breaking news
Sangareddy
-
కాంగ్రెస్తోనే పేదల సంక్షేమం
నారాయణఖేడ్/కంగ్టి/కల్హేర్: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని, పేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. కంగ్టిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇన్నాళ్లు రేషన్ కార్డులు లేక పేదలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్మెంట్ పూర్తిచేసిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే కల్హేర్ మండలం సిర్గాపూర్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద నల్లవాగు కాల్వలో పూడిక తీత, చెట్ల పొదల తొలగింపు పనులను పరిశీలించారు. నల్లవాగు ప్రాజెక్టు నిండితే కాల్వల ద్వారా సాగు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా పూడిక తీత పనులు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఖేడ్లో గొల్లకురుమ సంఘం నియోజకవర్గ, మండలాల నూతన కార్యవర్గాలను అభినందించారు. నియోజకవర్గంలోని గొల్లకురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
కార్మిక చట్టాలను విస్మరిస్తున్న యాజమాన్యం
పటాన్చెరు టౌన్: కార్మిక చట్టాలను పరిశ్రమల యజమాన్యాలు విస్మరిస్తున్నాయని యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజయ్య అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పాశమైలారంలోని సువెన్ ఫార్మా పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఫార్మా యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు. కార్మికులను ఉత్పత్తిలో నేరుగా పని చేయించుకోవడం తప్పని అన్నారు. అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, పరిశ్రమ యూనియన్ నాయకులు వెంకటేశ్, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభు, రాజు, మల్లేశ్, లక్ష్మి పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర నాయకుడు రాజయ్య -
క్షేత్రస్థాయిలో.. సాగు పాఠాలు
● గ్రామీణ కృషి అనుభవంలో వ్యవసాయ విద్యార్థులు ● కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ ఆధ్వర్యంలో అవగాహనసేంద్రీయ సాగుపై అవగాహన రైతులు తమ ఆరోగ్య ప్రయోజనాలను, నేల సారాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఉన్న భూమిలో కొంతవరకై నా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. తమ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు కనీసం కొంత మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసే విధంగా కృషి చేస్తా. ప్రాజెక్ట్లో భాగంగా మేము రైతులకు తెలియజేసిన విషయాల కంటే, మేము వారి ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాం. – టి.అక్షయ, అగ్రికల్చర్ విద్యార్థి, మల్లారెడ్డి యూనివర్సిటీ రైతుల సహకారం బాగుంది గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా శీలాంపల్లి గ్రామ రైతుల సహకారం బాగుంది. ఈ ప్రాజెక్ట్లో నేర్చుకున్న విషయాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. రైతులతో కలిసి చేసిన వ్యవసాయ పనులు మర్చిపోలేనివి. ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు గ్రామరైతుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటా. తరగతిలో నేను నేర్చుకున్న పాఠాలు రైతులకు క్షుణ్ణంగా వివరిస్తా. – ఎస్.అశ్వినికుమారి, అగ్రికల్చర్ విద్యార్థి, మల్లారెడ్డి యూనివర్సిటీతరగతి గదిలో నేర్చుకునే విద్యతోపాటు, క్షేత్ర స్థాయిలో సాగు పనులను పరిశీలిస్తూ ఆ పనులు చేయడంతో ఎక్కువ అవగాహన కలుగుతుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తాము నేర్చుకుంటున్న సబ్జెక్ట్పై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన పొందుతున్నారు. గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా మండలంలోని శీలాంపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు నేర్చుకుంటున్నారు. తాము తరగతి గదిలో చదువుకున్న విషయాలు రైతులకు తెలియజేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం తునికి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ అనుభవాలను రైతులకు వివరిస్తున్నారు. చిలప్చెడ్(నర్సాపూర్): రైతులకు సూచనలు...గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులు ప్రాజెక్ట్ మూడు నెలలు చేయాల్సి ఉండగా, నెలన్నర సమయం పూర్తయింది. ఈ సమయంలో వారు రైతులతో కలిసి వరినాట్లు వేయడం, పత్తి సాగులో మెలుకువలు, సాంకేతిక వ్యవసాయంలో భాగంగా డ్రోన్ల వినియోగం, సేంద్రీయ పద్ధతిలో వరి, మునగ సాగును పరిశీలిస్తున్నారు. వరికోత పూర్తికాగానే, కొయ్యకాళ్లలో మొక్కజొన్న సాగు చేసే పద్ధతులను నేర్చుకుంటున్నారు. అలాగే రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించి, భూసారానికి అనుకూలమైన పంటలు సాగుచేయాలని అవగాహన కల్పిస్తున్నారు.భూసార పరీక్షలకు కావాల్సిన మట్టిని, నేల నుంచి ఏ విధంగా సేకరించాలో ప్రయోగాత్మకంగా రైతులకు వివరించారు. పత్తికి సోకిన చీడపీడల గురించి వివరించి, వాటి నివారణకు చర్యలు సూచించారు. వరి, ఇతర పంటల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతు నారువేసే సమయం నుంచి, పైరు కోసే వరకు ఏ సమయంలో ఏ పనులు చేయాలి? ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పద్ధతులను వివరిస్తున్నారు. గ్రామాల రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా మొగ్గు చూపకుండా, ఎక్కువగా వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారని, పంటమార్పిడి చేసేలా సైతం విద్యార్థులు సూచిస్తున్నారు. గ్రామంలో కనీసం 15 మంది రైతులు తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయం చేసేలా అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు గ్రామ రైతుల నుంచి వ్యవసాయంలో పూర్తి సమాచారం తెలుసుకోవడంతోపాటు, తాము నేర్చుకున్న విషయాలను రైతులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.సాగు విధానాల పరిశీలన.. -
గేదె తాడు అడ్డురావడంతో..
దుబ్బాక: రోడు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ కీర్తి రాజు వివరాల మేరకు... మండలంలోని రాజక్కపేటకు చెందిన ముదిగొండ రాజేశం(55) గ్రామంలో కిరాణదుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళతో దుబ్బాకకు కిరాణసామగ్రి కోసం వెళ్లారు. ఆదివారం సాయంత్రం సామాను తీసుకొని బైక్పై భార్యాభర్తలు స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చెల్లాపూర్ శివారులో రోడ్డుప్రక్కన కట్టేసిన గేదె తాడు అడ్డువచ్చి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో రాజేశం తలకు తీవ్రగాయం కావడంతోపాటు చంద్రకళకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూరగాయలు తీసుకొస్తుండగా మహిళ..దుబ్బాకరూరల్: భైక్ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్లో జరిగింది. ఎస్ఐ హరీశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గుజ్జెటి బాలమణి(58) ఆదివారం సాయంత్రం గ్రామ చౌరస్తాలో కూరగాయలు కొనుగోలు చేసుకుని ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో భైక్పై సిద్దిపేట వైపు నుంచి రామాయంపేటకు వెళుతున్న రఘునందన్ అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా బైకిస్టుది మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనుగుల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది.. గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి చెందారు. ఈ ఘటన గజ్వేల్ మన్సిపాల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో గల రాణే కంపెనీ ఎదుట ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన రంగయ్య కూతురు సంధ్యను మిరుదొడ్డి గ్రామానికి చెందిన రాజ్కుమార్కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం జరిపించారు. సంధ్య, రాజ్కుమార్ దంపతులు ఉపాధి కోసం వెళ్లి మేడ్చల్ పరిధిలోని కేఎల్ఆర్ కమాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా, సంధ్య అమ్మమ్మగారి గ్రామమైన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల పండుగకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం రాజ్కుమార్ అత్తగారి గ్రామమైన కోనాపూర్కు బస్సులో చేరుకున్నారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో బావ రాజ్కుమార్ను మేడ్చల్లో దింపడానికి బామ్మర్ది సందీప్ కారులో బయలుదేరారు. వీరు ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళుతుండగా రాజీవ్ రాహదారిపై రాణే కంపెనీ ఎదుట ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజ్కుమార్, సందీప్ తీవ్ర గాయాలై దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి కిందపడిన దంపతులు భర్త మృతి..భార్యకు గాయాలు -
అదే అలసత్వం
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం● ఐదుగురు తహసీల్దార్లకుషోకాజ్ నోటీసులు ● బడాబాబులు, రియల్టర్లు, దళారుల పనులు మాత్రం చకచక ● విమర్శలకు దారితీస్తున్న కొందరు రెవెన్యూ అధికారుల పనితీరు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొందరు రెవెన్యూ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా భూసమస్యల పరిష్కారంలో తమ అలసత్వం వీడటం లేదు. ధరణి పోర్టల్ స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కొందరు తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులకు గతంలో ఉన్న ధరణి కష్టాలే ఇప్పుడూ కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 26 మండలాల పరిధిలో ఉన్న 604 రెవెన్యూ గ్రామాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఆయా గ్రామాల్లో భూసమస్యలకు సంబంధించి మొత్తం 13,897 ధరఖాస్తులు వచ్చాయి. ఈ సదస్సులు పూర్తయి దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ, ఇందులో కేవలం 1,030 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా సుమారు 12,867 దరఖాస్తులకు అతీగతీ లేదు. రోజువారీగా ఎన్ని దరఖాస్తులను పరిష్కరిస్తున్నారనే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు. కొందరు తహసీల్దార్లు ఒక రోజులో కనీసం ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించడం లేదు. బడాబాబులు, రియలర్టు, రాజకీయ నేతలు, దళారుల భూ వ్యవహరాలను మాత్రం చకచక చేస్తున్నారు. నిరుపేద రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి మాత్రం చేతులు రావడం లేదు. ఐదుగురికి శ్రీముఖాలు భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్న ఐదుగురు తహసీల్దార్లకు కలెక్టర్ ప్రా వీణ్య షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఎన్ని పర్యాయాలు చెప్పినా తమ తీరు మార్చుకోకపోవడంతో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిష్కారం ప్రగతిపై ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షల్లో సదరు అధికారులను హెచ్చరించినప్పటికీ., తీరు మార్చుకోకపోవడంతో నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాకులు చెబుతూ.. దాటవేస్తూ.. భూభారతి అమలు తీరుపై నిర్వహించే సమీక్షల్లో నిర్లక్ష్యం చేస్తున్న ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే.. కొందరు సాకులు చెబుతున్నారు. రైతులే స్పందించడం లేదని, మ్యూటేషన్, సక్సేషన్ వంటి దరఖాస్తులకు సంబంధించిన ఫీజును రైతులు చెల్లించడం లేదని చెప్పుకొస్తున్నారు. కొన్నింటికి సర్వే అవసరమని సాకు చెబుతున్నారు. అవసరం ఉన్నా.. లేకపోయిన సర్వే సాకు చెబుతుండటంతో భూ సమస్య నెలల తరబడి పెండింగ్లో పడిపోతోంది. భూముల సర్వే చేయాలంటే చాలా సమ యం పడుతుండటంతో అధికారులు ఈసాకును వెతుకుతున్నారని తెలుస్తోంది. పరిష్కరిస్తే మాకేంటీ..? జిల్లాలో కొందరు తహసీల్దార్లు అక్రమార్జనకు మరిగారు. విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంలో పరోక్షంగా సహకరించి కోట్లకు పడగలెత్తారు. అసైన్డ్ భూములకు నిరభ్యంతర పత్రాలు జారీకి అనుకూలమైన రిపోర్టులు ఇచ్చి అందిన కాడికి దండుకున్నారు. రియల్టర్లు, దళారుల ద్వారా వచ్చిన భూసమస్యలు పరిష్కరిస్తే పెద్ద మొత్తంలో కాసుల వర్షం కురుస్తుంది. అదే ఇప్పుడు ఈ భూభారతి ధరఖాస్తులను పరిష్కరిస్తే ఒరిగేదేమీ ఉండదు. దీంతో వీరు భూభారతి ధరఖాస్తుల పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదు. -
కూతురిని కడతేర్చేందుకు యత్నించిన తండ్రి
నర్సాపూర్ రూరల్: కన్న కూతురును కడ తేర్చేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని అచ్చంపేటలో జరిగింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... తుజాల్పూర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ ప్రశాంత్కు కొన్నేళ్ల క్రితం అచ్చంపేట గ్రామానికి చెందిన ఇందుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు రుతిక, రియాన్షిక ఉన్నారు. ఆరు నెలల క్రితం భార్యభర్తల మధ్య సంసారం విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇందు ఇద్దరు కూతుళ్లతో పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రశాంత్ ఆదివారం అచ్చంపేటలోని భార్యాపిల్లల వద్దకు వెళ్లి చిన్న కూతురు తనకు పుట్టలేదని భార్యతో గొడవ పెట్టుకుని రియాన్షికను పైకిఎత్తి సీసీ రోడ్డుపై పడేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మొదట నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు కంది(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పుస్తకాలను అందజేస్తున్నామని పుస్తకాల పంపిణీ ప్రత్యేక అధికారి రమణకుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కందిలోని కేంద్ర ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సమర్థ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జోగప్ప, సీఎమ్ఓ వెంకటేశం, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ఆక్రమించి ఇల్లు నిర్మాణంపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు జహీరాబాద్ టౌన్: పంచాయతీ రోడ్డును అక్రమించి ఇల్లు నిర్మిస్తున్నా కార్యదర్శి అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తున్నారని మండలంలోని ఆనేగుంట గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి యథేచ్ఛగా రోడ్డును అక్రమించి ఇంటి నిర్మాణం పనులు చేపట్టడంతో రహదారి కబ్జాకు గురవుతుందన్నారు. అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఆయన కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో చేపడుతున్న నిర్మాణం పనులు ఆపేసి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
తీరనున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వెతలు!
సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పించటంతో పాటు హాజరు, కొలతలు చేపట్టడంతో పాటు వివిధ రకాల పనులు నిర్వహిస్తారు. అయితే కొనేళ్లుగా వారికి సరైన వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల మంత్రి సీతక్క ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపశమనం కలిగించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు కార్యాచరణ జిల్లాలోని 619 గ్రామ పంచాయతీలలో 332 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీనెల సుమారు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనం అందిస్తున్నారు. అయితే అందరికీ సమాన వేతనం కల్పించాలని పలుమార్లు సమ్మె సైతం నిర్వహించారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల కోరిక మేరకు సమాన వేతనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్న్స్తో పాటు హెల్త్కార్డులు మంజూరు చేయనున్నారు. ఎక్స్గ్రేషియా రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెరగనుంది. అలాగే గత ప్రభుత్వం తీసుకొవచ్చిన 4779 సర్కులర్ను రద్దు చేయనున్నారు. గతంలో వివిధ కారణాలతో తొలగించిన వారిని తిరిగి విధుల్లో నియమించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల అభ్యర్థన మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. ఉపాధి హామీలో విధులు నిర్వర్తిస్తున్న జిల్లాస్థాయిలో ఏపీడీ, మండలస్థాయిలో ఏపీఓ, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రతి మూడు, నాలుగేళ్లకు ఒకసారి బదిలీలు చేపట్టినప్పటికీ, విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టలేదు. ప్రస్తుతం పలు రకాల సమస్యలు పరిష్కారం అవుతుండటంతో ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల చోట్ల పనులకు ఇబ్బందులు జిల్లాలో చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. సగానికి పైగా గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం చేపట్టలేకపోయారు. ఆ గ్రామాలలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారంతో పాటు కొత్తగా పోస్టులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. సమాన వేతనం పాటు సౌకర్యాలు తొలగించిన వారికి నియమించేలా చర్యలు జిల్లాలో 332 మందికి లబ్ధి కొత్త జీపీలలో నియామకాలు అయ్యేనా? -
భారీ వర్షానికి కూలిన ఇల్లు
తప్పిన పెను ప్రమాదం రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. పట్టణానికి చెందిన డప్పు సూరి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్నాడు. డప్పు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సూరి ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో సూరి అతని తల్లి అమ్మరమ్మ, భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపు కొండాపూర్(సంగారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధి మల్కాపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎంపీపీలతో పాటు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలన్నారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల లో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు వెంకటేశంగౌడ్, శ్రీకాంత్రెడ్డి, నరసింహులు, ప్రభుదాస్, మల్లారెడ్డి, సునీల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం టీపీసీసీ ఉద్యమం చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల ఉద్యమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. కాగా బీసీలకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని, 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. సిగాచీ బాధితులను ఆదుకోండి: సీఐటీయూ సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కార్మిక కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి నెలరోజులు దాటినా బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాడుతామని హెచ్చరించారు. దీక్షలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శులు జయరాజ్, సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య, నాయకులు మాణిక్యం, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిప్లొమాలో అవకాశం మెదక్జోన్: పదో తరగతి పాసైన విద్యార్థినులు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో చేరాలనుకుంటే ఎలాంటి ఎంట్రెన్స్ రాయకున్నా నేరుగా డిప్లొమాలో చేరవచ్చని మెదక్ ప్రభు త్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ భవాని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీర్ మూడు కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు కళాశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
కొత్త చెరువు వద్ద పైపులు ధ్వంసం
జోగిపేట(అందోల్): సింగూరు నుంచి కాల్వల ద్వారా జోగిపేట కొత్త చెరువులోకి వచ్చే పైపులైనును కొందరు ధ్వంసం చేసి చెరువులోకి నీరు రాకుండా అడ్డుకున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా... సింగూరు ప్రాజెక్టు ద్వారా చెరువులోకి నీరు వచ్చేలా ప్రభుత్వం పైపులైనును ఏర్పాటు చేసిందని, ఆ నీటిని మళ్లించుకునేందుకు పైపులను, సిమెంట్ కట్టడాలను ధ్వంసం చేశారని రైతులు వాపోయారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సోమవారం అందోల్లోని ఇరిగేషన్ అధికారులకు జోగిపేట రైతులు ఫిర్యాదు చేశారు. సింగూర్ కెనాల్ నుంచి పైపుల ద్వారా కొత్త చెరువులోకి మాసానిపల్లి గ్రామం నుంచి నీళ్లు వస్తాయని, ఆ గ్రామంలోని చెరువులోకి వెళ్లే కాల్వ కూడా వేరుగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రి చెరువు వద్ద తాము చేసిన పనులను పూర్తిగా ధ్వంసం చేసి నీళ్లు రాకుండా అడ్డుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాము ప్రశ్నిస్తే తమపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులకు రైతుల ఫిర్యాదు బాధ్యులపై చర్యలకు డిమాండ్ -
37లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
డీఆర్డీఓ శ్రీనివాస్ కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో వన మహోత్సవం సందర్భంగా వర్షాకాలంలో 37లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 37లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇందులో ఉపాధిహామి పథకం ద్వారా 25లక్షలు నాటేందుకు నిర్ణయించామన్నారు. కాగా ఇప్పటివరకు యాబైశాతం మొక్కలు నాటినట్లు తెలిపారు. త్వరలో అన్ని గ్రామాల్లో అవసరమైన పండ్లు, పూలు, ఇతర మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో యాబైవేల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని, తొంబైశాతం పూర్తి అయిందన్నారు. పింఛన్ డబ్బులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఈసీ ప్రేమ్కుమార్, కారోబార్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
సంగారెడ్డి జోన్: ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. డీఆర్ఓ పద్మజరాణితో పాటు ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఓ జ్యోతి వినతులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 57 వినతులు వచ్చినట్లు వెల్లడించారు. పింఛన్ మంజూరు చేయండి వికలాంగుల ఫించన్ మంజూరి చేసి ఆదుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నా, కొన్ని సంవత్సరాలుగా పింఛన్ రావడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లానా ప్రయోజనం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా. అధికారులు చర్యలు తీసుకొని ఆదుకోవాలి. – మాణిక్రెడ్డి, చేర్యాల గ్రామం, కంది మండలం ఆర్థిక సహాయం అందించాలి సిగాచీ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్గా విధు లు నిర్వర్తించాను. ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావటంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, రూ. 5 లక్షలు అందించారు. ఇప్పటివరకు మిగితా సహాయం అందించలేదు. అధికారులు చర్యలు తీసుకుని ఆర్థిక సహాయం అందించాలి. – కమలేష్ ముఖిమ్, బిహార్ కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ సంగారెడ్డి జోన్: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ మేరకు ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం అభినందించారు. జూలై 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు వరంగల్లోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన సైబర్ పోలీస్ కానిస్టేబుల్ రాజలింగం రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచాడు. త్వరలో పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లో మెరుగైన ప్రదర్శన చూపి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. -
వ్యవసాయ ఉద్యమంలో పటేల్ కీలకపాత్ర
పటాన్చెరు టౌన్: రైతులను ఏకం చేయడంలో, భారతదేశ వ్యవసాయ ఉద్యమాన్ని రూపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఐసీఎస్ఎస్ఆర్ సహకారంతో నిర్వహిస్తోంది. సోమవారం ఈ చర్చా గోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంలో ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతకుముందు ఎస్పీ పరితోష్ పంకజ్ గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ టి – సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఏఎస్ సంజయ్ జోషి, సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యామ్ ప్రసాద్, గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్.పటేల్, సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్, డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి, సోషియాలజీ ప్రొఫెసర్ నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గీతంలో జాతీయ ఐక్యత సదస్సు చర్చాగోష్టిని ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
మెడికల్ కోడింగ్లో ఉచిత ఆన్లైన్ శిక్షణ
సిద్దిపేట ఎడ్యుకేషన్: బయోటెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మెడికల్ కోడింగ్లో వారం రోజుల పాటు ఆన్లైన్లో ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, నేషనల్ గైడర్స్ ఫర్ మెడికల్ కోడర్స్ ఫౌండర్స్ కార్తీక్కుమార్ వెల్లడించారు. సోమవారం కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నేషనల్ గైడర్స్ ఫర్ మెడికల్ కోడర్స్ మధ్య ఐదేళ్లకు అవగాహన ఒప్పందం కుదిరిందని వీరు తెలిపారు.అనంతరం విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగాధిపతి రోహిని, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, బయోటెక్నాలజీ అధ్యాపకులు వేణు, ఎన్జీసీ ప్రతినిధులు పవన్, నీలకంఠం పాల్గొన్నారు. నేషనల్ గైడర్స్ ఫర్ మెడికల్ కోడర్స్తో ఎంఓయూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత -
లాంగ్ జంప్లో సాయితేజకు పతకం
సంగారెడ్డి: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 11వ తెలంగాణ అథ్లెటిక్ క్రీడల్లో భాగంగా లాంగ్ జంప్ విభాగంలో అండర్ –16లో సంగారెడ్డి జిల్లాకు చెందిన కె.సాయి తేజ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అతడికి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ ఎండి జావిద్ అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిగిలిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవా మద్యం స్వాధీనం మునిపల్లి(అందోల్): భారీ ఎత్తున గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ శంకర్ తెలిపారు. సోమవారం మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన గోవా మద్యం దొరికింది. మొత్తం 34 బాటిళ్లలో 14.850 లీటర్ల గోవా మదాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ అనుదీప్, వినారెడ్డి, నజీర్పాషాతో పాటు సిబ్బంది ఉన్నారు. గంజాయి స్వాధీనం.. పటాన్చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఘటన ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ వివరాల ప్రకారం... జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రామచంద్రపురంలో సోమవారం దాడులు నిర్వహించారు. కంజర్ల రమేశ్, దినేశ్ల నుంచి 385 గ్రాముల గంజాయి, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కాపర్ వైర్ చోరీ అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి, కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలోని కట్కూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... గ్రామానికి చెందిన కొలుగూరి వెంకట్రెడ్డి పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. గుర్తించిన పలువురు రైతులు విషయాన్ని ట్రాన్స్కో అధికారులకు చెప్పారు. వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో దాదాపు 10ఎకరాల్లో ఆదివారం వరి నాట్లు చేశారు. దీంతో రైతులు పొలానికి నీరు ఎలా పారించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు జరిమాన సంగారెడ్డి క్రైమ్ / సిద్దిపేటకమాన్ / పటాన్చెరు టౌన్: ఉమ్మడి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుపడ్డ వాహనదారులకు జిల్లా న్యాయస్థానాలు జరిమాన విధించాయి. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 11మందిని జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షీకీల్ అహ్మద్ సిద్దిఖీ ఆరు మందికి రూ.2వేలు, ఇద్దరికి రూ.1500, మిగతా ముగ్గురికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 11మంది పట్టుబడ్డారని టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.18వేల జరిమాన, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష, బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ పట్టుబడిన నలుగురికి రూ.6వేల జరిమాన విధించినట్లు తెలిపారు. పటాన్చెరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో 22 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ చెప్పారు. సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 21 మందికి రూ. వెయ్యి చొప్పున, మరో వ్యక్తికి రూ. 2 వేలు జరిమాన విధించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుసంగారెడ్డి క్రైమ్: కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్టు తెలిపారు. -
బీసీలకు కాంగ్రెస్ అన్యాయం
ఎమ్మెల్సీ అంజిరెడ్డిపటాన్చెరు టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం బీసీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని, ప్రతిపాదిత బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం కోటా ఉన్నందున వారికి 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభిస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్లోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. మహా సంపర్క్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేసే చాలా పథకాలు కేంద్రం నిధులతోనే అమలు చేస్తున్నారని తెలిపారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, దాని అనుబంధం రంగాల కోసం ఏకంగా రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక, జనహిత పాదయాత్ర అని కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడతారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
పటాన్చెరు టౌన్: సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్లో కార్మిక సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ...త్వరలోనే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీలను నియమిస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న నరసింహారెడ్డిని కార్మిక సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ ఐఎన్టీయూసీ అమర్ సింహారెడ్డి, ఆంటోనీ, శ్రీధర్, కరుణాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేశ్, కిష్టయ్య, నాగరాజు గౌడ్ పాల్గొన్నారు. -
నిలిచిన నిమ్జ్ భూ సేకరణ
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా స్పీడ్ అందుకున్న భూ సేకరణ పనులు ఆగిపోయాయి. నిమ్జ్ కార్యాలయంలో ప్రస్తుతం కార్యకలాపాలు జరగడం లేదు. జూలై 10న నిమ్జ్ కార్యాయలంలో ఏసీబీ దాడులు చేయడంతో భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. జహీరాబాద్ ప్రాంతానికి జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్) మంజూరు కాగా, నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 12,635 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను నిమ్జ్కు కేటాయించారు. ఫేజ్ వన్లో 3,240 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,888 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 352 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇటీవట ఫేజ్వన్కు సంబంధించి మిగులు భూమి సేకరణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. నిమ్జ్ కార్యాలయంలో పనులు జరగని కారణంగా పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. సెకండ్ ఫేజ్లో 9,747 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాల భూమిని సేకరించారు. హద్నూర్, మామిడి తదితర గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పంపిణీకి చెక్కులు కూడా సిద్ధంగా ఉన్నాయి. పరిహారం చెక్కుల కోసం రైతులు నిమ్జ్ కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఏసీబీ దాడుల తర్వాత కార్యాలయంలో ఎలాంటి పనులు కూడా జరగడం లేదు. నెల రోజుల క్రితం నిత్యం రైతులతో కిక్కిరిసిన నిమ్జ్ కార్యాలయం ప్రస్తుతం బోసిపోయింది. ఆర్డీఓకు అదనపు బాధ్యతలు నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు (రాజిరెడ్డి), డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. జహీరాబాద్ ఆర్డీఓ రాంరెడ్డికి నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా అదనపు బాధ్యతలను కలెక్టర్ ప్రావీణ్య అప్పగించారు. నిమ్జ్ భూముల సేకరణకు సంబంధించిన పనులపై ఆర్డీఓ శ్రద్ధ చూపడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పరిహారం చెల్లింపుల వ్యవహరంలో గందరగోళం నెలకొనడంతో నిమ్జ్ ఫైళ్లను ముట్టుకోవడం లేదని తెలిసింది. దీంతో నిమ్జ్ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి. 11 సంవత్సరాలుగా.. నిమ్జ్ కోసం 11 సంవత్సరాల నుంచి వందల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రక్షణ ఏరోనాటిక్స్ అంతరిక్ష రంగాల్లో ఉపయోగించే పరికరాలను ఉత్పత్తి చేసే వెమ్ టెక్నాలజీతో ఒప్పదం జరిగింది. రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు 511 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మేరకు గత ప్రభుత్వంలో శంకుస్థాపన కూడా చేశారు. ఆటోమోటీవ్ విడిభాగాల జర్మనీ కంపెనీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్, హ్యూందాయ్ మోటార్స్తో కూడా ఒప్పందాలు జరిగాయి. హ్యూందాయ్ మోటార్స్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రచారం జరిగింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కూడా కలిశారు. కానీ ఇంతవరకు నిర్మాణ పనులకు శ్రీకారం చ్టుటడం లేదు. నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. కార్యకలాపాలకు బ్రేక్ ఆగిన పరిహారం చెక్కుల పంపిణీ -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేని విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదే విషయమై ఈనెల 5న పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనుండగా, రాష్ట్రం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలతో 6న ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు నియోజకవర్గం నుంచి 20 మంది కార్యకర్తలు తరలివెళ్లనున్నారని వివరించారు. గెస్ట్ లెక్చరర్లకు ఆహ్వానం జోగిపేట(అందోల్): జోగిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. సీఎంఈ పోస్టులు 5, ఈసీఈ 4, ఇంగ్లీష్ 1, గణితం 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2 మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలని, ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. అలాగే ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. సీఎస్ఈ, ఈసీఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు న్యాల్కల్(జహీరాబాద్): వర్గల్లోని నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 13 వరకు పొడిగించినట్లు ఎంఈఓ మారుతి రాథోడ్ తెలిపారు. గత నెల 29తో గడువు ము గిసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించినట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులను వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడుపాయలలో భక్తుల సందడి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ ఉద్యోగుల తొలగింపు సరికాదు: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వెంటనే నిలిపివేసి, వారికి రావా ల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. 36 ప్రభుత్వ శాఖల్లో 90 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరిని రెన్యూవల్ చేయకుండా దాదాపు 4,500 మందిని ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణం అన్నారు. వారికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ జోగిపేట(అందోల్): జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ.. జోగిపేట ఎస్సీ మహిళా కాలేజీ హాస్టల్కు తక్షణమే నూతన భవనం ఏర్పాటు చే యాలని, స్కూల్, కళాశాల హాస్టల్ రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరపత్రం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేసి వారి సమస్యలను సేకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిని సైతం ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దోమల విజయకుమార్, నాయకులు వాసు, గిరిధర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, పవన్, గురునాథ్, గోవింద్, బాబా, చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొండాపూర్ మండల పరిఽ దిలోని మారేపల్లిలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి -
కేతకీలో భక్తుల సందడి
బోనం.. వైభవంప్రభుత్వ భూమిని కాపాడండిఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవు రోజు కావటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు. వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఎం.జలాల్పూర్ శివారులోని కాళికామాత దేవాలయం వద్ద శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం బోనాలు ఊరేగింపు ఘనంగా చేపట్టారు. ఉదయం నుంచే వేద పండితులు హోమం, అర్చనలు, అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ 765డీ జాతీయ రహదారిపై వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నంబర్ 447లో ప్రభుత్వ భూమిని కౌడిపల్లికి చెందిన వ్యక్తి అసైన్డ్ ల్యాండ్ పేరిట కబ్జా చేస్తు న్నాడని ఆరోపించారు. ఈవిషయమై మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ సీసీఎల్లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకు పాల్పడుతున్నాడని వాపోయా రు. రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనా లు నిలిచిపోయాయి. ఎస్ఐ రంజిత్రెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశా రు. అనంతరం గ్రామస్తులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. -
అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ హకీం హెచ్చరించారు. ఆదివారం హత్నూరలో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తుంటే జీర్ణించుకోవడం లేదన్నారు. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తే ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పా రని ప్రశ్నించారు. ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ, జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత, ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామిగౌడ్, కాంగ్రెస్ నాయకులు సత్యం, రియాజ్, పెంటయ్య, మణిదీప్, లక్ష్మీనారాయణ, సాయి, పెంకటేశ్, అబ్దుల్ ఖదీర్, ఆంజనేయులు, నర్సింలు, రాములు, సదా శివులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిన్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీలో ఈఈఈ, సివిల్ బ్రాంచ్లో మిగులు సీట్లకు విద్యార్థుల మెరిట్ ప్రతిపాదికన సీట్లు 11వ తేదీన కేటాయించనున్నట్లు చెప్పారు. 2025 పాలీసెట్కు హాజరు కాని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.‘బాలకథా చంద్రిక’ పుస్తకావిష్కరణ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం రచించిన ‘బాలకథా చంద్రిక’ బాలల కథల పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, రచయితలు పైడిమర్రి రామకృష్ణ, చంద్రప్రతాప్, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, బూర్ల నాగేశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉండ్రాళ్లరాజేశం బాలల కోసం గేయాలు, కథలు, పద్యాలు తదితర రచనలతో చేసిన బాలసాహిత్య కృషిని కొనియాడారని పేర్కొన్నారు. బాలసాహిత్య పురస్కారాలు ప్రదానం ప్రశాంత్నగర్ / చిన్నకోడూరు (సిద్దిపేట): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో 10వ తరగతి చదువుతున్న జక్కుల లోహితకు ప్రథమ బహుమతి లభించిందని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మాచిరాజు బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలల కథల పోటీల్లో 541 కథల్లో లోహిత రాసిన ఽ‘‘ధూమపానం’’ కథ ప్రథమ బహుమతి పొందిందని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ చేతుల మీదుగా లోహిత బహుమతి, మాచిరాజు బాలసాహిత్య పురస్కారం అందుకున్నారని చెప్పారు. కాగా, చిన్న కోడూరు మండలంలోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని అఖిల కూడా మాచిరాజు బాల సాహిత్య పురస్కారం అందుకున్నదని ఉపాధ్యాయుడు దుర్గయ్య తెలిపారు. అథ్లెటిక్స్లో ప్రతిభ చాటిన క్రీడాకారులుసిద్దిపేట జోన్: హన్మకొండలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేటకు పతకాలు లభించాయి. అండర్ 20 విభాగంలో రేస్ వాక్లో గణేశ్ బంగారు పతకం సాధించగా, అండర్ – 16 బాలికల విభాగంలో సిరి చందన జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా వారిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి అభినందించారు. ఆలయంలో ఫ్రెండ్షిప్డే వేడుకలు నర్సాపూర్ రూరల్: మండలంలోని లింగాపూర్ దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గండబేరుండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆవరణలో నిత్య జీవన యోగాసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువులు బాసంపల్లి సురేందర్ గౌడ్, సంతోష్ ఆధ్వర్యంలో నిత్యం యోగా సాధన చేసే వారంతా కలిసి ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం యోగా సాధన చేసి రోజంతా కబుర్లు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, హనుమంత్ గుప్తా, భిక్షపతి రెడ్డి, జైపాల్ పాల్గొన్నారు. -
వికసించిన కదంబ వనవాసిని పుష్పాలు
గుండ్రంగా బంతిలా వికసిస్తూ కనిపిస్తున్న కదంబ వనవాసిని పుష్పాలను తిలకించిన ప్రతి ఒక్కరూ అబ్బుర పడుతున్నారు. సుతిమెత్తగా, సుకుమారంగా వికసించే ఈ పుష్పాలు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత వాసులకు అంతగా పరిచయం లేని ఈ చెట్లు ఎక్కువగా వారణాసిలోని కాశీ, మధురై, త్రిపురాంతకంలో ఎక్కువగా కనిపిస్తాయి. గత హరితహారంలో రోడ్లకిరువైపులా నాటిన కదంబ మొక్కలు ప్రస్తుతం ఏపుగా ఎదిగి పుష్పిస్తున్నాయి. ఏడాదిలో ఆషాఢమాసంలో పుష్పించడం వల్ల పార్వతీదేవి అమ్మవారికి ఈ పుష్పాలు ప్రీతిపాత్రమైనవిగా చెప్పుకుంటారు. అమ్మవారికి ఒక్క పుష్పంతో పూజిస్తే 108 పువ్వులతో పూజించినట్టేనని నమ్ముతారు. – మిరుదొడ్డి(దుబ్బాక): -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): పట్టాలిచ్చిన అందరికీ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గంగారంలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గంగారంలో సర్వే నం.1, 5, 243లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చారన్నారు. కానీ ఇళ్లు కట్టుకునేందుకు పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, ప్రవీణ్, గ్రామ నాయకులు అనిల్, సొలోమోన్, కృష్ణ, యువాన్, అర్జున్, గంగమ్మ, ఆంజనేయులు, ఏసమ్మ, సురేశ్, బాలమణి, ప్రశాంత్, సంజీవ్ పాల్గొన్నారు.గంగారంలో పర్యటించిన సీపీఎం నాయకులు -
విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర
పటాన్చెరు: విశ్వశాంతి కోసం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వరకు చేపట్టిన 18వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... 12వ శతాబ్దంలో అభ్యుదయ సమాజం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్, సమాజం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
ప్రజలు తినే ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లలో ప్రజారోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ, మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. నిల్వ చేసిన మాంసం, కుళ్లిన వాటితో వంటకాలు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ, జిల్లాలో అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – దుబ్బాకటౌన్ దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో 30కి పైగా రెస్టారెంట్లు, దాబాలున్నాయి. కానీ సంవత్సరం నుంచి అధికారుల తనిఖీలు కరువయ్యాయి. ఓ వైపు హోటల్స్, దాబాల్లో నాసిరకం ఆహార పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సాంబార్లో పురుగు.. ఇటీవల దుబ్బాక పట్టణంలో శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో సాంబర్లో పురుగు వచ్చిన ఘటన కలకలం రేపింది. దీంతో అధికారులు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. ఫలితాలు ఇంకా బయట పెట్టలేదు. అపరిశుభ్రంగా ఉందని, కుళ్లిన కూరగాయలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు రూ. 5వేల జరిమాన విధించారు. తనిఖీలు కరువు.. సంవత్సరం నుంచి దుబ్బాకలో అధికారుల తనిఖీలు లేవు. దీంతో కొందరు హోటల్ నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను వండి విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గతంలో సైతం దుబ్బాకలో కుళ్లిన కేక్ విక్రయించిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం కనీసం తనిఖీలు నిర్వహించకపోవడంతో అసలు ఫుడ్సేఫ్టీ అధికారులు ఉన్నారా? లేరా? అనే అనుమానాలు పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ బేకరీలో కాలం చెల్లిన బిస్కెట్ విక్రయించినట్లు తెలిసింది. కూరగాయలు, మాంసం కుళ్లిపోయిన వాటిని ఫ్రిజ్లో భద్రపరిచి వండి విక్రయిస్తున్నారని వినికిడి. రెస్టారెంట్లు, చిన్నచిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాల్లో కల్తీ నూనెలు, మసాలా దినుసులు వాడటం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ పై రూ.10 అదనం దుబ్బాకలో కొన్ని రెస్టారెంట్లలో రూ.10 కూల్డ్రింక్కు ఏకంగా మరో రూ.10 అదనంగా తీసుకుని హోటల్స్కి వచ్చే వారిని దండుకుంటున్నారు. ఎందుకు అదనంగా తీసుకుంటున్నారని అడిగితే రూ. 10 కూల్డ్రింక్ పై ఏసీ ఛార్జ్ వేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా, దుబ్బాకలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని జిల్లా ఆహార తనిఖీ అధికారి జయరామ్ను సాక్షి వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పాడు.హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలేవీ? నిల్వ చేసిన పదార్థాలతో వంటకాలు అపరిశుభ్రంగా వంటగదులు నిమ్మకు నీరెత్తినట్లు అధికారుల తీరునాణ్యతకు తిలోదకాలు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్థం కాని ప్రశ్న. జిల్లాలో కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు కేవలం శాంపిళ్లు తీసుకెళ్లి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా స్థానిక మున్సిపాలిటీ అధికారులు, ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి తనిఖీలు లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.అధికారులు చర్యలు తీసుకోవాలి నా పేరు యాదగిరి. మాది దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామం. నేను ఉడిపి హోటల్లో దోష ఆర్డర్ చేసి తింటున్నప్పుడు సాంబార్లో పురుగు కనిపించింది. వెంటనే యజమానిని అడగగా పొంతన లేని సమాధానం చెప్పాడు. ఒకవేళ నేను ఆ పురుగును చూడకపోతే నా పరిస్థితి ఏమయ్యేది. నిర్లక్ష్యం వహిస్తున్న హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – యాదగిరి, రాజక్కపేట -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
దుబ్బాక: పట్టణంలో రెండు దుకాణాల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్ఐ కీర్తిరాజు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో మైబైల్ షాపు, పెయింటింగ్ షాపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనను పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. చోరీ ఘటనపై ఏసీపీ రవీందర్రెడ్డి, దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచనల మేరకు ఆ ప్రాంతంలోని నిఘానేత్రాలను పరిశీలించగా పట్టణానికి చెందిన చెక్కపల్లి శివగా గుర్తించారు. ఆదివారం ఉదయం బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడు శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి వద్ద చోరీ చేసిన 10 సెల్ఫోన్లు,1500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. కాగా చోరీ ఘటనను 24 గంటల్లోనే ఛేదించిన దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు, పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్ఐ కీర్తిరాజు -
బిల్లును అడ్డుకుంటున్నది బీజేపీనే
● కాళేశ్వరంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దు ● కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించినప్పటికీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నారాయణఖేడ్లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా నాల్గవ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు స్వార్థం కోసం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం విషయంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటాలకై నా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. సింగూరు జలాలు సంగారెడ్డి జిల్లా ప్రజలకే అందాలన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కర్మాగారాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఈటీ నర్సింహా, కార్యదర్శి సయ్యద్ జలాలొద్దీన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంద పవన్, నాయకులు ప్రకాశ్రావు, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, కార్యవర్గ సభ్యులు రహేమాన్, తాజొద్దీన్, దత్తురెడ్డి, మహబూబ్ఖాన్, రుబీనా తదితరులు పాల్గొన్నారు. -
నిశ్చితార్థం వేడుకకు వెళ్లి.. అనంతలోకాలకు..
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా, సాయికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోష్నగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్కు చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్పూర్ మీదుగా చైన్నెకి వెళ్తూ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికుమార్తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్తో పాటు శివసాయికుమార్ను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులు లారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్షాప్లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు రామకృష్ణ లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ద్విచక్రవాహనదారులు, పాదచారులపైకి దూసుకువచ్చిన లారీ ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు -
ఈత చెట్ల పెంపకానికి భూములివ్వాలి
కొండాపూర్(సంగారెడ్డి): ఈత చెట్లు పెంచేందుకు కల్లు గీత సొసైటీలకు భూములివ్వాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్లపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం అమరవీరులయాదిలో గీతన్నల సామాజిక చైతన్యయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న, మహాత్మ జ్యోతిరావుపూలే, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి, అక్కడనుంచి మల్కాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆశన్నగౌడ్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రతీ కల్లుగీత సొసైటీలకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని, వాటి సంరక్షణ కోసం డ్రిప్, బోరు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా గీత కార్మికులకు, గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మునిదేవునిపల్లి, మాందాపూర్ అలియాబాద్ గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న కల్లుగీత సొసైటీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు? 18 వరకు సామాజిక చైతన్య యాత్ర సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 18 వరకు సామాజిక చైతన్యయాత్ర కొనసాగుతుందని అదేరోజు సంగారెడ్డిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు ఆశన్నగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్గౌడ్, కృష్ణగౌడ్, నాగరాజు గౌడ్, రామాగౌడ్, వెంకటేశంగౌడ్, కుమార్గౌడ్, మల్కాపూర్ టీటీసీఎస్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, అనంతయ్య గౌడ్, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ -
రసాభాసగా చెక్కుల పంపిణీ కార్యక్రమం
హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూ ర రైతు వేదికలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసేందుకు పెద్ద ఎత్తున నినాదాలతో సమావేశ మందిరంలోకి ఒక్కసారిగా వచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడానికి యత్నించగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రం పటం చినిగిపోయింది. దీంతో కాంగ్రెస్ నాయకులు మరింత రెచ్చిపోయి పెద్ద ఎత్తున సునీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పినా వినకపోవడంతో వారందరినీ బయటకు లాక్కెళ్లారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చించేసిన బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేయగా...బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ప్రజల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ను, మంత్రులను కూడా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. నియోజకవర్గంలో తాను చేపట్టే ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాలలో అధికార పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తుండటం సరికాదన్నారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 187 రేషన్ కార్డులు 40 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని సమయం వచ్చినప్పుడు చూస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఫర్హీన్ షేక్, ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ దావూద్ హరిబాబు, లబ్ధిదారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ అభివృద్ధి కోసం రాజకీయాలుపక్కన పెడతాః ఎమ్మెల్యే సునీతారెడ్డిసీఎం ఫొటో చించిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని చించివేసిన దుండగులను వెంటనే శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి డిమాండ్ చేశారు. -
జనరహిత పాదయాత్ర
మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎద్దేవా జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో జనరహితంగా సాగిందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎద్దేవా చేశారు. శనివారం అందోల్లోని ఒక ఫంక్షన్ హాలులో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గానీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. పాదయాత్రలో కనీసం ప్రజా సమస్యలు వినలేకపోయారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రజాప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్తో చంద్రబాబుకు తొత్తులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పుల్కల్, టేక్మాల్ మండలాల పార్టీ అధ్యక్షులు మాచర్ల విజయ్ కమార్, వీరప్ప, అందోల్ మండల నాయకులు చాపల వెంకటేశం, నాగరత్నంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడికి మతి భ్రమించింది
సంగారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అజ్ఞానంతో రేవంత్రెడ్డితో పోటీ పడటం అవివేకమన్నారు. బీఆర్ఎస్ చేసిన పనులు ప్రస్తుతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని గ్రామాల్లోకి వెళ్త్తే ప్రజలే చెబుతారని వ్యాఖ్యానించారు. హరీశ్రావుపై మాట్లాడేటప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
గ్రూపులుంటేనే మజా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవరా ్గల్లో గ్రూపులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయ కులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15% కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తల కలయికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే ఈ టికెట్ల కేటాయింపు ఉంటుందని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారి ఇంటికే స్థానిక సంస్థల ఎన్నికల టికెట్లు నడిచివస్తాయని తెలిపారు. చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి: కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వారినే గుర్తించాలని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్గౌడ్లకు విజ్ఞప్తి చేశారు. తమ పబ్బం గడుపుకునేందుకు పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఇందిరమ్మ కమిటీలకు ఇవ్వాలని కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రెడ్డిపల్లి ఆంజనేయులు, ఆవుల రాజిరెడ్డి తదితరులుపాల్గొన్నారు. గ్రూపులు, ఆధిపత్య పోరు లేకుండాపార్టీ అభివృద్ధి చెందదు ఎన్నికలు వస్తే అంతా ఒక్కటై పనిచేయాలి పాత, కొత్త నాయకుల కలయికతోముందుకు సాగుదాం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పటాన్చెరు నాయకులు దూరం జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు దూరంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు నేతలు ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ శ్రేణులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
సమస్యలు పరిష్కరించకపోతే ముట్టడే
పటాన్చెరు: స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పటికై నా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో మున్సిపల్ ఆఫీస్ను ముట్టడిస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి హెచ్చరించారు. అమీన్పూర్లోని పటేల్గూడా, కృష్ణారెడ్డిపేట్ పరిధిలో కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నాలో గోదావరి, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్గుప్తా పాల్గొని మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, అధికారులు దోచుకున్న సొమ్మును కక్కించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ..మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తునామన్నారు. కృష్ణారెడ్డి పేట గ్రామ పరిధిలోని దుర్గానగర్ కాలనీకి కలెక్టర్ పార్కుకోసం స్థలాన్ని కేటాయిస్తే కొందరు నాయకుల కారణంగా అది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పటేల్గూడ గ్రామంలో కూడా వివిధ కాలనీలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు నరకయాతన పడుతున్నారని రోడ్ల సమస్యల పరిష్కారానికి కాలనీ అసోసియేషన్ల నుంచి అధికార పార్టీ నాయకులు డబ్బులను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి -
కనీస వేతనాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు కంది(సంగారెడ్డి): గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000లు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన కంది గ్రామపంచాయతీ వద్ద శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ..గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో ఇచ్చిన వేతనాలను కూడా తగ్గించి ఇవ్వడం దారుణమన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మల్లేశ్, వీరరాజు, సతీశ్, తదితరులు పాల్గొన్నారు. రీసెర్చ్ స్కాలర్ అర్షద్ హుస్సేన్కు డాక్టరేట్పటాన్చెరు: పటాన్చెరు మండలం రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, లైఫ్ సైన్సెస్ విభాగం ఎన్విరాన్మెంట్ సైన్స్లో పరిశోధక విద్యార్థి అర్ష్షద్ హుస్సేన్ మాలిక్ డాక్టరేట్ లభించింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో తుపాను, ఉప్పెన వంటి సహజ ప్రమాదాల అంచనాకు రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) అనువర్తనాలను ఉపయోగించడం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంధి ఉమాదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘బనకచర్ల’పై ఆరోపణలు అర్థరహితంమాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి వట్పల్లి(అందోల్): బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలు అర్థరహితమని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి పేర్కొన్నారు. జోగిపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మఠం తీవ్రంగా ఖండించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి బీడు వారిన భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. అన్ట్రైన్డ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి డీఈఓ వెంకటేశ్వర్లును కోరిన టీబెస్ నాయకులు జహీరాబాద్ టౌన్: అన్ట్రైన్డ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బంజార ఎంప్లాయిస్ సేవా సంఘం(టీబెస్) నాయకులు డీఈఓ వెంకటేశ్వర్లను కోరారు. ఈమేరకు శనివారం ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీబెస్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీరాథోడ్, ప్రధాన కార్యదర్శి తులసీరాం రాథోడ్లు మాట్లాడుతూ అన్ట్రైన్డ్ డీఎస్సీ ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. డీఎస్సీల వారీగా సీనియారిటీ జాబితా రూపొందించి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు దేవీసింగ్, మంజునాయక్ తదితరులున్నారు. -
మల్లన్న పైపులైన్ పూర్తవడంతో సంబరాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా జలాభిషేకాలుగజ్వేల్ : స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ...గజ్వేల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ముందుకుసాగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గజ్వేల్కు రూ.210కోట్లతో చేపట్టిన ప్రత్యేక మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తయి మంచినీటి సరఫరా ప్రారంభమైంది. శనివారం రెండు పార్టీలు జలాభిషేకాలు నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై ఉన్న మిషన్ భగీరథ హెడ్వర్క్స్ వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ వల్లే గజ్వేల్కు మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథ ప్రత్యేక పైపులైన్ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కృషివల్లే గజ్వేల్కు మిషన్ భగీరథ నీరు వచ్చిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. -
ఊరురా తల్లి పాల వారోత్సవాలు
న్యాల్కల్(జహీరాబాద్): తల్లి పాల ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లులు తమ పిల్లలకు తల్లి పాలను సక్రమంగా అందించడం లేదు. ఫలితంగా పిల్లలకు సరైన పోషకాలు అందక వ్యాధుల బారిన పడుతున్నారు. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా ఈ ఏడాది కూడా తల్లి పాల వారోత్సవాలను ప్రారంభించింది. గత రెండు రోజులుగా ఊరురా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 1,504 అంగన్వాడి కేంద్రాలుజిల్లాలో 1,504 అంగన్వాడి కేంద్రాలున్నాయి. 1,432 మంది అంగన్వాడి కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆయా కేంద్రాల పరిధిలో 19,405 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, 1,02,724 మంది చిన్నారులున్నారు. వీరందరికి అంగన్వాడి కార్యకర్తలు పౌష్టికాహారం అందిస్తున్నారు. పౌష్టికాహారంతోపాటు తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం తల్లి పాల వారోత్సలపై ఊరురా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లిదండ్రులతోపాటు ఆశ వర్కర్లు, స్వయం సహాయ సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. వీరంతా గ్రామాల్లో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లి పాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లి పాలను బిడ్డకు పట్టించాలని, 6 నెలల వరకు తల్లి పాలను అందించాలని, తల్లి పాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు అందుతాయని, చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు అవగాహన కల్పిస్తున్నారు.తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్న అధికారులు తల్లి పాలపై అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. బిడ్డ పుట్టిన గంటలోపు పాలిచ్చే తల్లులు 34% ఉండగా, 6నెలలలోపు పాలిచ్చే తల్లులు 65% ఉన్నారు. తల్లులకు అవగాహన కల్పించి పిల్లందరికీ 6 నెలల లోపు తల్లిపాలను తప్పకుండా అందించేలా కృషి చేస్తున్నాం. – లలితాకుమారి, జిల్లా సంక్షేమాధికారి,సంగారెడ్డి -
మహిళా సాధికారతే లక్ష్యం
కోవ్ అధ్యక్షురాలు కల్పనారావు రామచంద్రపురం (పటాన్చెరు): మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి కోవ్ (తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్పనారావు స్పష్టం చేశారు. శనివారం తెల్లాపూర్ పట్టణ పరిధిలోని రాజా పుష్ప గ్రీండేల్ కమ్యూనిటీలో కోవ్ మార్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఈ మార్ట్లో 30కి పైగా మైక్రో మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో కోవ్ కార్యదర్శి అనురాధ కరాటి, కోశాధికారి కీర్తి చీకోటి, సంయుక్త కార్యదర్శి నిషా అగర్వాల్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నీరజ గోదావరి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. హత్నూరలో రచ్చ రచ్చ..
సాక్షి, సంగారెడ్డి: హత్నూర మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. పాలాభిషేకం వద్దని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. మరోవైపు, పాలాభిషేకం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల పార్టీ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా నాయకులను చెదరగొట్టారు. -
జనహితకు జేజేలు
● కాంగ్రెస్ పాదయాత్రకు అనూహ్య స్పందన ● ఆద్యంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. ● దారిపొడవునా హోరెత్తిన నినాదాలు వట్పల్లి(అందోల్): కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కదంతొక్కారు. ఆందోల్ మండలంలోని సంగుపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. మంత్రులు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్న ఈ పాదయాత్రలో ఆద్యంతం కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్ర సందర్భంగా ‘జై కాంగ్రెస్ .. జై సోనియా, జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు, బెలూన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం: పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు అప్పగించిందని విమర్శించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అందించామని, రేషన్కార్డులను పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాలో లక్ష ఉద్యోగాలు: వివేక్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో డబుల్బెడ్రూంలు అందజేయలేదని కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క వాగ్దానాన్ని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పీసీసీ నాయకులు గిరిజా షెట్కార్, సంగమేశ్వర్, రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష, పటాన్చెరువు, నర్సాపూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, రావుల అంజిరెడ్డి, విజయారెడ్డి, మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజాహితమే మా ధ్యేయం: దామోదర రాజనర్సింహప్రజాహితమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జోగిపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సోనియాగాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రైతుభరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేదలకు అందించామన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ బేసిస్లో పని చేస్తున్న ఉద్యోగులు, పూజారులకు కనీస వేతనం అమలు చేయాలని ఎమ్మెల్సీసీ.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ..దేవాదాయ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులు సరైన వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని కోరారు. ‘సిగాచి’ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు జహీరాబాద్ టౌన్: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. దిగ్వాల్ పిరామిల్ పరిశ్రమలో శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు పరిహారం ప్యాకేజీ బాధిత కుటుంబాలకు అందలేదని మండిపడ్డారు. దశల వారీగా కాకుండా ఒకే విడతలో పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం,క్లస్టర్ కన్వీనర్ మహిపాల్, నాయకులు నర్సయ్య, మాణిక్రెడ్డి, ప్రభు, నర్సింలు పాల్గొన్నారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్ జహీరాబాద్ టౌన్: అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్ ఆరోపించారు. జహీరాబాద్ డివిజన్ సీపీఐ మహాసభలు శుక్రవారం ప్రారంభమైన సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలం ఉన్న చోట పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతా రని హెచ్చరించారు. సమావేశంలో డివిజన్ కా ర్యదర్శి కె.నర్సింలు, నాయకులు ఆశ్వాక్, అఫ్జ ల్, శంకర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ‘కృష్ణమూర్తి పోరాటం స్ఫూర్తిదాయకం’ జహీరాబాద్ టౌన్: కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి పోరాటం స్ఫూర్తిదాయకమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ పేర్కొన్నారు. కాచం కృష్ణమూర్తి వర్థంతిని పురస్కరించుకుని మండలంలోని బూచినెల్లి గ్రామంలో శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. పేదలకు భూములు పంచాలని, కూలీ పెంచాలని, వెట్టి చాకిరి రద్దు చేయాలని ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. -
రంగనాయకా.. రక్షణ ఏదీ?
గొర్రెలకు వ్యాధి నివారణ టీకాలుకలెక్టర్ ప్రావీణ్యముస్కాన్11తో బాలకార్మికుల సంరక్షణజిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్సంగారెడ్డి టౌన్: గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వల్ల గొర్రెలకాపరులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నదని పెంపకం దారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. స్థల సేకరణ పనులు వేగవంతం చేయాలి సంగారెడ్డి జోన్: జిల్లాలో జీ ప్లస్ త్రీ మోడల్ ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మోడల్ గృహనిర్మాణాల కోసం భూధాన్ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5,956 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. నిమ్జ్ కోసం చేపట్టిన భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: ఆపరేషన్ ముస్కాన్తో బాలకార్మికులకు సంరక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొనారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 11 వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ చేపట్టిందని, ప్రతీ ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేర్లతో రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 126 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. వీరిలో 119–మంది బాలురు, 07–మంది బాలికలు ఉన్నారు. బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై 81 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు రక్షణ కరువైంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రిజర్వాయర్ వద్ద ప్రకృతిని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు రిజర్వాయర్లోకి దిగుతుండటంతో నీటి గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. రక్షణ చర్యలు లేక.. ఇటీవల వర్షాలు కురువడంతో రిజర్వాయర్లోకి భారీగా వరద చేరింది. రిజర్వాయర్ అందాలను వీక్షించేందుకు సిద్దిపేట, సమీప ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగే క్రమంలో నీటి అంచుల వరకు చేరుకుంటున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇటీవల వరంగల్ జిల్లా విద్యార్థులు ఇద్దరు నీటిలో దిగి మృత్యువాత పడ్డారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పేదల సొంతింటి కల తీరుస్తాం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని భూమయ్య కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులందరికీ దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఆర్థిక సహాయానికి తోడు ఉచిత ఇసుక, ప్రారంభించడానికి డబ్బులు లేని పేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని చెప్పారు. జూకల్ శివారులో నిర్మించిన 775 రెండు డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలైన దివ్యాంగులు, వితంతువులు, స్థలాలు, ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించేందుకుగాను వార్డుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు జరుగుతోందన్నారు. అనంతరం రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు క్రాస్ చెకింగ్ చేశాక అర్హులైన వారికి కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను 900 ఎస్ఎఫ్టీ వరకు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని, వ్యవసాయంకోసం 4 వీలర్ వాహనాలు కలిగిఉన్న అర్హులకు ఇళ్లను మంజూరు చేయాలని సంబంధిత మంత్రి శ్రీనివాస్రెడ్డిని కోరామని వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్కు రూ.1.15కోట్లు ఖేడ్ పట్టణంలోని జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్ కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, వాష్రూం తదితర సదుపాయాలు కల్పించేందుకు రూ.1.15 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. కన్వెన్షన్ హాల్ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ..పేదలు తక్కువ అద్దె చెల్లించి వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్య, మాజీవైస్ చైర్మన్ దారం శంకర్, పండరీరెడ్డి, అర్జున్, ప్రభాకర్రెడ్డి, వార్డుల అధికారులున్నారు. -
నల్లవాగు కాల్వలో పూడికతీత
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు కాల్వల్లో శుక్రవారం పూడికతీత పనులు చేపట్టారు. కాల్వల్లో ఉన్న మొక్కలను, మట్టిని తొలగించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో పూడిక మట్టి, చెత్త, మొక్కలు నిండిపోయాయి. నీటి సరఫరా కోసం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు కింద సాగు నీటి సరఫరాకు ఆటంకం ఉండకుండా ముందస్తుగా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించడంతో కల్హేర్ మండలం బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, తదితర చోట్ల జేసీబీలతో ప్రాజెక్టు కాల్వల్లో పూడిక తీసి శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ డీఈఈ పవన్కుమార్ పనులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏఈలు శివధర్రెడ్డి, మల్లేశం, కాంగ్రెస్ నాయకులు తుకారాం పాల్గొన్నారు. -
అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు
జహీరాబాద్: పాఠశాలలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు చెక్ పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో ఉపాధ్యాయుల ఇష్టారీతిగా వ్యవహరించే విధానానికి తెరపడినట్లైంది. జిల్లాలోని 1,264 పాఠశాలల్లో ఈ విధానం అమలు కానుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించేవిధంగా, హాజరును వారే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకునేలా ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చింది. సంబంధిత ఉద్యోగి సెల్ఫోన్లోనే టీజీఎఫ్ఆర్సీ అనే యాప్ను డౌన్లోడ్ చేసి వారి హాజరును నేరుగా ఆన్లైన్లో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలలకు చేరుకోగానే యాప్ను ఉపయోగించి హాజరు నమోదు చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5,900మంది బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీర ంతా ఫేస్ రికగ్నేషన్ కోసం టీజీఎఫ్ఆర్సీ యాప్ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. సమయానికి చేరుకోలేక పోతున్నారనే... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా పోతున్నారనే ఫిర్యాదులు వచ్చిన కారణంగానే ఈ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గతేడాది పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టడంతో విజయవంతం అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. అనేకమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో స్కూళ్లకు సకాలంలో హాజరు కాలేకపోవడం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్ రికగ్నేషన్ అమల్లోకి తెచ్చారు. సర్వర్ డౌన్తో నమోదులో ఆలస్యం సర్వర్ డౌన్తో ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా ఒకేసారి నమోదు చేయడంతో సర్వర్ డౌన్ అయినట్లు జహీరాబాద్ ఎంఈఓ మాణయ్య పేర్కొన్నారు. ప్రక్రియను పూర్తిచేసుకున్న అనంతరం ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. ఈ విధానాన్ని స్వాగతిస్తున్నాం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని తమ యూనియన్ పూర్తిగా సమర్ధిస్తోంది. ఎప్పట్నుంచో ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా తమ యూనియన్ కోరుతూ వచ్చింది. ఈ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుంది. పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను పెంచాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఆశయం నెరవేరుతుంది. –కె.దత్తాత్రి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్యక్షుడు డుమ్మాకొట్టే, ఆలస్యంగా వచ్చే టీచర్లకు చెక్ పలు పాఠశాలల్లో సర్వర్ల డౌన్తో నమోదు ప్రక్రియలో జాప్యం స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు -
తరగతి గదులు నిర్మించండి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని నాగులపల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని వెంటనే తరగతి గదులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వారంతా శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. పాఠశాలలోని విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా డీఈఓ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ఈ సమస్యపై కలెక్టర్కు నివేదిక అందజేస్తానని తెలిపారు. -
పార్టీలకు అతీతంగా నిధులిచ్చాం
సిద్దిపేటజోన్: పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు అప్పటి మంత్రి హరీశ్రావు సహకారంతో సమానంగా నిధులు కేటాయించామని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పేర్కొన్నారు. మేము ఇచ్చిందే కానీ, కాంగ్రెస్ వచ్చాక ఆ పార్టీ కౌన్సిలర్లు తెచ్చిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు కౌన్సిలర్లు ఏకపక్షంగా ఎజెండా రూపకల్పన చేసినట్టు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భార్యల పదవులను అడ్డం పెట్టుకుని భర్తలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనుల నిధులను ఆపివేసిందని ఆరోపించారు. సిద్దిపేటకు ఆపిన నిధులను గూర్చి మంత్రులను అడిగే ధైర్యం లేని నాయకులు విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఐదు వార్డులకు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. కలెక్టర్ స్పందించి అన్ని వార్డులకు ప్రభుత్వ నిధులు వచ్చేలా చూడాలన్నారు. అధికారం ఉందని, తమ వార్డులకు మాత్రమే నిధులను మంజూరు చేయడం సరికాదన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎమ్మెల్యే హరీశ్రావు అన్ని వార్డుల్లో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం 90శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా 10 శాతం పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు లక్ష్మణ్, ప్రవీణ్, సుందర్, యోగి, నాగరాజురెడ్డి, మల్లికార్జున్, అరవింద్ రెడ్డి, సాయికుమార్,సతీశ్, కోఆప్షన్ సభ్యులు షాహిద్, సత్తయ్య, నాయకులు తిరుమల్ రెడ్డి, అక్తర్, మోహిజ్, రాజేశం, రాజు, శ్రీహరి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మీరేం తీసుకొచ్చారు? రూ.20 కోట్ల నిధులు ఆపేసిన కాంగ్రెస్ ఆ పార్టీ నేతలవి అవగాహనలేని వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ధ్వజం -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ.రాజేందర్రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఇజ్రాయిల్(42) సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్తూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక అదృశ్యంకల్హేర్(నారాయణఖేడ్): ఇంటి నుంచి వెళ్లిన బాలిక అదృశ్యమైంది. కల్హేర్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రహ్మణపల్లికి చెందిన దుర్గ భవాని కల్హేర్లోని మేనమామ రమేశ్ వద్ద ఉంటోంది. గురువారం సాయంత్రం ఇంటి నంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల పీఓ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజికల్ స్టడీస్, సోషల్ సబ్జెక్ట్లను ఇంగ్లిష్ మీడియంలో బోధించే ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఈడీతోపాటు టెట్ అర్హత సాధించిన వారు అర్హులని, ఈనెల 5 లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేకాట రాయుళ్ల అరెస్టుగజ్వేల్రూరల్: పేకాట స్థావరంపై దాడిచేసి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పాత గ్రామపంచాయతీ సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లో కొందరు పేకాటాడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ. 28100 నగదుతో పాటు 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి.. చేగుంట(తూప్రాన్): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ గోపాల్ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు నాగులమ్మ కాలనీలో జార్ఖండ్కు చెందిన అస్మవుల్షేక్ గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడు ఉంటున్న ఇంటిని తనిఖీ చేసి 160 గ్రాముల గంజాయిని, నిందితుడి ఫోనును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రామాయంపేట ఎస్హెచో కార్యాలయంలో అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాలయ్య, సిబ్బంది ఎల్లయ్య, చంద్రయ్య, రాజు, నరేశ్, హరీశ్, రవి, నవీన్ పాల్గొన్నారు. కత్తితో బెదిరించిన వ్యక్తికి మూడేళ్ల జైలు రూ.వెయ్యి జరిమాన మెదక్ మున్సిపాలిటీ: డబ్బులు దోచుకెళ్తూ కత్తితో బెదిరించిన వ్యక్తికి మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... 2024లో మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శేకులు అనే వ్యక్తి నుంచి సిల్వేరి విల్సన్ డబ్బులు లాక్కొని వెళ్తుండగా బాధితుడు గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడున్న భక్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా విల్సన్ వారిని కత్తితో బెదిరించినట్లు తెలిపారు. ఈ మేరకు అప్పటి సీఐ కేసు నమోదు చేయగా శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ విల్సన్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు విషయంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మందుబాబులకు జరిమానసిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 51మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,04,500 జరిమానా విధించారు. -
బలవంతపు భూసేకరణ వద్దు
కొండాపూర్(సంగారెడ్డి): పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పేర్కొన్నారు. శుక్రవారం సీపీఎం నాయకులు మండల పరిధిలోని మాందాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ... గ్రామంలో గల సర్వే నం.22లో సుమారు 300 ఎకరాల భూమిని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అలాంటి రైతుల భూమిని ప్రభుత్వం బడా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, ఒక వేళ భూములు ఇవ్వాల్సి వస్తే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన రైతుల ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి, వారి ఒప్పందంతో భూములు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వృద్ద్ధాప్య, వితంతు పెన్షన్లు రూ.4016, వికలాంగుల పెన్షన్ రూ.6016 ఇస్తామని వాగ్దానాలు చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు, శాఖ కార్యదర్శి సుధాకర్, అమృతమ్మ, రమేశ్, సంజీవులు, మాజీ సర్పంచ్ శ్రీశైలం, విక్రం, రైతులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం -
ఆరుతడి పంటల సాగుతో లాభాలు
నర్సాపూర్ రూరల్: ఆరుతడి పంటల సాగుతో మంచి లాభాలు వస్తాయని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రైతులకు సూచించారు. శుక్రవారం అగ్రికల్చర్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూసాపేటలో రైతులకు ఆరుతడి పంటల సాగు, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలను వివరించారు. దీంతోపాటు పంటల సంరక్షణ పాస్పరస్ సెల్యూబ్లిజిగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ) గూర్చి వివరించారు. విత్తన శుద్ధి, భూసార పరీక్షల వంటి వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా మట్టి దందా?
అక్రమంగా మట్టిని తీసుకువచ్చి పోస్తున్న టిప్పర్అర్ధరాత్రి రిసార్ట్లకు తరలింపు ● నంబర్ ప్లేట్లు లేని టిప్పర్ల వినియోగం ● ఏడుపాయల టీ జంక్షన్ వద్ద తంతు ● పట్టించుకోని అధికారులు కొల్చారం(నర్సాపూర్): మండలంలోని పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయల వన దుర్గాదేవి సన్నిధికి వెళ్లే రహదారి పొడవున అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, వాటికోసం అవసరమైన మట్టిని తరలించేందుకు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. తప్పుడు అనుమతుల పత్రాలతో, అర్ధరాత్రి మట్టి రవాణా చేయడం, అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా అక్రమంగా మట్టి దందా చేస్తున్నారు. పైగా తాము ‘నాయకులమని‘, మమ్ములను ఎదిరించేవారు ఎవరంటూ.. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు పరిపాటిగా తయారయ్యాయి. అధికారుల అడ్డగోలు అనుమతులతో ఈ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. 20 ఎకరాల్లో రిసార్ట్కు... ఎప్పుడూ నీటితో పారే మంజీరా నదికి పక్కన పచ్చని పంటల పొలాలతో తులతూగుతున్న భూములపై కన్నుపడ్డ కొందరు.. ఇక్కడి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పొలాలను లీజుకు తీసుకుని రిసార్ట్లు, భవనాలను నిర్మిస్తు న్నారు. ఇప్పటికే ఇక్కడ అనుమతులు లేని నిర్మాణాలు వెలిశాయి. ఇందులో కొన్ని బఫర్ జోన్ పరిధిలో కూడా ఉన్నాయి. ముడుపులకు ఆశపడ్డ అధికారులు, అటువైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరిన్ని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తంలో మట్టి అవసరం ఏర్పడటంతో అక్రమ మట్టి రవాణా దందా నడుస్తోంది. రింగుగా ఏర్పడ్డ కొందరు పెద్ద మొత్తంలో దందా నిర్వహిస్తున్నారు. తాజాగా 20 ఎకరాల పరిధిలో రిసార్ట్ నిర్మాణానికి ’నేను నాయకున్ని, నాకెవరు అడ్డు చెప్పేదని చెప్పుకుంటున్న ఓ అక్రమార్కుడు ఈ మట్టి రవాణాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాపన్నపేట మండలం పరిధి నుంచి అర్ధరాత్రి తప్పుల తడకతో ఉన్న ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా మట్టిని టిప్పర్ల ద్వారా తీసుకెళ్తున్నారు. అనుమతి పత్రంలో చూపించినట్టుగా నంబర్ ప్లేటులేని టిప్పర్లను మట్టి రవాణాకు వినియోగించడం, పైగా అర్ధరాత్రి రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి సైతం గండి కొడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసార్ట్ ఏర్పాటు, అనుమతుల విషయమై పోతంశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుంధతిని వివరణ కోరగా... ఎలాంటి అనుమతులు లేవని ఆమె సమాధానమిచ్చారు.కేసులు నమోదు చేస్తాం అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణా చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్చారి, తహసీల్దార్, కొల్చారం -
కార్మికులకు అండగా లేబర్కార్డు
జిల్లాలో 25వేల మంది కార్మికులుమెదక్ కలెక్టరేట్: అసంఘటిత కార్మికులకు లేబర్కార్డు అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయ ఆధారం లేకపోవడంతో పట్టణాలకు చేరుకుని భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు పట్టణంలోని పేదలు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే ప్రమాదవశాత్తు పనిచేస్తున్న చోట జరగరానిది జరిగి కాలు, చేయి విరగడం, ప్రాణాలుపోతే అతడిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్మికుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలబడి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్కార్డును అందజేస్తుంది. 25 వేల మంది కార్మికులు జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట మూడు అసిస్టెంట్ లేబర్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు 25వేలు మంది ఉండగా, 87,607 మంది ఈ–శ్రమ్కార్డులు పొంది ఉన్నారు. అందులో 67,316 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. పెళ్లికి, డెలివరీలకు.. అసంఘటిత రంగ కార్మికుడు కూతురు పెళ్లికి రూ.30 వేలు, డెలివరీకి రూ.30 వేల చొప్పున రూ.60 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే అసంఘటిత కార్మికురాలి పెళ్లి కానుకగా రూ.30 వేలు, ఒక్కో డెలివరీ కానుకగా రూ.30 వేల చొప్పున రెండు డెలీవరీలకు రూ.60 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. రూ.6.50 కోట్లు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ప్రమాదంలో గాని, పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, సాధారణ మరణం సంభవిస్తే రూ.1.30 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు కార్మికుల పెళ్లిళ్లకు, డెలివరీలకు, ప్రమాదంలో గాయపడిన వారికి, మరణించిన వారికి మొత్తం రూ.6.50 కోట్లు ప్రభుత్వం అందజేసింది.ఒక్క ఏడాదిలో 256 వరకు.. డెలివరీ బెనిఫిట్స్ 175 మ్యారేజ్ కానుకలు 68 సాధారణ మరణాలు 9యాక్సిడెంటల్ మరణాలు 487,607 మందికి ఈ– శ్రమ్కార్డులు 67,316 మంది వ్యవసాయ కార్మికులురూ.110 కొండంత అండ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కేవలం రూ.110 చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో లేబర్కార్డు లభిస్తుంది. అడ్డా కూలీలు, భవన నిర్మాణ కూలీలకు ఈ కార్డు ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తుంది. కూలీలు చేసే పనులన్నీ ప్రమాదాలతో కూడినవే. నిర్మాణ పనులు చేసే సమయంలో ఏదైన ప్రమాదానికి గురైతే ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు విరగడంతో పాటు ఏదైనా తీవ్ర గాయం జరిగితే ప్రమాద తీవ్రతను బట్టి సుమారు రూ.3 లక్షల వరకు అందజేస్తుంది.ప్రాసెసింగ్లో 50 దరఖాస్తులు జిల్లాలో ప్రస్తుతం మరో 50 వరకు దరఖాస్తులు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పెళ్లిళ్లు, డెలీవరీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కార్మికుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. – సత్యేంద్రనాథ్, జిల్లా కార్మికశాఖ ఇన్చార్జి -
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..
కంది(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కౌలంపేటలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జగన్మోహన్ (42) గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఊదం చెరువుకట్ట వద్దకు వెళ్లాడు. అక్కడే మద్యం తాగిన అతడు ప్రమాదవశాత్తు చెరువులోకి జారి పడ్డాడు. శుక్రవారం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి కూలీ.. కంగ్టి(నారాయణఖేడ్): కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తుర్కవడ్గాం గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కిందిదొడ్డి సోపాన్(37) గురువారం స్థానిక రైతు శెట్కార్ ఏశప్పకు చెందిన పత్తి చేనులో కిందిదొడ్డి శంకర్, తులసీరాంతో కలిసి రసాయనాల పిచికారీకి నీరు మోసేందుకు మద్యం తాగి వెళ్లాడు. సమీపంలోని బావిలో నుంచి నీరు మోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. కాగా గమనించిన తోటి కూలీలు బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడగా శుక్రవారం ఉదయం బావిలో మృతదేహం లభించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సిద్ధ దుర్గారెడ్డి తెలిపారు. అనారోగ్యంతో బీహార్ వాసి.. పటాన్చెరు టౌన్: పడుకున్న చోటే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బీహార్కి చెందిన మురళి కుమార్ (32) బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంలో ఉంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో పడుకున్న అతడు శుక్రవారం ఉదయం నిద్రలేవలేదు. దీంతో తోటి కార్మికులు, స్థానికులు మురళిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్పైనుంచి కిందపడి.. కౌడిపల్లి(నర్సాపూర్): బైక్ అదుపుతప్పి కిందపడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన మేకలకాడి నాగరాజు(37) గురువారం సాయంత్రం కౌడిపల్లిలో అంగడికి వెల్లి కూరగాయలు తీసుకువస్తానని ఇంట్లో చెప్పి తన బైక్పై వెళ్లాడు. రాత్రి తిరిగి బైక్పై ఇంటికి వెళుతుండగా మండలంలోని ధర్మసాగర్ శివారులో రోడ్డుపై బైక్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
దుబ్బాక: హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ జయరాం హెచ్చరించారు. దుబ్బాక పట్టణంలోని ఉడిపి శ్రీకృష్ణ హోటల్లో టిఫిన్ చేస్తుండగా సాంబార్లో పురుగులు రావడంతో గురువారం బాధితులు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ జయరాం శుక్రవారం ఉడిపి హోటల్ను తనిఖీ చేశారు. అక్కడ వాడుతున్న ఆయిల్, పప్పు దినుసులు, కారంపొడి శాంపిల్స్ను సేకరించారు. అలాగే ప్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన శాంపిల్స్ పరీక్షల ఫలితం వచ్చాక తగు చర్యలు తీసుకుంటామన్నారు. హోటళ్లలో నాణ్యతలేని ఆహారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని సూచించారు. రూ.5 వేల జరిమానా.. ఉడిపి హోటల్లో వంటగదితో పాటు పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆస రాజశేఖర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు. జిల్లా ఫుడ్ సేప్టీ ఇన్స్పెక్టర్ జయరాం ఉడిపి శ్రీకృష్ణ హోటల్కు రూ.5 వేలు జరిమానా -
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆ తరువాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన స్తంభించిపోయిందని, సమస్యలు పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలుపులు బార్లా తెరిచారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం టారిఫ్ను పెంచి దేశంపై సుంకాలు విధిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అసహానానికి గురికాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, యాదగిరి, అరుణ్కుమార్, బాలనర్సయ్య, శ్రీనివాస్, నవీన, శారద, కృష్ణారెడ్డి, శిరీష, ప్రశాంత్ పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు -
ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవించాలి
మాజీ జడ్జి డాక్టర్ హేమంత కుమార్ పటాన్చెరు: ప్రతీ పౌరుడు దేశ చట్టాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని లేదంటే కోర్టులో తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ జిల్లా సెషన్స్ జడ్జ్జి, తెలంగాణ ఎన్నికల సంఘం న్యాయ సలహాదారు డాక్టర్ హేమంత కుమార్ స్పష్టం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ‘చట్టపరమైన హక్కులు, బాధ్యతలు’పై గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పోక్సో, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్ నిరోధక చట్టాలు, రాజ్యాంగ నిబంధనలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో సహా పలు కీలక చట్టాల గురించి విద్యార్థులకు తెలిపారు. న్యాయ సలహా కోరుకునే వారెవరైనా జిల్లా న్యాయ సేవా సంఘం చైర్మన్ లేదా కార్యదర్శికి లేఖ రాసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని వెల్లడించారు. -
ఇంటింటా జ్వర సర్వే
కంది(సంగారెడ్డి): వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జ్వరాల సర్వేను నిర్వహిస్తున్నారు. జ్వర బాధితులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్సను అందజేస్తున్నారు. ఈ సర్వే కోసం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లతో మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేక రిస్తున్నారు. మలేరియా, డెంగీ జ్వరాల పరీక్షలను అక్కడికక్కడ నిర్వహించి అవసరమైన చికిత్స అందజేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చే కలబ్గూర్, కలివేముల గ్రామాల్లో డెంగీ కేసులను గుర్తించి వారికి చికిత్సలు అందజేస్తున్నట్లు పీహెచ్సీ డాక్టర్ సాయి శంకర్ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 9,246 మందిని సర్వే చేసి నివాస గృహాల్లోని 1,685 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 65 మందికి వైద్య సేవలు అందజేస్తున్నారు. వీరిలో నలుగురికి డెంగ్యూ, 16 మందికి టైఫాయిడ్ జ్వరం వచ్చినట్లు గుర్తించారు. మండలంలో ఇప్పటి వరకు చికెన్ గున్యా కేసులు సర్వేలో నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ఇళ్ల ముందు మురికి నీరు నిలవకుండా చేయడం, డ్రమ్ముల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో సర్వేలు నిర్వహించి జ్వర బాధితులను గుర్తిస్తున్నాం. పూల కుండీలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమై రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. అలాగే తాజాగా, వేడి వేడిగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. –సాయి శంకర్, కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు -
ప్రాణాలు పోతున్నా.. హెల్మెట్లు పెట్టరా..?
● ప్రతినెల సగటున 11 మంది మృత్యువాత ● జిల్లావ్యాప్తంగా ఏడు నెలల్లో400 ప్రమాదాలు ● 179 మరణాలు.. ద్విచక్ర వాహనదారులు 118 మంది ● జరిమాన విధించినా కానరాని మార్పుకలెక్టర్ కట్టడిచేసినా.. ద్విచక్రవాహన దారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, లేకుంటే కలెక్టరేట్ ఆవరణలోకి అనుమతించ వద్దని కలెక్టర్ రాహుల్రాజ్ ఫిబ్రవరిలో తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో కలెక్టరేట్కు వెళ్లే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించే కార్యాలయానికి వెళ్లేది. ఆ నెలలో 95శాతం మంది ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించారు. కొంత కాలం తర్వాత మళ్లీ యథాస్థితే. కాగా, జిల్లాలో హెల్మెట్ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు. ఈ విషయమై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది.మెదక్జోన్: ‘‘హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడపొద్దు.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం’’అని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. నిత్యం జరిమానాలు విధించినా ఫలితం లేకుండా పోతుంది. ఫలితంగా జిల్లాలో ప్రతినెల సగటున 11 మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు శోకం మిగుల్చుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు మాసాల్లో 400 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. అందులో 179 మంది మరణించారు. వారిలో 118 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 61 మంది ఇతర వాహనదారులు ఉన్నారు. కేవలం హెల్మెట్లు ధరించక పోవటంతోనే 76 మంది మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. రోడ్ల మీదకు వస్తున్న కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డు మీదకు వస్తోంది. పిల్లల చదువులు ఆగిపోతాయి. కుటుంబ భారం మహిళపై పడుతోంది. ఒకవేళ పెళ్లికాని యువత చనిపోతే జన్మనిచ్చిన తల్లి దండ్రులకు తీరని కడుపు కోత మిగిలిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కుటుంబమే రోడ్డుపైకి వస్తోంది. ఇంత జరుగుతున్నా ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా నడపటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. -
చింతకుంట టు ‘చిట్కుల్’
● క్యూగట్టిన కల్లు ప్రియులు ● చింతకుంట, పోసానిపేటలలోకల్లు దుకాణాలు మూసివేత ● మొదటిసారిగా నాలుగురోజులుగా బంద్ ● అక్రమంగా కల్లు తెచ్చుకుంటున్నాపట్టించుకోని ఎక్సైజ్ అధికారులువట్పల్లి(అందోల్): అందోలు మండలం పరిధిలోని చింతకుంట, పోసానిపేట గ్రామాల్లో కల్లు దుకాణాలను మూసేశారు. దీంతో కల్లు ప్రియుల బాధలు వర్ణనాతీతం. కల్లుకు బానిసైన కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో చిలప్చెడ్ మండలం చిట్కుల్ గ్రా మంలోని కల్లు దుకాణాలకు క్యూగట్టారు. జోగిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన కొంత మంది సభ్యులు తమకు రావాల్సిన వాటా డబ్బులు కాంట్రాక్టర్ ఇవ్వలేదన్న ఆరోపణలతో ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, అందోల్లోని కల్లు డిపోలో కల్లును తయీరు చేసి రవా ణా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో జోగిపేట, పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయి. నాలుగు రోజుల పాటు స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా కల్లుకు బానిసై న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఒక్క రోజు కల్లు సేవించనట్లయితే నరాలు పీక్కుపోవడం, అనారోగ్యానికి గురికావడం వంటి ఘటనలు గతంలో జరిగాయి. దారులన్నీ చిట్కుల్వైపే... స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడంతో మూడు గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు చిట్కుల్ గ్రామానికి తరలివెళుతున్నారు. అక్కడ విక్రయించే కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడం వల్ల కూడా స్థానికులు బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రతి రోజు జోగిపేటకు చెందిన వారు మహిళలే 5, 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలలో ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ కావడం కూడా వారికి కలసి వస్తుంది. ప్రభుత్వం లైసెన్స్లు కలిగి ఉన్న దుకాణాలు మూసి ఉంచినా ఎకై ్సజ్ అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. చిట్కుల్ కల్లు కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి.. జోగిపేటలో కల్లు అందుబాటులో ఉన్నప్పటికీ మత్తు కు అలవాటు పడిపోయి చిట్కుల్కు ప్రతి రోజు ద్విచక్రవాహనాలపై వెళుతున్నారు. అక్కడే కల్లు సేవించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు పది మందికిపైగా మృత్యువాతకు గురైన సంఘటనలున్నాయి. ఈ విషయం స్థానిక ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ కల్లు రవాణాను అడ్డుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. -
కరవు నేలను ముద్దాడిన వరద నీరు..!
హుస్నాబాద్రూరల్: భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు సాగునీరు అందక రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటలను సరిపడా నీరందక పశువుల మేతకు వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. పెట్టుబడుల భారంతో మెట్ట రైతులు ఆర్థిక నష్టాలను సైతం భరిస్తున్నారు. అయితే.. నిత్యం వేధించే సాగునీటి సమస్యను శాశ్వతంగా దూరంగా చేయాలని ఓ రైతు ప్రయత్నం ఫలించింది. ఆర్థిక కష్ట, నష్టాలు.. కొన్ని సందర్భాల్లో నిరాశ పరిచినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్కు చెందిన రైతు మాదారపు రాంగోపాల్రావు తన ఆలోచనలకు పదును పెట్టి ఏకంగా ఇరవై ఎకరాలకు సాగునీరందేలా చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితానిస్తోంది. కోర్టు కేసుల కారణంగా మొన్నటి వరకు గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు కావాల్సిన సాగు నీరు అందుతుందన్న ఆశలను రైతులు వదులుకున్నారు. రెండేళ్లు యాసంగి పంటలకు సాగు నీరందక పంటలు ఎండిపోతే చాలా మంది రైతులు చేసేదేమిలేక పశువుల మేతకు వదిలేశారు. అయితే.. రాంగోపాల్రావు మాత్రం తన ముందున్న ప్రతికూల పరిస్థితులకు భయపడలేదు. మెదడుకు పదును పెట్టాడు. గతంలో ఊటబావి తవ్వించాడు. నీరు పడలేదు. సరిగా నీరందక ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేసి.. మరో బావిని తవ్వే పనులు మొదలు పెట్టాడు. రూ.5 లక్షల వ్యయంతో 25 గజాల బావి తవ్వించి సిమెంట్ రింగ్లు పోయించాడు. వేసవిలో నీరు లేకపోయినా నిరుత్సాహపడలేదు, బావి పక్కనే 10 గుంటల విస్తీర్ణంలో చిన్న కొలను తవ్వించి.. అందులోకి వరద నీటిని మళ్లించి చిన్న చెరువులా చేశాడు. దీంతో బావిలో నీటి ఊటలు రావడం ప్రారంభమైంది. చూస్తుండగానే బావిలో నీరు పుష్కలంగా ఉండటంతో పంటలకు సాగునీటి కొరత లేకుండా పోయింది. తన పదెకరాల పొలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని బీడు భూమిని చదును చేసి వరి సాగు చేస్తున్నాడు రాంగోపాల్రావు. నిన్నటి వరకు నీళ్లు లేని బావులు ఇప్పుడు చిన్న కొలను ఏర్పాటు చేయడం ద్వారా రెండు ఊట బావుల్లో భూగర్భ జలాలు ౖపైపెకి వచ్చి రైతులను అశ్చర్య పరుస్తున్నాయి. రెండేళ్ల రైతు శ్రమకు కావాల్సిన సాగు నీరు రావడంతో రాంగోపాల్రావు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కష్టపడితే నీళ్లరేవొచ్చింది గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు సాగు నీరు వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు కోర్టు కేసులతో గోదావరి జలాలు వచ్చే నమ్మకం లేదు. రెండేళ్లు పది ఎకరాల్లో పంట ఎండి రూ.10లక్షల నష్టం వచ్చింది. కష్టపడి బావి తవ్వితే.. ఇప్పుడు నీళ్ల రేవు వచ్చింది. నీటి కొలనుతో బావిలో ఊట నీరు పెరిగింది. పంటలకు కావాల్సిన నీళ్లు రెండు బావులు అందిస్తున్నాయి. రాంగోపాల్రావు, రైతు వరద నీరు మళ్లించి కొలను ఏర్పాటు బావుల్లో ఊట పెరగడంతో పాతాళ గంగ ౖపైపెకి .. బీళ్లకు నీరు పారించిపంటలు సాగు చేస్తున్న రైతు 20 ఎకరాలలో వరి, మొక్కజొన్నపంటల సాగు సత్ఫలితాలిస్తున్న రైతు రాంగోపాల్రావు కృషి ఓ రైతు భగీరథయత్నం ఫలించింది. కరువుతో అల్లాడుతున్న ఆ నేలకు వరద నీరు ముద్దాడేలా చేశాడు. బీడు భూములను సస్యశ్యామలం చేశాడు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు, సిద్దిపేట టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం ప్రకారం .. గురువారం ఉదయం చేర్యాల హెచ్పీ పెట్రోలు పంపు వెనకాల ఉన్న చెట్లలో గంజాయి విక్రయించేందుకు పలువురు యువకులు ప్రయత్నిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు, చేర్యాల పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నీల చందు, ఆకుల హర్షవర్ధన్ వద్ద 180 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, వారు హైదరాబాద్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద విక్రయించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.180 ఎండు గంజాయి, బైకు స్వాధీనం -
అనుమతులు వేగవంతం చేయండి
పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్ సంగారెడ్డి జోన్/కంది(సంగారెడ్డి): జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ప్రావీణ్య నిర్వహించిన పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశానికి జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ తుల్జా నాయక్ హాజరయ్యారు. మెటీరియల్స్ సరఫరా, భూ కమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్ల అనుమతుల కోసం దరఖాస్తు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు వెంటనే అనుమతులివ్వాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కందిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో చికిత్స పొందుతున్నవారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కందిలోని జెడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా అందుతున్న బోధనలను పరిశీలించారు. ఈసారి కూడా పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సూచించారు. -
అడ్డగోలు స్కానింగ్లు
● కనీస నిబంధనలు పాటించనిప్రైవేటు ఆస్పత్రులు ● రాష్ట్ర అధికారుల తనిఖీల్లో వెల్లడైన బాగోతం ● పీసీపీఎన్డీటీ నిబంధనల్ని గాలికొదిలిన వైనం ఎందుకు పట్టుకోలేదు? జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించింది. జిల్లా అధికారుల బృందాలతోపాటు, రాష్ట్ర అధికారులు కూడా ఈ ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర అధికారుల బృందాలు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్ల వ్యవహారం బట్టబయలైంది. కానీ, జిల్లా అధికారుల బృందాలు ఈ అక్రమ స్కానింగ్లను ఎందుకు పట్టించుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా జిల్లా అధికారులు తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో రెండు ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలుగా స్కానింగ్ల దందా సాగుతోంది. నిబంధనల ప్రకారం గర్భిణీలకు నిర్వహించిన ప్రతీ స్కానింగ్ వివరాలను ప్రభుత్వానికి సంబంధించిన పీఎన్డీటీ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. కానీ, ఈ ఆస్పత్రులు నిబంధనలను తుంగలో తొక్కాయి. వీళ్లు చేసిన స్కానింగ్లకు, పోర్టల్లో నమోదైన స్కానింగ్లకు భారీగా తేడాలున్నట్లు వెలుగుచూసింది. అలాగే వైద్యుడు రిఫర్ చేసిన స్లిప్ ఉంటే మాత్రమే స్కానింగ్ చేయాల్సి ఉండగా అటువంటి స్లిప్లు లేకుండానే స్కానింగ్ చేసేశాయి. పైగా ఈ స్కానింగ్లకు సంబంధించి ఈ ఆస్పత్రులు కనీసం రికార్డులను కూడా నిర్వహించలేదు. ఇటీవల రాష్ట్రస్థాయిలో అధికారుల బృందాలు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారు. కాసులకు కక్కుర్తి పడి భ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్కానింగ్ల విషయంలో పీసీ పీఎన్డీటీ చట్టం (ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ యాక్ట్) కింద కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే కాసులకు కక్కుర్తి పడుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఈ నిబంధనలను కాలరాస్తూ స్కానింగ్ దందాను సాగిస్తున్నాయి. పైన పేర్కొన్న ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. గ్రామాల్లో పనిచేస్తున్న పీఎంపీలు, ఆర్ఎంపీలను ఏజెంట్లను పెట్టుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులు, ఇతర సంస్థలు జిల్లాలో మొత్తం 656 ఉన్నాయి. ఇందులో ఆస్పత్రులతోపాటు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, దంత వైద్యశాలలు, పాలిక్లీనిక్లు, ఫిజియోథెరపీ యూనిట్లు, పునరావాస కేంద్రాలు, ఆయుష్ ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు కింద వీటికి అనుమతులు జారీ అయ్యాయి. అయితే కొన్ని ఆస్పత్రులు కాసులకు కక్కుర్తిపడి ఈ నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్ చేసి డబ్బులు దండుకుంటున్నాయి. -
నేడు అందోల్కు మీనాక్షి
జోగిపేట(అందోల్): ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం అందోల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ రెండు రోజులుగా జోగిపేటలోనే మకాం వేసి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా, సంగుపేట నుంచి జోగిపేట వరకు మీనాక్షి నటరాజన్ చేపడుతున్న పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం చేశారు. అందోల్ మండలం సంగుపేట నుంచి జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సంగుపేట వద్ద మీనాక్షి నటరాజన్కు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా పాల్గొనాలి: దామోదర మీనాక్షి నటరాజన్ చేపట్టే జనహిత పాదయాత్రలో నియోజకవర్గంలోని పార్టీకి ముఖ్యనాయకులు, కా ర్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా హజరై పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని విజయవంతం చే యాలని మంత్రి దామోదర పిలుపునిచ్చారు. ఆగస్టు 2న శ్రమదానంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మిదేవీ గార్డెన్స్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. సంగుపేట నుంచి జనహిత పాదయాత్ర తరలిరావాలని దామోదర పిలుపు -
నిత్యం నరకమే
రామచంద్రాపురం, ఎంఐజీ, ఎల్ఐజీ, విద్యుత్నగర్, బెల్ కాలనీలకు చెందిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్నగర్ కాలనీ నుంచి తెల్లాపూర్ మార్గంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ కొద్ది రోజుల పనిచేసి తర్వాత మొరాయించడంతో కొంతమంది వాహనదారులు ఇష్టానుసారంగా వస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. –రామచంద్రాపురం(పటాన్చెరు) -
యూ టర్న్ తీసుకుంటుండగా..
మనోహరాబాద్(తూప్రాన్): జాతీయ రహదారి–44పై రెండు లారీలు ఢీకొని పల్టీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళుతున్న లారీ మండలంలోని కాళ్లకల్ శివారులోకి రాగానే యూ టర్న్ చేస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు పల్టీ కొట్టాయి. లారీ డ్రైవర్కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్ స్తంభించడంతో జీఎమ్మార్ సిబ్బంది క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్ను అంబులెన్సులో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఢీకొని పల్టీ కొట్టిన రెండు లారీలు ఒకరికి తీవ్రగాయాలు -
దశదిన కర్మ స్నానానికి వెళ్లి..
మిరుదొడ్డి(దుబ్బాక): దశదిన కర్మలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల పర్శరాములు (28) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ భార్య నవనీత, ఐదు నెలల కుమారుడితో పాటు, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కాగా పర్శరాములు పాలివారైన చుక్క పోచయ్య ఇటీవల చనిపోవడంతో గురువారం దశదిన కర్మ ఉండగా.. తోటి కులస్తులతో భూంపల్లి శివారులోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో దిగి స్నానం చేస్తుండగా పర్శరాములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా మూడు గంటల పాటు గజ ఈతగాళ్లు శ్రమించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కేసు దర్యాప్తులో ఉంది.చెరువులో మునిగి యువకుడి మృతి -
మీ సేవలు శ్లాఘనీయం
సంగారెడ్డి జోన్: ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజమేనని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, ఎస్సై యాదవ్రెడ్డి, అలీముద్దీన్, ఏఎస్సై అజీముద్దీన్ పదవీ విరమణను పురస్కరించుకుని గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. విరమణ పొందిన అధికారులను పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివన్నారు. పదవీ విరమణ అనంతరం వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా చూస్తామన్నారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని తెలిపారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. వర్టికల్ డీఎస్పీ శ్రీనివాసరావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, ఎఆర్ డీఎస్పీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ -
కొత్త కార్డులకూ సంక్షేమ పథకాలు!
నారాయణఖేడ్: రాష్ట్రంలో ప్రస్తుతం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆరోగ్యశ్రీతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను ఈ నూతన కార్డుదారులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నారు. పథకాల అమలుతో జిల్లాలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ మేలు చేకూరనుంది. చాలా పథకాలు రేషన్కార్డులు లేకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు. దాదాపు అన్ని పథకాలకు రేషన్కార్డే ప్రామాణికం కావడంతో ఇన్నాళ్లూ కార్డులులేని వారు పలు పథకాలను పొందలేకపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. దీంతో జిల్లాలో రేషన్ కార్డుదారుల్లో సంతోషం నెలకొంది. అనుమతి పొందిన దరఖాస్తులు 56,324 జిల్లాలో నూతనంగా రేషన్ కార్డుల కోసం 81,587మంది దరఖాస్తు చేసుకున్నట్లు డీఎస్ఓ అధికారులు తెలిపారు. ఇందులో 56,324 దరఖాస్తులు అనుమతి పొందగా...13,767 అప్లికేషన్లను తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇంకా 11,496 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పాత రేషన్ కార్డులు 3,78,511కాగా, ఇందులో సభ్యులు 19,32,137 ఉన్నారని తెలిపారు. నూతనంగా మంజూరైన, మంజూరు కానున్న రేషన్కార్డు లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు అర్హులు కానున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక విభాగం ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను రేషన్ కార్డుదారులకు రూ.10లక్షల వరకు పెంచి అవకాశం కల్పించింది. నూతన కార్డుదారులందరికీ ప్రథమంగా ఆరోగ్యశ్రీ సేవలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయియించింది. ఇందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారి వివరాలతోపాటు పాతకార్డులో కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీలో నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున వీలైనంత త్వరగా రేషన్ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అనుసంధాన ప్రక్రియ పూర్తి కాగానే నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా నిబంధనల మేరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. త్వరలో అమలుకు శ్రీకారం మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ.. తర్వాత అన్ని పథకాలూ వర్తింపు నమోదు కోసం ఇళ్లవద్దకే అధికారులు ఇతర పథకాలు కూడా.. రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు ఇతర పథకాలను కూడా కార్డుదారులకు అందించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ డ్రైవ్లో అధికారులే నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి వివరాలను నమోదు చేసుకుని అవసరమైన అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు పొందనున్నారు. కాగా, రేషన్ కార్డు స్థానంలో ప్రస్తుతం మంజూరు పత్రాలు జారీ చేయగా త్వరలో డిజైన్ను ఖరారు చేసి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. -
పెద్ద చెరువుకు ముప్పు
కాల్వలు కబ్జా.. పూడుకుపోయిన అలుగు విచారణ చేసి చర్యలు తీసుకుంటాం పెద్ద చెరువుకు పెద్దగా ప్రమాదం లేదు. బంధం కొమ్ము వైపు కాలువల కబ్జా అంశంపై ఉన్నతాధికారుల సూచనలు అవసరం. గతంలో అప్పటి కలెక్టర్ హనుమంతరావు మౌఖిక ఆదేశాలిచ్చారే కానీ లిఖిత పూర్వక ఆదేశాలివ్వలేదు. అక్కడ కొన్ని ఇళ్లను తొలగించాలని సూచించారు. బంధం కొమ్ము చెరువు కింద కాలువలను కబ్జా చేస్తూ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారన్న విషయంపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – జైభీమ్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంగారెడ్డి ● గొలుసు కట్టు చెరువులకు తెగిన లింక్ ● 2021లోనే కబ్జాల గుర్తింపు.. తొలగని నిర్మాణాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు పటాన్చెరు: అమీన్పూర్ పెద్ద చెరువు బయోడైవర్సిటీ సైట్గా గుర్తింపు పొందింది. విదేశీ పక్షులకు ఆలవాలంగా ఉండే ఈ తటాకం కళావిహీనంగా మారింది. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఏర్పడటంతో డ్రైనేజీ నీరు వచ్చి చెరువులో కలుస్తోంది. అలుగులు పూడుకుపోవడటంతో నిండుకుండలా ఉంది. అయితే శిఖం భూమి కబ్జా కాకుండా, ఎఫ్టీఎల్ను గుర్తించేందుకు ఇరిగేషన్ అధికారులు నీటిని కిందకు వదలడం లేదని తెలుస్తోంది. దీంతో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు, అక్కడ ఏర్పడిన పలు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనుమరుగైన కాల్వలు.. గతంలో పెద్ద చెరువు నుంచి బంధం కొమ్ము చెరువు వరకు గొలుసుకట్టు చెరువులుగా, వాటికి అనుసంధానంగా కాలువలు ఉండేవి. కానీ, కొత్తగా వెంచర్లు వెలుస్తుండటంతో కొన్ని చోట్ల కాలువలు కబ్జా అవుతున్నాయి. ఎగువ భాగం నుంచి వరద తీవ్రత పెరిగినప్పుడు చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఆర్ఆర్ హోమ్స్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద చెరువు ఎగువ భాగంలో రియల్ సంస్థలు 30 అంతస్తుల హై రైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో చెరువు నీరు రైతుల పొలాల్లోకి పారుతోంది. స్థానిక రైతులు తమ పొలాల్లో నీరు ఉండకుండా ఎత్తు పెంచేందుకు మట్టిని పోస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఈ ప్రాంతంలో ఉన్నామని ఎప్పుడు లేనిది పొలాలు నీట మునుగుతున్నాయని స్థానిక రైతు రామిరెడ్డి వాపోయారు. పొంచి ఉన్న ప్రమాదం...! వర్షాలు ఎక్కువగా కురిస్తే అలుగులు లేని చెరువుతో ప్రమాదం పొంచి ఉందని, అదే జరిగితే ఇప్పుడున్న కాలనీలన్ని నీటి మునిగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కబ్జా అయిన కాల్వవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. బందం కొమ్ము చెరువు శిఖం, కాల్వలు కబ్జా అయ్యాయని.. 2021లో అప్పటి కలెక్టర్ హన్మంతరావు నిర్ధారించారు. అలాగే క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి అక్కడ నిర్మాణాలను కూల్చాలని స్థానిక అధికారులకు కూడా సూచించారు. కానీ నేటికీ హైడ్రా వచ్చినా కబ్జాలను తొలగించలేదని సమీప కాలనీల ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా కబ్జాకు గురైన కాల్వలను పునరుద్ధరించాలని, చెరువు నిండినప్పుడు నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. -
మంత్రి వివేక్ వ్యాఖ్యలు సరికాదు
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ సిద్దిపేటజోన్: జిల్లాపై అవగాహన లేక, అక్కసుతో మంత్రి వివేక్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఆయన తండ్రి వెంకట్ స్వామిని ఎంపీగా చేయడంలో సిద్దిపేట ప్రజల పాత్ర ఉందన్నారు. దాన్ని మరిచి మంత్రి సిద్దిపేటపై అక్కసు, అసూయతో వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు సహించరని స్పష్టం చేశారు. సిద్దిపేటను చెన్నూరుతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేట వెయ్యి పడకల ఆస్పత్రి అవసరమా అని వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నూరుకు వెయ్యి పడకల ఆస్పత్రి మంజూరు చేయకపోవడం ఆయన అసమర్థతగా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో జిల్లాలో 11673 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని, అది తెలియక ఇండ్లు రాలేదని అనడం అసత్య ప్రచారమన్నారు. జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు భుపేశ్, శ్రీనివాస్, మోహన్ లాల్, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, కనకరాజు, సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ వైస్ పాపయ్య పాల్గొన్నారు. -
గంజాయి కేసులో వ్యక్తికి జైలు
జహీరాబాద్ టౌన్: గంజాయి కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు జడ్జి బుధవారం తీర్పు చెప్పారని ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వివరాలోకి వెళితే... ముంబాయికి చెందిన సట్రాజ్ హుస్సేన్(39) 2019లో కారులో 16 కిలోల గంజాయిని అక్రమంగా ముంబాయి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నాడు. కోహీర్ మండల కవేలి చౌరస్తా వద్ద ఎకై ్సజ్ అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఎండు గంజాయితో హుస్సేన్ పట్టుబడ్డాడు. అప్పట్లో కేసు నమోదు చేసి ఆయనను రిమాండ్కు పంపారు. కేసు పూర్వాపరాలు విన్న తరువాత జడ్జి హుస్సేన్కు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. -
పంట పురుగులకు దీపం ఎరతో చెక్
వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్నారాయణరామాయంపేట(మెదక్): దీపం ఎరలతో వరి, మొక్కజొన్న, పత్తి చేన్లలో కాండం తొలిచే పురుగు ఉధృతని అరికట్టవచ్చని వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్నారాయణ పేర్కొన్నారు. దీపపు ఎరల వినియోగంపై బుధవారం మండలంలోని లక్ష్మాపూర్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీటి నివారణకుగాను తరచూ పురుగుల మందులను పిచికారీ చేస్తే వాటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఇలా చాలాసార్లు మరిన్ని శక్తివంతమైన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందని, దీంతో పంట ఉత్పత్తి తగ్గడంతోపాటు రైతులకు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. కాండం తొలిచే పురుగు నివారణకు సాయంత్రం వేళ పంటచేన్లలో దీపపు కాంతి ఎరలను అమర్చడం ద్వారా వాటిని ఆకర్షించి చంపివేయడమే ఏకై క మార్గమన్నారు. దీపం ఎర తయారీకి రైతుకు కేవలం రూ.మూడు నుంచి నాలుగు వందలు మాత్రమే ఖర్చవుతాయని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం
చేర్యాల(సిద్దిపేట): నలబైరెండు శాతం బీసీ రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు ఆరోపించారు. బుధవారం పట్టణ కేంద్రంలో జరిగిన చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ కుల,మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల ఐక్యతను విడదీస్తుందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్లమెంటులో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి యూరియా కొరత ఏర్పడిందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్గా సత్తిరెడ్డి వ్యవహరించగా జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు యాదవరెడ్డి, శశిధర్, వెంకట్మావో, యాదగిరి, అరుణ్, రవీందర్, కృష్ణారెడ్డి, శారద, ప్రశాంత్, శిరీష, నాగరాజు, షఫీ, రాజు, ఇస్తారీ, బాలకిషన్, శ్రీహరి, శోభ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ బాబు -
అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
మునిపల్లి(అందోల్): ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మక్త క్యాసారానికి వెళ్లి రోడ్డంతా గుంతల మయంగా ఉండటంతో నిదానంగా వస్తుంది. ఈ క్రమంలో పెద్దలోడి గ్రామ శివారులోకి రాగానే స్టీరింగ్ రాడ్ విరిగిపోయి బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాల్వలోకి వెళ్లి ఆగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో కాలేజీ, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. బస్సు డ్రైవర్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రయాణికులు ఆరోపించారు. -
స్వచ్ఛతకు దూరంగా..!
పేరుకే సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ● గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో 94వ ర్యాంకు ● కంపు కొడుతున్న డంప్యార్డ్ ● ముక్కుపిండి పన్నులు వసూలు.. ● వసతులు మాత్రం శూన్యంసంగారెడ్డి: పేరుకే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ సంగారెడ్డి.. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో మాత్రం 94వ స్థానానికి పరిమితమైంది. పట్టణంలో కంపు కొడుతున్న డంపుయార్డ్ , వసతుల లేమి, మౌలిక సదుపాయాలు, స్వచ్ఛత విషయంలో వెనకబడటంతో వెరసి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటికి కారణం మున్సిపాలిటీలో ప్రైవేటు వ్యక్తుల హవాతో అధికారులు ఎలాంటి అభివృద్ధి, వంద రోజుల ప్రణాళిక పనులు సైతం చేయలేకపోతున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్యంపై పర్యవేక్షణేది? పారిశుద్ధ్యం మెరుగు పరచడంతో పాటు మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. జూన్ 2వ తేదీ నుంచి సెప్టెంబరు 10 వరకు క్షేత్రస్థాయిలో రోజుకో కార్యక్రమం నిర్దేశించారు. కానీ సంగారెడ్డిలో స్వచ్ఛ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడ ఏం పని జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అధికారులు ఉన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇకనైనా ప్రణాళిక పనులు పటిష్టంగా అమలు చేసేలా జిల్లా కలెక్టర్, మున్సిపాలిటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అమలు కానీ ప్రణాళిక..! ప్రతి మార్పు అభివృద్ధికి బాటలు అనే నినాదంతో.. 50 అంశాల్లో రోజుకో కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ పట్టణంలో మాత్రం జరగడం లేదు. సామాజిక, స్వచ్ఛంద మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తూ, పారిశుద్ధ్యం, పచ్చదనం తదితర కార్యక్రమాలు నిర్వహించి, శిథిల భవనాలను గుర్తించి వాటిని తొలగించాలి. ప్రైవేట్ వ్యక్తుల హవా పట్టణ అభివృద్ధిలో వార్డు అధికారులదే కీలక పాత్ర. అందుకు ప్రతి వార్డుకు ఓ అధికారిని నియమించారు. వీరు ఆశించిన స్థాయిలో పనులు చేయడం లేదు. చాలా వరకు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వార్డు అధికారుల విధులకు సంబంధించి ఉత్తర్వులను ఇటీవలే పురపాలక శాఖ విడుదల చేసింది. కానీ వారి చేతిలో ఏమి లేని అయోమయ స్థితిలో ఉన్నారు. కాలనీల్లో ఏ పని జరగాలన్న ప్రైవేట్ వ్యక్తుల హవాతో అధికారులకు తెలియకుండానే జరిగిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది సర్వేలోనూ లాస్ట్.. దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పట్టణాల సర్వే ఫలితాలను రాష్ట్రపతి జూలై 17న విడుదల చేశారు. ఇందులో రాష్ట్రాల వారీగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండగా సంగారెడ్డి, అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలు చివరి స్థానంలో ఉన్నాయి. తెల్లాపూర్ –18, అమీన్పూర్ – 31, సదాశివపేట్ – 52, జహీరాబాద్ –54 , బొల్లారం నారాయణఖేడ్ –89 , సంగారెడ్డి – 94, అందోల్ జోగిపేట్ –118వ స్థానంలో నిలిచాయి. నంబర్వన్కు ప్రయత్నిస్తా.. స్వచ్ఛత విషయంలో సంగారెడ్డి మున్సిపాలిటీని నంబర్ వన్గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు పనులను పరీక్షించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి. – శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, సంగారెడ్డి -
రోడ్డు దాటుతుండగా కారు ఢీ..
వ్యక్తి దుర్మరణంసదాశివపేట(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయ రహదారి మద్దికుంట చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం... పట్టణ పరిధిలోని దక్కన్దాబా వద్ద మద్దికుంట వెళ్లడానికి కల్లప్ప(43)అనే వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయంలో సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న మారుతి వేగనార్ డ్రైవర్ అతివేగంగా నడిపి ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కల్లప్ప కర్నాటకలోని బీదర్ జిల్లా పర్వాటి మండలం బెల్హల్లీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన యాదాగౌడ్ కుమారుడు శివకుమార్గౌడ్(20) పదవ తరగతి వరకు చదువుకుని నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి మేడ్చల్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్లోని తన రూమ్కు తిరిగి వస్తుండగా ఈ నెల 18న బొలెరో వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రసాయన డ్రమ్ముల దహనం.. బ్లాస్టింగ్
భయంతో పరుగులు తీసిన తగలబెట్టిన వ్యక్తులు, స్థానికులుపటాన్చెరు టౌన్: ఓ పరిశ్రమకు చెందిన రసాయన డ్రమ్ములను డంప్యార్డ్ సమీపంలో తగలబెట్టడంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ఓ పరిశ్రమ వారు డంప్యార్డ్ సమీపంలో రసాయన డ్రమ్ములను తగలబెట్టడంతో ఒక్కసారిగా పేలాయి. ఈ హఠాత్పరిణామానికి తగలబెట్టిన వ్యక్తులు, స్థానికులు దూరంగా పరుగులు తీశారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న చెట్లు కాలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పిల్లర్ గుంతలోపడి వృద్ధుడు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదశాత్తు పిల్లర్ గుంతలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ వివరాలిల ప్రకారం.. శమ్నాపూర్ గ్రామానికి చెందిన కాటిపడిగల కిషన్(67) తన ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో కాలుజారి పడిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలో నీరు నిల్వడంతో వెంటనే ఆయనను కుటుంబీకులు పైకి తీసేలోపే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడ్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య నర్సమ్మ, కుమారుడు ఉన్నాడు. 2 నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు చేగుంట(తూప్రాన్): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన చేగుంటలో ఆగస్టు2న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్రవికుమార్ తెలిపారు. సబ్ జూనియర్ నుంచి 55 సంవత్సరాల వరకు గల సీ్త్ర, పురుషుల వరకు 6 కేటగిరిలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆదిలాబాద్ నిర్మల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. వివరాలకు 96666 32023 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. చెరువులో మృతదేహం లభ్యం హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం చేర్యాల(సిద్దిపేట)/మద్దూరు(హుస్నాబాద్): అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతదేహమై కనిపించాడు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం... మృతదేహం ములుగు మండల కేంద్రానికి చెందిన తిగుళ్ల నెహ్రూ(35)గా గుర్తించారు. ములుగు ఐకేపీ కార్యాలయంలో ఆపరేటర్గా పని చేసే నెహ్రూ సోమవారం ఉదయం రోజువారీగా కార్యాలయానికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం ములుగు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గాగిళ్లాపూర్ చెరువులో మృతదేహం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ములుగు పోలీసులు నెహ్రూ మృతదేహంగా గుర్తించారు. ఇదిలా ఉంటే కాళ్లు చేతులు కట్టి, నడుముకి బండరాయి కట్టి ఉండటంతో ఎక్కడో హత్య చేసి తీసుకువచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట నిరసన చేశారు. ఆలయంలో చోరీ నర్సాపూర్: నర్సాపూర్లోని సాయిబాబ ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు హుండీ తాళం పగలగొట్టి అందులో నుంచి సుమారు రూ.20వేలు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఎస్ఐ లింగం చోరీ జరిగిన చోట క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. పేకాట స్థావరంపై దాడి దుబ్బాకరూరల్: పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో జరిగింది. ఎస్ఐ కీర్తి రాజు వివరాల ప్రకారం... బుధవారం రాత్రి గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.36,280 నగదు, నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని గురువారం చేపడుతున్నామని డిపో మేనేజర్ ఉపేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి 8500376267 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు జాబ్ మేళా సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అనిల్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ముత్తూట్ ఫైనాన్స్లో 60 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి సూచించారు. రామచంద్రాపురం పట్టణంలోని సాయినగర్కాలనీలో జాతీయ పైలేరియా, నులిపురుగుల నిర్మూలనపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు నులిపురుగుల, పైలేరియా నిర్మూలనకు ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నులిపురుగల నివారణకు ఉచిత మందులను పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు సి.గోదావరి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య కాంగ్రెస్ మహిళా నాయకురాలు అస్మా న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ బడుల్లో వసతులతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అస్మా స్పష్టం చేశారు. మండల కేంద్రమైన న్యాల్కల్లోని కేజీబీవీని బుధవారం ఆమె సందర్శించారు. విద్యాలయంలో వంట గది, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో అధిక శాతం పేద విద్యార్థులే చదువుతున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపారు. జాతీయ పక్షి నెమలి మృతి హత్నూర(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో జాతీయ పక్షి మృతి చెందిన ఘటన హత్నూర మండలం సిరిపుర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు విద్యార్థులు తెలిపిన కథనం ప్రకారం బుధవారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన సమయంలో పాఠశాల ఆవరణలో నెమలి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన నెమలిని సిబ్బంది తీసుకెళ్లి ఖననం చేసినట్లు తెలిపారు. -
ఫేస్రికగ్నేషన్తో అక్రమాలకు అడ్డు
సంగారెడ్డి టౌన్: ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) ద్వారా పింఛన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ముఖ గుర్తింపు యాప్తో పెన్షన్లు ఇవ్వడం వల్ల వృద్ధులు వేలిముద్రలు రాని వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతీ నెలా పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ ద్వారా నూతనంగా ప్రభుత్వం రూపొందించిన ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ తీరును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ద్వారా పింఛన్ లబ్ధిదారులకు నిత్య అవసరాలకు నిధులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అధిక ధరలకు వినియోగిస్తే చర్యలుసంగారెడ్డి జోన్: ఎరువులు అధిక ధరలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణంలో యూరియా స్టాక్ను పరిశీలించారు. ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. రైతుతో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ తనిఖీ సమయంలో కలెక్టర్ దుకాణంలో ఎరువులు కొనుగోలు చేసిన రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మారని తెలుసుకున్నారు. అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్కు ఆదేశించారు.కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
సంగారెడ్డి జోన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని మల్టీజోన్–2 ఇన్చార్జి ఐజీ తఫ్సిల్ ఇక్బాల్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పొరుగు రాష్ట్రాల నుంచి నిషేధిత గంజాయి, పొగాకు, గుట్కా వంటివి అక్రమ రవాణ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దులో పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు ప్రభాకర్, సైదానాయక్, వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.మల్ట్టీజోన్–2 ఇన్చార్జి ఐజీ తఫ్సిల్ ఇక్బాల్ -
మీనాక్షి పర్యటనను జయప్రదం చేయాలి
జోగిపేట (అందోల్)/సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గంలో ఆగస్టు 1న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ పర్యటనలో భాగంగా చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి బుధవారం పరిశీలించారు. అందోల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2న అందోల్ పట్టణంలో నిర్వహించే శ్రమదాన కార్యక్రమం, కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశం ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు ఎస్.సురేందర్గౌడ్, ఆకుల చిట్టిబాబు, పి. ప్రవీణ్, డి.శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి దామోదర -
ఇసుక పరేషాన్ లేదిక!
● జిల్లాలో మూడు ఇసుక స్టాక్ పాయింట్లు ● మండలానికి ఒకటి ఏర్పాటు ! ● తక్కువ ధర, నాణ్యమైన ఇసుక అందించడమే లక్ష్యంజోగిపేట(అందోల్): ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ప్రతీ మండలంలో ఇసుక నిల్వలు (స్టాక్ పాయింట్)లను ఏర్పాటు చేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మూడు మండలాలను గుర్తించింది. ఇటీవల అందోల్, కోహీర్, నిజాంపేట మండలాల్లో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి నిల్వ ఉంచుతున్నారు. డిజిటల్ మానిటరింగ్ ద్వారా ఈ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు సమాచారం. వర్షాకాలం మినహా అన్ని కాలాల్లో స్టాక్ పాయింట్లను ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోతే ప్రజలు మళ్లీ మార్కెట్వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. వీటితోపాటు రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారి ద్వారానే డబ్బులను వసూలు చేసినా ఇబ్బందులుండవని భావిస్తున్నారు. ఇసుక పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం అయి ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ప్రభుత్వమే ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లయితే ఇసుక అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు అక్రమ మాఫియాల నియంత్రణ జరుగుతుంది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ, నియంత్రిత తవ్వకాలు, ఆథరైజ్డ్ మైనింగ్ వల్ల పర్యావరణ విధ్వంసం తగ్గే అవకాశం ఉంది. పాలసీ అనుసరణ, టెండర్లు, డిజిటల్ మానిటరింగ్ ఉంటే కేంద్రాలు విజయవంతం అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ పాయింట్లతో ప్రజలకు ప్రయోజనం స్టాక్ పాయింట్లతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందిరమ్మ ఇళ్లకే కాకుండా ప్రతీ ఒక్కరు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ పాయింట్లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇసుక లభిస్తుంది. ప్రజలు టోకెన్ తీసుకుని తమ అవసరానికనుగుణంగా బుకింగ్ చేసుకోగలుగుతారు. అక్రమ మాఫియాల నుంచి రక్షణ ప్రజలు మోసపోవడం తగ్గుతుంది.త్వరలోనే ధర నిర్ణయం జిల్లాలోని కోహీర్, అందోలు, నిజాంపేట మండలాల్లో మొదటగా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే ఇసుక ధరపై టీజీఎండీసీ నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. మైనింగ్ శాఖ కూడా స్టాక్ పాయింట్లపై మానిటరింగ్ చేస్తుంది. – చలపతిరావు, హౌసింగ్ పీడీ, సంగారెడ్డి -
సిగాచికి ప్రొహిబిటెడ్ ఆర్డర్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగాక ఫ్యాక్టరీల శాఖ మేల్కొంది. ఈ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 54 మంది కార్మికుల ప్రాణాలు పోయాక ఆ శాఖ అధికారులు ఇప్పుడు యాజమాన్యానికి ప్రోహిబిటెడ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని, నిబంధనల ప్రకారం ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు జరగలేదని ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. తిరిగి తాము అనుమతిచ్చేంత వరకు ఇందులో ఉత్పత్తి చేయవద్దని తెలిపింది. ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పరిశీలించాల్సిన ఈశాఖ అధికారులు ప్రమాదం జరగకముందు ఎందుకు స్పందించలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత ఏది? ప్రమాదం జరిగిన వెంటనే సీఎస్ఐఆర్–ఐఐసీటీ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నలుగురు నిపుణుల బృందాన్ని నియమించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిందా? ఇవ్వలేదా? అనేది తేలలేదు. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.ప్రాణాలు పోయాక ఆర్డరిచ్చిన పరిశ్రమల శాఖ 54 మంది చనిపోయాక మేల్కొన్న అధికారులు దుర్ఘటన జరిగి నెల రోజులు పూర్తి బాధ్యులైన ఏ ఒక్కరిపైనా చర్యల్లేవు నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత కరువుబాధ్యులైన అధికారులపై చర్యలేవి? ప్రమాదం జరిగిన నెల రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులైన ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిశ్రమను ఇప్పటివరకు తనిఖీలు చేసిన అధికారులు భద్రతా లోపాలను గుర్తించారా? గుర్తిస్తే వాటిని సరిచేయాలని పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులిచ్చారా? సరి చేయకుండా నిర్లక్ష్యం చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రమాదం జరిగే వరకు ఎందుకు ఉపేక్షించారు? వంటి అంశాలపై ఆ శాఖ ఇప్పటికీ వెల్లడించడం లేదు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జిన్నారం(పటాన్చెరు): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి ధీమావ్యక్తం చేశారు. బుధవారం బొల్లారం పట్టణ అధ్యక్షుడు ఆనంద్కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక యువకులు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ... ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రవీందర్రెడ్డి, మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి మేఘన రెడ్డి, నాయకులు అఖిల్, శ్రీకాంత్ చారి, అరుణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి -
సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ
ఆడుతూ పాడుతూ... ఆహ్లాదకర వాతావరణం మధ్య మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య మాత్రమే ఇన్నాళ్లూ ఉండగా ఇక నుంచి ప్రీప్రైమరీని ప్రారంభించనుంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వాటి ధాటి నుంచి పేద పిల్లలకు ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 790 ప్రీప్రైమరీ పాఠశాలలను రెండో విడతగా మంజూరు చేయగా సంగారెడ్డి జిల్లాకు 58 పాఠశాలలు, మెదక్ జిల్లాకు 30 మంజూరయ్యాయి. ఈ జిల్లాల్లో ఇదివరకే ఎంపిక చేసిన ఆయా పాఠశాలల్లో ప్రీప్రైమరీని కొనసాగించనున్నారు. – నారాయణఖేడ్: విద్యా సంవత్సరమే ఎంపిక రానున్న ఏడాది 1వ తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2025– 26 విద్యా సంవత్సరమే ప్రీప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. పాఠశాలలకు సిద్ధం చేయడం, ప్రాథమిక అభ్యాసం అందించడం దీని ప్రధాన కర్తవ్యం. ప్రీప్రైమరీ విభాగానికి ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలి. అందులో పిల్లలకు అనుకూలమైన ఫర్నీచర్, తగిన ప్రదర్శనలు, సరైన వెలుతురు, ఇండోర్, ఔట్డోర్ ఆటవస్తువులు, వీలైతే నిద్రపోయే స్థలం అందుబాటులో ఉంచాలి. ప్రీప్రైమరీ విభాగానికి రెండు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేశారు. ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు టీచింగ్ అనుభవం ఉన్న వారిని పది నెలల గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిన స్థానికులను నియమించనున్నారు.ఒత్తిడి లేకుండా... ఐదేళ్లలోపు పిల్లలు చిన్నారులు కావడం వల్ల వారిపై చదువు ఒత్తిడి ఉండకుండా వారి మనో వికాసాభివృద్ధికి ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కనబరిచేలా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు చేయనుంది. పాఠశాల విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఇప్పటికే అకడమిక్ ఇయర్ (విద్యా సంవత్సరం) ప్రారంభం కావడంతో రానున్న విద్యా సంవత్సరం పూర్తిస్థాయిలో కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది. జ్ఞానంతోపాటు అల్పాహారం, భోజనం కూడా.. కరిక్యులమ్, యాక్టివిటీ ప్లానింగ్ ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికను అనుసరించనున్నారు. ఇది నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంది. ప్రీప్రైమరీ విభాగాల్లోని పిల్లలు అందరికీ మధ్యాహ్నం భోజనం, అదనంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్నాక్స్ అందించనున్నారు. సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తూ పిల్లలకు హక్కుల పరిరక్షణ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు పర్యవేక్షించాల్సి ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య విభాగాల అధికారులతో ఉమ్మడి తనిఖీ బృందాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.రెండు విడతలో రాష్ట్రవ్యాప్తంగా 790 బడుల్లో ప్రీప్రైమరీ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 88 సర్కారు స్కూళ్లలో అమలు ఆట, పాటల ద్వారా చదువు58 ప్రీప్రైమరీ బడులు ఏర్పాటు ప్రభుత్వం రెండో విడతగా మంజూరు చేసిన ప్రీప్రైమరీలో జిల్లాకు 58 పాఠశాలలు మంజూర య్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున రానున్న విద్యా ఏడాది లేదా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాట్లు చేపడతాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి -
కాపురం కోసమే అత్తను హతమార్చాడు
మద్దూరు(హుస్నాబాద్): అత్త చెప్పిన మాటలు విని భార్య కాపురానికి రావడం లేదనే అనుమానంతో అత్తను అల్లుడు, అతడి తమ్ముడు కత్తితో నరికి చంపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్స్టేషన్లో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని మర్మాముల గ్రామ శివారులోని బంజేరుకు చెందిన జంగిలి వజ్రమ్మ(55)ను అల్లుడు జక్కుల మహేష్, అతడి తమ్ముడు హరీశ్తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. అత్తను చంపి కాపురం బాగు చేసుకోవచ్చని నిర్ణయించుకుని అన్నదమ్ములిద్దరూ కలిసి కమ్మకత్తి తీసుకొని అత్త గ్రామమైన బంజేరుకు వెళ్లారు. అక్కడ అత్తతో మాట్లాడుతున్నట్లు నమ్మించి మహేశ్ కత్తితో నరకగా బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితులను రిమాండ్కు తరలించారు. వారు ఉపయోగించిన కమ్మకత్తితో పాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాట్లాడినట్టు నమ్మించి కత్తితో నరికారు అల్లుడు, అతని తమ్ముడు రిమాండ్ వివరాలు వెల్లడించిన ఏసీపీ -
ప్రభుత్వంపై దుష్ప్రచారం
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాకు వెళ్తూ మంగళవారం నార్సింగి మండలం జప్తిశివనూర్లోని మాజీమంత్రి షబ్బీర్అలీ గెస్ట్హౌస్లో ఆగిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగుతున్నాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కవడంతోనే బీఆర్ఎస్కు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నది నిజం కాకపోతే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మంత్రి వెంట మాజీమంత్రి షబ్బీర్అలీ, కామారెడ్డి, బిక్కనూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క ధ్వజం -
బైండోవర్ ఉల్లంఘన.. జరిమానా
అక్కన్నపేట(హుస్నాబాద్): బైండోవర్ను ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ పవన్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ బింగి శారద, చంద్రమౌళి గతంలో తహసీల్దార్ అనంతరెడ్డి ఎదుట బైండోవర్ అయ్యారు. కాగా ఇటీవల గుడుంబా తయారీదారులకు బెల్లం, పటికలు సరఫరా చేస్తూ పట్టుబడి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో తహసీల్దార్ రూ.50వేల జరిమానా విధించారు. ఎస్ఐ దామోదర్, రూప తదితరులు ఉన్నారు. అథ్లెటిక్స్లో కృతికి మూడో స్థానం తొగుట(దుబ్బాక): జిల్లా స్థాయి అథ్లెటిక్ ్స పోటీల్లో మండలంలోని వెంకట్రావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని తగరం కృతి మూడవ స్థానంలో నిలిచింది. మంగళవారం సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ సబ్ జూనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో కృతికి జ్ఞాపిక, బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, పీఈటీ కనకయ్యలను హెచ్ఎం నయీమా కౌసర్ అభినందించారు. వ్యక్తి ఆత్మహత్య సంగారెడ్డి క్రైమ్: ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని భవానీనగర్కు చెందిన దేవరశెట్టి నవీన్కుమార్ (35) వృత్తి రీత్యా సీసీ కెమెరాల పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికెళ్లి చూడగా దూలానికి చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవోదయకు గడువు పొడిగింపు వర్గల్(గజ్వేల్): ఉమ్మడి జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తేదీ మంగళవారంతో ముగిసిందని, విద్యార్థుల ప్రయోజనం కోసం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ చోరీ నర్సాపూర్: రెండు ట్రాన్స్ఫార్మర్లలో 20లీటర్ల ఆయిల్ను దొంగలు చోరీ చేశారు. ఎస్ఐ లింగం కథనం ప్రకారం... నర్సాపూర్ – తూప్రాన్ మార్గంలో హెచ్పీ గ్యాస్ గోదాం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్, నారాయణపూర్ చౌరస్తా వద్ద గల ట్రాన్స్ఫార్మర్లను కింది భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి కట్ చేసి వాటిలో ఉండే ఆయిల్ను చోరీ చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనుసిద్దిపేటరూరల్: అమాయక ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రూరల్ సీఐ శ్రీను స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ గ్రామానికి చెందిన చెట్టు మహేశ్, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఎరుకల కావడి అశోక్, ఎరుకల గోపి ప్రస్తుతం సిద్దిపేటలోని బాలాజీ నగర్లో ఉంటున్నారు. లలిత నగర్లో ఉంటున్న ఎరుకల గారడి ప్రశాంత్తో కలిసి నలుగురు ముఠాగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కిరాణ దుకాణాలు, వైన్స్ షాపులు, పెట్రోల్బంకులు, మీసేవా కేంద్రాలు, వ్యాపార సముదాయాల వద్ద అత్యవసరం అంటూ నకిలీ ఫోన్పే, గూగుల్ పే యాప్లతో చెల్లింపులు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరస్తులను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే 100, పోలీస్కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు ఫోన్ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్ఐ రాజేశ్, చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్అలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు సరిపడా ఎరువుల సరఫరా
జిన్నారం (పటాన్చెరు): రైతుల డిమాండ్కు తగ్గట్లుగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సోలక్పల్లి గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. మండలంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా యూరియా డీఏపీ, ఎంఓపీ ఇతర కాంప్లెక్స్ ఎరువుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎరువుల సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ పొజిషన్, ఎమ్మార్పీ ధరలు తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణ నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి, ఏఈఓ అజారుద్దీన్, ఎరువుల దుకాణ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ -
హస్తం హవా కొనసాగాలి
సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో హస్తం హవా కొనసాగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, టీపీసీసీ మెదక్ ఇన్చార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులతో హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుర్తింపునివ్వాలని చెప్పారు. కష్టకాలంలో జెండా మోసిన వారితో, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సమావేశానికి సంగారెడ్డి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లా నేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ పరితోష్ పంకజ్జోగిపేట /వట్పల్లి (అందోల్): బెట్టింగ్, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులకు సూచించారు. ప్రజలు కూడా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం జోగిపేట, వట్పల్లి పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలని, ప్రతి ఫిర్యాదును క్లుప్తంగా విచారణ చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందించాలని, త్వరగా ఘటనా స్థలానికి చేరుకున్నట్లయితే నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని తెలిపారు. డాబాలు, పెట్రోల్ పంపులు, విద్యాసంస్థల్లో సీసీలు ఏర్పాటు చేసుకునేలా యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. -
స్వచ్ఛతలో సత్తా చాటేనా?
ఉత్తమ పంచాయతీల గుర్తింపునకు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మార్కుల కేటాయింపు ఇలా.. అంశాలు మార్కులు క్షేత్ర స్థాయి పరిశీలన ఆధారంగా 540 మానవ వనరుల వినియోగం 240 వ్యర్థాల నిర్వహణ కేంద్రం 120 ప్రజాభిప్రాయ సేకరణకు 100 మొత్తం 1000 మార్కులు ఉంటాయి. ● పల్లెల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం ● జిల్లాలో 20 గ్రామాల ఎంపిక ● దాదాపు పూర్తయిన సర్వే న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలను గుర్తించేందుకు కేంద్ర బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా రోజుకు రెండు గ్రామాల చొప్పున సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థన ప్రదేశాలు తదితర వాటిని వారు పరిశీలిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈసారి స్వచ్ఛతలో గ్రామాలు సత్తా చాటుతాయో? లేదో వేచి చూడాలి. జిల్లాలో 620 గ్రామ పంచాయతీలున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను గుర్తించేందుకు 20 గ్రామాలను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వట్పల్లి మండలంలోని గొర్రెకల్, మర్వెల్లి, పుల్కల్లోని శివంపేట్, వెండికోల్, సురెడ్డి ఇటిక్యాల, హత్నూరలోని ఎల్లమ్మగూడ, కొండాపూర్లోని మనసన్పల్లి, న్యాల్కల్లోని అమీరాబాద్, మొగుడంపల్లి మండలం, కందిలోని ఎద్దుమైలారం, అందోల్లోని తాలెల్మ, కల్హేర్తోపాటు నిజాంపేట్లోని రాంరెడ్డి పేట్, మనూర్లోని అతిమ్యాల్, మనూర్, నాగిల్గిద్దలోని ముక్తాపూర్, కారముంగి, నారాయణఖేడ్లోని నాగూర్, పగిడిపల్లి గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మొత్తం 20 గ్రామాలకు గాను 19 గ్రామాల్లో పర్యటించగా ఒక గ్రామ పంచాయతీ మాత్రం మున్సిపాలిటీలో కలవడం వల్ల సందర్శించలేదు. ఒక్కో గ్రామంలో 16 ఇళ్లల్లో సర్వే ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో 16 నివాస గృహలను ఎంచుకొని బృందం సభ్యులు సర్వే చేస్తున్నా రు. అందులో మూడు ఎస్సీ, మూడు ఎస్టీ, ఇతర వర్గాలకు చెందిన 10 కుటుంబాలను ఎంపిక చేసు కుని ఆయా ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు. పరిశీలిస్తున్న అంశాలు.. ఎంపిక చేసుకున్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డి ఉందా? ఉంటే దానిని వినియోగిస్తున్నారా? నల్లా ఉందా, దాని ద్వారా తాగు నీరు సరఫరా అవుతుందా? ఇంకుడు గుంత ఉందా? మురుగు నీరు మురికి కాల్వలోకి వెళ్తుందా? ఇంకుడు గుంతలోకి వెళ్తుందా? అని వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే చెత్త సేకరణ ఎలా జరుగుతుంది? తడి, పొడి చెత్త వేరు చేస్తున్నారా? సేకరించిన చెత్తను ఎక్కడ వేస్తున్నారు? డంపింగ్ యార్డు ఉందా? ఉపాధిహామీ పథకం పనితీరు, జాబ్ కార్డులు ఉన్నాయా?అనే అంశాలను అడుతున్నారు. గ్రామంలో రోడ్లు, తదితర వసతులతోపాటు పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రార్థనాలయాలు సందర్శించి వాటిలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఉన్నాయా?ఉంటే వాటి నిర్వహణ ఎలా ఉందనే విషయాలను పరిశీలిస్తున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా పంచాయతీలకు మార్కులు కేటాయిస్తారు. వాటి ఆధారంగా ఎంపికై న ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. పకడ్బందీగా సర్వే ఎంపిక చేసుకున్న గ్రామాల్లో పకడ్బందీగా సర్వే కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాల్లో పర్యటించి సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 19 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, ఓ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల సర్వే జరగలేదు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్లో పొందుపరుస్తున్నాం. – దెశెట్టి స్వామి, ఎస్బీఐ కో–ఆర్డినేటర్, సంగారెడ్డి -
అథ్లెటిక్స్తో ఉజ్వల భవిష్యత్
సిద్దిపేటజోన్: అథ్లెటిక్స్తో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ సంఘం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించారు. అండర్ 8,10,12, 14,16,18,20 ఓపెన్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 320మంది క్రీడాకారులు హాజరయ్యారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీడా సమాఖ్య చైర్మన్ సాయిరాం, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అర్థమయ్యేలా బోధించాలి
జిల్లా విద్యాశాఖ పరిశీలకులు కృష్ణారావుకొండపాక(గజ్వేల్): విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జిల్లా విద్యాశాఖ పరిశీలకులు, రాష్ట్ర ఎగ్జామినేషనల్ డైరెక్టర్ కృష్ణారావు ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కొండపాక మండలంలోని దుద్దెడలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అలాగే కొండపాకలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలని విద్యార్థులకు సూచించారు. గ్రంథాలయంలో విలువైన పుస్తకాలుంటాయని, వాటిని చదువడం వల్ల మేథోసంపత్తి పెరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా, పుస్తక పఠనం చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, ఎస్వో రంగనాథస్వామి, సీఆర్సీ హెచ్ఎం లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పప్పు ధాన్యాల సాగు.. ఆశాజనకం
అధికారుల సూచనలు పాటించాలి ఖరీఫ్ పంటలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పంటలకు అనుకూలంగా వానలు పడుతున్నాయి. పంటల సాగులో ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలు తదితర తెగుళ్ల నివారణకు రైతులు అధికారుల సూచనలు పాటించాలి. –భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ ● ఖరీఫ్ పంటలకు జీవం పోసిన వర్షాలు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు జహీరాబాద్ టౌన్: పప్పు ధాన్యాల సాగు ఆశాజనకంగా ఉండటంతో రైతులు దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. పప్పుధాన్యాల కొరతపై అవగాహన ఉన్న అన్నదాతలు కంది, సోయాబీన్, పెసర, మినుము పంటలను సాగు చేస్తున్నారు. నైరుతి రుతు పవనాల కారణంగా మే నెలలో వర్షాలు కురిశాయి. అదే సమయంలో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే జూన్లో వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. జులైలో ఓ మోస్తారు వానలు కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జహీరాబాద్ వ్యవసాయశాఖ డివిజన్లో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలు ఉన్నాయి. ప్రాజెక్టులు, చెరువులు లేనందున ఆయా మండలాల్లో వర్షధార పంటలను అధిక విస్తీర్ణంలో రైతులు పండిస్తుంటారు. ప్రధానంగా పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, సోయాబీన్ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలను సాగు చేశారు. సుమారు 3 లక్షల ఎకరాల్లో పత్తి, 65 వేల ఎకరాల్లో సోయాబీన్,70 వేల ఎకరాల్లో కంది, 7,500 ఎకరాల్లో మినుము, 14వేల ఎకరాల్లో పెసర, 7వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలను సందర్శించి పంటలను పరిశీలిస్తున్నారు. జోరుగా కలుపుతీత పనులు పంట పొలాల్లో పెరుగుతున్న కలుపు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఆయా పంట చేన్లు ఎదుగుదల దశలో ఉన్నాయి. కలుపు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. కూలీల కొరత వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో ఆటో చార్జీలిచ్చి మరి ఇతర గ్రామాల నుంచి తీసుకు వస్తున్నారు. ఎకరాకు రూ.6 నుంచి 8 వేల వరకు కూలీలు తీసుకుంటున్నారు. కలుపుతీత పనులు తలకుమించిన భారంగా మారాయని అన్నదాతలు వాపోతున్నారు. -
పీఎంశ్రీ హైస్కూల్ శిలాఫలకం ఆవిష్కరణ
వర్గల్(గజ్వేల్): పీఎంశ్రీ పాఠశాల లు దేశానికి అంకితంలో భాగంగా మంగళవారం భారత విద్యా శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నుంచి వర్గల్ పీఎంశ్రీ జెడ్పీహైస్కూల్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నది. ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి సునీత, ఏఏపీసీ చైర్మన్ భవాని, ఇన్చార్జి హెచ్ఎం సుధారాణి, ఏఈ అరవింద్, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా ‘పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ వర్గల్’ శిలాఫలకాన్ని ఎంఈఓ సునీత ఆవిష్కరించారు. పీఎంశ్రీ స్కూల్ కావడంతో పాఠశాలకు కంప్యూటర్లు, సంగీత పరికరాలు, ఆట వస్తువులు, సైన్ ్స ల్యాబ్, తరగతి గదులు తదితర అనేక హంగులు సమకూరుతున్నాయని పేర్కొన్నారు. ఇవి విద్యావికాసానికి బాటలు వేస్తాయని తెలిపారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
హత్నూర(సంగారెడ్డి): ప్రతీరోజు యోగా సాధన చేయడం వల్ల విద్యార్థులకు మానసిక ప్రశాంతతతోపాటు ఏకాగ్రత ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన హత్నూర కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో బసచేసిన కలెక్టర్ మంగళవారం ఉదయం విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడటంతోపాటు ఏకాగ్రత కూడా వస్తుందని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న తహసీల్దార్ పర్వీన్షేక్, ప్రత్యేక అధికారి జయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ ప్రావీణ్య -
స్మార్ట్ వాకింగ్ స్టిక్ ఆవిష్కరణ
దుబ్బాకటౌన్: ఢిల్లీలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు స్మార్ట్ వాకింగ్ స్టిక్ను ఆవిష్కరించి మంగళవారం ప్రదర్శించారని ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి తెలిపారు. రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యం.హర్షవర్ధన్, పి.కార్తీక, యం.చైతన్య, గైడ్, టీచర్ కె.భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ‘స్మార్ట్ వాకింగ్ స్టిక్‘ను తయారు చేశారని చెప్పారు. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ –2025లో భాగంగా.. గత డిసెంబర్ 2024లో జాతీయ స్థాయిలో లక్షా ఐదువేల వైజ్ఞానిక ప్రాజెక్టులు ఆన్లైన్లో ప్రదర్శించగా ఉత్తమమైన 27 ఆవిష్కరణలను ప్రకటించారన్నారు. వాటిలో బేగంపేట విద్యార్థుల ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపికై ందని తెలిపారు. నేటి నుంచి జులై 31 వరకు న్యూ ఢిల్లీలోని గాల్గోటియాస్ యూనివర్సిటీలో ప్రదర్శిస్తున్నారని చెప్పారు. కాగా విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. -
వసతి గృహాల తనిఖీ
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని సర్ధన, బూర్గుపల్లి గ్రామాల్లోని బాలుర వసతి గృహాలను బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించి విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వంటగది, భోజనశాల, స్టోర్రూమ్లను హాస్టల్కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి గంగకిషన్, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉమ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. -
ఇళ్లు కడతానని గుల్ల చేశాడు
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని నమ్మబలికిన కాంట్రాక్టర్ లక్షల్లో అడ్వాన్స్ తీసుకుని కన్పించకుండా పోయాడు. ఈ ఘటన మండలంలోని మిర్జాపల్లితండాలో చోటుచేసుకుంది. తండాలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు జార్కండ్కు చెందిన ఎండీ అబ్దుల్ యూనస్ ముందుకొచ్చాడు. మండలంలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుండటంతో గిరిజనులు నమ్మి అడ్వాన్స్గా లక్ష చొప్పున ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. బేస్మెంట్ వరకు నిర్మించి బిల్లు వచ్చిన తరువాత మిగితా పనులు చేస్తానన్నాడు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ బిల్లు రావడంతో మళ్లీ రూ. లక్ష చొప్పున 14 మంది కాంట్రాక్టర్కు ఇచ్చారు. మరి కొంత మంది ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అదనంగా మరో రూ.2 లక్షలు కూడా అందజేశారు. డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ వారం క్రితం ఎవరికీ చెప్పకుండా ఇక్కడి నుంచి ఉడాయించాడు. ఫోన్చేస్తే స్విచ్చాఫ్ వస్తుండటంతో గిరిజనులు అతను నివాసం ఉంటున్న ఇంటికెళ్లి ఆరా తీయగా వారం నుంచి కన్పించడం లేదని చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్ పరారీ లబోదిబోమన్న ఇందిర మ్మ లబ్ధిదారులు -
తరుణోపాయం
ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లకు రుణం●● ఆ నిధులతో రోడ్లు వేయించాలని నిర్ణయం ● రోడ్ల అభివృద్ధికి సరికొత్త టెండరు విధానం ● హెచ్ఏఎం తొలి విడతలో పలు ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల ఎంపిక సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రోడ్ల అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా ఇంజనీరింగ్ శాఖలు నూతన టెండరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం రోడ్ల పనులకు టెండరు నోటిఫికేషన్ జారీ చేసి..తక్కువకు బిడ్ వేసిన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేసి పనులు చేయించేవారు. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించడం ప్రస్తుతం ఉన్న విధానం. అయితే ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రోడ్లు భవనాల శాఖలో ఒక్కో పనికి గతంలో పది పర్యాయాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఒక్క కాంట్రాక్టర్ కూడా బిడ్ వేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసేందుకు సాహసించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా హెచ్ఏఎం (హైబ్రీడ్ అన్యూటీ మోడ్) అనే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానం ప్రకారం కాంట్రాక్టర్లకు ఆయా రోడ్డు పనుల అంచనా వ్యయంలో 60% మొత్తానికి ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. మిగిలిన 40% మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చి కాంట్రాక్టరుతో పనులు చేయించాలని నిర్ణయించింది.26 ఆర్అండ్బీ రోడ్లకు రూ.523 కోట్లు నూతన విధానం హెచ్ఏఎం మొదటి విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 26 రోడ్లను ఎంపిక చేశారు. మొత్తం 387 కి.మీల పొడవున్న ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.523 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సిద్దిపేట జిల్లాకు 25 రోడ్లను ఎంపికయ్యాయి. రూ.379 కోట్లతో 289 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాకు సంబంధించి సుమారు 18 రోడ్లు ఎంపికై నట్లు సమాచారం. ఎంపిక చేసిన రోడ్లలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులు, అలాగే మండల కేంద్రం నుంచి నేషనల్ హైవే వరకు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి ఉన్న రోడ్లు, అలాగే మండల కేంద్రం నుంచి హైదరాబాద్కు ఉన్న రహదారులను ఎంపిక చేసినట్లు ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజనీర్ వసంత్నాయక్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ రోడ్లు సైతం ఈ నూతన టెండరు విధానంతో పంచాయతీ రాజ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం 105 రోడ్లను ఎంపిక చేశారు. 343 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. 15 సంవత్సరాల నిర్వహణ బాధ్యతలు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 30 నెలల్లో పనులు పూర్తి చేయాలి. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లకే ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. మొత్తం 15 సంవత్సరాల వరకు ఈ నిర్వహణ సదరు కాంట్రాక్టరే చూసుకోవాలి. రోడ్డు వేసిన ఏడేళ్లకు ఒకసారి బీటీ రెన్యూవల్ చేయాలి. అలాగే 14వ సంవత్సరంలో మరోసారి బీటీ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. -
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ఆర్డీఓ పాండు
జోగిపేట(అందోల్): అందోల్– జోగిపేట ఆర్డీఓ పాండుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుమారుగా 40 మందికి పైగా ఆర్డీవోలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఏడాదిన్నర కాలంగా అందోల్–జోగిపేట ఆర్డీఓగా పాండు పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. జిన్నారం మున్సిపాలిటీ గెజిట్ విడుదలజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభు త్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు అండూర్, శివానగర్, సోలక్పల్లి, రాళ్లకత్వ, ఊట్ల, కొడకంచి, నల్లూర్, మంగంపేట, జంగంపేట, పంచాయతీలను కలుపుతూ జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. కాగా ఇకనుంచి గ్రామపంచాయతీ పాలన నుంచి మున్సిపల్ పాలన కొనసాగనుంది. -
పారదర్శకతతో పనిచేయాలి
మెదక్జోన్: ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. పౌరసమాచార అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. సమాచార కమిషనర్లు, పీవీ శ్రీనివాస్, బోరెడ్డి, అయోధ్యరెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్లతో కలిసి ఆయన మంగళవారం మెదక్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్రాజ్ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖలలో ఎటువంటి కేసులు లేకపోవడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. గత పదేళ్ల కాలంలో సమాచార కమిషన్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్చార్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలు అడిగిన వెంటనే సమాచారం అందించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్రెడ్డి, జయచంద్రారెడ్డితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి -
ఆర్టీసీ అదిరే టూర్
దర్శనీయ స్థలాలకు ప్రత్యేక ప్యాకేజీ●● నేటి నుంచి ప్రయాణం ● జిల్లా నుంచి ఆరు క్షేత్రాలకు..మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు విహార యాత్రలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలపైనే ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ తన వ్యూహం మార్చింది. ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు.. సంస్థ ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. విహార యాత్రలకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు లేక పోవడంతో చాలా మంది ప్రజలు రెండు, మూడు బస్సుల్లో ప్రయాణించి ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సులను సిద్ధం చేసి నడిపిస్తోంది. ఫలితంగా అటు ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి సౌకర్యం కలిసొస్తుంది. జిల్లా నుంచి ప్రత్యేకంగా.. జిల్లాలోని ప్రజలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తుంది. దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికోసం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా టూరు బస్సులు నడిపించేందుకు సంస్థ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రజల నుంచి బుకింగ్లు స్వీకరిస్తుంది. ఈనెల 30న మెదక్ ఆర్టీసీ డిపో నుంచి ఆరు పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సు బయల్దేరనుంది. ఇందుకోసం బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టీసీ సంస్థ తన ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ టూర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత కొన్ని పుణ్యక్షేత్రాలకు నాలుగు బస్సులు వెళ్లివచ్చాయి. టూర్ బస్సు వెళ్లే పుణ్యక్షేత్రాలు సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వరస్వామి ఆలయం, రేజింత్లోని సిద్ధ వినాయక ఆలయం, బీదర్లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గానుగాపూర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం నుంచి పండరిపూర్ రాత్రి అక్కడే ఉండి ఈనెల 31న రెండో రోజు ఉదయం పండరిపురిలో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం, తుల్జాపూర్లోని తుల్జావాని మాత దర్శనం చేయిస్తారు. అనంతరం తిరిగి రాత్రి బయలుదేరి మెదక్కు చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు ఒకరికి రూ.1700, పిల్లలకు రూ.1000 చార్జీ ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు టిఫిన్, భోజనం, దర్శన టికెట్ ఖర్చులు ఎవరికి వారు భరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఐదు టూర్లు మెదక్ ఆర్టీసీ డిపో నుండి మొత్తం ఐదు ట్రిప్పులు టూర్ వెళ్లి వచ్చాయి. అందులో యాదగిరిగుట్టకు నాలుగు బస్సులు, ఆరుణాచలంకు ఒక బస్సు వెళ్లి వచ్చింది. ఒక్కో బస్సులో 55 ప్రయాణికులను తీసుకెళుతారు.ఆదరణ బాగుంది ఆర్టీసీ నడిపిస్తున్న పుణ్యక్షేత్రాల టూర్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒకే రోజు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. జిల్లా నుంచి ఫుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ఆర్టీసీ సూచించిన నంబర్లకు, స్థానిక బస్సు డిపోలో సంప్రదించాలి. సురేఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, మెదక్ -
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి దామోదర మంగళవారం సంగారెడ్డిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అందోల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మండలాల అధ్యక్షులు, ఆత్మ కమిటీల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. వన దుర్గమ్మ సేవలోఆర్టీఐ కార్యదర్శులు పాపన్నపేట(మెదక్): సమాచార హక్కు చట్టం కార్యదర్శులు మంగళవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీఐ కార్యదర్శి రాములు, డిప్యుటీ కార్యదర్శి ప్రమీల, సభ్యులు ఉదయం ఏడుపాయలకు రాగా వారికి సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు శంకరశర్మ,పార్థివ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆర్టీఐ అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.లైసెన్ ్డ్స సర్వేయర్ల ప్రాక్టికల్ పరీక్ష ప్రశాంతంసంగారెడ్డి జోన్: జిల్లాలో లైసెన్ ్డ్స సర్వేయర్ల నియామకం ప్రక్రియ కొనసాగుతోంది. పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. 160 మంది అభ్యర్థులకు గాను 127 మంది అభ్యర్థులు హాజరుకాగా 33 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాధురి పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ మెదక్ కలెక్టరేట్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014కు పూర్వం సమైక్యాంధ్ర ప్రదేశ్లో గిరిజనులకు 6% లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10% పెరిగినట్లు తెలిపారు. రాష్ట్ర గిరిజన జనాభాలో 70% మైదాన ప్రాంతాలైన మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్లో గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు. ఓడీఎఫ్లో సమస్యలు తీర్చాలి కంది(సంగారెడ్డి): ఎద్దు మైలారం అయిద కర్మగారం(ఓడీఎఫ్)లో వర్క్లోడ్ సమస్యను తీర్చాలని బీఎంఎస్, ఓఎఫ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎంపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓడీఎఫ్లో వర్క్లోడ్ లేక ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి, రైల్వే, సోలార్ తదితర సౌకర్యాలు ఓడీఎఫ్లో ఉన్నాయని తెలిపారు. ఓడీఎఫ్కు బీఎంపీ 3 వర్షన్ వర్క్లోడ్ కల్పించాలన్నారు. -
సీజనల్పై అప్రమత్తం
మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సీజనల్, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటి జ్వర సర్వేను ముమ్మరం చేసింది. జ్వర పీడితులు, ఇతర వ్యాధిగ్రస్తుల గుర్తింపు చేపట్టింది. రోగి పరిస్థితికి అనుగుణంగా స్థానికంగా ఇంట్లో లేదా సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందించే చర్యలు తీసుకొంటుంది. మంత్రి జిల్లాలో ముందు జాగ్రత్తగా వైద్యశాఖ అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించి ఇంటింటి సర్వేను స్పీడప్ చేశారు. – నారాయణఖేడ్ జిల్లాలో 30 పీహెచ్సీలు, 246 సబ్సెంటర్లు, 19 బస్తీ దవాఖానాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లాలో 4.60 లక్షల నివాసాల్లోని 16 లక్షల జనాభాకు ఈ వైద్యశాలల పరిధిలో 48 మంది పీహెచ్సీ వైద్యులు, 400 మంది ఏఎన్ఎంలు, 156 మంది హెల్త్ సూపర్వైజర్లు చికిత్స చేస్తుండగా, 908 మంది ఆశ కార్యకర్తలు సహకారాలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా డోర్టు డోర్ సర్వేను వైద్యశాఖ అధికారులు చేపట్టారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు ఈ సర్వే కొనసాగనుంది. తక్షణం స్పందించాలి ఏ గ్రామం, తండాలో వైద్య పరంగా సమస్యలు వచ్చినా తక్షణం స్పందించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైరిస్క్ జోన్లలో ప్రివెంటీవ్ మేజర్స్పై దృష్టి పెట్టాలని, వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే గర్భిణులను తరలించాలని సూ చించింది. ఆస్పత్రుల్లో సానిటేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, పరిశుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, యాంటీ లార్వాల్ ఆపరేషన్స్, ఫాగింగ్, ఇండోర్ స్ప్రేయింగ్ విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా తాగు నీటి నమూనాలు పరీక్షించాలని, ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున.. ఓపీ కౌంటర్లు పెంచే చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల్లోనే అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్న ఆదేశాలను అమలు చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెండీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో అందుకనుగుణంగా చర్య లు తీసుకుంటున్నారు. 102 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డెంగీ, మలేరియా కార్డెన్ కిట్స్ పీహెచ్సీలో 500, సబ్సెంటర్లలో 100 చొప్పున సిద్ధంగా ఉంచారు. ఓఆర్ఎస్, డయేరియా, కోల్డ్, యాంటీ బయోటిక్, ప్యారసిటమాల్ తదితర మందులు సిద్ధం చేశారు. పాముకాటుకు సంబంధించి యాంటీ స్నేక్ వీనం, కుక్కకాటు మందులను పీహెచ్సీల్లో సిద్ధంగా ఉంచారు.అధికారుల ముందస్తు జాగ్రత్తలు జోరుగా డోర్టు డోర్ సర్వే వ్యాధులు ప్రబలకుండా చర్యలుప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం వ్యవహరించి రోగులను దోచుకోకుండా చూడాలని సూచి ంచారు. ఈ మేరకు అధికారులు తనిఖీలకు సిద్ధమవుతున్నారు. -
కేసీఆర్ సతీమణి పూజలు
మర్కుక్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వర్దరాజ్పూర్లోని వరదరాజుల స్వామి ఆలయంలో మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలాభూదేవి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని సోమవారం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలను సమర్పించారు. శోభకు ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, పురోహితులు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పాల ప్రవీణ్, పురోహితులు పాల్గొన్నారు. -
బందీ అయిన బాల్యం!
ఫలించని ఆపరేషన్లు ● మారని తల్లిదండ్రులు, యజమానులు ● యేటా పెరుగుతున్న బాల కార్మికులు ● 99 మందికి విముక్తి..54 కేసులు నమోదుమెదక్ కలెక్టరేట్: బడిలో చదువుకుంటూ సరదాగా గడపాల్సిన చిన్నారుల బాల్యం పనుల్లో బందీ అవుతోంది. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రతియేటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట ఆరు నెలలకోసారి అధికార బృందం తనిఖీలు చేస్తుంది. కానీ తల్లిదండ్రులు, యజమాను లు, విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా బాల కార్మికుల సంఖ్య పెరుగుతూ నే ఉంది. పేద ప్రజలు తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పిల్లలను పనుల్లో పెడుతుండగా, తక్కువ జీతం, ఎక్కువ గంటలు పనిచేయిస్తూ యజమానులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కేసులు పెడుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో చైతన్యం వచ్చే వరకు ఫలితం కానరాదని సమాజ సేవకులు వాపోతున్నారు. ఆర్థిక సమస్యే ప్రధాన కారణం బడీడు పిల్లలు బడిలో కాకుండా బాల కార్మికులుగా మారడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం. తల్లిదండ్రులు లేని పిల్లలు, చదువుకునే ఆర్థిక స్తోమత లేని వారు కొందరైతే.. అమ్మనాన్నల అనారోగ్యం దృష్ట్యా ఆర్థికంగా అండగా ఉండేందుకు పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. చదువులో ఫెయిలైన విద్యార్థులు, చదువుపై ఆసక్తి లేని వారు సైతం బాల కార్మికులుగా మారి వెట్టి చాకిరీ చేస్తున్నారు.పిల్లలను ప్రోత్సహించాలి ఈ నెల 1న చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో ఇప్పటి వరకు 99 మంది బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 54 కేసులు నమోదు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూళన జరగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానుల్లో మార్పు రావాలి. బడీడు పిల్లలను బడికి వెళ్లేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలే అత్యధికంగా ఉన్నారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే రూ.20వేల జరిమానాతోపాటు కేసు కూడా నమోదవుతుంది. ఈనెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుంది. – కరుణశీల, బాలల సంరక్షణ అధికారి, మెదక్ రెండేళ్లుగా కార్మికులు ఇలా.. సంవత్సరం పట్టుబడిన బాలలు కేసులు 2024 జనవరి (ఆపరేషన్ స్మైల్) 118 27 2024 జూలై (ఆపరేషన్ ముస్కాన్) 46 1 2025 జనవరి (ఆపరేషన్ స్మైల్) 122 25 2025 జూలై (ఆపరేషన్ ముస్కాన్) 99 54 -
‘మంజీరా’లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో గల్లంతైన శాయిబాజ్ (26) మృతదేహం ఎట్టకేలకు సోమవారం సాయంత్రం దొరికింది. మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాచారం గ్రామానికి చెందిన శాయిబాజ్ ఆదివారం ముద్దాపూర్ బ్రిడ్జి కింద గల్లంతయ్యాడు. అతని తండ్రి గౌస్ పాషా ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తన బృందాలతో కలిసి వెతికినప్పటికీ ఆచూకి లభించలేదు. దీంతో సోమవారం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, రెవెన్యు అధికారులు తమ బృందాలతో ఎయిర్ బోట్లు, స్కానర్లతో కలిసి గాలించారు. మంజీరా నది వెడల్పు 400 మీటర్లు, లోతు 30 నుంచి 40 ఫీట్లు ఉండటంతో గాలింపు చర్యలు సత్ఫలితం ఇవ్వలేదు. ఎట్టకేలకు సాయంత్రం బ్రిడ్జికి 30 మీటర్ల దూరంలో మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా తమ కొడుకు మృతి పట్ల వెంట వెళ్లిన అతని మిత్రులపై అనుమానం ఉందని గౌస్పాషా ఆరోపించారు. -
కార్పొరేట్కు దీటుగా కేజీబీవీలు
హత్నూర(సంగారెడ్డి): కార్పొరేటుకు దీటుగా కేజీబీవీలను ప్రభుత్వం తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని హత్నూర కేజీబీవీలో సోమవారం రాత్రి బస చేశారు. విద్యార్థులతో కలిసి రాత్రి భో జనం చేశారు. భోజనం ఎలా ఉంది..? రోజూ ఇలా ఉంటుందా అంటూ ఆరా తీశారు. కష్టపడి చదివి లక్ష్యాలను సాధించుకోవాలని విద్యార్థినులకు సూచించారు. విద్యాలయంలోని తరగతి గదులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేసి ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. భవనం మరమ్మతులు, నీటి వసతి, కరెంటు వంటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యే లా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేక ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులకు శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేసేలా చూడాలని సూచించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారి వెంబడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ స్వప్న, డీఈఓ వెంకటేశ్వర్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జయలక్ష్మి, తహసిల్దార్ ఫర్హిన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎంఈఓ వెంకట్ నరసింహ గౌడ్, ఎంపీఓ యూసుఫ్, ఏపీఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య హత్నూర కస్తూర్బాలో రాత్రి బస -
నిఘా నీడలో సంగారెడ్డి
పట్టణంలో 500 సీసీ కెమెరాల ఏర్పాటు! సంగారెడ్డి టౌన్: పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. నేరాలు సైతం పెరుగుతున్నాయి. పట్టణంలో సుమారు 1.80 లక్షల జనాభా, 38 వార్డులలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలు, హత్యలు జరుగుతుండటంతో వాటిని అరికట్టడానికి పట్టణవ్యాప్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కేసులలో పోలీస్శాఖకు అంతుచిక్కని విధంగా ఆధారాలు లేకుండా జరిగిన సంఘటనలు ఉన్నాయి. దీంతో నేరస్తులను ఆరా తీసేందుకు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి, బైపాస్, చౌరస్తాలలో సైతం ఏర్పాటు చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కేంద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉండనుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారు, రోడ్డు ప్రమాదాలపై సీసీ కెమెరాల్లో చూసిన వెంటనే వారిపై చర్యలు తీసుకోనున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ. 8 కోట్లతో సీసీ కెమెరాలు బిగించేందుకు పోలీస్శాఖ ఏర్పాటు చేస్తోంది. సీసీ కెమెరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.నేరాలను అరికట్టడానికే.. జిల్లా కేంద్రంలో నేరాలను అరికట్టడానికి పట్టణవ్యాప్తంగా సీసీ 500 కెమెరాలను ఏర్పా టు చేయనున్నాం. ఎస్పీ కార్యాలయంలో క మాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం పోలీసుల పర్యవేక్షణ తో పాటు నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. – సత్తయ్య, సంగారెడ్డి డీఎస్పీ -
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు
● 9వ,11వ తరగతుల్లో అడ్మిషన్లకుఅవకాశం ● సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులస్వీకరణ ● వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఎంట్రెన్స్ పరీక్ష వర్గల్(గజ్వేల్): ఆశ్రమ విద్యతో బాల బాలికల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వాలు బాటలు వేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 9వ,11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్ష రాసేందుకు సెప్టెంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఫిబ్రవరి 7న (లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్) ఎంపిక పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు www.navodaya.gov.in ద్వారా సెప్టెంబర్ 23 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ప్రోత్సహించాలని కోరారు. అభ్యర్థులకు అర్హత, పరీక్ష సిలబస్ తదితర విషయాలను వివరించారు. ఇవిగో అభ్యర్థుల అర్హతలు ● ప్రవేశం పొందే బాలబాలికలు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెంది, వారి తల్లిదండ్రులు ఇక్కడే నివాసం ఉండాలి. ● 9వ తరగతిలో ప్రవేశం కోసం అభ్యర్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2025–26)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. అభ్యర్థి మే 1, 2011 నుంచి జూలై 31, 2013 మధ్య జన్మించి ఉండాలి. ● 11వ తరగతిలో ప్రవేశం పొందే అభ్యర్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2025–26)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండాలి. జూన్ 1, 2009 నుంచి జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలి. 9వ తరగతి పరీక్ష సిలబస్ హిందీ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, సైన్స్కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎమ్ఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 11వ తరగతి పరీక్ష సిలబస్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్కు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎమ్ఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇతర వివరాలకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్లో చూడొచ్చు. -
గోవా మద్యం బాటిళ్ల స్వాధీనం
జహీరాబాద్ టౌన్ / మునిపల్లి(అందోల్): గోవా నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా టాస్క్ఫోర్స్(డీటీఎఫ్) టీం సభ్యు లు పట్టుకున్నారు. సోమవారం మండలంలోని చిరాగ్పల్లి చెక్పోస్టు వద్ద డీటీఎఫ్ సీఐ శంకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందన యశ్వంత్రెడ్డి తన కారులో వివిధ బ్రాండ్స్కు చెందిన 162 మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా పట్టుకున్నారు. అతడ్ని అరెస్టు చేసి మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో ఎస్ఐలు హనుమంతు, అనుదీప్, రామేష్, మురళీ, ఉమారాణి ఉన్నారు. -
వృత్తి నటన.. ప్రవృత్తి దొంగతనం
సంగారెడ్డి క్రైమ్ : మహిళ మెడలోంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన నిందితులను అరెస్టు చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్ కేసు వివరాలు వెల్లడించారు. రేగోడు మండలానికి చెందిన గోరం అనీల్(25),గోరం సునీల్ (23) ఇద్దరు అన్నదమ్ములు. పటాన్చెరువులోని గౌతమ్ నగర్లో అద్దెకు ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా జీవనం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని అయ్యప్ప కాలనీకి చెందిన ఇందిరి లక్ష్మి ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటల సమయంలో బైపాస్లోని రిషీ స్కూల్ నుంచి తన మనవరాలుని ఇంటికి తీసుకెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలోంచి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పట్టణంలోని ఐబీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, యమహ ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి యమహ ద్విచక్ర వాహనం, ఫోన్, మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట పట్టణ ఎస్సై రాజశేఖర్, సర్దార్,హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ నగేంద్రబాబు,ప్రదీప్,శివకుమార్ ఉన్నారు. చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు -
సమస్యలపై నేరుగా సంప్రదించండి
నారాయణఖేడ్: సమస్యలపై ఖేడ్ డివిజన్ పరిధిలోని ప్రజలు తనను నేరుగా సంప్రదించి పరిష్కరించుకోవాలని, వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేయవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. ఖేడ్ ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. తాను వికారాబాద్లో శిక్షణపొందగా, శిక్షణలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల సమస్యలను పరిశీలించానని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంతానికి సబ్ కలెక్టర్గా నియామకమై అభివృద్ధికి పాటుపడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలోని సమస్యలు, ప్రజల అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పిల్లల డ్రాపౌట్లు లేకుండా చూస్తామన్నారు. ప్రాంత అవసరాలు, సమస్యలపై ఆధ్యయనం చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతిని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆర్డీఓ కార్యాలయ అధికారులు, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, వివిధపార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు సన్మానించారు. ప్రజలకు ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సూచన బాధ్యతల స్వీకరణ -
బాధితులకు పునరావాసం కల్పించండి
సంగారెడ్డి జోన్: భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ప్రాంతంలో ఎంఎంటీఎస్ రైల్వేలైన్ నిర్మాణం నేపథ్యంలో నివాస గృహాలు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కార్పొరేటర్ సింధుతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన సుమారు 218 కుటుంబాలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా, ఈ ప్రాంతంలోని 218 కుటుంబాలకు మాత్రం ఇప్పటికీ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పారిశ్రామిక యూనియన్ల నాయకత్వ స్థాయి ట్రేడ్ యూనియన్ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. నిత్యావసర ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచటం, మహిళలతో రాత్రివేళ పనిచేయించే అవకాశం కల్పించటం వంటివి లేబర్ కోడ్ అమలులో భాగమేనని వివరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు రాజయ్య, మాణిక్యం, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం జహీరాబాద్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. సోమవారం మండలంలోని బూచనెల్లిలో గల మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు దోహదపడుతుందన్నారు. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించడానికి చట్టాలు తోడ్పడతాయని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు నర్సాపూర్ రూరల్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్సింగ్ రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని అచ్చంపేటలో ఓ రైతు పొలంలో లీఫ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో రైతులు తమ భూముల్లో ఆయిల్పామ్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లీఫ్ ఫాం రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణ, ఏఈఓ దుర్గాప్రసాద్, రైతులు పాల్గొన్నారు. -
బీరప్పనా.. మజాకా..
జహీరాబాద్: మండలంలోని తూంకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి బీరప్ప ఇటీవల సస్పెన్షన్కు గురయ్యాడు. కాగా మరో కార్యదర్శిని తీసుకువచ్చి కంప్యూటర్లో రికార్డులను తనిఖీ చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆదివారం బీరప్ప ఇతర ప్రాంతానికి చెందిన కార్యదర్శిని తీసుకొచ్చి పంచాయతీ రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు కార్యదర్శులను అడ్డుకోవడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మహేందర్రెడ్డిని వివరణ కోరగా తమకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి వెళ్లడం సరైంది కాదన్నారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించామన్నారు. తమకు రికార్డులను అప్పగించే వరకు వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. హుగ్గెల్లి తండాకు చెందిన కార్యదర్శి సమతకు సోమవారం అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. సస్పెన్షన్కు గురైన బీరప్ప మంగళవారం రికార్డులను తమకు సమర్పించనున్నట్లు వివరించారు. సస్పెండైనా రికార్డుల తనిఖీ అడ్డుకున్న గ్రామస్తులు -
మహా గర్జనకు తరలిరండి
మెదక్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సమస్యలపై ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహాక సభకు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదన్నారు. దీంతో దివ్యాంగులు రూ. 20,000 కోట్లు నష్టపోయారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసిన డబ్బులు దివ్యాంగులకు సంబంధించినవేనని అన్నారు. పేద వర్గాల డబ్బులు దోచి భూమి ఉన్నవర్గాలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడని విమర్శించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి దండు శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి విజయ్, సైదులు, చెట్లపల్లి యాదగిరి, మురళి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
బురద పొలంలో పడి రైతు మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు కాలు జారి బురద పొలంలో పడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో జరిగింది. ఎస్ఐ సమత వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెక్క భిక్షపతి (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య బాలమణి, ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో పాటు, తల్లి బాలమ్మను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పనులు చేసుకోవడానికి పొలం ఒడ్డుపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బురద పొలంలో పడిపోయాడు. బురదలో తల కూరుకు పోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన పరిసర ప్రాంత రైతులు హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్ల నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేపల కోసం వెళ్లి యువకుడు.. తూప్రాన్: ప్రమాదవశాత్తు యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలోని అల్లాపూర్ పెద్ద చెరువు వద్ద జరిగింది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... పాపన్నపేట మండలం నార్సింగికి చెందిన టంటం ప్రవీణ్(30) కొంత కాలంగా పట్టణంలోని గీతారెడ్డి కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం అడ్డాపై పని దొరకకపోవడంతో చేపలు పట్టేందుకు అల్లాపూర్ శివారులోని తిమ్మాయ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య లలిత, బాబు, పాప ఉన్నారు. భూ తగాదాలతో.. మనస్తాపానికి గురై.. గజ్వేల్రూరల్: ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్కు చెందిన శ్రీరాం మల్లేశ్(59) కుటుంబ సభ్యులకు పట్టణంలోని లక్ష్మీప్రసన్నకాలనీలో గల భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మల్లేశ్ను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తీర్థయాత్రలకు వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన బొడ్డు గౌరీనాథ్కు ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు బొడ్డు భరత్(20)హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం తన మిత్రులతో కలిసి కారులో అరుణాచలం వెళ్లాడు. అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, చిత్తూరు సమీపంలోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న భరత్ కారులో నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా నలుగురు గాయపడగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భరత్ మృతదేహం చిత్తూరు ఆస్పత్రిలో ఉంది. తాను ట్రైన్లో అరుణాచలం, తిరుపతికి వెళుతున్నానని, అమ్మానాన్నకి చెప్పిన భరత్ కారు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. బైక్ అదుపుతప్పి కిందపడటంతో.. జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామ శివారులో జరిగింది. రూరల్ ఎస్ఐ.కాశీనాథ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రేజింతల్ అంజన్న(34) మండలంలోని గోవింద్పూర్ వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి బైక్పై వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేర్యాల యువకుడు మృతి నలుగురికి గాయాలు -
రూ. 5 లక్షలు సరిపోతాయా?
పటాన్చెరు టౌన్: మండలంలోని పెద్దకంజర్ల గ్రామంలో సోమవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్్ (ఎన్ఆర్ఎల్ఎం) బృందం పర్యటించింది. సభ్యులు సృజన్, సయ్యద్ అలీ నేతృత్వంలోని బృందం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డులు.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ఎన్ని రోజులు పని ఇచ్చారనేది రాసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 44 దరఖాస్తులకు ఆమోదం వచ్చిందని ఎంపీడీఓ యాదగిరి వారికి వివరించారు. వారిలో 16 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని హౌసింగ్ ఏఈ నందిని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు సరిపోతాయా.? అని బృందం సభ్యుడు సృజన్ ప్రశ్నించారు. సరిపోవని, లబ్ధిదారులకు సెల్ఫ్హెల్ప్ గ్రూప్ ద్వారా రూ. లక్ష రుణం అందేలా చూస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు తెలిపారని అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర బృందం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. కార్యక్రమలో పంచాయితీరాజ్ ఏఈ సంపత్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ సంతోష్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర బృందం ఆరా పెద్దకంజర్లలో పర్యటనగ్రామస్తులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం -
ఖేడ్.. ఇక పాలన దౌడ్
నారాయణఖేడ్: మారుమూల ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, ప్రజా సమస్యల తక్షణ పరి ష్కారమే లక్ష్యంగా ప్ర భుత్వం రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లను సబ్ కలెక్టర్ కార్యాలయాలుగా మారుస్తూ సబ్ కలెక్టర్లను నియమించింది. అందులోభాగంగా జిల్లాలోని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి 2023వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఉమా హారతిని కేటాయించారు. రాష్ట్రంలో భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్కు అభిజ్ఞాన్ మాల్వియా, ఖమ్మం జిల్లా కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా మనోజ్ను నియమించారు. ఖేడ్కు కేటాయించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖేడ్కు పూర్వ వైభవం! ఖేడ్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు ముందు కర్ణాటకలో, నిజాం పాలన కింద కొనసాగింది. నాడే డివిజన్ కేంద్రంగా కొనసాగిన ఖేడ్ వికారాబాద్పాయగా సాగింది. అప్పట్లో పన్నులను వసూలు చేసి వికారాబాద్కు పన్నులు చెల్లింపులు జరిపేది. బీదర్ జిల్లాతో సత్సంబంధాలు కొనసాగేవి. అప్పట్లో వస్తువుల క్రయ, విక్రయాలు, బంధుత్వాలు చాలావరకు కర్ణాటకతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండటంతో సరిహద్దు గ్రామాలతోపాటు మెజార్టీ మండలాల్లో కన్నడ, మరాఠీ భాషలను మాతృభాష తరహాలోనే మాట్లాడతారు. ఉమ్మడి రాష్ట్రాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్లో కలిశాక ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి పరిమితమైంది. 2016లో రెవెన్యూ డివిజన్గా.. ఖేడ్లో ఉప ఎన్నికల సందర్భంగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాంత ప్రజలు, విద్యార్థుల కోరిక మేరకు 11 అక్టోబర్ 2016న ఖేడ్ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి పరిపాలన కొనాసాగుతుంది. అంతకుముందు సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో ఉండటంతో ఏ చిన్న పనికై నా జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే ఆర్డీఓ ఉండటంతో చాలా పనులు చేసుకోవడం, డివిజన్ స్థాయి అధికారి ఉండటంతో తనిఖీలు, ప్రజా సమస్యలు కొంత పరిష్కారం అయ్యేవి. సబ్ కలెక్టర్ నియామకంతో మేలు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం సులువు అధికారులు, ప్రజల మధ్య సమన్వయం ప్రజావాణి ఇక్కడే.. నేరుగా సమస్యపై ఫిర్యాదు నేడు సబ్ కలెక్టర్గా ఉమా హారతి బాధ్యతల స్వీకరణసబ్ కల్టెర్ హోదాతో.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఖేడ్లో సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉండటంతో ప్రజా సమస్యలు తక్షణం పరిష్కారం కాగలవు. జిల్లా కేంద్రానికి ఖేడ్ 85కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజావాణి, ఇతర సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతూ వెళ్తుంటారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు జిల్లా కేంద్రానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ప్రజావాణితోపాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, ఆయా విభాగాల సమస్యలన్నింటినీ సబ్ కలెక్టర్ హోదాలో అధికారి ఇక్కడే పరిష్కరించే వీలుంది. ఏ సమస్యనైనా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలు సబ్ కలెక్టర్కు కలుగనుంది. దీంతో ప్రజలు నేరుగా సమస్యలు వివరించి పరిష్కరించుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం ఖేడ్ ప్రజలకు వరంలా మారనుంది. ఆరు మండలాలతో ఖేడ్ డివిజన్ కొనసాగుతుంది. అన్ని మండలాల ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, అధికారులకు సబ్ కలెక్టర్ అనుసంధాన కర్తగా ఆయా విభాగాలకు పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు. -
విద్యుదాఘాతంతో గేదె మృతి
శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కాలేరాం తండాలో ఆదివారం చోటుచేసుకుంది. బీమ్లా తండాకు చెందిన కేతవాత్ రమే్శ తన గేదెలను రోజువారీగా పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో గేదె మేత మేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. గేదె విలువ రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం పటాన్చెరు టౌన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సుభాష్ వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి శివారు పాశమైలారం రోడ్డులో రేణుక ఎల్లమ్మ దేవస్థానం పక్కన హైటెన్షన్ స్తంభానికి కేబుల్ వైర్తో ఉరివేసుకొని కుళ్లిన స్థితిలో ఆదివారం వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి చేతికి రాగి కడియం ఉంది. వర్షానికి కూలిన ఇళ్లు.. చిన్నశంకరంపేట(మెదక్): వర్షాలతో పలువురి ఇళ్లు కూలిపోయాయి. మండల కేంద్రంలోని డప్పు లక్ష్మి నర్సింహులు ఇల్లు ఒకవైపు గోడ కూలిపోయింది. దీంతో పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నారు.అలాగే రుద్రారం గ్రామంలో తొర్రి సత్తయ్య ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ న్యాల్కల్(జహీరాబాద్): ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... ఖలీల్పూర్ గ్రామ శివారులో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి చెరకు తోటలో కొందరు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17వేలు నగదు, పేకాట ముక్కలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గోవా మద్యం పట్టివేత మునిపల్లి(అందోల్): నిబంధనలకు విరుద్ధంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ వీణారెడ్డి కథనం ప్రకారం... ఆదివారం మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. గోవా నుంచి హైదరాబాద్కు వస్తున్న ట్రావెల్ బస్సులో తీసుకువస్తున్న 6.5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు. గంజాయి స్వాధీనం.. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 1250 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన శ్రీధర్, దనుంజయా బెహర కర్నాటక లోని బీదర్లో ఇరాని గల్లీలో గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. వారి వద్ద నుంచి హోండా యాక్టీవా, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
చేర్యాల(సిద్దిపేట): పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగపురి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సాంబని కనకయ్య అదే గ్రామంలో ఓ భూ వివాదానికి సంబంధించి గతంలో జరిగిన గొడవ ఫొటోలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్చేశాడు. విషయమై ఫొటోల్లో ఉన్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం కొమురవెల్లి పోలీసులు స్టేషన్కు పిలిపించి మందలించి పంపించారు. ఆదివారం ఉదయం కనకయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ రాజుగౌడ్తో మాట్లాడగా అతడిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పిలిచి మాట్లాడి పంపించామని తెలిపాడు. మంజీరా నదిలో యువకుడి గల్లంతు పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముద్దాపూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఏఎస్ఐ తుక్కయ్య కథనం మేరకు... మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన శాయిబాజ్ (25) మెదక్లోని ఆర్టీఏ బ్రోకర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి ముద్దాపూర్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ చేపలు పట్టే క్రమంలో మంజీరా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. కాగా సాయంత్రం వరకు అతని ఆచూకీ దొరక లేదు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం రామాయంపేట(మెదక్): వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన చాకలి సుజాత ఈనెల 25న ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్ఫోన్ సైతం ఇంటి వద్దే వదిలి వెళ్లింది. ఈ మేరకు సుజాత కూతురు దుర్గాభవాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
సంగారెడ్డి జోన్: గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 77 మంది అభ్యర్థులకు గాను 62 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరయ్యారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు160 మంది అభ్యర్థులకు గాను 129 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం సర్వేయర్ల అభ్యర్థులకు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డు అధికారి ఐనేష్, ఆర్డీవో రవీందర్రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్, అధికారులు పాల్గొన్నారు.పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య -
కర్ణాటకకు 42 బోగీల బియ్యం రవాణా
సిద్దిపేటఅర్బన్: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సిద్దిపేట నుంచి కర్ణాటకకు 42 రైలు బోగీల నిండా బియ్యాన్ని రవాణా చేసినట్టు ఎఫ్సీఐ అధికారులు తెలిపారు. సిద్దిపేటలోని గూడ్స్ రైల్వే షెడ్ నుంచి కర్ణాటకలోని కొప్పల్ ఎఫ్సీఐ ఫుడ్ స్టోరేజీ డిపోకు ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్తో కూడిన రైలును విజయవంతంగా రవాణా చేయడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. హబ్సీపూర్లోని ఎస్డబ్ల్యూసీ గోదాం నుంచి 90కి పైగా ట్రక్కుల ద్వారా రైల్వే లోడింగ్ పాయింట్కు తరలించగా 200 మంది కూలీలు బోగీలలో లోడింగ్ చేసినట్టు పేర్కొన్నారు. వర్షం వల్ల బస్తాలు తడిసిపోకుండా ఉండేందుకు కాంట్రాక్టర్ పాలిథిన్ షీట్ వేసి జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. వరి దిగుబడి ఎక్కువగా ఉన్న తెలంగాణ నుంచి తక్కువ ఉత్పత్తి కలిగిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలించినట్టు పేర్కొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
దుబ్బాకటౌన్: ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శానిటేషన్, కేర్ టేకర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు ఆదివారం ఆయన సమక్షంలో సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రిలో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్లర్లు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల నుంచి కాకుండా ప్రభుత్వమే నేరుగా పీఎఫ్ను జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 26 వేల కనీస వేతనం అందజేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నామని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ తెలిపారు. అధ్యక్షురాలిగా లావణ్య, కార్యదర్శిగా ఇందిర, కోషాధికారిగా మహిపాల్, ఉపాధ్యక్షులుగా నవీన్ కుమార్, బాలాలక్ష్మిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ భాస్కర్, నాయకులు రాజు, ఎండీ. సాజిత్, కార్మికులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్/పటాన్చెరు టౌన్: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు పేర్కొన్నారు. సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా, సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్ట్ సిద్ధాంతం ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని కేవల్కిషన్ భవన్లో సీపీఎం జిల్లా స్థాయి విసృతస్థాయి సమావేశంతోపాటు పటాన్చెరు పట్టణంలోని ఐలా భవన్లో జరిగిన కిర్బీ కార్మికుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచమంతా శాసీ్త్రయంగా అభివృద్ధి చెందుతుంటే మన దేశంలో మాత్రం మూఢాచారాల కు పెద్దపీట వేస్తూ బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులో పూర్తిగా విఫలమైందని, వాటిని చిత్తశుద్ధితో నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య డిమాండ్ చేశారు. మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో ఆదివారం జరిగిన సీపీఎం పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో ప్రజల సమస్యలపై గ్రామాలు, పట్టణాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెదక్లో ఆగష్టు 4 నుంచి 13 వరకు సర్వేలు నిర్వహిస్తామని చెప్పారు. సర్వేలలో వచ్చిన సమస్యలపై ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసే కుట్రలు చేస్తుందని వెంటనే అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రామచంద్రాపురం(పటాన్చెరు): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తెల్లాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన రాకే్శ్ కుమార్ రెడ్డి(24) జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. తెల్లాపూర్లో యానిమాల్ కేర్ సెంటర్ను నిర్వహిస్తున్న గోపన్పల్లికి చెందిన సంధ్యారాణి వద్ద నాలుగు ఏళ్లుగా యానిమల్ కేర్ టేకర్గా రాకేశ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్లకు బానిసైన అతడు తన యాజమాని సంధ్యారాణి వద్ద సుమారు రూ.6లక్షల వరకు అప్పు చేశాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమె రాకేశ్ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కాగా శనివారం రాత్రి తనకు కొంత అప్పు కావాలని యజమానిని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్పంగా మాటామాట పెరిగింది. ఆగ్రహంతో రాకేశ్ కుమార్ రెడ్డి కర్ర తీసుకుని సంధ్యారాణిపై దాడి చేశాడు. ఆమె తలకు గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి రాగా అప్పటికే అతడు పరారయ్యాడు. ఆదివారం ఉదయం తెల్లాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకున్నది రాకేశ్ కుమార్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువలోపడి యూపీ వాసి.. హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి కాలువలో పడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని మాచవరం శివారులో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... ఉత్తరప్రదేశ్ సియో జిల్లా ఇండ్రాయికి చెందిన రాజేశంపాండే(34) మాచవరం గ్రామ శివారులో కూలీ పని నిమిత్తం వచ్చాడు. శుక్రవారం సాయంత్రం అతడు పక్కనే ఉన్న ఎంఎన్ కెనాల్ కాలువ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలు జారి పడ్డాడు. దీంతో తోటి కూలీలు వెతికినా అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఎన్ కెనాల్ కాలువ ఉధృతి ఎక్కువగా ఉండటంతో మెదక్ రూరల్ ఎస్ఐ మురళి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని నిలిపివేయించారు. కాగా ఆదివారం ఉదయం కాలువలో రాజేశంపాండే మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్రం ఆధీనంలోనే ఎరువుల తయారీ
అక్కన్నపేట(హుస్నాబాద్): ఎరువుల తయారీ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, మిగితా విత్తనాలు నీళ్లు, విద్యుత్ను రాష్ట్రాలు ఇస్తాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదన్నారు. రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి దగ్గర కూర్చొని రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాలను విలీనం చేసేందుకు ప్రయత్నం మండలంలోని గోవర్ధనగిరి, రేగొండ గ్రామాలను హుస్నాబాద్లో విలీనం చేసేందుకు సీసీఎల్ఏలో ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదికలో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రాంమ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం పరిశీలన కోహెడరూరల్(హుస్నాబాద్): యంగ్ ఇండియా స్కూల్తో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని తంగలపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం బస్వాపూర్, పోరెడ్డిపల్లెలో ఈత మొక్కలు నాటారు. ప్రభుత్వ స్థలాలు, చెక్డ్యాంలు, చెరువు కట్టల వద్ద మొక్కలు నాటాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ , అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలి
సిద్దిపేటకమాన్ : కుక్క, పాము కాటు సంబంధిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానను డీఎంహెచ్ఓ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బస్తీ దవాఖానలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హై రిస్క్ ఉన్న గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
టేక్మాల్(మెదక్): విధి నిర్వహణలో ఆర్టీసీ బస్ కండక్టర్ ముదిగొండ రవి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు ఇలా... సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుంచి లింగంపల్లి వైపు వెళుతుంది. శంకరంపేట్ బస్టాండ్లో బొడ్మట్పల్లి వెళ్లేందుకు ప్రయాణికురాలు బస్సు ఎక్కింది. తన స్టేజ్ రావడంతో దిగిన ఆమె పర్సును బస్సులో మర్చిపోయింది. గమనించిన కండక్టర్ రవి పర్సును తెరిచి చూశారు. అందులో వెండి ఉంగరంతో పాటూ రూ. 2050 నగదు ఉంది. వివరాల కోసం పర్సులో వెతకగా ప్రయాణికురాలి కొడుకు సర్దార్ ఫోన్ నంబర్ ఉండటంతో వారికి సమాచారం అందించారు. బొడ్మట్పల్లి స్టేజ్ వద్ద ప్రయాణికురాలు, ఆమె కొడుకుకు పర్సును అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ను ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందించారు. ప్రయాణికురాలికి పర్సు అప్పగింత -
ఉరకలెత్తిన ఉత్సాహం
ఉల్లాసంగా హాఫ్ మారథాన్ ● రంగనాయక సాగర్ జనసంద్రంచిన్నకోడూరు(సిద్దిపేట): హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట జనసంద్రంగా మారింది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇందుకు సపోర్టింగ్ స్పాన్సర్గా సాక్షి మీడియా వ్యవహరించింది. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఆసక్తిగా పాల్గొన్నారు. రన్నర్స్, యువత, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా పరిగెత్తారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. సాక్షి డాట్ గేమ్స్ అదుర్స్.. రంగనాయక సాగర్పై జరిగిన హాఫ్ మారథాన్లో సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్ ఆకట్టుకున్నాయి. రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి విత్ సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. సాక్షి డాట్ గేమ్లో మొదటి ముగ్గురి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీ రఘునందన్రావుతో పాటు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, పలువురు ప్రముఖులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు తదితరులు సాక్షి సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు పాల్గొన్నారు. వ్యాయామం తప్పనిసరి.. డయాబెటిక్ ఇండియాను హెల్త్ ఇండియాగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్న మార్గం వాకింగ్ అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు. 50 మారథాన్లలో పాల్గొన్నా ఇప్పటి వరకు 50 మారథాన్లలో పాలొని సత్తాచాటాను. ఢిల్లీ, ముంబై, చైన్నె, గుజరాత్, వైజాగ్, హైదరాబాద్లలో జరిగిన మారథాన్లలో పాల్గొన్నా. గత ఏడాది సిద్దిపేటో మొదటి స్థానంలో నిలిచాను. ఈ సారి 21కే లో రెండో స్థానం సాధించాను. – రమేశ్ చంద్ర, నాగర్కర్నూల్ -
చిత్రాలే.. పాఠాలై..
● ఆయా పాఠశాలల్లో గోడలపై బొమ్మలు ● సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా.. జగదేవ్పూర్ మండలంలోని 29 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 28 ప్రాథమిక పాఠశాలలు, 10 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో మొత్తం 2380 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీ నిధుల ద్వారా పలు పాఠశాలల్లో మరమ్మతు పనులు చేయించారు. అందులో భాగంగా మండలంలోని కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలకు పాఠాల చిత్రాలు వేయించారు. తిగుల్, ఇటిక్యాల, రాయవరం, జగదేవ్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి పిల్లలతో పాటు అన్ని తరగతుల పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాలు వేయించారు. అన్ని సబ్జెక్టులతో కూడిన బొమ్మలు వేశారు. జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితశాస్త్రంతో పాటు జనరల్ చిత్రాలు కూడా వేశారు. భారతదేశం, తెలంగాణ చిత్రపటం, జాతీయ, రాష్ట్ర పక్షులు, అడవి జంతవులు, పిల్లలు ఆటలాడే చిత్రాలు వేయించారు. పుస్తకాల కంటే పిల్లలకు గోడలపై వేసిన బొమ్మలే సులువుగా అర్థమవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ఫ్రైమరీ ప్రారంభిస్తామని చెప్పడంతో వాటికి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. విద్యార్థులకు గోడలపై వేసిన చిత్రాలే పాఠాలు అవుతున్నాయి. ఉపాధ్యాయులు బోధించడం కన్నా..చూసి నేర్చుకోవడం పిల్లలకు సులువు అవుతుంది. పిల్లలకు అర్థమయ్యే విధంగా మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై చిత్రాలు వేయించారు. జగదేవ్పూర్(గజ్వేల్) పిల్లలకు అర్థమయ్యేలా.. అమ్మ ఆదర్శ కార్యక్రమంలో పాఠశాలలో వసతులు కల్పించారు. అందులో భాగంగా తరగతి గోడలపై బొమ్మలు వేయించాం. చిన్న పిల్లలు బొమ్మలను చూసి పాఠాలు నేర్చుకుంటున్నారు. అలాగే జనరల్ నాలెడ్జ్కు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – శంకర్, ప్రధానోపాధ్యాయుడు, ఇటిక్యాల -
బైక్ను ఢీకొట్టిన క్రేన్ వాహనం
గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లికి చెందిన సయ్యద్ చాన్పాష స్టోన్ కట్టింగ్ పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం స్టోన్ కటింగ్ బ్లేడ్ను తీసుకువచ్చేందుకు మల్లుపల్లి నుంచి గజ్వేల్కు ద్విచక్ర వాహనంపై ఇదే గ్రామానికి చెందిన బానోత్ చందుతో కలిసి వచ్చాడు. తిరిగి బైక్పై వెళ్తుండగా మండల పరిధిలోని జాలిగామ గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన క్రేన్ వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రామాయంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో చాన్పాష మృతి చెందాడు. చాన్పాష మృతికి కారణమైన క్రేన్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ పైనుంచి పడి యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన పోతరాజ్ కిషోర్కుమార్(35) ఈ నెల 15న మండల కేంద్రంలోని ప్యూయల్ స్టేషన్లో బైక్లో పెట్రోల్ పోసుకుని వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య నవనీత, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తి మృతి -
వన దుర్గమ్మా.. కరుణించమ్మా
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మా.. మము బ్రోవమ్మా అంటూ వేలాది మంది భక్తులు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రవి పటాన్చెరు టౌన్: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పటాన్చెరు డివిజన్కు చెందిన రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ రవి కృతజ్ఞతలు తెలిపారు. వీహెచ్పీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మోదీ విధానాలపై పోరాడాలిఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు మద్దతుగా లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు నిరంతరం పోరాడతామన్నారు. కార్మికులు నిరంతరం పనిచేస్తున్న పని భద్రత ప్రదేశాల్లో భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికుల దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. బీసీలకే 42% రిజర్వేషన్లు నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, పార్టీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో ముస్లింలకు పది శాతం ఇవ్వడమెందుకని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తే బీసీలను మోసం చేయడమేనని వారన్నారు. 42% రిజర్వేషన్లను బీసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, మొదటగా రాష్ట్ర మంత్రి మండలిలో బీసీల సంఖ్యను పెంచాలని మురళీయాదవ్, రమేశ్గౌడ్లు డిమాండ్ చేశారు. కాగా సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలు పెట్టనందున నిధులు రావడం లేదని, సీఎం పరోక్షంగా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
నల్లవాగు అభివృద్ధి కోసం చర్యలు
కల్హేర్(నారాయణఖేడ్)/కంగ్టి(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వానాకాలం పంటల సాగుకోసం ప్రాజెక్టులో నీటినిల్వ పరిశీలించారు. ప్రాజెక్టు కట్టపై చెట్లు తొలగించాలని అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న నీటి ఆధారంగా పంటల సాగుకోసం రైతులతో చర్చించారు. అనంతరం నల్లవాగు గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. భోజన వసతి, విద్యాభోధన గురించి విద్యార్థులను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంగ్టి మండలంలోని తడ్కల్ ప్రాథమిక పాఠశాల భవనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేదలకు ఉచిత కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఏఈ శివదయాళ్రెడ్డి, ప్రిన్సిపాల్ తిరుపతయ్య, నాయకులు రమేశ్ చౌహాన్, యాదవరెడ్డి, తుకారాం, జితేందర్రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు.ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి -
బాబును ఇవ్వాలని మహిళకు బెదిరింపులు
క్షేమంగా సొంత గ్రామానికిపంపించిన పోలీసులుహుస్నాబాద్: చిన్న బాబుతో భిక్షాటన చేస్తున్న ఓ మహిళను రూ.500 ఇచ్చి బాబును ఇవ్వా లని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ ఘటన శుక్రవారం హుస్నాబాద్లో చోటు చేసుకుంది. పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్లో తన బాబుతో ఓ మహిళ భిక్షాటన చేస్తున్న సమయంలో బాబును ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ బాబుతో ఏడ్చుకుంటూ బస్టాండ్కు చేరుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు బస్టాండ్ సెక్యూరిటీ గార్డు వెంకటేష్కు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు చెప్పారు. వెంటనే అక్కడికి వచ్చిన బ్లూ కోట్ సిబ్బంది కుమార్, సంపత్ మహిళ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరిగొప్పుల గ్రామానికి చెందిన కోమలగా గుర్తించారు. వెంటనే మహిళను, ఆమె బాబును బస్టాండ్ నుంచి వయా తరిగొప్పుల మీదుగా జనగామ వెళ్లే బస్సు ఎక్కించి ఆ గ్రామానికి వెళుతున్న ప్రయాణికులకు చెప్పి పంపించారు. గ్రామానికి మహిళ చేరుకునే వరకు ఎస్సై లక్ష్మారెడ్డి మానిటరింగ్ చేశారు. -
హోటల్ సీజ్
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలోని హోటళ్లను గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో పరిశుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. పోలీస్ బొమ్మ చౌరస్తాలో గల రాజస్థాన్ హోటల్లో కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తుండటంతో సీజ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించవద్దని, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రంమలో గ్రామపంచాయతీ సిబ్బంది కృష్ణ, మల్లేశం, శ్రీను,అరవింద్ పాల్గొన్నారు. కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నందుకే.. -
పురుగుల అన్నం తినేదెట్లా?
విద్యార్థుల ఆందోళన ● హాస్టల్ను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి సంగారెడ్డి : తాము తింటున్న అన్నం బాగాలేదని, అందులో పురుగులు వస్తున్నాయని బొమ్మరెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని తమ సమస్యను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. పురుగులతో కూడిన అన్నం కాకుండా నాణ్యమైన భోజనం వడ్డించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ వైఖరిపై మండిపడ్డారు. గిరిజన పాఠశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి, ఎంపీడీఓ శంకర్ పాఠశాలను సందర్శించారు. సివిల్ సప్లై బియ్యంలో పురుగులు ఉన్నాయని నిర్ధారించి వాటిని వాపస్ చేసి కొత్త బియ్యంతో అన్నం వండించారు. ఇకపై నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే హాస్టల్ వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.గిరిజన పాఠశాల వార్డెన్ సస్పెన్షన్ సంగారెడ్డి జోన్: చౌటకూర్ మండలంలోని బొమ్మరెడ్డి గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు బియ్యం శుభ్రం చేయకుండా వంటలు చేసి వడ్డించడంతో అన్నంలో పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. -
స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడమే లక్ష్యం
పటాన్చెరు టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం, మహిళలకు సాధికారత కల్పించి పేదరికాన్ని తగ్గించడం ఎన్ఆర్ఎల్ఎం ముఖ్య ఉద్దేశమని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సభ్యుడు సృజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్డారం గ్రామంలో ఎన్ఆర్ఎల్ఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలతో మాట్లాడి కేంద్ర పథకాలపై ఆరా తీశారు. అలాగే పెన్షన్ అందుతుందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఎంపీడీవో యాదగిరి, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, డిప్యూటీ ఈఈ తదితరులు సన్మానించారు. రిపబ్లిక్ డే పరేడ్కు శిక్షణ గజ్వేల్రూరల్: ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో గజ్వేల్లోని బాలుర హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొననున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతియేటా జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్సీసీ క్యాడెట్లు పరేడ్లో పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగానే గజ్వేల్ ఎన్సీసీ విభాగం 33వ తెలంగాణ సంగారెడ్డి బెటాలియన్ ఆధ్వర్యంలో పలువురు క్యాడెట్లను ఎంపిక చేశామని, ఈ సందర్భంగా వారికి ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నట్లు లెఫ్టినెంట్ మహేందర్రెడ్డి తెలిపారు. క్రీడా ప్రాంగణం ఆక్రమణ.. కేసు జిన్నారం (పటాన్చెరు): ప్రభుత్వ క్రీడా ప్రాంగణాన్ని ఆక్రమించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బొల్లారం పట్టణ పరిధిలోని 254 సర్వే నంబర్లోని ప్రభుత్వ క్రీడా స్థలాన్ని స్థానికులు రాజ్ గోపాల్, జితయ్య, ప్రవీణ్ క్రీడా ప్రాంగణంలో అక్రమంగా కంటైనర్ను ఏర్పాటు చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అధికారులు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం బోర్డును ధ్వంసం చేసి తొలగించారు. ఈ వ్యవహారంపై జిల్లా యువజన క్రీడా శాఖ సీనియర్ అసిస్టెంట్ అభినవ్ కుమార్ శుక్రవారం బొల్లారం సీఐ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఒకరిపై కేసు నమోదు అక్కన్నపేట(హుస్నాబాద్): భూ తగాదాలో ఒకరిపై కేసు నమోదైంది. ఈ ఘటన మండలంలోని పెద్దతండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సీహెచ్. ప్రశాంత్ వివరాల ప్రకారం... తండాకు చెందిన గుగులోతు కోమ, మంక్య్త భార్యాభర్తలు. కాగా భూ వివాదంలో కాశబోయిన అశోక్ వీరిపై దాడికి పాల్పడినట్లు కోమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొండెంగ దాడి.. గాయాలు జహీరాబాద్: పట్టణ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు రోగులపై కొండెంగలు దాడి చేయడంతో గాయపడ్డారు. శుక్రవారం పట్టణానికి చెందిన అబ్దుల్ ఖాదర్, అక్రం అలీలు వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. ఆవరణలో ఉన్న కొండెంగలు వారిపై దాడి చేయడంతో కాలికి కుట్లు పడ్డాయి. ఆస్పత్రి ఆవరణలో సంచరించే కొండెంగలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. విద్యుదాఘాతంతో గేదె మృతి చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పొన్నబోయిన ప్రభాకర్ తన పాడి గేదెను రోజులాగే భావి వద్ద తీసుకెళ్లి మేత మేపుతుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. -
పేలుడు పదార్థాలు, ట్రాక్టర్ సీజ్
ముగ్గురిపై కేసు నమోదు తూప్రాన్: అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లు పేల్చుతున్న ట్రాక్టర్ను సీజ్ చేసి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... మండలంలోని గుండ్రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గౌడిగూడెంకు చెందిన రాంచంద్రారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లు పేల్చుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పేలుడు పదార్థాలు, ట్రాక్టర్తో పాటు పేలుళ్లకు పాల్పడుతున్న భిక్షపతి, బొల్లబోయిన నర్సింలు, అంబపురం రాజులపై కేసు నమోదు చేశారు. -
విద్యాశాఖ మంత్రిని నియమించాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్లో ఎస్ఎఫ్ఐ వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ చదువుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయక పోవడంతో పేద విద్యార్థులు అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే మెదక్ జిల్లాలో విద్యార్థులు ఉన్నత విద్యా చదువుకోవడానికి పీజీ ఇంజనీరింగ్ కళాశాలలు లేక ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లు స్పందించి పీజీ ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఎస్సీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, తూప్రాన్ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు, రామాయంపేట డివిజన్ అధ్యక్షులు అజయ్ కుమార్, మెదక్ మండల అధ్యక్షులు నోముల అజయ్ కుమార్ తదితర మండల నాయకులు. విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కిరణ్ డిమాండ్ -
ఆయిల్పామ్తో అధిక ఆదాయం
చిన్నశంకరంపేట(మెదక్): అధిక ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి ప్రతాప్సింగ్ కోరారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో వరి పంట కన్నా రెండింతల అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒక ఎకరం వరి సాగుచేసే నీటితోనే ఐదెకరాల ఆయిల్పామ్ పంటను సాగు చేయవచ్చని తెలిపారు. సబ్సిడీపై ఆయిల్పామ్ మొలకలు అందించడంతో పాటు ఏడాదికి పంటల సాగుకు అవసరమైన ఖర్చులను కూడా ప్రబుత్వం అందిస్తుందని చెప్పారు. సబ్సిడీపై డ్రిప్ సిస్టం అందించడంతో పాటు పంటల సాగుకు సబ్సిడీ అందించనుందని చెప్పారు. ఆయిల్పామ్ పంట గెలలను కొనుగోలు చేసేందుకు కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకోవడంతో పాటు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక అధర్ఘాదాయం పొందేందుకు రైతులు ఆయిల్పామ్ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిఽశోధకులు రంగనాయకులు, మెదక్ డివిజన్ హార్టికల్చర్ అధికారి రచన, నార్సింగి ఏఈ హరిప్రసాద్, ఏఈఓలు విజృంభణ, దివ్య, ఆయిల్పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ మధు పాల్గొన్నారు.ఉద్యానశాఖ జిల్లా అధికారి ప్రతాప్సింగ్