breaking news
Crime
-
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్త దారుణహత్య
కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన మహమ్మద్ కరీం (43), సలీమాబేగం నాగర్కర్నూల్లో నివాసం ఉంటున్నారు. సలీమాబేగం తనకు మరిది వరుసైన నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్పాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని గుర్తించిన కరీం తన భార్యను మందలించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 9న వాట్సాప్ కాల్లో రాత్రికి కరీంను చంపుతానని సలీమాబేగంకు గౌస్పాష చెప్పాడు. పదునైన కత్తి, చేతి గ్లౌజులు తీసుకొని రాత్రి 2.30 గంటల సమయంలో గౌస్పాష.. కరీం ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రమత్తులో ఉన్న కరీం డోర్ తీయగా కత్తితో గౌస్పాష అతనిపై దాడి చేసి చంపి పరారయ్యాడు. -
అల్వాల్లో కీచక పర్వం
అల్వాల్: ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ మైనర్ బాలికను కాటేసింది. ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. అనేకమార్లు లైంగిక దాడికి గురయ్యింది. వేర్వేరు ఘటనల్లో మత్తు మందు కలిపిన చాక్లెట్లు తినిపించడంతో పాటు, మద్యం, గంజాయి, సిగరెట్లు తాగించిన పలువురు నిందితులు..అమానుషంగా ప్రవర్తించారు. బాలికను వెంటాడారు. లైంగికంగా వేధించారు. చివర్లో ఎలాగో తప్పించుకుని బయటపడిన ఆమె ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఘోర సామూహిక అత్యాచారాల పరంపర వెలుగులోకి వచ్చింది. ఇందులో 8 మంది నిందితులు పేర్లు బయటకు రాగా, మరికొందరు కూడా ఈ లైంగిక దాడుల పర్వంలో పాల్గొన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తరగతి చదువుతుండగా.. అల్వాల్కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. 10వ తరగతి చదువుతున్నప్పుడు జెర్నీ వరుణ్ ఇన్స్ట్రాగామ్లో పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న వరుణ్ ఓ రోజు కారులో తీసుకెళ్లి మత్తు మందు కలిపిన చాక్లెట్లు తినిపించాడు. ఆమె మత్తులోకి వెళ్లడంతో కారులోనే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జెర్నీ వరుణ్ పరిచయం చేసిన మరో వ్యకి రోమల వరుణ్ బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేశాడు. ఈ క్రమంలో బాలికను కొంపల్లిలోని ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ నెల 9న కూతురి వ్యవహారశైలిని ప్రశ్నించిన ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. నేరుగా బొల్లారం రైల్వేస్టేషన్కు చేరుకుంది. అక్కడికి రమ్మని తనకు పరిచయస్తుడైన నీరజ్ అనే యువకుడిని పిలిచింది. అతను తన స్నేహితుడైన విక్కీని స్టేషన్కు రమ్మని చెప్పాడు. ఇద్దరూ కలిసి బాలికతో గంజాయి కలిపిన సిగరెట్లు తాగించడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆమెను స్టేషన్కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ నీరజ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లిన విక్కీ అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత విక్కీ తన స్నేహితుడైన నిఖిల్తో కలిసి బాధితురాలిని స్కూటర్పై ఎక్కించుకుని దూలపల్లికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి నల్లటి నూనె లాంటి పదార్థాన్ని సిగరెట్లోకి ఎక్కించి బలవంతంగా తాగించారు. తర్వాత సమీపంలోని ఓయో రూమ్కు తీసుకెళ్లి అక్కడ గంజాయి తాగించారు. అక్కడ నిఖిల్ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తర్వాత హోటల్ రూమ్ నుంచి బాలికను బొల్లారంలోని విక్కీ ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ విక్కీతో పాటు నిఖిల్ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె సెల్ఫోన్ లాక్కొని అక్కడే బంధించారు. ఒకసారి తప్పించుకున్నా వెంటాడి.. ఈ నెల 10న మైనర్ బాలిక అక్కడ్నుంచి తప్పించుకొని బొల్లారం రైల్వే స్వేషన్కు చేరుకుంది. అయితే ఆమెను వెంటాడిన విక్కీ, తన స్నేహితుడు గణేష్తో పాటు అక్కడికి చేరుకున్నాడు. మళ్లీ ఆమెకు గంజాయి తాగించారు. రైల్లో మేడ్చల్ తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ నిలిచి ఉన్న రైలు బోగిలోకి తీసుకెళ్లి విక్కీ, గణేష్ ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముగ్గురూ కలసి మరో రైలులో మల్కాజిగిరి వైపు వెళ్తుండగా బాలిక ఇతరుల సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను ఆటోలో ధూల్పేట వైపు తీసుకెళ్లారు. అయితే ఆమె గట్టిగా కేకలు వేయడంతో మధ్యలోనే వదిలేసి పరారయ్యారు. అనంతరం మరో ఆటోలో ఇంటికి చేరుకున్న బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో బాలికతో కలిసి కుటుంబసభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెర్రీ వరుణ్, రోమల వరుణ్, నీరజ్, విక్కీ, నిఖిల్, గణేష్, ఇతరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. -
ఓ మహిళ విషయంలో వివాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలారంపల్లి గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు సమాచారం.ఘర్షణలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణగలేదు.దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇరువర్గాలు మరోసారి గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంగా మారడంతో.. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి.. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శేషయ్యగారిపల్లి వద్ద బస్సు వెనుక టైర్ కింద పడి గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులు కడపలోని లోహియా నగర్కు చెందినవారిగా తెలుస్తోంది. అదే ప్రమాదంలో కానూరు మనోహర్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో శేషయ్యగారిపల్లి వద్ద విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు
భోపాల్: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా జైలులో ఓ విచారణ ఖైదీ.. జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఈ దృశ్యాలు బయటకు రావడం గమనార్హం. పండ్ల బుట్టలో దాచిన తుపాకీతో ఖైదీ జైలు గార్డుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు.ఖైదీ పేరు నీలేశ్ ఠాకూర్. రక్షాబంధన్ సందర్భంగా జైలులో నిర్వహించిన వేడుకల సమయంలో అతడు జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులో ఠాకూర్ జైలులో ఉన్నట్లు ఉపవిభాగ పోలీసు అధికారి ప్రతిభా శర్మ తెలిపారు.గార్డును ఠాకూర్ ఒక్కసారిగా పట్టుకుని కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. గార్డు తిరిగి ఎదురుదాడికి ప్రయత్నించగా.. ఖైదీ అతడిని పక్కకు నెట్టేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో ఉంది. ఠాకూర్ పండ్ల బుట్టతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి దాన్ని తెరవాలని తోమర్ను ఒత్తిడి చేశాడు. గార్డు నిరాకరించడంతో.. బుట్టలో దాచిన దేశీయంగా తయారు చేసిన తుపాకీని బయటకు తీసి అతడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.కాల్పుల్లో బుల్లెట్ తోమర్ వీపు ఎడమ వైపున తగలడంతో అతడు కుప్పకూలాడు. జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమించడంతో భోపాల్లోని ఎయిమ్స్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ ఆర్కే.చౌరే, ఇతర గార్డులు వెంటనే అక్కడికి చేరుకుని ఠాకూర్ను పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆయుధం జైలులోకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.చౌరే సస్పెన్షన్ ఈ ఘటనలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగినట్లు అధికారులు గుర్తించడంతో చౌరేను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సమయంలో ఆయనను జైలు ప్రధాన కార్యాలయంలో విధులకు కేటాయించారు. దర్యాప్తును జైళ్ల శాఖ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండేకు అప్పగించారు. మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వరుణ్ కపూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ‘నేను రాజీనామా చేస్తున్నా’.. అభిజీత్ దీప్కే కిర్రాక్ సెటైర్భద్రతా లోపంలో జైలు గార్డుల పాత్ర ఏమైనా ఉందా? ఠాకూర్కు ఆయుధం అందేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. బయట నుంచి ఎవరో తుపాకీని జైలు లోపలికి విసిరారని ఠాకూర్ చెప్పినట్లు తెలుస్తోంది. రక్షాబంధన్ వేడుకల కోసం జైలులోకి తీసుకొచ్చిన స్వీట్లు, పండ్ల బుట్టల్లో ఒకదానిలో తుపాకీని దాచి ఉండవచ్చని చౌరే అంతకుముందు అనుమానం వ్యక్తం చేశారు. తుపాకీ జైలులోకి ఎలా చేరింది? ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? అనే విషయాలను దర్యాప్తు తేల్చనుంది.🚨 RAISEN : An undertrial prisoner allegedly attacked a jail guard during an escape attempt, firing a shot before striking him and throwing chilli powder into his eyes. The guard fought back and helped stop the escape, while a security probe was ordered. https://t.co/CrMAdCnAHR— indiainlast24hr (@indiain24hr) September 12, 2026 -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతమైన స్వరూప్ నగర్లో ఆదివారం ఉదయం ఒక గోడౌన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి రప్పించారు.ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భయాందోళనల మధ్య కొందరు స్థానికులు భవనాల పైనుంచి దూకడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. మంటలు చెలగడానికి అసలు కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ జరుపుతున్నారు. -
భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త!
భార్య వివాహేతర ప్రియుడిని గొంతు కోసి చంపిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ధర్మపురి జిల్లాలోని కరిమంగళంకు చెందిన పార్థిబన్, శారదాను గతంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత పార్థిబన్, అతని భార్య కృష్ణగిరి జిల్లాలోని హోసూర్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తూ, సిబ్ కాట్ లోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో హోసూర్ పార్వతీ నగర్ కి చెందిన అమావాసై, శారదాకి మధ్య పరిచయం ఏర్పడి, అది చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్థిబన్, ఆ సంబంధాన్ని వదులుకోమని తన భార్యను చాలాసార్లు మందలించాడు. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని వదులుకోలేదు. ఈ స్థితిలో, 14.3.2017న, పార్థిబన్ తన భార్యతో తాను పనికి వెళ్తున్నానని చెప్పి, పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన అమావాసై, శారద సరదాగా గడుపుతున్నారు. ఇది చూసిన పార్థిబన్, తీవ్రమైన కోపంతో అమావాసై గొంతు కోసి చంపేశాడు. ఇది చూసి అతని భార్య శారద పారిపోయింది. ఈ విషయమై సిబ్కకట్ పోలీసులు కేసు నమోదు చేసి పార్థిబన్ ను అరెస్టు చేశారు. హోసూర్ అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతున్న ఈ కేసులో జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. అందులో, అమావసై గొంతు కోసి హత్య చేసినందుకు పార్థిబన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువతి అక్కడికక్కడే మృతి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్íÙప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపైనుండి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది.ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పట్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి... -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్కు చెందిన వికాష్ కుమార్ యాదవ్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన కోసం వచ్చిన యువతిని వికాష్ కుమార్ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో ఆ యువతి తిరుప్పూర్ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్ ఉమెన్ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్కుమార్యాదవ్ను అరెస్టు చేశారు. అతడి ఫోన్ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. -
క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి
పెద్ద శంకరంపేట(మెదక్): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తల్లి హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె మృతిని తట్టుకోలేక కుమారుడు పెద్దశంకరంపేటలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మక్త లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగదార శివయ్య, బేతమ్మ(45) దంపతులు ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి బౌరంపేటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమా రుడు ఉన్నారు. స్వగ్రామంలోని వారి సమీప బంధువులకు చెందిన వ్యక్తికిచ్చి పెద్ద కుమార్తె శివలీల వివాహం చేశారు. మరో కుమార్తె స్వప్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం చిటుకుల్లోని ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కుమారుడు ప్రవీణ్(19) హైదరాబా ద్లో తల్లిదండ్రులతో కాకుండా కూకట్పల్లిలోని ఓ ప్రయివేటు హాస్ట ల్లో ఉంటూ ఎలక్రీ ్టషియన్గా పనిచే స్తున్నాడు. శివయ్య, బేతమ్మ దంపతులిద్దరూ బౌరంపేటలో వాచ్మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్ర వారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో బేతమ్మ ఉరేసుకొని మృతి చెందింది. ఈ విషయాన్ని శివయ్య తన కుమారుడు ప్రవీణ్, చిన్నకుమార్తె స్వప్నకు ఫోన్ చేసి అమ్మకు బాగోలేదు, కిందపడితే దెబ్బలు తగిలాయని వారిద్దరినీ రావాలని చెప్పాడు. దీంతో ప్రవీణ్ వెంటనే వచ్చేశాడు. మృతి చెందిన తల్లిని చూసి భోరున విలపించాడు. ఆ సమయంలో తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తల్లి మృతిని తట్టుకోలేని కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా పెద్దశంకరంపేట మండలానికి వచ్చాడు. సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిలోని కోలాపల్లి వద్ద సా యంత్రం ఆరు గంటల సమయంలో దిగి సమీప వ్యవసాయ పొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. తండ్రి శివయ్య, బంధువులు ప్రవీణ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలే దు. అతడిని చూసిన స్థానికులు ఈ సమాచారం చేరవేయడంతో పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించారు..శుక్రవారం రాత్రి అతడు చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం స్వగ్రామానికి బంధువులు ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న బేతమ్మ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మధ్యాహ్నం మక్తలక్ష్మాపూర్కు చేరుకుంది. దీంతో ఇరువురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. అటు భార్య, ఇటు కొడుకు చితిలకు శివయ్యే నిప్పంటించాడు.కాలువలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతిఈత రాకపోవడంతో ప్రమాదంమునగాల: సూర్యాపేట జిల్లా ము నగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులోని ముక్త్యాల బ్రాంచి కాలువలో శనివారం ఇద్దరు విద్యార్థులు మునిగి మృతి చెందారు. కోదాడ పట్టణానికి చెందిన ఎలమర్తి లేఖ స్వరూప్రెడ్డి (14), సారిక హరీశ్ (14) కోదాడ మండలం బాలాజీనగర్లోని ఎస్ఆర్ ఎం (సంకల్ప) పాఠశాలలో 9వ తరగతి చదువుతూ పాఠశాలకు చెందిన వసతి గృహంలో ఉంటున్నారు. వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఇంటికి పంపించింది. ఇదే పాఠశాలలో చదువుతున్న చరణ్ స్వగ్రామం ముకుందాపురం కాగా.. శనివారం చరణ్, స్వరూప్రెడ్డి, హరీశ్ కలిసి ముకుందాపురం శివారులో గల ముక్త్యాల బ్రాంచి కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లా రు.కాలువలో స్నానం చేస్తుండగా.. స్వరూప్రెడ్డి, హరీశ్కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లు సంజీవరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ముక్త్యా ల బ్రాంచి కాలువకు నీటి సరఫరాను నిలిపివేసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. దూరంలో చిలుకూరు మండలం మాదగూడెం వద్ద స్వరూప్రెడ్డి మృతదేహం, అక్కడి నుంచి మరో కిలోమీటరు దూరంలో హరీశ్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య?పోక్సో కేసు విషయంలో ఓ నాయకుడు, బాలిక బాబాయ్ రూ.20 లక్షల డిమాండ్!సూసైడ్ లెటర్లో వెల్లడి ముదిగొండ: పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన యువకుడిని ఓ నాయకుడు, బాలిక బంధువు నగదు కోసం వేధించినట్లు తెలుస్తుండగా, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్కుమార్ (21) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళా శాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనిపై మార్చి నెలలో పోక్సో కేసు నమోదు కాగా, రిమాండ్కు తరలించారు. రెండురోజుల క్రితం బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, కేసు విషయమై బాలిక బాబాయ్తో పాటు నాయకుడు నూకల నాగేశ్వరరావు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, లేకపోతే కుటుంబానికి హాని చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసి ఉండటంతో శుక్రవారం రాత్రి డాబాపై ఉన్న రేకుల గదిలో వినయ్ ఇనుప కడ్డీకి వైర్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు శనివారం ఉదయం గుర్తించారు. కాగా, వినయ్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడని, అందులో సైతం నాగేశ్వరరావు, బాలిక బాబాయి పేరు ఉందని తెలుస్తోంది. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యా దుతో ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్'!
ముంబై: ఇతరుల డ్రెస్ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సూరజ్ శంకర్ ధోలె(26), బాబా సాహెబ్ అలియాస్ సుబోధ్ భీమ్రావ్ వాంఘ్మారేలు గోరెగావ్లోని ఓ పెట్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: గుజరాత్కు ఎందుకు తరలించారు? -
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
ప్రియుడు ఫోన్ ఎత్తట్లేదని ఇద్దరు పిల్లల తల్లి..
బెంగళూరు: ప్రియుడు ఫోన్ చేయడం లేదు, ఆమె కాల్ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది.కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్ చేయకపోగా, ఈమె ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రూ.20 కోట్ల చిట్టీలు.. దంపతులు మాయం! అసలు కథేంటి?
హైదరాబాద్: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసిన దంపతులు అదృశ్యమయ్యారు. 15 రోజులుగా ఆ దంపతులు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం హెచ్ఎంటీ హిల్స్లోని వారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన సీత, రమణా రెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.అయితే చిట్టీల వాయిదాలు పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అడిగేందుకు వెళితే వాయిదా వేస్తూ తీరా కనిపించకుండా పోయారు. అందరికి చిట్టీల డబ్బు రూపంలో సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు.పైగా తమకు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా ..రూ.60 లక్షలు మోసపోయినట్లు ఆరుగురు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇవీ చదవండి: ‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే! -
స్లోపాయిజన్తో జగదీశ్వరరెడ్డి హత్య
కాకినాడ రూరల్: కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు అతడికి సాధిక్ఖాన్ పలుమార్లు స్లోపాయిజన్ ఇచ్చినట్లు తేలింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్యకేసుల్లో నిందితుడైన సాధిక్ఖాన్కు మూడురోజుల పోలీసు కస్టడీ శుక్రవారం ముగిసింది. జగదీశ్వరరెడ్డి హత్యకేసులో విచారణకు సాధిక్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సర్పవరం పోలీసులు గడువు ముగియడంతో శుక్రవారం అతడికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి, అమలాపురంలోని మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అనుమతితో సాధిక్ఖాన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యకేసులో సాధిక్ఖాన్ విచారణలో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నించినా సాంకేతిక ఆధారాలు అతడిని నేరం ఒప్పుకొనేలా చేశాయి. ప్రధానంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్స్టేషన్లో జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసిన పోలీసులు సాధిక్ఖాన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకుని మూడురోజులు విచారించారు. ఈ విచారణలో సాధిక్కు ప్రమాదకరమైన రసాయనం అందించిన హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులను అతడి సమక్షంలో విచారించడంతోపాటు సీన్ రీకన్స్ట్రక్షన్కు సాధిక్ అకాడమీ వద్దకు తీసుకువెళ్లారు. కీలక ఆధారాలు సేకరించి అకాడమీని సీజ్చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు హత్య, సూసైడ్ నోట్లలో కీలకమైన అంశాలకు సంబంధించి విచారించేందుకు 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్న పోలీసులు 110 ప్రశ్నను మాత్రమే అడిగినట్లు తెలిసింది. స్లోపాయిజన్ ఇచ్చినట్టు అంగీకారం విచారణకు సంబంధించి పోలీసువర్గాలు తెలిపిన మేరకు.. కుమారుడు కార్తికేయరెడ్డిని రైఫిల్ షూటింగ్ కోసం సాధిక్ అకాడమీ వద్దకు తీసుకువెళ్లిన సౌజన్యను సాధిక్ఖాన్ ట్రాప్ చేసి, ఏడాదిన్నరకుపైగా సన్నిహితంగా మెలిగాడు. గత ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున జగదీశ్వరరెడ్డితో కారులో పిఠాపురం మొబైల్ షాపునకు వెళుతున్న సమయంలో సాధిక్ పదేపదే సౌజన్యకు కాల్ చేశాడు. అనుమానం వచ్చిన జగదీశ్వరరెడ్డి సెల్ లాక్కుని ప్రశ్నించడంతో ఇద్దరికి వాదన జరిగింది. అదేరోజు సాయంత్రం సాధిక్ కాకినాడలోని ఇంట్లో ఉన్న జగదీశ్వరరెడ్డిని కొట్టి, చాకుతో హత్యాయత్నం చేశాడు. ఆర్థికంగా స్థితిమంతుడు, క్లాస్వన్ కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సాధిక్.. సౌజన్యతో చనువుగా ఉంటూనే జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు ప్లాన్ చేశాడు. ఆహారం అరుగుదలకు సంబంధించిన సమస్యతో సర్పవరం జంక్షన్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జగదీశ్వరరెడ్డికి పలుమార్లు కొబ్బరి బొండంలో స్లోపాయిజన్ రసాయనం కలిపి ఇచ్చాడు. చివరిగా హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఉండగా ఇచ్చాడు. జగదీశ్వరరెడ్డి మృతికి ముందురోజు జూలై ఒకటో తేదీ రాత్రి ఆస్పత్రి రీహేబిలిటేషన్ సెంటరులో ఉండగా రాత్రి సమయంలో పొటాషియం సైనేడ్ ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే స్లో పాయిజన్ మాత్రమే ఇచ్చానని, సైనేడ్ ఇవ్వలేదని సాధిక్ పోలీసుల వద్ద అంగీకరించాడు.ఆస్తికోసం నరకం చూపించాడుపీఆర్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజుకు కుమారుడు చనిపోగా ఒకే కుమార్తె సౌజన్య ఉంది. దీంతో ఆమె తండ్రి ఆస్తులతోపాటు భర్త జగదీశ్వరరెడ్డి ఆస్తులపై సాధిక్ కన్నుపడింది. సౌజన్యను ఆస్తికోసం వేధించాడు. భర్త చనిపోయిన తరువాత తన పేరిట రావులపాలెంలో ఉన్న సుమారు రూ.25 కోట్ల విలువైన 44 సెంట్ల స్థలాన్ని అత్తమామలకు రాసి ఇచ్చేందుకు సౌజన్య సిద్ధమైంది. ఆ స్థలాన్ని తన పేరిట రాయాలని సాధిక్ ఆమెపై ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఆగస్టు 16కు ముందురోజు సాధిక్ ఆ స్థలాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్డాడు. ఇవ్వకపోతే సౌజన్యతో కలిసి జగదీశ్వరరెడ్డిని చంపిన విషయం అతడి తండ్రి భాస్కరరెడ్డికి చెబుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అల్లుడి హత్య గురించి అప్పుడే తెలుసుకున్న నూకరాజు కుటుంబం.. సాధిక్ తమను బతకనివ్వడని భయపడింది. నూకరాజు, భార్య, కుమార్తె, మనుమడు కలిసి మరుసటిరోజు గోదావరిలో దూకేశారు. మనుమడు కార్తికేయరెడ్డి బతకగా మిగిలిన ముగ్గురు చనిపోయారు. ఈ విషయం తెలిసిన సాధిక్ మీరట్కు పారిపోయి తరువాత పోలీసులకు చిక్కాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందురోజు వాట్సాప్ కాల్, మామూలు కాల్ ద్వారా నూకరాజును బ్లాక్మెయిల్ చేయడం, ఆస్తికోసం బెదిరించడం వంటి కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు విచారణలో ఆ అంశాలు ప్రస్తావించడంతో జగదీశ్వరరెడ్డిని హత్యచేసినట్లు సాధిక్ఖాన్ అంగీకరించినట్లు తెలిసింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో విచారించేందుకు రాజమహేంద్రవరం పోలీసులు అతడిని కస్టడీకి ఇవ్వమని న్యాయసా్థనాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. -
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో చోరీ యత్నం కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంక్ కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఒక నిరుద్యోగి క్యాష్ కౌంటర్ వద్ద గలాటా సృష్టించాడు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి, రూ. 4 లక్షల నగదుతో పరారు కావడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడిని 28 ఏళ్ల సూరజ్ భోజ్రాజ్ బోర్కర్గా గుర్తించారు. ఇతను B.Sc పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడు. సాధారణ వినియోగ దారుడిలా నటిస్తూ బ్యాంక్లోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లడంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రూ. 4 లక్షల నగదుని తస్కరించి అక్కడినుంచి ఉడాయించాడు. కానీ బ్యాంక్ సిబ్బంది, అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిందితుడిని వెంటాడారు. బ్యాంక్కు సుమారు కిలోమీటర్ దూరంలో, ఘటన జరిగిన 30 నిమిషాల్లోనే అతడిని పట్టుకున్నారు.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్ महाराष्ट्र,नागपुर इनसे मिलिए,इनका नाम है सूरज भगवा कपड़ा पहन कर उसका भी इज़्ज़त डूबा दिए,दरअसल इसने SBI बैंक में चोरी की प्लानिंग की और लालमिर्च का पाउडर कर्मचारियों के आँख में झोंक दिया,कम से कम 4.5 लाख लेकर फरार हुआ था लेकिन कुछ ही देर में धर लिया गया pic.twitter.com/fXzOd3DUJ4— Anvi Yadav (@Yadavanviroyal) September 11, 2026 పోలీసులు అతని వద్ద నుండి దొంగిలించిన రూ. 4 లక్షల పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను ఉద్యోగం లేకపోవడం వల్లే ఈ దోపిడీకి ఒడిగట్టాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇందులో ఇంకెవరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి: బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం -
భార్య, పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెల హత్య, స్థానికంగా కలకలం
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల అనంతరం ఏమీ ఏరగనట్టుగా పాలవాడి దగ్గర పాలుతీసుకొని, తండ్రికి టీ పెట్టి వచ్చి, ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రాహుల్ ఝా షేర్ ట్రేడింగ్ చేసేవాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఆయన గుజరాత్ నుండి జైపూర్కు తిరిగి వచ్చారు. భార్య గీతా ఝా తమ ఇంటి మొదటి అంతస్తులో ఒక బొటిక్ను నడిపేవారు. వారి పెద్ద కుమార్తె నందిని చదువుకుంటూనే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.ఈ హత్యలకు కేవలం మూడు రోజుల ముందు రాహుల్ ఒక పొరుగింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!వెలుగులోకి వచ్చిందిలాశుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి? -
కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు తుపాకీతో ఒక యువకుడు అరెస్ట్ అయిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO) నకిలీ ఐడీ కార్డు, తుపాకీతో షాపింగ్ మాల్ నుండి 24 ఏళ్ల రోహన్ పారిఖ్, అతని అంగరక్షకుడు దిలీప్ కుండేలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పిన సంగతులు విని పోలీసులు విస్తుపోయారు. తన కాబోయే భార్య, అత్తమామలను ఇంప్రెస్ చేయడానికి డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రోహన్ తాను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన అధికారినని , ప్రధాని కార్యాలయంతో నేరుగా సంబంధాలున్నాయి గప్పాలు కొట్టాడు. ఈ విషయాలో వారిని నమ్మించాలనుకుని పథకం వేశాడు.ఇందుకు ప్రధాని మోదీ హాజరు కానున్న ఎన్ఎంఏసీసీ వేదికను ఎంచుకున్నాడు. ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలుఏఐ టూల్స్ ఉపయోగించి నిజమైన పీఎంఓ కార్డ్ను పోలిన డిజిటల్ ఐడీ కార్డును (దీన్ని 2025లోనే తయారు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది) ఉపయోగించి వీవీఐపీ మార్గం ద్వారా దర్జాగా లోపలికి వెళ్లాలనే ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. జియో వరల్డ్ ప్లాజాలోకి వివిఐపి (VVIP) ప్రవేశ మార్గం ద్వారా వెళ్ళి,వారికి "పవర్" చూపించాలని ప్లాన్ చేశాడు. కానీ ప్రధాని పర్యటనకు ముందు భారీ భద్రతా తనిఖీల్లో దొరికిపోయాడు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజంఈ కేసులో రోహన్, అతని బాడీగార్డ్, డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, పారిఖ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రథమేష్ బాగుల్ కోసం గాలిస్తున్నారు. వీరిపై మోసం, ఫోర్జరీ, VVIP భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నాగ్పూర్-రాయ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం -
కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక
కేపీహెచ్బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్బీ సెక్టార్ ఎస్ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్జెండర్లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్జెండర్లపై కేసులు నమోదు చేశారు.ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌనిక స్థానికులకు సూచించారు.At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026 -
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఓజిలి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 19 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓజిలి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మొదటి డ్రైవర్ జేడీ ప్రేమ్ రాత్రి 10 గంటలకు ఒంగోలు వద్దకు వచ్చేసరికి బస్సును రెండవ డ్రైవర్ తిరుపతయ్యకు అప్పగించారు. అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ఓజిలి పెద్దచెరువు సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి కాలిన వాసన, పొగ రావడాన్ని డ్రైవర్ తిరుపతయ్య గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బస్సుకు ఉన్న అన్ని తలుపులు తెరిచి ప్రయాణికులను దించి దూరంగా పంపివేశారు. కొద్దిసేపటికి బస్సు డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమయంలో బస్సు రేకు ఒకటి ఎగిరి రోడ్డు డివైడర్పై ఉన్న చెట్లపై పడింది. డివైడర్పై ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. కేవలం 15 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. అనంతరం వేరే బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపారు. ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ తిరుపతయ్య అప్రమత్తం కావడంతోనే 19మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్ఎం అత్యాచార యత్నం
ధర్మపురి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గాడితప్పి ఓ బాలిక (4)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ సదరు చిన్నారిని బుధవారం స్టాఫ్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపగా.. గురువారం తల్లిదండ్రులు, మరికొంతమంది కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అవమానం భరించలేక కేదారి దంపతుల ఆత్మహత్య
నయీంనగర్: అద్దె డబ్బులు ఇవ్వడం లేదని హోటల్ భవన యజమాని తిట్టి తాళం వేయడంతో అవమానం భరించలేక లింగాల కేదారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లింగాల కేదారి కొడుకు పృథ్వీ ఫిర్యాదు మేరకు బిల్డింగ్ యజమాని కుమారుడు రాముపై కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు గురువారం తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని అదాలత్ జంక్షన్ వద్ద అద్దె భవనంలో లింగాల కేదారి దంపతులు కొన్నేళ్లుగా తమ పేరుమీద హోటల్ నడుపుతున్నారు. అనివార్య కారణాలతో అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమాని కుమారుడు బుధవారం హోటల్ వద్దకు వచ్చి కిరాయి ఎందుకు ఇవ్వడం లేదని దూషించి తాళం వేశాడు. దీనిని అవమానంగా భావించిన లింగాల కేదారి దంపతులు సాయంత్రం హోటల్లోకి వెళ్లి తాళం తీసి లోనికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. లింగాల కేదారి అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలతకు తీవ్రగాయాలు కాగా, ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.కాగా, ఎంతోమందికి ఉచితంగా అన్నం పెట్టిన లింగాల కేదారి మరణవార్త విని అంతిమయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నగరంలో చదువుకునేందుకు వచ్చిన సమయంలో అతి తక్కువ ధరకు భోజనం పెట్టేవాడని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. లింగాల కేదారి దంపతులకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నివాళులరి్పంచారు.దంపతుల అనుమానాస్పద మృతిపురుగుల మందు తాగి భార్య...రైలుకు ఎదురెళ్లి భర్త మృతి తండ్రి కళ్లముందే కొడుకు బలవన్మరణం ఇరువురి మధ్య గొడవలే కారణంసికింద్రాబాద్/అడ్డగుట్ట: పెళ్లై పదహారు నెలలు... రాఖీ పండుగకు సొంత ఊరికి వెళ్లి పది రోజుల కిందటే తిరిగి నగరానికి వచ్చారు. అంతలోనే ఏమైందో తెలియదు. దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందగా... భర్త రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తార్నాక విజయపురి కాలనీలో విషాదాన్ని నింపాయి. సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్, లాలాగూడ ఇన్స్పెక్టర్ రవి కిరణ్లు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన శరణప్ప (28) ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి తార్నాక విజయపురి కాలనీలోని ఓ ఇంట్లో భార్య లక్ష్మి, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. శరణప్ప నాచారంలోని ఒక హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం శరణప్ప తండ్రి ధర్మన్న మంగ ఇద్దరూ కలిసి లాలాపేట విజయ డెయిరీ సమీపంలో టీ తాగేందుకు వెళ్లారు. అనంతరం, అక్కడి నుంచి శరణప్ప పనికి వెళ్తున్నానని తన తండ్రికి చెప్పి పట్టాల మార్గం గుండా నాచారం వైపు వెళ్తుండగా ఖర్చుల నిమిత్తం తనకు యాభై రూపాయలు కావాలని తండ్రి శరణప్ప అతడి వెనుకనే వెళ్లాడు. ఈ క్రమంలో మౌలాలి రైల్వే స్టేషన్ అప్లైన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్ల ముందే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద గల ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. ఇంట్లో భార్య ఆత్మహత్యకేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ సాగించగా మరో ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. శరణప్పకు 16 నెలల క్రితం సొంత జిల్లాకు చెందిన లక్ష్మి (24)తో వివాహం జరిగింది.అప్పటి నుంచి వీరిద్దరిమధ్య ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన గొడవలు ఉన్నట్లు పోలీసులకు బంధువుల ద్వారా సమాచారం అందింది. ఇటీవల రాఖీ పండుగ కోసం దంపతులిద్దరూ కర్ణాటక వెళ్లి పది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిత్యం గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి లక్ష్మి పురుగుల మందు తాగి నిద్రపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం శరణప్ప నిద్రలేచేసరికి విగతజీవిగా పడిఉన్న భార్య లక్ష్మి మృతదేహాన్ని గుర్తించి ఉంటాడని, భార్య మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న జీఆర్పీ, లాలాగూడ పోలీసులు ఇరువురి మృతదేహాలను గాం«దీమార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి విషాదం!
ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ వద్ద బైక్ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహాబూబ్ బాషా, మహమ్మద్ రఫీగా గుర్తించారు. అయితే, వీరు ముగ్గురూ ఒకే బైక్పై ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండలో కోర్టు పనిమీద వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరుణంలో ప్రమాదావశాత్తు ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చౌటుప్పల్లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది
లక్నో: ప్రముఖ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కోడలు షాలు(30) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుఫారీ గ్యాంగ్ మనోచాను కత్తితో పొడుస్తున్న సమయంలో కోడలు షాలు బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు తేలింది. సంబంధిత దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణలో కోడలు షాలు సైతం అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో తగిన స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకు కూడా మామను అడగాల్సి రావడం, ఇంట్లో సీసీటీవీల ద్వారా తన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంపై కోడలు షాలు తీవ్ర కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది.పోలీసులు నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. హత్యకు ముందు కేవలం 21 రోజుల్లో మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్తో కుటుంబ సభ్యులు విపరీతంగా సంప్రదింపులు జరిపారు. కోడలు షాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్తో ఫోన్లో మాట్లాడారు. మొత్తం కలిపి ఈ సంఖ్య 330కి చేరింది. హత్య జరిగిన రోజు ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు షాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.జూలై 28న ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు మామతో గొడవ పడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్కు రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి, ముందుగా రూ.2 లక్షలు చెల్లించి డూప్లికేట్ తాళం చెవిని అందజేసింది. పథకం ప్రకారం హత్యకు గురైన రోజు షాలు, ఆమె భర్త తమ బిడ్డతో కలిసి కాన్పూర్లోని కాస్మోజిన్ లాంజ్లో జరిగిన పార్టీకి వెళ్లారు.అక్కడ షాలు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులెస్తోంది. మరోవైపు మామను ఎలా హత్య చేయాలో నిందితులకు గైడెన్సీ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్ మందులు ఇవ్వడానికి వచ్చామంటూ సెక్యూరిటీ గార్డ్ను నమ్మి లోపలికి వెళ్లారు. 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో పొడిచి చంపారు.పోలీసుల అరెస్టుఅర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వినీత్ మీనోచా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఎన్కౌంటర్ తర్వాత నిందితులు విశాల్, రాజ్ కిషోర్లతో పాటు సూత్రధారైన కోడలు షాలును అరెస్టు చేశారు. మొదట అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది. -
రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, ముంబై: పూణేలోని శనివార్ పేట్ ప్రాంతంలో విషాదంచోటు చేసుకుంది. కేవలం రూ. 2.5 లక్షల అప్పు తీర్చలేక సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో తన అప్పులపై రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని ధారాశివ్ జిల్లాలోని పరందా తహసీల్ పరిధిలోని ఖసాపురి గ్రామానికి చెందిన ప్రథమేష్ దేశ్ముఖ్గా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా పూణేలోని ఒక భవనంలో మూడవ అంతస్తులో ఉన్న వన్-BHK ఫ్లాట్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దేశ్ముఖ్ రాసినట్లు భావిస్తున్న లేఖ సూచిస్తోందని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నవనాథ్ జగ్తాప్ తెలిపారు.MPSC ची तयारी करणाऱ्या परांडा तालुक्यातील (जि. धाराशिव) विद्यार्थी प्रथमेश देशमुख याने पुण्यात आत्महत्या केल्याची घटना अत्यंत दुःखद आहे.गेल्या काही काळात पेपरफुटीसह विविध गैरप्रकार होत असल्याने एक स्वप्न उराशी बाळगून अभ्यास करणाऱ्या विद्यार्थ्यांमध्ये डावलल्याची भावना निर्माण… pic.twitter.com/UWiw9vcyVQ— Riven (@R1v3n_0x) September 9, 2026ఇదీ చదవండి: కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడిసొంత ఖర్చుల కోసం దేశ్ముఖ్ రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నానని, అందులో అతను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో వారి పేర్లను కూడా అందులో పేర్కొన్నాడు. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తల్లిదండ్రులను కూడా విచారించనున్నామని డీసీపీ (జోన్-1) రుషికేష్ రావలే చెప్పారు.మరోవైపు మార్చిలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) స్క్రీనింగ్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో సహా, నియామక పరీక్షలలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై పూణే , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో MPSC అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్న తరుణంలోనే అతని బలవన్మరణం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. An MPSC aspirant died by suicide. Exam delays, irregularities and years of uncertainty have made the pressure unbearable for many students.How many more students have to suffer before the government takes accountability?https://t.co/SbWkzoej5h— Cockroach Janta Party - CJP (@Cockroachisback) September 9, 2026ఇంకా ఎంతమంది బలికావాలి - సీజేపీమరోవైపు ఈ ఘటనపై సీజేపీ కూడా స్పందించింది. పరీక్షల ఆలస్యం, అక్రమాలు , సంవత్సరాల అనిశ్చితి ఒత్తిడి చాలా మంది విద్యార్థులను బలితీసుకుంటోంది. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాన్ని కలుసుకున్న సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు -
కేవలం రూ.15 కోసం ప్రొఫెసర్పై కత్తితో దాడి
బిహార్లోని ఛప్రా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై అమానుషంగా దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతుండగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.నంద్లాల్ సింగ్ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భగవాన్ ఠాకూర్, ఎప్పటిలాగే అర లీటరు పాలు కొనుగోలు చేయడానికి ఒక దుకాణానికి వెళ్లారు. దీనికోసం ఆయన రూ. 500 నోటును దుకాణదారుడికి ఇచ్చాడు. అతను తిరిగి రూ. 450 మాత్రమే ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, తనకు రావాల్సిన చిల్లరలో రూ. 15 తక్కువగా వచ్చాయని ఠాకూర్ గమనించారు. దాంతో ఆయన తిరిగి దుకాణానికి వెళ్లి, ఆ డబ్బును దుకాణదారుడికి చూపించి, రూ. 15 కూడా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే షాప్ ఓనర్ కుమారుడు వెనకనుంచి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో ఆయన చెవిలో పొడిచాడు. ఈ హఠాత్పరిణామానికి ఠాకూర్ కింద పడిపోయారు. ఎలాగోలా తన సహోద్యోగికి ఫోన్ చేయగలిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహోద్యోగి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది మరియు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు -
హనుమకొండ కేదారి హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..
తెలంగాణ: వరంగల్ హన్మకొండ జిల్లాలోని అదాలత్ జంక్షన్లో లింగాల కేదారి హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ యజమాని కేదారి దంపతులు గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఉన్న వారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు.ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.అయితే, మంటల కారణంగా గాయపడిన కేదారి దంపతులను చికిత్స కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.హోటల్లో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.ఇవీ చదవండి: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్.. -
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
గ్రేటర్ నోయిడాలో ఆన్లైన్ మోసానికి సంబంధించిన ఉదంతం ఒకటి వైరల్గా మారింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్లో పేడ వచ్చిన దారుణమైన ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది.ఆకాష్ నగర్ అనే వ్యక్తి తన పని కోసం కొద్ది రోజుల క్రితం ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రూ. 1,999 విలువైన ఆండ్రాయిడ్ పరికరాన్ని ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసే సమయంలోనే ఆన్లైన్ ద్వారా పూర్తి నగదు చెల్లింపు కూడా చేశారు. అయితే సోమవారం సాయంత్రం 5:00 గంటలకు కొరియర్ ద్వారా పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఉత్సాహంగా ఆ బాక్స్ను తెరిచిన ఆకాష్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. అందులో ఉండాల్సిన ఎలక్ట్రానిక్ పరికారానికి బదులుగా ఆవు పేడ (ఎరువు) ప్యాకెట్ కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుదీంతో మోసపోయానని గ్రహించిన ఆకాష్ వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆర్డర్ చేసిన వెబ్సైట్ వివరాలు, పేమెంట్ ట్రాన్సాక్షన్ డేటా, కొరియర్ డెలివరీ చైన్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ग्रेटर नोएडा | गजब का फ्रॉड! ऑर्डर किया Android डिवाइस, पैकेट से निकला गोबर!देखिए पूरा वीडियो - https://t.co/UTRPvCWML4#noida #onlinefraud #dainikbhaskarup #dainikbhaskar pic.twitter.com/mHEzmSuw3v— Dainik Bhaskar UP (@dainikbhas32934) September 9, 2026 ఆన్లైన్ షాపింగ్ పేరిట నమోదవుతున్న మోసాలకు సంబంధించి ఇదే మొదటి సంఘటన కాదు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అధికారిక, గుర్తింపు పొందిన వెబ్సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేయాలని, ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: రీల్స్తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి! -
రీల్స్తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!
గుజరాత్లోని అహ్మదాబాద్లో మరో పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీల్స్తో పరువు తీస్తోందని, తండ్రీ కొడుకు కలిసి తమ ఇంటి ఆడబిడ్డను మట్టుబెట్టారు. తొలుత హిట్ అండ్ రన్ కేసుగా భావించి నప్పటికీ అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. కన్న తండ్రి, సోదరుడు కలిసి చేసిన 'పరువు హత్య' గా తేలడంతో కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు సోఫియా (22) ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్గా పని చేస్తోంది. అయితే బైక్ యాక్సిడెంట్ సంఘటనను లోతుగా విచారించగా అసలు విషయం తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని పోలీసులు వెల్లడించారు.సుమారు మూడు నెలల క్రితం సోఫియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సమాజంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతింటుందంటూ ఆగ్రహంతో రగిలి పోయిన తండ్రి, కొడుకుతో కలిసి ఆమెను అంత మొందించడానికి కుట్ర పన్నినట్టు నిర్ధారణ అయింది.ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్తమ పథకం ప్రకారం తండ్రి మహ్మద్ ఫారూక్, సోదరుడు మహ్మద్ హబీల్ సోఫియాను బైక్పై బయటకు తీసుకెళ్లారు. ఘెల్జీపురా గ్రామం వద్ద ఉన్న ఒక నిర్జనమైన బాటలోకి బైక్ను మళ్లించి, హబీల్ తన ప్యాంట్లో దాచుకున్న సుత్తితో సోఫియా తలపై మూడుసార్లు తీవ్రంగా దాడి చేశాడు. దాడి అనంతరం, ఆమెను తిరిగి ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చి, బైక్ను ధ్వంసం చేసి తీవ్ర వేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసుగా భావించి సోఫియాను సోలా సివిల్ ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించింది. వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీకొట్టిందని హబీల్ పోలీసులకు చెప్పినప్పటికీ, విచారణలో వారి మర్డర్ ప్లాన్ బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులైన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని, వారిపై హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్ను కొట్టి చంపేశారు -
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు. తన నిర్ణయానికి అనారోగ్యం ,మానసిక సమస్యలే కారణమని పేర్కొంటూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరిగాయి.ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, మూడేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. రాజధాని నగరంలో రవాణా, విద్యుత్ మరియు పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు. -
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు -
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం -
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు -
నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు
ఆంధ్రప్రదేశ్: కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని పలువురి నుంచి నగదు వసూలు చేసి మోసం చేసిన కేసులో యూట్యూబర్ జాగర్లమూడి రమా నందన (నందు) మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా డెస్టినీ కన్సెల్టెన్సీలో ఆమె పాత్ర, దాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై ఆమెను పోలీసులు ప్రశ్నించారు.ఈ అంశంపై తనకు ఏమీ తెలియదని అంతా తన భర్త మధుకర్ చూసుకుంటారని రమానందన చెప్పారని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తామని, సరైన సమాధానాలు రానందున ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని రమానందనకు నోటీసు ఇచ్చామని వెల్లడించారు. యూట్యూబ్లోని నందూస్ వరల్డ్ చానల్ను ఉపయోగించి వాట్సాప్ గ్రూప్ ద్వారా కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రమా నందన మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.యూకే గవర్నమెంట్ అధికారిక రికార్డుల మేరకు అన్నే రమా నందన పేరిట నందూస్ కెఫే లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్, స్మైల్ హెల్త్కేర్ సరీ్వసెస్ లిమిటెడ్ సంస్థలు సృష్టించినట్లు విచారణలో తేల్చారు. ఈ కంపెనీలను వీసా స్పాన్సర్íÙప్స్ చూపించడానికి ఫండ్స్ మళ్లించడానికి వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీసాల పొడిగింపు, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమానందన చేసిన మోసాలు, ఆర్థిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై రమా నందన, ఆమె భర్త మధుకర్, మామయ్య మోహనరావులపై కేసు నమోదవ్వగా..మోహనరావును ఇప్పటికే అరెస్ట్ చేశారు.అద్దంకిలోనూ వసూళ్లు?: ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా ఉద్యోగాల పేరుతో నగదు వసూలు చేసినట్లు రమా నందనపై ఆరోపణలున్నాయి. అద్దంకికి చెందిన ఉప్పలపాటి నవీన్ ఉద్యోగం కోసం రూ.18 లక్షలు ఇచ్చినట్లు నవీన్ తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి పోలీసులతో ఇబ్రహీంపట్నం వచ్చిన రమా నందనకు 41ఏ నోటీసులు ఇవ్వబోయారు.అయితే ఇప్పుడు తాను నోటీసులు తీసుకోనని, మొగల్రాజపురంలో ఉంటున్నానని అక్కడకు వచ్చి ఇస్తే తీసుకుంటానని అడ్రెస్ చెప్పి ఆమె వెళ్లిపోయారు. అంతకు ముందు స్టేషన్లోకి రమా నందన వెళ్లే క్రమంలో ఆమె లాయర్లు, విలేకరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో విలేకరులు స్టేషన్ ముందు ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు సర్దిజెప్పి వివాదాన్ని ముగించారు. -
మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!
హైదరాబాద్: పోలీసులు గుర్తించకుండా మాస్క్ పెట్టుకొని దొంగతనానికి పాల్పడిన నిందితుడిని కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడిన ఓ మచ్చ పట్టించింది. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్రోడ్ నెం.10లో నివసించే ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లోకి గత నెల 31న ఓ దొంగ ప్రవేశించి అల్మారాలోని నగలు తస్కరించి పరారయ్యారు.అంతకుముందు ఇదే రోడ్డులో రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించి విఫలమై మూడో ఇల్లు శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించగా ఆయన భార్య నీలు కౌర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇక్కడ సీసీ ఫుటేజీలు, వేలి ముద్రలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించగా కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడ్డ ఓ మచ్చను పోలీసులు గమనించారు. పాత నేరస్తుల కదలికలను పరిశీలించిన కనురొమ్మలపై మచ్చ ఉన్న వ్యక్తిని గుర్తించారు.గత నెల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితుడి వివరాలు నమోదయ్యాయి. ఈ మచ్చ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పెందుర్తికి చెందిన గౌరేష్(27) బంజారాహిల్స్రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో అద్దెకు ఉంటూ జూనియర్ ఆరి్టస్ట్గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలపై దృష్టి పెట్టాడు. శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారం దొంగతనం చేసి అందులో కొంత విక్రయించి గోవాకు ఫ్లైట్లో వెళ్ళాడు.గోవాలో ఓ క్యాసినోలో జూదం ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. బంగారం రికవరీ చేసే దిశలో పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నది. చోరీ జరిగిన 48 గంటల్లోనే క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితుడు గౌరేష్ గతంలో మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోనూ దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి పేకాట కోసం జూబ్లీహిల్స్లో దొంగతనం చేశాడు. -
మంచిర్యాలలో దారుణం.. వివాహితను గొడ్డలితో నరికి చంపిన బంధువు!
తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ వివాహితను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దండేపల్లి మండలం నిల్కి వెంకటాపూర్లో సింగతి లక్ష్మి (37) అనే వివాహిత నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆమె బంధువు సింగతి రవి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి చంపాడు. దీంతో సింగతి లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే నిందితుడు హత్యచేసిన వెంటనే ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలోని స్థానికులలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని పట్టుకున్నాకే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాద ఛాయలు
వైఎస్ఆర్: జిల్లాలోని నందలూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నందలూరు మండలం వెంకట రాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరతయ్య (40) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరతయ్య పని నిమిత్తం తన పొలంలో ఉన్నటువంటి కరెంటు మోటార్ గదిలోనికి వెళ్లాడు. అయితే, అతను వెళ్లిన గదిలో విద్యుత్ తీగలు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. అయితే, ప్రమాదావశాత్తు ఆ కరెంటుతీగలు అతనికి తగిలాయి. దీంతో వెంకటరతయ్య ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విషయం గురించి సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, విద్యుత్ వైరు ఎలా తగిలింది, విద్యుత్ మోటార్ గదిలో భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే అంశాలపై పోలీసులు విచారణకై మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: డిల్లీలోని సత్య నికేతన్లో భవనం కూలిపోయిన ఘటనలో సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సెప్టెంబర్ 10న విచారించనుంది. అలాగే ఈ ఘటనపై దాఖలైన అత్యవసర ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అధికారుల స్పందనను కోరుతూ పలు మార్గదర్శకాలను, ఆదేశాలను జారీ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సౌత్ జోన్కు చెందిన ఐదుగురు అధికారులను (డిప్యూటీ కమిషనర్ రాకేష్ గుప్తాతో సహా) మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సస్పెండ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ హాస్టల్ యజమాని, 81 ఏళ్ల హరిరామ్ గుప్తా, భార్యను పాటియాలా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టూ ఉన్న ప్రమాదకరమైన భవనాలకు MCD కూల్చివేత నోటీసులు జారీ ప్రక్రియను ప్రారంభించింది. కూలిపోయిన భవనానికి ఆనుకుని ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉన్న మరో భవనంతోపాటు మరికొన్ని భవనాలను పరిశీలిస్తున్నామని MCD సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్?మరోవైపు బాధితులు గాయపడిన వారి కుటుంబాలను రేఖా గుప్తా ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స ఖర్చును ఎన్సిటి (NCT) ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. ప్రమాదకరమైన మరో భవనాన్ని బుధవారం కూల్చివేస్తామని కూడా ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలుఈ ఘటన అనంతరం పారిపోతున్న పీజీ యజమానిని హరిరామ్ రాజస్థాన్లోని భివాడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓనర్తోపాటు, అతని భార్య ఊర్మిళా గుప్తా (75), కుమారుడు మహేష్ గుప్తా (52)లను కూడా అరెస్టు చేశారు.ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్! -
ఏటీఎంలలో ఫెవిక్విక్.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా
ముంబై: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లినప్పుడు కార్డును కార్డ్ స్లాట్లో పెట్టి, భాషను ఎంచుకుని, 4 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్), తీసుకోవాల్సిన నగదు మొత్తాన్ని నమోదు చేస్తారు. నగదు తీసుకున్న తర్వాత డెబిట్ కార్డును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే అది బయటకు రాకుండా ఇరుక్కుపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కొల్సేవాడిలో ఓ ముఠా ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఏటీఎం యంత్రాల కార్డ్ స్లాట్కు ఫెవిక్విక్ను పూసి కార్డులను ఇరుక్కుపోయేలా చేసేది. కల్యాణ్లోని కొల్సేవాడి పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం కేంద్రాల వద్ద వేచి ఉండి, వినియోగదారుల కార్డులు స్లాట్లో ఇరుక్కుపోయేలా ఫెవిక్విక్ పూసినట్లు దర్యాప్తులో తేలింది.కార్డు ఇరుక్కుపోయి వినియోగదారుడు అయోమయానికి గురైన వెంటనే ముఠాలోని ఓ సభ్యుడు సహాయం చేస్తున్నట్లు అక్కడికి వచ్చేవాడు. ఏటీఎం పిన్ను 3 సార్లు నమోదు చేయాలని అతడు వినియోగదారుడిని కోరేవాడు. పిన్ నమోదు చేసినా నగదు బయటకు రాకుండా చేసేవారు. అనంతరం ఓ ప్రత్యేక మొబైల్ నంబర్కు ఫోన్ చేయాలని వినియోగదారుడికి చెప్పేవారు. ఆ నంబర్ ముఠాలోని మరో సభ్యుడిదే.తర్వాత వినియోగదారుడిని ఓ నిర్దిష్ట ప్రాంతానికి రావాలని చెప్పేవారు. దర్యాప్తులో భాగంగా వినియోగదారుల నుంచి ఏటీఎం పిన్ తెలుసుకున్నట్లు లేదా ఇతర మార్గాల్లో వారి బ్యాంకింగ్ వివరాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలతో బాధితుల ఖాతాల నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడైంది.కల్యాణ్ ఈస్ట్లోని కొల్సేవాడి ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రంలో ఓ వ్యక్తిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో రాజేశ్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ వ్యవహారంలో మరో ముగ్గురు ఉన్నట్లు రాజేశ్ పోలీసులకు తెలిపాడు. వారు భివాండీలోని కొంగావ్ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించాడు.ఆ ముగ్గురు నిందితులు పాట్నా ఎక్స్ప్రెస్ రైలులో బిహార్కు వెళ్తున్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు వారిని వెంబడించి పాట్నా ఎక్స్ప్రెస్లోనే అరెస్ట్ చేశారు. ఇదే పద్ధతిలో ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విధానంలో ఇంకా ఎంతమందిని మోసం చేశారో, బాధితుల ఖాతాల నుంచి ఎంత నగదు తీసుకున్నారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చిన్న విమానం అదృశ్యం.. ఫ్యామిలీ మిస్సింగ్ -
జైలు నుంచి వచ్చాక.. ఆ షుగర్ డాడీ పని పడతా!
భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె తలను ఫ్రిడ్జిలో భద్రంగా దాచాడు. ఈ ఘటన దేశం మొత్తాన్ని నివ్వెర పోయేలా చేసింది. అయితే పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తాజాగా మీడియా ఎదుటే.. తన భార్యను చంపినందుకు బాధపడడం లేదని, బయటకు వచ్చాక మరో వ్యక్తిని చంపి తీరతానంటూ నిందితుడు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.అస్సాం రాజధాని గువాహటి(గౌహతి) సమీపంలో జరిగిన ఈ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య రియా తాలుక్దార్ (25)ను హత్య చేసి, ఆమె తలను నరికి ఫ్రిజ్లో దాచి పెట్టాడు రమానుజ్ గోస్వామి. అయితే మంగళవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో హతిగావ్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ షుగర్ డాడీని చంపుతా’’ అంటూ హెచ్చరించాడు.అయితే ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించగా.. అతడు కోపంతో ఊగిపోయాడు. ‘‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. క్షమాపణ కూడా చెప్పను’’ అని చెప్పాడు. Wife murder accused Ramanuj Goswami allegedly showed no remorse over the killing of Riya Talukdar during questioning at Hatigaon Police Station.Ramanuj reportedly made shocking remarks and even threatened another person referred to as a “sugar daddy.”He also allegedly… pic.twitter.com/hY2uVDyELC— The Sentinel (@Sentinel_Assam) September 8, 2026భార్యపై అనుమానంతోనే?రియా, రమానుజ్లకు సుమారు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని.. భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రమానుజ్ వివాదానికి దిగేవాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో ఆవేశానికి లోనై రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనల క్రమాన్ని దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి ఉంది.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలోని దంపతుల నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు రెండ్రోజుల ముందు నుంచి.. కుటుంబ సభ్యులు వాళ్లకు కాంటాక్ట్ మిస్ అయ్యారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. శరీరం కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. తల కనిపించలేదు. ఇంట్లోని ఫ్రిజ్ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచిన రియా తలను గుర్తించారు. ఆమె వేళ్లు కూడా నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులకు లొంగిపోయిన భర్తఘటన అనంతరం రమానుజ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.‘షుగర్ డాడీ’ ఎవరు?షుగర్ డాడీ అంటే Sugar Daddy సాధారణంగా తనకంటే చిన్న వయసున్న వ్యక్తికి డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశచూపి లోబర్చుకోవడం. రమానుజ్ చేసిన తాజా వ్యాఖ్యలు.. ఈ కేసులో మరో కోణాన్ని తెరపైకి తెచ్చాయి. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా ‘షుగర్ డాడీ’ని శిక్ష పూర్తయ్యాక తిరిగొచ్చి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి ఎవరు? రియాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? నిజంగానే అలాంటి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.పోలీసు కస్టడీకి అనుమతిరమానుజ్ను కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటన జరిగిన సమయం, నిందితుడి కదలికలు, ఆయుధం వినియోగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. -
లోన్ ఎగ్గొట్టేందుకు మేనేజర్నే లేపేస్తే..
ప్రాంటిజ్: గుజరాత్లోని ప్రాంటిజ్ తాలూకాలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ మేనేజర్ భరత్ చౌధరి హత్య కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. రూ.6 లక్షల రుణం ఎగ్గొట్టడంతోపాటు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి దక్కించుకునేందుకు ఓ ప్రేమజంట ఈ హత్యకు పథకం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మాణసా బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న భరత్ చౌధరి సెప్టెంబర్ 2న అదృశ్యమయ్యారు. అనంతరం లిమ్లా గ్రామం నుంచి వడవాసా వెళ్లే మార్గంలో ఓ కారులో ఆయన మృతదేహం కనిపించింది. ఆయన మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.డిప్యూటీ ఎస్పీ ఏకే పటేల్ వివరాల ప్రకారం.. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు భావన అలియాస్ భావూ ఠాకోర్, ఆమె ప్రియుడు యోగేశ్ ఠాకోర్లపై అనుమానం వ్యక్తం చేశారు. భావనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. భావన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నుంచి రూ.1.50 లక్షలు, యోగేశ్ రూ.4.50 లక్షలు రుణంగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం రూ.6 లక్షల రుణాన్ని చెల్లించకుండా ఉండటంతోపాటు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు ఇద్దరూ మేనేజర్ను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.పథకంలో భాగంగా భావన.. డబ్బులు ఇస్తాననే నెపంతో భరత్ను ప్రాంటిజ్కు రప్పించింది. అనంతరం యోగేశ్ ఆయనను కారులో మాణసా నుంచి తీసుకెళ్లాడు. వడవాసా సమీపంలో కారులోనే పదునైన ఆయుధంతో భరత్పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత మృతదేహాన్ని, కారును నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేయాలని ఇద్దరూ భావించారు. అయితే లిమ్లా వైపు వెళ్తుండగా కారును రివర్స్ చేసే సమయంలో రహదారి పక్కన ఉన్న గుంతలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు బయటకు రాకపోవడంతో పోలీసులకు చిక్కుతామనే భయంతో మృతదేహంతోపాటు కారును అక్కడే వదిలి ఇద్దరూ పరారయ్యారు.భావన, యోగేశ్ సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భావనను అరెస్టు చేయగా, యోగేశ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: కాంగ్రెస్లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు! -
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్ను కొట్టి చంపేశారు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్గా పనిచేస్తున్న చోంగ్థమ్ విక్రమ్ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్మెంట్లో థర్డ్ఫ్లోర్దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family…— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2026Manipuri musician beaten to death for objecting to shouting, drinking outside his Delhi flat; 7 held#ChongthamVikramSingh pic.twitter.com/U0fZBjClqa— Raajeev Chopra (@Raajeev_Chopra) September 7, 2026చోంగ్థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణంహోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్ గాంధీ ఆగ్రహంలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు. సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.THIS IS SHOCKING🚨😡Delhi.Modi’s capital.BJP’s city.Manipuri musician Chongtham Vikram Singhobjected to drunk boys making noise outside his home.They beat him on the road.Chased him into his third-floor flat.Beat him again.Hours later, he was dead in hospital.His… pic.twitter.com/QN3cr5TV7x— The Rebel (@TheRebel_IN) September 8, 2026ఇదీ చదవండి: రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్లోకి..కట్ చేస్తే! -
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.భౌరంపేట్లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
హైదరాబాద్: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఇంటి పైపోర్షన్లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి తెలిపారు.ఇవీ చదవండి: కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్! -
కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
తెలంగాణ: కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కల్లెడ శివారు ధర్మపురి రోడ్డులో జరిగింది.స్థానికుల సమాచారం ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్కి సమాచారం అందించి, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాత్రి మహేష్ (23) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురిని చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రాయచోటి ఘాట్లో ఘోరం.. లారీ బోల్తా, ఇద్దరు సజీవ దహనం!
వైయస్సార్ కడప: జిల్లాలోని రాయచోటి ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయచోటి నుంచి కడపకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఘాట్లో ప్రమాదానికి గురైంది. ఘాట్లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి ఎడమవైపు తిరగకుండా నేరుగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.అయితే, లారీ బోల్తా పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో లారీ డ్రైవర్, క్లీనర్ చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.అలాగే, లారీకి అంటుకున్న మంటలు సమీపంలోని అడవికి వ్యాపించగా, అటవీ ప్రాంతం దట్టంగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించి పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఫైర్ ఇంజన్లను రప్పించి లారీకి అంటుకున్న మంటలతో పాటు అడవిలో వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, లారీ అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
టీవీకే నేత దారుణ హత్య, ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శలు
సాక్షి, చెన్నై: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీలో దుమారం కొనసాగుతుండగా, మరోవైపు టీవీకే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 5న రాత్రి పార్టీకి చెందిన కణ్ణన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్గా మారాయి. పాత కక్షలతో ఒక ముఠా అతడిని కిరాతకంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కార్ రెంటల్ వ్యాపారం చేసే కణ్ణన్, సెప్టెంబర్ 5న తన స్నేహితులతో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఒక ముఠా ఆయనపై దాడి చేసింది. కత్తిపోట్లతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శాస్త్రి నగర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భరణి, రాకేష్, నరేష్, మణికంఠన్, హరిహరన్ అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.Chennai - TVK functionary S. Kannan was chased and hacked to death by a gang in the Adyar–Besant Nagar area on Saturday night. Police have arrested five men. Kannan was standing near Ellaiamman Koil Street when attackers on two-wheelers surrounded him. He tried to flee, but the… pic.twitter.com/O45DiOOz2b— NextMinute News (@nextminutenews7) September 7, 2026ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణం ప్రతీకార హత్యకణ్ణన్పై క్రిమినల్ కేసులతో పాటు, హిస్టరీ షీటర్గా రికార్డుల్లో ఉన్నట్లు పోలీసుల తెలిపారు. గతంలో 2009లో భరణి బాబాయి శివను, 2014లో భరణి తండ్రి వేలును కణ్ణన్ బృందం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే భరణి, అతడి అనుచరులు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు తమిళనాడు డీజీపీ ఆదేశాల మేరకు అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్తో పాటు శాస్త్రి నగర్ ఇన్స్పెక్టర్ రోహిణిలను వేకెన్సీ రిజర్వ్లోకి బదిలీ చేశారు.நாளை மாண்புமிகு முதலமைச்சர் காவல்துறை மானியக் கோரிக்கை விவாதம் மீது பதிலுரை அளிப்பதற்கு முன்பாக அவரது கட்சிப் பிரமுகர் ஒருவரே தலைநகரில் கொலைக்கு ஆளாகியுள்ளார்.அதுவும், தனது உயிருக்குப் பாதுகாப்பு வேண்டி ஆளும் த.வெ.க.வில் இணைந்த சரித்திரப் பதிவேடு குற்றவாளி சாலையில் ஓட ஓட…— Udhay (@Udhaystalin) September 6, 2026మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షణ కోసం అధికార పార్టీలో చేరిన వ్యక్తే వీధిలో దారుణహత్యకు గురయ్యాడని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని ఎక్స్లో విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో బహుళ అంతస్తుల పీజీ (PG) భవనం కూలిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో కనీసం ఏడుగురు మరణించిన, పలువురు గాయపడిన ఘటనలో పరారీలో ఉన్న భవన యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చదువు లేదా ఉద్యోగం కోసం నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది.ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉన్న ఈ బాలుర పీజీలో ఎక్కువగా కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్లకు చెందిన విద్యార్థులు నివసిస్తున్నారు.పాత భవనంలో మరమ్మతులు చేస్తుండగా, బేస్మెంట్లో నీరు చేరడంతో భవనం బలహీనపడి కూలి పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత పరారైన పీజీ యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 12 మందిని వెలికితీశారు. వారిలో ఏడుగురు మరణించగా, మిగిలిన ఐదుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఐదు అంతస్తులు ఉన్న భవనాలన్నింటినీ తక్షణమే సీల్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణం మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధ్యులైన ఎంసీడీ (MCD) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్కనే ఉన్న ప్రమాదకరమైన మరొక భవనాన్ని కూడా కూల్చివేయనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఫైర్ సర్వీసెస్, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా ప్రధాని కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నాయి.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి!
విశాఖపట్నం: నేడు పుట్టినరోజు. కొత్త దుస్తులు ధరించి, మిత్రులతో సరదాగా గడపాలి. అమ్మానాన్నల ఆశీస్సులు అందుకోవాలి. ఇదీ ఆ యువకుడి ఆశ. కానీ, విధి మరోలా తలచింది. పుట్టినరోజు సంబరాల ఏర్పాట్లు చేసుకుని బైక్పై ఇంటికి వస్తుండగా మృత్యువు కాటేసింది. స్నేహితుడితో కలిసి బైక్పై వస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బస్సు మీద నుంచి వెళ్లిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రెండు బస్సుల మధ్య.. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్కు చెందిన తంగుడు మదన్ (24) ఆదివారం తన పుట్టినరోజు కావడంతో పార్టీ ఏర్పాట్ల నిమిత్తం మిత్రుడు మణికుమార్తో కలిసి బైక్పై కంచరపాలెం వెళ్లాడు. పనులు ముగించుకుని ఎన్ఏడీ వైపు జాతీయ రహదారిలో వస్తుండగా, ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ముందు వెళ్తున్న ఫార్మా బస్సును ఢీకొని కిందపడిపోయారు. ఆ సమయంలో మదన్పై నుంచి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న కంచరపాలెం యువకుడు మణికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో కేజీహెచ్కు తరలించారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సొంతింటి ఈఎంఐ కోసం శ్రమిస్తూ.. మదన్ తల్లిదండ్రులు ఎన్ఏడీ జంక్షన్లో తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. మదన్ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే, ఈవెంట్లలో డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇటీవలే శాంతినగర్లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాధ్యతలు మోస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు.. పుట్టినరోజే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నువ్వు లేకపోతే మాకెవరురా దిక్కు’ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు స్థానికులను కలచివేశాయి. చదవండి: భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్కు తాళ్లతో కట్టేసి -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
మట్టి మాఫియాకు యువకుడు బలి
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద బైక్పై వెళుతున్న ఓ యువకుడిని మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మ కుమారుడు చంద్రశేఖర్ (25) ఆదివారం బైక్పై శ్రీకాళహస్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఎదురుగా మట్టి లోడుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా చిన్నపాటి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా, ట్రాక్టర్కు కనీసం నంబరు ప్లేట్ కూడా లేకపోవడం విశేషం. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అక్కడున్న వారిని ఆరా తీశారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని తీరుతో శ్రీకాళహస్తిలోని ప్రతి గ్రామంలోనూ మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందన్నారు. నంబరు ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు నడుపుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్రెడ్డి మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాగా.. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్పై వస్తుండగా బైపాస్రోడ్డులోని అండర్పాస్ వంతెన వద్ద మట్టి లోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్ ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!
ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ మరింత ముదిరింది. ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. మాధురి రాథోడ్ ఫిర్యాదు..అంతకుముందు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాసింగ బలాలే జానపద నృత్యంలో నటించి ఈశ్వర్సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీన్ రీక్రియేట్ చేయమంటే ఇలా చేశారేంటి?
గాంధీనగర్ : గుజరాత్ భావ్నగర్ ఎస్టీ బస్టాండ్లో జరిగిన హత్య కేసుకు సంబంధించి, పోలీసులు నిందితుడితో కలిసి క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్ట్ చేశారు. అయితే, ఈ సందర్భంగా చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసుల వివరాల మేరకు.. భావ్నగర్ ఎస్టీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఫైసల్ (అలియాస్ ఖాట్కి లఖాని), కాజల్బెన్ గత ఏడేళ్లుగా కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. వివాహేతర సంబంధంందనే అనుమానంతో తలెత్తిన గొడవ కారణంగా ఫైసల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బస్ స్టాండ్లోనే కాజల్బెన్ను కిందపడేసి, తలపై, శరీరంపై తీవ్రంగా కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీన్ని అడ్డుకోబోయిన రవి అనే వ్యక్తిపై కూడా ఫైసల్ దాడి చేసి గాయపరిచాడు.ఈ భయానక దాడి బస్ స్టాండ్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. చుట్టూ జనం చూస్తున్నప్పటికీ దాదాపు నిమిషాల తరబడి ఈ దాడి కొనసాగడం గమనార్హం. తీవ్ర గాయాలపాలైన కాజల్బెన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న ఆమె మృతి చెందింది.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైసల్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడికి ఇదివరకే దోపిడీలు, శారీరక దాడులకు సంబంధించిన క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు ఫైసల్ను నేరుగా భావ్నగర్ ఎస్టీ బస్ స్టాండ్లోని ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. అతను ఏ విధంగా మహిళపై దాడికి పాల్పడ్డాడో పోలీసులు అక్కడే పూసగుచ్చినట్లు రికన్స్ట్రక్ట్ చేసి పరిశీలించారు. ఈ క్రమంలో బస్ స్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పోలీసులు చుట్టుముట్టి అక్కడికి తీసుకెళ్లగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంఘటన స్థలంలో నిందితుడిని పోలీసులు దండించిన తీరు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్యం, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు #BREAKING Bhavnagar Crime IncidentFaisal Khan was arrested by Gujarat Police after allegedly beating his live-in partner, Kajal Baraiya, to death in Bhavnagar. The assault, captured on CCTV, also injured her brother.#Bhavnagar #GujaratPolice @GujaratPolice @SPBhavnagar pic.twitter.com/VRyTmxTnZr— jarvis ☠️ (@Vishii14) September 5, 2026 -
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
నిజామాబాద్ అర్బన్: చాక్లెట్ కొనిస్తానని చెప్పి మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. సంధ్య మూడో కాన్పు కోసం ఈనెల 2న నిజామాబాద్లోని జీజీహెచ్లో చేరింది. శనివారం ఉదయం నరేశ్ ప్రసూతి విభాగం ముందు టీ తాగి, ఇద్దరు పిల్లలను అక్కడే ఉండమని చెప్పి ఖాళీ గ్లాసులను చెత్తకుండీలో వేసేందుకు వెళ్లాడు. అంతలోనే ఓ మహిళ పిల్లల వద్దకు వచ్చి చాక్లెట్ కొనిస్తానని చెప్పి వారిని తీసుకువెళ్లింది.మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లగా.. అతడి అన్న ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అక్కడికి వచ్చిన నరేశ్ కంగారుగా ఆస్పత్రి అంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్హెచ్వో రఘుపతి ఆస్పత్రికి వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అపరిచిత మహిళతో పాటు మరో మగ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అన్నం వడ్డించనందుకు భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త
నాగ్పూర్: అన్నం వడ్డించనందుకు ఓ మహిళను ఆమె భర్త కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలాల్ (41) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్య యామిని మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ హరేశ్ కల్సేకర్ మాట్లాడుతూ.. కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్య యామినిని భోజనం వడ్డించాలని అడిగాడని తెలిపారు. అయితే యామిని అందుకు నిరాకరించి, తాను డ్యాన్స్ క్లాస్కు వెళ్లాలనుకుంటున్నానని, భోజనం అతడే వడ్డించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.దీంతో దంపతుల మధ్య మొదలైన విభేదం తొలుత వాగ్వాదానికి, ఆ తర్వాత భౌతిక ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి ఫ్లాట్లో మహిళలకు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఘర్షణ సమయంలో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్ యామినిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మెడ, పొత్తికడుపుపై లోతైన గాయాలయ్యాయి. ఆ గాయాలు ప్రాణాంతకంగా మారడంతో యామిని మృతి చెందింది.పోస్టుమార్టంతో అనుమానాలుయామిని మృతి తర్వాత పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యామిని కుటుంబ సభ్యులకు ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో యామినిని హత్య చేసినట్లు కృష్ణలాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు 14 ఏళ్లు కాగా, చిన్న కుమారుడి వయసు 4 ఏళ్లు. -
రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
సాక్షి, మార్కాపురం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు దురదృష్టవశాత్తు ఈ రోజు (శనివారం) కాలువలో గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే..వెలికొండ ఫీడర్ కెనాల్లో పడి ఇద్దరు యువకులు రాజు (23) వినయ్ (22) గా గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గల్లంతైన రాజు అనే యువకునికి రేపు వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
మధ్య కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసిన తరుణంలో యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతం వద్ద శనివారం ఈ తాజా ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా సంస్థలకు అందిన సమాచారం మేరకు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నిఘా ఆధారిత గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ కాల్పులు మొదలయ్యాయి. స్పెషల్ ఫోర్సెస్ 53 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి.ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. యాసిర్ మొదట లష్కర్-ఏ-తైబాకు చెందిన సులేమాన్ మూసా బృందంలో సభ్యుడిగా ఉండేవాడు. అయితే, దాదాపు ఏడాది క్రితం ఆ బృందం నుండి విడిపోయి, అప్పటి నుండి స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భద్రతా సంస్థలు అతని కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, కొంతకాలంగా యూస్మార్గ్ ప్రాంతంలో అతని కార్యకలాపాలపై నిఘాపెట్టాయి.సులేమాన్ బృందం నుండి విడిపోయిన తర్వాత యాసిర్ ఆ ప్రాంతంలో కీలకమైన లష్కర్ కార్యకర్తగా ఎదిగాడని కూడా వర్గాలు వెల్లడించాయి. యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతాల్లో అతని ఉనికిని గుర్తించిన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి, చివరకు అది ఎదురుకాల్పులకు దారితీసింది.ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుయాసిర్ మరణం తర్వాత, భద్రతా సంస్థలు అతని నెట్వర్క్, ఇతర లష్కర్-ఏ-తైబా కార్యకర్తలతో అతనికి ఉన్న సంబంధాలు మరియు ఆ ప్రాంతంలో అతని కార్యకలాపాల విస్తృతిపై దర్యాప్తు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళిక, నిర్వహణ లేదా మద్దతులో యాసిర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.ఇదీ చదవండి: 8 తులాల గోల్డ్ కొట్టేసి ప్రియుడికి బైక్ : గుట్టు విప్పిన ఇన్స్టా రీల్కాగా హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ మూసా, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారులలో ఒకడు. ఆ దాడి జరిగిన కొద్ది నెలల తర్వాత, శ్రీనగర్లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాడు.ఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ -
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్కు చెందిన లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ 3న చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఇవి కూడా చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు -
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. హాస్టల్ గదుల్లో దాక్కున్న విద్యార్థులను తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు. బుధవారం రాత్రి తీజ్ వేడుకల్లో మధ్య తలెత్తిన వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. వీరికి మిగతా విద్యార్థులు సర్ది చెప్పి పంపించారు.ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వేరే హాస్టళ్ల గదులకు వెళ్లిపోయారు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి చెప్పారు. విచారణ చేస్తున్నాం: డీసీపీ జేఎన్టీయూహెచ్లో గొడవకు కారణమైన ఇరువర్గాల విద్యార్థులపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. వర్సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులను, ఇతర సిబ్బందితో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ర్యాగింగ్ కారణంగా గొడవ జరిగిందనే విషయం వాస్తవం కాదన్నారు.కేసులు ఇలా.. కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు రాజు, ఆనంద్, వసంత్, దుర్గా ప్రసాద్, ఆదిత్య, సాగర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా వసంత్నాయక్ ఫిర్యాదు మేరకు నవీన్ నాయక్, ప్రశాంత్, సందీప్, ఇస్మాయిల్, వెంకట్, చక్రి, సాత్విక్, ప్రకాష్లపై కేసులు నమోద య్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, సందీప్, పూజిత్, రాజే‹Ù, సన్నీ, ఇస్మాయిల్, ఇమ్మాన్యుయేల్లపై కేసులు నమోదు చేశారు. -
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు. నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్ అరెస్ట్ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తాజా సమాచారం.Tiruchengode 🚨⚠️Disturbing Visuals🚨4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026పేద కుటుంబం.. పెద్ద కష్టంమృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారంఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదంచదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం -
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు. -
మహిళను వివస్త్రను చేసి, దాడి : వీడియోలతో బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో లోన్ వడ్డీ చెల్లించలేదనే నెపంతో ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన వైనం కలకలం రేపింది. దీనికి తోడు బాధితురాలిపై దాడి చేసిన ఆ దృశ్యాలను నిందితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మరింత ఆందోళన రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు రెండేళ్ల క్రితం రేష్మ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించలేక పోయింది. రేష్మా ద్వారా పరిచయమైన నజ్రత్ వద్ద కూడా బాధితురాలు రూ. 50 వేలు రుణం తీసుకుని, వారానికి రూ. 5,000 చొప్పున చెల్లిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల గత నాలుగు వారాలుగా ఈ చెల్లింపులు కూడా నిలిచిపోయాయి అయితే డబ్బులకోసం వేధిస్తారనే భయంతో బాధితురాలు రేష్మా ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చింది.దాడి జరిగిన తీరుదీనితో నజ్రత్, రేష్మా, సుహైల్, సైఫ్గా కలిసి ఒక పన్నాగం పన్నారు. దీని ప్రకారం నజ్రత్ బాధితురాలికి ఫోన్ చేసి, పని ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించింది. బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లగానే సుహైల్ ఆమెపై బూతులతో నానా దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని బలవంతంగా ఆటోరిక్షాలోకి ఎక్కించారు. ఆమె పక్కన రేష్మా, నజ్రత్ కూర్చోగా, సుహైల్ మరికొందరితో కలిసి ఫాలో అయ్యారు. బెంగళూరు శివార్లలోని కుంబళగోడు సమీపంలోని ఒక ఇంటికి తీసుకువెళ్లి బాధితురాలిని బంధించారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోమరోవైపు కుమార్తె కనిపించడం లేదంటూ రేష్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆరాగా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రక్షించి, నలుగురు నిందితులు నజ్రత్, రేష్మ, సుహైల్, సైఫ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News -
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కేరళ త్రిసూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎనిమిది మరణించారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మరొకరు డ్రైవర్గా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.తమిళనాడు దిండిగల్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తున్నారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను సెంటర్ వద్ద NH-66పై శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ వెళ్తున్న టైంలో.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదానికి గురైన కారు తమిళనాడు రిజిస్ట్రేషన్తోనే ఉంది. మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అమిత వేగం ఒక కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న రహదారిపై డైవర్షన్, తగిన హెచ్చరికలు, లైటింగ్ వంటి అంశాలపైనా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ మూడు లారీలు నిలిపి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా? -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్నదమ్ములు ముదునూరి రామభద్రరాజు (రాంబాబు రాజు) (55), అతని తమ్ముడు ముదునూరి వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) (52) అక్కడిక్కడే మృతి చెందారు. తోటికోడళ్లయిన రాంబాబు రాజు భార్య విజయలక్ష్మీ మాధురి, శ్రీనివాసరాజు భార్య శారద తీవ్రంగా గాయపడగా వారిని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాంబాబు రాజు, విజయలక్ష్మీ మాధురి భీమవరంలో బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళారు. శ్రీనివాసరాజు, శారద తమ కుమార్తెను అమెరికా పంపించేందుకు బెంగళూరులో విమానం ఎక్కించి రైలులో భీమవరం వచ్చారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక రాంబాబు రాజు దంపతులు, భీమవరంలో రైలు దిగిన శ్రీనివాసరాజు దంపతులు కలిసి తెల్లవారుజామున కారులో లక్కవరం బయలుదేరారు. మరొక్క నిమిషంలో ఇంటికి చేరుకుంటారనగా.. లక్కవరం ఓఎన్జీసీ సైట్ వద్ద వీరి కారు అదుపు తప్పి ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటికోడళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేస్తుండగా కునుకు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధంప్రయాణికులు సురక్షితంపెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. టీజీ13టీ1986 నంబరు గల బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్కు గురువారం రాత్రి 8.40 గంటలకు బయలు దేరింది. బస్సులో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో పామిడి దాటిన తర్వాత కాలుతున్న వాసన రావడంతో ప్రయాణికులు, డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ కొద్దిదూరంలోని మిడుతూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశారు. అందరూ దిగేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగి్నమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకొనేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రాఘవేంద్రప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
లాకప్లోనే నా కుమారుడ్ని చంపేశారు
ఒంగోలు టౌన్: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి బిడ్డను పోగొట్టుకున్న మరో తల్లి కన్నీరు పెట్టుకుంది. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ తల్లి సలోమీ తన కుమారుడిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తమను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే పోలీసులు దివ్యతేజను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారని అతని చెల్లెలు శ్రీనిధి వాపోయింది. దివ్యతేజను ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టారని, ఆ దెబ్బలకు లాకప్లోనే చనిపోయాడని, ఆ తరువాత పంట పొలాల్లో పడేశారని సలోమీ, శ్రీనిధి ఆరోపించారు. దివ్య తేజ మృతదేహం జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శుక్రవారం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడకు వచ్చి న హతుడి తల్లి సలోమీ, చెల్లెలు శ్రీనిధి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. దివ్యతేజను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. దివ్యతేజ బాధితుల కథనం ప్రకారం.. మల్లి దివ్యతేజ (34) గత శనివారం రాత్రి దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానంటూ తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకొని స్నేహితుడు సాతపాటి శశికాంత్తో కలిసి బయలుదేరాడు. రాత్రి 12 గంటలకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు వారిని పట్టుకెళ్లారు. శశికాంత్ను వదిలి పెట్టిన పోలీసులు దివ్యతేజ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. అనుమానం వచ్చి న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు. జె.పంగులూరు తన పరిధిలో లేదు కనుక అక్కడకు వెళ్లి పోలీసులను కలవమని ఆయన సలహా ఇచ్చారు. దాంతో బాధితులు జె.పంగులూరు ఎస్సైని కలవగా.. శశికాంత్ ఒక్కడినే పట్టుకున్నామని, దివ్యతేజ సంగతి తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఎస్సై కంగారుపడినట్లు వారు గమనించారు. ఈనెల 1వ తేదీ వరకు పోలీసుల నుంచి సమాచారం లేకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. దివ్యతేజ ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ సమాచారం తెలిసిన గంటకే పోలీసులు లాయర్కు ఫోన్ చేసి కండమూరు పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో దివ్యతేజ మృతదేహం పొలాల్లో పడి ఉంది. దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి ఉన్నట్లు గమనించారు. ఇవన్నీ పోలీసులు కొట్టిన దెబ్బలేనని, తన కుమారుడిని లాకప్లో కొట్టి చంపేశారంటూ సలోమీ విలపించారు.మమ్మల్ని చూడగానే ఎస్సై కంగారుపడ్డారు: శ్రీనిధితాము హైకోర్టులో పిల్ వేయకపోతే తన అన్న మృతదేహాన్నీ పోలీసులు మాయం చేసేవారని దివ్యతేజ చెల్లెలు శ్రీనిధి కన్నీరు పెట్టుకుంది. జె.పంగులూరు పోలీసు స్టేషన్కు వెళ్లిన తమను చూడగానే ఎస్సై కంగారు పడిపోయారని, భయంభయంగా మాట్లాడడంతో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి ందని తెలిపారు. తన సోదరుడు డిగ్రీ చదివాడని, ఐటీఐ చేశాడని చెప్పారు. ఆయనకు 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, భార్య చనిపోయిందని, ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాడని వివరించింది. పోలీసులు తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విలపించింది. కోర్టుకు వెళ్లకపోతే శవం కూడా దొరికేది కాదు: నీలం నాగేందర్ బాధితులు హై కోర్టులో పిటిషన్ వేయకపోతే దివ్యతేజ మృతదేహం కూడా దొరికేది కాదని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకులు కాకుమాను రవి, కోలా జీవరత్నం, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీనుతో కలిసి ఆయన జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు దివ్యతేజను లాకప్లోనే కొట్టి చంపారని, శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధితులు కోర్టులో పిటిషన్ వేసే దాకా మృతదేహం ఎక్కడ ఉందో కూడ చెప్పలేదన్నారు. దివ్యతేజ కంటి మీద, వీపు మీద, పొట్టమీద గాయాలున్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని తెలిపారు. దివ్యతేజ లాకప్డెత్ కేసులో వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని, కేసును గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విచారణ జరుపుతున్నాం: దర్శి డీఎస్పీ గత నెల 29వ తేదీ రాత్రి జె.పంగులూరు లిమిట్స్లో నైట్ బీట్లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని వెళ్లి పోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చి వెంటపడ్డారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. మరుసటి రోజు శశికాంత్ను పోలీసులు పట్టుకున్నారని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. గురువారం మధ్యాహ్నం కండమూరు పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, విచారణలో అది దివ్యతేజదిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితుల ఆరోపణలో నిజం లేదన్నారు. -
నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్ ట్యాంక్లో శవంగా నవవధువు
ఇండోర్లోని నెహ్రూ నగర్లో వివాహమైన 25 రోజులకే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటి బయట ఉన్న నీటి ట్యాంక్లో ఆమె శవమై తేలింది. పొరుగు వారి సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలు వందనా కుష్వాహా ఈ ఏడాది ఆగస్టు 11న ఉపేంద్ర పటేల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు గానీ వివాహం జరిగి నెల కూడా తిరగ్గకుండానే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది.అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వందన గట్టిగా అరిచిన శబ్దం విన్నారు పొరుగువారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భర్త ఉపేంద్ర పటేల్ షర్టుపై రక్తం మరకలతో బయటకు రావడం, ఇంట్లో ఏ చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. నీటి ట్యాంక్లో మృతదేహంపొరుగువారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్లో వందన మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త ఉపేంద్ర పటేల్కు తీవ్రమైన వ్యసనాలున్నాయని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. గతంలో వందన కుటుంబ సభ్యులు చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, వందన మేజర్ కావడంతో ఉపేంద్రతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చింది.ఇదీ చదవండి: లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకంప్రాథమికంగా ఇది హత్యగా అనుమానిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నిధి సక్సేనా తెలిపారు. భర్త ఉపేంద్ర పటేల్, అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి : వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు: ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకంతో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటనలో ఏడుగురు సభ్యుల ముఠాను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్, ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహ్మద్ మహబూబ్ అలీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు గుట్టును పోలీసులు విప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఒక మైనర్ను (సిసిఎల్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, ఆరు కత్తులు/బాకులు మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం.. ఫలక్నుమా, వట్టేపల్లిలోని ఫాతిమా నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (53) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఆగస్టు 30, 2026 రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో వట్టేపల్లిలోని ఆల్మాస్ హోటల్ ఎదురుగా అతనిపై కొంతమంది దుండగులు కత్తులతో ఘోరంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్ అలీని వెంటనే ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.మృతుని కుమారుడు మహ్మద్ షానవాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 439/2026 కింద బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 103(1), 61(2) r/w 3(5) మరియు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27(2) ప్రకారం కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా లభించిన పక్కా సమాచారంతో సెప్టెంబర్ 3, 2026న ఫలక్నుమా పోలీసులు ఆరుగురు నిందితులను మరియు ఒక మైనర్ను అరెస్ట్ చేశారు.హత్యకు గల కారణాలుజ..ప్రధాన నిందితుడు A1 మీర్జా మోహిన్ బైగ్, మృతుడు మహ్మద్ మహబూబ్ అలీ తన తల్లి తాహిరా బేగంపై చేతబడి చేశాడని, అందుకే ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని బలంగా నమ్మాడు. అంతేకాకుండా, తన మేనమామ మహ్మద్ ఖలీల్ మరణానికి కూడా మహబూబ్ అలీ చేసిన చేతబడే కారణమని అనుమానించాడు.ఈ క్రమంలో బైగ్ తన బావమరిది A2 మహ్మద్ ఇమ్రాన్ అహ్మద్తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇమ్రాన్ అతనికి సహకరిస్తానని, హత్య చేసిన తర్వాత బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం నిందితులందరూ కలిసి మహబూబ్ అలీని అంతమొందించేందుకు కుట్ర పన్నారు.ఆగస్టు 30న మహబూబ్ అలీ ఆల్మాస్ హోటల్ వద్ద ఉన్నాడనే సమాచారం అందడంతో, నిందితులంతా అయాన్ దర్బార్ హోటల్ వద్ద సమావేశమై ఆరు కత్తులు, బాకులు సమకూర్చుకున్నారు. రెండు యాక్టివా వాహనాలపై వచ్చి, ఆల్మాస్ హోటల్ ఎదురుగా మహబూబ్ అలీని అడ్డుకుని తల, ఛాతీ, చేతులపై తీవ్రంగా నరికి చంపారు. అరెస్టయిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.ప్రజలకు విజ్ఞప్తి..చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలని, వాటికి ఎలాంటి వైజ్ఞానిక ఆధారాలు లేవని రాజేంద్రనగర్ జోన్ డిసిపి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో హింసకు పాల్పడటం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి నమ్మకాలను నమ్మవద్దని, శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోకుండా ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఎం. అప్పల నాయుడు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ మరియు క్రైమ్ టీమ్ను రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ఫలక్నుమా ఎసిపి ఎం.ఎ. జావీద్ అభినందించారు. -
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (Ashwini Manohar Paul) ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. నాల్దుర్గ్ చారిత్రక కోటలో 100 అడుగుల లోతైన లోయలోకి తన ముగ్గురు పిల్లలతో సహా దూకేసిన విషాద ఘటన క్రీడా లోకంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ ఘటనలో అశ్వినితో పాటు ముగ్గురు పిల్లలలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. ఒక కుమార్తె ప్రాణాలతో బయట పడింది. అశ్విని ఆమె ఐదున్నర ఏళ్ల కుమారుడు అజింక్య అక్కడికక్కడే మరణించారు. రెండేళ్లన్నర కవల కుమార్తెలలో ఒకరైన క్రాంతి, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరో కుమార్తె వీర తీవ్ర గాయాలతో ప్రస్తుతం ధారాశివ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స పొందుతోంది.తన భర్త, అత్తమామల నుండి అశ్విని నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: దివ్యాంగ మహిళపై లైంగిక దాడి యత్నం.. తరిమి కొట్టిన వీధి కుక్కలు!కాగా అశ్విని పాల్ రెజ్లింగ్ వర్గాల్లో సుపరిచితురాలు. ఆమెను "మహారాష్ట్ర టైగ్రెస్" (Maharashtra's Tigress) అని పిలిచేవారు. తన క్రీడా జీవితంలో ఆమె జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ , ఆరు రజత పతకాలను గెలుచుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా, క్రీడా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది; ఈ క్రీడాకారిణి ,ఆమె పిల్లల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
దివ్యాంగ మహిళపై లైంగిక దాడికి యత్నం : తరిమి కొట్టిన వీధి కుక్కలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన మహిళను లైంగిక దాడి నుంచి వీధి కుక్కలు కాపాడిన వైనం నెట్టింట వైరల్గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం తెల్లవారు జామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.నివేదికల ప్రకారం, రోడ్డు పక్కన నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలైన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. తుడియలూర్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన కింద ఈ ఘటన జరిగింది. నిందితుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ, రోడ్డు పక్కన పడి ఉన్న ఆ మహిళను గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించు కున్నాక, అతను ఆమెపై దాడికి యత్నించాడు. మానసిక వైకల్యంతో వీధుల్లో నివసించే ఆ మహిళ భయపడి, సహాయం కోసం కేకలు వేసింది. అయితే ఎవరూ రాలేదు. నిందితుడు ఆమెపై దాడిచేస్తున్నపుడు ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరనేధైర్యంతో అతను తన పట్టువీడలేదు. అయితే, రోడ్డుపై ఉన్న రెండు వీధి కుక్కలు ఈ విషయాన్ని గమనించి గట్టిగా అరవడం ప్రారంభిచాయి. మొరుగుతూనే అతని పైకి లంఘించాయి. అయినా ఆమెను వదలకపోవడంతో, కుక్కలు అతనిపై ఎటాక్ చేసి మరీ అక్కడి నుంచి తరిమికొట్టాయి. ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, లైంగిక దాడికి ప్రయత్నించిన ఆరోపణపై పోలీసులు భూపతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నిస్పహాయురాలైన మహిళను కాపాడిన ఈ వీడియో చూసిన నెటిజన్లు వీధికుక్కల విశ్వాసాన్ని కొనియాడు తున్నారు. கோவை துடியலூர் அருகே நள்ளிரவில் மனநலம் பாதிக்கப்பட்ட பெண்ணை பாலியல் துன்புறுத்தல் செய் முயன்ற இளைஞரைகடித்து விரட்டி விட்ட நாய்கள்.#kovai #tnpolice #womensafety #Chanakyaa Stay informed with the latest news through Chanakyaa via https://t.co/fKuhMnLnfy pic.twitter.com/RUPEDRI7Ty— சாணக்யா (@ChanakyaaTv) September 4, 2026ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐర్లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H— ANI (@ANI) September 4, 2026 “Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్ మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్కాస్ట్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
కిరాణా కొట్టు నుంచి కోట్ల అక్రమ సామ్రాజ్యం! ఎవరీ నీతుబాయి?
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్వర్క్గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. ధూల్పేట్లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్గా మారింది.ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బంది లక్ష్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. నీతుబాయి స్వస్థలం ధూల్పేట్ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్రామ్గూడలోని లోథాబస్తీలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించింది.అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములే.రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎక్సైజ్ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2024లో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు.నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, నానక్రామ్గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్లైఫ్ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.ఇవీ చదవండి: రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన -
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు
సాక్షి, నల్లగొండ: తిప్పర్తిలో ఈ రోజు (శుక్రవారం) మూడు ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. గంగన్నపాలెంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు సతీష్, శ్రీకాంత్, నరేష్ కు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఒక చిన్న వివాదం నేపథ్యంలో తలెత్తిన వివాదం కాస్త ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. -
రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
తుమ్మపాల/కడప వైఎస్ఆర్ సర్కిల్: రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం వెల్లడించారు. ముందస్తు సమాచారంతో అనకాపల్లి పోలీసులు సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో ఉన్న వ్యాన్తో పాటు పైలట్ కారును పట్టుకున్నారు. వ్యాన్(ఏపీ 39 వీఏ 6786)లో ఉన్న 600 కిలోల గంజాయి, పైలట్ వాహనంగా వాడిన హోండా సివిక్ (ఏపీ 16 బీసీ 0018) కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితులైన షేక్ మస్తాన్ వలి, షేక్ మదీనా, పాంగి రత్నను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. రూ.3 లక్షల కమీషన్ ఒప్పందంతో గంజాయిని ఒడిశాలోని మల్కాజ్గిరి జిల్లా చిత్రకొండ నుంచి తునిలో అందించేందుకు ప్లాన్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రధాన నిందితుడు షేక్ మస్తాన్వలిపై వేర్వేరు చోట్ల 5 గంజాయి కేసులు ఉన్నాయన్నారు. కడపలో ఎండు గంజాయి పట్టివేత కడపలో ఎండు గంజాయిని స్వా«దీనం చేసుకున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్టీఎఫ్, కడప ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా నగరంలోని బుద్ధ టౌన్షిప్ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్ వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేశారు. వీరి వాహనంలో 9 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులైన మోటుపల్లి సతీష్ చంద్ర, బొమ్మవరం రవిరాజాను అరెస్టు చేశారు. వీరు అల్లూరి జిల్లా చింతలపల్లికి చెందిన కామేష్ అనే వ్యక్తి నుంచి కిలో రూ.5 వేల చొప్పున పది కిలోలు కొనుగోలు చేశారు. దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి ఒక్కో ప్యాకెట్ రూ.500 నుంచి డిమాండ్ని బట్టి రూ.5,000 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే కిలో గంజాయి విక్రయించగా, మిగిలిన 9 కిలోలను తరలిస్తుండగా పట్టుబడ్డారు. -
యూపీలో దారుణం : 3 నెలల చిన్నారిపై అఘాయిత్యం
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మెయిన్పురి జిల్లాలో ఒక గ్రామంలో, మూడు నెలల చిన్నారిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన దిగ్బ్రాంతి రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం పొరిగింటిలో ఉండే, కుటుంబానికి తెలిసిన వ్యక్తి జితేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి వేళ ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న చిన్నారి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ సమయంలో చిన్నారి తల్లి రాత్రి వంట పనిలో తండ్రి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పొరుగింట్లో ఉండే నిందితుడు జితేంద్ర, ఇంట్లోకి వచ్చి చిన్నారితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. తెలిసిన వ్యక్తి కావడంతో, వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సుమారు అరగంట తర్వాత నిందితుడు తిరిగి వచ్చి, చిన్నారిని మళ్లీ మంచంపై పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే పాప విపరీతంగా ఏడుస్తూండటంతో తల్లీ ఎత్తుకుని ఓదారుస్తుండగా, చిన్నారి జననేంద్రియాల నుండి తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్నిగమనించి ఒక్కసారిగాఉలిక్కిపడింది. గట్టిగా కేకలు వేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారని బేవార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలుకుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో సాయిఫై మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందు తోందని పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి తండ్రి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు -
లవర్ని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని లహోరీ గేట్ ప్రాంతంలోని ఒక హోటల్లో నిన్న రాత్రి ఒక మహిళ రక్తపు మడుగులో పడి శవమై కనిపించిన ఘటన పోలీసులకు ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రియుడి చేతిలోకత్తిపోట్లకు గురై మరణించిందని, ఆ తర్వాత నిందితుడు విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు గురువారం తెలిపారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజస్థాన్కు చెందిన నిందితుడు బిహార్కు చెందిన ఆ మహిళ బుధవారం సాయంత్రం 'హోటల్ ప్రిన్స్'లో బస చేశారు. ఏం జరిగిందో తెలియదుగానీ, రాత్రి ఆ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకోవాలనే ఉద్దేశంతో అతను విషం సేవించాడు. హోటల్ సిబ్బంది ఆ గదిలో రక్తపు మడుగులో మహిళ పడి ఉండటాన్ని గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు -
వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్నూలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను కడతేర్చిన çఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసముండే ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్తో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కూతురిపై దాడి చేస్తున్న క్రమంలో అడ్డువచ్చిన అత్త కూడా కత్తిపోట్లకు గురై కరీంనగర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర ఒడ్డరికాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ ఓదెల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెరకాలనీకి చెందిన గండికోట చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల కూతురు జ్యోతి(28)ని ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేష్కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. ఎనిమిది నెలల క్రితం రెండుసార్లు చీకోడులో జ్యోతిని చంపడానికి సురేష్ ప్రయత్నించాడు. ఒకరోజు నిద్రిస్తుండగా దిండుతో చంపడానికి ప్రయత్నించగా.. తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెళ్లి జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పుడు జ్యోతి ఫిర్యాదుతో ముస్తాబాద్ ఠాణాలో సురేష్పై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గ్రామానికి సమీపంలో ఉన్న అర్బన్పార్క్లో మృతురాలు జ్యోతి దినసరి కూలీగా పని చేస్తుంది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో సురేష్ పలుమార్లు జ్యోతిని, వారి బంధువులను దూషించాడు. ఈ క్రమంలో సురేష్ మరో ముగ్గురితో కారులో వచ్చి పదిర బస్టాండ్లో మధ్యాహ్నం నుంచి జ్యోతి కోసం కాపు కాశాడు. జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లింది. చీకటి పడే సమయంలో బస్సు దిగి ఒడ్డెరకాలనీకి వెళ్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించుకొని కత్తిని అక్కడే వదిలేసి అదే కారులో పరారయ్యాడు. నిందితుడు సురేష్ సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
ఊయలలోనే పసికందుల చితి పేర్చిన తల్లి
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఘోర విషాదం సంభవించింది. లేకలేక పుట్టిన కవల పిల్లలను తల్లే నీటి బకెట్లో ముంచి హతమార్చింది. తలఘట్టపురలో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులకు 2002లో వివాహమైంది. రామలింగప్ప వ్యాపారం చేస్తుండగా, ఉమాదేవి గృహిణి. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో అనేక ప్రయత్నాల తరువాత ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఉమాదేవి గర్భం దాల్చింది. మే 5న ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యం బారిన పడింది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శిశువులను నీళ్లున్న బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తరువాత వారిని ఊయలలో ఉంచింది. ఆపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అదే సమయంలో ఇంటికొచ్చిన భర్త రామలింగప్ప ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రసవం తరువాత వచ్చే మానసిక వైకల్యానికి తన భార్య గురైందని, నిమ్హాన్స్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో భర్త రామలింగప్ప తెలిపారు. తాను పిల్లలను చూసుకోలేనని, అనాథాశ్రమంలో ఇచ్చేయాలని ఆమె గొడవ చేసేదని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
విజయవాడ లీగల్: బాలికపై మాయమాటలతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.జయలక్ష్మి తీర్పునిచ్చారు. విజయవాడ సూర్యారావుపేట పోలీసుస్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల బాలికకు తన అన్నయ్య స్నేహితుడు పరిచయమై ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిశాడు. కొద్దిరోజుల తరువాత నిన్ను ప్రేమించడం లేదని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన అప్పటి సూర్యారావుపేట మహిళా ఎస్సై జి.అనూష అనంతరం అప్పటి సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ దర్యాప్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామానికి చెందిన కోరేపల్లి ప్రవీణ్ కుమార్ (37)ను అదుపులో తీసుకొని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికకు రూ.లక్ష నష్ట పరిహారం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. -
భార్య, అత్తలపై కత్తితో దాడి.. భార్య మృతి
సాక్షి, సిరిసిల్ల : ఎల్లారెడ్డి పేట మండలం పదిరలో దారుణం జరిగింది. ఈ రోజు ( బుధవారం)కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన అత్తపైన దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన అత్తను ఆసుపత్రికి తరలించారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో (Times Square Stabbing) సంచలన విషయం వెలుగులోకివచ్చింది. మరణించిన మహిళను 'బ్యాంక్ ఆఫ్ అమెరికా' (BofA) వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (Erin Piacenti)గా పోలీసులు గుర్తించారు. ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె ఫోర్ధమ్ లా స్కూల్ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసింది. ఇటీవల ప్రసూతి సెలవు (Maternity Leave) ముగించుకుని తిరిగి ఉద్యోగంలో చేరిన ఆమె అకాల మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫోర్ధమ్ లా స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్కు సమీపంలోనే 49 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు కత్తులు బయటకు తీసి ఎటాక్ చేసింది. ఈ దాడిలో ఎరిన్ పియాసెంటి ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దాడికి పాల్పడిన మహిళను క్వీన్స్కు చెందిన పామెలా సిస్నెరోస్ (49)గా గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈమె తన షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పెద్ద కత్తులు తీసి ఇద్దరిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఆమె కత్తులతో పోలీసులపైకి దూసుకురావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారుమరోవైపు ఈ ఘటనపై అని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీవిచారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలు వేదనను అర్థం చేసుకోగలమని, వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు -
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
సాక్షి, ఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు సంబంధించి ఢిల్లీలో ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (NIA,ATS) అధికారులమని చెప్పుకొని ఒక ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నుంచి 30 లక్షల రూపాయలను కాజేసీన వైనం కలకలం రేపింది.ఢిల్లీలోని ద్వారకాకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి గత ఏడాది జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడులో నిందితులకు నిధులిచ్చారని భయపెట్టేశారు. ఎర్రకోట పేలుడు కేసు నిందితులకు అతని బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వెళ్లాయని బెదిరించారు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించారని చెప్పి కేటుగాళ్లు అధికారిని, ఆయన భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. దాదాపు ఏడు రోజుల పాటు 'డిజిటల్ అరెస్టు'లో ఉంచారు. దీంతో బెంబేలెత్తిపోయిన భయపడిన ఆ దంపతులు, తమ జీవితకాలం లో దాచుకున్న సొమ్ము రూ. 30 లక్షలను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలువీడియో కాల్స్ ద్వారా వారిని బెదిరించి, నిఘా పెట్టి, ('డిజిటల్ అరెస్ట్') బయటివారితోగానీ, పిల్లలతోగానీ మాట్లాడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వాట్సాప్లో నకిలీ రహస్య ఒప్పంద పత్రాలు (Confidentiality Agreement) పంపి సంతకాలు కూడా చేయించుకున్నారు. ఖాతాలోని డబ్బులను తనిఖీ చేయాలని, విచారణ ముగిశాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి రెండు విడతలుగా (రూ. 15 లక్షలు చొప్పున) మొత్తం రూ. 30 లక్షలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత నేరగాళ్లు ఆర్బీఐ గవర్నర్ సీల్తో ఉన్న నకిలీ వెరిఫికేషన్ లెటర్ పంపారు. ఆతరువాత యధావిధిగా ముఖం చాటేశారు.బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. హర్యానాకు చెందిన సునీల్ సింగ్లా అనే వ్యక్తికి చెందిన 'శ్రీ బాలాజీ ట్రాక్టర్' కంపెనీ బ్యాంక్ ఖాతాకు ఈ డబ్బు బదిలీ అయినట్లు మే నెలలో గుర్తించి, అతడిని మే 11న అరెస్ట్ చేశారు. ఇతని ఖాతా ద్వారా దాదాపు రూ. 1 కోటికి పైగా సైబర్ మోసాల లావాదేవీలు జరిగినట్లు తేలింది. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడు పంపిన రూ. 15 లక్షల ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగారు. అందులో రూ. 12 లక్షలను రికవరీ చేసి తిరిగి బాధితుడికి అందించారు. -
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
సాక్షి, ముంబై: Disha Salian's Death Case దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద మరణం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి ఎవరిపైనైనా తగిన ఆధారాలు లభిస్తే తప్ప, వారిని నిందితులుగా పరిగణించ కూడదని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు హత్య అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా కేవలం ప్రమాదవశాత్తు మృతి (ADR) గా మాత్రమే ఎందుకు పరిగణించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, ఐదేళ్లు గడుస్తున్నా పోస్టుమార్టం నివేదికను కుటుంబానికి అందజేయక పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది.దిశ తండ్రి సతీష్ సాలియాన్ తన పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమార్తె దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధారంగా, కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ధర్మాసనం పోలీసుల ప్రవర్తనపై దృష్టి సారిస్తూ ఈ క్రింది ముఖ్యమైన అంశాలను లేవనెత్తింది.రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు లేదా రాజకీయ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిస్సహాయుడైన ఒక తండ్రి మనోభావాలను, న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, పారదర్శకమైన విచారణ జరిపి, సరైన ముగింపు ఇవ్వడం అవసరమని పేర్కొంది. ఇదీ చదవండి : లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?మాల్వాణి పోలీసు స్టేషన్ పరిధిలోని సంబంధిత కేసు రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. సరిపడా ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని, ఆధారాలు లభించిన వారిపైనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ నెగెటివ్ రిపోస్ట్ ఇస్తే, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ప్రోటెస్ట్ పిటిషన్' దాఖలు చేసే హక్కు పిటిషనర్కు ఉంటుందని తెలిపింది.కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పనిచేసిన సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్, 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని నివాస భవనం 14వ అంతస్తు నుండి కిందపడి కన్నుమూసింది. ఆమె మరణించిన ఆరు రోజులకే (2020, జూన్14న) సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా తన నివాసనంలో అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం 2022 నాటి మహారాష్ట్ర శాసనసభలో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో, నితేష్ రాణే ఆదిత్య థాకరేకు నార్కో పరీక్ష చేయాలని కూడా షిండే వర్గం డిమాండ్ చేసింది. -
రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా
సాక్షి, హైదరాబాద్ : రసోడా గ్యాంగ్..ఇదే గనుక టార్గెట్ చేస్తే క్షణాల్లో దొంగతనం జరగాల్సిందే. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠాకు ఓ ప్రత్యేకత ఉంది. దీనిలో ఉండే మహిళలు పురుషులకంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. చాలా టెక్నిక్గా చోరీ చేస్తారు. మరో విశేషమేంటంటే పిల్లలకు దొంగతనం ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విషయమై శిక్షణ ఇస్తారు. వృద్ధులను లక్ష్యం చేసుకోవడం ఒక ఎత్తయితే పెళ్లిళ్లకు అతిథులుగా వెళ్లి అందరిలో కలిసిపోయి చిన్నారులతో దొంగతనాలు చేయించడం ఈ మహిళా గ్యాంగ్ ప్రత్యేకత. అయితే సాధారణ సమయాల్లో కేవలం మహిళలే బృందాలుగా వెళ్తారు. అనువైన లాడ్జీల్లో బస చేస్తారు. ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేస్తారు.అదును చూసుకుని వారి దృష్టి మళ్లించి నగదు తస్కరిస్తారు. ఇక ముహూర్తాల సీజన్లో అయితే స్త్రీ పురుషులు ‘సుశిక్షితులైన’ చిన్న పిల్లలను తీసుకుని వస్తారు. కాస్త ఖరీదైన హోటళ్లలో బస చేస్తారు.పెళ్లి మండలాలకు అతిథులుగా వెళ్తారు. వధూవరుల గదుల్లోకి పిల్లల్ని పంపి బంగారం చోరీ చేయిస్తారు. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో పంజా విసిరే మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా నర్సింగ్ గఢ్ తహసీల్ పరిధిలోని పిప్లా్య రసోడా, గుల్ఖేడీ, కడియా గ్రామాలకు చెందిన రసోడా గ్యాంగ్ వ్యవహారమిది. హైదరాబాద్, మల్కాజ్గిరితో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులకు వాంటెడ్గా ఉన్న ఈ ముఠా గుట్టును మంగళ్హాట్ పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. ఇద్దరు మహిళల్ని అరెస్టు చేయగా...మరో నలుగురు తృటిలో తప్పించుకున్నారు. మహిళల పంథా మరోరకంగా... మెట్రో నగరాల్లోని ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకునే మహిళలు గ్రూపులుగా ఆ ప్రాంతానికి చేరుకుని లాడ్జీల్లో బస చేస్తారు. ప్రతి రోజూ ఉదయం కొందరు బయటకు రాగా... మరికొందరు గదిలోనే ఉంటారు. వీరు అనువైన ప్రాంతం, టార్గెట్ను గుర్తించడానికి సమయం పడుతుంది. ఈలోపు అలసిపోయిన వాళ్లు తమ షిఫ్ట్ ముగించుకుని లాడ్జీకి వెళ్లగా.. అక్కడ రెస్ట్లో ఉన్న వాళ్లు స్పాట్కు చేరుకుంటారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ చేరి, అలజడి సృష్టిస్తూ దృష్టి మళ్లించి వారి బ్యాగ్లు కట్ చేయడం ద్వారా నగదు తస్కరిస్తారు. ఆ వెంటనే అక్కడ నుంచి లాడ్జీకి వచ్చేస్తారు. ఒక నేరం చేసిన తర్వాత కొన్నాళ్లు ఆ ప్రాంతానికి మళ్లీ రారు. ఇలా గడిచిన రెండు నెలల్లో ఫిల్మ్నగర్, సరూర్నగర్, మంగళ్హాట్ల్లో మూడు నేరాలు చేశారు. ఈ గ్యాంగ్ను పట్టుకోవడానికి మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర చాకచక్యంగా నిఘా ఉంచారు. శనివారం మరోసారి వచ్చిన గ్యాంగ్ లాడ్జీలో బస చేయగా... తన బృందంతో దాడి చేశారు. అనిత బాయ్, మల్కా శిసోడియా చిక్కగా... పూజ, లలిత శిసోడియా, బాబ్లీ శిసోడియా, రామ్సాఖీ తృటిలో తప్పించుకున్నారు.చిన్నారులకు చోరీల్లో శిక్షణ ఇచ్చి...ఈ రసోడా గ్యాంగ్కు పిప్లా్య రసోడా గ్యాంగ్ అనే పేరు కూడా ఉంది. ఈ ముఠాల్లో పురుషుల కంటే మహిళలే యాక్టివ్గా ఉంటారు. పెళ్లి మండపాలను టార్గెట్గా చేసుకునే వీళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారుల్ని వినియోగిస్తారు. తొలుత తమ గ్రామాల్లోని పిల్లల్లో చలాకీగా ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించేలా వారి తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటారు. చోరీలు ఎలా చేయాలనే అంశంపై ఆ చిన్నారులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ వ్యవహారం మొత్తం మహిళల నేతృత్వంలోనే సాగుతుంది. చిక్కితే డిస్ట్రాక్షన్ టెక్నిక్ వాడి...ఆ తర్వాత కొందరు పురుషులతో కలిసి మెట్రో నగరాలకు వస్తారు. అక్కడ జరిగే వివాహాలకు అతిథులుగా వెళ్తారు. వందలాది మంది అతిథుల్లో కలిసిపోయి వధువు, వరుడితోపాటు ఇతరు కీలక అతిథులకు కేటాయించిన గదుల్ని గుర్తిస్తారు. ఆపై అదును చూసుకుని చిన్నారుల్ని వాటిల్లోకి పంపి బంగారం, వెండి నగలతో పాటు నగదు తీసుకువచ్చేలా చేస్తారు. ఇవి చేతికి చిక్కిన వెంటనే ఆ ప్రాంతం నుంచి ఉడాయిస్తారు. ఈ చిన్నారులు అనుమానాస్పదంగా యజమానులకు పట్టుండితే ‘డిస్ట్రాక్షన్ టెక్నిక్’వాడతారు. ‘చాక్లెట్ల కోసం లోపలికి ఎందుకు వెళ్లావు?, అది మన గది కాదు’అంటూ పిల్లవాడిని మందలిస్తున్నట్లుగా నటించి ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ స్థానిక నిర్వహణ, పిల్లలను సమకూర్చడం, శిక్షణ ఇవ్వడం, టార్గెట్లను గుర్తించడం, చిన్నారుల్ని నగరాలకు తీసుకెళ్లడం, దొంగతనం సమయంలో పర్యవేక్షించడం, దొంగిలించిన వస్తువులను తరలించడం, విక్రయించడానికి వేర్వేరు సభ్యుల్ని వాడుతూ వ్యవస్థీకృతంగా పని చేస్తుంది. -
ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం
ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై దారుణం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సును ఎన్హెచ్ఆర్సీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్పురి ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహారం వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.అసలేం జరిగింది?ఉత్తరప్రదేశ్లోని మైన్పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని (16) ఆగస్టు 4న తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద బస్సు దిగింది. జోరు వానలో సెక్టార్-63 వైపు వెళ్లే వాహనం కోసం వేచి చూస్తుండగా, సుర్జాపూర్ నుంచి వస్తున్న 'విశ్వనాథ్' అనే ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లు తాము సెక్టార్-63 వైపే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.47 కిలోమీటర్లు నరకంబాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు, బస్సు కర్టెన్లు మూసివేసి లైట్లు ఆర్పివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దింపివేసి పరారయ్యారు.తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.నాటి నిర్భయ ఘటనను గుర్తు చేసేలా ఈ ఘోరకలి 2012 నాటి ‘నిర్భయ’ దారుణాన్ని తలపించింది. ఢిల్లీ-నోయిడా ఎక్స్ప్రెస్ వే, రింగ్ రోడ్డు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నిఘా మార్గాల్లో బస్సు అంత దూరం ప్రయాణిస్తున్నా పెట్రోలింగ్ వాహనాలు గానీ, పోలీసులు గానీ గుర్తించకపోవడంపై మీడియా భద్రతా లోపాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మహిళా భద్రతా దావాల డొల్లతనాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాలు మండిపడటంతో రాజకీయంగానూ పెద్ద దుమారమే రేగింది.మరోవైపు, వివాదాలకు తావివ్వకుండా కశ్మీరీ గేట్ స్టేషన్కు వచ్చిన బాధితురాలికి ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి జీరో-ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాయి.ఆగస్టు 4న ఘటన జరగగా.. ఆగస్టు 31న జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 1న జాతీయ మానవ హక్కుల కమీషన్ చర్యలకు ఉపక్రమించింది. -
ప్లేస్కూల్లో మూడేళ్ల బాలుడిపై అమానుషం, సీఎం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్లో మకూన్స్ ప్లే స్కూల్లో మూడేళ్ల బాలుడిని టీచర్, కేర్ టేకర్ దారుణంగా కొట్టిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. ఆ ప్లేస్కూల్ ప్రాంగణాన్ని తక్షణమే సీల్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పందిస్తూ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా స్కూల్ సీలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఢిల్లీలో ఒక ప్లేస్కూలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిళ్లు నిద్రపోకుండా, భయంతో వణికిపోతున్న తమ బిడ్డను చూసి అనుమానం వచ్చిన తల్లితండ్రులు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. భయంతో గడిచిన 15 రోజులుగా సరిగ్గా స్నానం కూడా చేయలేకపోతున్నాడని, వాష్రూమ్లోకి వెళ్లడానికి భయపడుతున్నాడని బాలుడి తండ్రి వాపోయారు. A three-and-a-half-year-old boy was allegedly physically and sexually assaulted and mentally harassed at a private playschool in northeast Delhi's Maujpur, with CCTV footage purportedly showing him being tied to a chair, kicked and held by his ears.Police have registered a case… pic.twitter.com/TaLzjs8XNk— Hate Detector 🔍 (@HateDetectors) August 31, 2026 ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? Delhi Government has taken serious cognisance of the deeply disturbing incident reported from a play school in Maujpur.On the directions of Chief Minister Smt. Rekha Gupta, the District Magistrate has initiated proceedings to seal the premises of the school. Police…— CMO Delhi (@CMODelhi) August 31, 2026అంతేకాదు బాలుడిని ఆసుపత్రికి తీసుళ్లడంతో మరో ఘోరం బయటపడింది. బాలుడి రెండు చెవుల కర్ణభేరిలువాచినట్లు వైద్యులు తెలిపారు. అతని ముఖం, చేతులపై స్పష్టమైన గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. తమకేం తెలీదంటూ యాజమాన్యం బుకాయించడంతో తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ కావాలని డిమాండ్చేశారు. అది ఇవ్వాలంటే రూ.1,500 చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ నగదు చెల్లించి ఫుటేజీ తెప్పించి ఆగస్ట్ 16, 17, 18 తేదీల దృశ్యాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది. బాలుడిని చిన్న చైర్కు కట్టేసి మూడు గంటల వ్యవధిలో పలుమార్లు కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదేంటని స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తే పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే మందలించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.#WATCH | Delhi | On play school Attendant arrested for allegedly abusing 3-year-old boy in Maujpur, Navneet Chaudhary, father of 3-year-old boy, says, “…The child had been troubled for several days… Then, suddenly, on 18 August, my son came home from school. As soon as he got… https://t.co/wu7RfIAjo0 pic.twitter.com/vmILhjfgcC— ANI (@ANI) August 31, 2026 దీనిపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. కేర్టేకర్ను అరెస్ట్చేసి స్కూల్ డైరెక్టర్ సునీతా బన్సల్, ప్రిన్సిపల్ నీలమ్, ఉపాధ్యాయులు సిమ్రాన్, పూజలపై కేసు నమోదుచేశారు. పోక్సో చట్టంతోపాటు భారతీయ న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు వేసి దర్యాప్తు ఆరంభించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలమేరకు పాఠశాల ప్రాంగణాన్ని సీజ్చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఘటనలో అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించేందుకు పాఠశాల ప్రాంగణాన్ని పోలీసులు సీజ్చేశారు. పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనంచేసుకున్నారు. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’ -
కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. తమపై దాడి జరిపి.. పారిపోతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దేవరపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన దుండగుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు దుండగుడు నిన్న ఉదయం పోలీసులపై దాడి జరిపి పారిపోయాడు. అయితే అతన్ని పట్టుకునే క్రమంలో మరోసారి పోలీసుల మీదకు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కత్తి, రాళ్లతో దాడి చేయగా.. ఈ క్రమంలోనే అతన్ని నిలువరించేందుకు కంకిపాడు సీఐ కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని అవినాశ్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో అతని రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: గృహ ప్రవేశం చేసిన నాలుగు రోజులకే విషాదం -
హత్యకేసులో అనుచరుడిని రక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు యత్నాలు
కాకినాడ క్రైం: కాకినాడలో ఈ నెల 23న జరిగిన జిమ్ట్రైనర్ కొడమటి సతీష్రెడ్డి హత్యకేసులో పోలీసుల తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ, కుటుంబసభ్యులు చెప్పారు. కాకినాడ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అనుచరుడైన బోను శ్రీను అలియాస్ కటౌట్ శ్రీను ఈ హత్య చేయించాడని ఆరోపించారు. శ్రీనుని రక్షించేందుకు ఎమ్మెల్యే కొండబాబు పోలీసులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. జయశ్రీ, సతీష్ రెడ్డి తల్లి ఈశ్వరి, కుటుంబసభ్యులు, బంధువులు, సతీష్ రెడ్డి స్నేహితులు సోమవారం హత్యాస్థలంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో రక్తపు మరకలు లేకుండా పోలీసులే కడిగేయడం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో హత్య జరిగితే మూడు గంటలకే.. అంటే గంట వ్యవధిలోనే శుభ్రం చేసేశారని తెలిపారు. పోలీసులు క్రైం సీన్ ప్రొటెక్షన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హత్య జరిగిన చోట మార్కింగ్, డు నాట్ ఎంటర్ బ్యాండ్లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఉదయానికి చూస్తే అసలు అక్కడ హత్య జరిగిందన్న ఆనవాళ్లు కూడా లేవన్నారు.ఈ హత్యచేయించాడని తాము అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడైన బోను శ్రీనును ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తాము కటౌట్ శ్రీను పేరు చెబితే ఓ అధికారి మీడియాకు ఆ పేరు చెప్పొద్దని ఒత్తిడి చేశారన్నారు. శ్రీను ప్రణాళికతోనే సాయికిరణ్ బృందం హత్యచేసిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుడైనందువల్లే పోలీసులు కటౌట్ శ్రీను గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదునెలల గర్భిణిని అయిన తాను, గుండె సమస్యతో బాధపడుతున్న తన అత్త ఈశ్వరి న్యాయం కోసం ఇలా తిరుగుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. కటౌట్ శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించాలని, హంతకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొండబాబు అర్థం చేసుకుని కటౌట్ శ్రీనును రక్షించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్యాలయానికి తరలింపు ఉదయం నుంచి నిరసన చేపట్టిన జయశ్రీ, ఆమె కుటుంబసభ్యులతో పోలీసులు చర్చించారు. మధ్యాహ్నం వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎస్పీని కలిసిన అనంతరం బాధితులు ఆయన సూచనమేరకు కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారు.కటౌట్ శ్రీనును విచారించిన పోలీసులుటీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీనును సోమవారం పోలీసులు విచారించారు. హత్యకు కారకుడని మృతుడు సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. -
పెన్సిల్ బాక్స్ కోసం ఆర్డర్ పెడితే.. రూ.5 లక్షలు మాయం!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో పెన్సిల్ బాక్స్ కోసం ఆర్డర్ చేసిన మహిళ చివరకు తన బ్యాంకులో ఉన్న రూ.5 లక్షలను పొగొట్టుకుంది. మోసపోయానని తెలుసుకోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్బాగ్లోని సైబర్ పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకీ అల్హస్నగర్ కాలనీకి చెందిన జరీనా జబీన్(66) ఈ నెల 22న ఇంట్లో ఫేస్బుక్ చూస్తుంది. అందులో ఏవీ క్రియేషన్స్ వారి ప్రకటన చూసింది. అందులో రెండు పెన్సిల్ బాక్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో పెన్సిల్ బాక్స్ 229 కాగా రెండు బాక్సులకు డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించింది.కాగా 24వ తేదీ వరకు డెలివరీ రాకపోవడంతో ఏవీ క్రియేషన్స్ ప్రకటనలో ఉన్న దీపుదాస్కు 9163269043 ఫోన్ చేసింది. అక్కడ నుంచి మీ ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని జవాబు వచ్చింది. తాను ఆర్డర్ క్యాన్సల్ చేయలేదని దీపూదాస్కు ఫోన్లో తెలిపింది. కస్టమర్ సపోర్ట్ నెంబర్ 74881971కు ఫోన్ చేయాలని దీపూదాస్ తెలిపాడు. కస్టమర్ సపోర్ట్ నుంచి రూ.5 రూపాయలు పే చేయాలని కస్టమర్ సపోర్ట్ వీ2 ఏపీకే ఫైల్ వాట్సప్లోకి వచ్చింది.కాగా ఆమె ప్రతినిధి అడిగినట్లే ఐదు రూపాయలు పంపింది. మరుసటి రోజు నుంచి ఆమె ఖాతా ఉన్న కెనెరా బ్యాంక్ నుంచి డెబిట్ మెస్సేజ్లు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఈ నెల 29న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం ఒకే రోజు వివిధ డెబిట్ల ద్వారా మొత్తం రూ.5,24,102 తన ఖాతా నుంచి పోయాయని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మజ్లిస్ పార్టీలో ధిక్కార స్వరం! -
రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి
సాక్షి, చెన్నై: చెన్నైలోని కోవిలంబక్కమ్లో మరో వరకట్న మరణం విషాదాన్ని నింపింది. ఉన్నత విద్యావంతురాలు, ఉద్యోగం, పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ముట్టజెప్పినప్పటికీ అత్తింటివారి ఆశ తీరలేదు. వేధింపులను తట్టుకోలేక పెళ్లైన రెండేళ్లకే ఏడాదిన్నర పసిగుడ్డును అనాథను చేసి, ఆమె ఉసురు తీసుకుంది.మృతురాల్ని చెన్నైలోని కోవిలంబాక్కంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భువనేశ్వరి (27)గా గుర్తించారు. M.Sc. B.Ed. పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఒక సంవత్సరం వయసున్న కుమారుడు ఉన్నాడు. భారీగా కట్నం, అయినా తీరని దాహంభువనేశ్వరికి 2024 సెప్టెంబర్లో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల విలువైన కారు, 50 సవర్ల బంగారం ఇచ్చారు. అదనంగా వరుడికి మరో 20 సవర్ల బంగారం సమర్పించారు. పెళ్లయిన రెండేళ్లలోపే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు భువనేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఇటీవల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బాబుకు బంగారు గొలుసు కానుకగా ఇచ్చారు. ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’పెళ్లి అయింది మొదలు భర్త , అత్తమామలు నిరంతర కట్న వేధించేవారనీ, వాటిని భరించలేక తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడేళ్లలోపు అనుమానాస్పద మృతి కావడంతో వరకట్న మరణంగా కేసు నమోదు చేశారు. దీనిపై RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) విచారణకు ఆదేశించారు.ఇదీ చదవండి: నెవ్వర్ బిఫోర్ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు -
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఈ నెల ప్రారంభంలో ఓ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆగస్టు 4న పరి చౌక్ సమీపంలో జరిగింది.తన ఫిర్యాదులో బాధితురాలు.. నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించింది. అనంతరం వారు ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ ఉత్తర జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ మాట్లాడుతూ.. డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అదే రోజు టిమార్పూర్లోని పార్కింగ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.పోలీసులు బస్సును కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆగస్టు 14న బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. ఈ బాలిక ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి నివాసి అని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. నోయిడా సెక్టార్ 63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు ఆమె బయలుదేరింది.భారీ వర్షం, చీకటి కారణంగా తాను పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని స్లీపర్ బస్సును ఆపినట్లు చెప్పింది. ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు నోయిడా సెక్టార్ 63కు వెళ్తోందని కండక్టర్ చెప్పడంతో ఆమె బస్సు ఎక్కింది.సూరజ్పూర్లోని వర్క్షాప్లో మరమ్మతుల అనంతరం స్లీపర్ బస్సు ఖాళీగా తిరిగి వస్తోందని పోలీసులు తెలిపారు. బస్సు కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని బాలిక ఆరోపించింది. అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెను రింగ్ రోడ్ సమీపంలో వదిలి పారిపోయిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది.కుల్దీప్, సందీప్లపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి కేసులు నమోదు చేశారు. స్లీపర్ బెర్త్లకు బస్సులో తెరలు ఉంటాయి. ఫోరెన్సిక్ బృందాలు బస్సులో బాలికకు చెందిన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 2012లో ఢిల్లీలో బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్భయ కేసును తలపించేలా ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. -
చలాన్లు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్.. అడ్డంగా బుక్కయ్యాడు!
హైదరాబాద్: ఈఎంఐలు, పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబరు మార్చి.. పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న ఓ వాహనాన్ని ఆర్జీఐ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ ప్రమోద్కుమార్ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టు ట్రంపెట్ బ్రిడ్జీ ఇండియానా బేకరి వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా వాహనం కనిపించింది. పరిశీలించగా ట్యాక్సీగా రిజి్రస్టేషన్ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్ రమేష్ తో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకుని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇవి వదవండి: భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం! -
రిటైర్డ్ అధికారి ఆత్మహత్య : 8 పేజీల లేఖ
రాంచీ: 61 ఏళ్ల రిటైర్డ్ అధికారి సునీల్ కుమార్ సింగ్ ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్లో ఆయన ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు.లాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిధో-కన్హు పార్క్ సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్లో, సీలింగ్ ఫ్యాన్ హుక్కు వేలాడుతూ ఆయన మృతదేహం ఆదివారం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. తీవ్రమైన కీళ్ల నొప్పులు లాంటి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’పోలీసులు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఆయన తన వృద్ధాప్య అనారోగ్య సమస్యల వల్ల పడుతున్న బాధను వివరంగా పేర్కొన్నారు. అయితే, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని ఆయన తెలిపారు. అసాధారణ మరణం (UD) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. రాంచీలోని RIMSలో పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.కాగా సునీల్ కుమార్ సింగ్ బీహార్లోని పాట్నాకు చెందినవారు. ఆయన ఏడాది క్రితం రాంచీలో డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ (DDC)గా పదవీ విరమణ చేశారు. ఆయన కుటుంబం పాట్నాలో ఉంటుండగా, ఈయన మాత్రం రాంచీలోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ? -
భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం!
హైదరాబాద్: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలివచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అతనితో వేగలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొట్టూర్ తెలిపిన వివరాల ప్రకారం... అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది బంజారాహిల్స్ ఇందిరానగర్కు చెందిన అంతటి సాయికుమార్ (28)తో పెళ్లి జరిగిన నెల రోజులకే (ఏప్రిల్లో) ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో ఏడాది జూన్లో సాయికుమార్.. రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు.ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని అదే ఏడాది నెల తర్వాత జులైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. అదే ఏడాది ఆగస్టు 13న సాయికుమార్ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చి, 2023 ఆగస్టు 16న తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ నివాసముంటున్నారు.నగల షాపులో సేల్స్గర్ల్గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్స్ట్రాగామ్లో మరో యువకుడితో చాటింగ్ చేస్తుండడం, ఫోన్లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్యా తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇద్దరి మధ్యా జరిగింది. అనుమానంతో సాయికుమార్ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ జరిగింది.ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్రూమ్లోకి వెళ్లి షవర్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా బయటకు రాకపోయేసరికి సాయికుమార్ బాత్రూమ్ తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా షవర్ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సాయికుమార్పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఇవి కూడా చదవండి: తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం -
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా మెకానిక్గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతదేహంపై కూడా లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. దీంతో ఈ ఘటనకు.. కోల్కతాలో జరిగిన సంచలన ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనను పోలిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ కారణంతో రూమ్మేట్స్ ఊరెళ్లగా.. శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో అత్యాచారం, హత్య కోణంలో విచారణ చేపట్టారు. స్థానికంగా పని చేసే మెకానిక్ మహ్మద్ సనావుల్లా(34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.కిటికీ గ్రిల్స్ లేకపోవడంతో..ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ల మెకానిక్ షాపులో బిహార్కు చెందిన సనుహుల్లా (34) పనిచేస్తున్నాడు. ఇతర కార్మికులు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను కొంతకాలంగా గమనించినట్లు తెలుస్తోంది. యువతి(21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో.. బయటకు శబ్దం వినిపించకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.నిందితుడు సనావుల్లా ఖాన్పోలీసుల అదుపులో నిందితుడుఅంతకు ముందు.. పోలీసుల ముందే నిందితుడు సనావుల్లా ఖాన్ దర్జాగా తిరిగాడు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో తనిఖీలు జరుపుతున్న టైంలో.. ఏం జరిగింది? అంటూ పోలీసులనే ఆరా తీశాడతను. అయితే జాగిలాలు నేరుగా మెకానిక్ షాపు దగ్గరకే వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈలోపు.. నేరం జరిగిన అర్ధరాత్రి నిందితుడు తనకు పదే పదే కాల్ చేశాడని షాపు యాజమానికి పోలీసులకు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా సనావుల్లా ఖాన్ నేరం అంగీకరించాడు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే నిందితుడు రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కుటుంబ సభ్యుల ఆందోళనమరోవైపు యువతి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు తరలి వచ్చారు.ఆర్జీకర్ ఘటనలో ఏం జరిగింది?2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఘటన.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అర్ధరాత్రి 31 ఏళ్ల ట్రెయినీ డాక్టర్ మృతదేహం లభించింది. ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజా తుక్కుగూడ ఘటనలోనూ అర్ధరాత్రే.. అదీ ఆస్పత్రి ఆవరణలోనే అఘాయిత్యం జరగడం గమనార్హం.ఇదీ చదవండి: నీట్ కొట్టింది.. అంతలోనే ఆనందం ఆవిరైంది! -
యోగి సర్కార్పై విమర్శల వేళ.. అంకిత్ కేసులో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంకిత్పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. సోమవారం వేకువ జామున షామ్లీ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.హరియాణాలో పుట్టి పెరిగిన అంకిత్ బల్యాన్.. యూపీకి వలస వచ్చి స్థిరపడ్డాడు. తొలుత కబడ్డీ ప్లేయర్గా రాణించి.. గాయం కారణంగా సంగీతం వైపు మళ్లాడు. యూట్యూబ్ వీడియోలతో పాటు హర్యాన్వీ సాంగ్స్తోనూ మాంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆయన వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే.. ఆగస్టు 26న సాయంత్రం షామ్లీ జిల్లా కోత్వాలి పీఎస్ పరిధిలో ఓ జిమ్ బయట అంకిత్ బల్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు.జిమ్ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తున్న అంకిత్పై రెండు బైక్లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అంకిత్ వైపు దూసుకొచ్చి వరుసగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. కనీసం 16 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అంకిత్ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారుఅయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు ఈ ఉదయం ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ల పేర్లు సుమిత్, మోహిత్గా పోలీసులు నిర్ధారించారు. అయితే వాళ్లు ఏ గ్యాంగ్? ఎందుకు అంకిత్ను హతమార్చారు అనేదానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ఉధృతం చేసినట్లు మాత్రమే వెల్లడించారు.భార్య తీవ్ర హెచ్చరికహత్య అనంతరం అంకిత్ కుటుంబం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంకిత్ భార్య డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో హంతకులను పట్టుకోకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మాహుతికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు.నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు.. అతడికి ఎలాంటి శత్రుత్వం లేదు. అన్యాయంగా అతడిని చంపారు. నా కొడుకును ఎలాగైతే చంపారో.. ఆ హంతకులనూ అలాగే చంపాలి అని సీఎం యోగికి అంకిత్ తండ్రి విజ్ఞప్తి చేశాడు. దీంతో.. పోలీసులు అంకిత్ కుటుంబాన్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు అనుమానితులు ఎన్కౌంటర్లో హతమవడం కేసులో కీలక మలుపుగా మారింది.గోగీ గ్యాంగ్ పేరు తెరపైకిఅంకిత్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తాను హరియాణాలోని సోనిపట్కు చెందిన భోలు షాపురి అని చెప్పుకుంటూ.. ఈ హత్యకు గోగీ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించాడు. దీంతో కేసులో గ్యాంగ్వార్ కోణం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రకటనను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అంకిత్కు ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? గ్యాంగ్ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు అనుమానితుల నుంచి లభించే సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.యోగి సర్కార్పై విమర్శలుఅంకిత్ బల్యాన్ హత్య ఘటన ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలపై మరోసారి రాజకీయ దుమారం రేపింది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ హత్యపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ హత్య కేవలం నేర ఘటనగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది.ఎవరీ అంకిత్ బల్యాన్?33 ఏళ్ల అంకిత్ బల్యాన్ హర్యాన్వీ సంగీతంలో గుర్తింపు పొందిన గాయకుడు, యూట్యూబర్. షామ్లీకి చెందిన ఆయనకు ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సంగీతంలోకి రాకముందు అంకిత్ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నారు. 2013–14 వరకు ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో కబడ్డీకి దూరమై అనంతరం జిమ్లో చేరారు. 2022 ప్రాంతంలో హర్యాన్వీ సంగీతంపై దృష్టి పెట్టారు.గాయకుడిగా మాత్రమే కాకుండా గీత రచయితగా, సంగీత స్వరకర్తగా కూడా పనిచేశారు. తన కెరీర్లో 50కి పైగా పాటలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘భారీ కోర్ట్ మే గోలి మారేంగే’, ‘బాడీ బిల్డర్’, ‘పీటీఐ’, ‘ఏక్ ఖటోలా జైల్ కే భీతర్’ వంటి పాటలతో పాపులర్ అయ్యారు. ఆయన పాటలు, వీడియోల్లో తుపాకులు, గొడవలు, గ్యాంగ్లు, లగ్జరీ కార్ల ప్రస్తావనలు తరచూ కనిపించేవి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అంకిత్ భావిస్తున్నట్లు గతంలో సమాచారం వచ్చింది.హత్యకు కొన్ని గంటల ముందు..అంకిత్ హత్యకు కొన్ని గంటల ముందే తన కొత్త పాట ‘బేబీ బద్మాష్’కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అందులో హత్యను ప్రస్తావించే కొన్ని పంక్తులను పాడారు. హత్య తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ పాటకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.ఇదీ చదవండి: జాక్పాట్ కొట్టిన కానిస్టేబుల్.. ఏకంగా కోట్లలో లాటరీ! -
కూతురును నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి
దండేపల్లి: దంపతుల మధ్య గొడవ, క్షణికావేశం.. పిల్లలను పోషించలేననే ఆందోళన ఓ తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. తాను చనిపోతే తన కూతురును కూడా ఎవరూ పట్టించుకోరని భావించిన ఆ తల్లి.. ఐదేళ్ల కూతురును నడుముకు కట్టుకుని బావిలో దూకింది. దీంతో ఇద్దరూ మృతిచెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో ఆదివారం సాయంత్రం జరిగింది. దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన గొట్ల రజిత (26)కు ఏడేళ్ల కిందట జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహమైంది. వీరికి అక్షిత (5), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. అంజయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో కలిసి ఉండలేనని రజిత లింగాపూర్లోని పుట్టింటికి వచ్చింది. అంజయ్య అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చి భార్య పిల్లలను చూసి వెళ్తున్నాడు. ఆదివారం పని లేకపోవడంతో రజిత ఇంటివద్దే ఉంది. మధ్యాహ్నం అంజయ్య భార్య వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగడం లేదని భావించిన రజిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తాను చనిపోతే తన కూతురును ఎవరూ పట్టించుకోరని భావించి కూతురును కొంగుతో నడుముకు చుట్టుకుని బావిలో దూకింది. ఆత్మహత్యకు ముందు జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు వచ్చి గాలించగా బావిలో తల్లీకూతురు శవమై తేలారు. పోలీసులు కేసు దర్యాప్తు చేçస్తున్నారు. -
ఎంతో కష్టపడి నీట్లో సక్సెస్..అంతలోనే విషాదం
సాక్షి, చెన్నై: పరీక్షల ఒత్తిడి కారణంగా మరో విద్యార్థిని జీవితం అర్థాంతరంగా ముగిసిసోయింది. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన శ్రుతి లయ (21) అనే మెడికల్ ఆశావాది (NEET-UG అభ్యర్థి) నీట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.వైద్యురాలు కావాలనే లక్ష్యంతో వరుసగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.ఐటీ ఉద్యోగి కుమార్తె అయిన శ్రుతి లయ 2023లో పాఠశాల విద్యను పూర్తిచేసి, వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ (NEET) కోచింగ్ సెంటర్లో చేరింది. గత ఏడాది NEET-UG పరీక్ష రాసినప్పటికీ వైద్య సీటు రాకపోవడంతో ఈ సంవత్సరం మళ్లీ తీవ్రంగా శ్రమించి నీట్-యుజి (NEET-UG) పరీక్షలో అర్హత సాధించింది. అయితే, ఇటీవల విడుదలైన మొదటి విడత కౌన్సెలింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఫలితం తెలిసిన రోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్లిన ఆమె, మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఇంటికి సమీపంలో ఉన్న ఒక షెడ్డులో ఉరివేసుకుని కనిపించింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం -
ఆప్ నేత దారుణ హత్య.. బైక్ను వెంబడించి..
మమ్దోట్: పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా మమ్దోట్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత గుర్ ప్రీత్ సింగ్ గోపీని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్ ప్రీత్ సింగ్ గోపీ, హర్ప్రీత్ అనే వ్యక్తితో కలిసి మోటార్సైకిల్పై వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు వారిని వెంబడించారు.అనంతరం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోపీ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీ, హర్ప్రీత్ల వెనుక మరో కారులో వస్తున్న వారి స్నేహితుల వాహనంపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) భూపిందర్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ఇరువర్గాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఎన్నికల సంబంధిత వివాదం కూడా ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు.నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: ఇంట్లో పిచ్చెక్కుతోంది.. డిష్వాషర్గా కార్పొరేట్ ఉద్యోగి! -
వైద్యానికని చెప్పి.. కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
న్యూఢిల్లీ: మానసిక సమస్యలు, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న తన 38 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి తన స్నేహితుడితో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 64 ఏళ్ల నిందితుడితో పాటు అతడికి సహకరించిన 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని కాళింది కుంజ్ వద్ద ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వే సమీపంలో పాడుబడిన షిప్పింగ్ కంటైనర్లో తీవ్ర గాయాలతో ఉన్న గుల్ హసన్ (38) మృతదేహాన్ని ఆగస్టు 23న ఉదయం గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ఈస్ట్) వినీత్ కుమార్ తెలిపారు.ఎన్టీపీసీ ప్రహరీ గోడ పక్కనే ఉన్న కంటైనర్లో రక్తం మడుగులో, తలకు బలమైన గాయంతో ఉన్న మృతదేహం కనిపించడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద హత్య కేసు నమోదు చేశారు. ఏసీపీ అనిల్ కుమార్ శర్మ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బాధితుడిని ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత వారు మాత్రమే ఒంటరిగా తిరిగి రావడం కనిపించింది.ఆ ఆధారాలతో నిందితులను గోవింద్పురిలోని ఓ టైలరింగ్ ఫ్యాక్టరీ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నామని నమ్మించి బాధితుడిని నిర్జన ప్రదేశంలోని కంటైనర్ వద్దకు తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడ మొదట రాయి లేదా బండతో తలపై బలంగా కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, హత్యకు గల పూర్తి కారణాలు, ఘటన క్రమాన్ని తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత డీఎన్ఏలోనే ఏకత్వం: న్యూయార్క్లో మోహన్ భగవత్ -
కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియో మర్డర్!
రాయచోటి టౌన్/వీరబల్లె: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం ఓదివీడులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన బాషాకు, ఓదివీడుకి చెందిన బేల్దారి ఖాదర్ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆమె భర్త బాషా కువైట్ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన ఖాసీం (ఇతడు కూడా కువైట్లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీనిపై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. కువైట్ నుంచి సుపారీ.. లైవ్ వీడియోలు తీసి కిరాతకం పది రోజుల క్రితమే ఖాసీం కువైట్ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. దీంతో ఆయన తన మరో పిన్నమ్మ కుమారులు అయిన బాబ్జి, ఖాదర్వలిని పురమాయించాడు. ఖాసీంను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి సూచించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాబ్జి, ఖాదర్వలి ఓదివీడుకు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఖాసీం, షాహీదాతోపాటు ఆమె కుమార్తె ఉన్నారు. నిందితులిద్దరూ లోపలికి వెళ్లి గడియలు పెట్టారు. తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. షాహీదా కుమార్తెతో బలవంతంగా వీడియోలు తీయించి కువైట్లోని బాషాకు పంపారు. ఈ ఘటన దాదాపు రెండు గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదు. చివరికి ఖాసీం చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు.. గదుల్లో ఉన్న రక్తపు మరకల్ని నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు బాబ్జీని పట్టుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లె ఎస్ఐ సుస్మితారెడ్డికి అప్పగించారు. అనంతరం పోలీసులు ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పూజలు చేసి.. డబ్బులు రెట్టింపు చేస్తానని..
బేస్తవారిపేట: తాను పూజలు చేసి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25లక్షలు తీసుకుని ఓ మహిళను మరో మహిళ దారుణంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం వీరభద్రాపురంలో జరిగింది. కంభం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జున శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... వీరభద్రాపురానికి చెందిన గుమ్మా రాజమ్మ తాను డబ్బులు పెట్టి పూజలు చేస్తే రెట్టింపు అవుతాయని పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ముడమంచు ఆదిలక్ష్మి(33)ని నమ్మించింది.రాజమ్మకు ఆదిలక్ష్మి రూ.25లక్షలు ఇచ్చి పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేయాలని కోరింది. అయితే, జూన్ 21 నుంచి ఆదిలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో గుమ్మా రాజమ్మను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుమ్మా రాజమ్మ తన భర్త బుజ్జి గురవయ్యతో కలసి ఆదిలక్ష్మిని హత్య చేసి వీరభద్రాపురంలోని తమ పంటపొలంలో పూడ్చిపెట్టారని నిర్ధారించారు. ఆమె సెల్ఫోన్ను సమీపంలోని చెక్డ్యామ్లో పడేశారని గుర్తించారు.ఆదిలక్ష్మి మృతదేహాన్ని శనివారం పోలీసులు బయటకు తీసి తహశీల్దార్, జిల్లా ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. నిందితులు రాజమ్మ, బుజ్జి గురవయ్యను సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నారాయణరెడ్డిపల్లెకు చెందిన రవిని కూడా రాజమ్మ ఇదే తరహాలో నమ్మించి రూ.45లక్షలు తీసుకున్నారని చెప్పారు. దానిలో రూ.16లక్షల మేర ఆదిలక్ష్మికి ఇచ్చారని పేర్కొన్నారు. -
కాపురానికి రాలేదని భార్య దారుణ హత్య
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మండలం కోళ్లబైలు–1 బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నేర చరిత్ర ఉండి, పదేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవలే విడుదలైన తంబళ్లపల్లె మండలం దిగువపల్లికి చెందిన కె.మధుకర్రెడ్డి, తనతో కాపురానికి రావడానికి నిరాకరించిందన్న కసితో భార్య దండామణి(38)ని మచ్చు కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 19 ఏళ్ల కిందట స్వగ్రామంలో బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులున్నాయి. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలని భార్యను వేధిస్తూ.. ఇటీవల బావమరిదిపై దాడి చేశాడు. కాగా, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం బావమరిదికి ఫోన్ చేసి.. ‘ఇంకా ఇద్దరున్నారు.. వారిని కూడా చంపి నేనూ చచ్చిపోతా’ అంటూ హెచ్చరించాడు. బాధితుడు ఈ ఆడియో రికార్డింగ్ను డీఎస్పీ బుచ్చిరాజుకు వినిపించడంతో ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
AP: వివాహితపై ఐదుగురు యువకుల అత్యాచారం
సాక్షి, విజయవాడ: వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఐదుగురు యువకులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. మద్యం తాగొచ్చి మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దారుణంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే.. పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్ మర్డర్తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు -
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య
చండీగఢ్: పంజాబ్లోని చండీగఢ్కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) దారుణ హత్యకు గురయ్యారు. కిడ్నాప్నకు గురైన ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న మృతి చెందారు. బాధితురాలి తల్లి కాంతా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు ఇద్దరు అనుమానితులపై అపహరణ, హత్య కేసులు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి చండీగఢ్లోని సెక్టార్ 34లో గల మద్యం దుకాణం వద్దకు రావాల్సిందిగా ఆమెకు పరిచయస్తులైన శుభి, పిందా అనే వ్యక్తులు ఫోన్ చేశారు. మంజీత్ అక్కడికి చేరుకోగానే, వారు బలవంతంగా ఆమెను కారులోకి లాగి మొరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై తీవ్రంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆమెను గమనించిన ఓ పరిచయస్తుడు దుప్పటితో మంటలను ఆర్పి, వెంటనే స్థానిక మొరిండా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మొహాలీ ఆసుపత్రికి, జూలై 9న పీజీఐఎంఈఆర్ చండీగఢ్కు తరలించారు.కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలో ఉన్న మంజీత్, ఆగస్టు 5న కొద్దిసేపు స్పృహలోకి వచ్చి జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 26న ఆమె కన్నుమూశారు. ఈ ఘటనపై సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 140(1) (కిడ్నాప్), 103(1) (హత్య), 3(5) కింద కేసు నమోదైంది. మృతురాలికి విడాకులు అయ్యాయని, ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని సెక్టార్ 34 ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ షాదీ లాల్ తెలిపారు. నిందితుల్లో ఒకరితో మంజీత్ గతంలో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్) చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిశోర్ జన సేవా కేంద్రం ప్రారంభం.. లక్ష్యం ఇదేనట! -
ఇంత క్రూరత్వమా?.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
విజయనగరం టౌన్: ఎనిమిది పదులు దాటిన వయసు.. చూపు అంతంతమాత్రమే.. చెవులు కూడా వినపడే స్ధా యి లేదు.. గట్టిగా అరిచే ఓపిక లేదు.. దీనస్ధితిలో కాలయాపన చేసే ఓ పండుటాకుపై కామాంధు డు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులతో మొరపెట్టుకోవడం, వెంట నే ఆస్పత్రికి తరలించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని గురువారం పరామర్శించారు. విషయాన్ని ఎస్పీ ఎఆర్.దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ నరసింహారావు, సీఐ నరసింహమూర్తి, ఎస్ఐలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి సీఐ, కాలనీవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం పట్టణంలోని ఓ కాలనీలో నివసిస్తున్న 82 ఏళ్ల వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఇంటికి అరుంధతీనగర్ కాలనీ మీదుగా గాజులరేగ నడక మార్గం నుంచి వెళ్తున్న సమయంలో కామాంధుడు ఆమెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కొంతసేపటికి తేరుకున్న ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వృద్ధురాలిని ఘోషా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైనశైలిలో విచారణ ప్రారంభించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ స్వయంగా ఘోషా ఆస్పత్రికి సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్కా్వడ్, క్లూస్టీమ్లను రంగంలోకి దించారు. నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి
యర్రగొండపాలెం: వీడియో కాల్ ద్వారా డాక్టర్ల సలహాతో కాంపౌండర్, నర్సులే ఓ గర్భిణికి అబార్షన్ చేయగా, అది వికటించడంతో ఆమె మృతి చెందింది. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఈ దారుణం జరిగింది. యర్రగొండపాలెం మండలం మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) 5 నెలల గర్భాన్ని తీయించుకునేందుకు యర్రగొండపాలెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడ అన్నీ తామై ఆపరేషన్లు చేస్తున్న కాంపౌండర్, నర్సులు కలిసి ఆమెకు అబార్షన్ చేసేందుకు పూనుకున్నారు.వీడియో కాల్లో డాక్టర్లను సంప్రదించి ఆపరేషన్ చేయగా బ్లీడింగ్ ఎక్కువైంది. దీంతో సమీపంలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అక్కడికి మాబున్నీని తీసుకెళ్లగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందింది. అవగాహన లేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాబున్నీ మృతి చెందిందని బంధువులు ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.మెడికల్ షాపు యజమానే హాస్పిటల్ యజమాని!మాబున్నీకి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తిరిగి గర్భందాల్చిన ఆమె లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆడపిల్ల అని తేలడంతో ఆమె అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె అబార్షన్ చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్ వైద్యం చేస్తుండేవారు. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత ఒక మెడికల్ షాపు యజమాని ఆ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అక్కడకు ఎక్కువగా అబార్షన్ కేసులే వస్తుంటాయని సమాచారం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు యర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ తెలిపారు. -
అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!
ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్షాపు ఉంది.దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇవీ చదవండి: తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
సింగర్ దారుణ హత్య.. యోగి సర్కార్పై తీవ్ర విమర్శలు
ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల అంశం.. మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. షామ్లీ జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో ప్రజలకు, ప్రముఖులకు రక్షణ కరువైందని యోగి సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి.పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్ బల్యాన్ జిమ్(33) నుంచి బయటకు వస్తుండగా బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే కూలిపోగా.. దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు షామ్లీ ఎస్పీ ఎం.పీ. సింగ్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అంకిత్పై దుండగులు దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.ఎవరీ బల్యాన్ఉత్తర ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోనూ అంకిత్ బల్యాన్ యూట్యూబ్లో ఎంతో ప్రజాదరణ పొందిన గాయకుడు. ఆయన ఛానల్కు 3.66 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. హర్యాన్వీ పాటలు, ప్రదర్శనలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వీడియోల్లో పాటలతో పాటు లగ్జరీ కార్లు, ఆయుధాల ప్రదర్శన హైలైట్ అయ్యేవి. ఇదిలా ఉండగా.. అంకిత్ బల్యాన్ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అఖిలేష్ ఆగ్రహంఅంకిత్ హత్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే ఎస్సీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. ఈ ఘటన భయాందోళనలకు కారణమైందని పేర్కొన్నారు. అంకిత్ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని విలపించిన దృశ్యం హృదయ విదారకమని అన్నారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కక్షల కోణంలోనూ దర్యాప్తు చేయాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్యపై జాట్ వర్గంలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో జాట్లు మొత్తం జనాభాలో సుమారు 2–3 శాతం వరకు ఉంటారని అంచనాలు ఉన్నాయి. అయితే పశ్చిమ యూపీలోని షామ్లీ, ముజఫర్నగర్, బాఘ్పత్, మీరట్ వంటి జిల్లాల్లో వీరి ప్రభావం గణనీయంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో జాట్ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.ఇప్పటికే యూపీలో శాంతి భద్రతల గురించి దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్ల గురించి యోగి ప్రభుత్వ తొలి కాలంలో సానుకూల చర్చ నడిచినా.. ప్రస్తుత టర్మ్లో మాత్రం కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అమాయకులు బలైపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు.. అభివృద్ధి అంశం పూర్తిగా పక్కకు జరిగిపోయిందనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంకిత్ బల్యాన్ హత్య రాజకీయ చర్చకు దారి తీసింది. జాట్ సంఘాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని ఆందోళనలు చేస్తే యోగి సర్కార్కు కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎదురు కావొచ్చు.ఇదీ చదవండి: సీఎం కటింగ్ ఖరీదు 50రూ. -
ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...
పటమట(విజయవాడతూర్పు): బీటెక్ చదివిన సూరవరపు షకీనా(24) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమవారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. భీమవరానికి చెందిన షకీనాకు రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు. చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంతేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
నోటరీ కోసం వెళితే.. చంపేసి బంగారం దోపిడీ
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నోటరీ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈనెల 17న జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు.. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు (74) ఒంటినిండా బంగారం ధరించి ఈనెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది. ఆమె నుంచి బంగారం దోచుకోవాలనే అత్యా శతో ధనలక్ష్మి తన సోదరుడు బెండి అచ్యుతరావు (స్టాంపు వెండర్), పెద్ద కుమారుడు గణేష్ (న్యాయవాది)తో కలిసి హత్యకు పథకరచన చేసింది. వృద్ధురాలిని వాష్రూమ్లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేసిన అనం తరం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గోనె సంచిలో పెట్టి అద్దె కారులో హిర మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి తంపర కాలువలో పడేశారు. ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), అచ్యుతరావు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఘాతుకం బయటపడిందిలాహతురాలు చిన్నమ్మడు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. ఈనెల 11న స్వగ్రామైన అల్లాడపేటకు వచ్చిన ఆమె 17న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లి రాటవేసే కార్యక్రమం ఉండటంతో నగలు ధరించి వెళ్లిందని, ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫి కెట్ నిమిత్తం నోటరీ చేసేందుకు ఈ ఏడాది మేలో పరిచయమైన న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్తానని కుటుంబీకులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దిశగా జలుమూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ నెల 17న ఉదయం 11.30 గంటలకు నరసన్నపేట పోలీస్స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. ఆ ఫుటేజీలో వృద్ధురాలు తిరిగి రావడం కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఓ కారు వచ్చింది. సీడీఆర్ విశ్లేషణతో పాటు డాగ్స్కా్వడ్ బృందంతో తనిఖీలు చేయగా న్యాయవాది ఇంటి పరిసరాల్లోనే తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. కారు ట్రాకింగ్ హిస్టరీ బట్టి పోలీసులు నిందితులను విచారించగా హత్యోదంతం బయటపడింది. న్యాయవాదులు కావడంతో చేసిన నేరాలనుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచించి కారును కెమికల్ లిక్విడ్తో శుభ్రపరిచారు. రక్తపు ఆధారాలు, ఇతర కీలకమైనవి చెరిపేశారు. ఆ న్యాయవాది జంట హత్యల కేసులో నిందితురాలునిందితుల్లో ఒకరైన ధనలక్ష్మి 2008లో జరిగిన జంట హత్యల కేసులో నిందితురాలని, అప్పుడు కూడా బంగారం కోసం హత్య చేశారని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
క్షుద్ర పూజలు, చిన్నారి బలికి యత్నం!
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు ఓ చిన్నారిని బలిచ్చేందుకు తీసుకొచ్చారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నిందితులను నిలదీస్తే చిన్నారిని తీసుకుని నలుగురు పరారవ్వగా, మహిళతోపాటు ఐదుగురిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చిర్రయానం సముద్ర తీరంలో కాలభైరవ స్వామి ఆలయం ఉంది. దీనికి సుమారు కిలోమీటరు దూరంలో తీరాన సరుగుడు, తుమ్మ చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ ప్రాంతానికి మంగళవారం రాత్రి 11 గంటలకు ఓ మహిళతోపాటు తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తులు కొత్త కారు, ఏపీ 05 ఈఈ 8557నంబరు గల మోటార్ సైకిల్పై చేరుకున్నారు. వీరిని అక్కడే ఉన్న ఇద్దరు గ్రామస్తులు ‘ఎవరు మీరు’ అంటూ ప్రశ్నించారు. తమది కోతుల చెరువు అని, మల్లాడి ధన కిషోర్ తెలుసా అని ఎదురు ప్రశ్నించాడు. అదే సమయంలో తోటలో మరి కొంత మంది ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు గ్రామస్తులు లైట్లు వేసుకుని అక్కడకు వెళ్లారు. వారిని చూసి, అక్కడున్న నలుగురు వ్యక్తులు పదేళ్లలోపు పాపను తీసుకుని ఒక్కసారిగా పరారయ్యారు. ఈ విషయంపై వారిద్దరూ మిగిలిన గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని కారును అడ్డుకుని మహిళతోపాటు ఐదుగురు వ్యక్తులను గట్టిగా నిలదీశారు. దీంతో గుప్త నిధుల కోసం పూజలు చేసేందుకు వచ్చామని ఆ మహిళ చెప్పింది. ఆ కారులో కొబ్బరి కాయలు పూజా సామగ్రి ఉన్నాయి. అదే సమయంలో కత్తి పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి మోటారు సైకిల్పై అక్కడి నుంచి పారిపోయాడు. తోటలో ఉన్న నలుగురు వ్యక్తులతోపాటు చిన్నారిని కూడా కారు వద్దకు తీసుకుని రావాలని గ్రామస్తులు పట్టుబట్టారు. తమ వెనుక ప్రజాప్రతినిధులున్నారంటూ నిందితులు బెదిరించడంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు.అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వారిని పంపేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ ప్రాంతంలో చాకు, రెండు పారలు, కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, పేలాలు, పేడ, తాళ్లు, సంచులు, కల్లు, కూల్ డ్రింక్, మంచి నీటి బాటిళ్లను గుర్తించామని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్ను వివరణ కోరగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని చెప్పారు. -
రామచంద్రపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురంలో దారుణం జరిగింది. భర్తను భార్య పొత్రం రాయితో కొట్టి హత్య చేసింది. భార్య తంగేటి ఉమాదేవి చేతిలో భర్త తంగేటి ఎల్లారావు హత్యకు గురయ్యాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.నిందితురాలు ఉమాదేవిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి భార్య మృతి చెందడంతో ఉమాదేవిని ఎల్లారావు రెండో వివాహం చేసుకున్నాడు. వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావుకు భార్యపై అనుమానం కలగడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 25న మద్యం సేవించి వచ్చి భార్యతో ఎల్లారావు ఘర్షణకు దిగాడు.దీంతో భార్య పొత్రం రాయితో కొట్టడంతో భర్త మృతి చెందాడు. హతుడు సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారావు హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పాల వ్యాపారితో వివాహేతర సంబంధం..
తమిళనాడు: ఆవడి సమీపం కర్లబాక్కం యాదవర్ వీధికు చెందిన లతా(45). ఈమె కర్లబాక్కం పంచాయతీలో క్లీనర్గా పని చేస్తోంది. ఈమె భర్త, సుబ్రమణి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఆమె తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ వచ్చింది. ఈనెల 20వ తేదీ లత పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాలేదు. ఆమె ఇంటి తలుపు బయటి నుండి తాళం వేసి ఉంది. ఈ స్థితిలో, మంగళవారం లత ఇంట్లో నుండి దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు ముక్తపుదుపేట్టై పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో, పడకగదిలో లత తలకు గాయాలతో, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలు గానీ, ఇంట్లోని వస్తువులు గానీ ఏవీ దొంగిలించబడలేదు. అనంతరం, పోలీసులు లత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం చెన్నైలోని కిల్పాకం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అవడి ముక్త పుదుపేట్టై పోలీసులు అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణ లో అదే ప్రాంతానికి చెందిన మునివేల్ (65) అనే పాల వ్యాపారితో లతకు అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో, పోలీసులు మునివేల్ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణ సమయంలో, తానే లతను చంపానని అతను చెప్పాడు. చాలా కాలంగా లతతో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. లత కొన్ని రోజులుగా చాలా మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడంతో కొట్టి చంపినట్లు తెలిపాడు. దీంతో మునివేల్ను పుళల్ జైలుకు తరలించారు. చదవండి: యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని -
‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం!
సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జెజు ద్వీపంలో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు శవాలుగా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో పది మందికి పైగా అదృశ్యం కావడం, అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు లభ్యమవుతుండటంతో అక్కడ సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దేశ అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ స్పందించి ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు.మే 12న అదృశ్యమైన 37 ఏళ్ల జాంగ్ మి-రాన్ అనే మహిళ మృతదేహం సోమవారం (ఆగస్టు 24) హల్లిమ్-యుప్లోని ఓ తాటి తోటలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. శవపరీక్ష ద్వారా ఆమె గుర్తింపును నిర్ధారించారు. ప్రాథమికంగా ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది. అయితే, ఇక్కడ సీరియల్ కిల్లర్ ఉన్నాడనే వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు అదృశ్యం కేసుల దర్యాప్తులో పోలీసుల అలసత్వం బయటపడింది. సుమారు 17 నెలల్లో 298 మిస్సింగ్ కేసులను పర్యవేక్షించిన ఓ అధికారి తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు మాట్లాడిందని తప్పుడు సమాచారం ఇచ్చి, ఆధారాలు లేకుండానే జాంగ్ మి రాన్ కేసును మూసివేసి, రికార్డులను తొలగించినట్లు తేలింది. ఆగస్టు 22న శవమై తేలిన 60 ఏళ్ల వృద్ధుడి కేసును కూడా ఇదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా క్లోజ్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై జెజు సియోబు పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు ఉన్నతాధికారులను నేషనల్ పోలీస్ ఏజెన్సీ (ఎన్పీఏ) సెలవుపై పంపింది. హత్యలు, అక్రమ రవాణా కోణాలపై ఇంకా నిర్ధారణ కానప్పటికీ, కేసుల విచారణపై సమగ్ర దర్యాప్తు జరపాలని, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలని అధ్యక్షుడు లీ ఆదేశించారు.ఇది కూడా చదవండి: చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ! -
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
శివ సన్నిధిలో ప్రాణాలొదిలారు
శ్రీశైలం టెంపుల్: కుటుంబ కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), అతడి పెద్దక్క గోగుల ఆదిలక్ష్మి (50), చిన్నక్క మల్లేశ్వరి (45), చెల్లెలు పల్లపు శ్రీదేవి (33), మల్లేశ్వరి కుమారుడు మణికంఠ విగత జీవులై కనిపించారు. సత్రంలోని రూమ్ నంబర్–11లో సుధాకర్, అతని మేనల్లుడు మణికంఠ గదిలోని హాల్లో ఫ్యాన్కు ఉరేసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు స్నానాల గదిలో చీరతో ఉరేసుకున్నారు. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. సత్రం గదినుంచి దుర్వాసన రావడంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. 26 రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ మాట్లాడుతూ.. ‘గత నెల 28న సుధాకర్తో పాటు ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలం వచ్చారు. రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో ఉంటున్నారు. ఇన్ని రోజులు ఉండకూడదని చెప్పినా ఆరోగ్యం బాగాలేదంటూ కొనసాగారు. సుధాకర్కు ఇంకా వివాహం కాలేదు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసినా భర్తలను వదిలేసి ఇంటివద్దే ఉంటున్నారు. వారంతా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బత్తలపల్లిలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వసతి గదుల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతి ఉందన్నారు. కానీ, సత్రం నిర్వాహకులు నిబంధనల్ని ఉల్లంఘించి గదులు కేటాయించారన్నారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారం గదులు కేటాయించాలని ఆదేశించారు. -
ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ భర్త తన భార్యను ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో, ఈ సమయంలో తన భార్య తన చేతులను పట్టుకోగా, ఆమె ప్రియుడు తనపై దాడి చేసి.. గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని బాధిత భర్త ఆరోపించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి తనను కాపాడారని తెలిపాడు.బాధిత భర్తకు ఆ మహిళతో సుమారు నెలన్నర క్రితమే వివాహం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు భర్త ఝాన్సీ ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెల్లడించాడు. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.చిర్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలోని అతడు నివసిస్తున్నాడు. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. జూన్ 24న మధ్యప్రదేశ్లోని భాండేర్కు చెందిన ఓ యువతితో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగినట్లు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి తన భార్య తనకు నిద్రమాత్రలు ఇవ్వడం ప్రారంభించిందని, తాను నిద్రపోయాక ఆమె తన ప్రియుడితో మాట్లాడుకునేదని భర్త ఆరోపించాడు.టీ, పాలలో నిద్రమాత్రలు తన భార్య టీ, పాలలో నిద్రమాత్రలు కలిపేదని, ప్రియుడితో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని బాధిత భర్త ఆరోపించాడు. ఆగస్టు 19న ప్రియుడి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆగస్టు 23న రెండోసారి భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ సమయంలో ప్రియుడు, భార్య కలిసి తన గొంతు నులిమి కొట్టారని ఆరోపించాడు. అతని అరుపులు విని వచ్చిన పొరుగువారు అతడిని కాపాడారు. ప్రస్తుతం తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతూ బాధితుడు పోలీసులను న్యాయం చేయాలని కోరాడు.ఈ కేసుపై మోంఠ్ పోలీస్ సర్కిల్ అధికారి మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారని, ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’
తిరుపతి: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసి తర్వాత వదిలివేయడంతో తిరుపతికి చెందిన లిల్లీ అనే యువతి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైలవరం ఎస్ఐ శ్యామ్సుందర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం నార్జాంపల్లెకు చెందిన సుధాకర్ యాదవ్ తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న లిల్లీ వద్దకు వెళ్లేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కావడంతో సుధాకర్ యాదవ్ తనకు వివాహం కాలేదని, నిన్ను నీ ఇద్దరు పిల్లలను నేను చూసుకుంటానని నమ్మించాడు. దీంతో లిల్లీ కూడా భర్త లేకపోవడంతో అంగీకరించింది. అయితే సుధాకర్ యాదవ్కు అప్పటికే వివాహమైందనే విషయం తెలుకుని లిల్లీ ప్రశ్నించింది. దీంతో సుధాకర్ యాదవ్ కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి లిల్లీకి తాగించి ఆమె ఫోన్లో వివరాలను తొలగించేశాడు. సుధాకర్ యాదవ్ తరఫున బంధువులైన బాలయ్య, లక్ష్మీదేవి, పార్వతీ, శ్రీదేవి తమ పెళ్లి జరిపిస్తామని హమీ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. చివరికి కులంపేరుతో దూషించి దాడి చేసి మోసం చేసి తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ ఆరోపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం! -
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం పరారైంది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన దివ్య (35) చిన్నపాటి ఆనారోగ్య సమస్యతో మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో చేరారు.వారం రోజుల క్రితమే ఆమెను పరీక్షించిన వైద్యులు సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో, ఆదివారం రాత్రి అడ్మిట్ అయ్యారు. సోమవారం ఉదయం చికిత్స ప్రారంభించారు. తొలుత పేషెంట్కు రక్త స్రావం అవుతోందని.. అదనపు రక్తం కావాలని చెప్పారు. ఇంతలోనే పెషెంట్ వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయని, బ్లడ్ సెల్స్ తెప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికి పేషెంట్ మృతి చెందినట్లు చెప్పి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి వైద్యులు తప్పించుకున్నట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు దిగడంతో మరికొందరు బంధువులు కూడా మద్దతు పలికారు.ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యం, బాధితులతో మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సమయంలో ప్రమాదవశాత్తూ వెయిన్ తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావంతో పాటు పెషెంట్ గుండెపోటుకు గురై ఉంటుందని వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం అనంతరం బాధితులు శాంతించినప్పటికీ, నిర్లక్ష్యపు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.కేసు నమోదు... మృతురాలి భర్త వికాస్ ఫిర్యాదు మేరకు అస్పత్రి వైద్యులు శ్రీకాంత్, గీతాంజలి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.ఎమ్మెల్యే పరామర్శ.. దివ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించారు. బృందావన్ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. -
చిక్కిన నకిలీ డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: డబ్బులు డబుల్ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్ రాజు ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు.మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్కుమార్ నమ్మలేదు.దీంతో 2019 అక్టోబర్ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్ హైదరాబాద్ తీసుకువచ్చి సునీల్ కుమార్ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు.డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్కుమార్ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్–5 ఏసీపీ కె.కిరణ్ కనిపెట్టి పట్టుకున్నారు. -
రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రామగుండంలో నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ప్రభుత్వ సంస్థలకు చెందిన 54 వెబ్సైట్లపై అధునాతన డీడీఓఎస్ (డిస్టర్బ్ డేనియల్ ఆఫ్ సర్వీస్) సైబర్ దాడులకు యత్నించిన కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందాలు తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేప ట్టాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ, సైబర్ క్రైమ్ అధికారుల బృందం సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ప్రత్యేక వాహనాలతోపాటు స్థానిక పోలీసుల సహకారంతో అయోధ్యనగర్కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఈఈఈ చదువుతున్న ముజామిల్ ఖాన్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో, సైబర్ దాడుల కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు అతడిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముజామిల్ ఖాన్ను అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో విచారణ కొనసాగించినట్టు సమాచారం. టెలిగ్రామ్ గ్రూపుపై ప్రత్యేక ఆరా... కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం టెలిగ్రామ్ యాప్లో ‘ఏఐపై ప్రత్యేక శిక్షణ’ఇస్తామంటూ వచ్చిన సందేశం ఆధారంగా ముజామిల్ ఓ గ్రూపులో చేరినట్టు తెలుస్తోంది. ఆ గ్రూపులో కొన్ని వివాదాస్పద సందేశాలపై గొడవలు జరగడంతో సుమారు ఏడాదిన్నర క్రితమే తాను ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చినట్లు విద్యార్థి అధికారులకు వివరించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెలిగ్రామ్ గ్రూపులో సంఘవిద్రోహ లేదా సైబర్ దాడులకు సంబంధించిన చర్చలు జరిగాయా? అందులోని సభ్యులెవరు? గతంలో గ్రూపులో ఉన్న వ్యక్తులతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సోదాల సందర్భంగా ముజామిల్కు చెందిన సెల్ఫోన్, ల్యాప్టాప్తోపాటు ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను అధికారులు పరిశీలించారు. సోదాల్లో మొత్తం 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లతో పాటు ఇతర డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విచారణకు అవసరమైనప్పుడు హాజరు కావాలని విద్యార్థికి సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
మొగుడ్ని చంపి పేగుల్లాగేసింది: కిడ్నీ, లివర్ మాయం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ భర్తను అత్యంత అమానుషంగా హత్య చేసింది. పొట్టలో కత్తితో దారుణంగా పొడవడంతో పేగులు బయటకొచ్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మృతుడి కాలేయం, కిడ్నీ అదృశ్యం కావడంపై మరింత ఆందోళన రేపింది. దీనిపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యూపీలోని ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, విమలా దేవి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో భర్తను పొడిచిన తర్వాత, ఆ మహిళ అతని ప్రేగులను భవనం పైకప్పుపై ఉన్న ప్లాస్టిక్ సంచిలో కుక్కుతుండగా,ఇంటి యజమాని కంట్లోపడింది. ఇంటి యజమాని రింకు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించినప్పుడు, నిందితురాలు విమలా దేవి భవనం పైకప్పు పైనుంచి దూకేసింది. రాజేష్ పొట్టలో తీవ్రమైన గాయాలు అయ్యాయని, బయటకు వచ్చిన ప్రేగులను విమల ఒక ప్లాస్టిక్ సంచిలో పెడుతోందని రింకు పోలీసులకు తెలిపింది. మరోవైపు నిందితురాలు దేవి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.భర్త కాలేయం, మూత్రపిండం అదృశ్యంపోస్ట్-మార్టం నివేదిక ప్రకారం, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ గౌరవ్ కౌశిక్ వివరాల ప్రకారం భర్త రైట్ కిడ్నీ,కాలేయంలోకొంత భాగం కనిపించకుండా పోయాయి. అలాగే పొట్ట భాగంలో సుమారు 37 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాటు, ప్రేగులు బయటకు వచ్చి పడి ఉన్నాయి. ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బువిమల, రాజేష్ దంపతులు సుమారు ఏడాది కాలంగా కురుక్షేత్రలో నివసిస్తుండగా, భర్త ఒక కంపెనీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే విమలాదేవి చేతబడి, దుష్టశక్తులను వదిలించే ప్రక్రియవంటి పనుల్లో నిమగ్నమై ఉండేదని, వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇంటి యజమాని తెలిపారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. విచారణకు సహకరించేంతగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను విచారిస్తామని ఆదర్శ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సురేందర్ సంధు వెల్లడించారు. ఈ అవయవాలు అదృశ్యం కావడానికి, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ -
ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
ముంబైలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 45 ఏళ్ల ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జిమ్నాస్టిక్స్ కోచ్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విలే పార్లేలోని ఓ జిమ్నాస్టిక్స్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి వద్ద చదువుకుంటున్న సమయంలో కోచ్ వాట్సాప్ ద్వారా బాలికకు ‘హాయ్’ అంటూ సందేశం పంపాడు. అనంతరం ఆమెను జిమ్నాస్టిక్స్ కేంద్రానికి రావాలని, కలవడానికి ఖాళీగా ఉన్నావా అని అడిగాడు. కోచ్ నుంచి సందేశం రావడంతో బాలిక అతడిని సంప్రదించిందని సమాచారం.బాలిక జిమ్కు వెళ్లినప్పుడు అక్కడ కోచ్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అధికారిక పనికి సంబంధించిన విషయం ఉంటుందని భావించి వెళ్లిన బాలికను తన చెప్పులు లోపలికి తీసుకురావాలని, అనంతరం తలుపు లోపలి నుంచి లాక్ చేయాలని కోచ్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత బాలికపై కోచ్ లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది.ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సహాయంతో ఫిర్యాదుఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా విలే పార్లే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఆరోపణలపై ఆధారాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు -
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
ముంబై నేర చరిత్రలో ఎందరో క్రూరమైన గ్యాంగ్స్టర్లు ఉన్నారు. అయితే అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సైతం తలవంచి, కన్నతల్లిలా భావించి భయభక్తులతో నడుచుకున్న ఏకైక మహిళ ఒకరు ఉన్నారు.. ఆమె మాటే దావూద్కు వేదవాక్కు.. ముంబై అక్రమ మద్యం సామ్రాజ్యాన్ని శాసించి, పోలీసులతో పాటు అండర్వరల్డ్ డాన్లందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ మహిళే ‘జేనాబాయి దారువాలీ’. ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఆమె సంచలనాత్మక జీవిత ప్రస్థానం ఇది.పేదరికం నుంచి స్వతంత్ర సమరం వరకుజేనాబాయి అసలు పేరు జైనబ్. ఆమె 1920లో ముంబైలోని ఒక ముస్లిం మెమన్ హలాయ్ కుటుంబంలో జన్మించారు. తండ్రి విక్టోరియా గుర్రపు బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆరుగురు తోబుట్టువులతో కలిసి డోంగ్రీ ప్రాంతంలోని ఒక చిన్న గదిలో ఆమె బాల్యం గడిచింది. 14 ఏళ్ల వయసులోనే కలప వ్యాపారి మహమ్మద్ షా దర్వేశ్తో వివాహం జరిగింది. 1920-30ల నాటి స్వాతంత్రోద్యమంలో జేనాబాయి.. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పోరాటాల్లో పాల్గొన్నారు. దేశ విభజనకు ముందు ముంబైలో జరిగిన మత ఘర్షణల్లో హిందువులకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఆమె భర్త చేతిలో దెబ్బలు కూడా తిన్నారు.దేశ విభజన.. ఒంటరి పోరాటం1947లో దేశ విభజన జరిగినప్పుడు జేనాబాయి భర్త దర్వేశ్ పాకిస్థాన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమెను కూడా రావాలని ఒత్తిడి చేసినప్పటికీ, జేనాబాయి భారతదేశాన్ని వీడటానికి ససేమిరా అంగీకరించలేదు. తన ఐదుగురు సంతానంతో కలిసి ముంబైలోనే ఉండిపోయారు. కుటుంబ పోషణ కోసం నగరంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతను అవకాశంగా మలుచుకున్నారు. హోల్సేల్ వ్యాపారులకు, బ్లాక్ మార్కెట్లో విక్రయించే దుకాణదారులకు మధ్య మధ్యవర్తిగా మారి బియ్యం వ్యాపారం ప్రారంభించారు. మెమన్ వర్గానికి చెందినది కావడంతో గుజరాతీ వ్యాపారులతో సులభంగా సంబంధాలు నెరిపారు. అలా ఆమె ‘జేనాబాయి చావలాలీ’గా గుర్తింపు పొందారు.అక్రమ మద్యం సామ్రాజ్యంలోకి ప్రవేశంతదనంతర కాలంలో ఆమె ఇక్బాల్ గాంధీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోవడంతో, పేదలకు సహాయం చేసే వరదరాజన్ ముదలియార్ను కలిశారు. ఆ సమయంలో బొంబాయిలో మద్యపాన నిషేధం అమల్లో ఉండటంతో వరదరాజన్ ముఠా అక్రమ మద్యం తయారీలో ఉండేది. వరదా సలహాతో జేనాబాయి మద్యం వ్యాపారంలోకి దిగారు. అనతికాలంలోనే భారీగా మద్యం అమ్ముతూ ‘జేనాబాయి దారువాలీ’గా మారారు. ఈ క్రమంలోనే వరదరాజన్ ద్వారా హాజీ మస్తాన్, కరీం లాలాలతో ఆమెకు బలమైన పరిచయాలు ఏర్పడ్డాయి.దావూద్ కుటుంబంతో బంధంఅక్రమ మద్యం వ్యాపారంతో విపరీతమైన సంపదను ఆర్జించిన జేనాబాయి, అండర్వరల్డ్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1962లో ఆమె ఇంట్లోని వాటర్ ట్యాంక్లో మద్యం నిల్వలు దొరకడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ను కలిసి తన పేదరికాన్ని వివరించినట్లు కథనాలు వచ్చాయి. తదనంతరం ఆమె పోలీసులకు కీలక ఇన్ఫార్మర్గా మారారు. ఈ క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్, ఆయన భార్య అమీనాలతో జేనాబాయికి సాన్నిహిత్యం పెరిగి కుటుంబ సభ్యురాలిగా మారారు. వారి కుమారుడే దావూద్ ఇబ్రహీం.దావూద్ను కాపాడిన మహిళా గాడ్మదర్చిన్నతనంలో దావూద్ గ్యాంగ్ వార్స్లో తిరుగుతూ తండ్రికి తలనొప్పిగా మారేవాడు. ఒకసారి మనీష్ మార్కెట్కు చెందిన గ్యాంగ్స్టర్ హమీద్ ‘చూహా’పై దావూద్ తీవ్ర దాడి చేయడంతో అతను ఐసీయూ పాలయ్యాడు. కొడుకు ఆగడాలతో విసిగిపోయిన కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దావూద్ వారం రోజుల పాటు ఇంటికి దూరంగా దాక్కున్నాడు. ఆ సమయంలో జేనాబాయి రంగంలోకి దిగి దావూద్ తల్లిదండ్రులను శాంతింపజేయడమే కాకుండా, పోలీసు అధికారులతో మాట్లాడి కేసు నుంచి దావూద్ను రక్షించారు. నాటి నుంచి దావూద్ ఆమెను కన్నతల్లిలా గౌరవించేవాడు.రక్తపాతానికి ముగింపు.. గ్యాంగ్స్టర్ల మధ్య సంధిదావూద్ ఇబ్రహీంకు, ఇతర ముస్లిం గ్యాంగ్లకు మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో జేనాబాయి కీలక మధ్యవర్తిత్వం వహించారు. పఠాన్ గ్యాంగ్ లీడర్ కరీం లాలా, హాజీ మస్తాన్లతో దావూద్కు సమావేశం ఏర్పాటు చేశారు. జేనాబాయి చొరవతో కరీం లాలా వర్గం, దావూద్, అతని సోదరుడు సాబిర్, మాజిద్ కాలియా, హుస్సేన్ సోమ్జీ తదితరులు చేతులు కలిపారు. పరస్పరం కొట్టుకు చచ్చే ముఠాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, ముంబై అండర్వరల్డ్లో సరికొత్త నేర సిండికేట్ను నడిపించిన ఘనత జేనాబాయికే దక్కింది.ఇది కూడా చదవండి: బెంగాల్ విభజనకు తావులేకుండా గూర్ఖాలాండ్కు పరిష్కారం -
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదాంతం
సాక్షి, సంగారెడ్డి: ఆరు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా శాంతినగర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆదివారం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమె హతమార్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చింది. అయితే ఈ కేసులో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన ఓ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పిన సురేఖకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో సంబంధం చూడటం ప్రారంభించారు. దీంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తొలగించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.వైద్య రంగంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న సురేఖ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు మందును తీసుకొచ్చింది. అనంతరం ఓ మెడికల్ షాపులో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. జనవరి చివర్లో ఓ రోజు రాత్రి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ.. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో వారు ఆమెను మందలించారు. అప్పటికే వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. ముందుగా తల్లి లక్ష్మికి ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ మత్తు మందును అధిక మోతాదులో ఇచ్చింది.కొద్దిసేపటికే లక్ష్మి మృతి చెందగా.. ఆమెను నిద్రిస్తున్నట్లు పడుకోబెట్టింది. అనంతరం ఇంటి బయట ఉన్న తండ్రి దశరథం వద్దకు వెళ్లి ఆయనకూ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.అన్నకు ఫోన్ చేసి.. కన్నీటి నాటకంతల్లిదండ్రుల మరణాలను సహజంగా చూపించేందుకు సురేఖ ప్రయత్నించింది. అన్న అశోక్కు ఫోన్ చేసి.. ‘‘అమ్మా నాన్న చనిపోయారు.. భయంగా ఉంది.. త్వరగా రండి’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అన్న వచ్చాక.. తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, తల్లి షాక్కు గురై గుండెపోటుతో స్పృహ కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది.అలా బయటపడిన నిజంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో లభించిన సిరంజీలను పరిశీలించారు. సురేఖ చెప్పిన వివరాల్లో అనుమానాలు రావడంతో ఆమెను ప్రశ్నించారు. మొదట అవి మూడు నెలల కిందటివని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సంచిలో దొరికిన ఉపయోగించని మూడో సిరంజీ, ఖాళీ ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విచారణలో తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు సురేఖ అంగీకరించింది. ప్రేమ వివాహానికి అడ్డుపడటమే కారణమని వెల్లడించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికే సురేఖ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. -
గర్ల్స్ హాస్టల్లో యువతి ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సిరి ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.వికారాబాద్కు చెందిన ఆ యువతి ప్రైవేట్ ఉద్యోగం కోసం ఈ నెలలోనే సంగారెడ్డికి వచ్చింది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ.. హాస్టల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు త్వరలో పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి. -
మద్యం మత్తులో తల్లిపై దాడి.. అక్కడికక్కడే మృతి
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కుమారుడు కన్న తల్లిపై కిరాతకంగా దాడి చేసి చంపాడు. స్థానిక గాంధీనగర్లో రజియా అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. అయితే పుల్లుగా తాగిన తన కుమారుడు మద్యం మత్తులో తల్లి తలపై బలమైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన రజియా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. -
పోలీసులపై మూకదాడి: కళ్లలో కారం కొట్టి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భల్సా డైరీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందంపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భల్సా డైరీ పరిధిలో శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో పోలీసు సిబ్బంది సాధారణ గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వాహనాల తనిఖీ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.దీంతో ఆగ్రహానికి గురైన వాహన యజమాని, మరికొందరు వ్యక్తులతో కలిసి పోలీసులపై ఒక్కసారిగా దాడికి దిగారు. దుండగులు పోలీసుల కళ్లలో మిరపపొడి చల్లి, చేతుల్లో ఉన్న కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నిందితులు కర్రలు పట్టుకుని పోలీసులను వెంబడించి కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో నమోదయ్యాయి. స్థానికంగా పలు నేరాలతో సంబంధం ఉన్న సునీల్ అలియాస్ పంకజ్ అనే రౌడీషీటర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.ఇతనిపై గతంలోనూ తీవ్రమైన నేరాలతో కూడిన ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి, ఘటనా స్థలంలో ఉన్న ఒక మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పంకజ్తో పాటు మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసులపై ఇలాంటి దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.ఇది కూడా చదవండి: ఐఫోన్ ఈఎంఐ కట్టలేక ‘యమున’లో దూకి.. -
యువతి హత్య.. శరీర భాగాలను బిర్యానీ పాత్రలో వండేందుకు యత్నం?
చెన్నై: తమిళనాడులో వెలుగు చూసిన దారుణమైన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనుమానిత దంపతులు ఓ మహిళను అతి క్రూరంగా హత్య చేశారు. హత్య తర్వాత ఆ మహిళ శరీర భాగాలను ముక్కలుగా నరికి, అందులో కొంతభాగాన్ని బిర్యానీ పాత్రలో వండారు. ఆ పాత్ర మూతకు గాలి ఆడకుండా మైదా పిండితో సీల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆగ్రా చేరుకున్న తర్వాత ఓ జనరల్ కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఉన్న ఎరుపు రంగు సూట్కేసు నుండి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్రా రైల్వే పోలీసులు ఆ సూట్కేసును తెరిచి చూడగా, అందులో తల లేని, ముక్కలుగా నరికిన ఒక మహిళా మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఆగ్రా రైల్వే పోలీసులు తమిళనాడు పోలీసుల సహాయం కోరారు. చెన్నై సెంట్రల్ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ పుటేజ్ను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. మధ్యవయస్కుడైన వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్కేసుతో సెంట్రల్ స్టేషన్కు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడం కనిపించింది. ట్రైన్ బయలుదేరే సమయానికి కొద్దిసేపు ముందు వారు ఆ సూట్కేసును లోపల ఉంచి కిందకు దిగిపోయారు. అనంతరం వారు పార్క్ స్టేషన్కు నడిచివెళ్లి, ఈఎంయూ రైలు ఎక్కి గుడువాంచేరిలో దిగి ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. 👉ఇదీ చదవండి: ఐఫోన్ పిచ్చి.. కుటుంబాన్ని బలితీసుకుందిగుడువాంచేరి పరిసర ప్రాంతాల్లో సుమారు 350లకు పైగా సీసీటీవీ కెమెరాలను విశ్లేషించగా, ఆ జంట గుడువాంచేరిలోని మస్జిద్ వీధిలో ఉన్న ఒక అద్దె ఇంటి నుంచి అదే సూట్కేసుతో బయలుదేరినట్లు తేలింది. గుడువాంచేరి పోలీసుల సహాయంతో ఆ ఇంటిని తనిఖీ చేయగా, అక్కడే హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు మాణిక్ ఉతిన్ లస్కర్, అతని భార్య భగమతి మాజి, హయత్ నిషా అనే ముగ్గురు నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. హత్యకు గురైన మహిళ హయత్ నిషాగా ప్రాథమికంగా గుర్తించారు. ఆమె తాంబరం సమీపంలోని ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బాధితుల్ని ఇంట్లోనే హత్య చేసి, ముక్కలుగా నరికారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన శరీర భాగాలతో బిర్యానీ వండిన ఆధారాలు లభ్యమయ్యాయి. బాధితురాలి తల ఎక్కడ పడేశారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
మద్యం మత్తులో బైక్ రైడ్... యువకుడి విషాదం!
సాక్షి హైదరాబాద్: మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ అదుపు తప్పడంతో కోల్కతాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం... కోల్కతాకు చెందిన అబ్బాస్ సిద్ధిఖీ (26) రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన ఎక్స్పోకు వచ్చి వెస్టిన్ బంజరాలో ఉంటున్నాడు. అతని స్నేహితులు అభిరూప్ సింగ్ మిరాజ్ (25), సహస్ర చటోపాధ్యాయలతో కలిసి శుక్రవారం సాయంత్రం మాదాపూర్లోని మధుశాల బార్లో మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురూ కలిసి చార్మినార్ చూసేందుకు క్యాబ్లో వెళ్లారు.తెల్లవారుజామున 3 గంటలకు బార్కు తిరిగి వచ్చి పార్కింగ్లో ఉన్న బైక్పై ఖాజాగూడ లేక్ వద్దకు వెళ్లి తిరిగి బయలుదేరారు. చటోపాధ్యాయ మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఖాజాగూడ లేక్రోడ్డులో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ వద్ద అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. వెనుక కూర్చున్న అబ్బాస్ సిద్ధిఖీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చున్న అభిరూప్సింగ్ మిరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడంతో సహస్ర చటోపాధ్యాయ ప్రాణాలు దక్కాయి. వీరి ఇద్దరు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మహిళను ముక్కలు చేసి సూట్కేసులో రవాణా
సాక్షి, చెన్నై: ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నై సమీపంలోని గూడువాంచేరిలో నరికి చంపి, ఆమె శరీర భాగాలను సూట్కేస్లో పెట్టి రైలులో ఆగ్రాకు పంపించడం కలకలం రేపింది. బాధితురాలిని ఒడిశాకు చెందిన హయత్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె విడాకులు తీసుకొని తాంబరంలోని ఓ సంస్థలో పనిచేస్తూ 19 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. చెన్నై నుంచి ఆగ్రా రైల్వేస్టేషన్కు చేరుకున్న తమిళనాడు ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో ఒక ఎర్రటి సూట్కేస్ లభ్యమైంది. దానిని తెరిచి చూడగా మహిళ శరీర భాగాలు ముక్కలుగా లభించాయి. ఆగ్రా నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లోని 350కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక యువ జంట ఆ ఎర్రటి సూట్కేస్ను తమిళనాడు ఎక్స్ప్రెస్లో పెట్టి సబర్బన్ రైల్లో గూడువాంచేరికి వెళ్లినట్లు గుర్తించారు. -
హెజెలో ల్యాబ్స్లో పేలిన రియాక్టర్
సాక్షి, యాదాద్రి, భూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు కెమిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా, హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరో కెమిస్ట్ మృతిచెందాడు. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి (31), ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేశ్కుమార్ (29), సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన రణబోతు రాజశేఖర్ రెడ్డి (38) ఉన్నారు. నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం నుంచి, నరేశ్కుమార్ మూడేళ్లుగా, రాజశేఖర్రెడ్డి (38) నాలుగేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వారిని పరామర్శించారు. నాగిరెడ్డి, నరేశ్కుమార్ల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదం ఎలా జరిగింది.. హెజెలో కంపెనీలో శుక్రవారం రాత్రి షిఫ్ట్ మార్పు సమయంలో రసాయనాల మిశ్రమ నిష్పత్తిలో తేడా రావడం, ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగి కూలెంట్ వ్యవస్థ విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలెంట్ వ్యవస్థ ఆ వేడిని నియంత్రించలేకపోవడంతో ఒక రియాక్టర్ దెబ్బతిని, పక్కనే ఉన్న మరో రియాక్టర్ను ఢీకొన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు, మంటలు ఎగిసిపడ్డాయి. శబ్ద తీవ్రతకు చుట్టుపక్కల దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కంపెనీని సీజ్ చేయాలని ఆదేశం వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ఫార్మా కంపెనీని సీజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ మధుసూదన్రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు ప్రమాదం జరిగిన కంపెనీని సందర్శించారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలు తెలుసుకుని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. కాగా, రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.80 కోట్ల ఎక్స్గ్రేషియాను కంపెనీ యాజమాన్యం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు వైకల్యం తీవ్రత ఆధారంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపేదీ? ఇదే కంపెనీలో జూలై 16న రసాయన వాయువులు పీల్చడం వల్ల అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) మృతి చెందారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కాకముందే రియాక్టర్ పేలడంతో కంపెనీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ దోపిడీ కేసులో దాదాపు 15 ఏళ్లుగా పరారీలో ఉన్న 72 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన హరి సింగ్ షెఖావత్ను 2016లో కోర్టు పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది.ఈ కేసు 2008 నాటిది. తాను పనిచేస్తున్న ప్రముఖ వస్త్రాల బహుళజాతి సంస్థ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు షెఖావత్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షెఖావత్పై 2008 మార్చి 15న దోపిడీ, నేరపూరిత బెదిరింపులు, నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన కేసు నమోదైంది. అతను కోర్టుకు హాజరుకాకపోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు దూరంగా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో 2016 ఏప్రిల్ 2న అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించారు.అరెస్టును తప్పించుకునేందుకు..దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నేరస్థుల కోసం నిఘా కొనసాగిస్తోందని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం తెలిపింది. షెఖావత్ ఆచూకీ కోసం విస్తృతంగా వ్యక్తిగత నిఘా నిర్వహించినట్లు వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా అరెస్టును, చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు అతను తొలుత గుజరాత్కు, ఆ తర్వాత రాజస్థాన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు పైగా నిఘా కొనసాగించిన తర్వాత ఆగస్టు 13న షెఖావత్ జైపూర్లో దాక్కున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది.సబ్ఇన్స్పెక్టర్ రాకేశ్ నేతృత్వంలో ఎస్ఐ విశాల్ తివారీ, హెడ్ కానిస్టేబుళ్లు నవీన్ చిల్లర్, నవీన్ శర్మ, కుల్దీప్తో కూడిన ప్రత్యేక బృందాన్ని జైపూర్కు పంపించారు. బృందం గాలింపు చేపట్టి చివరకు నగరంలోని ఓ నివాస సముదాయంలో షెఖావత్ ఆచూకీ గుర్తించింది. అతడి గుర్తింపు, నివాసాన్ని నిర్ధారించిన తర్వాత చట్ట ప్రకారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.పలు బహుళజాతి సంస్థల్లో పనిచేసిన నిందితుడుషెఖావత్ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో, గతంలో జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్గా పిలిచే సంస్థలో చదువు పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేసినట్లు వెల్లడించారు. 2008లో ఓ వస్త్రాల బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఆ సంస్థ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు అతను ప్రయత్నించినట్లు ప్రత్యేక విభాగం తెలిపింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్లో అతడి కదలికలను గుర్తిస్తూ సాగిన సుదీర్ఘ అంతర్రాష్ట్ర గాలింపునకు అతడి అరెస్టుతో ముగింపు పడిందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: బుర్ఖాలో అక్కడికి పురుషుడు.. ఎలా గుర్తుపట్టారంటే? -
భార్య, సోదరి హత్యకు అదే కారణమా?.. లక్నో కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఒకవైపు విడాకుల కేసు.. మరోవైపు రూ.1.5 కోట్ల భరణం డిమాండ్.. ఇంకోవైపు కుటుంబ కలహాలు.. ఇవన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయా?. లక్నోలో ఓ బ్యాంకర్ భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపి, ఇంటికి వెళ్లి సొంత సోదరినీ హతమార్చి చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. మూడు ప్రాణాలను బలిగొన్న ఈ దారుణం వెనుక అసలు కారణమేంటి?. మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు మరింత కలవరపెడుతున్నాయి.దివ్యా మిశ్రా, మానస్ బాజ్పాయ్ 2017లో వివాహం చేసుకున్నారు. మొదట వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగినప్పటికీ, కొంతకాలానికి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో దివ్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.ఆగస్టు 18న కోర్టులో ఏం జరిగింది?విడాకుల కేసు విచారణలో దివ్య రూ.1.5 కోట్ల భరణం కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం మానస్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే రూ.1.5 కోట్ల డిమాండ్ ఒక్కటే హత్యకు కారణమని పోలీసులు ఇప్పటివరకు తేల్చలేదు. దంపతుల మధ్య ఉన్న గొడవలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా మానస్ చెల్లెలు షీబాతో ఉన్న విభేదాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.ఒక్కరోజే మూడు కాల్పులుగురువారం మధ్యాహ్నం గోమతీనగర్లోని తన కార్యాలయం వెలుపల దివ్యపై మానస్ కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం అతడు తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తన 28 ఏళ్ల చెల్లెలు షీబాను కాల్చి చంపిన అనంతరం, తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మానస్ గదికి తాళం వేసుకుని టీవీ శబ్దాన్ని గట్టిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లో సంచలన ఆరోపణలుదివ్యను హత్య చేసిన తర్వాత మానస్ పెట్టినట్లు చెబుతున్న వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. దివ్య తనను మోసం చేసిందని ఆరోపిస్తూ, తాను భార్యను చంపినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, తాను, తన చెల్లెలు చనిపోతామని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. దివ్య సోదరి, యూట్యూబర్ ప్రగ్యా మిశ్రా, ఆమె భర్త భరత్ పేర్లు కూడా ఆ సందేశంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రగ్యా, భరత్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దివ్య బంధువు మయాంక్ దీక్షిత్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: నీ తల్లి కోసమైనా బతకాలి కదరా.. ఇది ముందే పన్నిన పథకమా?ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న మరో కీలక ప్రశ్న ఇదే. మానస్ దివ్యను హత్య చేసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాడా?. మూడు తుపాకుల స్వాధీనం, సీసీటీవీ దృశ్యాలు, దివ్య కదలికలపై అతడు రెండు రోజుల పాటు నిఘా పెట్టినట్లు వచ్చిన సమాచారం.. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, పొరుగువారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్, వాట్సాప్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. రూ.1.5 కోట్ల భరణం వివాదమే హత్యలకు కారణమా? కుటుంబ కలహాలే అసలు కారణమా? లేక మానస్ చివరి సందేశంలో పేర్కొన్న ఆరోపణల వెనుక మరేదైనా కథ ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. -
పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
సాక్షి,న్యూఢిల్లీ: భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం ఒక యువ టెకీని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి తన భార్యతో ఇంట్లో వచ్చిన వివాదంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో అది తీవ్రరూపం దాల్చింది. వీరి దాడిలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా హత్యకు గురైన సంఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం మృతుడిని లక్ష్మీ పార్క్ నివాసి, నోయిడాలోని 'అడోబ్' (Adobe) సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)గా గుర్తించారు. కాగా వినయ్కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల వయసున్న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారు.ఏం జరిగింది?ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించగా, వారు నిహాల్ విహార్లోని వినయ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన విజిటర్స్ కోసం నీళ్లు, అల్పాహారం తీసుకురావడానికి వినయ్ తల్లి బయటకు వెళ్లిన సమయంలో, భార్య తరఫు బంధువులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి వచ్చి అడ్డుపడి, ఆపమని బ్రతిమాలినా వినకుండా దాడిని కొనసాగించారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ను ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మృతుడి భార్యతో పాటు మరో ఆరేడుగురిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
నిఖితకు ఏం జరిగింది?.. కాంచీపురం వర్సిటీలో కలకలం
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపింది. ఆంధప్రదేశ్ తిరుపతికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. రెండ్రోజులుగా బయట కనిపించని ఆమె.. హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఆమె మరణానికి కారుకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కాంచీపురం ఎనతూర్లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో తిరుపతికి చెందిన నిఖిత ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు. రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు. హాస్టల్ గదిలోనే ఉంటోంది. గురువారం రాత్రి ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్, ఇతర సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. నిఖిత విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పొన్నేరికరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.విద్యార్థుల ఆందోళనవిద్యార్థిని మృతితో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా నిఖిత తరగతులకు రాలేదని.. ఇటు హాస్టల్ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.“నిఖిత మృతికి కారకులను శిక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యంతోనూ ప్రాథమిక చర్చలు జరిపారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే?ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధిత కారణాలతోనే నిఖిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నీ ప్రాణం పోయినా.. మా బైక్ రిపేర్ చేయించాల్సిందే!
హైదరాబాద్: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మరమ్మతు విషయంలో తీవ్ర ఒత్తిడి, వేధింపులకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపిన మేరకు.. చార్మినార్ ప్రాంతానికి చెందిన మీర్ సోఫియాన్ అలీ అలియాస్ ఆదిల్(24) నాలుగు నెలల క్రితం తన స్నేహితుడు పాషను బైక్ తీసుకువెళ్లాడు. అయితే బైక్ ఓ రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో పాషాతోపాటు ఇతని మిత్రుడు ఇషాక్ ఉద్దీన్లు మరమ్మతు చేసివ్వాలని.. లేకపోతే డబ్బులివ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని ఆదిల్ చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఈనెల 19న అర్థరాత్రి మాసబ్ట్యాంక్ ఫస్ట్లాన్సర్లోని మార్వా లిబర్టీ అపార్ట్మెంట్ ఏడవ అంతస్తు టెర్రస్పై హంజాలా పాషాతో పాటు మిత్రులు ఇషాక్ ఉద్దీన్, మస్తాన్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆదిల్ను పిలిపించారు. ఆదిల్, షారుఖ్ వెళ్లగా బైక్ రిపేరు గురించి ఒత్తిడి చేశారు. తాను డబ్బులు చెల్లించలేనని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆదిల్ చెప్పినా.. నీ ప్రాణం పోయినా మాకు అనవసరం లేదు.. బైక్ రిపేర్ చేసి తీరాల్సిందే అని హెచ్చరించారు. దీంతో ఆదిల్ ఏడో అంతస్తునుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ ఆదిల్ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇదిలా ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మాసబ్ట్యాంక్ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం


