Sangareddy
-
కాంగ్రెస్తోనే రైతు సంక్షేమం
రామచంద్రాపురం(పటాన్చెరు): నిత్యం రైతుల మధ్యలో ఉంటూ రైతుల సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పరిధిలోని మెట్టపాంత్రాల వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్)ను శుక్రవారం రైతు కమిషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్రిశాట్ ఏర్పాటు చేశారన్నారు. అందుకు ఇక్రిశాట్కు 3,500 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఇక్రిశాట్ వ్యవసాయ పరిశోధనలు చేస్తోందని వివరించారు. సాంప్రదాయ పంటలను అభివృద్ధి చేసేందుకు ఇక్రిశాట్ సేవలు దోహదపడుతున్నాయన్నారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం ఇక్రిశాట్ సందర్శించానని, ప్రభుత్వంతో క లసి కొనసాగిస్తున్న ప్రాజెక్టులపై సమీక్షించినట్లు గుర్తుచేశారు. తాము కూడా శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. మెట్ట పంటల అభివృద్ధి, విత్తన పరిశోధన, మట్టి ఆరోగ్యం, నీటి వినియోగం అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు రామ్రెడ్డి గోపాల్రెడ్డి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పతక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.స్టాన్ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయ అధికారులు హరి వెంకట్ప్రసాద్, సురేశ్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా.హరికిషన్, డా.జానిలా పాల్గొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఇక్రిశాట్ మారుతున్న పరిస్థితులకనుగుణంగా పరిశోధనలు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ ప్రయాణికుల సలహాలు సూచనలకు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు 99592 26267 నంబర్కు సంప్రదించవచ్చని సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. పురుషులకు టైలరింగ్లో ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: పురుషులకు టైలరింగ్లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్లు పురుషులు ఈ నెల 31 నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సంగారెడ్డి బైపాస్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం, 97044 46956, 94901 29839 సంప్రదించాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని పేర్కొన్నారు. రజతోత్సవ సభను జయప్రదం చేయండివాల్ పోస్టర్ ఆవిష్కరణ సంగారెడ్డి: తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించనున్న ‘‘జర్నలిస్టు జాతర’’రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్ జర్నలిస్టులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని తెంజూ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్లో శుక్రవారం టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ను ఫోరం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు శ్రీధర్, పరశురాం, యోగానందరెడ్డి, సునీల్, శ్రీనివాస్, రాము, నాని తదితరులు పాల్గొన్నారు. పాఠశాల గదుల నిర్మాణానికి రూ.50లక్షలుజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి రూ.50 లక్షలు మంజూరు చేస్తూ అనుమతులిచ్చినట్లు మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..గతేడాది పాఠశాలలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాఠశాల సమస్యను వివరించారు. ఈ మేరకు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతూ సహకారం అందించడం పట్ల ఆయనకు, పరిశ్రమ యాజమాన్యానికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు వారు పేర్కొన్నారు. బస్సులు నడపండి.. బాధలు తీర్చండిమెదక్ మున్సిపాలిటీ: పలు రూట్లలో బస్సులు నడపాలని కోరుతూ పలువురు ప్రయాణికులు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు విన్నవించారు. మెదక్ నుంచి వెల్పుగొండ మీదుగా రేగోడ్కు, మెదక్ నుంచి టేక్మాల్, బొడ్మట్పల్లి మీదుగా జోగిపేట, సంగారెడ్డి. పటాన్చెరుకు, అలాగే ఉదయం 6 గంటలకు మాచారం మీదుగా జేబీఎస్ వరకు, టేక్మాల్ నుంచి నర్సాపూర్కు బస్సు నడపాలని కోరారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. సమానత్వం కోసం ఉద్యమిద్దాం నిజాంపేట (మెదక్): అన్నిరంగాల్లో సమానత్వం కోసం ఉద్యమించాలని మహిళా రైతు హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు, సామాజిక కార్యకర్త ఆశాలత పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇప్పటికీ 65 శాతం దళిత మహిళలు భూమి లేని కూలీలుగా ఉన్నారని, వారికి సామాజిక భద్రత కరువైందన్నారు. -
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
మంత్రి కొండా సురేఖసంగారెడ్డిజోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలో పెట్రోల్ బంక్ నిర్వహణ కూడా మహిళలే నిర్వహించబోతున్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి: మంత్రి దామోదర గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు అయినా, ఇండస్ట్రియల్ జోన్ అయినా తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. లక్ష ఎకరాలకు సాగు నీరు: ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ ప్రాంతంలో చెరువులు, నదులు లేకపోవటంతో సాగు, తాగు నీటి అవసరాలకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్రావు సీఎం రేవంత్ను కోరారు. జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు అధికశాతం చెరకు, ఆలు, అల్లం తదితర వాణిజ్య పంటలను పండిస్తుంటారని చెప్పారు. లక్ష ఎకరాలకు నీరందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని రోడ్లు అధ్వాన్నంగా తయారైయ్యాయని, రోడ్ల మరమ్మతులకు రూ.72 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు రూ.20లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా: ఎంపీ షెట్కార్ జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఇక్కడి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయాన్నారు. రూ. 250కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి: మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ గురించి పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి రాకతో జహీరాబాద్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యి, అభివృద్ధికి బాటలు పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిమ్జ్ రైతుల ముందస్తు అరెస్టు
మామిడ్గిలో స్వల్ప ఉద్రిక్తత న్యాల్కల్(జహీరాబాద్): నిమ్జ్ రైతుల ముందస్తు అరెస్టుతో మండల పరిధిలోని మామిడ్గిలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా నిమ్జ్ రైతులు అడ్డుకునే అవకాశమున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేకువ జామున మామిడ్గి గ్రామానికి వెళ్లిన హద్నూర్ పోలీసులు గ్రామానికి చెందిన రాజిరెడ్డి, నాగన్న, సంజీవరెడ్డి, బుచ్చిరెడ్డి, వీరారెడ్డిలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని వాగ్వివాదానికి దిగి పోలీసులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీకు సీఎం దగ్గరకు తీసుకు వెళ్లి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని నచ్చ జెప్పిన పోలీసులు రైతులను నేరుగా పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. మామిడ్గి గ్రామానికి చెందిన వారితోపాటు ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి, శంకర్ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీఎం సమావేశం ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మల్గి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారుతి యాదవ్, డప్పూర్కు చెందిన శివరాజ్, న్యామతాబాద్కు చెందిన శ్రీకాంత్, రేజింతల్కు చెందిన కుత్బుద్దీన్లను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు నారాయణఖేడ్: అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గణపతి తెలిపారు. ఖేడ్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. టెండర్లలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ ఆలయం వద్ద వస్త్రాలు ఒడి బియ్యం సేకరించుకునే హక్కును రూ.18,30,000కు సనాది వెంకటేశ్ అధిక పాట పాడి దక్కించుకోగా ఆలయ పరిసరాల్లో పాదరక్షలను భద్రపరుచుకునే హక్కు లైసెన్స్ను రూ.15 లక్షలకు సనాది కరుణాకర్ దక్కించుకున్నారు. కూరగాయలు సప్లయ్ చేసే హక్కు టెండర్ చల్లా మౌనిక ఆలయం కోడ్ చేసిన ధర కంటే తక్కువ కోడ్ చేసి దక్కించుకున్నారు. పలు టెండర్లు వాయిదా.. మల్లన్న ఆలయంలో కొబ్బరి కాయలు, ముక్కల సేకరణ, తలనీలాల సేకరణ, ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరి కాయల విక్రయం, కోర మీసాలు, మొక్కుబడి వస్త్రాలు, ఎల్లమ్మ ఆలయం వద్ద కూల్డ్రింక్స్ విక్రయం, టాయిలెట్స్ నిర్వహణ, ప్రసాదం తయారీ, పాలు పెరుగు, పూల దండల సరఫరా, ఫొటోలు, వీడియోలు, బుక్స్ ప్రింటింగ్ల కోసం నిర్వహించిన టెండర్లలో సరియైన షెడ్యూల్స్, పాట రాకపోవడంతోఆలయ అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ఈ టెండర్లకు తిరిగి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంజిరెడ్డి, శ్రీనివాస్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానర్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆలయ ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహణ పలు టెండర్లు వాయిదా -
ఎండోమెంట్ భూములు కబ్జా
దుబ్బాకరూరల్: అక్రమ కబ్జాదారులు ప్రభుత్వ భూములే కాకుండా ఎండోమెంట్ భూములను కూడా కబ్జాకు పాల్పడుతున్నారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. 417, 418 సర్వే నంబర్లలో 12 ఎకరాలు భూమి ఎండో మెంట్ పరిధిలో ఉంటుంది.దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ దాని చుట్టుపక్కల భూమి ఉన్న కొందరు 12 ఎకరాలపై కన్నేసి కబ్జాకు పాల్పడుతున్నారు. ఆ భూమిని ఆక్రమించడమే కాకుండా నూతనంగా భవనాలు నిర్మించారు. ఇప్పటికి కొంత మంది భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు దేవాలయ భూములు కబ్జాకు గురైతున్నాయని గ్రామస్తులు కలెక్టర్, దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎండోమెంట్ అధికారులు పలుమార్లు భూములను సర్వే చేశారు. భూములు కబ్జా చేసిన వ్యక్తులు కొంత మంది అధికారులకు మామ్ములు ఇస్తూ తమకు అనుకూలంగా చేయించుకుంటున్నారు. ఇదేమిటని గ్రామస్తులు అడిగితే భూములు సర్వే చేస్తున్నామని చెబుతున్నారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల సర్వే అధికారులు భూములను తూతూ మంత్రంగా సర్వే చేశారు తప్ప కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎండో మెంట్ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణకు గురవుతున్న వేణుగోపాల స్వామి ఆలయం భూములు నూతనంగా భవంతులు నిర్మాణం అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ -
విద్యార్థులను తీర్చిదిద్దే నిలయాలు కేవీలు
ఝరాసంగం(జహీరాబాద్): విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిలయాలు కేంద్రీయ విద్యాలయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మాచ్నూర్ గ్రామ శివారులో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాసేపు అక్కడి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. నూతన భవనం ప్రారం భోత్సవంతో విద్యార్థులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీతాపాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రావుపాటిల్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
13 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు వలస కూలీలు అరెస్ట్ రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ బర్మన్, తపన్ బిశ్వాస్ జీవనోపాధి నిమిత్తం తెల్లాపూర్కు వలసొచ్చారు. స్థానిక నిర్మాణ రంగ సంస్థలో కూలీలుగా పని చేస్తున్నారు. ఇద్దరూ గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలనుకున్నారు. బెంగాల్ ప్రాంతానికి చెందిన కృష్ణ విజయవాడ వరకు గంజాయిని తీసుకొచ్చాడు. అతడి వద్ద నుంచి వీరిద్దరూ 13 కిలోలు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి తీసుకొచ్చి కూలీలకు విక్రయించేందుకు శుక్రవారం ఉస్మాన్నగర్లోని బస్టాండ్ వద్ద వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
సంగారెడ్డి క్రైమ్: ఔత్సాహికులైన పట్టణ యువత, మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తోంది జిల్లా కేంద్రంలోని సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్)శిక్షణ కేంద్రం. పట్టణంలో ముఖ్యంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండేలా శిక్షణ ఇవ్వడంపై సెట్విన్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. ఫలితంగా ఇటి వద్దే వివిధ రకాల వృత్తి వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. మరింత విస్తృతం సెట్విన్ కేంద్రాన్ని ఆరేళ్ల కిందట ఆరు కోర్సులతో జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ప్రస్తుతం మరిన్ని కోర్సులను అందుబాటులకు తెచ్చి సేవలు విస్తృతం చేసేందుకు సెట్విన్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్సుల తీరును బట్టి మూడు నుంచి 12 నెలల డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. కోర్సులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకుంటున్నారు.ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు అండగా నిలుస్తున్న సెట్విన్ కేంద్రం అందుబాటులో పలు కోర్సులు జాబ్ మేళాల నిర్వహణతో ఉద్యోగ అవకాశాలు శిక్షణకు కావాల్సిన అర్హతలు పదో తరగతి మొదలు పీజీ వరకు చదివిన అభ్యర్థులకు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఒక బ్యాచ్కు 300 మంది అభ్యర్థుల చొప్పున శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంలో వసతులున్నాయి. ప్రతీ సంవత్సరం 1000 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేయడంతోపాటు ప్రతీ సంవత్సరం జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందుబాటులో ఉన్న కోర్సులు విద్యా అర్హత, ఆసక్తి ప్రతిపాదికన వివిధ కంప్యూటర్ కోర్సులతోపాటు, సాంకేతిక కోర్సుల్లో ఇక్కడ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ప్రసుత్తం అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, రీటేయిల్ సేల్స్ అసోసియేట్స్, ఫీల్ట్ టెక్నీషియన్, నెట్ వర్కింగ్, స్టోరేజీ, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.జిల్లా కేంద్రంలోని సెట్విన్ కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంక్ ద్వారా రుణాలు అందించేందుకు సహకరిస్తున్నాం. – శివ కుమార్, సెట్విన్ ఇన్చార్జి -
ఇందిరమ్మ ఇళ్లు
నిమ్జ్ నిర్వాసితులకుశుక్రవారం జహీరాబాద్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులుపట్టాలిచ్చే ప్రత్యేక బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్లో భూములు కోల్పోతున్న 5,612 నిర్వాసిత కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి హామీనిచ్చారు. ఈ నిర్వాసితులకు పట్టాలు అందించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అప్పగిస్తున్నానన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.494 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రేవంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 2014 తర్వాత మెదక్ జిల్లాతో పాటు, నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిమ్జ్ నిర్వాసితుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని, వెంటనే అధికారులను పిలిచి నిర్వాసితులకు న్యాయం చేసేలా నష్టపరిహారం పెంచాలని ఆదేశించామన్నారు. జంట నగరాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించిన రేవంత్రెడ్డి వీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం.. జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన పదెకరాల భూమిని నిమ్జ్లో కేటాయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక్కడ పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ ఇదే నిమ్జ్లో తన యూనిట్ స్థాపన పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి 450 ఎకరాలు భూమిని కేటాయించామన్నారు. జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అండర్ పాస్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఆదర్శనీయుడు బసవేశ్వరుడు గౌతమ బుద్ధుని తర్వాత బసవేశ్వరుడు ఆదర్శనీయుడని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజుల్లో అనుభవ మండపాలను ఏర్పాటు చేసి అన్ని సామాజికవర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చేసిన విశ్వగురువు బసవేశ్వరుడన్నారు. అప్పటి అనుభవ మండపాల మాదిరిగానే ఇప్పుడు అసెంబ్లీ.. పార్లమెంట్లను నిర్వహించుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై త్వరలో సమీక్ష జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను పరిష్కరించి ఈ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని ఎన్నికలయ్యాక అందర్నీ కలుపుకుని పోతామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 150 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి కో–ఆపరేటివ్ సెక్టార్లో చక్కెర పరిశ్రమ త్వరలో హుందాయ్ కార్ల పరిశ్రమ పనులు ప్రారంభం సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మకు మెదక్తో విడదీయలేని అనుబంధం.. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తన చివరి శ్వాస వదిలేవరకు మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ భాగారెడ్డి, ఈశ్వరీబాయిలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. గీతారెడ్డి హయాంలోనే జహీరాబాద్కు నిమ్జ్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు ప్రాంతంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, నిమ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినవేనని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామన్నారు. మెదక్ సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. -
ఆపరేషన్ కగార్ను విరమించాలి
కేంద్రానికి వామపక్షాలు విజ్ఞప్తి సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆపరేషన్ కగార్ను విరమించి, మరణ హోమాన్ని ఆపాలని వామపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెహమాన్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్, ప్రశ్నించే గొంతులను, ఆదివాసులను అతిక్రూరంగా బూటకపు ఎన్కౌంటర్లు చేసి మారణహోమాన్ని సృష్టిస్తోందన్నారు. మావోయిస్టులతోపాటు ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చలు జరపాలని సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపకుండా మావోయిస్టులను చంపడం అత్యంత హేయమన్నారు. ఈ మారణ హోమంలో మావోయిస్టులు, ఆదివాసులు, మిలిటరీ జవాన్లు కూడా చనిపోతున్నారని, ఇవన్నీ పట్టించుకోకుండా కేంద్రం నిరంకుశ వైఖరితో ఎన్కౌంటర్లు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఫాసిస్టు నైజమని మండిపడ్డారు. మారణ హోమాన్ని ఆపకపోతే విపక్ష పార్టీలు ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చింత గంగయ్య, సయ్యద్ సమద్, మల్లేశ్, అసద్, తిరుమలేశ్, సమతా సైనికదళ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించిన సీపీఎం సంగారెడ్డి: చత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడాన్ని సీపీఎం సంగారెడ్డి ఏరియా కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆ పార్టీ నాయకుడు యాదగిరి సూచించారు. మావోయిస్టు రాజకీయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, చర్చల కోసం వారు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి అన్ని పారా మిలిటరీ కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. -
యాభై సార్లయినా మోదీని కలుస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఎన్నికలయ్యాక అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కేంద్రం సహకారాన్ని తీసుకుంటాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం..రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం..కావాల్సిన అనుమతులు తీసుకుంటాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసి మెలసి పనిచేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.చెరువు మీద అలిగి కడుక్కోకుంటే ఎలా?..దిగిపోయిన ఆయన (కేసీఆర్) చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో పడుకుంటే ఏమైంది?.. ప్రజలు ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది.. నేను అలాంటి తప్పులు చేయను.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరా బాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం ‘రాష్ట్ర ప్రజలు మాపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు రావ డం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. ప్రజలు మాకు అండగా నిలిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా అబివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో, ఫార్మాసిటీ అన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోను..’ అని రేవంత్ అన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అవకాశాలు ‘రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం కోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ శాఖతో ఒప్పందాల ద్వారా తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు ఇచ్చాం. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని.. సోనియాగాంధీ నాయకత్వంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..’ అని సీఎం చెప్పారు. యువత నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం.. ‘తెలంగాణ ఉద్యమంలో ముందున్న లక్షలాది మంది యువతకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నేను సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి యువతలో మాపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.వీటన్నింటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఆశ్విర్వదిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 25.55 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుబరోసా ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి ‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. రండి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. ఎక్కడైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం..అలా కాకుండా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేకపోతే ఫాంహౌస్లో పడుకుంటానంటే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. నేను 20 ఏళ్లు ప్రజల గొంతుకై నిలిచా నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీగా.. ఇలా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ప్రజల సమస్యలకు గొంతుకనై పనిచేశా. నేను 20 ఏళ్లుగా ప్రజల పక్షాన పనిచేశాను కాబట్టే ప్రజలు నాకు సీఎంగా అవకాశం కల్పించారు. నా వద్దకు చిన్నోడు వచి్చనా.. పెద్దోడు వచి్చనా.. ఉన్నోడు వచి్చనా.. పేదోడు వచ్చినా.. అందరినీ కలిసి.. చేతనైన సాయం చేస్తున్నా..’ అని రేవంత్ చెప్పారు. సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
జహీరాబాద్: బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి, సంగారెడ్డి: జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్లో పర్యటించిన సీఎం.. హుగ్గెల్లి జంక్షన్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని.. భూసేకరణలో అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిమ్జ్కు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచామని చెప్పారు. నిమ్జ్ కోసం భూములిచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. త్వరలోనే 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణాలు చేస్తాం. సింగూరు ప్రాజెక్టును అద్భుతమైన టూరిజంగా తీర్చిదిద్దుతాం. హుండాయ్ కార్ల పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని రేవంత్ అన్నారు. జహీరాబాద్ అభివృద్ధి సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
● మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి ● ముగిసిన రాష్ట్ర స్థాయి జూనియర్సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు ● నిజామాబాద్ జట్టుకు బంగారు,మెదక్ జట్టుకు రజత పతకం తూప్రాన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. అనంతరం సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణగుప్త మాట్లాడుతూ. ఫైనల్లో పోటీల్లో మెదక్ జిల్లా–నిజామాబాద్ జిల్లా జట్లు హోరాహోరీగా పోటీ పడగా నిజామాబాద్ జట్టు 6–1 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. మెదక్ జిల్లా జట్టు రజత పతకం, హనుమకొండ జట్టు కాంస్య పతకాలను కై వసం చేసుకున్నాయని తెలిపారు. అనంతరం సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు మాట్లాడుతూ.. చండీఘర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు రాణించి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేత జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, కోశాధికారి రేణుక, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ శర్మ, కోశాధికారి గోవర్ధన్ గౌడ్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, మంచిర్యాల కార్యదర్శి కిరణ్, మాజీ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మామిండ్ల కృష్ణ, వివిధ జిల్లాల జట్ల కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో అధిక లాభాలు
● సెరి కల్చర్ ఏడీఏ ఇంద్రసేనారెడ్డి బెజ్జంకి(సిద్దిపేట): మల్బరీ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సెరి కల్చర్ ఏడీఏ ఇంద్రసేనారెడ్డి సూచించారు. మండలంలోని గాగిళ్లాపూర్లో మల్బరీ సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రో త్సాహకంగా మల్బరీకి సంబంధించిన యూ నిట్ నిర్మాణంతోపాటు మొక్కలు, డ్రిప్, స్ప్రింక్లర్ తదితరాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా ఆదాయం వస్తుందన్నారు. సమావేశంలో ఎస్ఓ శర్మ, గ్రామ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్లు పులి శ్రీనివాస్, మాచం శ్రీనివాస్, రైతులు అన్నాడి శ్రీధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బాలయ్య, రమణారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. రుద్రారంలో లుక్ ఆఫ్ తెలంగాణ భామ సందడి మిరుదొడ్డి(దుబ్బాక): మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ అందాల పోటీల్లో కీర్తి కిరీటాన్ని కైవసం చేసుకున్న అందాల భామ తుమ్మల ఆర్తీ అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని తన స్వగ్రామమైన రుద్రారంలో బుధవారం సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్లోని సారథి స్టూడియోలో అమీర్ పేట స్కైల్ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచారు. ఆర్తీకి క్లౌడ్ మీడియా చైర్మన్ రామకృష్ణ, హైకోర్టు అధికారి వేణుగోపాల్, రిజిస్ట్రేషన్ డీఐజీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విజేత కిరీటంతోపాటు చెక్కును అందించారు. స్వగ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి సన్మానించారు. గ్రామానికి చెందిన తుమ్మల యాదగిరి, మాదమ్మ దంపతుల కూతురు ఆర్తీ మహారాష్ట్రలోని నాగపూర్లో బీఈ ఆర్కిటెక్చర్లో డిగ్రీ పట్టా పొందారు. ఎస్టీ జాబితాలోకి నక్కల కులస్తులు ● ఫలించిన 8 ఏళ్ల పోరాటం తొగుట(దుబ్బాక):తొగుట మండలం ముత్యంపేటకు చెందిన నక్కల (పిట్టల) కులస్తుల 8 ఏళ్ల సుధీర్ఘ పోరాటం ఫలించింది. ప్రభుత్వం నక్కల కులస్తులను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చింది. ఇక నుంచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ గ్రామాన్ని సందర్శించి పూర్వ పరాలను విచారించారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ తన కార్యాలయంలో వారికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీంతో గ్రామంలోని సుమారు 80 కుటుంబాలకు అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు పొందుతారు. వారి న్యా య పోరాటానికి సామాజిక సమరసత వేదిక అండగా నిలిచింది. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తంచేశారు. -
ఉద్యోగం పోయిందని మానసిక ఒత్తిడితో..
రేగోడ్(మెదక్): ఉరేసు కొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ పోచయ్య కథనం మేరకు.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (30) గతంలో మిషన్ భగీరథలో ఉద్యోగం చేసేవాడు. ఓ కేసు వల్ల ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. మంగళవారం తన కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం పెద్దశంకరంపేటకు వెళ్లాడు. బుధవారం తమ చేనులో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. – చెరువులో దూకి వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని సదాశివపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం మేరకు.. సదాశివపల్లి గ్రామానికి చెందిన చాకలి క్రిష్ణ(34) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం తాను ఎక్కడైనా వెళ్లి చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి వెతకగా గ్రామ కనికల చెరువు తూమ్ వద్ద బట్టలు, ఫోన్ కనిపించాయి. రాత్రి చెరువులో వెతికినా జాడ దొరకలేదు. బుధవారం గజ ఈతగాళ్లతో వెతికించగా క్రిష్ణ మృతదేహం బయటపడింది. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య -
అసంపూర్తిగా త్రిశూలం, ఢమరుకం పనులు
● మల్లన్న ఆలయం వద్ద ఏర్పాటు ● రూ.63 లక్షల వ్యయంతో నిర్మాణం ప్రారంభం ● డిజైన్ మార్పుతో పెరిగిన వ్యయం ● మరో రూ.20 లక్షలకు దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలుకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని భక్తులు పరమశివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ఆలయ గొప్పతనాన్ని చాటడంతోపాటు శివుడి ప్రతి రూపం ప్రతిబింబించేలా మల్లన్న ఆలయంపై ఉన్న ఎల్లమ్మ గుట్టపై త్రిశూలం, ఢమరుకం ఏర్పాటుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నా పనులు పూర్తి చేయడానికి నిధులు కొరత వెంటాడుతుంది. గతేడాది స్వామి వారి కల్యాణానికి ముందే పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ అధికారులు ప్రకటించి పనులు వేగంగా చేసినా నిధులు సరిపోక అసంపూర్తిగా వదిలేశారు. రూ.63 లక్షల వ్యయంతో 2023 సెప్టెంబర్లో పనులు ప్రారంభించారు. పనులు చివరి దశకు చేరుకోగా హైదరబాద్లోని ఓ కార్ఖానాలో స్టీల్తో త్రిశూలం, ఢమరుకం, ఓం ఆకారాలను తయారు చేయించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేందుకు వీలుగా ఆకారాలను బిగేంచేందుకు రెండు అంతస్థుల భవనం నిర్మించారు. కానీ డిజైనింగ్లో మార్పు వల్ల ప్రతిపాదించిన రూ.63 లక్షల వ్యయం సరిపోలేదని అదనంగా రూ.20 లక్షలు అవసరమవుతాయని నిధులు మంజూరు చేస్తే పనులు చేస్తామని నవంబర్లో దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంత వరకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగలి అన్న చందంగా మారాయి. కమిషనర్ అనుమతి కోసం ఫైల్ పంపించామని, అనుమతి రాగానే పనులు పూర్తి చేస్తామని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. -
కవి, చిత్రకారుడు ప్రవీణ్ కన్నుమూత
– మెడికల్ కళాశాలకు పార్ధివదేహం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారు డు, కళాకారుడు, కవి చొప్పదండి ప్రవీణ్ (పెంటన్న) (72) మంగళవారం కన్ను మూశారు. ఈయన కాకతీయ యూనివర్సిటీలో తెలుగు ఉపన్యాసకులుగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. సిద్దిపేట ప్రేరణ సాహితీ సంస్థ, నవ్య కళానికేతన్కు సేవలు అందించారు. ప్రముఖ రచయిత శారద కథలపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు పెంటన్న పార్ధిదేహాన్ని సిద్దిపేట మెడికల్ కళాశాలకు పరిశోధనల కోసం అందజేశారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిదారెడ్డి, కవులు కొమురవెల్లి అంజయ్య, పప్పుల రాజిరెడ్డి, వేముగంటి మురళీ, తైదల అంజయ్య, భగవాన్ రెడ్డి , మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, తెలంగాణ రచయితల సంఘం, మరసం ప్రతినిధులు, తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి ముండ్రాయి శివారులో చోటు చేసుకుంది. రాజగోపాల్పేట గ్రామానికి చెందిన కొక్కోండ జగదీశ్ చారి (23) సిద్దిపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని స్వగామానికి తిరిగి వస్తున్నాడు. సురభి ఆస్పత్రి సమీపంలో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జగదీశ్ది ఎర్రవల్లి కాగా మల్లన్నసాగర్ నిర్మాణంలో ఇల్లు కోల్పోవడంతో అమ్మమ్మ గ్రామం రాజగోపాల్పేటలో నివాసం ఉంటున్నాడు. కాగా అతని తండ్రి గతంలోనే మరణించగా తల్లి బాగ్యవ్వ, తమ్ముడు మధు ఉన్నారు. -
సన్నాసుల సన్నాయి నొక్కులకు భయపడ..
● ఓట్ల రాజకీయం కాదు..అభివృద్ధి ముఖ్యం ● ఎంపీ మాధవనేని రఘునందన్రావుదుబ్బాక : సన్నాసుల సన్నాయి నొక్కులకు భయపడనని.. చట్టం తెలిసిన వాడిని న్యాయబద్ధంగా తుదిశ్వాస విడిచేంత వరకు ప్రజల కోసమే పాటు పడుతానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో ఎంపీ ల్యాడ్స్తో నిర్మించిన మెడికల్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం కాదని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. 7 ఏళ్లుగా ఐటీఐ భవన నిర్మాణం పూర్తి కాలేదని ఇది పూర్తయితే లోకల్ విద్యార్థులకు న్యాయం జరిగేదన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాకనే దుబ్బాక–ముస్తాబాద్ డబుల్ రోడ్డు, మెట్టు–చందాపూర్, దౌల్తాబాద్–చేగుంట రోడ్లు వేయించానన్నారు. దుబ్బాక అంబేడ్కర్ విగ్రహం నుంచి హబ్షీపూర్ చౌరస్తా వరకు ఫోర్లైన్ రోడ్డు కోసం బీఆర్ఎస్ హయాంలో సీఎం ను కలిస్తే నాకు పేరొస్తుందని ఆపించారన్నారు. దుబ్బాకలో మెడికల్ కాలేజీ ఎందుకు లేదని అడిగా, కనీసం నర్సింగ్ కాలేజీ పెట్టమంటే హరీశ్రావు వద్దన్నాడని ఆరోపించారు. కొత్త మండలాలకు తహసీల్దార్ కార్యాలయాలు లేవు దుబ్బాక రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతానన్నారు. దుబ్బాకలో మెడికల్ అసోసియేషన్ భవనంకు పార్టీలకు అతీతంగా రూ.10 లక్షలు ఇచ్చానన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వేంకటేశ్వరుడి ప్రతిమ అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యందుబ్బాక అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్, బింగి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
మెదక్ జిల్లాలో బుధవారం జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కారు, డీసీఎం ఢీకొనడంతో ఎనిమిది మంది శివ్వంపేట(నర్సాపూర్) : కారును డీసీఎం ఢీకొట్టడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తూప్రాన్–నర్సాపూర్ హైవేపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలం మున్రాయి గ్రామానికి చెందిన ముచ్చర్ల రమేశ్ కుటుంబ సభ్యులు శివ్వంపేట మండలం గోమారంలో మంగళవారం రాత్రి జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు స్వగ్రామానికి కారులో బయలుదేరారు. చిన్నగొట్టిముక్ల గ్రామ శివారులో శభాష్పల్లిలోని సుగుణ పరిశ్రమ నుంచి పరంలోడుతో నర్సాపూర్ వైపునకు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి వీరి కారుని ఢీకొట్టింది. దీంతో కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడటంతో 8 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రామాయంపేట వద్ద ఐదుగురు రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ శివారులో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు గాయపడ్డారు. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్డీసీ బస్సు రామాయంపేట వస్తుండగా కోమటిపల్లి స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావడంతో బస్సు డ్రైవర్ స్లో చేశాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా తిప్పాపూర్కు చెందిన ప్రమీల స్పల్పంగా గాయపడింది. మరో ఘటనలో దౌల్తాబాద్ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కారును బొలేరో ఢీకొట్టడంతో ఐదుగురు తూప్రాన్: కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తూప్రాన్–గజ్వేల్ రహదారిపై మండలంలోని యావపూర్ చౌరస్తా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. పట్టణంలోని హైదర్గూడకు చెందిన పరశపోగు రమేశ్ కారులో నలుగురు మేసీ్త్రలను సిద్దిపేట జిల్లా అనంతగిరిపల్లెకు తీసుకెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం కారును, మరో ద్విచక్ర వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రవీణ్, శివ, సురేశ్, మరియదాస్తోపాటు బైక్పై ఉన్న శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. దంపతులకు తీవ్ర గాయాలు నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం నర్సాపూర్–తూప్రాన్ రహదారిలోని కోమటికుంట సమీపంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమంతపూర్కు చెందిన అరట్ల వినయ్, భార్య రజిత కలిసి బైక్ పై నర్సాపూర్ వైపు వస్తున్నారు. ప్రమాదవశాత్తు కారుతోపాటు లారీని ఢీకొట్టారు. దంపతులిద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నర్సాపూర్ ఎస్సై లింగంను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ఫల రాజ కేంద్రం
ఉద్యానానికి ఊతం..● రైతులకు ఉపయోగపడేలా నర్సరీలు ● వృద్ధి చెందుతున్న ములుగు‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ● 53 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● మొక్కలతోపాటు శిక్షణ తరగతులు ● ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రైతన్నలకు ఆదాయం సమకూరేలా పండ్ల తోటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో సాగుకు అనువైన వివిధ రకాల ఉద్యాన మొక్కలను వృద్ధి పరిచి, పంపిణీ చేయడం, ప్రత్యక్ష పద్ధతిలో శిక్షణ, రైతుల ఆదాయ వనరులు పెంపొందింపజేయడం లక్ష్యంగా ప్రభుత్వం ములుగు మండల కేంద్రంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్’ ఫల పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాల పండ్ల మొక్కలు, రైతులు ఆసక్తి చూపే ఉద్యాన పండ్ల మొక్కలు, ఎకో ప్లాంటేషన్ మొక్కలను ఇక్కడ నర్సరీల్లో అభివృద్ధి చేసి రైతులకు అందజేస్తారు. – ములుగు(గజ్వేల్) ములుగు మండల కేంద్రం సమీపంలో రాజీవ్ రహదారి ఆనుకొని 53 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కల పరిశోధన, అభివృద్ధి కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో కేవలం మొక్కలు అభివృద్ధి చేసి రైతులకు సకాలంలో పంపిణీ చేయడానికే పరిమితం కాదు. వాటి సాగు విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించేలా కేంద్రంలో ప్రత్యక్ష శిక్షణ కూడా ఇస్తారు. రైతుల చేతుల మీదుగా ఆయా పద్ధతులు ఆచరింపజేస్తూ వివరిస్తారు. మామిడి మొక్క కొమ్మ ఎలా కత్తిరించాలి.. ఏ సీజన్లో కత్తిరింపు జేయాలి.. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను సలహాలతో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ప్రాక్టికల్గా చూపిస్తారు. దీంతో ఉద్యాన తోటలపై రైతులకు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. పక్కనే ఉద్యాన యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడ రైతులతోపాటు ఉద్యాన విద్యార్థులకు సైతం శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. సైంటిస్టులు అందుబాటులో ఉండటం వల్ల శాస్త్రవేత్తల ద్వారా మరింత మెరుగైన శిక్షణ లభిస్తుంది. ప్రత్యక్షంగా ప్రదర్శన క్షేత్రాలు ఉద్యాన రైతులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా 53 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. అందులో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఫర్టిగేషన్ తదితర విధానాలు ఆచరిస్తున్నారు. ఆ విధంగా వృద్ధి చేసిన డెమో ప్లాట్లలో కొమ్మల కత్తిరింపు, ఎరువుల వాడకం, సస్యరక్షణ తదితర అంశాలను ప్రత్యక్ష పద్ధతిలో చూపుతూ రైతుల్లో అవగాహన పెంపొందింపజేసేందుకు ఇవి ఉపయోగపడుతాయి. పరిశోధన కేంద్రంలో ఎన్నెన్నో రకాలు ములుగు ఫల పరిశోధన అభివృద్ధి కేంద్రం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తెలంగాణ ప్రాంతానికి అనువైన ఉద్యాన పండ్ల మొక్కల రకాల అభివృద్ధి జరుగుతుంది. ఇందులో 17 రకాల మామిడి, 3 రకాల నిమ్మ, 5 రకాల జామ, 5 రకాల దానిమ్మ, 3 రకాల డ్రాగన్ ఫ్రూట్, 4 రకాల చింత, ఒక రకం ీసీతాఫలం, 2 రకాల వెదురు, 9 రకాల ఆయిల్ పామ్ తదితర వైరెటీలు ఇక్కడి డెమో ప్లాట్లలో సాగు చేశారు. అంతే కాకుండా శ్రీగంధం, కూరగాయలు, వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. రాయితీలు అనుసంధానంగా.. రైతులు ఎన్ని ఎకరాల్లో.. ఏ రకం ఉద్యాన పండ్ల మొక్కలు సాగు చేయాలనుకుంటున్నారో ముందుగా కేంద్రంలో నమోదు చేయించాలి. అందుకు అనుగుణంగా ఆయా మొక్కలను నర్సరీలో వృద్ధి చేసి సకాలంలో రైతులకు అందజేస్తారు. అయితే నర్సరీ ద్వారా మొక్కలు తీసుకున్న రైతులు రాయితీని మాత్రం వివిధ ఉద్యాన పథకాల ద్వారా పొందాల్సి ఉంటుంది.పరిశోధనల నిలయం తెలంగాణ ప్రాంత భూములకు అనువైన పండ్ల రకాలపై ములుగు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పరిశోధన జరుపుతుంది. మార్కెట్ డిమాండ్కు అనువైన రకాలు ఏమిటి, అధిక దిగుబడి రకాలు ఏమిటి తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని మొక్కల వృద్ధి కోసం పరిశోధనలు జరుపుతారు. డిమాండ్కు అనువైన పండ్ల రకాలను, ఇతర రాష్ట్రాల వైరెటీలు సైతం ఇక్కడ అభివృద్ధి చేస్తారు. దీంతో రైతులు పండ్ల వైరెటీల కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన బాధ ఉండదు. ఓ సూపర్ బజార్ మాదిరి అన్ని ఇక్కడే లభ్యమవుతాయి. దరఖాస్తు చేసుకుంటే మొక్కలు సిద్ధం చేస్తాం తెలంగాణ ప్రాంత ఉద్యాన రైతులకు ఊతంగా రాష్ట్రంలోనే ఏర్పాటైన తొలి కేంద్రమిది. ఇక్కడ తెలంగాణకు అనువైన వివిధ రకాల ఉద్యాన పండ్ల మొక్కలు, శ్రీగంధం తదితర అటవీ అభివృద్ధికి దోహదపడే రకాల పరిశోధన, వాటిని రైతులకు అందజేసేందుకు నర్సరీల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రైతులు దరఖాస్తు చేసుకుంటే ఆ సీజన్ వరకు మొక్కలు సిద్ధం చేస్తాం. ఆ తర్వాత మొక్కలను కేంద్రం నుంచి తీసుకెళ్లవచ్చు. రైతులు ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి సహకారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ 89777 14250 లేదా ఉద్యానశాఖ అధికారి 90001 36490 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. – బీ.శ్రీధర్, ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఫ్రూట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ -
10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ పట్టణంలోని కోమటికుంటలో బుధవారం సుమారు 10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. కోమటికుంటలోకి డ్రైనేజ్ నీళ్లు కలవడంతో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంట పైభాగంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, అధికారులు సరైన డ్రైనేజీ, మురికి కాల్వల నిర్మాణాలు చేపట్టకపోవడంతో నేరుగా కుంటలోకి కలుషిత నీరు చేరి చేపలు మృత్యువాత పడ్డాయని ఆవేదన చెందారు. చేపల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులను ఆదుకోవాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. -
8 లక్షల ఎకరాల్లో సాగు
ఎరువుల అంచనా ఇలా జిల్లాలో పంటలకు అవసరమయ్యే ఎరువుల కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికలను సిద్ధం చేశారు. యూరియా 41,900, డీఏపీ 16,045, ఎంఓపీ 19,682, కాంప్లెక్స్ 36,804, ఎస్ఎస్పీ 9,225 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వివిధ రకాల ఎరువులు 18,757 మెట్రిక్ టన్నులు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడాది 1,23,656 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు.వానాకాలం సీజన్లో పంటల సాగు అంచనా వివరాలు పంట రకం గత సం.. సాగువివరాలు ప్రస్తుత సం.. సాగు అంచనా వరి 1,50,157 1,65,173 మొక్క జొన్న 7,257 7,983 పత్తి 3,52,308 3,87,539 కంది 77,110 84,821 సోయాబీన్ 71,966 79,613 పెసర 13,478 14,826 మినుములు 8,897 9,787 ఇతరములు 26,339 26,256 హార్టికల్చర్ 25,534 28,964 మొత్తం 7,33,047 8,04,512● వానాకాలం పంటల అంచనా ● గతేడాది కంటే పెరిగిన సాగు విస్తీర్ణంసంగారెడ్డి జోన్: ఈ ఏడాది ఖరీఫ్ పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో వానాకాలం సాగు పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,04,512 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు సాగు విస్తీర్ణం, పంట రకంతోపాటు సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాలు తదితర అంశాలతో కూడిన ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. గతేడాది కంటే ఈసారి సుమారు 70 వేల ఎకరాల్లో అత్యధికంగా సాగు చేయనున్నట్లు ప్రణాళికల్లో పేర్కొన్నారు. జిల్లాలో గతేడాది సాగు చేసిన పంటల ఆధారంగా సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. అత్యధికంగా పత్తి సాగు జిల్లాలో సాగు చేస్తున్న పంటల్లో అత్యధికంగా పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రతీ ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది సుమారు 70వేల ఎకరాలకు పైగా పత్తి పంట అధికంగా సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు 7,75,078 మేర పత్తి ప్యాకెట్లు అవసరం ఉన్నట్లు తెలిపారు. వరి, సోయాబీన్, కందితోపాటు ఇతర పంటలు పత్తి పంట తర్వాత అత్యధికంగా జిల్లాలో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 1,65,173 ఎకరాలు, కంది 84,821, సోయాబీన్ పంట 79,163, మొక్కజొన్న 7,983 పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఆయా పంటలకు ఎంత మేర విత్తనాలు అవసరమో వాటి ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు.ప్రణాళికలను సిద్ధం చేశాం వానకాలం సీజన్లో భాగంగా సాగు చేసే పంటలను అంచనా వేసి ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. సాగు చేసే పంటలకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అంచనా వేశాం. గతేడాది కంటే ఈసారి పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేసే అవకాశముంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: రాష్ట్ర ముఖ్యమంత్రి జహీరాబాద్లో ఈనెల 23న పర్యటించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...హెలీపాడ్ నుంచి సభాస్థలి వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ రూట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, హెల్త్ క్యాంపులు, భగీరథ నీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.రాజీవ్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్లోని తన స్వగృహం ఆవరణలో బుధవారం రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను గురించి ఎమ్మెల్యే వివరించారు. ఆయన చూపిన బాటలో ప్రతీఒక్కరూ పయనించాలన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్ వివేకానంద్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ తహసీల్దార్గా వెంకటేశ్పటాన్చెరు: అమీన్పూర్ నూతన తహసీల్దార్గా వెంకటేశ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీపై వికారాబాద్ వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ నుంచి వెంకటేశ్ ఇక్కడికి బదిలీపై వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ, అధికారులు సిబ్బంది పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ భూములు కాపాడటంలో నిరంతరం కృషి చేస్తామన్నారు. అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలిసీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ కవితాదేవి పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఉపాధ్యాయులకు న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. న్యాయం ప్రతీ ఒక్కరి హక్కు అని ప్రతి ఒక్కరికీ చట్టాల గురించి తెలియాలన్నారు. ఉపాధ్యాయుల పట్ల సమాజంలో మంచి గౌరవం ఉంటుందని తెలిపారు. ఉత్తమమైన విద్యాబోధనతోపాటు బాలకార్మిక నిర్మూలనకు కృషి చేయాలన్నారు. సంగారెడ్డి తహసీల్దార్గా బాధ్యతల స్వీకరణసంగారెడ్డి టౌన్: ఎన్నికల బదిలీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల తహసీల్దార్గా బదిలీపై వెళ్లిన జయరాం ఇటీవల సంగారెడ్డి జిల్లాకు తిరిగివచ్చారు. బుధవారం జరిగిన బదిలీలలో భాగంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆయనను సంగారెడ్డి మండల తహసీల్దార్గా నియమించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ దేవదాస్ జిన్నారం మండలానికి బదిలీ అయ్యారు. -
సేవలు బాగున్నాయా..?
ప్రభుత్వాస్పత్రిలో రోగుల బాగోగులపై ఎమ్మెల్యే మాణిక్రావు ఆరాజహీరాబాద్: స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే కె.మాణిక్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను కలసి ఆస్పత్రి సేవల గురించి వారి బాగోగుల గురించి ఆరా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఇతర వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు వారితో మాట్లాడుతూ..ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రతీ విభాగంలో సిబ్బంది అంకితభావంతో సేవలందించాలన్నారు. వచ్చే నెలలో తిరిగి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోగులకు ఉత్త మ సేవలందించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, బండి మోహన్ పాల్గొన్నారు. -
ఏ ముఖం పెట్టుకొస్తున్నావ్?
జహీరాబాద్: తమ ప్రభుత్వ హయాంలో జహీరాబాద్లో చేసిన పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రారంభించడానికి వస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ తీరు చూస్తూ సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం రాత్రి జహీరాబాద్ వచ్చిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. రైల్వే ఫ్లైఓర్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని సీఎం రిబ్బన్ కట్చేయడానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని అప్పటి బీఆర్ఎస్ ఎంపీ తీసుకువచ్చిండని, అందులో విద్యార్థులు చేరి ఆరు నెలలవుతుంటే ఇప్పుడు కొబ్బరికాయ కొడతారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హాయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతోపాటు నా సొంత నిధులను కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా అని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్రెడ్డి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన రూ.25 కోట్లను, మున్సిపాలిటీకి ఇచ్చిన రూ.30 కోట్లు కూడా వాపస్ తీసుకున్నారని విమర్శించారు. ఇచ్చినవి కూడా గుంజుకున్నారు ఎమ్మెల్యే మాణిక్రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నారని హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్ మీద రేవంత్రెడ్డి ప్రేమ ఉంటే తీసుకున్న నిధులను వెంటనే తిరిగివ్వాలని, పాతవి ఇచ్చి కొత్తగా రూ.100కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 21వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొని రైతులకు ఇవ్వాల్సిన రూ.72కోట్లలో ఇప్పటి వరకు సీఎం రేవంత్రెడ్డి ఒక్క రూపాయి కూడ ఇవ్వలేక పోయారన్నారు. రేవంత్రెడ్డిది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా పూర్తిగా అమలు చేయలేక పోయిందని మండిపడ్డారు. తాము చేసిన పనులకు ప్రారంభోత్సవాలా! సీఎం రేవంత్కు హరీశ్ రావు ప్రశ్న జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి పథకాలను అటకెక్కించారు కేసీఆర్ మంజూరు చేసిన నిధులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ -
ఉత్తమ సేవలకు పురస్కారం
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా బొల్లారం, జహీరాబాద్ సి.ఐలు రవీందర్రెడ్డి, శివలింగంతోపాటు హెడ్ కానిస్టేబుల్ రఫిక్, సీత్య నాయక్లను అభినందించి వారికి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ సమయంలో కేసును పరిష్కరించి నిందితుడికి మరణ శిక్ష విధించడంలో బొల్లారం సి.ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో బెస్ట్ కన్విక్షన్ అవార్డ్ అందుకున్నారన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆస్థి నేరాన్ని పరిష్కరించి, అత్యుత్తమ కేసుల ఛేదనలో జహీరాబాద్ సి.ఐ రాష్ట్ర స్థాయిలో జిల్లా గుర్తింపు పొందారని వివరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. ప్రశంసాపత్రాలు అందజేసిన డీజీపీ -
ఆటోలోనే డ్రైవర్ మృతి
రామాయంపేట(మెదక్): ఆటోలో నిద్రించిన డ్రైవర్ అందులోనే మృత్యువాత పడ్డ ఘటన మంగళవారం రామాయంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్కు చెందిన ప్రవీణ్గౌడ్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం ఆటోలో రామాయంపేటకు వచ్చిన ప్రవీణ్గౌడ్ ఎల్లమ్మ గుడి వద్ద బండి నిలిపి అందులోనే నిద్రించాడు. ఉదయం చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య అఖిలతోపాటు ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. -
ఆర్వీఎంలో అరుదైన శస్త్ర చికిత్స
ములుగు(గజ్వేల్) : మండలంలోని లక్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్రావు కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన తాడూరి యాదగిరి(65) ఇటీవల ఒక శుభకార్యంలో భోజనం చేస్తూ త్రిభుజాకారంలో ఉన్న ఎముకను మింగాడు. ఆ ఎముక గొంతు ద్వారా అన్నవాహిక వద్దకు వెళ్లి నిలిచిపోయింది. దీంతో కడుపునొప్పి, శ్వాసపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. స్పందించిన వైద్యులు శ్రీనివాస్, అభిషేక్, గోపికృష్ణ, వరుణ్, భావన యాదగిరికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎముకను గుర్తించారు. సమస్య పరిష్కారానికి గ్యాస్ట్రోస్కోపీలో నూతన సాంకేతికను వినియోగించి ఓవీఏస్కో చికిత్స ద్వారా వైద్యులు సురక్షితంగా ఎముకను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ముందు చూపే సాగుకు మందు
దుబ్బాకటౌన్: మరి కొన్ని రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే రైతులు ప్రణాళికబద్ధంగా సాగుకు సిద్ధమైతే మంచి దిగుబడులు సాధించవ్చని ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రైతులకు సూచిస్తున్నారు. తొలకరి చినుకులు పడే వరకు వేచి చూసి పనులు ప్రారంభించడం కంటే నెల రోజుల ముందు నుంచే సాగుకు సన్నద్ధమైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పంట సాగుకు ముందు నుంచే ఖర్చులను లెక్కించుకోవాలి. పెట్టుబడులకు అనుగుణంగా విత్తనాలను, కూలీలు, ఎరువులు కొనుగోలుకు వ్యయాన్ని సమకూర్చుకోవాలి. వేసవి దుక్కులు కీలకం.. వానాకాలం సాగుకు నెల రోజుల ముందు నుంచే పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తు కోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంట కోతల అనంతరం భూమిని వృథాగా వది లేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ పురుగులను నివారించొచ్చు. అంతే కాకుండా వర్షాలు కురిస్తే నీరు భూమి లోపలి వరకు చేరుతుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు లేదా చెరువు మట్టిని పొలంలో వెదజల్లడం వల్ల మంచి దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. పత్తి మొదళ్లను భూమిలో కలపడం ఏటా పత్తి దిగుబడి అనంతరం రైతులు పత్తి మొదళ్లను కోసి తగల బెడుతుంటారు. పత్తి మొదళ్లు వృథాగా పోకుండా భూమిలో తేమ ఉన్నప్పుడు రోటవేటరుతో కలియ దున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి సారవంతం పెరగడమే కాకుండా రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు. భూసార పరీక్షలు భూమిలో సారం ఎంత వరకు ఉంది. ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, ఎంత మోతాదు ఎరువులు వాడాలి అనే విషయం గ్రహించేందుకు భూసార పరీక్షలు కీలకం కానున్నాయి. అధిక దిగుబడికి పోటీ పడి నష్టాలు కొని తెచ్చుకోవడం కంటే భూసార విలువలు తెలుసుకొని కాలానుగుణంగా సాగుతీరు మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చు. ఇసుక నేలు, ఒండ్రు నేలలు, రేగడి నేలలు, బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు, తదితర నేలలకు అనుగుణంగా పంట విత్తుకోవడంతో ఆశించిన దిగుబడి పొందవచ్చు. రైతులు మూడు పంటలకొకసారి భూసార పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు నేలలో కుళ్లి ఖనిజ పొరల్లో అభివృద్ధి చెంది పంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్థాయి. నేల రసాయనిక, భౌతిక, జీవ గుణాలపై ప్రభావం చూపి నేల సత్తువ, ఉత్పాదక శక్తిని పెంచుతాయి. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, వానపాముల ఎరువును ఎకరానికి సుమారు 2 నుంచి 4 టన్నుల వరకు వాడవచ్చు. విత్తడానికి 20 నుంచి 25 రోజుల ముందే సేంద్రియ ఎరువులు వేసి భూమిలో కలియ దున్నాలి. సేంద్రియ పదార్థం వాడటం వల్ల భూమి గట్టి పడకుండా గుల్లగా ఉంటుంది. నీరు బాగా ఇంకటం వల్ల తేమ గణనీయంగా పెరిగి విత్తనం బాగా మెలకెత్తుతుంది. వేసవి దుక్కులతో రైతులకు ఎంతో మేలు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అధిక ఎరువులతో అనర్థాలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త విజయ్ నాణ్యమైన విత్తనాలు పంట సాగులో విత్తనాల ఎంపిక ప్రధానం. దాదాపు 38 సంస్థలు వందల రకాల విత్తనాలను మార్కెట్లో సిద్ధంగా ఉంచుతున్నాయి. ఆయా కంపెనీల డీలర్లు రైతులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏ కంపెనీ నాణ్యమైన విత్తనాలను అందిస్తుందనే విషయంలో రైతులకు అవగాహన లేకుండా పోతుంది. ఏటా ఏదో ఒక కంపెనీ విత్తలనాను వేసుకునే కంటే నాణ్యమైన విత్తలనాలకు రైతులే విత్తనోత్పత్తికి తోడ్పడితే మేలు. -
మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
డ్రైవర్ మృతిహత్నూర(సంగారెడ్డి): బీర్ కాటన్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన హత్నూర మండలం చందాపూర్ బస్స్టేజి సమీపంలో సంగారెడ్డి–నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామ శివారులోని బీర్ ఫ్యాక్టరీ నుంచి బీర్ కాటన్ల లోడుతో కరీంనగర్ లిక్కర్ డిపోకు డీసీఎం వెళ్తుంది. డీసీఎం ఒక్కసారిగా చందాపూర్ గేటు సమీపంలోని వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్(22) మృతి చెందగా క్లీనర్ ముజామిద్ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితులు ఇద్దరూ కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చింతకి గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న ఎకై ్సజ్ ఎస్ఐ సందీప్ రెడ్డి, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను పరిశీలించి పంచనామ నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డివైడర్ను ఢీకొని కంటైనర్ హుస్నాబాద్: డివైడర్ను ఢీకొని కంటైనర్ బోల్తా పడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా పరకాల నుంచి సంగారెడ్డి పేపర్ మిల్లుకు బుధవారం అర్థరాత్రి ఇసుక కంటైనర్ వెళ్తుంది. మార్గమధ్యలో హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. డోర్ అద్దాలు పగులగొట్టుకొని డ్రైవర్, క్లీనర్ బయటకు దూకారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
హుస్నాబాద్లో ఎదురెదురుగా ఢీకొన్న ఆటో, కారు హుస్నాబాద్రూరల్: ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన బానోతు రాజు, లలిత కుటుంబం కరీంనగర్లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇద్దరు కుమారులు ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు అశోక్(20) గట్లనర్సింగాపూర్ గ్రామానికి నాయనమ్మను చూసేందుకు వచ్చి తిరిగి కరీంనగర్ వెళ్తున్నాడు. మార్గమధ్యలో జిల్లెలగడ్డ దగ్గరకు రాగానే హుస్నాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యి డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం పంచనామ చేస్తున్న పోలీసులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని తీసుకొచ్చి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. కారు యజమానికి పోలీసులు ఫోన్ చేయగా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నట్లు చెప్పారు. వాళ్లు వచ్చే వరకు పోస్టుమార్టం చేసేది లేదని భీష్మించి కూర్చోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోనే భద్రపరిచారు. కారు ఢీకొని వాచ్మెన్ జగదేవ్పూర్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అలిరాజ్పేట సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అలిరాజ్పేట గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు(65) పీఎన్ఆర్ గార్డెన్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం నిర్మల్నగర్ ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఉండటంతో వెళ్లాడు. అన్నం తిని సైకిల్పై తిరిగి గార్డెన్కు వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై నర్సింలు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం అందోల్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు కథనం మేరకు.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన దానంపల్లి రాములు (52) టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జోగిపేట వైపు వస్తున్నాడు. అన్నాసాగర్ శివారులో ఎదురుగా వచ్చిన సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ జె.లింగయ్య అజాగ్రత్తగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య తుల్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
జూన్ 2 నుంచి చెక్కుల పంపిణీ..
రాజీవ్ యువ వికాసంలో భాగంగా సిబిల్ స్కోర్ను ప్రమాణికంగా తీసుకుంటే బ్యాంకు లావాదేవీలు జరిపే వారికే పథకం వస్తుందని, ఇందులో పేద నిరుద్యోగులైన అర్హులకంటే అనర్హులకే లబ్ది చేకూరే అవకాశాలు ఉంటాయని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలు ఏవీ పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని, రాజీవ్ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని నిరుద్యోగ యువతకు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. భారీగా ధరఖాస్తులు.. జిల్లాలో ఊహించని విధంగా భారీ స్థాయిలో యువత నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకంలో రూ.50 వేలు మొదలు కొని రూ.4 లక్షల వరకు రుణం పొందేందుకు నిర్ణయించారు. గత నెల 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించగా 51,657 మంది దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకు గాను 23,681 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో 7,415 యూనిట్లకు 14,480 దరఖాస్తులు, మైనార్టీ విభాగంలో 2,456 యూనిట్లకు 8,378 దరఖాస్తులు, ఎస్టీ విభాగంలో 2,502 యూ నిట్లకు 4,232 దరఖాస్తులు, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించారు.ఈ పథకానికి ఎంపికై న లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి చెక్కులు పంపిణీ చేయనున్నారు. మండల, మున్సిపల్ స్థాయిల్లో అధికారులు గత నెలాఖరు నుంచి దరఖాస్తుల వెరికేషన్ ప్రక్రియను చేపట్టారు. జాబితాను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అధికారులు సిఫారసు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా జాబితాలో ఉన్న వారిని మరింత వడబోసి కలెక్టర్ ఆధ్వర్యంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారుల జిల్లా కమిటీ ఎంపిక చేయనున్నారు. రూ.50 వేల లోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ–1లో చేర్చారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉన్న దరఖాస్తుల దారులను కేటగిరీ–2లో, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ–4లో చేర్చారు. కేటగిరీ 1 కింద వందశాతం రాయితీతో రూ.50 వేల రుణం మంజూరు చేయనున్నారు. -
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు
సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా సరిహద్దులలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువుల రవాణా విషయంలో వెటర్నరీ వైద్యుల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. పశు సంవర్థక శాఖ సిబ్బందితో షిఫ్ట్ల వారీగా సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చట్ట విరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. తప్పిపోయిన మహిళ మృతదేహమై లభ్యం చిన్నశంకరంపేట(మెదక్): రెండు నెలల కిందట తప్పిపోయిన మహిళ అడవిలో అస్థి పంజరమై కనిపించిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారం అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసి ంది. పేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. నిజా ంపేట మండలంలోని రజాక్పల్లి గ్రామానికి చెందిన వజ్జె బాల మల్లవ్వ(54) మార్చి 13న మండలంలోని భగీరథపల్లిలోని బీరప్ప జాతరకొచ్చి తప్పిపోయింది. మహిళ మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఎక్కడికో వెళ్లిపోయింది. మరుసటి రోజు 14న బాధితురాలి కుమారుడు వజ్జె శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మంగళవారం సూరా రం అటవీ ప్రాంతంలో మానుకుంట బండ రాళ్ల వద్ద కుళ్లిపోయిన మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి మల్లవ్వగా గుర్తించారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆల్ఫాజోలమ్ పట్టివేత వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం నెంటూరులో ఓ ఇంటిపై మంగళవారం జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేశారు. సోదాలో 330 గ్రాముల ఆల్ఫాజోలమ్ దొరికినట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ఎకై ్సజ్ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, సీఐలు కే.శ్రీధర్, బ్రహ్మానంద రెడ్డి, ఎస్ఐలు సాయికృష్ణ, శ్రీనివాస్, హెచ్సీలతో కూడిన బృందం నెంటూరులోని గౌరయ్యగారి ప్రకాశ్గౌడ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3,30,000 విలువైన చేసే 330 గ్రాముల ఆల్ఫాజోలమ్ దొరికింది. ప్రకాశ్గౌడ్ను విచారించగా దానిని రాయపోలు మండలానికి చెందిన కొత్తపల్లి సత్యనారాయణ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఆల్ఫాజోలమ్ను సీజ్ చేశామని, ప్రకాశ్గౌడ్తోపాటు సత్యనారాయణను అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
సీఎం పర్యటన విజయవంతం చేయాలి
సంగారెడ్డి జోన్/జహీరాబాద్: జహీరాబాద్ లో ఈనెల 23న జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోశ్ పంకజ్తో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ...ీసీఎం పర్యటనలోభాగంగా రూట్ మ్యాప్, సెక్యూరిటీ బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, హెల్త్ క్యాంప్, హెలిప్యాడ్ తదితర ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయం, నిమ్జ్ రోడ్డు, ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం సభ కోసం ఏర్పాట్లు ముమ్మరం సీఎం జహీరాబాద్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభా వేదిక ఏర్పాట్లను ఆర్డీఓ రాంరెడ్డి, డీఎఫ్ఓ శ్రీధర్రావు, తహసీల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావులు పర్యవేక్షించారు. మైదానంలో హెలికాప్టర్ దిగేందుకు వీలుగా రూ.3.50లక్షల వ్యయంతో సీసీ నిర్మాణం పనులను ఆర్అండ్బీ శాఖ అధికారులు చేపట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
రేషన్ బియ్యం పక్కదారి!
కల్హేర్(నారాయణఖేడ్): అక్రమంగా పక్కదారి పట్టిస్తున్న 40 టన్నుల పీడీఎస్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. ఘటనకు చెందిన వివరాలిలా ఉన్నాయి. లారీలో అక్రమ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి సిర్గాపూర్ మండలం పోచాపూర్ చౌరస్తా వద్ద ఎస్ఐ డి.వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని గురిమిట్కల్ నుంచి కామారెడ్డి జిల్లా పిట్లంకు వెళ్తున్న లారీలో అక్రమ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు లారీలో ఉన్న బియ్యా న్ని పరిశీలించి వాటిని పీడీఎస్ బియ్యంగా ధ్రువీకరించారు. వెంటనే లారీని, పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఖేడ్ ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. సివిల్ సప్లయ్ డీటీ సాజియోద్దిన్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అనిల్కుమార్, యజమాని జాకీర్మియాపై కేసు నమోదు చేశారు.నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి: ఏడీఏనారాయణఖేడ్: రానున్న వానాకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను విక్రయించాలని ఖేడ్ సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్కుమార్ సూచించారు. నాగల్గిద్ద మండల కేంద్రంలో ఫర్టిలైజర్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డారు. అధిక ధరలకు విత్తనాలు, మందులు అమ్మినా, నాసిరకం పురుగు మందులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మండల వ్యవ సాయ అధికారి ప్రవీణ్చారి పాల్గొన్నారు. కేంద్రానికి గుణపాఠం చెప్పాలిసీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య పటాన్చెరు టౌన్: పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం పటాన్చెరు పారిశ్రామికవాడలో పలు పరిశ్రమల్లో కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించిందన్నారు. ఇవి అమలయితే దేశంలోని కార్మిక వర్గం పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను భారత్ –పాక్ యుద్ధ పరిణామాల దృష్ట్యా జూలై 9కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న అధికారులను ఆదేశించారు. మంగళవారం సిర్గాపూర్ మండల పరిషత్తు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వార్షిక బడ్జెట్ నిధుల ఖర్చు, తదితర వివరాలు సేకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్సుర్, సూపరింటెండెంట్ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పటాన్చెరు డీఎస్పీగా ప్రభాకర్
పటాన్చెరు టౌన్: పటాన్చెరు నూతన డీఎస్పీగా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ డీజీ కంట్రోల్రూమ్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ పటాన్చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన డీఎస్పీ రవీందర్రెడ్డి హైదరాబాద్ డీజీపీ ఆఫీస్కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ...ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో ముందుంటామని తెలిపారు. మహిళ ల భద్రత కోసం బస్టాండ్లో, విద్యాసంస్థలు వద్ద షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బదిలీపై వెళ్తున్న డీఎస్పీ రవీందర్రెడ్డి పదవీ బాధ్యతలను డీఎస్సీ ప్రభాకర్కు అప్పగించారు. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుపటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీకాలనీ వేణుగోపాలస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కంకణధారణ, స్వామివారి అభిషేకం, హోమం, హరినామ సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం చేశారు. -
రూ.3 కోట్లతో సుందరీకరణ పనులు
జోగిపేట పట్టణంపై సర్కారు ప్రత్యేక దృష్టిసంగుపేట వద్ద నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడంతో జోగిపేట కళ తప్పినట్లయ్యింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు చాలావరకు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి జోగిపేట పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి నర్సరీ కాలేజీ, 150 పడకల ఆస్పత్రి, రూ.90 లక్షలతో అజ్జమర్రిరోడ్డు, పాలిటెక్నిక్, కేజీబీవీ పాఠశాలలకు ప్రహరీలు ఏర్పాటు, రెండు బస్టాండ్ల నిర్మాణం, సంగుపేట వద్ద నుంచి అన్నాసాగర్ వరకు ఫోర్లైన్ రోడ్డు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. వ్యాపారపరంగా చాలావరకు దెబ్బ తినడంతో ఆందోళన చెందుతున్నారు. గాంధీ, వివేకానంద పార్కులు, జంక్షన్లు, ఆర్చీలు ఏర్పాటుతో పట్టణానికి కొత్త కళ రానుంది.● గాంధీ, వివేకానంద పార్కుల అభివృద్ధికి నిధులు ● జంక్షన్లు, ఆర్చీల ఏర్పాటుకు ప్రతిపాదనలుజోగిపేట(అందోల్): జోగిపేట పట్టణ సుందరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపాలిటీ ఏర్పడి పదేళ్లు పూర్తయినా మున్సిపాలిటీ పేర కనీసం ఆర్చీలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పట్టణంలోని ప్రధాన మూల మలుపుల వద్ద జంక్షన్లు, సంగారెడ్డి, మెదక్ పట్టణాల వైపు వెళ్లేదారుల్లో మున్సిపాలిటీ శివారు ప్రాంతంలో రెండు ఆర్చీలను ఏర్పాటు చేసేందుకు స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కులో బహిరంగ మూత్ర విసర్జన, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి..గాంధీ పార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. పార్కులో లైటింగ్, గ్రీనరీ పార్కులాంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. అయితే గాంధీపార్కు అభివృద్ధి పనులకు అంత పెద్దమొత్తంలో నిధులు అవసరం లేదని సగం నిధులు అందోలు లోని వివేకానంద విగ్రహం వద్ద మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించేందుకు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మూడెకరాల్లో గార్డెనింగ్, లైటింగ్ ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయారు చేయాలని కూడా మంత్రి సూచించినట్లు సమాచారం.జోగిపేట గాంధీ పార్కురూ.కోటితో జంక్షన్లు అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు, ఫైర్ స్టేషన్ వద్ద, పొట్టి శ్రీరాములు విగ్రహం చౌరస్తా వద్ద జంక్షన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రి చేసినట్లుగా చెబుతున్నారు. ఏడాది కాలంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. బైపాస్తో దెబ్బతిన్న వ్యాపారాలు -
ఈదురు గాలుల బీభత్సం
నారాయణఖేడ్/కల్హేర్ (నారాయణఖేడ్): నారాయణఖేడ్ ప్రాంతంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ర్యాకల్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ర్యాకల్, పోతన్పల్లి, పలుగు తండా తదితర శివార్ల మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్తు లైనుకు సంబంధించి ఏడు విద్యుత్తు స్థంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్తు సబ్స్టేషన్ పరిధిలోని పలుగ్రామాలు, తండాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుగుతండాలోని పలు ఇళ్ల రేకులు ఎగిరి కింద పడ్డాయి. కల్హేర్, నిజాంపేట్ మండలాల్లో ఖానాపూర్(కె), కృష్ణాపూర్, నాగధర్, తదితర చోట్ల్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రల వద్ద వరి, జొన్న ధాన్యం తడిసిపోయింది. ఖానాపూర్(కె)లో బాలకిష్టయ్య ఇంటిపై వర్షం ధాటికి చెట్టు విరిగిపడి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైంది. మాజీ జెడ్పీటీసీ రవీందర్నాయక్, ఆర్ఐ మాధవరెడ్డి పలుగుతండాను సందర్శించి బాధితులను ఓదార్చారు. సంజీవన్రావుపేట్లో పొలం వద్ద చెట్టుకు కట్టేసిన నర్సయ్యకు చెందిన పాడెగేదె పిడుగుపాటుకు మృతి చెందింది. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు పిడుగుపాటుకు గేదె మృతి ఎగిరిపడ్డ ఇంటి పైకప్పు రేకులు -
చిరకాల స్వప్నం..తీరెను కష్టం
జహీరాబాద్: ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్...రయ్..మంటూ పరుగులు పెట్టనున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభించేందుకు వీలుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, ఇందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ఏడేళ్లకు మోక్షం రైల్వే ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన ఏడు సంవత్సరాలకు పూర్తి చేశారు. ప్రయాణికుల కష్టాలను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నిధులు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణం పనులు 2018 ఆగస్టు 30న చేపట్టారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. పట్టణ ప్రజలతోపాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై ఎల్ఈడీ లైట్ల వెలుగులు రైల్వే ఓవర్బ్రిడ్జిపై ఎల్ఈడీ విద్యుత్ దీపాలను బిగించారు. కిలో మీటరు పొడువునా బిగించిన లైట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డుపై కూడా వెలుతురు ఉండేలా బిగించారు. బ్రిడ్జికిరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి దిగువన మొగుడంపల్లి క్రాస్ రోడ్డు నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలను బిగించారు. రూ.వంద కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి 23న ప్రారంభించనున్న సీఎం రేవంత్ తీరనున్న వాహనదారుల వెయిటింగ్ కష్టాలు -
ఏరువాక సాగాలో...
యువ వికాసం.. ఉపశమనం యువ వికాసంకు సిబిల్ స్కోర్తో సంబంధంలేదని ప్రభుత్వం చెప్పడంతో యువతలో ఆందోళనకు తెరపడింది. వివరాలు 8లో uనత్తనడకన ధోబీ ఘాట్లు న్యాల్కల్ మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ధోబీ ఘాట్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. వివరాలు 9లో uబుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో ఈ ఏడాది వానాకాలం (ఖరీఫ్)లో జిల్లాలో 2,98,718.22 హెక్టార్లలో వివిధ రకాలు పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా పత్తి పంట అత్యధికంగా 1,43,817.81 హెక్టార్లలో సాగు చేయనున్నారు. రెండో ప్రధాన పంటగా వరి పంటను 59,424.7 హెక్టార్లలో సాగు జరగనుంది. కంది పంట 32,044.53 హెక్టార్లు, సోయాబీన్ 29,817.81హెక్టార్లు, పెసర 5,749.39 హెక్టార్లు, మినుము 3,465.59 హెక్టార్లు, చెరుకు 7,957.09హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.25, హార్టికల్చర్లో 9,898.79 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వీటితోపాటు కొర్రలు, రాగులు, సామలు, స్వీట్కార్న్, ఎర్ర జొన్నలు, ప్యారాగ్రాస్, ఉలువలు, వేరుశనగ, ఆవాలు, సామలు, గడ్డినువ్వులు, పొద్దుతిరుగుడు, హనుములు, బెబ్బర్లు తదితర పంటలను తక్కువ మోతాదులో సాగు చేసే అవకాశం ఉంది. 2.98లక్షల హెక్టార్లలో పంటల సాగునారాయణఖేడ్: ఈసారి రుతుపవనాలు ముందుస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతుండటం, అడపా దడపా జల్లులు కురుస్తూ వాతావరణం చల్లబడుతుండటంతో రైతులు వేసవి దుక్కులు దున్నడం ముమ్మరంగా చేపడుతున్నారు. వ్యవసాయ అధికారులు సైతం పంటసాగు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తే ఇప్పటికే చాలామంది రైతులు వేసవి దుక్కులు దున్నడం పూర్తి చేయగా మిగతా రైతులు దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి ముందుగానే... ఈ ఏడాది ఊహించినదానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కొద్దిరోజులుగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని పేర్కొంది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. వేసవి దుక్కులతో ప్రయోజనం వేసవి దుక్కులతో నేల సారవంతం అవుతుందని, నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూమి లోపలి గట్టి పొరలు పగులగొట్టడం వల్ల వేరు వ్యవస్థ ధృడంగా లోపలికి వెళ్లి బలంగా ఉంటుందని, భూమి కోతకు గురి కాకుండా అడ్డు కట్ట వేస్తుందని సూచిస్తున్నారు. తేమ శాతం పెరిగి కలుపు నివారణ, పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. పంట దిగుబడి పెరిగి ఎరువుల ఖర్చు తగ్గుతుందని, ఎండ వేడిమికి పురుగుల అవశేషాలు చనిపోతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వేసవిలో కనీసం 30 సెంటీమీటర్ల లోతుగా దుక్కిదున్నాలని, గట్టి పొరలు పగిలి భూమి తేమ, పోషకాలు పెరుగుతాయని ఏడీఏ నూతన్ కుమార్ వివరించారు. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల తొలకరివాన నీరు భూమిలోకి ఇంకేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలను ఉంచడం వల్ల వాటి విసర్జక వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా భూమికి ఉపయోగ పడగలదు.న్యూస్రీల్ముమ్మరంగా సాగుతున్న వేసవి దుక్కులు ముందుగానే రుతుపవనాలు! ఈసారి సాధారణంగా కంటే అధిక వర్షాలు దుక్కులు దున్నుతున్నాం... వేసవి దుక్కులు దున్నతున్నాం. ఎకరం భూమిలో గంటలకు రూ.1వేయి చొప్పున వెచ్చించి నాలుగు గంటల వ్యయంతో ట్రాక్టర్తో దున్నిస్తున్నా. వర్షాలు కురియగానే మరోమారు చిన్న నాగలితో దున్నించి గీతలు వేసి పత్తి పంట సాగు చేస్తా. ఈసారి వర్షాలు బాగుంటాయని అధికారులు అంటున్నారు. – ప్రవీణ్కుమార్, రైతు, వెంకటాపూర్ -
జాతీయ స్థాయిలో రాణించాలి
తూప్రాన్: సాఫ్ట్బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్రావు అన్నారు. పట్టణ సమీపంలోని బాలుర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 11వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించి విద్య, ఉద్యోగాల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అభిషేక్గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, తెలంగాణ అసోసియేషన్ కోశాధికారి రేణుక, సంయుక్త కార్యదర్శి రాజేందర్, మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిప్యాక నారాయణ గుప్త, ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ, కోశాధికారి గోవర్దన్ గౌడ్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కార్యదర్శులు నాగిరెడ్డి, గంగా మోహన్, వెంకటేశ్, రాజశేఖర్, క్రీడాకారులు, కోచ్లు, మాజీ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభం -
పచ్చిరొట్ట.. సాగుకు దిట్ట
జిల్లాకు పచ్చిరొట్ట విత్తనాలు ● 5,320 క్వింటాళ్లు మంజూరు ● జీలుగ, జనుము విత్తనాల పంపిణీకి కసరత్తు చేస్తున్న అధికారులు జహీరాబాద్ టౌన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పచ్చిరొట్ట ఎరువులు వేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానా కాలం సీజన్ ప్రారంభంతోనే జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేయడానికి ప్రణాళిలు సిద్ధం చేస్తుంది. అవసరాలకు అనుగుణంగా మండలానికి విత్తనాలను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు 3,380 క్వింటాళ్ల జీలుగ, 1,850 క్వింటాళ్ల జనుము విత్తనాలు మంజూరయ్యాయి. మండల వారీగా విత్తనాల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూమిలోని సారం పూర్తిగా తగ్గుతుంది. భూసారం పెంపునకు పచ్చిరొట్ట ఎరువులు వాడాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తుంది. జీలుగ, జనుము విత్తనాలను తొలకరి వర్షాలు కురువడంతోనే విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు. విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలు కిలో ధర రూ. 142.50 ఉంది. ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించగా రైతుకు రూ.71.50 లభిస్తుంది. 30 కిలోల బస్తా రూ.2,137.50 దొరుకుతుంది. జనుము కిలో విత్తనం ధరం రూ.125.30 ఉండగా రాయితీ పోనూ రైతుకు రూ.62.75 వస్తుంది. 40 కిలోల బస్తా ఒక్కోటి రూ.2,510కి రైతుకు లభిస్తుంది. మండల వారీగా విత్తనాల మంజూరు జిల్లాకు 5,320 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలు మంజూరయ్యాయి. 3,380 క్వింటాళ్ల జీలుగ, 1,850 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉన్నాయి. అందోల్కు 450 క్వింటాళ్లు, చౌట్కూర్కు 160, గుమ్మడిదలకు 110, హత్నూరకు 340, ఝరాసంగంకు 180, జిన్నారానికి 190, కల్హేర్కు 260, కోహీర్కు 180, కంగ్టికి 200, కొండాపూర్కు 340, మనూర్కు 40, మొగుడంపల్లికి 80, మునిపల్లికి 180, నారాయణఖేడ్కు 200, నిజాంపేట 160, న్యాల్కల్కు 210, పటాన్చెరుకు 260, పుల్కల్కు 410, రాయికోడ్కు 120, రాంచంద్రపురానికి 80, సదాశివపేటకు 240, సంగారెడ్డికి 400, సిర్గాపూర్కు 60, వట్పల్లికి 140, జహీరాబాద్కు 240 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయి. త్వరలో విత్తనాలు పంపిణీ జిల్లాకు మొదటి విడత కింద జీలుగ, జనుము విత్తనాలు మంజూరయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు త్వరలో పంపిణీ మొదలు పెడుతాం. పంపిణీ కేంద్రాలను ఎంపిక చేశాం. రైతులు ఆధార్ కార్డు, పట్టా పాసు పుస్తకంతో మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. పచ్చిరొట్ట వల్ల నేలలో మొక్కలకు భాస్వరం, పోటాష్ అందడమే గాక గాలిలోని నత్రజని నేలలో స్థిరీకరించబడుతుంది. సూక్ష్మ పోషకాలు మొక్కలకు లభ్యమై పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. పంట వేళ్లు కూడా ఆరోగ్యం, పటుత్వం పెరుగుతుంది. ఒక్కో బస్తా ఎకరానికి కంటే ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ -
అక్రమంగా వరి విత్తనాలు నిల్వ
అంకాపూర్ డీలర్పై కేసు నమోదునిజాంపేట(మెదక్): అక్రమంగా నిల్వ ఉంచిన మూడు టన్నుల వరి విత్తనాలను సోమవారం నిజాంపేట మండలానికి చెందిన వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకొని డీలర్పై కేసు నమోదు చేశారు. అధికారుల కథనం మేరకు.. మండలంలోని కల్వకుంటలో అక్రమంగా మూడు టన్నుల వరి విత్తనాలు నిల్వ ఉన్నట్లు సమాచారం అందింది. తనిఖీలు చేపట్టి సదరు విత్తనాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ విత్తనాలను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని రేయిన్ బో అగ్రిటెక్ డీలర్ వద్ద నుంచి సరఫరా అయినట్లు గుర్తించాం. విత్తనాలు స్వాధీనం చేసుకొని దుకాణానికి సీల్ చేశాం. సదరు డీలర్ మోహన్పై కేసు నమోదుకు జిల్లా అధికారులకు సిఫార్స్ చేసినట్లు వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా అనుమతులు లేని విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చెక్ డ్యామ్లో మునిగి విద్యార్థి మృతి
హవేళిఘణాపూర్(మెదక్): ఈతకు వెళ్లి చెక్ డ్యామ్లో మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం యూసుఫ్పేట గ్రామానికి చెందిన నిర్మల, ఉపేందర్రెడ్డి చిన్న కుమారుడు గౌతమ్రెడ్డి(16) పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో వారి చిన్నాన్న స్వగ్రామం మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి వచ్చాడు. 17న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోని చెక్ డ్యామ్లోకి ఈతకెళ్లి నీట మునిగాడు. శనివారం రాత్రి వరకు ఇంటికి రాకపోడంతో వెతకగా ఆదివారం చెక్ డ్యామ్ శివారులో ఫోన్, చెప్పులు, బట్టలు కనిపించాయి. అనుమానంతో చెక్ డ్యామ్లో గాలించగా సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలాన్ని మెదక్ రూరల్ పోలీసులు పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రహరీ గోడను ఢీకొని వ్యక్తి తూప్రాన్: ప్రహరీ గోడను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ సమీపంలోని కరీంగూడ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము జగన్(30) బోర్ మెకానిక్. ఆదివారం రాత్రి తూప్రాన్లో స్నేహితులను కలిసేందుకు బైక్పై ఇంటి నుంచి వచ్చాడు. సోమవారం ఉదయం తూప్రాన్ పట్టణ సమీపంలో గోడను ఢీకొని మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ప్రమాదవశాత్తు గోడను ఢీకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి గజ్వేల్రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మక్తమాసాన్పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇసకంటి నర్సింలు(45)కు భార్య మంజులతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సింలు తనకున్న 2 ఎకరాల భూమిలో పంటలు సాగు చేయడంతోపాటు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రెండేళ్ల కిందట కూతురు వివాహం జరిపించాడు. ట్రిపుల్ఆర్లో తనకున్న 2 ఎకరాల భూమి పోతుండటంతో తాము బతికేదెలా అంటూ తీవ్ర మనోవేదనకు గురైన నర్సింలు 10 రోజుల కిందట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స కోసం వంటిమామిడిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులోని ఓ హోటల్లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి అయన హాజరై, మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవడంలో యువజన కాంగ్రెస్ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో యువజన కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జి శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్, జిల్లా ఇన్చార్జి నాగార్జున, వివిధ నియోజకవర్గాల, మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
దేశ సేవ కోసం పిలుపు..
సంగారెడ్డి క్రైమ్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ యువతీ యువకులను దేశ సేవ కోసం ఆహ్వానిస్తుంది. మేరా యువ భారత్ పథకంలో భాగంగా పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలని యువతను సమీకరిస్తుంది. 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు అర్హులుగా పరిగణించింది. మై భారత్ పోర్టల్లో తమ పేర్లను మొదటగా రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించింది. ఉచిత శిక్షణ యువకుల్లో బలమైన పౌర బాధ్యత క్రమశిక్షణ పెంపొందించడం మేరా యువ భారత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం. వారం రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. నమోదు ప్రక్రియ చాలా సరళంగా ఉంది. అధికారిక మై భారత్ పోర్టల్లో అడిగిన వాటికి తమ వివరాలు పొందుపరచాలి. అనంతరం సబ్మిట్ చేయాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైబ్ను సంప్రదించాలి. వలంటీర్ల సేవలు ● దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రజలను కాపాడడం. ● గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేయడం. పరిస్థితి విషమంగా ఉంటే దగ్గరగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించడం. ● ట్రాఫిక్ నిర్వహణ ద్వారా జన సముదాలను నియంత్రించడం. ● విస్తృత శ్రేణి సేవల ద్వారా స్థానిక అధికారులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం. ● విపత్తు వేళా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ పడటం. పౌర రక్షణ వలంటీర్లకు దరఖాస్తులు ఆహ్వానం 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులకు అవకాశం -
దేశాన్ని కాపాడుకోవాల్సింది యువతనే
సిద్దిపేటకమాన్: పదేళ్ల కాలంలో దేశం మేకిన్ ఇండియా పేరిట గుండు సూది నుంచి ఫిరంగి వరకు మనమే తయారు చేసుకున్నామని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి లాల్ కమాన్ వరకు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఫహల్గాం దాడిలో అమరులైన వారిని, యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్లను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. ప్రపంచం మన శక్తి గురించి ఆలోచన చేస్తుందన్నారు. ఆడబిడ్డల సింధూరాన్ని తుడచాలని చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ను లేకుండా చేస్తామన్నారు. మన దేశానికి ముప్పు వస్తుందంటే మనం కూడా యూనిఫామ్ లేని సైనికుల వలె సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడాల్సింది యువతనేని అన్నారు. భారత్ మాతకీ జై అంటూ జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఐటీఐ కళాశాల భవనం పరిశీలన దుబ్బాక : అభివృద్ధి పనులు ఏళ్లుగా నత్తనడకన సాగడంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దుబ్బాక పట్టణంలోని ఐటీఐ కళాశాల భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన ఐటీఐ కళాశాల భవనం నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉండటంతో విచారం వ్యక్తం చేశారు. పూర్తి కావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అనంతరం పలు శుభకార్యాల్లో పాల్గొనడంతోపాటు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సుభాష్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ప్రవీణ్ కుమార్, వెంకట్ గౌడ్, భాస్కర్, బాచీ, తదితరులు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు సిద్దిపేట పట్టణంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ -
నేరుగా సంప్రదించండి
మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిమెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. -
మోటార్లకు వెంటనే మరమ్మతు
నారాయణఖేడ్: బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల కోసమే నాయకులు శ్రద్ధ చూపారని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆరోపించారు. నాగల్గిద్ద మండలం గూడూరు పంప్హౌస్లో చెడిపోయి పడి ఉన్న 75 హెచ్పీ మోటార్లను ఆయన సోమవారం పరిశీలించారు. రెండు మోటార్లను వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు ఆదేశించారు. నీటి సమస్య ఎక్కడ ఉన్నా అధికారులు తక్షణం స్పందించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కరస్గుత్తి శివారులో మీరాబాయి రావణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎస్టీఎస్ డీసీ నిధులతో బోరు మోటారు ఢ్రిల్లింగ్ పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే.. కరస్గుత్తి తండాలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. నాయకులు నారాయణ జాదవ్, శ్రీకాంత్, అనిల్ పాటిల్, రహీం, అంబ్రేష్ పాల్గొన్నారు. 75 మందికి చెక్కుల పంపిణీ నాగల్గిద్ద మండల కేంద్రంతోపాటు, ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఖేడ్, నిజాంపేట్ మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఖేడ్, నిజాంపేట్ మండలాలకు చెందిన 75మంది లబ్దిదారులకు రూ.20.98లక్షల విలువగల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు వినోద్పాటిల్, మాజీ ఎంపీటీసీలు పండరిరెడ్డి, దత్తాగౌడ్, నాయకులు శంకర్ ముదిరాజ్, రాంరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రాధాకిషన్, లింగారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశం -
వయసు రెండేళ్లు.. రికార్డులు ఆరు
సంగారెడ్డి జోన్: అతి చిన్న వయసులో జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధించాడు ఆ బుడతడు. పటాన్చెరులో నివాసం ఉంటున్న అపురూప–సత్యనారాయణరెడ్డిల రెండు సంవత్సరాల కుమారుడు రుద్రాన్స్రెడ్డి చిన్న వయసులో ఎక్కువ దూరం నడిచి రికార్డులు సొంతం చేసుకున్నాడు. రుద్రాన్స్ 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్ల దూరం, గంట వ్యవధిలో 4.29 కిలోమీటర్లు ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు సొంతం చేసుకున్నాడు. గంట వ్యవధిలో 4.29 కిలోమీటర్ల దూరాన్ని ఏకకాలంలో నడిచినందుకుగాను ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్రాండ్ మాస్టర్ టైటిల్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలామ్స్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కించుకున్నాడు. తాత నరేందర్రెడ్డి ప్రోత్సహంతోనే రికార్డులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తన కార్యాలయంలో చిన్నారిని అభినందించి, సన్మానించారు. రుద్రాన్స్ని మంచి క్రీడాకారుడిగా తయారు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.చిన్నారిని అభినందించిన కలెక్టరు -
పలువురు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి. ● జహీరాబాద్ డీఎస్పీ కె.రామ్మోహన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న బి.సైదాను జహీరాబాద్ డీఎస్పీగా నియమించింది. ● పటాన్చెరు డీఎస్పీ పి.రవీందర్రెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్రూంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎస్.ప్రభాకర్కు పటాన్చెరు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని సైదాబాద్ ఏసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూం ఏసీపీగా ఉన్న జే.నరేందర్గౌడ్కు తూప్రాన్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీఎస్పీగా పనిచేస్తున్న పురుషోత్తంరెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్న కె.నర్సింలుకు గజ్వేల్ డీఎస్పీగా నియమితులయ్యారు. ● సిద్దిపేట ఏసీపీ జి.మధును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రవీందర్రెడ్డి నియమించారు. ● సిద్దిపేట డీసీఆర్బీ ఏసీపీ శంకర్రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా నియమించారు. ● హుస్నాబాద్ డీఎస్పీ వి.సతీష్కు జీడీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్.సదానందంను నియమించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. -
23న జహీరాబాద్కు సీఎం రాక
జహీరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 23వ తేదీన జహీరాబాద్కు రాక సందర్భంగా కలెక్టర్ క్రాంతి ఎంపీ సురేష్శెట్కార్ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. హుగ్గెల్లి జంక్షన్ వద్ద ప్రతిష్ఠించిన బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. వేదిక ఏర్పాటు చేయాల్సిన దిక్కు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఝరాసంగంలోని కేంద్రీయ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆరా తీశారు. సుమారు రూ. 100కోట్లతో నిర్మించిన నిమ్జ్ ప్రాజెక్టులోకి వెళ్లే రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్హాల్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం, ముందు భాగంలోని అల్ఫా మైదానంలో చేపట్టాల్సిన సభా వేదిక ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచ నలు చేశారు. అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్లు మాధురి, ఎ.చంద్రశేఖర్, ఆర్డీఓ రామ్రెడ్డి, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ శివలింగంలతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని ఎంపీ సురేష్శెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డిలు కార్యకర్తలను కోరారు.సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎంపీ -
ప్రజావాణిలో 44 అర్జీలు
సంగారెడ్డి జోన్: అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 44 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, తదితరులు పాల్గొన్నారు. భారత్ సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందిఎమ్మెల్సీ అంజిరెడ్డి సంగారెడ్డి ఎడ్యుకేషన్: మన దేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ మన దేశ ఆర్మీ వీరోచితంగా పోరాడి విజయం సాధించిందని, ఇక భవిష్యత్లో దేశ పౌరులపై దాడి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, రమేష్, రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, మాణిక్యరావు పాల్గొన్నారు. లావణ్యకు కెమిస్ట్రీలో పీహెచ్డీ పటాన్చెరు: మండల పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని లావణ్య డాక్టరేట్కు అర్హత సాధించారు. బయోమైక్రో మాలిక్యూల్స్తో కూమరిన్ అనలాగ్లను బంధించడం, వాటి యాంటీ ఆక్సిడెంట్ అధ్యయనాలపై, బయోఫిజికల్ అంతర్దృష్టులపై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బిజయ కేతన్ సాహూ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ లావణ్య పరిశోధనకు మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు మరింత మద్దతు ఇచ్చాయని, ఆయా విధానాలపై లోతైన అంతర్దృష్టులను అందిస్తున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ లావణ్య సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొ ఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అభినందించారు. ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయండిఐకేపీ ప్రాజెక్టు మేనేజర్ జయశ్రీరాజ్ నారాయణఖేడ్: స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజరు జయశ్రీరాజ్ సూచించారు. నారాయణఖేడ్ మండలం కొండాపూర్, గంగాపూర్, తుర్కాపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తరచూ వర్షాలు కురుస్తున్నందున కొనుగోళ్లను ముమ్మరం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ఏపీఎం వంశీకృష్ణ, సీసీ అశోక్ గౌడ్, వీఓఏలు సుల్తానా, సమత ఉన్నారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులువ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పటాన్చెరు: రైతులు రసాయనాల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులతో రైతులు అధిక దిగుబడులు పొందాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ రాధిక డాక్టర్ హిమబిందు, డాక్టర్ శస్ట్రీన్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దకంజర్ల, లక్డారం, గ్రామాలలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులకు నష్టాలు తగ్గించి రైతే రాజుగా లాభాలను పెంచే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. -
మారిన ఉపాధి ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల ఎంపికలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మట్టి పనులను పూర్తిగా తగ్గించి.. ఆస్తులు సృష్టించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలని పేర్కొంది. అలాగే పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు, కిచెన్షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసింది. ‘పూడిక తీత’ తగ్గించండి ఈ పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమర్కుల ‘మేత’ కూడా ఎక్కువగా ఉంటోంది. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు చాలా మటుకు ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పూడిక తీత పనుల అంచనాల తయారీని తగ్గించారు. 2.11 లక్షల మంది కూలీలు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లా లో 657 గ్రామాల్లో పనులు నడుస్తున్నాయి. మొత్తం 2.19 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. ఈ జాబ్కార్డుల్లో మొత్తం 4.03 లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో రెగ్యులర్గా ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య 2.11 లక్షల మంది ఉంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.30.96 కోట్ల మేరకు పనులు చేపట్టారు. నీటి సంరక్షణ పనులు కూడా.. నీటి సంరక్షణ పనులు కూడా ఈసారి ఉపాధి హామీ పనుల్లో చేపట్టనున్నారు. ప్రధానంగా చెక్డ్యాంలు, పర్కులేషన్ట్యాంకులు, ఓపెన్వెల్స్, ఫాంపాండ్లు, వాటర్ హార్వేస్టింగ్ పాండ్లు, రూఫ్ హార్వేస్టింగ్ స్ట్రక్చర్లు, బోర్వెల్ రీచార్జి కట్టడాలు వంటి పనులను కూడా ఈసారి ఉపాధి హామీలో చేపడుతారు.మట్టి పనులు తగ్గించి.. ఆస్తులు సృష్టించే పనులు ఎంపిక జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత పూడికతీత పనులు తగ్గించాలని ఆదేశాలుప్రాధాన్యత పనులకు లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో ఈ పథకం కింద చేపట్టనున్న పనులకు సంబంధించిన లక్ష్యాలను కూడా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పనులను వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 54 అంగన్వాడీ కేంద్రాల భవనాలు, 54 చోట్ల పాఠశాలల కిచెన్షెడ్లు, ప్రహరీగోడలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో లింకు రోడ్లకు కూడా ఈ నిధులను కేటాయించనున్నారు. -
పుచ్చలపల్లికి నివాళి
పటాన్చెరు టౌన్: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ‘సమకాలిన పరిస్థితులు–మన కర్తవ్యం’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... పుచ్చలపల్లి సుందరయ్య ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నాగేశ్వరరావు, పాండు రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీర రావు, రామారావు, సురేందర్ రెడ్డి, జయరాం నారాయణ పాల్గొన్నారు. -
ఘనంగా 155వ సంకీర్తన
జహీరాబాద్: నిర్దయ కలిగిన వ్యక్తుల పట్ల జాలి, కరుణ చూపించడం తగదని స్థానిక హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి డాక్టర్ వినోద్ప్రభు అన్నా రు. ఆదివారం ఉదయం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్లో 155వ నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... శత్రువులకు ఎదుటివారి సామర్థ్యం, సత్తా తెలిసినప్పటికీ నిర్దయగల మాటలతో దూషిస్తూనే ఉంటారన్నారు. అలాంటి వారి పట్ల అవాంచితమైన జాలిని చూపడం వీరుడి లక్షణం కాదని, ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించారని వివరించారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని హితవు పలికారు. అంతకు ముందు పట్టణంలోని సుభాష్గంజ్లోని పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు అల్లాడి వీరేశం, అల్లాడి నర్సింహులు, కల్వ శేఖర్, లక్ష్మణ్, సాయిరెడ్డి విఠల్రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, హరేకృష్ణ బృందం సభ్యులు రతన్ సారడా, వెంకటేశ్, జయప్రకాష్, విజయ్, ఎన్నం రఘు, జానకిరామ్, మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక, కన్నయ్య వేషధారణలో పాల్గొన్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి వినోద్ప్రభు -
వేసవి శిబిరాలు.. కలల సాకారాలు
● ఎమ్మెస్ క్రికెట్ అకాడమీలోశిక్షణ శిబిరాలు ● ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తర్ఫీదు ● జిల్లా స్థాయిలో క్రికెట్లో రాణిస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలుజాతీయ స్థాయిలో ఆడటమే ఆశయం ప్రస్తుతం అండర్ –14 విభాగంలో ఆల్రౌండర్ ప్రతిభతో జిల్లా స్థాయిలో రాణిస్తున్నా. విరాట్ కోహ్లీకి వీరాభిమానిని. శిక్షణ పొందుతూ ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆడాలన్నదే నా ఆశయం. – చందన, అండర్ 14 జట్టులో స్థానమే లక్ష్యం డిగ్రీ చదువుతూ అండర్ 23లో రాణిస్తున్నా. అటు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆడి ప్రశంసలు అందుకున్నా. హెచ్సీఏ వేసవి శిబిరాలు పేద విద్యార్థులకు వరం లాంటివి. జాతీయ స్థాయి జట్టులో ఆడటమే నా లక్ష్యం. – నవీన్, అండర్ 23 సంగారెడ్డి క్రైమ్: విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులతో సందడిగా మారాయి. క్రికెట్ను మనదేశంలో పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విద్యార్థులు ఒక మెట్టు ముందే ఉన్నారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే తమ అభిమాన క్రికెటర్లా ఎదగాలని కలలు కంటున్నారు. వాటిని సాకారం చేసుకునేందుకు వేసవి సెలవుల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లోని ఎమ్మెస్ క్రికెట్ అకాడమీలో హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎమ్మెస్ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి శిక్షణ శిబిరాలను ప్రారంభించిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అకాడమీలో ప్రాక్టీస్ కొనసాగుతోంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల బాల,బాలికలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. విద్యార్థులకు క్రికెట్లో శిక్షణ ఎమ్మెస్ క్రికెట్ అకాడమీలో ప్రధాన కోచ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో విద్యార్థులకు తగిన మెలకువలు నేర్పిస్తున్నారు. క్రీడల్లో శిక్షణ పొందేందుకు విద్యార్థులు భారీగా బారులు తీరుతున్నారు. తెల్లవారు జామున విద్యార్థులు అకాడమీకి చేరుకుంటున్నారు. అకాడమీలో విద్యార్థులకు తగిన శిక్షణ ఇస్తున్నారు. అమ్మాయిలకు,అబ్బాయిలకు ఒకే విధంగా మెలకువలు నేర్పిస్తారు. శిక్షణ అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ చేస్తారు.200 మంది విద్యార్థులకు శిక్షణ ఎంతో పట్టుదలతో తమ ఇష్టమైన క్రీడారంగంలో రాణించాలని తపన పడుతున్నారు. జిల్లా నుంచి ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు అండర్ విభాగం –14, 16, 19 , 23లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. ప్రస్తుతం అకాడమిలో దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు.అమ్మాయిలు సైతం అండర్ విభాగం –14, 19లో రాణిస్తూ ఇతరులకు స్ఫూర్తిని నింపుతున్నారు. విద్యార్థులు జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో రాణించాలని కష్టపడుతున్నారు. – చంద్రమౌళి, ప్రధాన కోచ్, ఎమ్మెస్ క్రికెట్ అకాడమీ -
వేసవి వస్తే అమ్మమ్మ ఇంట్లో సందడే
● గ్రామంలోనే ఈత నేర్చుకున్నా ● అల్లరి చేసేవాళ్లం..ఐస్ క్రీం తినేవాళ్లం ● స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవాడ్ని ● బాల్యం జ్ఞాపకాలు తీపి గుర్తులు ● జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరోడీఎస్పీ నూకల వేణుగోపాల్ రెడ్డిరామచంద్రాపురం(పటాన్చెరు): నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామం మాది. గ్రామంలోనే పదవ తరగతి వరకు చదువుకున్నాను. బాల్యంలో వేసవి సెలవులు వచ్చాయంటే మా మామయ్య వచ్చి అమ్మమ్మ దేవతమ్మ గ్రామమైన పూసలపహడ్కు తీసుకెళ్లేవారు. వేసవిలో అక్కడ స్నేహితులు, సోదరులతో గడిపేవాణ్ణి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లో ఆడుకునే వాళ్లం. అక్కడి బావిలోనే ఈత నేర్చుకున్నాను. ఆకలి వేస్తే ఇంటికి పోకుండా తాటి ముంజలు తినే వాళ్లం. ఇంటికి వెళ్లి కడుపునొప్పితో బాధపడుతుండే. రోజు అమ్మమ్మ అందరికీ ఐస్క్రీం కొనిచ్చేది. ఆ తీపి గుర్తులను నేటికీ గుర్తు చేసుకుంటాను. చిన్నారులను వారికి నచ్చిన ఆటల్లో చేర్పించండి వేసవిలో సొంత గ్రామాలకు వెళ్లని పక్షంలో చిన్నారులను వారికి నచ్చిన క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలి. చిత్రలేఖనం, సంగీతం లాంటి క్లాస్లలో చేర్పించడం వల్ల సంస్కృతి, సంప్రదాయంపై మరింత అవగాహన పెరుగుతుంది. దీంతోపాటు క్రమశిక్షణ పెరిగి ఉన్నతస్థాయిలో స్థిరపడతారు.క్రికెట్ అంటే ఇష్టం.. హైస్కూల్కు వచ్చిన తరువాత మా గ్రామంలోనే ఉండేవాణ్ణి. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో స్నేహితులతో కలిసి మొదట గ్రామంలో నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. అప్పటి నుంచి డిగ్రీ వరకు పక్క గ్రామాల వారితో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండేవాడిని. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రాణించాను. -
సమాజం అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే హరీశ్రావు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు తమ స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీఽశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గౌరీ నీలకంఠ ఆలయ 34వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్లో రాణించిన నీలకంఠ విద్యార్థుల అభినందన సభలో పాల్గొని పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య సమాజ బాధ్యతను పెంచుతుందని తెలిపారు. నీలకంఠ సమాజ సభ్యులందరూ ఐక్యంగా ఉండాలని, ఆలయ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. వార్షికోత్సవాలను సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ సమాజ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
టెక్నోజియంలో బీవీఆర్ఐటీ విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్: బెంగళూరులో జరిగిన 8వ జాతీయ స్థాయి ఎల్అండ్టీ టెక్నోజియం పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని స్థానిక బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె ఆదివారం పేర్కొన్నారు. పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 569 కాలేజీలకు సంబంధించిన 40వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్స్కు చేరిన 36జట్లలో తమ కాలేజీ ఈసీఈ బ్రాంచ్ విద్యార్థుల జట్టు ఉందన్నారు. కాగా ఈసీఈ జట్టు పోటీల్లో ప్రతిభ కనబర్చి సెకండ్ రన్నరప్గా నిలిచి అవార్డుతో పాటు రూ.3 లక్షల నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. బహుమతి అందుకున్న విద్యార్థులను సొసైటీ చైర్మన్ విష్ణురాజు, వైస్ చైర్మన్ రాజగోపాల్, సెక్రటరీ ఆధిత్యవిస్సాం అభినందించారు. నేటి నుంచి ఏఐసీఆర్పీ వార్షిక సమావేశం – ములుగు ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): ఆల్ ఇండియా కో ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్(ఏఐసీఆర్పీ) 25వ వార్షిక సమూహ సమావేశం ఈ నెల 19, 20 తేదీల్లో రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో నిర్వహించనున్నట్లు ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ట్యూబర్ క్రాప్స్, రాజేంద్రనగర్లోని వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్, తిరువనంతపురానికి చెందిన సీటీసీఆర్ఐచే సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో దేశంలోని 21 వేర్వేరు కేంద్రాల్లో పనిచేస్తున్న 50 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో శాస్త్రవేత్తలు గతేడాది చేసిన పనులపై చర్చించడంతో పాటు వచ్చే సంవత్సరానికి సాంకేతిక కార్యక్రమాన్ని రూపొందిస్తారని వివరించారు. పేకాట రాయుళ్ల అరెస్టు న్యాల్కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం.. మండలంలోని చాల్కి గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.44వేలు, మూడు ద్విచక్ర వాహనాలు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
పిన్ను మింగి ఊపిరాడక చిన్నారి మృతి
వర్గల్(గజ్వేల్): బుడిబుడి నడకలు.. కేరింతలతో ముద్దులొలికే చిన్నారి..ఏది తినాలో ఏది తినకూడదో తెలియని పసిప్రాయం..ఆటలాడుకుంటూ పిన్నులాంటి వస్తువును మింగి ఊపిరి తీసుకోలేక అల్లాడిపోయింది. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాదకర ఘటన వర్గల్ మండలం నాచారంలో చోటుచేసుకుంది. గౌరారం ఎస్ఐ కీర్తి రాజు వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రానికి చెందిన షోయబ్ఖాన్, నజియా దంపతులకు అహ్మద్ఖాన్, అనబియా(14 నెలలు) అనే ఇద్దరు పిల్లలున్నారు. షోయబ్ఖాన్ నాలుగు నెలల నుంచి నాచారంలో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం అతడి చిన్న కూతురు అనబియా ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటూ పిన్నులాంటి వస్తువును మింగింది. అది గొంతుకు అడ్డుపడటంతో శ్వాస తీసుకోలేక తల్లడిల్లింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్సకోసం చిన్నారిని లక్ష్మక్కపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రొబేషనరీ ఎస్ఐ తెలిపారు. -
డివైడర్ను ఢీకొట్టి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
నంగునూరు(సిద్దిపేట): రోడ్డు డివైడర్ను ఢీకొట్టి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పాలమాకులలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంపంగి రాఘవ (16) ట్రాక్టర్లో వడ్లను గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. రోడ్డు పక్కనున్న ఓ ఇంటి గోడను ఢీకొని ట్రాక్టర్ నిలిచిపోయింది. రాఘవ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాజగోపాలపేట ఎస్ఐ అసీఫ్, ప్రొబిషన్ ఎస్ఐ సౌజన్య సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని బాధితుడికి సీపీఆర్ చేసి అంబులెన్స్లో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ట్రాక్టర్ ఇంటి గోడను ఢీకొన్న సమయంలో చిన్నారులు, మహిళలు వరండాకు మరోపక్క ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ – దంపతులకు తీవ్ర గాయాలు అల్లాదుర్గం(మెదక్): ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లాదుర్గం శివారులోని 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోల్లకుంట తండాకు చెందిన సురేశ్ నాయక్, భార్య హంసీబాయ్ అల్లాదుర్గం వెళ్లి తిరిగి తండాకు బైక్పై వస్తున్నారు. చిల్వెర వైపు నుంచి పెద్దశంకరంపేట వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై ఉన్న సురేశ్, హంసీబాయ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిరాగ్పల్లి ఎస్ఐ.రాజేందర్రెడ్డి కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గ జిల్లాలోని బరంగ్నూర్ గ్రామానికి చెందిన హసన్షా(25) శనివారం బైక్పై జహీరాబాద్ పట్టణానికి వస్తున్నాడు. మొగుడంపల్లి వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. హసన్షా పరిస్థితి విషయంగా ఉండటంతో సంగారెడ్డికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
25 ఏళ్ల క్రితం వాటర్షెడ్ పథకానికి శ్రీకారం
నియోజకవర్గవ్యాప్తంగా గతంలో చేపట్టిన వాటర్షెడ్ పనులు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడ్డాయి. ప్రముఖ ఇంజనీర్ హన్మంత్రావు చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001 సంవత్సరంలో వాటర్షెడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎత్తయిన ప్రదేశంలో పడిన వర్షం నీరు చిన్న చిన్న వంకలుగా, వాగులుగా ఏర్పడి పల్లపు ప్రాంతానికి ప్రవహించి ఒక పెద్ద వాగు లేదా కాలువ ద్వారా బయటకు పోయే ప్రదేశాన్ని నీటి పరీవాహక ప్రాంతం లేదా వాటర్షెడ్ అంటారు. చతుర్విద జల ప్రక్రియలో నాలుగు అంశాలు ప్రధానమైనవి. 1. వాన నీటిని నిలువరించడం. 2) భూగర్భంలోకి నీటిని ఇంకించడం. 3) లోయ ఉపరితలంలో నీటిని నిల్వ చేయడం. 4) భూమిలో తేమను కాపాడటం. రిడ్జ్ టు వ్యాలీ (శిఖరం నుంచి లోయ) విధానంతో, ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి సిమెంట్, కాంక్రీట్ లేకుండా ఒక వాటర్ షెడ్ ఏరియాను సృష్టించడం. వాటర్షెడ్ పథకంతోపాటు వర్షాలు సైతం ఆశించిన మేర కురవడంతో నీటి ఊటలు పుష్కలంగా ఉన్నాయి. -
గ్రామమంతా లబ్ధి పొందుతున్నారు
వాటర్షెడ్ ఫలితాలతో గ్రామం అంతా లబ్ధిపొందుతున్నారు. 99 శాతం మందికి భూములున్నాయి. పంటలు పండించుకుని జీవనోపాధి పొందుతున్నారు. గతంలో నర్సాపూర్, తూప్రాన్, దుండిగల్ ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులు చేసుకునే వారు. ఇప్పుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. నేను కూడా బోరు నీటితో ఆరు ఎకరాల్లో మూడు పంటలు పండించుకుంటున్నాను. – రాచయ్య, మాజీ సర్పంచ్–గొట్టిగారిపల్లి మూడు పంటలు పండిస్తున్న నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఏడాది పొడువునా రెండు ఎకరాల్లో మూడు పంటలు పండించుకుంటున్నా. వర్షాకాలంలో సోయా వేస్తున్నా. పంట తీశాక ఆలుగడ్డ వేస్తున్నా. అది చేతికి వచ్చాక ఇప్పుడు మొక్కజొన్న పంట వేశాను. మిగతా రెండెకరాల్లో చెరకు పంట వేశాను. పంటలకు తగినంత నీరు బోరు నుంచి అందుతోంది. – మైసని రాజు, రైతు–గొట్టిగారిపల్లి 26 ఎకరాల్లో పండ్ల తోటలు తగినంత నీరు ఉన్నందున 26 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నా. 20 ఎకరాల్లో బొప్పాయి, 6 ఎకరాల్లో అరటి పంట ఉంది. 3 ఎకరాల్లో అల్లం, 5 ఎకరాల్లో చెరకు, 5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాం. బోర్లలో తగినంత నీరున్నందునే అన్ని పంటలు బాగున్నాయి. దీంతో లబ్ధి పొందుతున్నాం. – జి.సంజీవ్, రైతు–రంజోల్ -
అకాల వర్షంతో తడిసిన ఉల్లి
కంది(సంగారెడ్డి): ఇటీవల కురిసిన అకాల వర్షంతో చేతికి రావాల్సిన ఉల్లి పంట పూర్తిగా తడిసిపోయి పనికి రాకుండా పోయింది. కంది మండలంలోని చెర్లగూడెంకు చెందిన రైతు దత్తాత్రేయ స్వామి రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగు చేశాడు. పంటను కోసి ఓ చోట చేర్చి సంచులు నింపేం దుకు ఇంటికి రాగా అంతలోనే రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో సుమారు వంద క్వింటాళ్ల ఉల్లి మొత్తం తడిసిపోయింది. తడిసిన ఉల్లిని ఆరబెట్టినా కుళ్లిపోతోందని, ఈసారి పంట బాగా పండినా చేతికొచ్చే సమయానికి అందకుండా పోయిందని విలపిస్తున్నాడు. అధికారులు స్పందించి పంట నష్ట పరిహారం ఇప్పించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. -
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్ట చేశారు. భవన నిర్మాణ పనులను ఆమె అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకనుగుణంగా భవనాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ డీఈ రామకృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): రైతులకు ఇబ్బంది లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. అధికంగా తరుగు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ పీఎసీఏస్ చైర్మన్ వీర్షెట్టి, కాంగ్రెస్ నాయకులు దేవదాస్, తుకరాం, జితేందర్రెడ్డి ఉన్నారు. రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ రాయికోడ్(అందోల్): రాయికోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మండలంలోని ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంఈఓ టి.మాణయ్య ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు ‘టీజీ స్కూల్ ఎడ్యుకేషన్’యాప్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ కేంద్రం నుంచి హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సబ్జెక్ట్ టీచర్లు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి టీచర్ ఫ్రీటెస్ట్, పోస్ట్ టెస్ట్, రోజువారీ ఫీడ్బ్యాక్ రాసి, డెమో పాఠాన్ని సిద్ధం చేసి ఈ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీలో యువత చేరిక పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పటాన్చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో యువత చేరుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంకు చెందిన యువకులు గోదావరి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ...పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా,పటాన్చెరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రవీందర్, నాయకులు పాల్గొన్నారు. -
సర్కారు బడి.. సీట్లకు పోటీపడి
రామచంద్రాపురం(పటాన్చెరు): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు సీటు కావాలంటూ పెద్ద ఎత్తున రికమండేషన్లు వస్తున్నాయంటే సర్కార్ పాఠశాలలకు ఉన్న డిమాండ్ ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా సర్కార్ బడులకు పెరుగుతున్న ఆదరణ, విద్యార్థులకు అనుగుణంగా మరింత మౌలిక సదుపాయలను కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత విద్య చదివిన వారే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నారు. ఆధునిక భవనాలు.. మండల పరిధిలో రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, తెల్లాపూర్, కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెలలో జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. ఉస్మాన్నగర్లో కస్తూర్బా, వెలిమెల ప్రభుత్వ తెలంగాణ మోడల్ పాఠశాలలున్నాయి. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పలు పాత భవనాలను కూల్చి దాతల సహకారంతో నూతన ఆధునిక భవనాలను నిర్మించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. డిజిటల్ బోధన... పలు అంశాలపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నారు. దానితోపాటు కంప్యూటర్పై విద్యార్థులకు మరింత పరిజ్ఞానం పెంచాలన్న లక్ష్యంతో ప్రత్యేక బోధన చేస్తున్నారు. ఆధునిక ౖసైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరాటేలో శిక్షణ అందిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అనేక పాఠశాలలు వందకు వంద శాతం ఉతీర్ణత సాధిస్తున్నాయి. అందుకు జిల్లా ఉన్నతాధికారులు చొరవతీసుకుని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నారు. అందుకనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. జోరుగా ప్రచారం.. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లోని విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, సాధించిన ఫలితాలను కరపత్రాలను తయారు చేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతో అనేకమంది తల్లిదండ్రులు వారి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. పలు సమస్యలతో ఇబ్బందులు.. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న పలు పాఠశాలల్లో సమస్యలతో ఇబ్బందులు తప్పడంలేదు. తెల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 450 మంది విద్యార్థులున్నారు. కేవలం 7మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. గతేడాది ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై వచ్చారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం 19మంది ఉపాధ్యాయులు ఉండాలి. బీహెచ్ఈఎల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 686మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో హాస్టల్ ఉండటం కారణంగా తరగతి గదుల కొరత ఉంది. సుమారు 7మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది. కొల్లూరు పాఠశాలలో పలు సమస్యలున్నాయి. విద్యార్థులను గదుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం నివాసులు ఇతర ప్రాంతాల నుంచి రావడంతో ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాల అవసరం ఉంది. ఈదులనాగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘికశాస్త్రంకు సంబంధించిన ఉపాధ్యాయుల కొరత ఉంది. సర్కార్ బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి మరిన్ని సౌకర్యాలు కల్పించాలంటున్న స్థానికులు కరపత్రాలతో టీచర్లు జోరుగా ప్రచారంఅడ్మిషన్లు పెరుగుతున్నాయి ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఇంగ్లిష్మీడియంలో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. మా పాఠశాలలోని సదుపాయాలు, ఫలితాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. పాఠశాలలో అడ్మిషన్ల కోసం పెద్దల నుంచి సైతం ఫోన్లు వస్తున్నాయి. – టి.భాస్కర్, ప్రధానోపాధ్యాయులు, తెల్లాపూర్ జిల్లాపరిషత్ పాఠశాల. -
మండు వేసవిలోనూ ఉట్టిపడుతున్న జలకళ
● జహీరాబాద్ ప్రాంతంలో తగ్గని భూగర్భ జలాలు ●● వ్యవసాయబావులు, బోర్లలో పుష్కలంగా నీటి ఊటలు ● పంటలకు..పశు పక్ష్యాదులు, జంతువుల కు సమృద్ధిగా నీరు ● సత్ఫలితాలిస్తున్న వాటర్షెడ్ పథకంజహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో ఇప్పటికీ 10 మీటర్ల లోతులోనే భూగర్భజలాలున్నాయి. వ్యవసాయ బావులు, బోర్లలో సమృద్ధిగా నీటి ఊటలున్నాయి. నియోజకవర్గంలో ఐదారు చెరువులు మాత్రమే ఉన్నాయి. మండు వేసవిలోనూ పలు చెక్డ్యాంలలో నీరు దర్శనమిస్తోంది. మండల కేంద్రమైన కోహీర్లో ప్రస్తుతం 15 మీటర్ల మేర నీరు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. మల్చల్మ వద్ద ఇప్పటికీ పెద్దవాగులో నీరు ప్రవహిస్తోంది. గ్రామంలోని ఈరన్న ప్రాజెక్టు చెరవులో పుష్కలంగా నీరు ఉంది. పలు చెరువులలో నీరు ఉండటంతో జంతువులు, పశు పక్ష్యాదులు దప్పిక తీర్చుకుంటున్నాయి. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోనూ నీరు నిండుకుండలా ఉంది. నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల్లో ఆయా పంటలు సాగులో ఉన్నాయి. -
23న జిల్లాకు సీఎం రేవంత్ రాక!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారంలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. 30 వేల మందితో సభ! సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఒకటీ రెండు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ప్రారంభించేందుకు జహీరాబాద్ వెళ్లనున్నారు. నిమ్జ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జహీరాబాద్లో బహిరంగ సభ! -
దేవాలయ నిర్మాణాలకు సహకరిస్తా
పటాన్చెరు: దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని జీవీ గుట్ట కాలనీలో నూతనంగా నిర్మించిన రాధాకృష్ణ దేవాలయం రాజగోపురం నిర్మాణానికి రూ.27 లక్షల భారీ విరాళం అందించారు. స్థానిక ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి రాజగోపురాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. భవిష్యత్తులోనూ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గ వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తామన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్, మాజీ కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ, నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి రాజగోపురం నిర్మాణానికి రూ.27 లక్షల విరాళం అందజేత -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
అకాల వర్షాలకు రైతులు నష్టపోకూడదు
కొండాపూర్(సంగారెడ్డి): అకాల వర్షాలతో జిల్లాలో రైతులెవరూ ఇబ్బందులు పడకూడదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకున్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలోని తొగర్పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సందర్శించి, నిర్వహణపై తీరును పరిశీలించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, దరఖాస్తుల ప్రక్రియ, విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరలకే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు రవాణా చేయాలని సూచించారు. తేమ శాతం కొంచెం ఎక్కువగా వున్నా ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు, డీలర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమయ్యేలా ఆన్లైన్లో ఖాతా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సేవల్లో పారదర్శకత భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. భూభారతి గ్రామ సభలలో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. భూభారతి గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులు ఉచితంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీఓ రవీందర్రెడ్డి, తహసీల్దార్ అశోక్, పీఎసీఎస్ సిబ్బందితోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు భూభారతిపై సమీక్ష భూ భారతిపై నిర్వహించిన గ్రామ సభలలో వచ్చిన సమస్యలపై శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతోపాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై.ప్రభు ఓ ప్రకటనలో తెలిపారు.కలెక్టర్ వల్లూరు క్రాంతి -
సెర్ప్లో స్థానచలనాలు
జిల్లా వివరాలు రాష్ట్ర ఉద్యోగులకు నివేదిక బదిలీ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను రాష్ట్రస్థాయి ఉద్యోగులకు నివేదిక పంపనున్నారు. ఉద్యోగులలో పేరు మార్పు లు, తప్పులు ఉంటే వాటి వివరాలు సైతం ఫిర్యాదు రూపంలో స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధివిధానాలతో కూడిన జీఓ జారీ కాగానే నియమ నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఉద్యోగులు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈనెలాఖరుకు బదిలీల ప్రక్రియ పూర్తి కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే వాటిని అనుసరించి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. ఇక జిల్లాలో ఏర్పడిన మండలాలకు సైతం అధికారులను నియమిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.సంగారెడ్డి జోన్: జిల్లాలో సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్ ఉద్యోగులతోపాటు ఉపాధి హామీ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చర్యలు ప్రారంభించింది. దీంతో కొన్నేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న అధికారులు బదిలీ కానున్నారు. అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. అన్ని రకాల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. త్వరలోనే బదిలీలకు సంబంధించిన జీఓ జారీచేయనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. పదేళ్ల అనంతరం బదిలీలు సెర్ప్ ఉద్యోగులకు 2015 సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. వాస్తవానికి 2018లో కొంతమేర బదిలీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. సుమారు పదేళ్ల అనంతరం ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఈ విభాగంలో 192మంది అధికారులు వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 40మంది ఉద్యోగులు జిల్లా కేంద్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా, 151 మంది మండలస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఉద్యోగి డిప్యూటేషన్పై హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.జిల్లాలోని సెర్ప్ ఉద్యోగుల వివరాలుఉద్యోగి స్థాయి జిల్లా కేంద్రంలోఅధికారులు మండల స్థాయిలో అదనపు డీఆర్డీఓ 1 0 డీపీయం 4 0 ఏపీయం 7 24 కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ 16 127 సపోర్టింగ్ స్టాఫ్ 12 02015 ఏడాది తర్వాత ప్రక్రియ రాష్ట్ర అధికారులకు జిల్లా ఉద్యోగుల వివరాలు జిల్లాలో 192 మంది ఉద్యోగులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్న బదిలీలు -
మోసగిస్తే కఠిన చర్యలే
జిన్నారం(పటాన్చెరు): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసగిస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ జ్యోతి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, నిర్వాహకుల తీరుపై రైతులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా అధికారుల బృందం శుక్రవారం జిన్నా రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా అధికారుల బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో తూకం వేయకపోవడం వల్లే వర్షాలకు తమ ధాన్యం తడిసిముద్దయిందని రైతులు వాపోయారు. టోకెన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఈ వ్యవహారంలో వీవోఏ భర్త పెత్తనం చలాయిస్తున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్ తనిఖీ చేపట్టి క్వింటాలుకు 4 కిలోల చొప్పన తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో తూకం యంత్రాలను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు అనిల్ తెలిపారు. ఇప్పటికే తూకంలో మోసపోయిన రైతులకు పరిహరం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. స్థానిక ఏపీఎం, వీవోఏలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐకేఏపీ ఏపీఎం నరేందర్, ఏఈఓ అజారుద్దీన్ వీవోఏ లత పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ పరమేశం తనిఖీ చేశారు. నల్లవల్లి కేంద్రంలో హమాలీల కొరతను రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా...కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలను పెంచాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో డీఆర్డీఏ పీడీ జ్యోతి -
జిల్లావాసికి ప్రధాని అభినందనలు
జహీరాబాద్: భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లావాసి పట్లోళ్ల లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. కోహీర్ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల లక్ష్మీకాంత్రెడ్డి నాలుగేళ్ల క్రితం భారత వైమానిక దళంలో చేరి ప్రస్తుతం ఫ్లైట్ లెఫ్టినెంట్ ర్యాంక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన అప్రకటిత యుద్ధం నేపథ్యంలో మిగ్ యుద్ధ విమానం, గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శనచక్ర ఎస్–400ను ధ్వంసం చేశామని పాక్ చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపించేందుకు ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లి దాని ఎదుటే నిల్చుని ప్రసంగించారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా భారత జవాన్లనుద్దేశించి ‘మీ మెరుపు వేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసిందని, భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగి పోయార’ని ప్రధాని అభినందించారు. ప్రధానితో కరచాలనం చేసి, అభినందనలు పొందడం తమకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని లక్ష్మికాంత్రెడ్డి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పేర్కొన్నారు. -
వైభవంగా రంగనాథస్వామి కల్యాణోత్సవం
హాజరైన మంత్రి దామోదర జోగిపేట(అందోల్): అందోల్ గ్రామంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్త్రాలతో కల్యాణానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్యామ్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజ లు నిర్వహించారు. మంత్రికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్కౌన్సిలర్లు సురేందర్గౌడ్, హరికృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెండు బల్దియాల్లో యూజీడీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ రెండు చోట్ల అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారమే లక్ష్యంగా ఈ యూజీడీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి పట్టణంలో ఈ యూజీడీ వ్యవస్థ కోసం రూ.580 కోట్లు అవసరమని, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.273 కోట్లు అవసరమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు)లను ఇటీవలే కలెక్టర్ ద్వారా కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు పంపారు. ఈ రెండు పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య, జనాభా, వార్డులు, జనసాంద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. భారీ నిధులు కేంద్రానికి ప్రతిపాదనలు.. యూజీడీల నిర్మాణానికి భారీగా నిధులు అవసరం ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ నిధులను రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం), అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ స్కీం వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల కింద పట్టణాల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే అమృత్ వంటి పథకాల కింద జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేసింది. ఈ యూజీడీలకు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ద్వారా పట్టణాలను అభివృద్ధి చేయవచ్చనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ యూజీడీల ప్రతిపాదనలు సీడీఎంఏ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినట్లు సమాచారం. యూజీడీ డీపీఆర్లు పంపాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ డీపీఆర్లను జిల్లా కలెక్టర్కు పంపాం. పట్టణ జనాభా, కుటుంబాల సంఖ్య, జనసాంద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ విభాగం ఈ డీపీఆర్ తయారు చేశాం. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. –ప్రసాద్ చౌహాన్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ రూ.580 కోట్లతో సంగారెడ్డి, రూ.273 కోట్లతో సదాశివపేటలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా ఇటీవలే సీడీఎంఏకు డీపీఆర్లు -
● ఇరువర్గాలపై కేసు నమోదు ● 17 మంది బైండోవర్
చెరువు కట్టపై గొడవచేర్యాల(సిద్దిపేట): చెరువుకట్టపై కొట్టుకున్న కేసులో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి 17 మందిని బైండోవర్ చేశారు. ఈ ఘటన శుక్రవారం చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నీరేష్ వివరాల ప్రకారం.. ఈ నెల 13న ఓ గొడవ విషయమై ఇరు వర్గాలు మాట్లాడుకుందామని పట్టణ కేంద్రంలోని చెరువుకట్ట మీదికి వచ్చారు. ఈ క్రమంలో ఓ వర్గంలోని వ్యక్తి మరో వర్గం వారిపై దాడి చేశాడు. బాధిత వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన వ్యక్తి వర్గానికి సంబంధించిన 17 మందిని శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ
మెదక్ కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను రిసోర్స్పర్సన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బడి బయట ఉన్న పిల్లలను బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం పోషకుల సమావేశం నిర్వహించి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన మూర్తి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బడీడు పిల్లలంతా బడిలో చేరాలి స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ -
ఆటలాడేటోళ్లం.. అల్లరి చేసేటోళ్లం
సాక్షి, సిద్దిపేట: ‘బాల్యపు జ్ఞాపకాలు నేటికీ మధురస్మృతులు.. వేసవి సెలవులు వచ్చాయంటే మాకు పండుగే.. ఆటలు ఆడేటోళ్లం.. అల్లరి చేసేటోళ్లం.. వేసవి సెలవులొస్తే దాదాపు రెండు నెలలు స్నేహితులతో సరదాగా గడిపే వాళ్లం’ అని రచయిత, ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. సిధారెడ్డి తన బాల్యంలోని వేసవి జ్ఞాపకాలను ’సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. సిద్దిపేట మండలం బంధారం గ్రామం మాది. మా ఊరులో పాఠశాల లేకపోతే వెల్కటూరుకు వెళ్లే వాళ్లం. వెల్కటూరు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సమయంలో దాహం వేస్తే మేము బావుల దగ్గరికి, ఎవరి ఇంటికై నా వెళ్లి నీళ్లు తాగి వచ్చే వాళ్లం. ఒక రోజు నాకు బాగా దాహం వేయడంతో బావి దగ్గరికి వెళ్లాను. దరి తెలియకపోవడంతో జారి బావిలో పడిపోయాను. అప్పుడు నాకు ఈత రాదు, నేను చనిపోయాను అనుకున్నా.. నన్ను వెతుక్కుంటూ నా బాల్య మిత్రుడు పోచయ్య వచ్చాడు. వెంటనే నన్ను చూసి బావిలోకి దూకి కాపాడారు. అప్పుడు పోచయ్య నన్ను కాపాడకపోతే నేను బతికేవాడిని కాదు. అలా నాకు పోచయ్య ప్రాణదాత అయ్యాడు. ఇది నా జీవితంలో మరచిపోని సంఘటన. దొంగచాటుగా మామిడి కాయలు తెంపుకునేటోళ్లం మేము దాదాపు 10 మంది కలిసి వెళ్లే వాళ్లం. ఓ ఇద్దరు అక్కడ కాపాలా ఉండే వారితో ముచ్చట పెడుతుంటే మరికొందరు తోటలోకి వెళ్లి మామిడి కాయలు, అల్లనేరేడు పండ్లు తెంపుకొచ్చేవాళ్లు. అప్పుడు ఫోన్లు సైతం సరిగా లేవు. మా ఊరు బంధారానికి కరెంటే లేదు. ఇప్పుడు చిన్న పిల్లలందరూ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా పర్యాటక ప్రాంతాలు చూపించాలి. ిఫిజికల్ యాక్టివిటీస్ చేపించాలి. మంచి పుస్తకాలు చదువుకునే విధంగా ప్రోత్సహించాలి.మాట్లాడుతున్న సిధారెడ్డి వేసవి సెలవులు వచ్చాయంటేరెండు నెలలు పండుగే నాడు బావిలో పడిపోతే బాల్యమిత్రుడు పోచయ్య కాపాడిండు ‘సాక్షి’తో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డిస్నేహితులే ఈత నేర్పారు..పరీక్షలు అయిపోయి.. రిజల్ట్ తీసుకోగానే వేసవి సెలవులు దాదాపు రెండు నెలలు ఎంజాయ్ చేసేవాళ్లం. 6వ తరగతిలో జరిగిన సంఘటనతో నాకు స్నేహితులు ఈత నేర్పించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈత కొట్టేవాళ్లం. ప్రతి రోజు ఉదయం పూట నేను వడ్ల సత్తయ్య, మధుసూదన్, పోచయ్య, బాల్నర్సయ్య, అంజిరెడ్డి, ఆగంరెడ్డి ఇలా దాదాపు 10 మంది కలిసి ఈతకు వెళ్లాం. తిండి తిప్పలు మానేసి ఈత కొట్టాం. బావిలో ముట్టించుకునే ఆటలు ఆడేటోళ్లం. ఇంటికిపోయే సమయంలో ఎండకు కాళ్లు కాలుతుంటే మోదుగు ఆకులు, సీతాఫలం కొమ్మలతో కలిపి చెప్పులాగా కుట్టుకొని రక్షణ పొందాం. సాయంత్రం చిర్రగోనే, తాటి ముంజలతో బండి, చింతగింజల ఆట, గోటీలు ఆడేటోళ్లం. -
కానిస్టేబుల్ దాడి చేశాడంటూ ఆందోళన
హుస్నాబాద్: హనుమాన్ మాల ధరించిన భక్తుడిపై ఎకై ్సజ్ కానిస్టేబుల్ దాడి చేశారంటూ శుక్రవారం ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట మాలధారులు ధర్నా చేశారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఽఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ మాల ధరించిన శివప్రసాద్ పట్టణంలోని ఓ వైన్స్ షాపునకు సంబంధించిన సిట్టింగ్ పర్మిట్ రూంలో పని చేస్తున్నాడని తెలిపారు. అయితే మద్యం తాగేందుకు ఎకై ్సజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి పర్మిట్ రూంకు వచ్చాడు. గ్లాసులు కావాలని కోరగా, శివప్రసాద్ గ్లాస్లు ఇచ్చి డబ్బులు అడిగాడు. నేను ఎవరో తెలుసా, డబ్బులు అడుగుతావా.. వైన్స్ షాఫును సీజ్ చేయిస్తానని బెదిరించి శివ ప్రసాద్పై దాడి చేశాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మాలధారులు ధర్నా నిర్వహించి కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై మహేష్ వచ్చి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటానని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ గౌడ్, నాయకులు వేణుగోపాల్రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, మాలధారులు ఉన్నారు.ఎకై ్సజ్ ఆఫీస్ ఎదుట హనుమాన్ మాలధారుల ధర్నా -
సైనికుల త్యాగాలు మరువలేనివి
సిద్దిపేటజోన్: దేశ సరిహద్దు రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివని సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం స్థానిక కోమటిచెరువు నెక్లెస్ రోడ్ వద్ద వినూత్నంగా గ్రాటీట్యూట్ వాల్(సందేశాత్మక గోడ) ఏర్పాటు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో మన దేశం, మన సైనికులపై ఉన్న అభిమానాన్ని గోడ మీద ఉన్న వస్త్రంపై అతికించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సంతోష్ కుమార్, శ్రీనాథ్,శివ కుమార్, కిరణ్, గణేష్, సతీష్, రమేష్, శివ, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఈసెట్లో సత్తా చాటిన విద్యార్థినులు
మిరుదొడ్డి(దుబ్బాక): ఏపీ ఈసెట్ ఫలితాల్లో ఒకే మండలం ఒకే గ్రామానికి చెందిన విద్యార్థినులు ప్రభంజనం సృష్టించారు. ఇటీవల విడుదలైన రాష్ట్రస్థాయి ఫలితాల్లో మొదటి, రెండవ ర్యాంకులను సాధించి ఔరా అనిపించారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట –భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కట్లె యాదగిరి, కవిత దంపతుల కూతురు రేవతి, అలాగే పంజ నర్సింలు, చె న్నవ్వల కూతురు నవ్య ఏపీ ఈసెట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈసీఈ విభాగంలో మొదటి, రెండో ర్యాంకులు సాధించి జిల్లాకే తలమానికంగా నిలిచారు. కూలి కుటుంబంలో ఆణిముత్యాలు రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబంలో జన్మించిన రేవతి, నవ్య టీఎస్ఆర్జేసీ ఎన్సానపల్లిలో పది వరకు చదివి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సికింద్రాబాద్లో డిప్లొమా పూర్తి చేశారు. రేవతి తండ్రి వ్యవసాయ కూలీ పనులు చేయగా తల్లి బీడీలు చుడుతూ తన బిడ్డను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అలాగే పంజ నర్సింలు చెన్నవ్వల కూతురు నవ్యను హమాలి, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చదువు కోసం పడుతున్న కష్టాలకు చలించి ఉన్నత చదువులే లక్ష్యంగా చదివి కలల సాకారాన్ని సాధించుకున్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల విద్యార్థిలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సొంతం -
విద్యలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారుతుందని, ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. సిద్దిపేట జిల్లాలో వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తన సమస్యల పట్ల పోరాటం చేస్తూనే బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలనే తపన, విద్యార్థుల నిరంతర అభివృద్ధికి వారు చేసే కృషి అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు బహుముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందివాలని, పిల్లల నమోదు పెంచాలని ప్రయత్నం చేస్తోందని, దానికి ప్రతి ఉపాధ్యాయుడు తన వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనల సాధనకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు రఘువర్ధన్రెడ్డి, తిరుపతి, శ్రీనాకర్ రెడ్డి, సింగోజి జనార్దన్, నర్సిరెడ్డి , బాలకిషన్, ఉమాశంకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర (సంగారెడ్డి): అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హత్నూర మండలం దౌలాపూర్ దౌల్తాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే సునీతారెడ్డి సందర్శించి తడిచిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ధాన్యం తెచ్చి రోజులు గడిచినా కేంద్రాల వద్ద కొనుగోళ్లు చేయకపోవడంతోనే వర్షాలకు ధాన్యం తడిచిపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని లేకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలే
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ● బోరుపట్లలో పరిశ్రమల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా అధికారుల బృందం హత్నూర (సంగారెడ్డి): అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్ప వని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశ్రమల ప్రతినిధులను హెచ్చరించారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెరనియం బైలోజీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, నీటిపారుదల శాఖ ఎస్ఈ ఏస య్య, డీఈ రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి గీతతో కూడిన అధికారుల బృందం ఆ పరిశ్రమల అక్రమ నిర్మాణాలను గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ...పరిశ్రమలు నిర్మాణాలు చేపడితే ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎపిటోరియా పరిశ్రమకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. -
కష్టం.. కన్నీళ్ల పాలు
జోగిపేట (అందోల్)/హత్నూర(సంగారెడ్డి)/సంగారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలకు పలు మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుమండలాల్లో కొనుగోలు కేంద్రాలవద్ద, రోడ్లమీద, కల్లాలో ఆరబెట్టిన ధాన్యపు రాసులు తడిసిముద్దయ్యాయి. సంగారెడ్డి, కంది, కొండాపూర్, పుల్కల్ , చౌటకూరు, హత్నూర, అందోల్, జోగిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోగా కొన్ని చోట్ల వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. సింగూరు డ్యామ్ వెళ్లే దారిలో ఎటు చూసినా తడిసిన ధాన్యమే కనిపించింది. ధాన్యపు రాసులపై ప్లాస్టిక్, టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచినా ప్రయోజనం లేకపోయింది. జోగిపేటలో సుమారు 12 లారీల ధాన్యం తడిసిముద్దయిపోయింది. కల్లాలో కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వచ్చి కనిపించింది. జోగిపేట మార్కెట్ కార్యదర్శి సునీల్తో పాటు కేంద్రం నిర్వాహకులు తడిసిన ధాన్యంను పరిశీలించారు. తడిచిపోయిన ధాన్యాన్ని చూసి రైతులు విలపిస్తున్నారు. ఆరుగాలం పనిచేసిన కష్టమంతా ఒక్క వర్షానికే నష్టంపోవడం తలచుకుని దైన్యంగా మిగిలిపోయారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యంతోపాటు జాప్యం లేకుండా కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్సంగారెడ్డి జోన్: మారుతున్న కాలానికనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి గురువారం ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ... ఎఫ్ఐఆర్ మొదలుకుని డేటా ఎంట్రీ, వివిధ రకాల కేసుల నమోదులో ఏమైనా సందేహాలుంటే శిక్షణ తరగతుల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వర్టికల్ విభాగంలో జిల్లాను ముందంజలో ఉండే విధంగా చూడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు, నాణ్యమైన నేరపరిశోధన చేసేందుకు వివిధ రకాల యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమావేశంలో వర్టికల్ మానిటరింగ్ అధికారి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పరిహారం చెల్లింపు
కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు అందించే పారదర్శకంగా పరిహారం చెల్లించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...రీజినల్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం త్వరితగతిన అందించి, ప్రతీ రైతుకు న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సర్వే ప్రక్రియ నుంచి పరిహారం చెల్లింపు వరకు ప్రతీదశలో అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం నిర్ణయించాలన్నారు. సమావేశంలో రీజినల్ అధికారి శివశంకర్, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రవీందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుకు రాయితీలు
● పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు రాయితీలు ● జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 27,633 ఎకరాలు సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఉద్యాన పంటల సాగుపెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఉద్యాన పంట సాగువైపు రైతులు మొగ్గు చూపేందుకు వారికి ఆయా పంటల సాగు, యంత్రపరికరాలపై రాయితీలను కల్పించనుంది. పండ్ల తోటలు, పూల సాగు,కూరగాయల సాగుకు సబ్సిడీలతోపాటు యంత్రాలు, యంత్ర పరికరాలు, సూక్ష్మ నీటి సేద్యానికి 2025–2026 ఏడాదికి ఉద్యానవన శాఖ రాయితీలను అందిస్తోంది. జిల్లాలో ఉద్యాన పంటలు 27,633 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా ఈ ఏడాది అదనంగా 1,094 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పండ్ల తోటలకు (హెక్టారుకు)... హెక్టారు మామిడి పంటకు రూ. 19,200, నిమ్మ రూ. 19,200, జామ రూ.19,200,అరటి రూ. 16,800, బొప్పాయి రూ. 7,200, డ్రాగన్ ఫ్రూట్ రూ. 64,800, దానిమ్మ రూ.19,200, ముదురు మామిడి తోటల పునరుద్ధరణకు రూ. 9,600ను ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు. కూరగాయల పంటలకు (ఎకరాకు) టమాటా పంట రూ. 9,600, వంగ రూ. 9,600, క్యాబేజీ రూ. 9,600, క్యాలీఫ్లవర్ రూ. 9,600, మిర్చి నారుకు రూ. 9,600ల సబ్సిడీ ఇవ్వనున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకునే రైతులకు ఎకరాకు రూ. 8 వేలు, తీగజాతి కూరగాయల సాగు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం ఎకరానికి రూ.లక్ష, పూల రైతులకు ఎకరాకు రూ. 8 వేలు రాయితీగా అందించనుంది. ఆయిల్పామ్ సాగుకు... రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును పెంచాలనే లక్ష్యంతో ఎకరాకు మూడేళ్ల బిందు సేద్యంతో కలిపి రూ.50,918లను సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 3,050 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. యంత్రాలు... ● ఉద్యాన పంటల సాగుకు 20 హెచ్పీ ట్రాక్టరుకు రూ. 2.45 లక్షల సబ్సిడీ, పవర్టిల్లర్కు రూ. లక్ష, ● పవర్ వీడర్కు రూ.75వేలు, బ్రష్ కట్టర్స్ రూ. 25 వేల సబ్సిడీని అందజేయనున్నారు. సూక్ష్మ నీటి సేద్యం... సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతోపాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు ప్రోత్సాహం అందుతుంది. ఉద్యాన పంటలసాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్ను కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. –సోమేశ్వర్ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి, సంగారెడ్డిప్రైమ్మినిస్టర్ క్రిషి సించాయి యోజన పథకం కింద పండ్ల తోటలతోపాటు కూరగాయలకు, మిరప, ఆయిల్పామ్ సాగుకు బిందు,తుంపర సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు 100% బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ ఇవ్వనున్నారు. -
‘ఉపాధి’లో మరింత పారదర్శకత
● ఉపాధి పర్యవేక్షణకు కమిటీలు ● ఐదుగురు సభ్యులతో వీఎంసీల ఏర్పాటు ● 619 గ్రామ పంచాయతీల్లో ఉపాధి అమలుసంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని వలసలు నివారించేందుకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిమంది సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ప్రతి గ్రామంలో వీఎంసీ కమిటీ ఏర్పాటు జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న ప్రతీ గ్రామంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (వీఎంసీ)లను ఏర్పాటు చేశారు. కమిటీలో ఆ గ్రామంలో పనిచేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అంగన్వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల సభ్యురాలు, రిసోర్స్ పర్సన్, యువత సభ్యులుగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 619 గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం అమలు అవుతుంది. ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీలలో పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర అధికారులకు కమిటీల నివేదికలు గ్రామాలలో ఏర్పాటుచేసిన వీఎంసీ కమిటీల నివేదికలను మండల అధికారులు జిల్లా అధికారులకు పంపించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు పంపించారు. ఆరు నెలలపాటు ఈ కమిటీలు ఉపాధిలో ప్రాతినిధ్యం వహించనున్నాయి. కమిటీ సభ్యుల తనిఖీలు, పర్యవేక్షణ ఈ పథకంలో చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ నిర్వహించి అవకతవకలను గుర్తించేది. దాంతోపాటే గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన వీఎంసీలు ఉపాధి పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి పర్యవేక్షించనున్నారు. తనిఖీల్లో భాగంగా చేపట్టిన పనిపేరు, హాజరైన కూలీల సంఖ్య, పనులకు సంబంధించిన రికార్డులు, అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేపట్టారా లేదా, చేపట్టిన పనుల్లో నాణ్యత, మాస్టర్లతోపాటు రిజిస్టర్ల తనిఖీ చేపట్టనున్నారు. కమిటీల పర్యవేక్షణతో చేపట్టే పనిలో పారదర్శకత పెంపొందనుంది. అంతేకాకుండా పనులలో నాణ్యత పెంపొంది అవకతవకలకు తావు లేకుండా పనులు కొనసాగనున్నాయి. -
100 రోజులకు చేరిన డంప్యార్డ్ నిరసన
జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 100 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ...స్థానికంగా ఆందోళనకారులు చేపడుతున్న దీక్షలకు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరావాల న్నారు. ప్రజాపాలనలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం డంపింగ్యార్డ్ ఏర్పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
నంగునూరు(సిద్దిపేట): నంగునూరులో వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నాయకులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. హిందూ సంఘాలు, అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం నంగునూరులో ర్యాలీ నిర్వహించి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు స్థానికంగా నివాసం ఉంటున్నారని, వారి ఆధార్ కార్డులను పరిశీలించాలని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ... కొన్నేళ్ల కింద గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్న సమయంలో గొడవలు జరిగాయన్నారు. సమస్య సమసిపోయి అందరి ఆమోదంతో తహసీల్దార్ కార్యాలయం సర్కిల్లో విగ్రహాన్ని నెలకొల్పామని తెలిపారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నామని, కొందరు గొడవలు సృష్టించేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్పేట ఎస్ఐ అసీఫ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని సీఐ తెలిపారు. హిందూ సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా -
తండ్రి వివాహేతర సంబంధానికి చెక్ పెట్టాలని..
పుల్కల్(అందోల్): మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బేగరి జయమ్మ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 6న అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమై హత్యకు గురై మెదక్ జిల్లా చేగుంట వద్ద కాలిన మృతదేహంతో లభించిన విషయం పాఠకులకు విదితమే. కేసుకు సంబంధించి జోగిపేట సీఐ అనిల్కుమార్, పుల్కల్ ఎస్ఐ క్రాంతి కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన బేగరి జయమ్మ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. ఈ నెల 6న ఆమె ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేస్తుండగా నిందితులైన పుట్ట అనిల్ికుమార్, స్నేహితుడు డప్పు వినీత్తో కలిసి తండ్రి ఆర్థిక లావాదేవీలను అడ్డుపెట్టుకొని జయమ్మను ఇంటిలోకి పిలిచి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని కారులో చేగుంట సమీపంలోకి తీసుకుని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో పుట్ట అనిల్కుమార్ తండ్రి రాములు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి జయమ్మ సహకరించేదని తెలిసింది. దీంతో వీరు ముగ్గురు రోజు అంగన్వాడీ కేంద్రంలో విందు చేసుకునే వారని, ఆర్థిక లావాదేవీలు కూడా జరుపుకునేవారని పోలీసులు తెలిపారు. దీంతో రాములు కొడుకు పుట్ట అనిల్ కుమార్ పథకం ప్రకారం జయమ్మను హత్య చేసి తండ్రి వివాహేతర సంబంధానికి చెక్ పెట్టాలని పథకం రచించాడు. ఈ క్రమంలో జయమ్మను తన స్నేహితుడి సహాయంతో హత్య చేసి ఆనవాళ్లు లేకుండా శవాన్ని చేగుంట సమీపంలో కాల్చి వేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను గురువారం రిమాండ్కు తరలించారు. మధ్యవర్తి మహిళ హత్య ఇద్దరు నిందితుల అరెస్టు -
వారం రోజుల్లో కూతురి పెళ్లి
అల్లాదుర్గం(మెదక్): కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఓ తండ్రికి గుండెపోటుతో రావడంతో మృతి చెందాడు. కొడుకులు లేకపోవడంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అల్లాదుర్గం మండలం బహిరన్దిబ్బ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నడిపోళ్ల నాగయ్య (53) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు తేజ, అశ్విని. ఈ నెల 21న తేజ పెళ్లి నిశ్చమైంది. ఈ పనుల్లో బిజీగా ఉండగా నాగయ్యకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందాడు. కొడుకులు లేక పోవడంతో కూతురు తేజ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో తండ్రి మృతి తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు -
డిపాజిట్ డబ్బులు మాయం!
కొల్చారం(నర్సపూర్): మండల కేంద్రంలోని పోస్టాఫీస్లో ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బులు మాయమయ్యాయి. గురువారం కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది పోస్టాఫీస్లో డిపాజిట్ రూపంలో, నెల నెలా డబ్బులు వచ్చేలా రికరింగ్ డిపాజిట్ పథకంలో డబ్బులు జమ చేశారు. వీటికి సంబంధించి సిబ్బంది పాస్ పుస్తకాలు, సంబంధిత పత్రాలు ఖాతాదారులకు ఇచ్చారు. నాలుగు నెలల క్రితం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న లంబాడి రవి అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం నూతన అసిస్టెంట్ పోస్టుమాస్టర్గా గ్రామానికి చెందిన కొత్త శేఖర్ విధుల్లో చేరాడు. ఇటీవల ఆడిట్ నిర్వహించగా.. డిపాజిట్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని శేఖర్ ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి పాసుపుస్తకాలు, డిపాజిట్ పత్రాలను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటినుంచి తీసుకెళ్లిన వాటిని ఇవ్వాలని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఈ విషయమై శేఖర్ను నిలదీయగా డబ్బులు జమ చేయలేదని దబాయించాడు. దీంతో కోపోద్రికులైన ఖాతాదారులు ఆందోళనకు దిగారు. మాయమైన సొమ్ము దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి పేర రూ.5 లక్షలని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. కొల్చారం పోస్టాఫీస్ ఎదుట ఖాతాదారుల ఆందోళన మాయమైన సొమ్ము సుమారు రూ.10లక్షలు -
నిషేధిత ఆల్పాజోలం పట్టివేత
జహీరాబాద్ టౌన్: ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి తీసుకొస్తున్న నిషేధిత ఆల్పాజోలాన్ని పోలీసులు పట్టుకున్నారు. టౌన్ ఎస్ఐ. కాశీనాథ్ కథనం ప్రకారం... మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశ్వనాథ్ ఆర్టీసీ బస్సులో ఆల్పాజోలంను జహీరాబాద్కు తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బైపాస్ రోడ్డులో ఇంద్రప్రస్థ వద్ద గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో అతడు తీసుకొస్తున్న 750 గ్రాముల ఆల్పాజోలం దొరికింది. పోలీసులు అతడిని విచారించగా పట్టణానికి చెందిన మిద్దెస్వామి గౌడ్కు అమ్మడానికి తీసుకొస్తున్నట్లు చెప్పాడు. దీంతో మిద్దెస్వామి గౌడ్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆల్పాజోలం కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతని వద్ద రూ.7.50 లక్షల నగదు, సెల్ఫోన్, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సేవామార్గం.. సమాజ హితం
నర్సాపూర్ రూరల్: జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో క్షేత్ర స్థాయిలో సమస్యలు, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, నాయకత్వ లక్షణాలతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగిందని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ –1 విద్యార్థులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ఇటీవల వారం రోజులపాటు వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఆయా వీధుల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించి పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతోపాటు బేటీ బచావో–బేటీ పడావో, బాల్య వివాహాలు, మత్తు పదార్థాలు, ప్లాస్టిక్తో కలిగే నష్టాలు, ఆడపిల్లలను చదివించాలని చైతన్య పరిచారు. ఇంటింటికీ వెళ్లి సర్వే గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో అధ్యాపకులతోపాటు పలువురు వక్తలు వివిధ అంశాలపై ఇచ్చిన ఉపన్యాసాలతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. గ్రామస్తులను చైతన్యపరిచేందుకు ఆటపాటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ు ప్రదర్శించారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయి ఎన్ఎస్ఎస్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు మెరుగుపడ్డాయి. దీంతోపాటు టీమ్ వర్క్ అలవాటైంది. బృందాలుగా ఏర్పడి రోజు వారి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాం. చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. – దాసరి శివరాజ్, విద్యార్థి, బీఏ సెకండ్ ఇయర్ క్రమశిక్షణ అలవాటైంది జాతీయ సేవా శిబిరంలో వారం రోజులపాటు పాల్గొనడంతో క్రమశిక్షణ అలవాటైంది. ఉదయం లేచి గ్రామంలో శ్రమదానం చేయడంతోపాటు మధ్యాహ్నం అధ్యాపకులు, వకల ఉపన్యాసాలతో కొత్త విషయాలు తెలుసుకున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల జీవన విధానం, సమాజంపై అవగాహన కలిగింది. – ఎస్. ప్రణయ, విద్యార్థిని, బీస్సీ ఫస్ట్ ఇయర్ సేవలపై అవగాహన అవసరం ప్రతీ విద్యార్థికి చదువుతో పాటు సేవా కార్యక్రమాలపై అవగాహన అవసరం. జాతీయ సేవా పథకం ద్వారా క్రమశిక్షణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై అవగాహన వస్తుంది. ప్రజల జీవన విధానం, సామాజిక, ఆర్థిక విషయాలపై అవగాహన పెరుగుతుంది. –డాక్టర్ సురేశ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంఅధికారి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గ్రామాల్లో చెత్తాచెదారం తొలగింపు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుదల : వలంటీర్లు -
వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు.. కల్హేర్(నారాయణఖేడ్): భర్త మరణించాడనే మనోవేదనతో కొడుకుతో కలిసి తల్లి నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగేపల్లికి చెందిన దార ప్రమీల(30), కుమారుడు అక్షయ్(8)ను వెంటబెట్టుకొని బ్యాంకు పని నిమిత్తం వెళ్లి వస్తామని చెప్పి బుధవారం ఇంటి నుంచి బయల్దేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి 20 గేట్ వద్ద కొడుకుతో కలిసి నీటిలోకి దూకింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో చేపలు పట్టే మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను బయటకు తీయించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా ప్రమీల భర్త దార సాయిలు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమీల జీవితంపై విరక్తి చెందింది. మృతురాలికి కూతురు నిహారిక ఉంది. తల్లికొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె ఇంట్లో లేదు. దీంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు తీర్చలేక.. చిన్నశంకరంపేట(మెదక్): అప్పులు చేసి దుబాయికి వెళ్లిన వ్యక్తి తీర్చేందుకు పొలం కుదువ పెడుదామని ప్రయత్నించి విఫలమై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం ప్రకారం... శాలిపేట గ్రామానికి చెందిన మాలే సత్యనారాయణ(40)కు భార్యాపిల్లలున్నారు. పదేళ్ల క్రితం దుబాయి వెళ్లేందుకు అప్పులు చేశాడు. దుబాయి నుంచి తిరిగి వచ్చినప్పటికీ చేసిన అప్పులు మాత్రం తీరలేదు. తనకు ఉన్న 30 గుంటల పొలంతో బతకడం కష్టమని భావించి గత ఏడాది నుంచి మేడ్చల్లో పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చినవాళ్లు అడుగుతుండటంతో గ్రామంలో ఉన్న భూమిని కుదువపెట్టి రూ. 2 లక్షలు ఇవ్వాలని పలువురిని అడిగినా అప్పు పుట్టే మార్గం కన్పించలేదు. దీంతో బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అతడు పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషం తాగి వ్యక్తి...పాపన్నపేట(మెదక్): విషం తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శానాయపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సంబధీకుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గజ్జెన లాలయ్య(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం విషం తాగి ఇంట్లో వాంతులు చేసుకుంటూ పడి పోయాడు. కుటుంబీకులు గమనించే లోగా మృతి చెందాడు. కుటుంబీకుల పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఎస్సై నరేష్ను వివరణ కోరగా ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అనారోగ్య సమస్యలతో.. మిరుదొడ్డి(దుబ్బాక): అనారోగ్య సమస్యలు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ధర్మారంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కథనం ప్రకారం... ధర్మారం గ్రామానికి చెందిన చెప్యాల రాజు, గౌరమ్మ దంపతుల కుమార్తె సౌమ్య (18) రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. సౌమ్య (ఫైల్)సత్యనారాయణ(ఫైల్)మోసపోయి యువకుడు..భాను ప్రకాష్ (ఫైల్)బైక్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నం.. న్యాల్కల్(జహీరాబాద్): బైక్ కొనివ్వలేదని నిరాశకు గురైన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మామిడ్గి గ్రామానికి చెందిన సాలమాన్(35) కొన్ని రోజులుగా బైక్ ఇప్పించాలని తల్లి మొగులమ్మను అడుగుతూ వస్తున్నాడు. దీంతో మూడు రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడు. గురువారం ఉదయం బైక్ ఇప్పించాలని తల్లిని అడుగగా గ్రూపులో డబ్బులు కట్టాల్సి ఉందని, తర్వాత ఇప్పిస్తానని నచ్చజెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సాలమాన్ బావిలో దూకుతానని తల్లికి చెప్పి వెళ్లాడు. గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బావిలో ఉన్న మోటరు పైపును పట్టుకుని నీళ్లలో ఉండిపోయాడు. వెంటనే గ్రామస్తులు నచ్చజెప్పి పైకి రావాలని కోరారు. దీంతో తాడు కట్టుకుని పైపు సహాయంతో పైకి వచ్చాడు. మిరుదొడ్డి(దుబ్బాక): వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారన్న మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ హరీశ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గోత్రాల రాజు పద్మల ఏకై క కుమారుడు భాను ప్రకాశ్ (27) గత ఏడాది జూలైలో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అక్కడ వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారని తేలడంతో ఈ ఏడాది జనవరిలో స్వగ్రామమైన మోతెకు తిరిగి వచ్చాడు. దీంతో సౌదీకి వెళ్లడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదన పడుతుండేవాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. గురువారం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చేపలు పట్టే అధికారం మాదంటే మాది
చిన్నశంకరంపేట(మెదక్): చెరువులో చేపలు పట్టే అధికారం తమదంటే తమదని గ్రామంలోని ఇరువర్గాలు చేపలు పట్టేందుకు సిద్ధం కావడంతో నార్సింగి మండలం వల్లూర్ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామంలోని ఊరు చెరువులో ముదిరాజ్లు చేపలు పట్టేందుకు సిద్ధం కాగా విషయం తెలుసుకున్న గ్రామంలోని ఇతర వర్గాల ప్రజలు తాము కూడా చేపలు పట్టుకుంటామని చెరువు వద్దకు చేరుకున్నారు. గ్రామంలోని చెరువులో చేపలు పట్టే అధికారం తమకే ఉంటుందని ముదిరాజ్లు, లేదు చెరువుపై గ్రామంలోని అందరికీ అధికారం ఉంటుందని మిగితా గ్రామ ప్రజల మధ్య వివాదం నెలకొంది. గతంలో ఇలానే జరిగితే కొందరిని పోలీసులు బైండోవర్ చేశారు. తాజాగా బుధవారం మరోసారి వివాదం నెలకొని ఉద్రిక్తతకు దారి తీసింది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీస్లు ఇరు వర్గాలను సముదాయించారు. గ్రామపంచాయతీ వద్దకు ఇరు వర్గాలను పిలిపించి చర్చించారు. ఇరు వర్గాలు కూడా తమకే హక్కులు ఉన్నాయని వాదనకు దిగడంతో 20 వరకు తమకు ఉన్న హక్కుల పత్రాలను పోలీస్లకు, రెవెన్యూ అధికారులకు అందించాలని సీఐ సూచించారు. అప్పటి వరకు ఎవరు చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కరీం,మత్స శాఖ ఏడీ మల్లేశం, ఎఫ్డీఓ రామ్దాస్ పాల్గొన్నారు. వల్లూర్లో చెరువు వద్ద ఇరువర్గాల పంచాయితీ ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం -
అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తే కటకటాలకే?
మెదక్ మున్సిపాలిటీ: సోషల్ మీడియాలో ఇక పై అశ్లీల పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని మెదక్ పట్టణ సీఐ నాగరాజు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. యువత గూగుల్లో ఫోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి ఎఫ్బి, ఇనస్ట్రాగామ్లలో పోస్టు పెడుతున్నారని, ఎలాంటి వారి పై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా పెట్టిందన్నారు. మెదక్ పట్టణంలో బీటెక్ విద్యార్థి అశ్లీల వీడియో పోస్టు చేస్తే ఆ యువకుడి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో టేక్మాల్, చిన్న శంకరం పేట, తూప్రాన్లలో ఫోర్న్ వీడియోలు పోస్టు చేసిన వారి పై కేసులు నమోదయ్యాయని తెలిపారు. యువత అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా వీడియో పోస్టు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలని సూచించారు. తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. మెదక్ పట్టణంలో బీటెక్ విద్యార్థిపై కేసు జిల్లాల్లో మరో మూడు చోట్ల కేసులు మెదక్ పట్టణ సీఐ నాగరాజు -
ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్య
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులతో ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి–2 కథనం మేరకు.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన మోడబోయిన రామకృష్ణ(35) సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్కి సంబంధించి ఇరిగేషన్ శాఖలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రామకృష్ణ ప్రైవేట్ సంస్థల్లో రుణం తీసుకున్న కారణంగా వచ్చే జీతం పూర్తిగా రుణం తీసుకున్న దానికి అసలు, వడ్డీ సరిపోతుండేది. ఇల్లు గడవం కష్టంగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో నిత్యం మనస్తాపానికి గురయ్యేవాడు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణం తీసుకున్న విషయం తెలియజేయలేదు. తనలో తానే మదనపడుతుండేవాడు. బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అఖిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి జహీరాబాద్ టౌన్: గుర్తు తెలియని వ్యక్తి జహీరాబాద్– వికారాబాద్ మధ్య నడిచే రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోహీర్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పకి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాగుడుకు బానిసై వ్యక్తి నర్సాపూర్ రూరల్: తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ లింగం కథనం మేరకు.. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వాల్మీకి అవినాష్ (29) నిత్యం భార్యతో ప్రతిమతో గొడవ పడుతున్నాడు. తాగుడుకు డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే కారణం -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు
టేక్మాల్(మెదక్): రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలైన ఘటన టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి 161 హైవేపై బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అల్లాదుర్గం గ్రామా ని కి చెందిన వడ్డె బేతయ్య, ఆయన భార్య శ్రీలత బైక్పై సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. వెనుకాల నుంచి బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. మళ్లీ కారు ఢీకొట్టడంతో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి టేక్మాల్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు. క్షతగాత్రులను అంబులెన్స్లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
జహీరాబాద్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన ఘటన కోహీర్ మండలంలోని నాగిరెడ్డి పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ(55) పొలం పనులకు వెళ్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ నాగమ్మ గాయపడింది. వైద్యం నిమిత్తం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మిరుదొడ్డి(దుబ్బాక): పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్మెట కళవ్వ (52) దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండేది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది 12న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి పాపన్నపేట(మెదక్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పొడిచన్పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పొడిచన్పల్లికి చెందిన సర్ధన కిష్టయ్య(40)కు భార్య లక్ష్మి, కూతురు గంగమణి, కుమారుడు బీరప్ప ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారు లేచి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పాపన్నపేట ప్రొబెషనరీ ఎస్ఐ నరేశ్ కేసు నమోదు చేసుకున్నారు. గేదెను తప్పించబోయి లారీ డ్రైవర్ చిన్నకోడూరు(సిద్దిపేట): గేదెను తప్పించబోయి అదుపు తప్పి లారీ బోల్తా పడటంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రామునిపట్ల శివారులో రాజీవ్ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా కాసీంపేట మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన వల్లూరి రాకేశ్ (26) సిద్దిపేటకు చెందిన వ్యాపారి వద్ద లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మంచిర్యాల నుంచి సిమెంట్ లోడ్ లారీతో సిద్దిపేటకు వస్తున్నాడు. రామునిపట్ల శివారులోకి రాగానే రోడ్డుపై గేదె అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి లారీ బోల్తా పడింది. డ్రైవర్ రాకేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాకేశ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
స్టాక్ మార్కెట్ పేరిట సైబర్ మోసం
రూ.21.6 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి పటాన్చెరు టౌన్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగికి బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సూర్యోదయ కాలనీ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మార్చి 25న వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. అతడు తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత స్టాక్ మార్కెట్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇవ్వగా ఆన్లైన్లో నగదు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. మొత్తం రూ.21.06 లక్షలు పెట్టుబడి పెట్టాడు. బాధి తుడు తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. తాను మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్పై విరిగిపడిన చెట్టు తృటిలో తప్పిన ప్రమాదం టేక్మాల్(మెదక్): టేక్మాల్ మండలంలో మంగళవారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు బొడ్మట్పల్లి చౌరస్తాలో ఓ చెట్టు విరిగి గ్రామానికి చెందిన ఉప్పు నర్సప్ప హోటల్పై పడింది. హోటల్లో ఐదుగురు ఉండగా తృటిలో ప్రమాదం తప్పింది. హోటల్ ఉన్న సామగ్రి రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బుధవారం ఉదయం ఆర్ఐ సాయి శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. హోటల్ ఆధారపడి జీవిస్తుండగా పూర్తిగా కూలిపోవడంతో రోడ్డున పడ్డారని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తాళం వేసిన ఇంట్లో చోరీ వెల్దుర్తి(తూప్రాన్) : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ట్రైనీ ఎస్సై జ్యోతి, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మర్కంటి సుశీల మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లగా కుమారుడు ఈశ్వర్ ప్రైవేట్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం ఈశ్వర్ ఇంటికొచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 20 తులాల వెండి వస్తువులతోపాటు రూ.30 వేలు నగదును దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అదే విధంగా గ్రామానికి చెందిన ఖాజాపూర్ దుర్గయ్య ఇంటి తాళాలు పగులగొట్టగా చుట్టుపక్కల వారు మేల్కొనడంతో దుండగులు పరారయ్యారు. వ్యక్తి హత్య కేసులో నిందితుడి అరెస్ట్ సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ రమేశ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నేతాజీ నగర్కు చెందిన పాండరి రాజు 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే కాలనీకి చెందిన రాజవేళి ఈశ్వర్పై వచ్చిన అనుమానంతో ప్రత్యేక టీమ్ అతడిపై నిఘా పెట్టింది. బుధవారం పాత బస్టాండ్ సమీపంలోని మండే మార్కెట్ కల్లు కాంపౌడ్లో అదుపులోకి తీసు కొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజు తనకు డబ్బులు ఇవ్వాలని, ఇవ్వ కపోవడంతో కక్ష పెంచుకొని 10న శనివారం రాత్రి మద్యం సేవించిన అనంతరం రాజుకు ఫోన్ చేసి రాజీవ్ పార్క్కి రమ్మని చెప్పానన్నాడు. సున్నీతో రాజు గొంతు నులిమి, పక్కనే ఉన్న బండరాయితో ముఖంపై కొట్టి హత్య చేసినట్లు తెలిపాడు. మృతుడి భార్య హారతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతీసారి వందశాతం సాధించాలి
● విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే పురస్కారాలు ● తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యం ● ఎంపీ రఘునందన్రావు మెదక్ కలెక్టరేట్: వచ్చేయేడు నుంచి ప్రతీసారి వందశాతం ఫలితాలతో విద్యారంగంలో మెతుకు సీమ సత్తా చాటాలని, విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలె వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, పాఠశాలల హెచ్ఎంలకు సన్మాన, పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, డీఈఓ రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరంలో నూరు శాతం ఫలితాలు లక్ష్యంగా మెతుకు సీమ జిల్లా కీర్తిని విద్యారంగంలో చాటి చెప్పాలని ఎంపీ పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన విద్యార్థులను ఇంటర్లో చేరేలా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు అందిస్తాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా 12వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. 196 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించగా, 17 మంది 570 పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన 196 మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను, 82 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, ప్రత్యేక అధికారులకు సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం ఎంపీ రఘునందన్రావును ఘనంగా సన్మానించారు. సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సంబంధిత సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది భార్య. ఈ ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్లో చోటు చేసుకుంది. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి కథనం మేరకు.. మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి శ్రీను(25) ఏప్రిల్ 16న ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని భార్య లత 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి భార్య లత అదే గ్రామానికి చెందిన మల్లేశంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ పెట్టారు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని భావించిన లత అదే గ్రామానికి చెందిన తన మిత్రుడు మోహన్కు రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్యకు ఒప్పందం కుదుర్చుకుంది. పథకం ప్రకారం గత నెల 16న మధ్యాహ్నం శ్రీనును బ్యాతోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మద్యం, కల్లు సేవించి సీసాతో నెత్తిపై కొట్టగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ హత్యకు వివాహేతర కారణమని, దీనికి కారణమైన మృతురాలు భార్య మైలి లత, మోహన్, మల్లేశంను విచారించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ రాజశేఖర్, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య హవేళిఘణాపూర్లో ఘటన -
రూ.80 లక్షలు మోసం.. యువకుడి అరెస్ట్
● వ్యాపారంలో వాటాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ● గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు కొల్చారం(నర్సాపూర్): పాతికేళ్లు కూడా నిండని ఓ యువకుడు జనానికి మాయమాటలు చెప్పి భారీ ఎత్తున డబ్బులు కాజేశాడు. ఈ ఘటన బుధవారం కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. మండలంలోని సంగాయిపేట గ్రామానికి చెందిన మన్నె శేఖర్ ఇటీవల కుమారుడు చేసిన అప్పులు తీర్చే క్రమంలో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి కుమారుడు మన్నె సాయి చరణ్ సొంత మండలానికి చెందిన వ్యక్తుల నుంచి వ్యాపారంలో వాటా, భూముల అమ్మకాల్లో మధ్యవర్తిత్వంప్రభుత్వ ఉద్యోగాల పేరిట దాదాపు రూ.80 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వకపోగా మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. ఇటీవల గ్రామానికి రావడంతో డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. తన వద్ద లేవని చేతులెత్తేశాడు. బాధితులు కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేయగా సాయి చరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. జనాలు అత్యాశకు పోవడంతోనే ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
డ్రంకెన్ డ్రైవ్లో 72 కేసులు
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో బుధవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నివారణకు వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నా రు. 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులతోపాటు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై 299 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తనిఖీల్లో సిద్దిపేట ఏసీపీ మధు, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూ టౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట సీపీ అనురాధ -
కుటుంబ సమేతంగా దొంగతనాలు
సంగారెడ్డి టౌన్ : వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న కుటుంబ సభ్యుల ముఠాను బుధవారం సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డికి చెందిన యాదగిరి(44), అతడి భార్య అనిత(42), కుమారుడు మైనర్ బాలుడు(17), ముస్లాపూర్ గ్రామానికి చెందిన తలారి లక్ష్మీ (34) బుధవారం సంగారెడ్డి పట్టణంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని హత్నూర, సంగారెడ్డి టౌన్ రంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఆరు దొంగతనాలతోపాటు వికారాబాద్ నర్సాపూర్ మోమిన్పేటలో మొత్తం 53 దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.4 లక్షల నగదు, బైక్ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన రూరల్ సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐ రవీందర్, క్రైమ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దారి దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ తూప్రాన్: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ శివానందం బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్కు చెందిన మనీశ్ కుమార్ గుర్జీ గత నెల 30న మేడ్చేల్ నుంచి ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్తోపాటు మరో ఇద్దరు దాడి చేసి నగదు,సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి మేడ్చేల్కు చెందిన మల్లేశం, బొల్లారానికి చెందిన శ్రీకాంత్, నేరేడ్మెట్కు చెందిన మధును గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా బంగారం, రూ.4 లక్షల నగదు స్వాధీనం -
తరుగు పేరుతో దోపిడీని అరికట్టాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్ నారాయణఖేడ్: జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట నిర్వాహకులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని వెంటనే దీన్ని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయగా అవి నిర్వాహకులు, దళారుల పట్ల కామధేనువుగా మారి రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. తూకంలో క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల దోపి డీపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయని పక్షంలో రైతుల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
భూసార పరీక్షలు తప్పనిసరి
నాగిరెడ్డిపల్లి, కొత్తపల్లిలో రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం జహీరాబాద్ టౌన్/జిన్నారం (పటాన్చెరు): రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు డాక్టర్ తబస్సుం ఫాతిమా, డాక్టర్ హరి, నవీన్కుమార్, ప్రశాంత్, పటాన్చెరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, శాస్త్రవేత్తలు జానకి, హేమలత ఏఈఓ ప్రణవి పాల్గొని మాట్లాడారు. పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఎరువుల వాడకం, చీడపీడల నివారణ, విత్తానభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులు, సమీకృత సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వ్యవసాయ పథకాల గురించి రైతులకు వివరించారు. స్థానిక రైతాంగానికి ఆయా పంటలకు సంబంధించిన సూచనలను సలహాలను అందజేశారు. -
ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషంట్ తదితర వార్డుల్లో కలియదిరిగి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుపేదలే ప్రభుత్వాస్పత్రికి వస్తారని, వారికి మెరుగైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది పనితీరును పరిశీలించాలని సూపరింటెండెంట్ శ్రీధర్ను ఆదేశించారు. సంగారెడ్డిలో భారీ వర్షంసంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పట్టణంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో వేసవితాపంతో అల్లాడుతున్న పట్టణ ప్రజలకు కొంచెం ఉపశమనం లభించినట్లైంది. భారీ వర్షానికి మురికి కాలువల నీరు రోడ్లపై వెళ్లడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతీసారి రోడ్లపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సమ్మె పోస్టర్ ఆవిష్కరణజహీరాబాద్ టౌన్: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాల రద్దు కోసం ఈ నెల 20 నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను సీఐటీయూ నాయకులు బుధవారం జహీరాబాద్ మహీంద్ర కంపెనీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. లేబర్ కోడ్ వంటి చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కనకారెడ్డి, గణేశ్, నరేష్, శేఖర్,రాజు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో కొత్తగా బీబీఏ, బీకాం కోర్సులుసదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులతోపాటు కొత్తగా బీబీఏ, బీకాం,(బీఎఫ్ఎస్ఐ) కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ భారతి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ‘దోస్త్’ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీకాం(బీఎఫ్ఎస్ఐ) కోర్సు ద్వారా పారిశ్రామిక రంగానికి అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. -
అన్నిరూట్లకు బస్సు సర్వీసులు బస్సుుపుతాం
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డిపోకు 30 కొత్త బస్సులు మంజూరుకాగా బుధవారం స్థానిక బస్టాండ్లో ఆయా బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పదేళ్ల బీఆర్ఎస్ హాయాంలో ఒక్క కొత్త బస్సుకూడా మంజూరు కాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిన్నరలోనే కోరగానే మంత్రి పొన్నం ప్రభాకర్ 30 బస్సులను మంజూరు చేయించడంతోపాటు నూతనంగా 10 మంది డ్రైవర్లను నియమించారని గుర్తు చేశారు. అన్నిరూట్లలో బస్సులు నడిపేలా చూస్తామన్నారు. డీఎం మల్లేశయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో పాదయాత్ర...సమస్యలపై ఆరా ఖేడ్ పట్టణంలోని వివేకానంద కాలనీతోపాటు పలు కాలనీల్లో సంజీవరెడ్డి పర్యటించారు. కాలనీల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాలసదనంలో వేడుకలు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన జన్మదినం సందర్భంగా సతీమణి అనుపమారెడ్డితో కలిసి స్థానిక షిర్డీసాయి బాబా ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు, నాయకులు దంపతులను గజమాలతో సత్కరించారు. స్థానిక బాలసదనంలో అనాథ బాలికల మధ్య కేకు కోసి ఎమ్మెల్యే జన్మదినం జరుపుకొన్నారు. బాలసదనానికి సొంతఖర్చుతో ఎల్ఈడీ టీవీని బహూకరించారు. కొత్త బస్సుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
తరుగు సమర్పయామి
తరుగుతీత కేంద్రాలుగా మారిన కొనుగోలు కేంద్రాలు ● క్వింటాలు జొన్నకు 5 కిలోలు తీస్తున్న వైనం ● సుతిలికీ డబ్బులు.. హమాలీ రూ.80 వసూలు ● పంట అమ్ముకునేందుకు వారం పడిగాపులు నారాయణఖేడ్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుందని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. టోకెన్లు పొందడం నుంచి పంటను అమ్ముకునే వరకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంతా చేసినా క్వింటాలుకు తరుగు పేర 5కిలోలు సమర్పించుకోక తప్పడంలేదు. జొన్న విక్రయాల్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ ప్రాంతంలో జొన్న పంట సాగు జరుగుతుంది. మనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో తరుగు పేర యథేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారు. 50కిలో చొప్పున తూకం వేయాల్సిన బస్తా 52.5కిలోల నుంచి 53కిలోల వరకు తూకం వేస్తున్నారు. క్వింటాలు వద్ద 5 నుంచి 6కిలోల తరుగు పేర దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లకే నాలుగైదు రోజులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.3,371 మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. బయటి మార్కెట్లో రూ.2,200 నుంచి రూ.2,500 లోపే ఉండటంతో రైతులు కేంద్రానికి పంటను తీసుకు వస్తున్నారు. కేంద్రంలో అమ్ముకునేందకు టోకెన్లకు కూడా నాలుగైదు రోజులు తిరిగి దక్కించుకోవాల్సి వస్తుందని, టోకెన్లు లభించినా కేంద్రం వద్ద ఐదారు రోజులు పడిగాపులు పడుతున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉన్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోతున్నారు. అమ్ముకునేందుకు పడిగాపులు పంటలను ఈ కేంద్రంలో అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో రైతు నాలుగైదు రోజులు కేంద్రం వద్ద వాహనాలతో ఉండాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు వాహనం రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల చొప్పున తరుగు పేర దోపిడీకి తోడు సుతిలి (తాడు) పేర డబ్బులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. క్వింటాలు హమాలీ కింద రూ.80 వసూలు చేస్తున్నారు. -
పంట చెల్లింపుల్లో జాప్యం
● పక్షం రోజులైనా పత్తాలేని డబ్బులు ● ఈ పంట బకాయిలు రూ.41.58 కోట్లు ● విడుదలైన వెంటనే చెల్లిస్తామంటున్న అధికారులు అధికారుల చుట్టూ తిరుగుతున్న జొన్న రైతులుఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడం వరకూ ఒక ఎత్తయితే ఆ పంటకు సంబంధించిన డబ్బులు రాబట్టుకోవడం మరో ఎత్తుగా మారింది జిల్లాలోని జొన్న రైతులకు. పంట విక్రయించి 15 రోజులు గడుస్తున్నా చాలామంది రైతులకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. దీంతో డబ్బులు రాబట్టుకునేందుకు అన్నదాతలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికై నా జొన్న రైతులకు పంట విక్రయ డబ్బులు చెల్లించడంలో జాప్యాన్ని నివారించాలని కోరుతున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 16 చోట్ల జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సహ కార సంఘాలకు, డీసీఎంఎస్లకు అప్పగించారు. ఈ జొన్నలను మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తోంది. సుమారు 20 రోజుల క్రితం ఈ కేంద్రాల్లో జొన్నల సేకరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు 4,904 మంది రైతుల వద్ద 12,334 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఈ జొన్నలకుగాను రైతులకు రూ.41.58 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోళ్లు ప్రారంభించి పక్షం రోజులు దాటినప్పటికీ రైతులకు పైసా చెల్లించలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.పెట్టుబడుల అవసరాలకు డబ్బులేవి? ప్రస్తుతం ఖరీఫ్ పంటసాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం పెట్టుబడుల కోసం డబ్బులు అవసరం ఉంటాయి. అయితే పంట డబ్బులు చేతికందకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కాలేవని, విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కలెక్టర్ వల్లూరు క్రాంతి కంది(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు. కందిలోని మైనారిటీ గురుకుల పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ను బుధ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామన్నారు. మైనారిటీ విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదివేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎల్సీ బహుమతి, మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. -
వారంలో సీఎం రేవంత్ పర్యటన!
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం న్యాల్కల్(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్థానిక ఎంపీపీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో సీఎం జహీరాబాద్కు వస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజల నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. న్యామతాబాద్, శంశల్లాపూర్, టేకూర్, హుస్సేన్ నగర్, మల్గి, కాకిజన్వాడ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. డప్పూర్, న్యామతాబాద్, వడ్డి, హద్నూర్, రుక్మాపూర్, రాంతీర్థ్ తదితర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య గురించి విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, రాజీవ్ వికాస్ తదితర పథకాలను గూర్చి సమావేశంలో చర్చించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, డీఈఈ సుజాన్, డీపీఓ సాయిబాబా, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, ఆర్డీవో రాంరెడ్డి, ఎంపీఓ సౌజన్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రైతులు ఇబ్బంది పడకూడదు
అదనపు కలెక్టర్ మాధురికంది(సంగారెడ్డి): కొనుగోలు చేసిన వరి ధాన్యా న్ని లారీలను పెంచి మరీ వెంటనే మిల్లులకు చేర్చి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ మాధురి అధికారులకు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కందిలో బుధవారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ధాన్యం తీసుకువచ్చేందుకు గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు తాగు నీరు, నీడ వంటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అలాగే వర్షంతో ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పలీన్లు కేంద్రంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ అంబదాస్, డీసీఎంఎస్ మేనేజర్ ఆంజనేయులు, తహసీల్దార్ ఆశాజ్యోతి, డీసీఓ కిరణ్, సీఈవో శ్రీధర్రెడ్డితోపాటు ఏఈఓలు పాల్గొన్నారు. -
చెరుకు పంటకూ బోనస్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరుకు పంటకూ బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. టన్నుకు రూ.500 వరకు ఇవ్వాలని కేన్ కమిషనరేట్ నుంచి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు సమాచారం. అయితే టన్నుకు రూ.225 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు కేన్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను ప్రోత్సహించడంతోపాటు, చక్కెర పరిశ్రమలు, చెరుకు ఆధారిత పరిశ్రమలకు సైతం ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.సాగు పెరిగితే సర్కారుకు భారీగా ఆదాయమే..రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం పెరిగితే సర్కారుకు ఆదాయం పెరుగుతుంది. ఎకరం సాగైతే సర్కారు ఖజానాకు సుమారు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తుందని సంబంధిత పరిశ్రమల వర్గాలు లెక్కగట్టాయి. చెరుకు నుంచి చక్కెరతోపాటు ఉప ఉత్పత్తులు వస్తాయి. లిక్కర్ తయారీకి అవసరమైన మొలాసిస్ (రెక్టిఫైడ్ స్పిరిట్), ఇథనాల్ (గ్రీన్ ఫ్యూయల్) తయారీకి చెరుకే మూలాధారం. చక్కెరతోపాటు, ఈ ఉప ఉత్పత్తులపై సర్కారుకు భారీగా పన్ను రాబడి ఉంటుంది. సాంగ్లీని సందర్శించిన ప్రజాప్రతినిధుల బృందం మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న నిజాం–దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధుల బృందాలు ఇటీవల మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో ఉన్న చక్కెర కర్మాగారాలను సందర్శించింది. అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చెరుకు పంటకు బోనస్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే బహిరంగసభ ఏర్పాటు చేసి ఈ బోనస్ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల అన్ని జిల్లాలకు చెందిన సీడీసీ (కేన్ డెవలప్మెంట్ కమిటీ) చైర్మన్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఏటా పడిపోతున్న విస్తీర్ణం రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతోంది. ఒకప్పుడు ఐదు లక్షల ఎకరాల వరకు ఉండే ఈ పంట విస్తీర్ణం ఇప్పుడు 82 వేల ఎకరాలకే పరిమితమైంది. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 28 వేల ఎకరాలు సాగవుతుండగా, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడా చెరుకు సాగవుతోంది. మూతపడుతున్న పరిశ్రమలు..చెరుకు సాగు విస్తీర్ణం పడిపోవడంతో చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఉన్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత ఏడాదే మూతపడిన విషయం విదితమే. ప్రస్తుతం కేవలం ప్రైవేట్ రంగంలోని చక్కెర కర్మాగారాలే పనిచేస్తున్నాయి. చెరుకు సాగువిస్తీర్ణం ఇలాగే తగ్గుతూ పోతే కర్మాగారాలు ఒక్కొక్కటిగా మూతపడే అవకాశాలున్నాయి. దీంతో బోనస్ ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా ఈ పరిశ్రమలకు ఊతమిచ్చినట్టు కూడా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
భూములను రీ సర్వే చేయండి
దుబ్బాక: మండంలోని హబ్సిపూర్ గ్రామంలో గల సర్వే నంబర్ 417, 418లో వేణుగోపాలస్వామి ఆలయం పరిధిలో ఉన్న భూములు కొందరు కబ్జా చేశారని గ్రామస్తులు ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం సర్వే చేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎండోమెంట్ భూములు కబ్జాకు గురైతున్నాయని గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు భూములను సర్వే చేస్తున్నామన్నారు. భూమూలు కబ్జా చేస్తే చర్యలు తప్పవన్నారు. అధికారులు గతంలో సర్వే చేసిన మాదిరిగానే మళ్లీ సర్వే చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలు పుల్కల్ మండల వాసి చేగుంట(తూప్రాన్): ఇటీవల మండల శివారులో కాలిపోయి గుర్తు పట్టకుండా ఉన్న మహిళ మృతదేహం పుల్కల్ మండలానికి చెందిన మహిళదిగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం మేరకు.. 7న చేగుంట శివారులోని జాతీయ రహదారి పక్కన కాలిపోయి గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహం గుర్తించి కేసు నమోదు చేశాం. మృతురాలి ఆచూకీ కోసం విచారణ చేపట్టగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్ స్టేషన్లో బస్వాపూర్ గ్రామంలో మహిళ అదృశ్యంపై కేసు నమోదైనట్లుగా తెలిసింది. ఈ కేసు ఆధారంగా వివరాలు సేకరించి బస్వాపూర్ గ్రామానికి చెందిన జయమ్మగా గుర్తించాం. మహిళది హత్యగా భావించిన పుల్కల్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. -
వరకట్న వేధింపుల కేసులో నలుగురు అరెస్ట్
సిద్దిపేటకమాన్: వరకట్న వేధింపుల కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టూటౌన్ సీఐ ఉపేందర్తో కలిసి ఏసీపీ మధు కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్న పవన్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామానికి చెందిన దంతూరి పుష్ప, భిక్షపతిల కూతురు అక్షయ (25)ను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020లో ఇరు కుటుంబ సభ్యులు రూ.5 లక్షల కట్నంతో పాటు నాలుగు తులాల బంగారం పెట్టి మళ్లీ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. పవన్ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్నాడు. అప్పటినుంచి అదనపు కట్నం కోసం అక్షయను భర్త పవన్, అతడి కుటంబ సభ్యులు వేధిస్తుండటంతో భరించలేక 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం అక్షయ భర్త పవన్తోపాటు మామ సత్తయ్య, అత్త కనకవ్వ, మరిది కల్యాణ్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
దుబ్బాక దవాఖాన రాష్ట్రంలోనే టాప్
దుబ్బాక: రాష్ట్రంలోనే ఉత్తమ వైద్య సేవలు అందించడంలో దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా నిలిచింది. తాజాగా తెలంగాణ (ఈహెచ్ఎంఐఎస్) వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ విడుదల చేసిన జాబితాలో ఉత్తమ ఓపీ వైద్య సేవల్లో దుబ్బాక ఆస్పత్రి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా, జిల్లా ఆస్పత్రులు, సీహెచ్సీలతోపాటు ఉస్మానియా ఆస్పత్రితోపాటు పెద్దాస్పత్రులను మొత్తం 102 ఆస్పత్రులను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసింది. జనవరి 1న 2025 నుంచి మే8 వరకు గణాంకాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు. అబా యాప్లో రోగుల ఆరోగ్య రికార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అబా యాప్ (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతా) ద్వారా దుబ్బాక ఆస్పత్రికి వచ్చే రోగుల రికార్డులను పొందుపరుస్తున్నారు. ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చే రోగులకు వారి మొబైల్లో అబా యాప్ను ఇన్స్టాల్ చేసి రోగి ఆరోగ్య వివరాలు పొందు పరుస్తున్నారు. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఈ అబా యాప్ను చూపిస్తే వారి ఆరోగ్య పరిస్థితి అంతా తెలిసిపోతుంది. ఇందు కోసం ఆస్పత్రిలో 7 మాడ్యుళ్లను సజావుగా నడుపుతున్నారు. జనవరి 1, 2025 నుంచి మే 8, 2025 వరకు ఓపీడీ 25,593, ఈఓపీ 15,000 రోగులు కలిపి మొత్తం 40,593 మంది రోగులు దుబ్బాక ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఆస్పత్రిలో 300 ఓపీ ఐతే అబా 150 టోకెన్లు, డాక్టర్ ప్రిస్కిప్షన్ 200 నుంచి 250 అవుతుంది. డాక్టర్ ప్రి స్కిప్షన్ 90 శాతం, అబా 80 శాతంతో రాష్ట్రంలో ఓపీ వైద్యసేవల్లో టాప్లో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలువగా ఈసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవలె సందర్శించిన కమిషనర్ మే 3న దుబ్బాక ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సందర్శించి ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ప్రశంసించారు. సరైన వైద్య సిబ్బంది లేకున్నా కార్పొరేట్కు దీటుగా సేవలు అందిస్తూ రాష్ట్రంలో ఉత్తమ ఆస్పత్రిగా నిలవడం అభినందనీయం అన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పి స్తామని హామినిచ్చారు. కమిషనర్ వచ్చిన ఐదు రోజులకే ఓపీ వైద్య సేవల్లో టాప్ స్థానంలో నిలువడం విశేషం.ఓపీ సేవల్లో మొదటి స్థానంలో నిలిచిన ఏరియా ఆస్పత్రి ఈహెచ్ఎంఐఎస్ జాబితా విడుదల ర్యాంకు ఇచ్చిన వైద్యారోగ్య శాఖ ఇటీవలె ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్వైద్య సిబ్బంది సహకారంతోనే.. ఓపీ వైద్య సేవల్లో దుబ్బాక ఏరియా ఆస్పత్రి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువడం చాలా సంతోషంగా ఉంది. వైద్యులు, సిబ్బంది నిరంతర సహకారంతోనే ఈ ఘనత సాధించాం. ఇంకా మంచి వైద్య సేవలు అందించి ఉత్తమ స్థానంలో నిలుస్తాం. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన తమ వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – డాక్టర్ హేమరాజ్సింగ్, దుబ్బాక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మొదటి స్థానం సంతోషకరం ఉత్తమ వైద్య సేవల్లో దుబ్బాక ఏరియా ఆస్పత్రి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువడం సంతోషకరం. ఇప్పటికే అరుదైన సర్జరీలు, వైద్య సేవలు అందించడంలో రాష్ట్రంలోనే మంచి పేరు సాధించింది. సరిపడా వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు లేనప్పటికీ ఉన్న సిబ్బందితో నిరంతరం కష్టపడి ఈ ఘనత సాధించడం విశేషం. – కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే -
వంటిమామిడి వద్ద పోలీస్ల స్పెషల్ డ్రైవ్
ములుగు(గజ్వేల్): నిత్యం వాహనాల రద్దీతో రాకపోకలకు ఆటంకంగా మారిన రాజీవ్ రహదారిపై గల వంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద మంగళవారం ములుగు పోలీస్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్–కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిపై వంటిమామిడి మార్కెట్ యార్డు ఉంటుంది. ప్రతీ నిత్యం తెల్లవారు జాము 4 గంటలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయల విక్రేతలు, వ్యాపారుల వాహనాలతో సందడిగా ఉంటుంది. దీంతో ఈ రోడ్డుపై కరీంనగర్, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకంగా మారింది. రాజీవ్ రహదారిపై క్రయవిక్రయాల రద్దీని అధిగమించేందుకు యార్డు ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మార్కెట్ నిర్మాణం చేపడుతామని ఇటీవలె ఇక్కడి పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. తాజాగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ డైరెక్టర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రోడ్డుపైన రాకపోకలకు అవరోధంగా నిలిచిన కూరగాయల వాహనాలను మార్కెట్యార్డు లోపలికి పంపించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. వంటిమామిడి మార్కెట్ యార్డు ఎదుట మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ ములుగు తహసీల్దార్ ఆరీపాతో కలసి మంగళవారం పరిశీలించారు.వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు -
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రోత్సాహం
రైతులు వరి, మామిడి, తదితర పంటను సాగు చేసి అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను పిచికారీ చేసి పెట్టుబడుల భారం పెంచుకుంటున్నారు. చివరికి వడగళ్లు, అకాల వర్షాలకు పంట నేలపాలై ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఎక్కువగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తుంది. ఇటీవల గ్రామాల వారీగా ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ, లీవింగ్పామ్ కంపెనీ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఆయిల్పామ్ సాగు ద్వారా వచ్చే దిగుబడి, ఆదాయాలపై వివరిస్తున్నారు. పెద్దశంకరంపేట(మెదక్) /హుస్నాబాద్రూరల్:తోటపల్లిలో ఆయిల్ పామ్లో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసిన రైతునాలుగేళ్లు అంతర పంటల సాగు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు పంట చేతికొచ్చే నాలుగేళ్ల సమయంలో అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. మొక్కజొన్న, పత్తి, పెసర్లు, మినుములు, బొబ్బర, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మునగ మొదలగు పంటలను రైతులు సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల సాగు నీటి కొరతను రైతులు అధిగమించి పంట దిగుబడులు తీయొచ్చు. ఆదాయం పొందవచ్చు. మెదక్ జిల్లాలో 5 వేల ఎకరాలు లక్ష్యం జిల్లాలో 5 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 1,000 ఎకరాల్లో ఆయిల్పామ్ పంటను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న పలువురు రైతులు వంట మార్పిడి చేయాలని భావించి ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,000 ఎకరాల వరకు ఆయిల్ పామ్ పంటను సాగు చేశారు. ఇటీవలె పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లో రైతులతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. వరి పంటను తగ్గించి.. హుస్నాబాద్ డివిజన్లో అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో 1,700 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. యాసంగి పంటలకు సాగు నీటి కొరతను అధికమించడానికి వరి పంటను తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేస్తే లాభాలు పొందవచ్చు. డివిజన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1,000 ఎకరాలు, ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో 1,500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు పంట దిగుబడులు రాగానే నంగునూర్ మండలంలోని ఆయిల్ పామ్ కంపెనీ వారే రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేయనున్నారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్పు పరికరాలు ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్పు పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్ పామ్ మొక్కలను 90 శాతం సబ్సిడీ పై రూ.1,140కి రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలను ప్రభుత్వం అందిస్తుంది. నాలుగేళ్లు పంటల నిర్వహణ కోసం ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. పెద్ద రైతులు వరి పంటలను తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం హుస్నాబాద్ డివిజన్లోని పెద్ద రైతులు ఎక్కువ వరి సాగు తగ్గించి దీర్ఘకాలిక పంటైన ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ప్రతీ ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై మొదలు జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని హుస్నాబాద్ ఏడీఏ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేత అవగాహన కల్పిస్తున్న అధికారులు వినియోగించుకోవాలంటూ సూచనలురైతులకు అదనపు ఆదాయం రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని పొందాలంటే ఆయిల్ పామ్ సాగు అనేది మంచి నిర్ణయం. రైతులు వరి, మొక్క జొన్న, పత్తి పంటల్లో స్వల్పకాలికంగా ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా రైతు ఆదాయం పెరగాలంటే తప్పనిసరిగా ఆయిల్ పామ్ సాగు చేయాలి. ప్రభుత్వం డ్రిప్ కు మరియు మొక్కలకు అధిక మొత్తంలో రాయితీలను ఇవ్వడం వలన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టేందుకు అవకాశం ఉంది. – సంతోష్, జిల్లా ఉద్యానశాఖ అధికారిమొక్క రూ.20కే అందిస్తున్నాం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూల వాతావరణం ఉంది. ఒక ఎకరాకు 57 మొక్కలు అవసరం ఉంటుంది. ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.193 కానీ సబ్సిడీపై రైతులకు కేవలం ఒక మొక్కను రూ.20 అందిస్తున్నాం. అంతేగాక పంట సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఆయిల్ పామ్ సాగు చేసిన నాలుగేళ్ల తర్వాత నుంచి దిగుబడి వస్తుంది. అప్పటి వరకు అంతర వంట సాగు కోసం ఏడాదికి రూ.4,200 అందజేయడం జరుగుతుంది. – జాన్సన్, లీవింగ్ పామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ -
సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు
కొమురవెల్లి(సిద్దిపేట): రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం అవకతవకలు జరిగిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన కొమురవెల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు కథనం మేరకు.. మండలంలోని కిష్టంపేట శివారులో ఉన్న శ్రీనివాస రైస్మిల్లో సివిల్ సప్లయ్ మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం సీఎంఆర్కు అప్పగించిన ధాన్యం మిల్లింగ్లో మొత్తం 18,513 క్వింటాళ్ల ధాన్యం అవకతవకలకు గురైందని, దాని విలువ రూ.4,57,93,542 ఉంటుందని పోలీస్ స్టేషన్లో సివిల్ సప్లయ్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మిల్లు యజమానులైన ఆకుల ప్రతాప్, ఆకుల కృష్ణ, ఆకుల శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్ : వ్యక్తి మృతికౌడిపల్లి(నర్సాపూర్): బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మహమ్మద్నగర్ శివారులోని హనుమాన్గుడి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం మేరకు.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కుర్మ కిష్టయ్య(51) భార్య పద్మతో కలిసి బైక్పై వెల్దుర్తి మండలం దర్పల్లి గ్రామంలో బంధువుల వద్దకు సోమవారం వెళ్లాడు. మంగళవారం ఒక్కడే తిరిగి వస్తున్నాడు. మహమ్మద్నగర్ శివారులోని హనుమాన్ ఆలయం సమీపంలోని అడవిలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్తోపాటు అతను పొదల్లో పడిపోయాడు. చాలా సేపటికి పెట్రోలింగ్ పోలీసులు చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి దత్తత కుమారుడు గొరకంటి షాదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.అప్పుల బాధతో ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్యవేలూరు గ్రామంలో వ్యక్తివర్గల్(గజ్వేల్): అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం వేలూరులో మంగళవారం చోటు చేసుకుంది. గౌరారం ప్రొబేషనరీ ఎస్ఐ కీర్తి రాజు కథనం మేరకు.. వేలూరుకు చెందిన చింతకింది మహేశ్(36), అనూష దంపతులకు కూతురు వైష్ణవి ఉంది. నాలుగేళ్ల కిందట మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. భార్య అనూష కూలీగా పని చేస్తుంది. 14 నెలల కిందట నుంచి గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నారు. తెలిసిన వారి దగ్గర అప్పు చేసినప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తికాలేదు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ మంగళవారం ఉదయం భార్య కూలీ పనికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.జహీరాబాద్లో నగల వ్యాపారిజహీరాబాద్: అప్పుల బాధతో నగల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్ పట్టణంలోని మహీంద్ర కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న రవికాంత్(34) బంగారం నగల వ్యాపారం చేసుకుంటున్నాడు. అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు పేర్కొన్నాడు. -
రాంగ్రూట్లో వచ్చి.. బైక్ను ఢీకొట్టి
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్రూట్లో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న బైక్ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట సమీపంలోని సిరి వెంచర్ వద్ద 765డి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని రాజిపేట గ్రామానికి చెందిన ఊరట్ల లక్ష్మణ్, అతడి స్నేహితుడు తోల్ల రమేశ్ ఇద్దరూ పెట్రోల్ పంపులో పనులు చేస్తారు. సొంత పని నిమిత్తం బైక్పై నర్సాపూర్ వెళ్తున్నారు. వెంకట్రావ్పేట సమీపంలోనికి రాగానే ఎదురుగా కొల్చారం గ్రామానికి చెందిన వేణు మాదవ్ కారును అజాగ్రత్తగా నడుపుతూ రాంగ్ రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్, రమేశ్ ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను 108లో ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్ మేనమామ ఊరట్ల వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాన్ని వెనుక నుంచి వస్తున్న వేరే కారులోని వ్యక్తులు సెల్ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లారీ ఢీకొని యువతికి గాయాలు చేగుంట(తూప్రాన్): లారీ ఢీకొని యువతికి గాయా లైన ఘటన మండల కేంద్రమైన చేగుంట గాంధీ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన నేరెళ్ల శిరీష అమ్మమ్మ ఇంటికెళ్లేందుకు చేగుంటలో బస్సు దిగింది. అక్కడి నుంచి రామేశంపల్లెకు వెళ్లడానికి రామాయంపేట బస్సు కోసం నడుచుకుంటూ వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలైన శిరీషను 108 అంబులెన్స్లో మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. కౌడిపల్లి మండలంలో కారు బీభత్సం ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు -
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
రామాయంపేట(మెదక్): మండలంలోని తొనిగండ్ల గ్రామ శివారులో సోమవారం రాత్రి గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామ శివారులో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా తల, ముఖం, చేతులు, ఛాతి కమిలిపోయినట్లు గుర్తించాం. అంగ వైకల్యంతో మృతురాలి రెండు కాళ్ల పాదాలు వంకరగా ఉన్నా యి. కుడి చేతిపై రజిత, ఎడమ చేతిపై మహేశ్ అనే పేర్లు పచ్చబొట్టు వేయించుకుంది. మెదక్తోపాటు కామారెడ్డి జిల్లాలో ఆచూకీ కోసం ఆయా పోలీస్స్టేషన్లకు సమాచారం పంపించాం. కనీసం ముగ్గు రు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి ఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వ రలో మృతురాలి ఆచూకీ కనిపెట్టి నిందితులను అ రెస్ట్ చేస్తామని తెలిపారు. అలాగే, తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, స్థానిక సీఐ వెంకట్రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజ్ ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
రేపు ఖేడ్ గురుకులంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
నారాయణఖేడ్: ఖేడ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 2025 –26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024 –25 విద్యా సంవత్సరంలో పదవతరగతి ఉత్తీర్ణత సాధించిన బాలురకు ఈనెల 15న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హయత్నగర్లోని పీవీటీజీ బాలుర కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మెరుగైన ఆర్టీసీ సేవలకు కృషినారాయణఖేడ్: ఆర్టీసీ సేవలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. మంగళవారం ఖేడ్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖేడ్కు చెందిన పండరీరెడ్డి ఫోన్చేసి ఖేడ్ నుంచి హన్మంతరావుపేట మీదుగా సంగారెడ్డికి, మాణిక్ పటేల్ ఫోన్చేసి ఉదయం ఖేడ్ నుంచి కంగ్టి మీదుగా లింగంపల్లికి బస్సులు నడపాలని కోరారు. నిజాంపేటకు చెందిన లక్ష్మణ్ మండల కేంద్రమైనందున నిజాంపేటలో డీలక్స్ బస్సుస్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ రాజీవ్ చౌరస్తాలో ప్రయాణికుల నిరీక్షణకు నీడలేనందున సౌకర్యాలున్న మంగల్పేట్ బస్టాండ్లోనే బస్సులను కొద్దిసేపు నిలపాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను నమోదు చేసుకున్న డీఎం వాటిని పరిష్కరిస్తామని వివరించారు. దైవచింతనతో మానసిక ప్రశాంతతఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పటాన్చెరు టౌన్: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని అద్దంకి దయాకర్ దంపతులు మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ దంపతులకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవకతవకలు ఉండొద్దుసంగారెడ్డి: వడ్ల కొనుగోళ్లలో అవకతవకలు ఉండొద్దని డీఆర్డీఓ జ్యోతి సూచించారు. చౌట్కూర్ మండలంలో కొనసాగుతున్న ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించి కొనుగోళ్లపై ఆరా తీశారు. పోసానిపల్లి, వెంకటకృష్ణాపూర్, వెండికోల్ తదితర గ్రామాల్లో తనిఖీ చేసి కొనుగోళ్లకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలను పరిశీలించారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలినారాయణఖేడ్: కార్మికుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. ఈ నల్లచట్టాల రద్దు కోసం ఈనెల 20న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను ప్రజలంతా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖేడ్లో సమ్మె పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్లపై కార్మిక వర్గం తిరుగుబాటు తప్పదన్నారు. ఈ చట్టాలు అమలైతే ఈఎస్ఐ, పీఎఫ్ ఎటు వంటి కార్మిక చట్టాలు అమలు కావని అన్నారు. -
సేంద్రియ వ్యవసాయమే పంటకు బలం
జహీరాబాద్: సేంద్రియ వ్యవసాయంతోనే పంటకు బలమని, ఈ దిశగా రైతులు ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి సూచించారు. కోహీర్ మండలంలోని గొటిగార్పల్లిలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట పంటలను వేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. రైతులు యూరియాను అధిక మొత్తంలో వాడడం వల్ల చీడ పీడల సమస్య, సాగు ఖర్చు పెరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పంట మార్పిడి చేయడం వల్ల నేల సారవంతమవుతుందని తెలిపా రు. బిందుసేద్య పద్ధతివలన సాగునీటి వనరులు ఆదాచేసి భావి తరాల వారికి అందించవచ్చన్నారు. బసంత్పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం, కందిలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నవీన్కుమార్, శాస్త్రవేత్తలు విజయలక్ష్మిం, రాజేందర్, శ్రీనివాసులు ఏఈఓలు స్వాతి, సంధ్య, సవిత, మౌనిక, వర్మ, ప్రవీణ్కుమార్, రైతులు పాల్గొన్నారు. రైతుల అవగాహన సదస్సులో ఏడీఏ భిక్షపతి -
పైరాలసిస్ పరేషాన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పైరాలసిస్ పరిశ్రమలు వెలువరిస్తున్న కాలుష్యంతో స్థానికులు పడరానిపాట్లు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోవాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు మసిబారుతున్నాయి. పాత టైర్లను కాల్చి అందులోంచి ఉప ఉత్పత్తులను తీసే ఈ పైరాలసిస్ పరిశ్రమలతో పరిసర గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిశ్రమల్లో టైర్లను కాల్చే క్రమంలో దట్టమైన నల్లని పొగ కమ్ముకుని పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నల్లని రేణువులు నిండిపోతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా నడుస్తోన్న ఈ పరిశ్రమలతో వచ్చే కాలుష్యంతో స్థానికుల జీవనమే అస్తవ్యస్తంగా తయారైంది.పాత టైర్ల నుంచి ఉప ఉత్పత్తులుపైరాలసిస్ పరిశ్రమల్లో పాత టైర్లను కాల్చి ఉప ఉత్పత్తులను తీస్తారు. ఇలా కాల్చడం ద్వారా వచ్చే ఆయిల్ను డాంబార్ కంపెనీలకు విక్రయిస్తుంటారు. బూడిదను సిమెంట్ ఉత్పత్తి చేసే కంపెనీలకు అమ్ముతుంటారు. టైర్లలో ఉండే ఐరన్ తీగలను చత్తీస్గఢ్తోపాటు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.జిల్లాలో 24 పరిశ్రమలు...ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందిన ఈ పైరాలసిస్ పరిశ్రమలు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 24 వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పరిశ్రమలు ప్రస్తుతానికి మూత పడగా, ప్రస్తుతం 19 నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నాయి. ఎక్కువగా కొండాపూర్ మండలంలోని ఎదురుగూడెం, మల్లేపల్లి, గుంతపల్లి, గొల్లపల్లి, తేర్పోల్ గ్రామాల శివారుల్లో ఈ పరిశ్రమలున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రమాణాల ప్రకారం ఈ పరిశ్రమలు రెడ్ కేటగిరీలోకి వస్తాయి.జిల్లాలోని పైరాలసిస్ పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజల బతుకులు మసిబారుతున్నాయి. టైర్లను కాల్చి వాటి నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసి లాభాలనార్జిస్తున్న ఈ పరిశ్రమలు ప్రజారోగ్యంతోపాటుగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను విస్మరించాయి. నిర్దేశిత ప్రమాణాల నిర్వహణ విధానాల్ని పాటించని ఈ పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలకు ఉపక్రమించినా... జరుగుతున్న జాప్యంతో స్థానికుల బతుకులు పొగచూరుకుంటున్నాయి. -
డిగ్రీ దోస్త్ షురువైంది
● ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ● మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 18,150 సీట్లు జహీరాబాద్ టౌన్: ఇంటర్ ఫలితాలు వచ్చాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విడతలుగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. జూన్ నెలాఖరు వరకు అడ్మిషన్లు పూర్తి చేసి 30 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లలో పారదర్శకతకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2025–26 విద్యా ఏడాదికి నోటిఫికేషన్ ఉన్న విద్యామండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి 20 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాలి. 28తో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా 29న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30 నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రెండవ విడతలో మే 30 నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్, జూన్ 13న సీట్ల కేటాయింపు, 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడవ విడతలో జూన్ 13 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 23న సీట్ల కేటాయింపు, 28 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. బీటెక్ వైపు మొగ్గు... ఇంటర్మీడియెట్ తర్వాత డిగ్రీలో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో దోస్త్ అడ్మిషన్ల గడువు ముగిసినా ఇంకా సీట్లు మిగులుతున్నాయి. ఇంటర్ తర్వాత బీటెక్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. సత్వర ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో మొగ్గు చూపుతున్నారు. బీటెక్లో కోర్సు పూర్తికాకముందే క్యాంపస్ సెలక్షన్లో చాలామంది విద్యార్థులు ఎంపికవుతున్నారు. మంచి వేతనాలు కూడా అందడంతో బీటెక్ కోర్సుల్లో చేరుతున్నారు.జిల్లాల వారీగా సీట్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్,సాంఘిక,గిరిజన సంక్షేమ కళాశాలల్లో 18,150 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 8,150, మెదక్ జిల్లాలో 4,800, సిద్దిపేట జిల్లాలో 7,400 సీట్లున్నాయి. డిగ్రీ కోర్సులను అవగాహనతో ఎంచుకోవాలి. డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి సైతం సత్వర ఉద్యోగ అవకాశాలున్నాయి. కంప్యూటర్ సైన్స్కు మంచి అవకాశాలు ఉన్నాయి, బీకాంలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్లు,అకౌంటెంట్లుగా చేసుకునేందుకు వీలు ఉంటుంది. బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఫార్మా కంపెనీలో కెరీర్ ఉంటుంది. మ్యాథ్స్ సబ్జెక్టుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డిగ్రీ చదివిన వారు ఎంబీఏ, ఎంసీఏ కూడా చేయవచ్చు. ఆర్ట్స్ కోర్సులు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. డిగ్రీ, పీజీ కోర్సులు చేసినా ఉపాధి అవకాశాలు ఉండటంలేదని ఇంటర్ నుంచే ఆర్ట్స్ గ్రూపులో చేరడం లేదు. ప్రైవేట్ కళాశాలలో దాదాపు ఈ గ్రూపు ఉండటం లేదు. -
డివిజన్ల అభివృద్ధికి నిధులివ్వండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్తో ఎమ్మెల్యే మంగళవారం సమావేశం అయ్యారు. మూడు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల సమస్యపై ఆయనకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కుల ఏర్పాటు, వీధి దీపాలు ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని అడిగారు. పలు కాలనీలలో నిధుల కొరత మూలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కర్ణన్ త్వరలోనే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. -
సంపద సృష్టే సర్కారు లక్ష్యం
● రోడ్ల నిర్మాణంతో గ్రామాల అనుసంధానం ● మంత్రి దామోదర రాజనర్సింహ ● రూ.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/సదాశివపేట రూరల్(సంగారెడ్డి)/కొండాపూర్(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్/సంగారెడ్డి: రోడ్ల నిర్మాణంతో గ్రామాల మధ్య అనుసంధానం జరిగి సంపద సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి దామోదర మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా సంగారెడ్డిలో రూ.90 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పోతిరెడ్డిపల్లి (ఎన్హెచ్65) నుంచి కలివేముల రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ నుంచి సింగూర్ ప్రాజెక్టు వరకు రూ 5.25కోట్ల ఎంఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి, కొండాపూర్ మండల పరిధిలోని అలియాబాద్ నుంచి గారకుర్తి వరకు సీఆర్ఆర్ నిధులతో రూ.10 కోట్లు, మారెపల్లి నుంచి వయా గోటీలగుట్ల మీదుగా సీతారాంకుంట తండా వరకు రూ.2.65 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్, పోతిరెడ్డి పల్లిచౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రోడ్ల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు చేరువవుతాయన్నారు. దీంతోపాటు చిన్న పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి సంపద సృష్టి సాధ్యమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంతోపాటుగా రైతు భరోసా,రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తోందని వివరించారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం రూ.5 లక్షలు అందిస్తోందని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించా లని సూచించారు. సిగ్నల్స్ జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు. ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతాం సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని నిర్మలారెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రవీందర్రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, డీఎస్పీ సత్తయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచాలి
కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి ఎడ్యుకేషన్: బోధన విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉపాధ్యాయులకు సూచించారు. సంగారెడ్డిలోని బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులు విద్యార్థులకు ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడటం విధిగా నేర్పించాలన్నారు. సాంఘికశాస్త్రం శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రణాళికలు, కోర్సు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో ఎమ్మార్పీలకు ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోతిరెడ్డిపల్లిలో 126 ఎస్జీటీలు, ఆర్పీలు, ఎస్ఏలు, 62 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల ఏఐ పరికరాలపై పరిశోధనలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించి పాక్షిక దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ ఐఐటీ, ఎంఎన్ఆర్ వర్సిటీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు రెండు విద్యా సంస్థలు మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఎంఎన్ఆర్ వర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ రవివర్మ మాట్లాడుతూ...అభివృద్ధి చేసిన పరికరాలను ఆస్పత్రుల్లో పరీక్షించి పాక్షిక దివ్యాంగులకు ఇచ్చేందుకు ఈ పరిశోధనలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ రేనూజాన్, బిఏబుల్ హెల్త్ సంస్థ సీఈఓ హబీబ్అలీ తదితరులు పాల్గొన్నారు.ఐఐటీహెచ్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఒప్పందం -
పెండ్లికి చేసిన అప్పులతో మనోవేదనకు గురై..
వర్గల్(గజ్వేల్):పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటన వర్గల్ మండలం గిర్మాపూర్లో చోటు చేసుకుంది. గౌరారం ప్రొబేషనరీ ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్మాపూర్కు చెందిన సాయిల్ల అశోక్, సుశీల(44) దంపతులకు సబిత, కల్పన, కార్తీక్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట పెద్ద కూతురు వివాహం కోసం కొంత అప్పు చేశారు. ఆ అప్పు విషయంలో సుశీల తరచూ బాధ పడేది. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన ఆమె గుర్తు తెలియని పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పురుగు మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
ప్రభుత్వ రోడ్డును కబ్జా నుంచి కాపాడండి
మెదక్ కలెక్టరేట్: పంట పొలాలకు వెళ్లే ప్రభుత్వ రోడ్డుతోపాటు చెరువు శిఖం, కుంటలను కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి మండలం చిన్న గొట్టిముక్ల గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్ఽ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ శివారులోని సర్వే నం.292లో అన్ని కులాల వారికి సంబంధించి 95 ఎకరాలు భూమి ఉంది. సర్వే నం.264, 274, 275, 276లో సుమారు 55 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఈ భూముల్లో పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల్లోకి వెళ్లేందుకు తాత ముత్తాతల కాలం నుంచి 3 కిలో మీటర్ల మేర దారి ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల కోసం పనికి ఆహార పథకం కింద రోడ్డును బాగు చేసినట్లు తెలిపారు. కానీ ఈ దారిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్రెడ్డి, స్థానికులు గడిల సుదర్శన్రావు కలిసి ధ్వంసం చేసి ఆక్రమించకున్నట్లు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అండతో స్థానికుల ఆక్రమణ కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన -
రాలిన ఆశలు.. నష్టాల్లో రైతులు
అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంటలు ● అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడలో 2,991 ఎకరాల్లో సాగు ● మార్కెట్లోనూ ధర అంతంత మాత్రమే ● నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల వినతిటన్నుకు రూ.15 వేలు దాటని వైనంకోహెడ(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించిన మామిడి రైతులకు నిరాశే దక్కింది. ఇటీవల కురిసిన గాలివానలతో కోత దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. గాలి తీవ్రతకు చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. దీంతో తీవ్ర స్థాయిలో తోటలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత పెరిగింది. నీటి ఎద్దడితో చిరుకాయ దశలో ఉన్న మామిడి తోటలు సగానికి పైగా నేల రాలడంతో నష్టాల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాలతో నేలరాలిన మామిడి కాయలను మార్కెట్కు తరలించిన రైతులకు టన్నుకు రూ.15 వేలు ధర అందని పరిస్థితి నెలకొంది. తోటలను ముందస్తుగా మాట్లాడుకున్న పలువురు వ్యాపారులు సైతం చేతులెత్తేశారు. గొట్లమిట్ట, కోహెడ, చెంచల్ చెర్వుపల్లి, తీగలకుంటపల్లి, వరికోలు, బస్వాపూర్, కాచాపూర్, సముద్రాల, శ్రీరాములపల్లి, కూరెల్లా, తంగాళ్లపల్లి, వింజపల్లి తదితర గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారుల వివరాల ప్రకారం 1,350 ఎకరాలు మామిడి సాగు అవుతుంది. ఆకాల వర్షాలు, వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత నిలువలేదు. కాస్తోకుస్తో నిలిచిన మామిడి కాయలు గాలివానకు పూర్తిగా నేలరాలాయి. హుస్నాబాద్ నియోజక వర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో సుమారు 2,991 ఎకరాలు మామిడి సాగు చేస్తున్నారు.పంట నష్టంపై సర్వే నిర్వహిస్తున్న అధికారులుపంట నష్టం వివరాలు సేకరణ ఉద్యానశాఖ అధికారులు ఆకాల వర్షాలతో నష్టపోయిన మామిడి తోటల వివరాలు సేకరించడంలో బిజీబిజీగా ఉన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కోహెడ మండల వ్యాప్తంగా 407 మంది రైతులకు చెందిన 1,255 ఎకరాల్లో 33 శాతం మామిడి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా 90 శాతం మామిడి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. వివరాలు పారదర్శంగా నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్ సీఐ ఉపేందర్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏసీపీ, సీఐ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్స్తో సిబ్బంది సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా యాంటి నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేట ఏసీపీ మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ -
యుద్ధం ఎందుకు ఆపారో మోదీ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: ట్రంప్ ట్విట్టర్తో యుద్ధాన్ని నిలిపివేసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే ఎలాంటి చర్చలు లేకుండా ఎందుకు ఆపారో ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం దేశమంతా ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టామన్నారు. భారత ఆర్మీకి శాసన సభ్యులందరు నెల జీతం ఇచ్చారన్నారు. డామేజ్ని కంట్రోల్ చేసుకునేందుకే త్రివిధ దళాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని దమ్మున్న వ్యక్తి అయితే యుద్దాన్ని ఎందుకు విరమించారో, జరిగిన నష్టమేమిటో పార్లమెంట్ వేదికగా చర్చకు పిలువాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటన చేసిన నాలుగు గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. పహల్గామ్ పై చేసిన దాడి పాకిస్తాన్ చేసిందని ఎంఐఎం కూడా ముక్తకంఠంతో ఖండించిందన్నారు. -
వేర్వేరు చోరీల కేసులో ఇద్దరు రిమాండ్
సిద్దిపేటకమాన్: బైక్ల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద గతేడాది మే నెలలో ద్విచక్ర వాహనాన్ని, ఈ ఏడాది జనవరిలో కోటిలింగాల టెంపులు వద్ద, రైతు బజార్ వద్ద, దుబ్బాకలో పార్క్ చేసిన బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, ఎస్ఐ నవత తమ సిబ్బందితో కలిసి సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (30) పోలీసులను చూసి బైక్ వదిలిపెట్టి పారిపోతుండగా పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఇంట్లో భద్రపర్చి తర్వాత ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. వెంటనే రూ.2,55,000 విలువ గల ఐదు బైక్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సీఐ వాసుదేవరావు, ఎస్ఐ నవత, సిబ్బంది భూమలింగం, శరత్బాబు, శేఖర్, రామకృష్ణను ఏసీపీ అభినందించి, సీపీ చేతుల మీదుగా రివార్డు అందజేస్తామని తెలిపారు. పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ పటాన్చెరు టౌన్: వృద్ధురాలి పుస్తెలతాడు, నగదు ఎత్తుకెళ్లిన కేసులో ఆటో డ్రైవర్ను రిమాండ్ చేసిన ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన భారతి 9న బొల్లారం అల్వాల్లో ఉండే తన ఇంటికి వెళ్లి అక్కడ కిరాయిదారుడు నుంచి రూ.10 వేలు అద్దె తీసుకుంది. తిరిగి అదే రోజు సాయంత్రం కూకట్పల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ వృద్ధురాలిని పలు వీధుల మీదుగా తిప్పి చివరకు అమీన్పూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదున్నర తులాల పుస్తెలతాడు, రూ.10 వేల నగదు తీసుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాను పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మాదపురం కాలనీకి చెందిన ముడావత్ చిన్నను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి అతడి వద్ద నుంచి పుస్తెలతాడు, రూ.7వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్కి తరలించారు.సిద్దిపేటలో పార్కు చేసిన బైక్లు దొంగతనం -
ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి
పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులను ప్రభు త్వం ఆదుకోవాలి. ఇటీవల గాలివానతో మామిడి కాయలు పూర్తిగా నేలరాలాయి. రాలిన మామిడి కాయలను మార్కెట్కు తరలిస్తే.. టన్నుకు రూ.10వేలు కూడా ధర ఇవ్వలేదు. దీంతో తీవ్రంగా నష్టం జరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. – మ్యాకల రజనీకాంత్రెడ్డి, మామిడి రైతు, తీగలకుంటపల్లి పండ్ల తోటల వివరాలు సేకరిస్తున్నాం. నష్ట పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. చాలా మంది రైతులు ఆన్లైన్లో పంట సాగు నమోదు చేసుకో లేదు. అలాంటి రైతుల వివరాలు కూడా సేకరిస్తున్నాం. అందరికీ నష్ట పరిహారం అందే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. – బాలాజీ, ఉద్యానవన శాఖ అధికారివివరాలు సేకరిస్తున్నాం -
సాంకేతిక విద్య.. బంగారు భవిత
నేడే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 కేంద్రాలు మూడేళ్లలో కోర్సు పూర్తి ● పారిశ్రామిక రంగాల్లో మెరుగైన ఉపాధిజహీరాబాద్ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలజహీరాబాద్ టౌన్: విద్యార్థుల ఉజ్వల భవితకు సాంకేతిక విద్య తోడ్పనుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన తర్వాత ఏం చదవాలి.. ఎలాంటి కోర్సులు తీసుకోవాలి.. ఏ విద్యాసంస్థల్లో చేరాలంటూ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు మదన పడుతుంటారు. ఇలాంటి వారికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఓ మంచి అవకాశం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలనుకునే వారికి పాలిటెక్నిక్ ఒక వరం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు సోమవారం (13న) పాలిసెట్(2025–26) పరీక్ష జహీరాబాద్ పట్టణంలోని రెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 7 కేంద్రాలు ఉన్నాయి. జహీరాబాద్లో ఆర్ఎల్ఆర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. నేరుగా బీటెక్లోకి ప్రవేశం మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేశాక.. పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఉన్నత విద్య కావాలంటే కూడా అందుకు అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తియ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. మూడేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి అవుతుంది. పాలిటెక్నిక్లో కంప్యూటర్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ ఇంజనీర్, లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్లో కూడా పాలిటెక్నిక్లో చదివే సబ్జెక్టులే ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే సులువుగా సబ్జెక్ట్పై పట్టు వస్తుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానం ఇస్తాయి.ప్రవేశాలు ఇలా.. పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయాలి. రాష్ట్ర సాంకేతిక శిక్షణ సంస్థ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసి ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు డిప్లొమా కోర్సుల్లో సెమిస్టర్ ప్రకారం శిక్షణ ఇస్తారు. -
యూరియా వినియోగం తగ్గించాలి : శాస్త్రవేత్త శోభ
హవేళిఘణాపూర్(మెదక్): రైతులు గతంలో మాదిరిగా ఎరువు పేడ, గొర్రె ఎరువు లాంటి వినియోగం తగ్గినందున వాటికి బదులుగా మినుము, జనుము, జిలుగ విత్తనాలను వేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల చీడపీడలు సోకి రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్టె, జిలుగు, మినుము చల్లి పార పెట్టినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్సింగ్, ఏడీఏ విజయనిర్మల, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.ఉపాధి హామీ కూలీ మృతిజహీరాబాద్ టౌన్: పని చేస్తున్న ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని రాయిపల్లి(డి) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కూ లీల కథనం మేరకు.. మండలంలోని రాయిపల్లి(డి) గ్రామానికి చెందిన ఎర్రోల కమలమ్మ(65)తోటి కూలీలతో కలిసి ఉదయం ఉపాధి పనులకు వెళ్లింది. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై కింద పడిపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు వెంటనే జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.మృతుడి ఆచూకీ లభ్యంచిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం నర్సంపల్లి అటవీప్రాంతంలో ఆదివారం బయటపడ్డ గుర్తు తెలియని మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలం చాగళ్ల గ్రామానికి చెందిన తుల్లూరు వెంకయ్య(58) చేగుంట మండల కేంద్రంలో ఉండే తన కుమారుడి ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. మానసిక పరిస్థితి బాగాలేని అతడు మార్చి 23న ఇంటి నుంచి కన్పించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం అటవీ ప్రాంతంలో మృతదేహమై కనిపించాడు. కుటుంబీకులను పిలిపించి చూయించగా మృతదేహాన్ని గుర్తించారు. మృతిపై ఎలాంటి అనుమానంలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.మందుబాబులకు జరిమానసిద్దిపేటకమాన్: మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల కిందట నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.34,500 జరిమాన విధించినట్లు తెలిపారు.పటాన్చెరులో 27 మందిపటాన్చెరు టౌన్: పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంకై న్ డ్రైవ్లో 27 మంది మద్యం తాగి పట్టుబడినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. వీరిని సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 9 మందికి రూ.1,500, 17 మందికి రూ.1,000 చొప్పున, మరో వ్యక్తికి రూ. 2 వేలు జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిమిరుదొడ్డి(దుబ్బాక): కారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు గోప దేవవ్వ, బ్యాగరి చంద్రవ్వ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పీ.శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డి పేటలో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న మహిళలను కారు ఢీకొట్టడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం రూ. 50 వేల చొప్పున కలెక్టర్ తన అత్యవసర నిధుల నుంచి చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. సిద్దిపేట–మెదక్ జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వద్ద తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. -
50 బస్తాలు గోల్మాల్
పాపన్నపేట(మెదక్): కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ జరిగినట్లు పాపన్నపేట కౌలు రైతు బైండ్ల భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట పెద్ద హరిజన వాడ వద్ద ఐకేపీ సభ్యుల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బైండ్ల భూమయ్య, బట్టి భారతి, ప్రభాకర్, నదరి నారాయణ, చోటు, కుర్మ కిషన్కు చెందిన 766 బస్తాలతో లారీ లోడ్ చేశామన్నాడు. అందులో తనవి 391 బస్తాలు ఉన్నాయని, 389 బస్తాల వరకు లెక్క కట్టి డ్వాక్రా గ్రూపు సభ్యురాలు సంచిపై సంఖ్య రాసిందన్నారు. అనంతరం రెండు సంచులు తెచ్చి తూకం చేసి లెక్క రాయించానన్నారు. శనివారం ఉదయం ట్రక్ షీట్ లేకుండానే లారీ లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ రైస్ మిల్లుకు వెళ్లిందన్నారు. ఆదివారం ఐకేపీ సభ్యులు తనకు చెందిన 50 ధాన్యం బస్తాలు తక్కువగా వచ్చినట్లు సమాచారం ఇచ్చారని వాపోయాడు. సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా వచ్చిందంటున్నారని, దీంతో సుమారు రూ.47 వేల నష్టం వస్తుందన్నారు. ట్రక్ షీట్ లేకుండానే లారీ వెళ్లింది ఈ విషయమై కమ్యూనిటీ కో ఆర్డినేటర్ శివరాణిని వివరణ కోరగా.. అప్పటికే చీకటి కావడంతో కమిటీ మెంబర్లు లారీ పూర్తి స్థాయిలో లోడ్ కాక ముందే ఇంటికెళ్లారని అన్నారు. శనివారం పొద్దున కేంద్రం వద్దకు వచ్చే సరికి లారీ లోడ్ చేసుకొని ట్రక్ షీట్ లేకుండానే వెళ్లి పోయిందన్నారు. ట్రక్ షీట్పై కమిటీ మెంబర్ల సంతకాలు ఉంటాయన్నారు. అనంతరం 50 సంచులు తక్కువగా వచ్చినట్లు చెప్పారన్నారు. హమాలీలు కూడా క్వింటాల్కు రూ.40 తీసుకుంటున్నందున వారి వద్ద కూడా లారీలో ఎన్ని బస్తాలు వెళ్లిన లెక్క ఉండాలన్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సుమారు రూ.47 వేల వరకు నష్టం న్యాయం చేయాలంటూ కౌలు రైతు ఆవేదన -
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ మల్లేశయ్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలతోపాటు మరింత మెరుగైన సేవలు అందించడానికి సూచనలు, సలహాలను ఇవ్వడానికి 9063417161 నంబరుకు ఫోన్చేసి వివరించాలని సూచించారు. జీతంపై అవగాహన ఉండాలిఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు సిబ్బంది పోలీసు జీతం ప్యాకేజీ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. గతేడాది డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన హోంగార్డు మశ్చేందర్ కుటుంబానికి మంజూరైన చెక్కును బ్యాంకు అధికారులతో కలసి ఎస్పీ చేతుల మీదుగా అందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినందుకు రూ.30 లక్షలు, ఇద్దరి పిల్లల చదువు నిమిత్తం రూ.4లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి కల్యాణి, ఆర్ ఐ డానియల్, బ్యాంక్ మేనేజర్ రాజేందర్ తదితరులున్నారు. ఎస్టీ గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్కంగ్టి(నారాయణఖేడ్): గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని గురుకుల ప్రతిభా కళాశాల, కల్వంచలోని శాంతినగర్ భాగ్యలత కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన బాలురకు, 16వ తేదీన బాలికలు తమకు సంబంధించిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, స్పోర్ట్స్, పీహెచ్సీ సర్టిఫికెట్లు, మూడు కలర్ ఫొటోలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. కొనుగోళ్లు వేగవంతండీఆర్డీఓ పీడీ జ్యోతి వట్పల్లి(అందోల్): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా డీఆర్డీఓ పీడీ జ్యోతి సూచించారు. కేరూర్లో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడగా హమాలీలు సమయానికి రాకపోవడంతో కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని తెలిపారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. తూకం చేసిన వెంటనే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. లోక్అదాలత్పై అవగాహన కల్పించండినారాయణఖేడ్: లోక్అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకునేలా చూడాలని ఖేడ్ జూనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పోలీసు అధికారులకు సూచించారు. కోర్టులోని డివిజన్ పరిధి పోలీసు అధికారులతో సోమవారం లోక్అదాలత్పై నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. వచ్చేనెల 14న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వర్తించే పోలీసులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
న్యాల్కల్(జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. న్యాల్కల్లో ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామంలో బుద్ధ విహార్ను ప్రారంభించడంతోపాటుగా గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. న్యాల్కల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న వారికి ఇటీవల రూ.1లక్ష చొప్పున అందించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రేజింతల్ గ్రామశివారులో గల శ్రీసిద్ధివినాయక ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బుద్దిష్టు సొసైటీ సభ్యులు దశరథ్, సుభాష్, బక్కప్ప, రాజ్కుమార్, నర్సింలు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్, సమతా సైనిక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్, జిల్లా అధ్యక్షుడు కరణం రవికుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎంపీ సురేశ్కుమార్ షెట్కార్ -
రోడ్ల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావుసంగారెడ్డి టౌన్/సంగారెడ్డి జోన్: కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహులకు మద్దతు ఇస్తోందని ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తను సోమవారం ఎంపీ పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ రహదారి 65 విస్తరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనలో అరెస్ట్ అయిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. రహదారుల విస్తరణతో అభివద్ధికి బాటలు పడతాయన్నారు.