాటు చేశారు. ఈనెల15న కోల్డ్ స్టోరేజీ పక్కన భూమిని కౌలుకు తీసుకున్న రైతు రాజయ్య ఖరీఫ్ సీజన్ పనుల కోసం పత్తి పొరకకు నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజీ గోదాంలోకి ప్రవేశించి రూ. 1.50 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో నిర్వాహకుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ ఫిర్యాదు మేరకు రాజయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరటి పండ్లను ఇవ్వడం లేదన్న కక్షతో గోదాం పక్కన పత్తి పొరకకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. రాజయ్య పరారీలో ఉండటంతో శుక్రవారం అరెస్టు చేశారు. -
పాక్పై చర్యలు తీసుకోవాలి
పటాన్చెరు టౌన్: ఫహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ముస్లిం సమాజం మండిపడింది. మతం పేరిట మారణహోమం సృష్టించినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని వారంతా నినదించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో శుక్రవారం ముస్లిం సోదరులు నిరసనలు చేపట్టారు. హిందూ ముస్లిం మతకలహాలను సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులు చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజులు చదివారు. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు ముస్లిం సమాజం వెన్నంటే ఉంటుందని మైనారిటీ నాయకులు మేరాజ్ ఖాన్, అబెద్, మునీరుద్దీన్, మీర్ ముహియుద్దీన్, నాసర్, కలీం పేర్కొన్నారు. కార్యక్రమంలో బాసిత్, ఇంతియాజ్, అన్వర్, మస్తాన్, అజీజ్, ఫైయజ్, గౌస్, నసీర్, సల్మాన్, సోఫీ, తదితరులు పాలొన్నారు.ఇస్నాపూర్ చౌరస్తాలో ముస్లిం సోదరులు -
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీలు
జోగిపేట సీడీపీఓ ప్రియాంక జోగిపేట(అందోల్): ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నట్లు జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ ప్రియాంక స్పష్టం చేశారు. అంగన్వాడీ దినోత్సవాన్ని 6,11,14,15,16 కేంద్రాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో 3 నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులను కేంద్రాలలో చేర్పించాలన్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. చిన్నారులకు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కేంద్రంలో చిన్నారులకు ఫలితాల సర్టిఫికెట్లు అందించారు. -
మామిడి కాయకు కవర్
జహీరాబాద్ టౌన్: పెరిగిన పెట్టుబడులతో పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం జిల్లాలోని కొంత మంది రైతులు వినూత్న ఆలోచనలతో వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైనా మంచి ఆదాయం పొందుతున్నారు. చీడపీడల నుంచి రక్షణ, బరువు పెరిగి అధిక లాభాలు రావడానికి మామిడి కాయలకు కవర్లు కడుతున్నారు. సాధారణంగా కంటే కూడా కవర్లలో పెరిగే మధుర ఫలం నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. లాభాలు అనేకం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మామిడి చెట్లు పూత పూసినా కాత నిలబడటం లేదు. 60 నుంచి 70 శాతం పిందె రాలిపోతోంది. ఈ పరిస్థితిలో పంటను కాపాడుకొని దిగుబడి పెంచుకోవడం రైతులకు కష్టమవుతోంది. కాయకు కవర్ కట్టే విధానం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మామిడి కాయ కోడిగుడ్డు సైజులోకి రాగానే కవర్లు కడతారు. దీని వల్ల తొడిమ వద్ద నల్లగా మసి రావడం, పురుగు పట్టడం, సొన కార డం లాంటివి తగ్గుతాయి. దీంతో పురుగు మందుల అవసరం చాలా వరకు ఉండదు. ఈదురు గాలులు, వడగండ్ల వానకు కాయలు రాలవు. మాములు కాయకంటే బరువు ఎక్కువగా ఉంటుంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉంటాయి. చెట్టుపైనే పక్వానికి రావడం వల్ల అధిక ధర పలుకుతుంది. ఖర్చు ఎక్కువ మామిడి కాయలకు కవర్ కట్టడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ. ఒక్కో బ్యాగ్కు రూ. 2.50 పైసలకు లభిస్తుంది. కట్టడానికి రూ.2.50 కూలీ ఖర్చు అవుతుంది. ఈ బ్యాగ్ లోపలివైపున నల్లరంగు, బయటవైపు గోధమ రంగులో ఉంటుంది. వీటిని కట్టడానికి ముందు కాయలను బట్టతో శుభ్రం చేయాలి. కాయ కింది భాగం నుంచి తొడిమ పైభాగంలో మూడు సెంటీమీటర్ల పైన కట్టాలి. అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల కలిగే లాభాల గురించి కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థులకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలోని మామిడి తోటల వద్ద రైతులకు ప్రాక్టికల్గా కవర్లు కట్టడం చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల కాయ బరువు పెరిగి రైతులకు అధిక లాభాలు వస్తాయనిచెబుతున్నారు.మధుర ఫలానికి రక్షణ వినూత్న విధానంలో సాగు పెరుగుతున్న కవర్ల వినియోగంపూత నుంచి కోత వరకు.. మామిడి చెట్లకు పూత వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగండ్ల వాన, ఈదురుగాలులు, చీడపీడల బెడద కారణంగా పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మ్యాంగో ప్రొటెక్షన్ బ్యాగ్స్(కాయలకు రక్షణ సంచులు)ను ఏర్పాటు చేస్తున్నారు. కాయలకు కవర్లు కట్టడం వల్ల పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. కవర్లను సబ్సిడీపై ఇవ్వాలి జహీరాబాద్ పట్టణ సమీపంలో గాయత్రి పామ్హౌస్లో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. సుమారు 4 లక్షల కవర్లు కట్టాం. మూడేళ్ల నుంచి కాయలకు కవర్లు కడుతున్నాం. మామూలు కాయకంటే కవర్ కట్టిన కాయ చాలా నీట్గా అధిక బరువు ఉంటుంది. కానీ కవర్ల ఖర్చు ఎక్కువ అవుతోంది. ఒక్కో కవర్ రెండు నుంచి మూడు రుపాయలకు లభిస్తుంది. కట్టడానికి కూలీల ఖర్చు కూడా అవుతుంది. ఈ బ్యాగ్లు హైదరాబాద్లో దొరకనందున ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఉద్యానశాఖ తరపున కవర్లు సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడే రైతులు ముందుకు వస్తారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే సబ్సిడీపై కవర్లు ఇస్తున్నారు. ఈ జిల్లాలో కూడా ఇవ్వాలి. – హరీశ్, మామిడి రైతు, జహీరాబాద్ -
మార్కెట్ ధర చెల్లించాలి
జిన్నారం (పటాన్చెరు): మార్కెట్ ధర ప్రకారమే రైతులకు న్యాయం చేయాలని, వారికి ఎదురయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిన్నారం రైతులు విజ్ఞప్తి చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు వారు హాజరై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్రెడ్డి మాట్లాడుతూ....పారిశ్రామిక వాడ ఏర్పాటు నేపథ్యంలో మార్చి 7న భూసేకరణ ప్రారంభించామన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు అడిగితెలుసుకున్నారు. పారిశ్రామికవాడ ఏర్పాటయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధిలోకి వస్తుందన్నారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ...ఇప్పటికే 98 మంది రైతులు ఉన్నారని, రైతులందరూ వారి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలన్నారు. వీటిలో ఏవైనా తప్పులు ఉన్నా, ఎవరి పేరైనా రాకపోయినా, వాటిలో భూమి వివరాలు పడకపోయినా, ఒకవేళ రైతు చనిపోయిన, లేదా భార్య లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న రికార్డుల్లో మార్పులు చేర్పులు సరి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.ప్రజాభిప్రాయ సేకరణలో జిన్నారం రైతులు -
‘ఉపాధి’ పనులు భేష్
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని విదేశీ ప్రతినిధులు కితాబిచ్చారు. వివిధ దేశాలకు చెందిన 25మంది విదేశీ ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కూలీలతో మాట్లాడి పథకం అమలుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలు, వేతన చెల్లింపులు,మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విదేశీ బృందానికి నీటి సంరక్షణ,పల్లె ప్రగతి కింద చేపడుతున్న పనులపై, సామాజిక తనిఖీపై వివరించారు.విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పథకం అమలు పద్ధతులను మెచ్చుకున్నారు.ప్రత్యేకించి డిజిటల్ మానిటరింగ్ విధానాలు,పారదర్శక చెల్లింపుల వ్యవస్థలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను వారు ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో లేని ఈ ఉపాధి హామీ పథకం భారతదేశంలో మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు కమిషనర్ శేషుకుమార్, ఎస్పీఎం మురళీ, పీడీ జ్యోతి,అదనపు డీఆర్డీఓలు బాలరాజు, జంగారెడ్డి,ఎన్జీవో ప్రతినిధులు వర్షిణి, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.విదేశీ ప్రతినిధుల బృందం కితాబు -
అంగన్వాడీలపై నజర్
కొనుగోలు కమిటీల ద్వారా టెండర్లు ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యేలా దృష్టి పెట్టింది. సరుకుల కొనుగోళ్ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం లేకుండా చేసింది. ఈ–టెండర్ విధానాన్ని పాటించేలా సూచనలు జారీ చేసినట్లు సమాచారం. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కోడిగుడ్లు సరిగ్గా సరఫరా జరిగేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.జహీరాబాద్: ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఇటీవల ఉన్నతాధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నట్లు పేర్కొంది. చిన్నారులు లేరనే సాకులతో కేంద్రాలను మూసివేయడం సరికాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుని సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చుకునే అవకాశం ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్య వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించింది. ప్రతీ కేంద్రంలో తప్పనిసరిగా 20 మంది సంఖ్య ఉండేలా నిర్వాహకులు చూసుకోవాల్సి ఉంటుంది. బడి బాట తరహాలోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఐసీడీఎస్ అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రయత్నాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదనే భావన ఉంది. చిన్నారుల సంక్షేమంపై భారీగా ఖర్చు పెడుతున్నా అధికారులు సరిగ్గా పనిచేయడం లేదనే అపోహ ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీన్ని సరిచేసేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని యోచిస్తోంది. అందులోభాగంగానే జిల్లా సంక్షేమాధికారులు వారానికి కనీసం మూడు కేంద్రాలను అయినా సందర్శించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.పిల్లల సంఖ్య పెంచేలా చర్యలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి గ్రేడింగ్ విధానం అమలుకు నిర్ణయంఅంగన్వాడీ బాటతో సంఖ్య పెంచుతాం కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకుగాను మే నెలలో అంగన్వాడీ బాట కార్యక్రమం చేపడతాం. కేంద్రం నిర్వాహకులు ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నారుల గురించి ఆరా తీస్తారు. రెండేళ్లు నిండిన చిన్నారులను కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సంఖ్య తక్కువ ఉన్న పట్టణ ప్రాంతాల్లోని రెండు మూడు కేంద్రాలను ఎక్కువ ఉన్న ప్రాంతాలకు మార్పించాం. కేంద్రాల పనితీరుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. –లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారి, సంగారెడ్డి -
గాలికుంటు టీకాలు తప్పనిసరి: విజయ్
పటాన్చెరుటౌన్: పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గాలికుంటు టీకాలు తప్పని సరిగా వేయించాలని కేంద్ర పశుసంవర్థక శాఖ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామ సమీపంలోని గోశాలలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ హాజరై వ్యాక్సినేషన్పై ఆరా తీయడంతోపాటు గోశాలలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శైలేంద్ర జస్వాల్, గోశాల కార్యదర్శి గిరిధర్, డాక్టర్ లు జితేందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలనసంగారెడ్డి జోన్: ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన అందించటం సాధ్యమవుతుందని డీఆర్ఓ పద్మజారాణి పేర్కొన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణ అంశాలపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారంతో ముగిసింది. కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రామసభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందించడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 35 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మలేరియాపై జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సంగారెడ్డి: ప్రతీ ఒక్కరూ మలేరియాపై జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వాస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ...ఈగలు, దోమలు, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రతీ ఒక్కరు చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్లింగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరిందని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బ్రహ్మానందరెడ్డి, రాజు, ఽమాజీ సర్పంచ్ ధన్రాజ్ పాటిల్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, ఖేడ్ మండలం ర్యాకల్లో 23న ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు మూడవరోజూ శుక్రవారం కొనసాగాయి. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. -
నిద్రిస్తున్న యువకుడి పైనుంచి..
మర్కూక్(గజ్వేల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ యువకుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మర్కూక్ మండలంలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ దామోదర్ వివరాల ప్రకారం... కర్కపట్ల గ్రామానికి చెందిన కరుణాకర్ (24) అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ వద్ద క్లీనర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ తన టిప్పర్ల ద్వారా ప్రతి రోజు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో గ్రామంలో నుంచి మట్టిని హైదరాబాద్కు తలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12గంటల తర్వాత మూడు టిప్పర్లు, 2 జేసీబీల సహాయంతో కర్కపట్ల గ్రామానికి చెందిన గ్యార మల్లేశం ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలిస్తున్నాడు. తన వద్ద క్లీనర్గా పనిచేస్తున్న కరుణాకర్ నిద్రరావడంతో కొద్దిసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పక్కన నిద్రిస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా అతడి ఛాతీపై నుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కరుణాకర్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేన్నారు. రేణికుంట రోడ్డు ప్రమాదంలో... బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద గల రాజీవ్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బెజ్జంకి క్రాసింగ్కు చెందిన బి.నక్షత్రమ్మ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో బెజ్జంకిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్షత్రమ్మ భర్త ఆనందరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కొలిపాక మంజుల, బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఐలేని నవీన్రెడ్డిలకు కాలు ఫ్యాక్చరైంది. వీరు కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్పై కేసు నమోదు
మనోహరాబాద్(తూప్రాన్): తప్పుడు వార్తలు రాసిన యూట్యూబర్పై కేసు నమోదైంది. ఈ ఘటన హనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం ప్రకారం... మండలంలోని కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అక్రమంగా అనుమతులు ఇచ్చిందని, రెచ్చగొట్టేలా, ఓ యూట్యూబ్ చానల్లో పార్ట్ 1, పార్ట్ 2 పేరిట ఓబులేసు లింగంగౌడ్ అనే వ్యక్తి టెలికాస్ట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపులో పడి వ్యక్తి మృతిములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం తున్కిబొల్లారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం బలవంతరెడ్డి(34)వ్యవసాయం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దగల నీటి సంపులో బోరు మోటరు నడవక పోవడంతో సంపులోకి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఇది గమనించిన తమ్ముడు కోటిరెడ్డి విషయాన్ని తన తండ్రి బుచ్చిరెడ్డికి తెలుపగా వారిరువురు కలిసి బలవంతరెడ్డిని నీటి సంపులోనుంచి పైకి తీసి చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలున్నారు. పిట్టగోడ కూలి గర్భిణి మృతి ● వర్షం వస్తుందని దాబా దగ్గర ఆగిన భార్యాభర్తలు.. ● టీ తాగుతుండగా గోడ కూలి ప్రమాదం మునిపల్లి(అందోల్): పిట్టగోడ కూలడంతో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని పొల్కంపల్లికి చెందిన మన్నె విజయ్, ఆయన భార్య శ్రావణి (గర్భిణి) సదాశివపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. బుదేరా గ్రామానికి సమీపంలోకి రాగానే ఈదురు గాలులు, వర్షం రావడంతో భార్యాభర్తలు ఓ దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు. అదే సమయంలో దాబా రేకుల షేడ్డు ముందు భాగంతో పాటు పిట్టగోడ కూలి శ్రావణిపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలొదిలింది. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం తాగి కిందపడి వ్యక్తి మృతిపటాన్చెరు టౌన్: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లికి చెందిన ఊషయ్య(45) తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఇంద్రపురి కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఈనెల 13న మద్యం తాగి కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మేస్త్రి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అనంతరం అతనికి తల నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేసి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో 23న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎఫ్ఆర్ఓ అర్చన, సిబ్బంది గురువారం సీజ్ చేశారు. జలాల్పూర్, జాకంపల్లి తండాల్లోని అడవిలోని వాగుల నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీజ్చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
హుస్నాబాద్: పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన వెంకటస్వామి తన ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం ఊరికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువతి అదృశ్యం నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంచర్ల నారాయణ కూతురు కంచర్ల కృష్ణవేణి (19)ఈనెల 23న తల్లి చంద్రకళతో కలిసి నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. తల్లి ఆస్పత్రి లోపల బంధువులను పరామర్శిస్తుండగా కృష్ణవేణి బయటకు వచ్చి కనపడకుండా పోయింది. చుట్టుపక్కల తల్లి, బంధువులు వెతికినా కనిపించలేదు. గురువారం తండ్రి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులే మరణ శాసనమై..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటకమాన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం రాంనగర్కు చెందిన మండల నరేశ్(32) కొన్నేళ్లుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకునే అతడికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపానికి గురై పట్టణ శివారు ఎర్ర చెరువు కట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు అతడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై లింగం కథనం ప్రకారం... నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ గిరిజన తండాకు చెందిన నేనావత్ జాంగిర్ నాయక్ (35) తనకు ఉన్న 20 గుంటల భూమితో పాటు ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మతిస్థిమితం లేని వివాహిత.. కొండపాక(గజ్వేల్): మతిస్థిమితం లేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ సీఐ.విద్యాసాగర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మి (56)కి కొన్ని నెలలుగా మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతుకుతున్న క్రమంలో ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా భూమి హద్దు కోసం పాతిన ఎత్తైన గనేట్ రాయికి ఉరేసుకొని చనిపోయింది. మృతురాలికి భర్త, కొడుకు, కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులబాధతో యువకుడు.. తొగుట(దుబ్బాక): అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లారెడ్డిసేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మన్నె భాస్కర్ (29) డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు ఏళ్ల క్రితం భార్య మహేశ్వరి మృతి చెందింది. తీవ్ర మనోవేదనకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటిపై ప్రైవేట్ ఫైనాన్స్లో రూ 3.25లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత.. జిన్నారం (పటాన్చెరు): అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం... మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన రేష్మాబేగంను (30) కానుకుంట గ్రామానికి చెందిన ఎండి అహ్మద్ 2019లో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భర్త అహ్మద్, అత్త భాను, బావ సలీం, చిన్న మామ పాషాలు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని రేష్మ భేగంను మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో ఈనెల 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోమారు గొడవపడటంతో 22వ తేదీన పెద్దల సమక్షంలో మాట్లాడి ఒప్పించారు. దీంతో అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరు కొడుకుల మణికట్టుపై గాయపరిచి రేష్మా బేగం బెడ్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోఉన్న ఇద్దరి పిల్లలను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అత్తింటి వేధింపులతోనే మృతి చెందిందని సోదరుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య -
కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్కు సరుకుల లారీలను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయం నుంచి పంపించనున్నట్లు కేదారినాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్లుగా కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులను అందిస్తూ, యాత్రికులకు ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మే 2 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడికి వచ్చే భక్తులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, రాత్రి భోజనం అందించనున్నామని చెప్పారు. శుక్రవారం శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకళ్యాణం నిర్వహించి, లారీలను కేదార్నాథ్కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాంకాల నవీన్కుమార్, మధుసూదన్, రత్నాకర్, శరభయ్య, కాశీనాథ్, గంజి రాములు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. నేడు వెళ్లనున్న సరుకుల లారీలు కేదారినాథ్ అన్నదానసేవా సమితి సభ్యులు వెల్లడి -
కారు ఢీకొట్టిన ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
వర్గల్(గజ్వేల్): బైకును వెనక నుంచి కారు ఢీకొట్టడంతో బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్రోడ్డు వద్ద రాజీవ్రహదారిపై జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం... మర్కూక్ మండలం ఎర్రవల్లికి చెందిన సంద గణేశ్(40)కు భార్య పద్మ, 14 యేళ్లలోపు మనోజ్, మానస అనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువుల కోసం గజ్వేల్లో ఉంటూ టిప్పర్, జేసీబీ పనులు చూసుకుంటున్నాడు. గురువారం సాయంత్రం బైక్పై గజ్వేల్ నుంచి గౌరారం వైపు వస్తున్నాడు. సింగాయపల్లి క్రాస్రోడ్డు వద్ద వెనక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకుకేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరికోత.. కన్నీటి వెత
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దుబ్బాకకు చెందిన కేసుగారి స్వామి. తనకున్న 12 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి వేశాడు. తీరా వరి కోద్దామంటే వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేలలో నీరు నిలిచిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చైన్ హార్వెస్టర్తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 12 ఎకరాలు కోసేందుకు కామన్ హార్వెస్టర్తో 14 గంటలు పట్టేది. ఇప్పుడు చైన్ మిషన్తో కోస్తే 18 గంటలకు పైగా సమయం పట్టింది. వరి కోసి వడ్లను రోడ్డుపైకి తెచ్చి ట్రాక్టర్లో పోయాల్సి రావడంతో అదనంగా 5 గంటలకు పైగా సమయం ఎక్కువైంది. పైగా కామన్ హార్వెస్టర్కు గంటకు రూ.2 వేలు ధర ఉంటే చైన్ మిషన్కు రూ.3 వేలకు పైగా ఉంది. దీంతో రూ.26 వేలలో పూర్తి కావాల్సిన కోతకు రూ.50 వేలకు పైగా అంటే అదనంగా రూ.24 వేలు అదనపు భారం పడింది. ప్రతిసారి వడ్లు 20 ట్రాక్టర్లకు పైగా అంటే 350 క్వింటాళ్ల వరకు అయ్యేవి. ఇప్పుడు తక్కువయ్యాయి. ఇది ఒక్క రైతు స్వామిదే కాదు చాలామంది రైతులది ఇదే పరిస్థితి. చైన్మిషన్తో కోయించా.. వరుసగా వానలు పడటంతో కోత కొచ్చిన వరిపంట కోసేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. వానలతో భూమి ఆరలేదు. మళ్లీ వాన వానలు వస్తుండటంతో ఎక్కువ డబ్బులు పోయినా ఉన్న పంటను దక్కించుకోవాలనే చైన్మిషన్తో కోయించా. నేనే కాదు రైతులందరూ చైన్మిషన్, ఫోర్వీల్తోనే కోయించుకుంటున్నారు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు అకాల వర్షాలతో ఇబ్బందులు తీరా పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాలతో కోసిన వడ్లు ఆరబోసేందుకు , వరి కోతలు కోసేందుకు కూడా అదనంగా ఖర్చులు అవుతున్నాయి. – రాధిక,జిల్లా వ్యవసాయ అధికారివరి కోసేందుకు నరకయాతన దుబ్బాక: అసలే యాసంగిలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టిపోయి చాలా పంటలు ఎండిపోయాయి. ఇక పంట చేతికొస్తదనుకున్న దశలోనే జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో వడ్లు చాలా వరకు వడ్లు రాలిపోవడంతో రైతులకు కనీస పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి దాపురించింది. పోగా మిగిలిన గింజలను కోద్దామంటే వారం పదిరోజులుగా వరుసగా పడుతున్న వానలకు పొలాలు ఆరక దిగబడుతుండటంతో కోతలకు ఇబ్బంది అవుతోంది. దీంతో వరి కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర పెట్టి చైన్ మిషన్లతోనే కోతలు కోయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని ఒక్క దుబ్బాకనే కాకుండా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో వరి కోతలు కోసేందుకు రైతులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో 45 శాతానికి పైగా వరికోతలు జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరిపంట వేయగా ఇప్పటి వరకు 45 శాతం వరకు అంటే సుమారుగా 1.45 లక్షలకు పైగా ఎకరాల్లో కోతలు కోయడం పూర్తయింది. ఇంకా 55 శాతం వరకు కోతలు కోయాల్సి ఉంది. కోసిన కోతల్లో 20 శాతం వరకు చైన్మిషన్లు, ఫోర్వీల్తోనే కోశారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులపై అదనపు భారం పొలాలు దిగబడుతుండటంతో చైన్మిషన్తో కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్వెస్టర్కు గంటకు రూ.2వేలు ఉండగా చైన్ మిషన్ గంటకు రూ.3వేల నుంచి 3500 వరకు ధర చెల్లించాల్సి వస్తోంది. పొలాలు దిగబడుతుండటంతో వడ్లు పోసేందుకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉంది. సాధారణంగా ఎకరం వరికోతకు టైర్ హార్వెస్టర్తో గంట 10 నిమిషాల నుంచి 1.20 పడుతుండగా చైన్ మిషన్తో ఎకరం వరికోసి వడ్లు బయట పోయాల్సి వస్తుండటంతో 2 గంటలకు పైగా సమయం పడుతోంది. అంతేకాకుండా చైన్మిషన్కు రేటు కూడా ఎక్కువ ఉండటంతో ఎకరానికి రైతుకు అదనంగా 5 నుంచి 6 వేల వరకు భారం పడుతోంది. రైతులు చైన్మిషన్తోనే కోయిస్తుండటంతో అవి దొరకక ప్రతిరోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులను కోలుకోకుండాచేస్తున్న అకాల వర్షాలు భూమిలో తేమతో దిగబడుతున్నహార్వెస్టర్లు చైన్మిషన్లతో వరి కోతలు ఎకరానికి రూ.5 వేలకు పైగాఅదనపు భారం జిల్లాలో ఇప్పటి వరకు 45 శాతం కోతలు -
జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ చోరీ..
● అంతర్జిల్లా దొంగను పట్టుకున్నత్రీటౌన్ పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధుసిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గురువారం సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట ఏసీపీ మధు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఇస్సానగర్కు చెందిన చెవుల మల్లేశం (40) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేస్తున్నాడు. తన సమీప గ్రామాల్లో దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతాననే భయంతో దూర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ముందు రోజు రెక్కీ నిర్వహించి అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొండపాక మండలం మర్పడగ మధరి దోమలోనిపల్లి గ్రామంలో దోమల మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని అపహరించాడు. అంతకుముందు ఫిబ్రవరి 12న రాంపల్లి గ్రామ శివారులోని బొమ్మ నర్సయ్య పొలం వద్ద నిలిపి ఉంచిన జాన్డీర్ ట్రాక్టర్ను ట్రాలీతో సహా దొంగిలించి తన స్వగ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ట్రాక్టర్ను గుర్తు పట్టకుండా నంబర్ ప్లేట్కు రంగులు వేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో సెలంపు గ్రామ శివారులో ట్రాక్టర్ ఇంజిన్తో సహా ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి జాన్ డీర్ ట్రాక్టర్ ఇంజిన్, రెండు ట్రాలీలు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. నేరస్తుడు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బంది తిరుపతిరెడ్డి, బాబు, శ్రీనివాస్లను ఏసీపీ అభినందించారు. -
ఆటలాడుకుందాం రండి
● మే 1 నుంచి వేసవి శిబిరం ప్రారంభం ● ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ సంగారెడ్డి జోన్: పాఠశాలలకు సెలవులు ప్రకటించటంతో విద్యార్థులకు క్రీడలపై శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటు చేసి, శిక్షణ అందించనున్నారు. ఇప్పటికే శిక్షణ అందించే కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా శిక్షణ అందించే కోచ్లను సైతం నియామకం చేసింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో రాణించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెలరోజులపాటు కార్యక్ర మాలు వేసవి శిక్షణ కార్యక్రమాలు మే 1న ప్రారంభమై మే 31 వరకు కొనసాగనున్నాయి. నెల రోజులపాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత యువతకు శాఖ తరఫున సర్టిఫికెట్లు అందిస్తారు. 14 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలకే... క్రీడా శిబిరాలలో14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు మాత్రమే శిక్షణ అందిచనున్నారు. ఆసక్తి గల బాల, బాలికలు ఈ నెల 31 వరకు జిల్లా క్రీడల అధికారి ఫోన్ నం:7981798957 కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పలు క్రీడలపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, అథ్లెట్స్, కబడ్డీ, చెస్, ఫుట్బాల్ పట్ణణ ప్రాంతాలలో హ్యాండ్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, వుషు క్రీడలలో శిక్షణ కల్పించనున్నారు. గ్రామీణప్రాంతాల్లో 10..పట్టణ ప్రాంతాల్లో 12 జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 10, పట్టణ ప్రాంతాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణకు రూ.50వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. క్రీడా సామగ్రి కొనుగోలుతోపాటు శిక్షణ అందించే కోచ్లకు పారితోషికంగా రూ.4వేలు అందించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశాం. మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. –ఖాసీం బేగ్, జిల్లా యువజన, క్రీడల అధికారి, సంగారెడ్డి -
చెక్బౌన్స్ కేసులపై లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: బ్యాంకులో చెక్బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బ్యాంకు కేసులు రాజీమార్గంతో పరిష్కరించుకోవచ్చని, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిరామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గురువారం పలు కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీలకతీతంగా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతోపాటు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని వివరించారు. దైవభక్తి పెంపొందించుకోవాలి ప్రతీ ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో గల శ్రీ సాయిబాబా దేవాలయం వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వి.సింధురెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, పుష్ప, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.