breaking news
Crime
-
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్సింగ్నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం
పంజాబ్లోని లూథియానా సెంట్రల్ జైలులో మరోసారి హింస చెలరేగింది. ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించిన జైలు సూపరింటెండెంట్ తీవ్ర గాయాల పాలు కావడం మరింత ఆందోళన రేపింది.మంగళవారం సాయంత్రం లూథియానాలోని తాజ్పూర్ రోడ్లోని సెంట్రల్ జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. జైలు అధికారులు, పోలీసు సిబ్బంది వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఖైదీలు పోలీసు అధికారులపై దాడి చేశారు. ఈక్రమంలో జైలు సూపరింటెండెంట్ కుల్వంత్ సిద్ధూ తలపై ఇటుకతో బలంగా కొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జైలు డిఎస్పీ జగ్జీత్ సింగ్ , కొంతమంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో సహా ఇతర సిబ్బంది కూడా ఇటుకల దాడిలో గాయపడ్డారు. ఖైదీలకు అసలు ఇటుకలు ఎలా వచ్చాయనేది ఆరాతీస్తే, జైలులోని గార్డెన్ బెడ్స్ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంబులెన్స్లు, అదనపు పోలీసు బలగాలను భారీగా తరలించారు. ప్రస్తుతం జైలును మూసివేసి పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.200 మందికి పైగా ఖైదీలు దాడిరెండు గ్రూపుల మధ్య గొడవ ఒకవైపు ఇద్దరు, మరోవైపు ముగ్గురుగా ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. మత కారణంగా తనను అవమానించారని ఆరోపణలతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఇరు పక్షాలు ఇటుకల విసురుకోవడంతో కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 నుండి 250 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, సెంట్రల్ జైలు వెలుపల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జైలు ఆవరణలో దాదాపు 20 నిమిషాల పాటు సైరన్లు మోతతో దద్దరిల్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై జైళ్ల మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ జైలు అధికారుల నుండి నివేదిక కోరారు. కాగా 2019, జూన్లో ఇదే జైలులో తీవ్ర ఘర్షణ చెలరేగింది. బ్యారక్ల లోపల హింసాత్మక తిరుగు బాటును అణిచి వేసేందుకు పోలీసులు 150 రౌండ్లకు పైగా కాల్పులు జరపవలసి వచ్చింది*A disturbance has broken out at the central jail in Ludhiana. Police have arrived at the scene, and according to sources, there are reports of clashes between inmates and the police.*+*Ludhiana a mini riot as prisoners clash at Ludhiana Central Jail (Tajpur Road) on Tuesday… pic.twitter.com/fEtZUwL4I3— Amit Bhardwaj (@AmmyBhardwaj) December 16, 2025 -
ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది. కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. #Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z— Bharathirajan (@bharathircc) December 17, 2025 -
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విని్పస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం
డిజిటల్ అరెస్ట్ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న వైనం ఆందోళన రేపుతోంది. బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణురాలు బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను నెరవేర్చేందుకు తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్లోని ఫ్లాట్లో నివసిస్తోంది బబితా. జూన్లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు నమ్మించాడు.ఆ కాల్ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే, కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే చేసింది. తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని సుమారు రూ. 2 కోట్లు మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్పై దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి? -
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్కు తన న్యాయవాదితో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్డాగ్ తన కథనంలో వివరించింది.ఎవరీ బబ్లీ కౌర్ కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్లెట్ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.బబ్లీ కౌర్ను విడుదల చేయాలని పిలుపులాంగ్ బీచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్ను బాండ్పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు. -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు
గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్లాండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్లో అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
ప్రభాకర్ రావు నాన్ కోపరేషన్.. సిట్కు కొత్త తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే. -
గుర్రం తన్నడంతో 12 ఏళ్ల బాలుడి మృతి
వరంగల్: సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్ర్డన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు.గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్ర్డన్ పార్క్కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. -
ప్రియురాలిని బలిగొని.. పెళ్లి పీటలెక్కిన క్రూరుడు!
ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.బిలాల్ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్నగర్లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్నగర్లో ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటేసేందుకు పట్నం నుంచి వచ్చి..
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్కు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు. -
ప్రియురాలే గెలిచింది
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు. -
నైట్క్లబ్లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.ఆ దంపతులు క్లబ్లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
న్యాయవాదికి 'సైబర్' వల.. రూ.72 లక్షలు మాయం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు. సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...
మహబూబాబాద్ రూరల్: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి. గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు. ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్లో ఉగ్రదాడి జరిగింది. బీచ్లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీచ్లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
3 గంటలు స్టేటస్.. 24 గంటలూ సేల్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్గా నగరానికి వలసవచ్చి డ్రగ్ పెడ్లర్గా మారిన శ్రీకాకుళం వాసి వ్యవస్థీకృతంగా, కొత్త పంథాలో ఈ దందా చేస్తున్నాడు. వర్చువల్ నంబర్ వినియో గిస్తూ.. తన వద్దకు సరుకు వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాడు. మాదకద్రవ్యాలను దోశల మాదిరిగా ప్యాక్ చేసి, డెలివరీ బాయ్స్ సహకారంతో ఆర్డర్ ఇచ్చిన వారి వద్దకు పంపిస్తున్నాడు. ఈ వ్యవహారం గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి ఐదేసి కేజీల చొప్పున గంజాయి, హష్ ఆయిల్, ద్విచక్ర వాహనం సహా రూ.70 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఈ వివరాలు వెల్లడించారు. సహచరుల కోసం దందా మొదలుపెట్టి.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వైకుంఠ రావు 2017లో హైదరాబాద్కు వలసవచ్చి, మాదాపూర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ధూల్పేట నుంచి గంజాయిని కొనుక్కుని వెళ్లి తన సహచర డ్రైవర్లకు విక్రయించే వాడు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి పూర్తిగా మాదకద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. తొలుత ధూల్పేట నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. 2020 నుంచి ఒడిశా విక్రేతల వద్ద నుంచి గంజాయి, హష్ ఆయిల్ తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి 2021లో సనత్నగర్, ఈ ఏడాది జూన్లో కొత్తవలస ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు. ఆధారాలు చిక్కకుండా పథకం.. జైలు నుంచి బయటకు వచ్చిన వైకుంఠ రావు తన పంథా మార్చేశాడు. ఉనికి బయటపడకుండా దందా చేయడానికి నిర్ణయించుకుని ఒడిశాకు చెందిన హష్ ఆయిల్ తయారీదారుడు పాల్ ఖిలా, సప్లయర్ కృష్ణ జల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.పాల్ నుంచి గంజాయి, హష్ ఆయిల్ సేకరించే కృష్ట నగరానికి తీసుకువచ్చి మాదాపూర్లోని వైకుంఠ రావు ఇంట్లో డెలివరీ ఇచ్చేవాడు. తన గుర్తింపు బయటపడకుండా వర్చువల్ నంబర్ వాడుతున్న వైకుంఠ రావు సరుకు వచ్చిన ప్రతిసారీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ‘గ్రీన్ అవైలబుల్’అంటూ స్టేటస్ పెట్టేవాడు. దీన్ని చూసే ఇతడి రెగ్యులర్ కస్టమర్లు ఎంతెంత కావాలో వాట్సాప్లోనే ఆర్డర్ ఇచ్చేవారు. దానికి అయ్యే మొత్తాన్ని ఆన్లైన్లో వసూలు చేసే వైకుంఠ రావు, సరుకు పంపడానికి తన బంధువులైన బాలాజీ, చైతన్యలను డెలివరీ బాయ్స్గా ఏర్పాటుకున్నాడు. గంజాయి, హష్ ఆయిల్ టిన్నులను దోశ మాదిరిగా పేపర్లో ప్యాక్ చేసి, వీరి ద్వారా సరుకు అయిపోయే వరకు 24 గంటలూ సరఫరా చేసేవాడు. బాలాజీ చిక్కడంతో కదిలిన డొంక.. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో టోలిచౌకి వద్ద కాపుకాశారు. అక్కడ ఓ కస్టమర్కు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన బాలాజీని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మాదాపూర్లోని వైకుంఠరావు గదిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ రావుతో పాటు అక్కడే ఉన్న పాల్, కృష్ణ, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గది నుంచి హష్ ఆయిల్, గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును టోలిచౌకి పోలీసులకు అప్పగించారు. వైకుంఠ రావు ఫోన్ను తనిఖీ చేసిన పోలీసులు 120 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో ఐటీ, సినీ రంగానికి చెందిన వారితో పాటు డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వీరికి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి రీహ్యాబ్కు పంపాలని నిర్ణయించామని, ఇలాంటి డ్రగ్స్ దందాలపై సమాచారం ఉంటే 8712661601 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని డీసీపీ వైభవ్ కోరారు. -
భార్యకు ఉరివేసి.. ఆత్మహత్య
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్లో రికార్డు చేసి స్టేటస్గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది. -
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్ప్లస్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
వైరల్: బీజేపీ నేత కుమార్తెకు ఆకతాయిల వేధింపులు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Molestation in daylight! 🚨⚠️Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చిలుక తెచ్చిన తంటా
కర్ణాటక: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్లోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అరుణ్కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్కుమార్ స్టీల్ పైప్కి కర్ర కట్టి అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మలయాళ నటి కేసులో ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
కొచ్చి: కేరళలో 2017లో సంచలనం సృష్టించిన బహుభాషా నటిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడ, మలయాళ నటుడు దిలీప్కు కోర్టు ఇటీవలే బయటపడటం తెల్సిందే. ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ శుక్రవారం సునీల్ ఎన్ఎస్ అలియాస్ పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ అనే వారికి గ్యాంగ్ రేప్నకు పాల్పడిన నేరానికి గాను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వీరికి వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను అదనంగా జైలు శిక్షలు, వేర్వేరు జరిమానాలు సైతం విధించారు. అశ్లీల వీడియోను ఇతరులకు షేర్ చేసిన నేరానికి గాను సునీకి అదనంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా, సాక్ష్యాన్ని నాశనం చేసిన నేరానికి మార్టిన్కు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, బెయిల్కు ముందు రిమాండ్లో కలిపిన కాలాన్ని కూడా శిక్షలో భాగంగానే పరిగణించాలని స్పష్టం చేశారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని, లైంగికదాడి దృశ్యాలున్న పెన్డ్రైవ్ను విచారణాధికారి కస్టడీలో ఉంచాలని జడ్జి తెలిపారు. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలనే ఈ కేసుకు కూడా వర్తింప జేసినట్లు చెప్పారు. ఈ తీర్పు తమకు నిరుత్సాహం కలిగించిందని, దోషులందరికీ కోర్టు యావజ్జీవ కారాగారం విధిస్తుందని భావించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజా కుమార్ చెప్పారు. దీనిపై త్వరలో కేరళ హైకోర్టుకు వెళతామన్నారు. ఈ నెల 8వ తేదీన ఇదే కేసులో నటుడు దిలీప్ సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా తదితర యాప్లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.ఏం జరిగింది..సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.లీలాలో పరివర్తన..నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. -
జుబీన్ గార్గ్ మరణంపై చార్జిషీట్
గౌహతి: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఆర్గనైజర్, వ్యక్తిగత సెక్రటరీ సహా నలుగురు నిందితులపై హత్య అభియోగాలు మోపింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్కు కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్గా హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. సెపె్టంబర్ 19న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అభిమానుల ఆందోళనల నేపథ్యంలో ఈకేసును దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు, అనేక అరెస్టులు, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం శుక్రవారం ఉదయం సిట్.. 3500పేజీల చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఈకేçసులో 300 మందికి పైగా విచారించినట్లు, ఏడుగురిని అరెస్టు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ చార్జిషీట్ను నాలుగు పెద్ద ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జుబీన్ అభిమానులు కోర్టు బయట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ నినాదాలు చేశారు. -
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.రాజుగారి మెట్ట వద్ద..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు. తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుల వివరాలుమృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.అతివేగం.. పొగమంచే కారణంబస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు. బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.తీరిగ్గా.. తాపీగా..ఈ ఘాట్రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గత సంక్రాంతి సీజన్కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు విచారంబస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులేచిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్రెడ్డి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్లో కుమార్తె వద్ద ఉంటున్నారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు. బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది. టూర్లో అరకు లేకపోయినా..ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.‘ఫిట్నెస్ ఎలా ఇచ్చారో’ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో ఎఫ్సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.డ్రైవర్ల వివరాలు ఇలా..బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథకూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్ దుర్ఘటనలో కదిలించే ఉదంతాలునేను పోయి వాళ్లు బతికినా బాగుండేది... ‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారిహెల్పర్గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు... బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజమమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్ మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి – చింతూరు/మోతుగూడెం -
దొంగిలించి.. తిరిగి అప్పగించి
చౌటుప్పల్: చోరీ చేసిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లాడొక దొంగ. దొరికి పోతానని భావించాడో.. మరేదైనా కారణ మో తెలియకపోయినా.. రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణా న్ని మాత్రం బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కాట్రేవు గ్రామంలో శుక్ర వారం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరా లివి. గ్రామానికి చెందిన గున్రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారు లు.. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు.ఎప్పట్లాగే బుధవారం ఉద యం 5 గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటినుంచి బయట కు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే పడుకుంది. ఆ సమయంలో తలుపు లకు గడియ పెట్టకపోవడంతో.. నేరుగా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకు న్న వృద్ధురాలి తలకు దుప్పటి చుట్టి.. కొట్టి.. ఆమె దిండు కింద ఉన్న నాలుగున్న ర తులాల బంగారు పుస్తెలతాడుతో పారిపోయాడు. అయి తే దొంగ చోరీ చేసే ముందు వీధి దీపాలను ఆపేశాడు. ఇంత పకడ్బందీగా చో రీ చేసిన దొంగ కొత్త వ్యక్తి ఏమాత్రం కాదని, తమ గ్రామస్తుడేనని పలు వురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.ఘటన జరిగిన రోజు పోలీ సులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పోలీసు లు జాగిలాలు వస్తాయని, దొంగ ఎక్కడున్నా పట్టుకుంటాయని గ్రామంలో చర్చ జరిగింది. ఇలాగైతే తాను దొరికిపోతానని, పరువుపోతుందని భావించిన ఆ దొంగ.. రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి బంగారు ఆభర ణాన్ని తిరిగి బాధితురాలికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి తలుపు వద్ద పుస్తెలతాడు వదిలేసి వెళ్లాడు. పాలు తీసుకొచ్చేందుకు బయటికెళ్తున్న బాధితురాలి భర్త రంగారెడ్డి.. పుస్తెలతాడును గమనించి తీసుకున్నాడు. -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
మామను చంపిన అల్లుడు
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మామ, బావమరిదిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో మామ మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్య తండాకు చెందిన బానోతు లాలునాయక్ (గార్ల మాజీ ఎంపీపీ), కౌసల్య దంపతుల కుమార్తె శ్రీసాయిలహరిని కురవి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోత్ గాంధీబాబుకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.51లక్షల నగదు, 30 తులాల బంగారం, సుమారు రూ.5 లక్షల విలువగల ఇంటి సామగ్రిని కట్నంగా అందజేశారు. కొన్ని నెలల నుంచి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు సీతారాం, కవిత, అక్క బానోతు మమత కలిసి శ్రీసాయిలహరిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో బాధితురాలు శ్రీసాయిలహరి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో అత్తింటివారిపై వరకట్నం, గృహహింస వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో పెద్దమనుషుల సమక్షంలో కుటుంబ తగాదాపై పంచాయితీ నిర్వహించారు. అప్పటినుంచి ఆమెను కొట్టకుండా మంచిగా చూసుకుంటానని చెప్పి గాంధీబాబు భార్యను తమ ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, అదనపు కట్నం తీసుకురాలని వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు కలిసి శ్రీసాయిలహరిని కొట్టి హత్యచేసేందుకు యత్నించారు. ఆమె తప్పించుకుని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తండ్రి లాలునాయక్, అన్న ప్రదీప్కు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. వారిద్దరూ వచ్చి మాట్లాడుతుండగానే గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు.. ప్రదీప్, లాలునాయక్పై దాడిచేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లాలునాయక్ను చికిత్స నిమిత్తం కుమార్తె శ్రీసాయిలహరి, కుమారుడు ప్రదీప్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. తన తండ్రి మృతికి కారణమైన గాంధీబాబు, అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. -
రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా
బీజింగ్ : రూ.1,404 కోట్ల అవినీతి , లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసు చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దోషిగా తేలిని సీనియర్ బ్యాంకర్ను ఉరి శిక్షను అమలు చేసింది.సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన తర్వాత టియాంజిన్లో మరణశిక్ష అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. బాయి టియాన్హుయ్ వేలకోట్ల అక్రమాలు, దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటి పాపులర్ ఈ కేసు చైనాలో , అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది.చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయి టియాన్హుయ్ 1.1 బిలియన్ యువాన్లకు(దాదాపు రూ.1,404 కోట్లు) పైగా చట్టవిరుద్ధమైన చెల్లింపులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత చైనా అతణ్ని ఉరితీసింది . ఆర్థిక సంస్థలు మరియు రాష్ట్ర-సంబంధిత సంస్థలలో అవినీతికి వ్యతిరేకంగా బీజింగ్ కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా ఈ శిక్షను అమలు చేసింది.చైనా గతంలో ప్రధాన కేసుల్లో శిక్షను అమలు చేసినప్పటికీ, అవినీతి కేసుల్లో మరణశిక్షలు అరుదనే చెప్పాలి.చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్గా పనిచేసిన లై షియోమిన్ 1.79 బిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు దోషిగా తేలిన తర్వాత 2021లో ఉరితీశారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన నేపథ్యంలో టియాంజిన్లో బాయి టియాన్హుయ్ మరణశిక్ష అమలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అక్రమ డబ్బు పరిమాణం , దేశంలోని ప్రధాన ఆర్థిక సమూహాలలో ఒకదానిలో బాయి ఒకప్పుడు కలిగి ఉన్న స్థానం కారణంగా ఈ కేసు చైనాలో మరియు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. టియాంజిన్ సెకండ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు తొలుత బాయికి 2024 మేలో మరణశిక్ష విధించింది. అతని వ్యక్తిగత ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. బాయి టియాన్హుయ్ అందుకున్న లంచాల మొత్తం , నేరాల స్థాయి చాలా తీవ్రమైనవిగా కోర్టు పరిగణించింది. బాయి ప్రవర్తన దేశప్రయోజనాలను దెబ్బతీయడం తోపాటు, ప్రజలకు హాని కలిగించిందని, చట్టం ప్రకారం అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది.సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఈ పరిశోధనలను ఆమోదించింది సాక్ష్యాలు స్పష్టంగా, నిర్ణయాత్మకంగా ఉన్నాయని అతనికి ఈ శిక్ష "తగినది" అని పేర్కొంది. SCMP ప్రకారం, బాయి 2014 - 2018 మధ్య చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్గాపనిచేశారు. ఆ కాలంలో, అతను ఫైనాన్సింగ్ ఏర్పాట్లు మరియు ప్రాజెక్ట్ సంబంధిత లావాదేవీల ఆమోదం కోసం అక్రమాలకు పాల్పడ్డాడు. ఇది చివరికి 1.1 బిలియన్ యువాన్లకు (రూ. 1,404 కోట్లు) పైగా అక్రమ లాభార్జనకుదారితీసింది. -
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్కు షాక్, 14 ఏళ్ల జైలు
పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు, సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్ దుర్వినియోగం చేశారని సైనిక కోర్టు విశ్వసించింది. కోర్టు ప్రతి అభియోగంపై హమీద్ను దోషిగా నిర్ధారించింది. దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణFGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు -
యూఎస్, యూకే కస్టమర్లే టార్గెట్ : రూ. 14 కోట్లకు ముంచేశారు
బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ వైట్ఫీల్డ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కింగ్పిన్లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అమెరికా, యూకేలలో 2022 నుండి ఈ దందా కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.ఆగస్టు నుండి ఈ ముఠా అమెరికా, యూకేలలో కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్కాయిన్ ATMలలో దాదాపు పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉన్నామని ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను' ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు. ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు , సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు. ఇదీ చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులుమస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్లాగానే ఉంటాయి. కనిపించకుండా ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు మెసేజ్ పాప్ అప్ అవుతుంది. నకిలీ హెల్ప్లైన్ నంబర్కూడా డిస్ప్లే అవుతుందని దర్యాప్తు అధికారులు వివరించారు.బాధితులు ఆ నంబర్కు కాల్ చేసినప్పుడు, వారి కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుమస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్వాక్ కోచ్గా మారి.. అనేక మంది మోడల్స్కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్పేటలో కిరాతకం -
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్క్లబ్లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్ను భారత్కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లోయలో పడ్డ బస్సు.. 18 మంది కూలీల దుర్మరణం
అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు వెయ్యి అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విషయం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద సోమవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్-చాక్లా మధ్య 40 నెంబర్ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి.. రెండు రోజుల తర్వాత లోయ నుంచి బయటకు వచ్చి సమీపంలోని ‘బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్స్’ (బీఆర్టీఎఫ్) లేబర్ క్యాంప్నకు చేరుకున్నాడు. మృత్యుంజయుడైన ఆ వ్యక్తిని బుధేశ్వర్ దీప్గా నిర్ధారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసింది. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. తీన్సుకియా నుంచి 22 మంది టీ ఎస్టేట్ పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. A truck carrying 22 labourers reportedly fell into a deep gorge between Hayuliang and Chakla, in the remote Chaglagam circle under Anjaw district. A rescue operation is currently underway, and efforts are on to contact authorities to know more about the incident. pic.twitter.com/rPGLnVvVXP— DD News Arunachal (@DDNewsArunachal) December 11, 2025 -
ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్లో గోరఖపూర్లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. బేలియాపర్లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి సాగనంపారు. సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు. కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్ నోటీసు పంపింది.డిసెంబర్ 3న బేలియాపర్లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి. వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని, "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్ఓ మహేష్ చౌబే వెల్లడించారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే.. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రభాకర్రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్రావు అరెస్ట్తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది. ప్రణీత్రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది. -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
మరదల్ని ఎందుకు చంపాడంటే!
బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్నగర్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్కు మద్యం అలవాటు ఉంది. తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కూతురుని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి.?
పటాన్చెరు టౌన్: ప్రేమ వ్యవహారం బీటెక్ బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది. మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాట్తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి (19) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటున్నాడు.పటాన్చెరు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సృజన లక్ష్మీసాయి మెడోస్లో ఉండే యువతితో ఇతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించలేదు. దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకంటూ మంగళవారం అమ్మాయితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. మాటామాటా పెరిగి..ప్రేమ విషయమై యువతి తల్లి సిరి, సాయి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తురాలైన సిరి క్రికెట్ బ్యాట్తో సాయిని, కూతురిని కొట్టింది. తల, వీపుపై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు. కుమార్తె చేయి విరిగింది. దీంతో తల్లి, సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం వేకువజామున ఇంటికి రాగా.. అప్పటికీ ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న సాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. సాయి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వివరించారు. -
సందేశ్ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్ను మెరుగైన చికిత్స కోసం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం కోల్కతాలోని ఎస్ఎస్కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
పటాన్ చెరులో పరువు హత్య!
సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పెళ్లి చేస్తామని నమ్మించి పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్పై దాడి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.పోలీసుల దర్యాప్తు ప్రారంభంసమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు ఆగ్రహం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్!
ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్ సిబ్బంది చేసిన నిర్వాకమే.పోలీస్ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మల్హర్గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.సోహన్ అనే ఇంటర్ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్గఢ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్ 5వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్ లేదు. చేజింగ్ లేదు. ఎలాంటి సీజ్లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్ఐఆర్లో అతని అరెస్ట్కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.డిసెంబర్ 9వ తేదీన మాందసౌర్ జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్ను బస్సులోనే సివిల్ డ్రెస్లో ఉన్న పీఎస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్ మొదలు ఏదీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్ వ్యవస్థలో హాట్ టాపిక్గా మారింది.నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో మానిఫులేషన్ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025 -
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తనే హత్య చేయించిందో భార్య. ఈ కేసులో ఆమెతో పాటు నలుగురిని హోసూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని పార్వతీనగర్కు చెందిన శరవణన్ (25). భార్య ముత్తులక్ష్మి(21). గత నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మరొకరితో ప్రేమాయణం ఇంతలో ముత్తులక్ష్మి అదే ప్రాంతానికి చెందిన సూర్య (23)తో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరవణన్ భార్యను నిలదీయడంతో వారి మధ్య తరచూ గొడవలేర్పడుతుండేది. గత కొద్ది రోజుల క్రితం ముత్తులక్ష్మి ఇద్దరు పిల్లలను భర్త ఇంట్లో వదిలి సూర్యతో వెళ్లిపోయింది. బంధువులు ఆమెకు నచ్చజెప్పి భర్త వద్దకు చేర్చారు. కానీ ఇద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ సమయంలో ఆమె తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది.రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సూర్య, మరో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. నిద్రిస్తున్న శరవణన్ను ముత్తులక్ష్మి సహకారంతో కత్తులతో పొడిచి హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై శరవణన్ తల్లి మంగమ్మ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భార్య ముత్తులక్ష్మి, ప్రియుడు సూర్య, సంతోష్ శక్తిలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వీరబల్లి : సోమవరం పంచాయతీలోని సోమవరం వడ్డిపల్లిలో దీపిక (16) అనే మైనర్ బాలిక అనుమానాసపద స్థితిలో మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక తల్లిదండ్రులు రెండు నెలల నుంచి సోమవరం వడ్డిపల్లిలో నాగేంద్ర అనే యజమాని దగ్గర ఎనుములు మేపుతూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న రేకుల గదిలో అనుమానాస్పద స్థితిలో దీపిక మృతి చెందింది. బాలిక తల్లి లక్ష్మీదేవిది కోడూరు నియోజకవర్గంలోని సిద్దారెడ్డిగారిపల్లి కాగా ఈమె మొదట వివాహం చేసుకున్న భర్తను వదిలేసి వీరబల్లి మండలం, సోమవరం వడ్డిపల్లికి చెందిన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. వీరు ఎనుములు మేపుకుంటూ ఉండేవారు. నెల క్రితం సొంత ఊరికి వెళ్లి మొదటి భర్త దగ్గర ఉన్న దీపికను తీసుకు లక్ష్మిదేవి వడ్డిపల్లికి వచ్చింది. ఇంతలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Hyd: కామాటిపురాలో దారుణ హత్య
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపురా పీఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్పై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పాతగొడవలు, వివాహేతర సంబంధం హత్యకు కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అరవింద్ ఘోస్లే , బియ్యం షాప్లో పని చేస్తున్నాడు.. కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్టరీకి తరలించారు..కాగా, నగరంలో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతకుముందు రెండు రోజుల క్రితం హైదరాబాద్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర గురయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. మల్కాజ్గిరిలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్పేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య
బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు. వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్పై బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్షోర్ ఛానెల్లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
కూలిన ట్రైనీ విమానం : తప్పిన ఘోర ప్రమాదం
ఒక పక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్ లోని సియోనీలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థకు చెందిన ట్రైనీ విమానం తన చివరి దశలో నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సోమవారం సాయంత్రం సుక్తారా గ్రామంలోని ఎయిర్స్ట్రిప్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లఖన్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమ్గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండింగ్ సమయంలో, 33 KV హై-వోల్టేజ్ లైన్కు చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ అకస్మాత్తుగా వైఫ్యలం కారణంగా పైలట్ అమ్గావ్ సమీపంలోని ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద శబ్దంతో పొలంలో కూలిపోయింది. శబ్దం విన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. విమానం కాక్పిట్ నుండి ఇద్దరు పైలట్లను రక్షించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సుమారు 90 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరాను పనరుద్ధరించారు.ఇద్దరు పైలట్లు ప్రైవేట్ ఆసుపత్రిలోఈ ప్రమాదంలో, పైలట్ అజిత్ , ట్రైనీ అశోక్ చావా తల మరియు ముక్కుకు గాయాలయ్యాయి. ఇద్దరినీ బారాపత్తర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. రెడ్ బర్డ్ ఏవియేషన్ కంపెనీ నాగ్పూర్ రోడ్డులో ఉన్న సుక్తారా గ్రామంలో ఒక ఎయిర్స్ట్రిప్ను లీజుకు తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ పైలట్ శిక్షణ అందిస్తుంది.గతంలోనూ ప్రమాదంవిమానయాన కేంద్రం వద్ద భద్రతా ప్రమాణాలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో శిక్షణా విమానాలు రన్వేపై రెండుసార్లు బోల్తా పడ్డాయనీ కానీ కంపెనీ, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆరోపించారు. -
హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు
మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్కు చెందిన జోంద్లే సంతోష్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్నగర్కు చెందిన నాగేశ్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్లో టీ స్టాల్ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్ పక్కనే ఉన్న రాడ్తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుండెపోటు కాదు.. ఆత్మహత్యే
కొండాపూర్(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని గీతానగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్ మండలం మద్వార్కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు
రాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. రాయికల్ మండలంలోని పీపడ్పల్లికి చెందిన రాజు (35) చురుకైన కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు.బిడ్డా.. పొలం అమ్ముకో.. ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటంతో సరైన నిద్ర లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద ,మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకిరణ్ తెలిపారు.గ్రామంలో విషాద ఛాయలు మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం. నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. -
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
పాతికేళ్ల నాటి పగ!
సాక్షి, సిటీబ్యూరో/జవహర్నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్నగర్ పోలీసులకు అప్పగించారు. అప్పట్లో డాన్గా వ్యవహరించిన సుదేశ్ సింగ్... నగరంలోని మంగళ్హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్గా చెలామణి అయ్యాడు. మంగళ్హాట్, ధూల్పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్్కఫోర్స్లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు. వెంకటరత్నంనే ఇన్ఫార్మర్గా అనుమానించి... ఈ ఎన్కౌంటర్తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్కు డ్రైవర్గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి... చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.కాపుకాసి దారుణంగా హత్య చేసి..నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్టీం, డాగ్స్వాడ్లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. -
తల్లిదండ్రుల ఎదుటే గొంతు కోసి ఘాతుకం
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు. సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
మద్యం తాగి బీభత్సం, మహిళ మృతి, బెయిల్కి రూ.11 కోట్లు
కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన యవకుడు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో అతివేగంతో లగ్జరీ కారు టెస్లా కారును నడిపి ఒక మహిళ మృతికి కారణ మయ్యాడు. అతనిపై పోలీసులు కేసునమోదు చేశారు. డిటెన్షన్ సెంటర్కు తరలించిన అతని బెయిల్ ఫీజు రూ. 10.81కోట్లు( 1.2 మిలియన్ డాలర్లు) గా నిర్ణయించారు.కాలిఫోర్నియాలో 240 కిలోమీటర్ల వేగంతో టెస్లాతో ఎస్యూవీని ఢీకొట్టాడు నిందితుడు 28 ఏళ్ల వ్యక్తి బాదల్ ధోలారియా .శనివారం (నవంబర్ 29) ప్రమాదం జరిగినప్పుడునిందితుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. టెస్లా మోడల్ 3ని కారుతో, ఫోర్డ్ బ్రోంకో అనే ఎస్యూవీలో ప్రయాణిస్తున్న 41 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలు అలిక్స్ మారి స్పార్క్స్ ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. దీంతో అతనపై సెకండ్ డిగ్రీ హత్య మరియు ఇతర నేరారోపణలు మోపబడ్డాయి.డోలారియా అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఫోర్డ్ బ్రోంకో వెనుక నుంచి ఢీకొట్టాడని శాన్ రామన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డోలారియా కస్టడీలో ఉండగా అతని బెయిల్ కోసం ఏకంగా 1.2 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించారు. అంతేకాదు "మీరు బలహీనంగా ఉంటే, డ్రైవ్ చేయవద్దు. మీరు జీవితాలతో జూదం ఆడుతున్నారు. మద్యం, గంజాయి, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు లాంటి వాహనాన్ని సురక్షితంగా నడపగల మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఏదైనా పదార్థం మన రోడ్లపై మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది." దీన్ని సహించ బోము అని కాంట్రా కోస్టా కౌంటీ జిల్లా న్యాయవాది డయానా బెక్టన్ తీవ్రంగా హెచ్చరించారు.ఇదీ చదవండి: IndiGo Crisis: హద్దే లేదు రారమ్మంటున్న ఎయిరిండియా -
ముషీరాబాద్ డివిజన్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్ డివిజన్లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బౌద్ధనగర్ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..మేనబావ పనే..!పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన స్థలంలో ఉమాశంకర్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, ఢిల్లీ: రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు. -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
HYD: రియల్టర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మల్కాజ్గిరిలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్పేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
అయ్యో పాపం! పుట్టిన వారానికే అనాథైన శిశువు
శ్రీనివాసపురం: పుట్టిన వారానికే పసిగుడ్డు అనాథ అయిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగింది. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా(22), రెహమాన్(28) స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు. పక్కనే పురుగుల మందు సీసా ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
ఖరీదైన ఫోను కోసం గొడవ.. బోరు బావిలో దూకి టీనేజర్ ఆత్మహత్య
కచ్: సెల్ ఫోన్ విషయమై తండ్రితో గొడవపడిన ఓ టీనేజర్ బోరుబావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్ తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్కు చెందిన ఓ కుటుంబం కుక్మా గ్రామంలోని ఫాంహౌస్లో ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రుస్తొమ్ షేక్(17) శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖరీదైన సెల్ఫోన్ విషయంపై తండ్రితో గొడవపడ్డాడు. చేతిలోని సెల్ఫోన్ను విసిరి పారేసి, దగ్గర్లో ఉన్న పడావు పడిన బోరు బావి వద్దకు చేరుకున్నాడు. దానిపైన అడ్డుపెట్టిన బండరాయిని తొలగించి అమాంతం లోపలికి దూకాడు. భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో, అడుగున్నర వెడల్పున్న ఆ బావి లోతు 140 అడుగులు. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరి అందక రుస్తొమ్ కేకలు వేస్తుండటంతో లోపలికి ఆక్సిజన్ను పైపుల ద్వారా పంపించారు. వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతడిని అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో వెలుపలికి తీయగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!
హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్కుమార్ హరీష్కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
మిత్రుల కళ్ల ముందే.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్మెట్లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది. దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్ను రప్పించిన మిత్రులు రవిశంకర్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కాంగ్రెస్ నేత హత్య
బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు. -
అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికి రాడు..!
బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది. -
చంద్రబాబు ప్రభుత్వంలో.. రెచ్చిపోతున్న మృగాళ్లు
ధర్మవరం పట్టణంలో వరుసకు మేనమామ కావాల్సిన ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ గర్భం దాల్చడంతో అసలు విషయం బయట పడింది. తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాకే నరసింహ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో వరుసకు పెద్దనాన్న అయిన 60 ఏళ్ల వృద్ధుడు మద్యం మత్తులో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యతి్నంచాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉండాలన్నా .. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా తిరిగి వచ్చే వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటంతో అల్లరిమూకలు రాజ్యమేలుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో 70 శాతం మంది మద్యం మత్తులోనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 120కి పైగా పోక్సో కేసులు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో వీధి వీధిగా బెల్టు షాపులు వెలిశాయి. రాత్రింబవళ్లూ మద్యం అందుబాటులో ఉంటోంది. ఫూటుగా సేవించిన తర్వాత మత్తులో సైకోలుగా మారి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు నుంచి పండు ముసలి వరకూ బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో అత్యాచార ఘటనలు దాదాపు 200 పైగా జరిగాయి. అలాగే 120 పైగా పోక్సో కేసులు నమోదు కావడంతో మహిళల రక్షణ ప్రశ్నార్థంగా మారింది. ఇక.. బయటికి రాని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యం.. బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. బయట ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగడం.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఏం జరగలేదు కదా’ అని కేసు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేసులు నమోదు చేస్తే ‘మీకే నష్టం’ అంటూ బాధితులతో చెబుతుండటంతో వారికేం చేయాలో కూడా పాలుపోవడం లేదు. దీనికి తోడు నిందితులు సైతం బెదిరింపులకు దిగుతుండటంతో నమోదు కాని కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. వీడియోల పేరుతో బెదిరింపులు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత పదే పదే బెదిరిస్తూ.. సదరు మహిళలపై సామూహికంగా వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తూ గ్యాంగ్ రేప్లకు పాల్పడుతుండటం సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో రోడ్డు పక్కన ఇంట్లోకి చొరబడి గ్యాంగ్రేప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగు చూస్తుండటం గమనార్హం.మహిళలకు రక్షణ కరువైంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైంది. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లాలో కూడా ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఆమె దగ్గర పని చేస్తున్న అనుచరులు సైతం వేధింపులకు గురి చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
విద్యార్థినికి అధ్యాపకుడి లైంగిక వేధింపులు
తిరుపతి సిటీ: విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థినికి వర్సిటీ అధికారులు టీసీ ఇచ్చేసి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తోన్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై వర్సిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
భార్య, బిడ్డను కడతేర్చిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యతో పాటు ఏడు నెలల చిన్నారిని కాలువలోకి నెట్టి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్కు, నాదెండ్లకు చెందిన త్రివేణికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడు నెలల వయసుగల కుమారుడు శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్గా పనిచేస్తున్నాడు.త్రివేణి గతంలో నర్స్గా పనిచేసేది. వివాహం అనంతరం ఇంటికే పరిమితమైంది. శరత్కు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం వైద్యం కోసం దంపతులు నరసరావుపేట తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి, శరత్ను బంధువులు ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి, శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10.30గంటల సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎదురుగా వచి్చన కారు లైటింగ్కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి, శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య, బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, కాలవలో గల్లంతైన శరత్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? శ్రీకాంత్కు తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరూ ఘర్షణ పడినట్టు సమాచారం. కొత్తపల్లికి ద్విచ్రవాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడిచేయడంతో పాటు, ఏడు నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు. -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ.. బడా మోసం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికారు. వారి మాటలకు ఆ కుటుంబం ఆశపడింది. అయితే ఏడు లక్షలు ఇస్తేనే ఆ గుప్త నిధులను వెలికి తీస్తామని మోసగాళ్లు వారికి చెప్పారు. దాంతో వారి మాటలను నమ్మి బాధితులు ఏడు లక్షలు ముట్ట జెప్పారు. అనంతరం రోజులు గడుస్తున్నా గుప్త నిధులు బయటకు తీయకపోవడంతో వారు మోసపోయినట్టు బాధితులు గ్రహించారు. నిందితులు అప్పటికే పరారైనట్టు సమాచారం.వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు మోసగాళ్లపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. -
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
గంజాయి కేసులు పెడతామని బెదిరించారు
విజయవాడ లీగల్: పోలీసులు తనను అరెస్టుచేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించకుండా అరెస్టుచేశారని కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఎ–9 నిందితుడు యర్రంశెట్టి రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు చేశారు. హైవేల మీద ఏలూరు, భీమడోలు వంటి ప్రాంతాల్లో తిప్పారని.. ఒక హోటల్లో బంధించి, అర్ధరాత్రి 11 గంటల తర్వాత కళ్లకు గంతలు కట్టి అక్కడ నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనను ఓ గదిలో బంధించి, కనీసం భోజనం, మంచినీరు కూడా ఇవ్వకుండా హింసించారని ఆయన చెప్పారు. గంజాయి కేసుతోపాటు అనేక కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని బలవంతంగా కొన్ని కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని రామాంజనేయులు ఆరోపించారు. అయితే, శుక్రవారం ఉ.11 గంటలకల్లా న్యాయస్థానంలో హాజరుపరచాల్సి ఉండగా, సా.3 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు ఆయన తరఫు న్యాయవాది సత్యశ్రీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రామాంజనేయులును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణాధికారి ఏసీపీ దామోదర్ నుండి వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి పి. భాస్కరరావు ఆదేశాలు జారీచేస్తూ, రామాంజనేయులును ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.బలవంతంగా తీసుకెళ్లారు: మరోవైపు.. రామాంజనేయులును గురువారం ఉ.11 గంటలకు కేసరపల్లిలోని ఆయన నివాసానికి కొందరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, కేసు విచారణ నిమిత్తం రావాల్సిందిగా అతనిని ఓ ప్రైవేటు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, వచ్చిన వారి సమాచారం తమకు ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో పట్టుకెళ్లారని వారు చెప్పారు. -
లాడ్జిలో తల్లీకొడుకుల ఆత్మహత్య
సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి.. నగరంలోని గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) శుక్రవారం అడవివరం వచ్చారు. వారు స్థానిక పోస్టాఫీసు వీధిలోని సిరిచందన కల్యాణమండపం అనుబంధ గదుల్లో(లాడ్జి) ఒకటి అద్దెకు తీసుకున్నారు. వారు గదిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ సీఐ ఎల్.ఎస్.నాయుడు, సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. తల్లీకొడుకులు ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్కు చెందినవారని, వారిని తల్లీకొడుకులుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గయప్పాంజన్ టీసీఎస్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2023లో నాంపల్లి స్టేషన్లో గయప్పాంజన్పై కేసు పెట్టింది. -
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లు అని పోలీసులు ప్రకటించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మృతులు వీళ్లే.. 1) వంగర రామక్రిష్ణ(51) కొరప కొత్తవలస2)మార్పిన అప్పలనాయుడు(33) కొరప కొత్తవలస 3)మరాడ రాము(50) కోరప కొత్తవలస4)బండారు చంద్ర రావు(35) మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలంమృతుల కుటుంబాలకు తమిళనాడు పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. పోస్ట్మార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పోలీసుల చేతికి చిక్కిన హవాలా ముఠా.. రూ. 4 కోట్లు స్వాధీనం
హైదరాబాద్: హవాలా ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠాలోనిఇద్దరు సభ్యులను పోలీసులు గురువారం(డిసెంబర్ 5వ తేదీ) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి(30), ప్రజ్ఞేశ్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 కోట్లకు పైగా నగదును ప్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ మీడియా సమావేశంలో హవాలా నిందితుల్ని అరెస్ట్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. గతేడాది డిసంబర్ 7వ తేదీన నాగోల్కు చెందిన వి విశ్వనాథ్ చారీ అనే వ్యక్తి .. తన స్నేహితులతో కలిసి రూ. 50 లక్షలను మోసపోయినట్లు బోయినపల్లి పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. క్యాష్ను ఆర్టీజీఎస్లో మార్చతామని వారు నమ్మబలికి విశ్వనాథ్ చారీని మోసం చేశారు హవాలా కేటుగాళ్లు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎట్టకేలకు హవాలా ముఠా సభ్యుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేసి భారీ మొత్తాన్ని రికవరీ చేశారు. నిందితులిద్దరూ గుజరాత్కు చెందిన వారే. వీరు నగదును మార్చడాన్ని వ్యాపారంగా చేసుకుని ఇలా మోసాలకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ చారీ, ఆయన స్నేహితుల్ని బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు దోచుకున్నారు. అయితే వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. హుండాయ్ క్రెటా కారులో వెళుతున్న సమయంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న టీమ్ను నార్త్జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ అభినందించారు. తాము దోచుకున్న నగదు రూ. 4.05 కోట్లను నాగ్పూర్ నుండి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడంలో తన ప్రమేయం ఉందని ప్రకాష్ ప్రజాపతి విచారణలో అంగీకరించాడు. -
పెళ్లిలో రసగుల్లా గోల : పిడిగుద్దులతో మల్లయుద్ధమే వైరల్ వీడియో
బిహార్లోని బోధ్ గయలో జరిగిన వింత ఘటన నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి విందులో వడ్డించిన స్వీట్ సరిపోకపోవడం దుమారం రేగింది. వధూవరుల కుటుంబ సభ్యుల వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద యుద్ధమే జరిగింది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది. అసలు ఏం జరిగిందంటే..ఒక వివాహం సందర్బంగా జరిగిన పెళ్లి విందులో రసగుల్లా కొరత వచ్చింది. దీంతో వధువు, వరుడి కుటుంబాలు ఘర్షణకు దిగడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలూ విచక్షణ మర్చిపోయి కొట్టుకున్నారు. నెట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. ఈ దృశ్యాలు వివాహం జరుగుతున్న హోటల్లోని సీసీటీవీలో రికార్డైనాయి. A chaotic scene unfolded in a wedding in #Bihar's #BodhGaya after the bride and the groom's families exchanged blows over a shortage of rasgulla.The incident was caught on CCTV installed inside the hotel where the wedding was taking place, and the video surfaced online.… pic.twitter.com/As6vU9WXSZ— Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2025 ఈ సంఘటన నవంబర్ 29న జరిగింది. పెళ్లి వేడుక కోసం వధూవరుల కుటుంబాలు ఒకే హోటల్లో బస చేశాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల తరువాత పెళ్లి మంటపానికి వెడుతుండగా వివాదం మొదలైంది. అది తీవ్రమై కొట్టుకునే దాకా వచ్చింది. రసగుల్లా కొరత కారణంగా జరిగిన గొడవ కారణంగా వివాహం రద్దయింది. తరువాత వధువు కుటుంబం వరుడి తరపు వారిపై వరకట్న కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా, ఒక గ్రూపు గొడవకు దిగి, కుర్చీలు, ప్లేట్లతో దాడికి దిగారు. దీంతో రెండు వైపుల నుండి చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ బుధవారం రసగుల్లా లేకపోవడం వల్ల గొడవ జరిగిందని ధృవీకరించారు. వరుడి కుటుంబం వివాహాన్ని కొనసాగించడానికి అంగీకరించగా, వధువు కుటుంబం ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంది.వరుడి తల్లి మున్నీ దేవి, గొడవ జరుగుతుండగా, వధువు కుటుంబం తాను బహుమతిగా తెచ్చిన ఆభరణాలను తీసుకుందని ఆరోపించింది. హోటల్ బుకింగ్ కూడా తామే చేశామని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం జరగాలని వధువు కుటుంబంతో సర్ది చెప్పాలని ప్రయత్నించాం. కానీ ఫలించలేదని వరుడి బంధువు సుశీల్ కుమార్ తెలిపారు. మొత్తానికి సర్దుకుపోవాల్సిన స్వల్ప విషయానికి ఒక శుభకార్యం ఆగిపోయింది. పంతాలు, పట్టింపులతో ఇరువైపు అవమానాలు, ఆర్థిక నష్టం తప్ప మరేమీ మిగల్లేదు. ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
అవినీతి తిమింగలం.. ఏడీ శ్రీనివాసులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొంత శ్రీనివాసులును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమార్జనకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూములు, నగదు, కార్లు, ప్లాట్లను గుర్తించారు. అందుకు సంబంధించిన లెక్కల్ని చూపడంలో శ్రీనివాసులు విఫలం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అనంతరం అరెస్టు చేశారు.వివరాల ప్రకారం.. శ్రీనివాసులు కూడబెట్టిన అక్రమాస్తులను అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా కమ్యూనిటీలో ఉంటున్న శ్రీనివాసులు ఇంటితో పాటు హైదరాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని అతని సన్నిహితులు, బినామీలు, బంధువుల ఇళ్లలో మొత్తం ఏడు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.అనంతరం, అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయనకు రాయదుర్గంలో ఒక ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11, మహబూబ్నగర్లో 4, నారాయణపేటలో 3 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్బంగా 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, రెండు కార్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి.ఇదిలా ఉండగా.. శ్రీనివాసులు తన సర్వీసులో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. తొలుత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పని చేసిన శ్రీనివాసులు, అదే జిల్లాలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా వ్యవహరించారు. సర్వే విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పని చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూనే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సైతం ఇన్ఛార్జిగా ఉన్నారు. సర్వే నంబర్లను మార్చి చూపడం, తప్పుడు సర్వే నివేదికలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడం ద్వారా శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు గతంలో హైడ్రాకు తప్పుడు సమాచారమిచ్చారని ఇతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదై ఉంది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట స్థలాన్ని ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టేందుకు శ్రీనివాసులు కొందరికి సహకరించినట్లు గతేడాది హైడ్రాకు ఫిర్యాదు అందింది. -
ఏలూరులో అమానుషం
ఏలూరు టౌన్: ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని వారి ఇంటి తలుపులు, కిటికీలు బాదుతూ ఇద్దరు రౌడీషీటర్లు భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం వారిలో ఒక యువతిని ఓ రౌడీషీటర్ కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువతులనూ రౌడీషీటర్లు బెల్టుతో దారుణంగా కొట్టినట్లు తెలిసింది. తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి.. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి (23) తండ్రి మరణించగా.. ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చేసింది.ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న రాత్రివేళ వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నగరంలోని కొత్తపేటకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ యువతులు ఉంటున్న ఇంటి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లిన ఒక రౌడీషీటర్ సమీపంలోని సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.ఆ తర్వాత యువతులిద్దరినీ బెదిరించి వెళ్లిపోయిన ఆ ఇద్దరు రౌడీషీటర్లు.. మరో గంట తర్వాత స్నేహితులతో వచ్చి యువతులను మళ్లీ బెల్టులతో ఇష్టమొచ్చినట్లు కొట్టి బెదిరించి వెళ్లారు. దీంతో బాధితులిద్దరూ నగరంలోని ఒక పోలీస్స్టేషన్కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. అయితే, పోలీసు ఉన్నతాధికారులకు ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో అత్యాచార బాధితురాలిని ఓ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అలాగే, హడావుడిగా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను పోలీసులు చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మీడియాకు సైతం తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. -
గురుకుల విద్యార్థిని కిడ్నాప్ కలకలం
అమలాపురం టౌన్/ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శివారు ఠాణేలంకలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, మరుసటిరోజు వదిలేయడం కలకలం సృష్టించింది. ఆ బాలికను తీసుకెళ్లిన యువకుడు టీడీపీ కార్యకర్త, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు అనుచరుడు. బాలిక బంధువుల కథనం ప్రకారం.. జిల్లాలోని కాట్రేనికోన మండలానికి చెందిన బాలిక ఈ పాఠశాలలో చదువుకుంటోంది. పల్లంకుర్రు శివారు వఢ్డివారిపేటకు చెందిన టీడీపీ కార్యకర్త మోకా గిరిబాబు బుధవారం ఆ పాఠశాల వసతి గృహానికి వెళ్లి బాలిక నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని, బాలికను తనవెంట పంపించాలని కోరాడు. దీనికి అక్కడి సిబ్బంది నిరాకరించారు.మరికొంతసేపటికి ఆ బాలిక మేనమామ భార్యనని చెప్పి ఓ మహిళ వసతి గృహానికి వచ్చి బాలికను తీసుకెళ్లింది. బుధవారం సాయంత్రం వరకు ఆ బాలిక తిరిగి పాఠశాలకు చేరలేదు. దీంతో ప్రిన్సిపాల్ డి.శారద బాలిక నాయనమ్మకు ఫోన్ చేశారు. మనవరాలి కోసం తాను ఎవరినీ పంపించలేదని, బాలిక ఇంటికి రాలేదని ఆమె చెప్పడంతో ప్రిన్సిపాల్ శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్, ఎస్ఐ డి.జ్వాలాసాగర్ బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలికను కిడ్నాప్ చేసింది మోకా గిరిబాబు అని, అతడి మరదలు అర్చన సహకరించిందని గుర్తించారు.ఎమ్మెల్యే సుబ్బరాజుతో నిందితుడు గిరిబాబు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నిందితుడు ఆ బాలికను తీసుకొచ్చి పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. బాలిక నాయనమ్మ, బంధువులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. తాము గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు చెబుతారని, అటువంటిది బయటి వ్యక్తులతో ఎలా పంపించారని ప్రశ్నించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జ్వాలాసాగర్ తెలిపారు. -
మాలిలో ఇద్దరు తెలుగు కార్మికుల కిడ్నాప్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉపాధి కోసం ఆఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన ఇద్దరు యువకులను జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ (జేఎన్ఐఎం) సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్ (23), ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర (25) గతేడాది హైదరాబాద్కు చెందిన ఓ బోర్వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.వారి ఫోన్లను స్వా«దీనం చేసుకొని స్విచ్ఛాప్ చేయడంతో కిడ్నాప్ సమాచారం ఆలస్యంగా భారత ఎంబసీతోపాటు వారి కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పనుల సీజన్ పూర్తయ్యాక వస్తానని కిడ్నాప్నకు ఒకరోజు ముందు తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడని ప్రవీణ్ తండ్రి జంగయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన చెందారు. మరోవైపు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు మాలిలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.తీవ్రవాదుల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఎంబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అల్కాయిదాకు చెందిన జేఎన్ఐఎం.. సహెల్ ప్రాంతంలో (మాలి, నైజర్ మొదలైన దేశాలు) మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆర్థిక యుద్ధం‘వ్యూహంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఆరు నెలల్లో (మే నుంచి అక్టోబర్ వరకు) 22 మంది విదేశీయులను బంధించింది. అందులో కొందరు విడుదలవగా మరికొందరు ఇంకా తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. బందీల విడుదలకు తీవ్రవాదులు ఆర్థిక డిమాండ్లు పెడుతున్నారు. -
వంద కోట్ల అవినీతి తిమింగలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహబూబ్నగర్ క్రైం: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి గురువారం ఏక కాలంలో ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.వంద కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. శ్రీనివాసులు మరో ఏడాదిలో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల్లో రూ.కోట్ల ఆస్తులుశ్రీనివాసులుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలోనూ రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాయదుర్గం మైహోం భూజాలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా నారాయణపేటలో రైస్మిల్, మహబూబ్నగర్లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో మూడు ప్లాట్లు, ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, రూ.ఐదు లక్షల నగదు, కియా, ఇన్నోవా కార్లు దొరికాయి. ఆయన గతంలో నల్లగొండ సహా మేడ్చల్ జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారిగా కూడా పని చేశారు. మేడ్చల్ జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, అప్పట్లోనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. కొంతకాలం సస్పెన్షన్లో ఉండి, ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరారు.తప్పుడు సర్వేలతో అక్రమార్జనశంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ రెవెన్యూల మధ్య ఉన్న వంద ఎకరాల గ్యాప్ లాండ్స్కు 555 సర్వే నంబర్ కేటాయించి, విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలోనూ, ఇబ్రహీంపట్నం ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని 33 ఎకరాల బిలాదాఖల భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నంబర్ 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల సర్కార్ భూమి, శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వే నం. 124/10, 11లోని రూ.రెండు వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాలు, శేరిలింగంపల్లి గ్రామం సర్వే నం. 90, 91 నుంచి 102లోని 110 ఎకరాల అలూమినీ కంపెనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో, సర్వే నం. 68లో ఐదెకరాల ప్రభుత్వ భూమి పట్టాగా మారడంలోనూ, హఫీజ్పేట్ సర్వే నం. 80లోని భూమి, కొండాపూర్ సర్వే నం. 87, 88 ల్లోని భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. అలాగే, వట్టినాగులపల్లి సర్వే నం. 186, 187లో 20 ఎకరాల భూదాన్ భూములు, గండిపేట్ మండలం ఖానాపూర్లోని 150 ఎకరాల బిలా దాఖల భూములకు సర్వే నంబర్ 65 కేటాయించి, ఆయా భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ సర్వే నం. 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక అప్పటి శేరిలింగంపల్లి రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గచ్చిబౌలిలో సర్వే నంబర్లు 38 నుంచి 54 వరకు గల 76 ఎకరాల సీలింగ్ సర్ప్లస్ భూములు, మహేశ్వరం మండలం మహేశ్వరం–తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాల బిలా దాఖల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక కూడా శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
కంటైనర్ను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే ఐదుగురు దుర్మరణం
పల్నాడు, సాక్షి : పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ను వెనుక నుంచి మారుతి షిప్ట్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదు మంది మృతి చెందారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు. 2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యరూ.41 లక్షలు సేకరించి..రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడు. రిజ్వాన్కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్టాప్, ఫోన్లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి. -
ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
కాళ్ల పారాణి ఆరకముందే అత్తింట్లో అల్లుడు..
జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని కల్గించే మహత్తర ఘట్టం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజున వరుడు అత్తవారింటికి తిరిగింపులకు రాగా బాజాభజంత్రీలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. అయితే పెళ్లి కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే వరుడు అత్తింట్లో గుండెపోటుతో మరణించడంతో అటు పెళ్లి కుమార్తె, ఇటు పెళ్లి కుమారుడి ఇళ్లలో తీవ్ర విషాదం, బాధ, కన్నీరు మిగిలాయి.సాక్షి బళ్లారి: పెళ్లయిన మరునాడే నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన విజయనగర జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్(30) అనే యువకుడికి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకొన్న మరుసటి రోజే మృతి చెందడంతో అటు అతని అమ్మమ్మ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. ఈ ఘటనతో పెళ్లి సందడి ఆవిరై కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెళ్లి కుమార్తె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. -
ఒకేసారి అన్నదమ్ములను కాటువేసిన పాము
అనంతపురం: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రాణాపాయ స్థితిలో.. అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో..
సిద్దిపేట జిల్లా (గజ్వేల్): ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18) ఇంటర్మీడియెట్ చదివి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళుతోంది. ఇదిలా ఉండగా శంకర్ కుటుంబీకుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేశ్ అలియాస్ రహీం బాబా వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో శ్రావణికి మహేశ్తో ఏర్పడిన పరిచయం ఒకరినొకరు ఇష్టపడే స్థాయికి చేరింది. కాగా, నవంబర్ 30న మహేశ్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రావణి మానసికంగా కుంగిపోవడాన్ని గమనించిన తండ్రి శంకర్ ఆరా తీయగా మహేశ్ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో శ్రావణి బుధవారం ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆమె తమ్ముడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వెంటనే ఇంటికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. ఈ ఘటనపై శ్రావణి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మత్తెక్కిన ముఠాలు..బానిసలైన విద్యార్థులు!
గంజాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడా మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ముఠా విసురుతున్న వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారిని పెడదారి పట్టిస్తోంది. ఇటీవల పోలీసు టాస్్కఫోర్స్ తనిఖీల్లో ఎక్కువగా విద్యార్థులు పట్టుబడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించామని బాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఏ మండలంలో చూసినా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా టాస్్కఫోర్స్ తనిఖీలు నామమాత్రంగా జరుగుతుండడంతో జిల్లా సరిహద్దులను, జిల్లాకు సమీపంలో ఉన్న మండలాలను కేంద్రంగా చేసుకొని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేటతెల్లం అవుతోంది. టీనేజీ పిల్లలు, మైనర్లు గంజాయికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారారు. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు మాని కార్యాచరణలో పనితనం చూపాలని తలిదండ్రులు, సామాజికవేత్తలు కోరుతున్నారు. గంజాయి మత్తులో విద్యార్థులు... గత వారం నగరంలోని టాస్్కఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి బ్యాచ్ మీద దాడి చేసి పట్టుకున్నారు. అందులో అంజయ్య రోడ్డులోని ఒక ప్రైవేటు హైస్కూకలులో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉండడంతో విస్తుపోయారు. రెండు రోజుల క్రితం మరో బ్యాచ్ గురించి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్్కఫోర్స్ పోలీసులకు కోర్టు సెంటర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్ రాజు గంజాయి వినియోగిస్తున్న బ్యాచ్ పై దాడులకు ఆదేశించారు. ఈ దాడుల్లో నగరంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీ విద్యార్థులు రెండంకెల సంఖ్యలో పట్టుబడ్డారు. నగర శివారుల్లోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో దొరికారు. వీరిలో కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి తొలి తప్పుగా హెచ్చరించి పంపించేశారు. మరి కొందరిని మాత్రం జీజీహెచ్లోని ఎడిక్షన్ సెంటర్కు తరలించి చికిత్స చేయించి పంపించారు. కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం... ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ఆయా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గంజాయి తాగుతున్న వారిని గుర్తించి, వారు మరొకరికి అలవాటు చేయకుండా కాలేజీ యాజమాన్యాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో కాలేజీలు గంజాయి అడ్డాగా మారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, దర్శి పరిసర ప్రాంతాలు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి టౌన్, మర్రిచెట్లపాలెం ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారినట్లు తెలుస్తుంది. జిల్లా సరిహద్దుల్లోని బాపట్ల జిల్లా అద్దంకి, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేసుకొని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలు వన్టౌన్, టూ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలో 10 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం గంజాయి విక్రేతలను మాత్రమే కాకుండా సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల 5 మంది గంజాయి సేవించిన వారిపై కేసు నమోదు చేయడం గమనార్హం. విశాఖ నుంచి రైళ్లలో ... ఒడిశా నుంచి విశాఖ పట్టణం గుండా రైళ్ల ద్వారా గంజాయిని తరలించి ఒంగోలులో విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీల్లో రైళ్లలో గంజాయి పట్టుబడడం ఇటీవల నిత్యకృత్యమై పోయింది. పోలీసులకు పట్టుబడిన గంజాయి కంటే వారి కళ్లు గప్పి రవాణా చేస్తున్న గంజాయే ఎక్కువగా ఉంటోందని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రైళ్లలో తనిఖీలు జరుగుతుండడంతో ఇతర మార్గాల ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆటోలు, ఆర్టీసీ బస్సుల ద్వారా గంజాయిని ఒంగోలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇంటినే గంజాయి డెన్గా మార్చిన విద్యార్థి..టాస్క్ఫోర్స్ తనిఖీల్లో నగరంలో ఒక విద్యార్థి ఇంటినే గంజాయి డెన్గా మార్చుకోవడం చూసి విచారణ అధికారులు నివ్వెరపోయారు. పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించిన సదరు విద్యార్థి తన స్నేహితులకు కూడా గంజాయిని అలవాటు చేసినట్లు చెబుతున్నారు. గంజాయి సేవిస్తున్న విద్యార్థులు కొందరు రాత్రి పూట పార్టీలు చేసుకోవడం, బర్త్ డే పార్టీ పేరుతో గంజాయి తాగడం ఎక్కువై పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు బయట స్నేహితులతో తిరిగి ఏ అపరాత్రో ఇంటికి వచ్చి పగలంతా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయికి అలవాటు పడిన విద్యార్థుల నడవడిక తీవ్రంగా ఉంటోందని, హై స్పీడ్ మోటారు బైకులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నారని, చీటికీ మాటికీ తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఏడిపిస్తున్నారని సమాచారం. మరికొందరు విద్యార్థులు గంజాయి కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక చోరీలు చేయడం, నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పట్టిలింగం కథనం ప్రకారం.. బీజాపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం కేశ్కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడికి (అంబుష్) దిగారు. పోలీసు బలగాలపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. అయితే వారు ఏయే ప్రాంతాలకు చెందిన వారనేది గుర్తించాల్సి ఉంది. బీజాపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు జవాన్లు మోనూ వాడాది (హెడ్ కానిస్టేబుల్), దుకారు గోండే, రమేష్ సోధీ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. సోమ్దేవ్ యాదవ్తో పాటు మరో జవాన్ గాయపడ్డారు. వీరిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా కూంబింగ్ మరింత ముమ్మరం చేసినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. సంఘటనా ప్రాంతం నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్, త్రీనాట్ త్రీ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 275 మంది ఎన్కౌంటర్జిల్లాలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగు తోందని ఐజీ తెలిపారు. తాజా ఎన్కౌంటర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 275 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన ఒక్క బస్తర్ డివిజన్లోనే 246 మంది మరణించారు. -
బొమ్మ బంద్.. ఇక ‘రుచి’ చూపిస్తా !: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: ఐ బొమ్మ, బప్పం పేర్లతో వెబ్సైట్లను ఏర్పాటు చేసి, 21 వేల సినిమాలను పైరసీ చేసిన ఇమ్మంది రవి తన పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలను విక్రయించాలని యోచిస్తున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో రవి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇమ్మంది రవిపై హైదరాబాద్లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. తొలుత ఓ కేసులో అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో ఓసారి కస్టడీకి, మరోసారి అదనపు కస్టడీకి తీసుకున్నారు. ఆపై మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ కోసం పిటిషన్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఈ తంతు పూర్తి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసుల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారి అరెస్టు చేసిన నాటికి, ఇప్పటికి అతడిలో ఎంతో మార్పు కనిపిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. తమకు చిక్కినప్పుడు సినిమా టికెట్ల రేట్లు, హీరోల రెమ్యూనరేషన్ల విషయాలు మాట్లాడి, తన పనిని సమర్థించుకున్నాడని, ప్రస్తుతం పైరసీ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడని అధికారులు తెలిపారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులతో చెప్పాడు. అలాగే తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రి చిన అప్పారావు వద్దకూ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. భార్య నుంచి దూరమైన నాటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఇక్కడ, తండ్రి అక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నాడు. అనారోగ్యంతో, తన తల్లి నుంచి దూరంగా బతుకుతున్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు తెలిపాడు.నేడు కీలక విచారణసినీ పైరసీ కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రెండు విడతలుగా.. ఎనిమిది రోజులుగా పోలీసులు రవిని కస్టోడియల్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు కేసుల్లో విచారణ జరిపేందుకు మరోసారి కస్టడీ కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇవాళ కోర్టు ముందుకు రానుంది. దీని విచారణ తర్వాతే కోర్టు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ను పరిశీలించనుంది. -
రూ.29 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
వైఎస్సార్సీపీ బీసీ నేతపై హత్యాయత్నం
రాయచోటి అర్బన్: వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్పై బుధవారం రాత్రి హత్యాప్రయత్నం జరిగింది. బాధితుడి భార్య విజయలక్ష్మి తెలియజేసిన వివరాల ప్రకారం దాదాపు 10 మంది వ్యక్తులు ఇంటికి వచ్చి గేటు తీయాలని అడిగారు. గేటు తీసిన భాస్కర్పై ఇనుప రాడ్లు, కట్టెలు, ట్యూబ్ లైట్లతో విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు. కాళ్లు పట్టుకున్నా వదలలేదు. తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తరువాత దుండగులు వీడియో, ఫొటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానికుల సహకారంతో గాయపడిన భాస్కర్ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి అనుచరుల పనే..!మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆగ్రహించిన మంత్రి అనుచరులే తనపై దాడి చేసి ఉంటారని విజయభాస్కర్ పేర్కొన్నారు. తనకు రాయచోటిలో వేరే శత్రువులు ఎవరూ లేరని తెలియజేశారు. హేయమైన చర్య: వైఎస్సార్సీపీ విజయభాస్కర్పై దాడిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాపక్షాన మాట్లాడేవారిని గొంతునొక్కాలన్న అరాచక ధోరణి ఇటీవల రాష్ట్రంలో పెరిగిపోయిందన్నారు. గతంలో బీసీ నాయకులైన మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డెయ్య ఇంటిపై దాడి, మల్లూరు రెడ్డి వరప్రసాద్పై దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భాస్కర్పై దాడిచేసిన నిందితులను గుర్తించి 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుకు ఒక మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కాగా భాస్కర్పై దాడి దారుణమని పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి ఒక ప్రకటనలో ఖండించారు. -
కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజ్జీవ జైలు శిక్ష విధిసూ.. పోక్సోకోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీసీ, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ.10 లక్షల 50 వేలు పరిహారం అందించాలని గుంతకల్ ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 19న తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. రాజంపేట-నందలూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక వాష్ రూమ్ వెళ్ళినప్పుడు రాం ప్రసాద్రెడ్డి ఆమెపై లైంగికదాడి చేశాడు.హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఆర్ఎం కార్యాలయం నుంచి కడపకు రిఫర్ చేశారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే టీసీల నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా భావించిన కోర్టు.. నిర్లక్ష్యానికి కారణమైన టీసీ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.హర్యానాలోని పానిపట్లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. జర్మన్ అద్భుత కథ స్నో వైట్లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన హత్యాకాండను ఛేదించారు.తన కంటే అందంగా ఉందనిపానిపట్లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. హత్య ఎలా జరిగిందిసోనిపట్కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు. పెళ్లిలో సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్ కన్నుపడింది. రాక్షసిలా మారిపోయింది.అకస్మాత్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్రూమ్కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్ చేశారు.పిల్లలను చంపే విధానంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన అమ్మాయిలే ఆమెటార్గెట్ అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే చంపినట్లు అంగీకరించింది.2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో -
వేలమంది సమక్షంలో, 13 ఏళ్ల బాలుడితో బహిరంగ మరణశిక్ష
ఆఫ్ఘనిస్థాన్లో బహిరంగ మరణ శిక్షలు, కొరడా దెబ్బలు లాంటి అనాగరిక శిక్షలు సర్వ సాధారణంగా. తాజాగా ఆటవిక న్యాయానికి సంబంధించిన మరో అరాచక సంఘటన ఒకటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖోస్ట్ ప్రావిన్స్లో మంగళవారం తాలిబన్లు తొమ్మిది మంది పిల్లలతో సహా ఒకే కుటుంబంలోని 13 మంది సభ్యులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవ్యక్తికి తాలిబన్లు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. కిక్కిరిసిన స్టేడియంలో ఈ శిక్ష అమలు చేయడం సంచలనం రేపింది.ఈ ఘటనలో తాలిబన్లు వీడియోలు, ఫోటోలను నిషేధించినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. వేలాదిమంది సమక్షంలో మతపరమైన నినాదాల మధ్య, కోస్త్ ప్రావిన్స్లోని స్టేడియంలో 80 వేల మంది చూస్తుండగా శిక్ష అమలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమానవీయం అంటూ తాలిబన్ల చర్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. అలాగే అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు తాలిబన్ల వైఖరిని తప్పుబట్టాయి.అసలు ఏం జరిగింది?తాలిబన్ అధికారులు ఉరితీసిన వ్యక్తిని మంగళ్గా గుర్తించారు. సుమారు పది నెలల క్రితం మంగళ్ స్థానిక నివాసి అబ్దుల్ రెహమాన్తోపాటు, 12 మంది కుటుంబ సభ్యులను చంపినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు. హతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. తాలిబన్ ప్రకారం, ఈ శిక్షను మొదటి దశ, అప్పీల్ కోర్టులు , సుప్రీంకోర్టు సమర్థించాయి. దీంతో మంగళ్కు తాలిబన్లు మరణశిక్షను అమలు చేశారు. ఆఫ్ఘన్ మీడియా నివేదిక ప్రకారం తాలిబన్ల క్విసాస్ (ప్రతీకారం) కింద, నేరస్థుడిని క్షమించే అవకాశాన్ని బాలుడు నిరాకరించాడంతో స్వయంగా బాధితురాలి కొడుకు, తన కుటుంబ సభ్యులను కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు చేత ఈ ఉరిశిక్షను అమలు చేయించారు. The #Taliban have turned #Afghanistan into an exhibition of brutality: yesterday flogging, today a public execution in the Khost stadium. A man was gunned down on the orders of #Hibatullah, in front of hundreds of children and teenagers and most shocking of all, the final shot… pic.twitter.com/cfrlwvWgMR— Golchehrah Yaftali (@womenaidafghan1) December 2, 2025 ఈ అమానవీయ ఘనటపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించింది. ఆఫ్ఘనిస్థాన్లోని మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ఈ చర్యను క్రూరమైన శిక్షగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి వాటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. -
నిండు ప్రాణం తీసిన నింద!
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రులోని యడదిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ (15)పై పక్కింటి వ్యక్తి బొట్టు సాంబశివరావు దొంగతనం నింద మోపాడని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ ఇంట్లో రూ.1500 పోయాయని, అది బాలుడు తీసుకున్నాడని ఆరోపించాడు సాంబశివరావు. ఆ డబ్బును యశ్వంత్ పేరెంట్స్ తిరిగి ఇవ్వబోగా.. సాంబశివరావు నిరాకరించాడు. అయితే తమ ఇంట్లో ఏది పోయినా యశ్వంత్దే బాధ్యత అంటూ మరింతగా బెదిరించాడు. అంతటితో ఆగక తన బంధువైన రిటైర్డ్ ఏఎస్ఐతో ఫోన్ చేయించి బాటుడిపై ఒత్తిడి చేశాడు. సాంబశివరావు బెదిరింపులకు భయపడి, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక యశ్వంత్ మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన యడదిబ్బ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక చిన్నారి ప్రాణం అనవసరమైన నిందలతో ముగియడం స్థానికులను కలచివేసింది. -
తల్లితో వివాహేతర బంధం పెట్టుకొని.. బిడ్డను గర్భవతిని చేసి..
మహబూబాబాద్ జిల్లా: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడు. మళ్లీ ఆ తల్లి సాయంతోనే అబార్షన్ చేయించాడు. ఈ ఘటన ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం వెలుగు చూసింది. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్కు చెందిన సైదులుబాబు స్థానికంగా ఉన్న మరో కాలనీకి చెందిన ఓ వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో రెండు నెలల కిందట తల్లి సహాయంతో బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేయటంతో సఖి కేంద్ర నిర్వాహకులకు విషయం తెలిసింది. బాలికను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక.. తనకు అబార్షన్ చేయించిన విషయం చెప్పడంతో వారు బయ్యారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన సైదులుబాబుపై పోక్సో కేసు నమోదు చేయగా, అబార్షన్కు సహకరించిన బాలిక తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు. -
భార్య కొత్త చీర కట్టిందని కోపంతో భర్త ఏం చేసాడంటే
టేక్మాల్ (మెదక్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చంపి, ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బరి్ధపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (37), మంజుల (35) దంపతుల కుమారుడు ప్రవీణ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో చికిత్స కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించారు. అయితే భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం ఈ ఏడాది దసరా పండుగ సమయంలో సొంత గ్రామమైన బర్దిపూర్కు మకాం మార్చాడు. ఈ విషయమై తరచుగా గొడవపడుతుండగా గత నెల టేక్మాల్ పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. భార్యపై అనుమానంతో శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు. తన భార్యను చంపేస్తానని, తనను తలెత్తుకోలేకుండా చేస్తోందని తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ అమ్మమ్మ ఊరికి వెళ్లడంతో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజుల ముఖంపై దిండు పెట్టి శ్వాసఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దూలానికి తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్ఐ అరవింద్, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ కృష్ణ ఆధారాలను సేకరించారు. -
తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు
సాక్షి,హైదరాబాద్: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్షిట్ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్గా పని చేసేవాడు. అదే అపార్ట్మెంట్లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్మెంట్కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో చెప్పని ఆ ఇరువురూ..ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్ 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి పలువురిని విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.అక్కడ అన్నీ చెప్పిన బాలిక..భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్గా తీసుకున్నారు. ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్ కేసులో పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) సెక్షన్ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.దర్యాప్తునకు సహకరించకున్నా దండనేఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్ఎస్ఎస్లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్ఎస్లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్లోని 19 సెక్షన్ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.– పి.వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ -
Khammam: సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టితో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు 9 ఏళ్ల బాలుడు ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.దీంతో, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న శేఖర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సందర్బంగా శేఖర్ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని శేఖర్గా గుర్తించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం, పోస్టుమార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కంసాన్పల్లిలో గ్రామస్థులు పెద్దఎత్తున ుగుమికూడి ఆందోళన చేపట్టారు. శేఖర్ ఆత్మహత్యకు కొందరి బెదిరింపులే కారణమని ఆరోపిస్తున్నారు. -
బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నను టిప్పర్తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు.రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానిక అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంగా చూపే పకడ్బందీ ప్లాన్ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.గత నెల (నవంబర్ 29, శనివారం) రాత్రి టిప్పర్తో పెద్దన్న వెంకటేష్ను ఢీకొట్టాడు. టిప్పర్ బ్రేక్డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
'పుష్ప' స్టైల్లో ఆవుల అక్రమ రవాణా
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పుష్ప సినిమా రేంజ్లో జరిగిన అక్రమ గోవుల రవాణా ప్రయత్నాన్ని పంతంగి టోల్ ఫ్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ పైభాగంలో ఉల్లిగడ్డల లోడు, కిందభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూహల వంటి ఖాళీలో గోవులను దాచిపెట్టి తరలించేందుకు ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి పరిశీలించగా వైజాగ్ నుంచి హైదరాబాదులోని ఒక కబేళాకు గోవులను తరలిస్తున్నట్టు బయటపడింది. లారీ క్రింద భాగాన్ని పాలిష్ బోర్డులతో కప్పి చిన్న గాలి రంధ్రాలు ఉంచి పైన ఉల్లిగడ్డల సంచులతో పూర్తిగా మూసివేసి ఎవరికీ అనుమానం రాకుండా ముఠా చాకచక్యంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.గోవుల రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వీడు మనిషి కాదు.. భార్యను చంపి సెల్ఫీ..
తమిళనాడు: నెల్లై జిల్లాలో మహిళా హాస్టల్లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్హాల్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది. శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే హత్య చేశానని బాలమురుగన్ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు. -
హనుమకొండలో నర్సింగ్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్పై నుంచి యాసిడ్ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్ దాడితో నగరం ఉలిక్కిపడింది. -
హైదరాబాద్: ముంబైలో ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ‘మానవ బాంబు’ బెదిరింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. కువైట్ నుంచి శంషాబాద్కు ఈ ఉదయం(మంగళవారం) రావాల్సిన విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. గత అర్ధరాత్రి 1.30గం. కువైట్ నుంచి ఇండిగో ప్లైట్ 6ఈ1234 హైదరాబాద్కు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.10గం.కి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే బాంబ్ బెదిరింపు మెయిల్తో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అటు విమానం ముంబైలోనూ ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కాసేపటికి సేఫ్ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మానవ బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రయాణికులను ఒక్కొక్కరిగా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్కు చెందిన విద్యార్థిని, శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిత (16) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.హాస్టల్ నిర్వాహకులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. సక్షమ్పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్ను చంపేసెయ్ అని హిమేశ్ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్ను చంపేశాక పోలీస్స్టేషన్కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
రుబయ్యా సయీద్ కిడ్నాప్ కేసు..
న్యూఢిల్లీ: 1989లో అప్పటి కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా కిడ్నాప్ కేసులో కుట్రధారుగా భావిస్తున్న షఫత్ అహ్మద్ షంగ్లూను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత జేకేఎల్ఎఫ్తో ప్రమేయమున్న ఈ కిడ్నాప్ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తాజాగా పట్టుబడిన షంగ్లూ జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్కు సన్నిహితుడు. రుబయ్యా సయీద్ కిడ్నాప్కు షంగ్లూ, యాసిన్ మాలిక్ కలిసి కుట్ర పన్నారు. 35 ఏళ్లుగా ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. వీరిపై రణ్బీర్ పీనల్ కోడ్తోపాటు 1989నాటి టాడా చట్టం కింద కేసులున్నాయని సీబీఐ తెలిపింది. షంగ్లూ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉందని పేర్కొంది. ఇతడిని జమ్మూలోని టాడా కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించింది. జేకేఎల్ఎఫ్ ఆర్థిక వ్యవహారాలన్నీ షంగ్లూ యాజమాన్యంలోనే సాగేవని అధికారులు చెప్పారు. శ్రీనగర్లోని నిషాత్ ప్రాంతంలోని తన నివాసంలో ఉన్న షంగ్లూను సీబీఐ, కశీ్మర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారని వివరించారు. జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ 2019 నుంచి తిహార్ జైలులో ఉండటం తెల్సిందే. రుబయ్యా సయీద్ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. జైలులో ఉన్న ఐదుగు రు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, అప్పట్లో బీజేపీ మద్దతుతో కేంద్రంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అందుకు తలొగ్గడంతో కథ సుఖాంతమైంది. -
బాలికపై మేనమామ అత్యాచారం
ధర్మవరం అర్బన్: ఆ తల్లికి ఇద్దరు మగ పిల్లలు. దర్శనం కోసం బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్లగా అక్కడ ఓ ఆడశిశువు ఏడుస్తూ కనిపించింది. ఎవరిని అడిగినా వారి బిడ్డ కాదన్నారు. దీంతో ఆమె అమ్మవారే తనకు బిడ్డను ఇచ్చారనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచింది. ఇప్పుడా చిన్నారికి 14 ఏళ్లు. అయితే.. పెంచిన తల్లి తమ్ముడే ఆ పసిమొగ్గను తుంచేశాడు. కామంతో కళ్లుమూసుకుపోయి తరచూ బాలికపై అత్యాచారం జరిపాడు. చివరికి బాలిక గర్భం దాలి్చంది. వివాహమై ముగ్గురు పిల్లలున్నా.. ఆరో తరగతి వరకు చదివిన ఆ బాలిక ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పెంచిన తండ్రి అనంతపురంలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. పెంపుడు తల్లి రెండో తమ్ముడు సాకే నరసింహ (వరుసకు మేనమామ) ఆ సమీపంలోని కాలనీలోనే నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ముగ్గురు పిల్లలున్నారు. అక్క కూలి పనులకు వెళ్లిన సమయంలో బాలికను తన ఇంటివద్ద చెత్త ఊడ్చేందుకు, ఇల్లు శుభ్రం చేసేందుకు తీసుకుని వెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో ఆమె బోరున విలపించింది. బాలికను మందలించి విషయం ఆరా తీయగా.. మేనమామ సాకే నరసింహ దీనికి కారణమని చెప్పింది. దీంతో తల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. సాకే నరసింహను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఉరేసుకుని ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తెమృతికి కారణమైన రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. -
పరువు పేరుతో ప్రేమకు సమాధి; తప్పెవరిది?
నాగరిక ప్రపంచంలో ప్రేమకు చోటు లేకుండా పోతోంది. కుల దురహంకారం మట్టికాళ్ల మహారాక్షసిలావిజృంభిస్తోంది. మనసుకు నచ్చినవాడిని ప్రేమించడమే తరతరాలుగా ‘ఆమె’ పాలిట శాపమైపోతోంది.మనసిచ్చినవాడిని మను వాడాలనుకున్న అమ్మాయి కలల్ని సొంత కుటుంబ సభ్యులే కాల రాస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురి కంట తడి పెట్టిస్తోంది. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చినపుడు, అబ్బాయి తల్లిదండ్రులు స్వీకరించిన సులువుగా అమ్మాయి తల్లిదండ్రులు ఒక జంట ప్రేమను ఎందుకు అంగీకరించకలేక పోతున్నారు. అమ్మాయి ప్రేమిస్తే.. అది ధిక్కారమే అన్నట్టు ఆగ్రహావేశాలతో ఎందుకు రగిలిపోతున్నారు.. ఎందుకంటే అనాదికాలంగా పాతుకుపోయిన ఆమె మన సొత్తు..మనం చెప్పినట్టే వినాలి అనే భావన. అమ్మాయి మన స్వాధీనంలోనే ఉండాలనే ఆధిపత్య ధోరణి. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకొని, వాడితో పిల్లల్ని కంటుందా? అనే అత్యంత అమానవీయమైన భావజాలం వారిలో తీరని అసంతృప్తిని రగిలిస్తోంది.అమ్మాయి ప్రేమే సమస్యతమ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తే ఎందుకంత అగ్గిమీద గుగ్గిలం అవుతారు. కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకోవాల్సిన సమస్యని హత్యల దాకా ఎందుకు తీసుకెళతారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆధిపత్య, అహంకార పూరిత ధోరణి. ఆడవారి స్వేచ్ఛను, ప్రేమను అంగీకరించలేని అసహనం. వివక్ష. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలి తనంలో కొడుకు ఇంట ఆడది బతకాలి. మారు మాట్లాడినా, ఎదురు తిరిగినా అంతే సంగతులు, పరువు ప్రతిష్ట పేరుతో ఇంట్లోని మగవాళ్ల ఆగ్రహానికి బలికావాల్సిందే. ఇదే తరతరాలుగా సాగుతున్న తంతు. మహిళల్ని, లేదా యువతులను పితృస్వామ్య అణచివేత, లైంగిక,శారీరక, మానసిక వేధింపులతోనే కాదు వారికి నచ్చినవారిని హతమార్చి, ఇలా కూడా అతి దారుణంగా చంపేయొచ్చు. వారిని మానసికంగా దెబ్బతీయచ్చు. తండ్రి , సోదరులు ఇలా ఎవరైనా సరే పరువు హత్యల ద్వారా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ‘ఆమెను’ హత్య చేయవచ్చు. అపుడే వారి అహం చల్లారుతుంది. ఈ అహంభావమే, దౌర్జన్యమే ఇప్పటికీ రాజ్య మేలుతోంది. ఆయా కుంటుంబాలలోని మహిళలు ఇలాంటి హత్యలను సమర్థించడం సాయపడుతూ ఉండటం దురదృష్టకరంఇటీవల జరిగిన సంచలన హత్యలు2016 మార్చి 13న లో తమిళనాడులోని తిరుప్పూర్లో జరిగిన శంకర్ పరువు హత్య సంచలనం రేపింది. తమ కుమార్తె కౌసల్యం శంకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన అక్కసుతో, కౌసల్య తండ్రి చిన్నస్వామితన బంధువులతో కలిసి పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు.ఈ కేసులో ఏమైంది... నేరస్తులకు దక్కిన పరువు ఉంటి? నలుగురిలోనూ హంతకులనే పేర్లు, జైలు జీవితం అంతేగా. ప్రణయ్ హత్యతో పరువు నిలబడిందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018, సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్ది మరో దారుణ హత్య. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా, పగపెంచుకుని, కిరాయిహంతకుల సాయంతో స్వయంగా అమృత తండ్రి మారుతీ రావు చంపించాడు.ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు దూరం, మరోవైపు అల్లుడి హత్యతో ఆమె జీవితంలో నిప్పులు పోసానన్న పశ్చాత్తాపం ఊపిరి సలప నీయలేదు. దీనికి తోడు పోలీసు కేసులు విచారణ, చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు. నానమ్మ కోసం హత్య 2025 జనవరిలో సూర్యాపేటలో భార్గవి, కృష్ణల ప్రేమను పరువు హత్య చేశారు. తమ కుమార్తెను భార్గవిని తన స్నేహితుడు కృష్ణ కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు దీంతో స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా మరి కొంత మందితో కలిసి కృష్ణను నమ్మించి హత్య చేశారు. ఈ కేసులో నానమ్మ పాత్ర పెద్ద చర్చు దారితీసింది. మొదటినుంచి భార్గవి ప్రేమను వ్యతిరేకించి నాన్నమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొట్టి మరీ ఈ హత్యకు వుసి గొల్పిందని పోలీసులు నిర్ధారించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని భావించి ప్రేమికుడిని హత్య చేశారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, నరేష్ ప్రేమించు కున్నారు. కేవలం కుల అహంకారంతోనే స్వాతి తల్లిదండ్రులు నరేష్ను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన యువకుడి హత్య. ఆంచల్ మామిద్వార్కు స్వయంగా తల్లిదండ్రులే పుట్టెడుదుఃఖాన్ని మిగిల్చారు. అంచల్ ప్రేమికుడు సాక్షమ్ టేట్ (25)ని దారుణంగా కాల్చి చంపారు. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. వెలుగులోకి రాని కౄరహత్యలు ఎన్నో...మరెన్నో..! పగ కాదు, ప్రేమను పంచుదాంకన్నబిడ్డల కంటే వారి సంక్షేమం కంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. జీవితాంతా కష్టపడి ప్రాణానికి ప్రాణంగా పెంచుతారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మూర్ఖంగా మారిపోతున్నారు. అమ్మాయి ప్రేమను అస్సలు ప్రేమను జీర్ణించుకోలేక పగతో రగిలి పోతున్నారు. కుటుంబ పరువు గంగలో కలిసిపోయిందంటూ గగ్గోలు పెడతారు. ఫలితంగా దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరికి కన్నబిడ్డ గొంతుకు ఉరి బిగించేందుకు కూడా వెనుకాడటం లేదు.ఏమిటీ పరిష్కారంఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ఉండాల్సింది ప్రేమ, అభిమానం, పరస్పరం నమ్మకం. ప్రేమకు, ప్రేమ వివాహాలకు కులాలు, మతాలు అడ్డుగోడలు కాకూడదు. ఆర్థిక స్థోమత అస్సలు సమస్యే కాదు. కానీ తక్కువ, ఎక్కువ అనే లేని పోని విద్వేషాలతో ప్రేమ వివాహాలను పెద్దలు అడ్డుకుంటున్నారు. కుటుంబ పరువు, సమాజంలో నలుగురూ ఏమనుకుంటారో అనే లేని పోని ఆందోళన వారిని భయపెడుతోంది. ఇదే ప్రేమికులనూ భయపెడుతోంది. అందుకే తమ ప్రేమ బతకని చోట తామూ బతకలేమని ప్రేమికులు ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతోంటూ, మరోవైపు ప్రేమకోసం ప్రేమగా, ధైర్యంగా కలిసి బతుకుదామను కున్న వారిని స్వయంగా కుటుంబ సభ్యులే హత్య చేస్తుండటం బాధాకరం.రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన ప్రతీ యువతీ యవకుడికీ తమకు నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడిని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం, చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. చట్టాలు, ప్రేమ వివాహాలు, పరువుహత్యలు, పర్యవసానాలపై పౌరుల్లో అవగాహన కల్పించాలి. "మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును." అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు కుల, మత బేధం లేని సమాజం ఇపుడు మనకు కావాలి. ఇకనైనా పరువు పేరుతో జరుగుతున్న మారణకాండ ఆగాలని కోరుకుందాం. పరువు, ప్రతీకారంకోసం నిండు నూరేళ్ల ప్రేమను కోల్పోయిన బాధితురాళ్ల వేదన సాక్షిగా నిజమైన ప్రేమలను గెలిపించుకుందాం. -
మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్ వీడియోలు
ముంబైలో జరిగిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి వీడియోల రికార్డ్ చేశారు కొంతమంది దుండగులు. ఎదురు తిరిగి మాట్లాడితే, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది.మేనేజింగ్ డైరెక్టర్ , వ్యవస్థాపక సభ్యుడు అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ సహా ఒక ప్రైవేట్ కంపెనీ సీనియర్ అధికారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమావేశం నెపంతో ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ (FIPPL) కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆమెను వేధించి, తుపాకీతో బెదిరించి ఆమె నగ్నంగా మారాలని బలవంతం చేశారు. మహిళపై దుర్భాషలాడి, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి, దాని గురించి ఎవరికైనా తెలియజేస్తే వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించి 51 ఏళ్ల బాధిత మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి మరియు క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
‘14 నెలలకే నూరేళ్లు నిండాయా నాయనా’..
నంద్యాల జిల్లా: బుడి బుడి అడుగుల చప్పుళ్లు ఆగిపోయాయి.. బోసి నవ్వులు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం జరిగిన మొదటి పుట్టిన రోజు వేడుకల సందడిని కుటుంబీకులు ఇంకా మరువక ముందే విధి ఆ చిన్నారిని వారికి దూరం చేసింది. ఊహించని ఘటన ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకు కుటుంబీకుల మధ్య ఆడుకుంటున్న చిన్నారిని క్షణాల్లో మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. నెహ్రూనగర్లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. 14 నెలల వయస్సున్న బాలుడు ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొడుగు శంకరయ్య, లావణ్యకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కుమారుడు గొడుగు చేతన్ (14 నెలలు) ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే మొదటి పుట్టిన రోజు వేడుకలను బంధువుల మధ్య ఆర్భాటంగా నిర్వహించారు. శంకరయ్య ఇంటి సమీపంలోనే గొడుగు వెంకటేశ్వర్లు గృహ నిర్మాణం చేపట్టాడు. సిమెంట్ ఇటుకలను ఆదివారం ఉదయం కర్నూలు నుంచి తెప్పించాడు. అన్లోడ్ అనంతరం ట్రాక్టర్.. శంకరయ్య ఇంటి మీదుగా వెళ్తుండగా ఇంట్లో నుంచి చిన్నారి చేతన్ హఠాత్తుగా రోడ్డు పైకి పరుగెడుతూ వచ్చి ట్రాలీ టైరు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర నెహ్రూనగర్ చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాలుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ బాషా పై కేసు నమోదు చేశారు. ‘14 నెలలకే నూరేళ్లు నిండాయా నాయనా’.. అంటూ కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు బంధువులు, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
అటు పోలీసులు.. ఇటు మంత్రి
సాక్షి, మన్యం: స్వయానా ముఖ్యమంత్రే మందలించినా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీరు మారడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ తన వ్యక్తిగత సహాయకుడు(మాజీ) సతీష్నే ఇంకా వెనకేసుకొస్తున్నట్లు కనిపిస్తున్నారు. కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఇటు పోలీసులు చర్యలకు దిగడం లేదు. దీనికి తోడు బాధితురాలికి అండగా నిలుస్తున్న సాక్షికి బెదిరింపులు తప్పడం లేదు.మంత్రి సంధ్యారాణి పీఏ వేధింపుల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. అతణ్ని దూరం పెట్టాలని, ఈ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని చంద్రబాబు ఆమెకు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం సతీష్ను రక్షించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. ఈ క్రమంలో పోలీస్ విచారణను మంత్రి సంధ్యా రాణి పిన్ టు పిన్ గైడ్ చేస్తున్నట్లు సమాచారం.బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. సతీష్ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం. బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. దీంతో విషయం జనాల్లోకి పోవడంతో ఆమెను గప్చుప్గా వదిలేశారు. ఈ క్రమంలో బాధితురాలి గురించి కథనాలు ఇచ్చిన సాక్షికి నోటీసులు జారీ చేసింది. బీఎన్ఎస్ 94 ప్రకారం.. ప్రస్తారం చేసిన కథనాలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. అలాగే.. సతీష్ అకృత్యాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్లు, వాట్సాప్ చాటింగ్(ఇందులో మంత్రి కుమారుడి చాటింగ్ కూడా) ఉన్న ఫోన్ను ఇప్పటికే ఆమె పోలీసులకు అప్పగించారు. పోలీసులు అవేవీ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆమె వెనక ఎవరైనా ఉన్నారా? అని ఆరాలు తీస్తున్నారు. తద్వారా విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసేలా కనిపిస్తోంది. సంబంధిత కథనం: మంత్రి కొడుక్కి నీపై మనసైంది! -
బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూఢిల్లీ: బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన బ్రిటిష్ పోలీసులు.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని దేశానికి తీసుకురావాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హరియాణాలోని చర్కి దాద్రికి చెందిన విజయ్కుమార్ షియోరాన్(30) యూకేలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున వెర్సెస్టర్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు విజయ్ను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో ఉద్యోగం చేసిన విజయ్ ఉన్నత విద్య కోసం ఈ ఏడాది ప్రారంభంలో యూకే వెళ్లాడు. బ్రిస్టల్లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
పెళ్లి వేడుకలో కాల్పుల మోత
లుధియానా: పంజాబ్లోని లుధియానాలో శనివారం రాత్రి పెళ్లి వేడుకకు వచ్చిన వైరి వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో అతిథులిద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పఖోవల్ రోడ్డులో జరిగే పెళ్లికి వరుడు ప్రత్యర్థి వర్గాల వారికి ఆహ్వానం పంపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో వేదిక వద్ద రెండు గ్రూపులు ఎదురుపడ్డాయి. ఏదో విషయమై వారి మధ్య గొడవ ముదిరింది. పరస్పరం కాల్పులకు దిగారు. కనీసం 20 రౌండ్ల వరకు కాల్చారు. పెళ్లికి హాజరైన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్లు తగిలి చనిపోయారు. పోలీసుల రాకతో రెండు గ్రూపులు అక్కడి నుంచి పరారయ్యాయి. వీరిని పెళ్లికి ఆహా్వనించిన వరుడితోపాటు భద్రతా నిబంధనలను పాటించని ఫంక్షన్ హాల్ నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్క కంట నీరు చూడలేక..బావ, అత్త హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు (30), కృష్ణకుమారి (55)పై మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. కత్తులతో పొడిచి, నరికి చంపేశారు. స్థానికుల కథనం మేరకు.. ధూళ్లిపాళ్ల గ్రామానికి చెందిన దొప్పలపూడి వీరయ్య, కృష్ణకుమారి దంపతులకు కుమారుడు సాంబశివరావు, కుమార్తె మౌనిక ఉన్నారు. మౌనికను ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.తాడికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాంబశివరావుకు 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితితో వివాహం చేశారు. సాంబశివరావు, సాహితి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్లపాటు కేసులు పెట్టుకుని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో ఆరునెలల కిందట విడాకులు తీసుకున్నారు. సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికి ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం నిత్యావసర సరుకులు తీసుకుని ధూళ్లిపాళ్ల వచ్చాడు. తన సోదరిని హింసించారని.. తన సోదరి వైవాహిక జీవితంలో భర్త, అత్త, మామ కలిసి శారీరకంగా, మానసికంగా వేధించారని వారిపై సాహితి సోదరుడు చెరుకూరి రోహిత్చౌదరి కక్ష పెంచుకున్నాడు. ఆ ముగ్గురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్తిపాడు మండలం చోడవరంలోని కళ్లం హరినాథ్రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రోహిత్చౌదరి.. చిలకలూరిపేటలోని పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లో తనకు స్నేహితులైన ఇద్దరు బాలురకు ఈ విషయం చెప్పాడు.గుంటూరు నారాయణ జూనియర్ కళాశాలలోను, చిలకలూరిపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలలోను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ ఇద్దరితో కలిసి హత్యలకు పథకం వేశాడు. ఆదివారం సాంబశివరావు ధూళ్లిపాళ్లలో ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న రోహిత్చౌదరి తన స్నేహితులిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ ఇంటివద్దకు చేరుకున్నాడు. సాంబశివరావు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా, తల్లి కృష్ణకుమారి ఇంట్లోనే ఉంది. ఒక్కసారిగా మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు.. వారిద్దరిని కత్తులతో పొడిచి, తలపై నరికి.. ద్విచక్రవాహనంపై పరారయ్యారు. సాంబశివరావు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.కొన ఊపిరితో ఉన్న కృష్ణకుమారిని స్థానికులు 108 వాహనంలో సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైనవైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు చెప్పారు. అప్పటివరకు ఇంట్లో ఉన్న దొప్పలపూడి వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.హైమారావు, ఎస్ఐ షేక్ అమీరుద్దీన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సాంబశివరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు ఇంట్లో ఉన్న తల్లి, కుమారులను దారుణంగా హత్యచేయడం కలకలం సృష్టించింది. పరారైన ముగ్గురు నిందితులను గ్రామస్తులు, పోలీసులు కలిసి నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో పట్టుకున్నట్లు తెలిసింది. -
వివాహితపై లైంగికదాడి
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో శనివారం రాత్రి ఒక వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మండలంలోని వినగడపకు చెందిన వివాహిత తోటమూలలోని ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు తోటమూల సెంటర్లో ఆటో కోసం వేచి ఉండగా, కార్ల సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడు చెన్నోజు అశోకచారి, మెకానిక్ రాజేష్ కారులో ఆమె వద్దకు వచ్చారు.తాము ఇంటివద్ద దింపుతామని నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకున్నారు. గంపలగూడెం శివారులో ఆమెకు కూల్డ్రింక్లో మద్యం కలిపి తాగించారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. వివాహిత ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
సోనియా, రాహుల్పై కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని చిరకాలంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వారితో పాటు ఈ కేసులో సహ నిందితులైన కాంగ్రెస్ నేతలు సుమన్ దుబే, శామ్ పిట్రోడాతో పాటు యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్, దాని ప్రమోటర్ సునీల్ భండారీ తదితరులపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వారిపై ఐపీసీ 120 బి (నేరపూరిత కుట్ర), 406 (నమ్మకద్రోహం), 403 (ఆస్తులు కాజేయడం), 420 (మోసం) సెక్షన్లు మోపారు. మనీ లాండరింగ్ నిరోధకచట్టంలోని 66(2) సెక్షన్ ప్రకారం దఖలు పడ్డ అధికారాలను ఉపయోగించుకుని ఎఫ్ఐఆర్ దాఖలు దిశగా ఈడీ చర్యలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఆర్ నమోదుపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. బోగస్ కేసును అడ్డుపెట్టుకుని సోనియా, రాహుల్ను వేధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చౌకబారు రాజకీయాలకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ, ప్రమోద్ తివారీ తదితరులు మండిపడ్డారు. వారు ఎంతటి అభద్రతా భావంలో ఉన్నదీ దీన్నిబట్టి మరోసారి రుజువవుతోందన్నారు. వారి ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లి, కుమారుడిపై హత్యాయత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కుమారుడు సాంబశివరావు మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.దోసకాయలపల్లిలో దారుణం..తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భార్య అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
చిత్తూరు : సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఈ మధ్య ప్రియుడి కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే పలమనేరు మండలంలో ఐదు నెలల క్రితం జరగ్గా ఎట్టకేలకు శనివారం ఈ కేసులో నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ స్వర్ణతేజ తెలిపారు. ఆ వివరాలు ఇలా.. మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్ , శిల్ప భార్యాభర్తలు. భర్త సీ. వెంకటేష్ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీలోని సీ.వెంకటేష్ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మనుషులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి సీ.వెంకటేష్ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త సీ. వెంకటేష్ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు. -
గంజాయి బ్యాచ్ బరి తెగింపు
టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా నేరాలకు అడ్డాగా మరింది. ఇందులో గంజాయి బ్యాచ్ బరి తెగిస్తోంది. అధికార పార్టీ అండదండలతోనే వీరు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికార పార్టీ సహకారం, పోలీసుల నిఘా వైఫల్యంతో సాధారణ గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్గా వ్యవహరించే స్థాయికి ఎదిగిన మహిళ నేతృత్వంలో ఈ గంజాయి బ్యాచ్ అరాచకాలు, ఘాతుకాలతో పేట్రేగిపోతోంది. తమ అక్రమ వ్యాపారానికి అడ్డొస్తే.. ఎంతటి వారైనా సరే అంతమొందించేందుకు సైతం వెనుకాడడం లేదు. గతంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతోపాటు పోలీస్ సిబ్బందిని, మరో ఘటనలో ఓ కానిస్టేబుల్ను కారు ఢీకొట్టి తప్పించుకున్నారు. తాజాగా గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు కొట్టివిడి పెంచలయ్యను సినిమా సీన్ తలపించే రీతితో వెంటాడి.. వెంటాడి దారుణంగా హతమార్చారు.నెల్లూరు: జిల్లాలో గంజాయి బ్యాచ్ చేసిన హత్య.. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత.. పోలీస్ శాఖ నిఘా యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అధికార పార్టీలోని ముఖ్య నేతల అండదండలతో ఒక సాధారణ మహిళ గంజాయి విక్రేత స్థాయి నుంచి గంజాయిన్ డాన్ స్థాయికి ఎదిగింది. రూ.కోట్లల్లో గంజాయి వ్యాపారం చేస్తూ.. కిరాయి బ్యాచ్లను మెయింటెన్ చేస్తున్నా.. నిఘా యంత్రాంగం పసిగట్ట లేకపోవడం ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. గంజాయి డాన్ వ్యవహారం తెలిసినా.. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మౌనం దాల్చారా? అనే అనుమానులు కూడా వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గంజాయి పంట నుంచి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదంతో అణచివేసింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి అడ్డాగా మారింది. విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా వ్యాపా రం సాగుతోంది. ఇక్కడి నుంచి కేరళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయి తరలివెళుతోంది. గంజాయిని కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్, ఈగల్ టీమ్లు మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారు. దీంతో గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. గంజాయి తరలింపు సమయంలో అడ్డుపడిన వారిని అడ్డుతొలగించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. ఈ ఏడాది ఆగస్టు 17న.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుంచి కారులో 22 కేజీల గంజాయిని నెల్లూరులోని వ్యాపారికి ఇచ్చేందుకు తీసుకు వస్తున్నారని పక్కా సమాచారం పోలీసు బాస్కు అందింది. ఆయన ఆదేశాల మేరకు బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జాతీయ రహదారిపై తన సిబ్బందితో కలిసి కాపు కాశారు. పెన్నాబ్రిడ్జి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును వెంబడించారు. ఎస్వీజీఎస్ కళాళాల వద్ద కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో పోలీసులు కారును చుట్టుముట్టారు. గంజాయి కోసం అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కారు డ్రైవర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించారు. ఈగల్ టీమ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ సాంబశివరావు కారును వెంబడిస్తూ కారుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పరారవుతున్న నిందితుడిని పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడి.. పోలీసుల కాల్పులు పెంచలయ్య హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి. వేణు, కోవూరు ఎస్ఐ తమ స్బిందితో కలిసి శనివారం తెల్లవారు జామున షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉన్న ప్రాంతాన్ని చుట్టు ముట్టారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునేందుకు నెల్లూరు రూరల్ హెడ్కానిస్టేబుల్ ఆదినారాయణపై హత్య కేసులో కీలక నిందితుడైన జేమ్స్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మ రక్షణ కోసం ఇన్స్పెక్టర్ వేణు తొలుత గాలిలోకి, అనంతరం నిందితుడి ఎడమ కాలిపై గన్తో కాల్చారు. తాజాగా.. పెంచలయ్య హత్య నగరంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన కొట్టివిడి పెంచలయ్య (35)సీపీఎం నాయకుడిగా, ఆరీ్టడీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యునిగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన అరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇచ్చి, దొంగతనాలకు పాల్పడే వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. గంజాయి విక్రయాలను అడ్డుకున్నాడు. పోలీసులతో కలిసి చైతన్య కార్యక్రమాన్ని చేపట్టాడు. గతంలో రూ.కోట్లల్లో జరిగిన గంజాయి వ్యాపారం.. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. దీంతో తన ముఠాతో కలిసి స్కెచ్ వేసి పెంచలయ్య హత్యకు తెగబడినట్లు పోలీసులే చెబుతున్నారు.అడ్డొస్తే.. అంతమే గతేడాది ఆగస్టులో విశాఖ ఏజెన్సీ నుంచి తిరుపతికి కారులో ముగ్గురు దుండగులు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం, మనుబోలు పోలీసులు వెంకటాచలం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా నిందితులు కారును ఆపినట్లు ఆపి వేగంగా ముందుకు దూసుకెళ్లారు. వాహనాన్ని ఆపేందుకు యతి్నంచిన డీఎస్పీతోపాటు పలువురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేతులు దులుపుకున్నారు.


