breaking news
Crime
-
బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సుమంత్ (24) అనే వ్యక్తి మద్యం మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.సుమంత్ మద్యానికి బానిసై, తన బైక్ EMI కట్టలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
రాజస్థాన్: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్లోని సవాయ మాన్సింగ్(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ਸਵਾਈ ਮਾਨ ਸਿੰਘ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਦੇ ICU 'ਚ ਲੱਗੀ ਅੱ+ਗਝੁਲ.ਸ ਗਏ ਕਿੰਨੇ ਹੀ ਮਰੀਜ਼ ! ਦੇਖੋ ਰਾਜਸਥਾਨ ਦੇ ਸਰਕਾਰੀ ਹਸਤਪਾਲ ਦੀਆਂ ਤਸਵੀਰਾਂ #jaipur #rajasthan #accident #LatestNews #Bignews #PunjabiNews #DailypostTV pic.twitter.com/kvlIRlBb4I— DailyPost TV (@DailyPostPhh) October 6, 2025 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది. #WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ— ANI (@ANI) October 5, 2025ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025సిబ్బందిపై ఆరోపణలుఅయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.ప్రధాని దిగ్భ్రాంతిజైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi— PMO India (@PMOIndia) October 6, 2025 #WATCH | Jaipur, Rajasthan | SMS Hospital Trauma centre Incharge Anurag Dhakad says, "Our trauma centre has two ICUs on the second floor: a trauma ICU and a semi-ICU. We had 24 patients there; 11 in the trauma ICU and 13 in the semi-ICU. A short circuit occurred in the trauma… pic.twitter.com/cjMwutRCl3— ANI (@ANI) October 5, 2025 -
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్పై మైపాడుబీచ్కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. -
కన్న కొడుకే కాలయముడయ్యాడు
ప్రొద్దుటూరు క్రైం: డబ్బు పంపలేదనే కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే కన్న తల్లిని గొంతుకోసి హత్యచేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డబ్బు పంపకుంటే కొడుకు ఇంటికి వస్తాడనుకుంది ఆ తల్లి. కానీ ఆ ఆలోచనతోనే కుమారుని ఆగ్రహానికి ఆమె బలైపోయింది. ప్రొద్దుటూరు మండలంలోని శ్రీరాంనగర్లో ఆదివారం ఉప్పలూరు లక్ష్మీదేవి (51)ని ఆమె కుమారుడు యశ్వంత్రెడ్డి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముచ్చుగుంట్ల విజయభాస్కర్రెడ్డి, ఉప్పలూరు లక్ష్మీదేవి పట్టణంలోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నారు.వీరికి యశ్వంత్రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. విజయర్ భాస్కరెడ్డి గతంలో బార్లో పని చేసేవాడు. యశ్వంత్రెడ్డి చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజీలో మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. హాస్టల్, కోచింగ్ ఫీజులతో పాటు ఖర్చుల నిమిత్తం లక్ష్మీదేవి ప్రతినెలా అతనికి డబ్బు పంపేవారు. అయితే ఎప్పుడు ఇంటికి రమ్మన్నా వచ్చేవాడు కాదు.అతడికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని, ఆ దిÔశగా ప్రయత్నాలు చేసేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. కొన్ని నెలల క్రితం బంధువులు, కుటుంబ సభ్యులు యశ్వంత్రెడ్డిని కారులో బలవంతంగా ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. ఆరోగ్యం సరిగా లేదని భావించిన తల్లిదండ్రులు అతనికి నాటు మందు కూడా తినిపించారు. రెండు నెలల పాటు ఇంటి వద్దే ఉన్న యశ్వంత్రెడ్డి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇటీవల కుమారుడిని ఇంటికి రమ్మని అనేకసార్లు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అతను రాలేదు. ఇటీవల యశ్వంత్రెడ్డి తల్లికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజుతో పాటు తన ఖర్చులకు డబ్బు పంపించాలని కోరాడు. ఆమె పంపలేదు. అలా అయినా కొడుకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు.ఆదివారం ఉదయాన్నే యశ్వంత్ ప్రొద్దుటూరుకు వచ్చాడు. నేరుగా వంట గదిలో ఉన్న తల్లి లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. తండ్రి విజయభాస్కర్రెడ్డి బెడ్రూంలో స్నానం చేస్తుండగా గది తలుపులు మూసి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలోనే వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకొని లక్ష్మీదేవి గొంతుకోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఈడ్చుకొచ్చి వరండాలో పడేశాడు. తర్వాత స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బెడ్రూం తలుపులు తీయడంతో తండ్రి విజయభాస్కర్రెడ్డి బయటికి వచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. కాగా, తల్లిని హత్యచేసిన అనంతరం యశ్వంత్రెడ్డి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులుసైతం అవాక్కయ్యారు. -
నకిలీ మద్యం తాగి ఒకరి మృతి
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
లైంగిక వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్కు చెప్పి వాపోయింది. దీంతో.. అమర్నాథ్పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్లతో కలిసి అమర్నాథ్ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఆ శ్రీనుగాడి వల్లే.. నన్ను క్షమించు మమ్మీ!
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ (petbasheerabad police station) పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి (Kompally) పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీనును కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్నెట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన బాలికపై గ్యాంగ్రేప్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. -
అల్లరి చేస్తోందని.. చేతులు విరిచి.. ట్యాంకులో పడేసి.. ఏడేళ్ల బాలిక హత్య
సాక్షి,హైదరాబాద్: మాదన్న పేట బాలిక హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడేళ్ల బాలిక అల్లరి చేస్తుందనే కారణంతో మేనమామ,అత్త కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో బాలికను నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. అయితే, బాలిక తల్లితో నిందితులకు గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, పాప అల్లరి చేయడం తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్లిన బాలిక ఆచూకీ గల్లంతయ్యింది. చీకటి పడుతున్న పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రమాదవ శాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి వాటర్ ట్యాంక్లో నీర్జీవంగా ఉన్న బాలిక మెడ, నోరు, చేతులు అనుమానాస్పద గుర్తులు ఉండటం, చేతులు వెనక్కి విరిచి ఉండడంపై పోలీసులు బాలికది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో బాలిక మేనమామ,అతని భార్య తీరు అనుమానాస్పదంగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసింది మేనమామ,అత్తేనని గుర్తించారు. -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్ప్రెస్) రన్ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్లోని అనేక చోట్ల రైల్వే అండర్పాస్, ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు..
భర్త పెట్టిన చిత్రహింసలను మౌనంగా భరించింది. మానసికంగా, భౌతికంగా హించించినా ఓర్చుకుంది. పరాయి మహిళలతో తన పెనిమిటి పాడు సంబంధాలు పెట్టుకున్నా ఊరుకుంది. కానీ పరాయి మగాళ్ల కోరిక తీర్చాలని తనను భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకు తోడు అతడి కుటుంబ సభ్యులు కూడా గలీజు పనులు చేయమని పోరు పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో (Puttenahalli) వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. 2024, డిసెంబర్లో సయ్యద్ ఇనాముల్ హక్ అనే వ్యక్తితో బాధితురాలికి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో 340 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యమహా బైక్ను ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజులకే వరుడి అసలు రూపం బయటపడింది. అతడికి అప్పటికే పెళ్లయిందని, తాను రెండో భార్యనని తెలిసి బాధితురాలు హతశురాలయింది. అంతేకాదు తనకు 19 మంది పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని స్వయంగా భర్త చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయింది.అతడి ఆగడాలు అక్కడితో ఆగలేదు. బెడ్రూంలో సీక్రెట్ కెమెరా (Secret Camera) పెట్టి రికార్డు చేసిన వీడియోలను విదేశాల్లోని తన స్నేహితులకు పంపించాడని బాధితురాలు వెల్లడించింది. వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని, తాను ఒప్పుకోకపోవడంతో.. ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టు పోలీసులకు ఆమె తెలిపింది. ఇంటా, బయట తనను పదేపదే చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది.ఫ్లాట్ (Flat) కొనడానికి తన బంగారు నగలను అమ్మమని అతడు ఒత్తిడి తెచ్చాడని, తాను నిరాకరించడంతో తనపై దాడి చేశాడని ఆమె చెప్పింది. అత్తమామలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 21న బాధితురాలిపై దాడి చేసి నిందితుడు పారిపోయాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఇంకా పట్టుబడలేదని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని, అతడి బారి నుంచి మహిళలను కాపాడాలని పోలీసులను బాధితురాలు ప్రాధేయపడింది.చదవండి: 'నా కుమారుడిని వదలనంటున్న లేడీ గాడ్సే' -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
చిత్తూరు దేవళం పేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, చిత్తూరు: సాక్షి, చిత్తూరు: వెదురుకుప్పం మండలం దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానిక సర్పంచ్ ఆధ్వరంలో దళిత సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు(Ambedkar Statue fire Incident). అయితే.. టీడీపీ నేత సతీష్ నాయుడు(TDP Leader Satish Naidu), అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విగ్రహానికి నిప్పు పెట్టినవాళ్లను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి -
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్ను అనుసరించింది. సింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన వేగం
పహాడీషరీఫ్: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రాజేంద్రనగర్లోని హనుమాన్నగర్కు చెందిన కొండ రామకృష్ణ కుమారుడు అరుణ్ (24) సాయంత్రం 6.30 గంటలకు తన పల్సర్ బైక్ (టీజీ 08సి 4722)పై పెద్ద గోల్కొండలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో హర్షగూడకు చెందిన ఇస్లావత్ నరేష్ కుమారుడు, స్కూల్ బస్సు క్లీనర్గా పనిచేసే మోహన్ (18), రమావత్నర్స్ కుమారుడు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధూ(17), ఇస్లావత్ సేవ్య కుమారుడు సింహాద్రి (17) యూనికార్న్ బైక్ (టీఎస్07జేఏ 9052)పై పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు హర్షగూడ నుంచి తుక్కుగూడకు వస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తున్న వీరి బైక్లు.. అవుటర్ సర్వీస్ రోడ్డులోని పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అరుణ్తో పాటు యూనికార్న్ నడిపిన సిద్ధూ, వెనుక కూర్చున్న మోహన్లు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్రెడ్డి, ఎస్ఐ దయాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన సింహాద్రిని వెంటనే ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మోహన్, సిద్ధూ వరుసకు బావ బావమరుదులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదంగా ముగిసిన మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు
సాక్షి,హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
నార్సింగిలో యువకుడి దారుణ హత్య
మణికొండ: ఓ సెల్ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు. చోరీ చేసిన ఫోన్ను తిరిగి ఇచ్చేయాలని చెప్పిన యువకున్ని మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన నార్సింగి – కోకాపేట రోడ్డులోని డబుల్ బెడ్ రూం గృహాల సముదాయం పక్కన సోమవారం అర్ధరాత్రి జరిగింది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..షాద్నగర్కు చెందిన కాశారం యాదగిరి(24), కిషన్బాగ్కు చెందిన అఫ్రోజ్, నవాజ్ల కుటుంబాలకు 11 నెలల క్రితం నార్సింగిలో డబుల్ బెడ్రూంలు మంజూరు కావటంతో ఇక్కడే పక్కపక్కనే నివసిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు రోజుల క్రితం నార్సింగిలో మరో యువకున్ని కొట్టి సెల్ఫోన్ను లాక్కున్నారు. దాన్ని యాదగిరి వ్యతిరేకించాడు. అది తిరిగి ఇచ్చేయాలని పట్టుపట్టాడు. అప్పటికే దాన్ని అమ్మేసిన హంతులకు విషయం యాదగిరి బయటపెడతాడని భావించి సోమవారం రాత్రి వారి గృహాలకు సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుదామని అతన్ని పిలిచారు. వింటే సరే లేదంటే హత్య చేయాలని పథకం వేసుకున్నారు. మద్యం తాగించి హత్య.. తమ పథకంలో బాగంగా మృతుడు యాదగిరికి ఎక్కువగా మద్యం తాగించి మత్తు ఎక్కేలా చేశారు. తర్వాత వారి వద్ద సిద్ధంగా ఉన్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. నొప్పి తాళలేక గట్టిగా అరవడంతో డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వారు సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108ను రప్పించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులలో ఒకడైన అఫ్రోజ్పై ఆర్జీఐ, బహదూర్ పురా పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. నిందితులనిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు. భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్ లేన్లోని ఆకాశ్ హోటల్ రూమ్ నెంబర్ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్మెంట్ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్రూమ్ డోర్ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు. పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
హత్యలు తగ్గాయి.. కిడ్నాప్లు పెరిగాయి..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2023లో నేరాల్లో 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అన్ని రకాల నేరాలు కలిపి దేశవ్యాప్తంగా 2022లో 58,24,946 కేసులు నమోదు కాగా..2023లో 62,41,569 కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) 2023 నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది నమోదైన వాటిల్లో 27,53,235 కేసుల్లో చార్జ్ïÙట్ పూర్తయింది. ప్రతి లక్ష మంది జనాభాకు 2022లో 422.2గా ఉన్న నేర నమోదు శాతం..2023లో 448.3కి పెరి గినట్టు గణాంకాలు వెల్లడించాయి.తెలంగాణలో 2022లో 1,65,830 కేసులు నమోదు కాగా, 2023 నాటికి అది 1,83,644కి చేరినట్టు నివేదిక పేర్కొంది. ఈ మేరకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2023 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం దేశవ్యాప్తంగా పలు రకాల నేరాలకు సంబంధించిన గణాంకాలు ఇలా.. హత్యలు తగ్గాయి 2023లో మొత్తం 27,721 హత్య కేసులు నమోదదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 2.8 శాతం తగ్గుదల కనిపించింది. హత్య కేసుల్లో అత్యధికంగా వివాదాలు (9,209 కేసులు) ప్రధాన కారణంగా ఉన్నాయి, ఆ తర్వాత ‘వ్యక్తిగత శత్రుత్వం లేదా ద్వేషం’(3,458 కేసులు), ‘వ్యక్తిగత లబ్ధి లేదా లాభం (1,890 కేసులు) కారణంతో జరిగాయి. 5.6 శాతం పెరిగిన కిడ్నాప్ కేసులు 2022, 1,07,588 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2023లో 1,13,564 కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 5.6% పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2023లో కిడ్నాపైన వారిలో 1,40,813 మంది జాడను పోలీసులు గుర్తించగా, వీరిలో 1,39,164 మంది బతికి ఉన్నారు. మరో 1,649 మంది చనిపోయినట్టు గుర్తించారు. మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 2022లో 4,45,256 కేసులు నమోదు కాగా..2023లో 4,48,211 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో భర్త లేదా అత్తింటివారి దాడులకు సంబంధించి 1,33,676 కేసులు, మహిళల కిడ్నాప్నకు సంబంధించి 88,605 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి 83,891 కేసులు, పోక్సో యాక్టు కింద 66,232 కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై నేరాల నమోదులో 9.2 శాతం పెరుగుదలచిన్నారులపై నేరాల నమోదులో 2022తో పోలిస్తే 2023లో 9.2 శాతం పెరిగింది. 2023లో పిల్లలపై మొత్తం 1,77,335 నేరాలు నమోదయ్యాయి. వీటిలో పిల్లల కిడ్నాప్నకు సంబంధించినవి 79,884 కేసులు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద 67,694 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదు సైబర్ నేరాల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. 2022తో పోలిస్తే 2023లో సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 86,420 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 2023లో నమోదైన వాటిలో 68.9 శాతం మోసం, లైంగిక దోపిడీ 4.9 శాతం కేసులు, దోపిడీ 3.8శాతం కేసులు ఉన్నాయి. ఆరు శాతం పెరిగిన ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే..ఆరు శాతం పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ 2023 నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం 2,04,973 కేసులు నమోదయ్యాయి. వీటిలో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, మోసం కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఎంతో ఆలస్యంగా నివేదిక..: ఎన్సీఆర్బీ నివేదిక ‘క్రైం ఇన్ ఇండియా’సాధారణంగా ఏడాది మధ్యలో విడుదల చేస్తారు. కానీ, 2023 నివేదికల ప్రచురణ చాలా ఆలస్యమైంది. డేటా సేకరణలో ఆలస్యం కారణంగానే 2023 నివేదిక ఆలస్యం అవుతోందని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక సైతం డిసెంబర్ 2023లో విడుదలైంది. -
కక్ష సాధించాలంటే.. నన్ను ఏమైనా చేసుకోండి
సాక్షి, చెన్నై: కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే తనను ఏమైనా చేసుకోవాలని, తన కేడర్ను విడిచి పెట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మూడు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించలేదని తెలిపారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. జరగకూడనిది జరిగిందని, ఘటన జరిగిన రోజున తాను అక్కడే ఉంటే, పరిస్థితిని మరింత సమస్యాత్మకంగా మార్చేస్తారేమోనని చెన్నైకి వచ్చేసినట్టు వివరించారు. సీఎం సార్ .. విజయ్ వీడియోలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ఐదు జిల్లాలకు ప్రచారానికి వెళ్లాను. కరూర్లో మాత్రమే ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. ఏం జరిగింది.. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ప్రజలు అన్నింటిని చూస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ‘కరూర్ ప్రజలు బయటకు వచ్చి వాస్తవాలు చెబుతున్నప్పుడు దేవుడే తన ముందుకు వచ్చి చెబుతున్నట్టుగా అనిపించింది. కేటాయించిన స్థలానికి వెళ్లి నిలబడి ప్రసంగించారు. ఏ తప్పు చేయలేదు. అయితే, నా పార్టీ వర్గాలను కేసుల పేరిట వేధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు.సీఎం సార్.. కక్షసాధింపు చర్య ఏదైనా ఉంటే .. నన్ను ఏమైనా చేసుకోండి. నా వాళ్లను వదలేయండి. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటాను.. నా వాళ్లను వదిలేయండి..’ అని అన్నారు. అలాగే కేడర్కు భరోసా ఇస్తూ, రాజకీయ ప్రయాణం మరింత బలంగా, ధైర్యంగా కొనసాగిస్తాం.. అని ముగించారు. టీవీకే వర్గాలపై కేసులు, అరెస్టుల ప్రక్రియ సాగుతుండటంతో ఆయన ఈ వీడియోను విడుదల చేసినట్టుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో ఆయన కక్షసాధింపు అంటూ సీఎం స్టాలిన్ను టార్గెట్ చేయడం మరింత చర్చకు దారితీసింది.ఇద్దరు నేతలకు రిమాండ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, కరూర్ నగర్ ఇన్చార్జ్ మాశి పొన్రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కరూర్ కోర్టులో న్యాయాధికారి భరత్కుమార్ ఎదుట హాజరుపరిచారు. అక్టోబర్ 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.బీజేపీ బృందం అనుమానాలు తొక్కిసలాటకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో ఎనిమిదిమంది ఎంపీలున్న బీజేపీ నిజనిర్ధారణ కమిటీ మంగళవారం కరూర్లో పర్యటించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారసభ కోసం సరైన స్థలం కేటాయించలేదని చెప్పారు. ఇరుకైన రోడ్డులో అనుమతి ఇవ్వడం, విద్యుత్ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అముదా నేతృత్వంలో ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం, ఇతర అధికారుల బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు కారణాలు, రద్దీపెరగడం వంటి అనేక అంశాలను వీడియో ఆధారాలతోసహా విడుదల చేసిన అధికారులు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
ఆస్తి కోసం భర్త హత్య
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడ్ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు.. గుంటూరు పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన లక్ష్మీతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య, భర్త మధ్య గొడవలు చెలరేగడంతో.. ఆరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం లక్ష్మీకి సత్తెనపల్లికి చెందిన పేర్నేపాటి వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ నేపథ్యంలో గోవిందరాజు కుటుంబానికి సంబంధించిన రూ.1.5 కోట్ల ఆస్తి గురించి తెలుసుకున్న లక్ష్మి భర్తను హత్య చేసి.. ఎలాగైనా ఆస్తిలో వాటా దక్కించుకోవాలని భావించింది. ఇందుకు వెంకటేశ్వర్లుతో కలిసి కుట్ర పన్నింది. ఆ ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ ఖాసిం సైదా సెపె్టంబర్ 18న ఆటోలో గోవిందరాజు ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర్లు, గోవిందరాజుకు గతంలో పరిచయం ఉంది. దీంతో ముగ్గురూ కలసి ఆటోలో తిరుగుతూ మద్యం తాగారు. ఈ క్రమంలో సాతులూరు, పెదరెడ్డిపాలెం గ్రామాల మధ్య.. గోవిందరాజుతో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు.పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోవిందరాజును.. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో మోది హత్య చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీకి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 19వ తేదీన పెదపలకలూరు తేజ గార్డెన్స్ సమీపంలో పడేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగూర్మీరాసాహెబ్, సిబ్బంది దర్యాప్తు చేసి.. వెంకటేశ్వర్లు, అతని మిత్రుడు షేక్ ఖాసింసైదాను అరెస్టు చేశారు. -
సీఎం సొంత జిల్లాలో అమానుషం.. బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు టీడీపీ మూకలు వంతులేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. స్నేహితుడి గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. చిత్తూరులో జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఫారెస్టు ఆఫీసర్లమంటూ బెదిరించి.. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెపె్టంబర్ 25వ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాస్లోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్కుకు వెళ్లింది. ఇద్దరూ ఓ బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటుండగా.. సంతపేటకు చెందిన హేమంత్, మురకంబట్టు అగ్రహారానికి చెందిన మహేశ్, కిశోర్తో పాటు మరికొందరు టీడీపీ వర్గీయులు పార్కు లోపలికి వచ్చారు. ఒంటరిగా కూర్చున్న వీరిద్దరి వద్దకు వెళ్లి.. ‘మేము ఫారెస్టు ఆఫీసర్లం. మీకు ఇక్కడేం పని? మీపై మాకు అనుమానం ఉంది. స్టేషన్కు పదండి’ అంటూ బెదిరించారు.తాము స్నేహితులమని.. మాట్లాడుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా.. వారిద్దరినీ పార్కులోని పొదల్లోకి లాక్కెళ్లారు. ప్రతిఘటించిన బాలిక స్నేహితుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కడుపుపై తన్ని.. మొహంపై పిడిగుద్దులు గుద్దారు. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అరవకుండా అతని నోరు మూసేశారు. అతడి కళ్లెదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ.. దాదాపు రెండు గంటల పాటు కీచకపర్వం సాగించారు. ముగ్గురు లైంగిక దాడికి పాల్పడగా.. మిగిలిన వారు బాలికను అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందినట్లు తెలిసింది. ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. టీడీపీ కండువాతో నిందితులు మహేశ్, హేమంత్ పంచాయితీకి ప్రయత్నించిన టీడీపీ నాయకులు..! ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్.. గుట్టుచప్పుడు కాకుండా పంచాయితీ చేసేందుకు యత్నించినట్లు సమాచారం. జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు.. తన కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు పార్కు సమీపంలోని హోటల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి.. 29వ తేదీన నిందితులను పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేశారు. ఆ సమయంలో నిందితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన ఏడు వీడియోలను గుర్తించినట్లు తెలిసింది. పట్టించుకోని పోలీసులు.. అంతకుముందు యువకుడి కుటుంబసభ్యులు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. సీఐ, ఎస్సై అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది జవాబిచి్చనట్లు సమాచారం. పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బంది సైతం సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్లు వెనుదిరిగినట్లు తెలిసింది. నిందితులకు దేహశుద్ధి జరిగిన విషయం బయటకురావడంతో పోలీసులు.. బాలిక స్నేహితుడి నుంచి సోమవారం రాత్రి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిందితులు ముగ్గురూ టీడీపీ కండువాలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్రావు, టీడీపీ నాయకుడు ఎల్బీఐ లోకేశ్, కార్పొరేటర్ నవీన్తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంగళవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నాయుడు, సీఐలు శ్రీధర్ నాయుడు, మహేశ్వర మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక ఫిర్యాదు మేరకు.. హేమంత్, మహేశ్, కిశోర్ అనే ముగ్గురిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
గోడ కూలి ముగ్గురు దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లో జరిగింది. వివరాలు.. నందవరానికి చెందిన బలుదూరు లక్ష్మీదేవి మూడేళ్లుగా తన ఇద్దరు కుమారులు నాగరాజు(45), రాజు(39), మనవడు లక్ష్మీనరసింహ(14)తో కలసి గుడేకల్లోని నీలకంఠశ్వేరస్వామి దేవాలయం స్థలంలో ఉన్న గోడకు రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తోంది.సోమవారం రాత్రి వారంతా భోజనం చేసి నిద్రపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన రాతి గోడ.. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారిపై పడింది. కేకలు విన్న స్థానికులు వచ్చి వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ తండ్రి నాగరాజు, కుమారుడు లక్ష్మీనరసింహ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రాజు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. లక్ష్మీదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. -
హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్మైలీ హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజారు చెందిన గుంజా గాయత్రి (25) ని ప్రసవం కోసం నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు.ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు .అయితే తనకు బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో చికిత్సపొందుతూ గాయత్రి మరణించింది. దాంతో గాయత్రి మృతదేహాన్ని జగ్గయ్యపేట స్మైలి హాస్పిటల్కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బంధువులు. భారీగా మోహరించిన పోలీసులు. -
దారుణం: ఏపీ యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం
తిరువణ్ణామలై: తమిళనాడు:రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఏపీకి చెందిన యువతిపై తమిళనాడు పోలీసులు అత్యారానికి పాల్పడ్డారు. తిరువణ్ణామలైలో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్స్ సుందర్ రాజ్, సురేష్ రాజ్లు సదరు యువతిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అత్యాచారం చేసిన పోలీసులను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి(సోమవారం, సెప్టెంబర్ 29వ తేదీ) తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఈ దారుణం చోటు చేసుకుంది. టమోటో లోడ్తో వెళుతున్న వాహనంలో డ్రైవర్తో పాట ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ సమయంలోనే గస్తీ కాస్తున్న ఇ ద్దరు పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపారు. వాహనంలో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన ఆ ఇద్దరు పోలీసులు.. మహిళల్ని కిందకు దింపారు. అందులో లక్ష్మీ అనే యువతిని విచారణ పేరతో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడి బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్తులు లక్ష్మిని రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరువన్నమలై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని విచారణ చేశారు. దాంతో పోలీసలే తనను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు బాధితరాలు చెప్పడంతో అసల విషయం వెలుగచూసింది.ఇదీ చదవండి:తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు -
భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్కు తగిలించి ఉరి వేసుకున్నాడు. వీడియో కాల్లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్లో సింగనల్లూరు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
50 కోట్ల బీమా కోసం భార్య, తల్లిదండ్రుల హత్య.. నాలుగో భార్య ఫిర్యాదుతో బీమా స్కామ్ వెల్లడి
మీరట్: ఉత్తరప్రదేశ్లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన భారీ బీమా స్కామ్ వెలుగుచూసింది.ఒక పథకం ప్రకారం హత్యలుఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన విశాల్ సింఘాల్(37) తన మొదటి భార్య, తల్లిదండ్రులను హత్య చేసినందుకు హాపూర్లో అరెస్టు చేశారు. అతని నాల్గవ భార్య.. విశాల్ సింఘాల్ ఇంటిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసులను అప్రమత్తం చేశారు. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, ఇప్పటికే రూ.1.5 కోట్ల క్లెయిమ్లను అందుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన దరిమిలా నివ్వెరపోయే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.నాల్గవ భార్యపై పాలసీ కోసం ఒత్తిడిపోలీసుల దర్యాప్తులో విశాల్ సింఘాల్.. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టివెళ్లిపోయారని తెలిపాడు. అయితే పోలీసులు ఈ మాటపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరట్లోని గంగానగర్కు చెందిన సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను అధిక విలువ కలిగిన జీవిత బీమా పాలసీలపై సంతకం చేసేందుకు ఒప్పించాడు. అయితే సంభాల్లో దర్యాప్తు జరుగుతున్న బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై చేస్తున్న ఒత్తిడి గురించి పోలీసులకు తెలిపారు. ‘విశాల్ పాలసీలపై సంతకం చేయమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడని, ఇదే సమయంలో అతని కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరణాలపై తనకు అనుమానాలు వచ్చాయని శ్రేయ పోలీసులకు తెలిపారు.భారీ బీమా స్కామ్లో ఎందరున్నారో.. విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ తండ్రి చనిపోయిన తర్వాత, తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయానని శ్రేయ పోలీసులకు వివరించారు. శ్రేయ ఫిర్యాదును పరిశీలించిన సంభాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కృష్ణకాంత్ బిష్ణోయ్ తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్లో ఇది ఒక భాగమేనని గుర్తించామని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇంటిలోని వారిని హత్య చేసిన దరిమిలా విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు.ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలుసింఘాల్ తన ఇంటిలోని వారి పేరుతో పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని, వారిని రోడ్డు ప్రమాదానికి బలిచేసి, బాధితులను మీరట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేవాడు. తరువాత బీమా చెల్లింపును క్లెయిమ్ చేసేవాడు. సింఘాల్ భార్య, అతని తండ్రి ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో మృతి చెందారు. ఇది అనుమానాలకు తావిస్తున్నదని, ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పాత్రను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సింఘాల్ తండ్రి ముఖేష్ మరణించే సమయంలో అతని పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి.రికార్డులపై అనుమానంతో ఫిర్యాదు2024 మార్చిలో హాపూర్ పోలీస్ స్టేషన్లో సింఘాల్ తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదయ్యింది. దీనిలో అతను గర్హ్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అయితే అతని బీమా క్లెయిమ్ పత్రాలలో 2023, మార్చి 27న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఉంది. అయితే అతను అడ్మిట్ అయిన నవజీవన్ ఆసుపత్రి రికార్డులతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారని నమోదయ్యింది. దీంతో అనుమానం తెలెత్తిన ఒక బీమా సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విశాల్ సింఘాల్ తెలిపిన వివరాలకు.. ఆసుపత్రి వర్గాలు అందించిన సింఘాల్ తండ్రి పోస్ట్మార్టం రిపోర్టుతో సరిపోలలేదు సంజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.తండ్రి మరణించాక వాహన రుణాలు తీర్చేసిన నిందితుడుకాగా విశాల్ సింఘాల్ సమర్పించిన పత్రాలలో తండ్రి వయస్సు,ఐడీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించడంలో విశాల్ విఫలమయ్యాడని హాపూర్ ఎస్పీ కున్వర్ జ్ఞానేందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు మూసివేశామని, అయితే ఇప్పుడు కేసును తిరిగి తెరవడానికి కోర్టు అనుమతి లభించిందని తెలిపారు. భారీ బీమా స్కామ్ దర్యాప్తుకు సారధ్యం వహిస్తున్న సంభాల్ అదనపు ఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ తండ్రి మరణానికి రెండు నెలల ముందు విశాల్ సింఘాల్ పేరుమీద టయోటా లెజెండర్, నిస్సాన్ మాగ్నైట్, బ్రెజ్జా, రాయల్ ఎన్ఫీల్డ్కు సంబంధించిన రుణాలు ఉన్నాయని, అయితే అవి అతని తండ్రి మరణం తర్వాత క్లియర్ అయ్యాయని అనుకృతి శర్మ తెలిపారు. విశాల్ సింఘాల్పై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
Gurugram: భార్యను హతమార్చి.. ఫ్రెండ్కు వీడియో సందేశం పంపి..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో అఘాయిత్యాలకు, దారుణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత తనను తాను అదుపు చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక జీవితంలో ప్రశాంతత కరువై, తగిన నిర్ణయాలు తీసుకోలేక పలువురు ఆత్మహత్యలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. గురుగ్రామ్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ తన భార్య స్వీటీ శర్మతో ఏదో విషయమై గొడవపడ్డాడు. తరువాత ఆవేశంతో ఆమె గొంతు కోసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్యపై దాడిచేసిన అనంతరం నిందితుడు అజయ్ కుమార్ (30), తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో సందేశం పంపాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నివాసి కుమార్కు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన స్వీటీ శర్మ(28)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.కాగా తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నానని తనకు వీడియో సందేశం పంపాడని కుమార్ స్నేహితుడు పోలీసులు తెలిపాడు. కుమార్ పంపిన వీడియో సందేశంలో అతను భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలున్నాయి. విషయం తెలియగానే పోలీసులు సెక్టార్ 37లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలో కుమార్ దంపతులుంటున్న ఫ్లాట్కు చేరుకున్నారు. స్వీటీ శర్మశర్మ మృతదేహం నేలపై పడి ఉండటాన్ని వారు గమనించారు. అక్కడ వారికి పదునైన కత్తి కూడా లభ్యమయ్యింది. కుమార్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. కాగా ఈ ఘటన వెనుక గల కారణం ఇంకా వెల్లడికాలేదు. అయితే స్వీటీ శర్మ కుటుంబ సభ్యులు కుమార్పై పలు ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కరూర్ తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సోమవారం ఎఫ్ఐఆర్లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్తో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది. ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత కరూర్లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
1,050 సినిమాల పైరసీ.. రూ.22,400 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారం జరుగుతున్న విధానం, మార్కె టింగ్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రకటించారు. వీరిలో ఓ నిందితుడు మూడేళ్లలో 550 సినిమాలు పైరసీ చేయగా... నలుగురితో కూడిన ముఠా ఐదేళ్లలో 500 సినిమాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ పైరసీతో చిత్ర పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి సీవీ ఆనంద్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ అశ్వని కుమార్ మామూలోడు కాదు... బిహార్కు చెందిన అశ్వినీ కుమార్ పదో తరగతి వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారానే హ్యాకింగ్ నేర్చుకున్న ఇతగాడి దృష్టి సినిమా పైరసీపై పడింది. విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన అశ్వినీ కుమార్ వాటి సర్వర్లను హ్యాక్ చేసి, విడుదలకు సిద్ధంగా ఉన్న, తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తాడు. మూడేళ్లలో వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేసి కొన్నింటిని విడుదలకు వారం రోజుల ముందే తస్కరించాడు. ఇలాంటి వాటిలో పుష్ప–2 కూడా ఉంది. పైరసీ ద్వారా లక్ష డాలర్లు (సుమారు రూ.88 లక్షలు) ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. పటా్నలోని సంపత్ చక్లో ఇతడి ఇల్లు 80 గజాల్లో ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్స్తో ఒప్పందాలు చేసుకుని... పైరసీ చేసిన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్వినీ కుమార్ వివిధ టెలిగ్రాం చానల్స్ అడ్మిన్లతోపాటు గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వీరి నుంచి ఒక్కో చిత్రానికి 10 వేల నుంచి 25 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాడు. టెలిగ్రాం చానల్స్లో నేరుగా సినిమా లింకు పెడుతుండగా... వెబ్సైట్స్లో యాడ్స్ రూపంలో ఈ లింకు ఇస్తున్నారు. పగటి పూట నిద్రపోయి, రాత్రి వేళల్లో మేల్కొనే ఇతడు తన హ్యాకింగ్ సత్తాను పరీక్షించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిహార్, జార్ఖండ్కు చెందిన వివిధ ప్రభుత్వ వెబ్సైట్లు, సర్వర్లను హ్యాక్ చేశాడు. దీనికోసం నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వినియోగించాడు. ఇతడు చిత్రాలను నేరుగా సర్వర్ల నుంచి పైరసీ చేస్తుండటంతో అవన్నీ హెచ్డీ ప్రింట్తో ఉంటున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఇతగాడికి అషి్మత్ సింగ్ ద్వారా చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడి హ్యాకింగ్ టాలెంట్ చూసి అవాక్కైన సీవీ ఆనంద్ నెలకు రూ.10 లక్షల జీతం ఇచ్చి అతడి సేవలు వినియోగించుకోచ్చన్నారు. క్యామ్ కార్డర్తో థియేటర్లలో... తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ క్యామ్ కార్డర్ ద్వారా థియేటర్లలో సినిమాలు రికార్డు చేసి పైరసీ చేస్తున్నాడు. దీనికోసం వనస్థలిపురంలో ఉంటున్న జాన కిరణ్ కుమార్, తమిళనాడుకే చెందిన సుధాకరన్, గోవాకు చెందిన అర్సలాస్ అహ్మద్లతో ముఠా ఏర్పాటు చేశాడు. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి అమలదాస్ రెండు సర్వర్లను ఖరీదు చేశాడు. కిరణ్ కుమార్ మిగిలిన ఇద్దరితో కలిసి సినిమా విడుదలైన రోజు థియేటర్లలో మధ్యలో ఉండే వరుసల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటాడు. తమతోపాటు చుట్టు పక్కల ఉన్న సీట్లను బుక్ చేస్తాడు. క్యామ్ కార్డర్లు లేదా సెల్ఫోన్లో ప్రత్యేక క్యామ్ కార్డర్ యాప్ల సహకారంతో వీరు సినిమా రికార్డు చేస్తారు. ఈ ప్రింట్ను అమలదాస్ కొన్ని టోరెంట్స్తోపాటు ఇతర వెబ్సైట్లలో హోస్టు చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కో సినిమాకు 3 వేల డాలర్ల వరకు వసూలు చేస్తూ అనుచరులకు వాటా ఇస్తున్నాడు. వీళ్లు ఐదేళ్లలో 500 సినిమాలు పైరసీ చేయగా... కొన్నింటిని హైదరాబాద్లోని థియేటర్లలో రికార్డు చేశారు. ఇలా ఇప్పటివరకు రూ.2 కోట్లు సంపాదించారు. హిట్, సింగిల్, కుబేర, హరి హర వీరమల్లు చిత్రాల పైరసీపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. సినీ ప్రముఖులతో సీపీ భేటీ సినిమా పైరసీ పూర్వాపరాలు, నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించడానికి హైదరాబాద్ పోలీసులు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు వివరించారు. క్యామ్ కార్డర్ పైరసీని నిరోధించడానికి థియేటర్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ యజమానులు నిఘా పెంచాలని కోరారు. పైరసీ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఏసీపీ ఆర్జీ శివమారుతితోపాటు ఇన్స్పెక్టర్లు ఎస్.నరేష్, సతీష్రెడ్డి, ఎన్.దిలీప్ కుమార్, కె.మధుసూదన్ రావులను అభినందించారు. -
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసిన ముఠా వివరాలన సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నాలుగు నెలలు దర్యాప్తు చేశాం. దేశంలో మొదటిసారి ఓ గ్యాంగ్ను పట్టుకున్నామని సీపీ తెలిపారు.‘‘పైరసీ వల్ల సినిమా నిర్మాతల కష్టం వృథా అవుతుంది. మూవీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 2023లో దేశంలో మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు పైరసీ వల్ల నష్టపోయారు. 2024లో తెలుగు ఇండస్ట్రీ 3700 కోట్లు నష్టపోయారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేశాం. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. టారెంట్ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు...సర్వర్స్ హ్యాకింగ్తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా తన యాప్లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే బృందాలను ఏర్పాటు చేశాముతమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్.. అత్తాపూర్లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమా కాపీ చేసాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించి జానా కిరణ్ కుమార్ నిందితుడని తేలింది. సింగిల్, అనేక మూవీని అత్తాపూర్లోని మంత్ర థియేటర్లో మొబైల్తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలభై మూవీలు థియేటర్ లో కాపీ చేసాడు.150 నుండి 500 డాలర్లు ప్రతి మూవీ కాపీ చేసినందుకు ఇస్తున్నారు. సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అర్సలన్ అహ్మద్ బీహార్ కు చెందిన వాడు. ఇతను కూడా హిందీ భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరల్కు పంపుతున్నాడు. సుధాకరన్ సత్యమంగళానికి చెందిన వ్యక్తి.. ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్కు ఇస్తాడు. కరూర్కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు. నాలుగు వెబ్సైట్లు 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసి ఈజీ మనీకి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు.’’ అని సీపీ వెల్లడించారు. -
50 రోజులు.. 15 హోటళ్లు.. ఢిల్లీ బాబా కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఈమె తల్లేనా?: చికెన్ అడిగిన పిల్లలపై రొట్టెల కర్రతో దాడి.. కుమారుడు మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్లో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించి, కొడుకు ప్రాణాలు పోయేందుకు కారకురాలయ్యింది. తమకు చికెన్ డిష్ తినాలని అనిపిస్తున్నదని ఇద్దరు అన్నాచెల్లెళ్లు తల్లిని చెప్పారు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ, రొట్టెల కర్రతో వారిని చితకబాదింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు మృతిచెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.పాల్ఘర్లో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతిచెందిన బాలుడిని చిన్మయ్ ధుమ్డేగా పోలీసులు గుర్తించారు. తొలుత చిన్మయ్ తన తల్లి పల్లవి ధుమ్డే (40)ను చికెన్ డిష్ అడిగాడు. దీంతో ఆమె ఇప్పుడు కుదరదని చెబుతూ, రొట్టెల కర్రతో కుమారునిపై దాడి చేసింది. తర్వాత తన తన పదేళ్ల కుమార్తెను కూడా అదే రొట్టెల కర్రతో కొట్టింది. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి తన కుటుంబంతో కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో ఉంటోంది. ఆమె కొట్టిన దెబ్బలకు కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) మృతిచెందాడు. 10 ఏళ్ల కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాల్ఘర్ పోలీసులు ఆ తల్లిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న పరువు హత్య: 17 ఏళ్ల యువతిని కాల్చేసి, మృతదేహాన్ని నదిలో తోసేసి..
మోరెనా : మధ్యప్రదేశ్లో మరో అత్యంత దారుణ పరువు హత్య వెలుగు చూసింది. ఉన్నత కులానికి చెందిన 17 ఏళ్ల యువతి.. వెనుకబడిన కులానికి చెందిన యువకునితో స్నేహం చేసిందని ఆరోపిస్తూ, ఆ యువతి కుటుంబీకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో నదిలో పోలీసులకు కనిపించిన దరమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.బాధితురాలిని 17 ఏళ్ల దివ్య సికార్వర్గా, ఆమె మోరెనా జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న దివ్య శనివారం నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దివ్య మృతదేహం ఒక నదిలో కనిపించింది. ఆమె తండ్రి భరత్ సికార్వర్ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, దానిని రాయికి కట్టి, వారి ఇంటికి 30 కి.మీ దూరంలో ఉన్న కున్వారీ నదిలో విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివ్య ఉన్నత కులానికి చెందినది. అయితే ఆమె వెనుకబడిన కులానికి చెందిన యువకుడితో స్నేహం చేస్తూ వచ్చింది. దీంతో ఆ అగ్రకులానికి చెందినవారు దివ్య కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి, ఆ యువకుని హత్యకు పురిగొల్పివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత పోలీసుల విచారణలో మృతురాలి తల్లిదండ్రులు విరుద్ధమైన సమాధానాలిచ్చారు. దివ్య విద్యుత్ షాక్ కారణంగా మరణించిందని చెప్పారు. తరువాత ఆత్మహత్య చేసుకున్నదన్నారు. అయితే పాక్షికంగా కుళ్లిపోయిన ఆమె శరీరాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, మృతురాలి తలపై తుపాకీతో కాల్చిన గాయం ఉందని గుర్తించారు.అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర పాల్ సింగ్ దబార్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్య మృతదేహాన్ని కున్వారీ నది నుండి వెలికితీసి, పోస్ట్మార్టం కోసం పంపామని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మాత్రమే మరణానికి గల కారణాన్ని నిర్ధారించగలమన్నారు. మృతురాలి తండ్రి భరత్ సికార్వార్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించిందని, దీంతో భయపడి తాను మృతదేహాన్ని నదిలో పారవేశానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్కుమార్తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.North Carolina shooter opens FIRE from a boatGunfire tears into restaurant — reports of 7 victimsSuspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025విల్మింగ్టన్కు సమీపంలోని సౌత్పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్పోర్ట్ పోలీస డిపార్ట్మెంట్కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.pic.twitter.com/0P055nihKy— TheBlaze (@theblaze) September 28, 2025 -
యువతిని ప్రేమిస్తున్నాడని యువకుడిని కొట్టి చంపారు
సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీశ్ (29) అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ రావొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు సతీశ్ను పలుమార్లు వారించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8గంటలకు సతీశ్కు, యువతి కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. యువతి కుటుంబ సభ్యులు కర్రలతో సతీష్పై దాడి చేయగా, మృతిచెందాడు. -
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పో యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మహిళలు ఉన్నారు. వీరు కాకుండా 45 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసుల భద్ర తా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్ష త గాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రుల కు లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఘటనపై విచార ణకు రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఏర్పా టు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాల యంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్ బయలుదేరా రు. ఈ దుర్ఘటనపై 24 గంటల్లో నివేదికను సమ ర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సభాస్థలికి ఏడు గంటల ఆలస్యంగా..సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఈ నెల 13వ తేదీ నుంచి మీట్ ది పీపుల్ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన చేస్తున్నారు. ఇందులో అధికార డీఎంకేను తీవ్రంగా విజయ్ టార్గెట్ చేస్తున్నా రు. అలాగే బీజేపీని ఫాసిస్టులు అంటూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం నామక్కల్లో ఆయన పర్యటించారు. ఇక్కడి కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వా మి పురం సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. విజయ్ వెళ్లిన కొదిసేపటికే...విజయ్ వెళ్లిన కాసేపట్లోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్క సారిగా పెరగడంతో తోపులాట, తొక్కిస లాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఊపిరి ఆడక పోవడంతో సొమ్మ సిల్లే వారి సంఖ్య పెరిగింది. క్షణాలలో పదుల సంఖ్యలో అంబులెన్స్లు అక్క డికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారందర్నీ ఆస్ప త్రులకు తరలించారు. పదుల సంఖ్యలో అంబులెన్స్లు నిమి షాల వ్యవధిలో బాధితులతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకు న్నాయి. ఒక్కో అంబులెన్స్లో ఇద్దరు, ముగ్గుర్ని తీసు కొచ్చారు. ఒకే స్ట్రక్చర్లో ఇద్దరి లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి కొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 45 మంది చికిత్సలో ఉండగా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. మిన్నంటిన రోదనలుప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశాయి. ఆస్పత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచ్చి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటా హుటిన కరూర్కు చేరుకున్నాయి. కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్, ఎమ్మెల్యే , మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను తక్షణ చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితి తక్షణ సమీక్షకు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ను కరూర్కు పంపించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఉన్న వారందరికీ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇక, సీఎం స్టాలిన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సచివాలయానికి చేరుకుని కరూర్ పరిస్థితిపై సమీక్షించారు. అటు తర్వాత అర్ధరాత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. అంబులెన్స్తో గందరగోళం..కాగా సభా సమయంలో విజయ్ పార్టీ వర్గాలు అటుగా వచ్చిన ఒక అంబులెన్స్కు దారి ఇవ్వకుండా, డ్రైవర్ పైదాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి చేజారినట్లు సమాచారం. పోలీసుల ముందస్తు భద్రతా చర్యలలో వైపల్యాలపై విమర్శలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన విజయ్..కాగా, ఈ ప్రమాద ఘటనపై తిరుచ్చి విమానాశ్రయంలో విజయ్ను మీడియా ప్రశ్నించడంతో, ఆయన మౌనంగా విషణ్ణ వదనంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే.. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పోలీసులు వీటికి తగినంత భద్రత కల్పించాల్సి ఉంది. అప్పుడే తొక్కిసలాటలను నివారించొచ్చు. కానీ పోలీసులు విజయ్ సభకు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. విజయ్ అభిమానులు సైతం ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతున్నారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ప్రచార సభ కోసం కరూర్లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే, చివరకు పోలీసులు ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరడమే ఘటనకు దారితీసినట్లు విమర్శలు వస్తున్నాయి. -
కాబోయే భర్తకు లవర్ ఉందని తెలిసి.. షాకిస్తున్న మరో ఘటన
సంభాల్: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణం చోటుచేసుకుంది. ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్లో అరెస్ట్ చేశారు. ఈ దాడికి అతనిని ప్రేరేపించిన జాహ్నవి అలియాస్ అర్చనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.కాబోయే భర్త ప్రియురాలిపై యాసిడ్ దాడిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని అమ్రోహా జిల్లాలోని తిగ్రి గ్రామానికి చెందిన నిషు తివారీ (30)గా గుర్తించారు. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 22 ఏళ్ల టీచర్ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా, నిందితుడు స్కూటర్పై వస్తూ, దేహ్పా గ్రామం సమీపంలో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కృష్ణ కుమార్ తెలిపారు. దాడిలో టీచర్కు 20 నుండి 30 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి చేర్చారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.ఎన్కౌంటర్లో నిందితునికి గాయాలుగురువారం రాత్రి కళ్యాణ్పూర్ గ్రామం సమీపంలో స్కూటర్పై వెళుతున్నప్పుడు నఖాసా పోలీసులు నిషును ఆపినప్పుడు, అతను అధికారులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో అతని రెండు కాళ్లకు దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు. వెంటనే నిషును అరెస్టు చేసి, చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు కార్ట్రిడ్జ్లు, స్కూటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్కాచెల్లెళ్ల పేరుతో నాటకమాడి..పోలీసులు విచారణలో నిషు తివారి పలు ఆసక్తికర వివరాలు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మహిళ తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని, ఆమె డాక్టర్ అర్చనగా పరిచయం చేసుకున్నదని తెలిపాడు. డాక్టర్ అర్చన తనతో.. ఆమె సోదరి జాన్వికి ఒక సైనికుడితో నిశ్చితార్థం జరిగిందని, అయితే అతనికి అప్పటికే ప్రియురాలు ఉండటంతో అతను వివాహాన్ని రద్దు చేసుకున్నాడని వివరించింది. అందుకే అతని ప్రియురాలైన టీచర్ను అడ్డుతొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆ టీచర్పై యాసిడ్ దాడి చేయాలని తనకు చెప్పిందని నిషు తివారి పోలీసులకు తెలిపాడు. కాగా జాన్వి, డాక్టర్ అర్చన ఒకరేనని.. నిషు తివారీకి అబద్ధం చెప్పి, అతని చేత టీచర్పై యాసిడ్ దాడి చేయించిందని విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిషు తివారీ,జాన్విలను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. -
వైద్యం అందక ఐదేళ్ల బాలుడి మృత్యువాత
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక శుక్రవారం ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీ హరిజన కేటీ రాజేష్, సరిత దంపతుల ఐదేళ్ల కుమారుడు అహరోన్కుమార్ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో ఉరవకొండ లోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నైట్ డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్తోపాటు ఏఎన్ఎంలు ప్రియాంక, అంజన ఉన్నారు. డాక్టర్ ఆస్పత్రి పై భవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా, నర్సు ప్రియాంక తానే తెలిసిన వైద్యం చేసి ఇంజక్షన్ తోపాటు సెలైన్ పెట్టారు. డాక్టర్ను పిలిచి ఒకసారి బాబు పరిస్థితి చూడాలని కుటుంబ సభ్యులు చెప్పినా ఏఎన్ఎం పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబు పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఇస్మాయిల్ హుటాహుటిన వచ్చి పరీక్షించారు. అప్పటికే బాబు మృతి చెందాడు. పుట్టిన రోజు జరిగిన నాలుగు రోజులకే బాబు మృతిచెందడం బాధాకరం. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు దీంతో ఆస్పత్రి ఎదుట బాబు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి ఉరవకొండ అర్బన్ సీఐ మహనంది, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్ కూడా ఆస్పత్రికి వచ్చి శాఖా పరమైన విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్తో పాటు కలెక్టర్కు సమరి్పస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కుజభంగిలో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కుజభంగికి చెందిన ప్రవీణ్ కుమార్ భార్య అగతంబిడి లావణ్యకు రెండు నెలల క్రితం బిడ్డ జన్మించింది. ఈ నెల 24న గ్రామంలో వైద్య సిబ్బంది పసికందుకు వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బిడ్డకు జ్వరం వస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారు జామున ఊపిరాడకపోవడంతో బిడ్డ మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై స్థానిక వైద్యాధికారి పి.రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పసరు మందు పట్టించడం వల్లే పసికందు మృతి చెందిందన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేస్తే సాధారణ జ్వరం ఉంటుందని, పుట్టుకతోనే పసికందుకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయన్నారు. మూర్ఛ ఉన్నట్టు తెలియక బాధిత కుటుంబీకులు పసరు మందును పట్టించడంతో పరిస్థితి విషమించి పసికందు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు.డెంగీతో బాలుడి మృతి గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలో రెండేళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి(2)కి పది రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో రక్తపరీక్ష చేయించారు. డెంగీగా నిర్ధారణ కావడంతో ఎమ్మిగనూరులోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. ఆరి్థక స్థోమత లేని తల్లిదండ్రులు.. నరహరిని సోమవారం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నరహరి శుక్రవారం మరణించాడు. -
జనవరిలో చిన్నోడిని.. నేడు పెద్దోడిని..
కేసముద్రం: కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులను హత్య చేసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన శిరీషను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు మనీష్ కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు.లారీడ్రైవర్గా పనిచేస్తున్న ఉపేందర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని, ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శిరీష మనస్తాపా నికి గురైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. తాను ఆత్మ హత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని శిరీష భావించింది. ముందుగా బిడ్డలను చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ ఏడాది జనవరి 15న రెండేళ్ల చిన్నకుమారుడు నిహాల్ను నీటిసంపులో పడేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయినట్లు చిత్రీకరించింది. ఆ తర్వాత గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమారుడు మనీష్ మెడపై కత్తితో దాడి చేసింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారని అందరూ భావించారు. ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మనీష్ (6) మెడకు నైలాన్దారం చుట్టి హత్య చేసింది. ఏమీ తెలియనట్లుగా బతుకమ్మ ఆడేందుకు వెళ్లింది. శిరీష అత్త మంగమ్మ పనికి వెళ్లి వచి్చంది. మనీష్ ఎక్కడున్నాడని శిరీషను అడగ్గా, జ్వరంగా ఉంటే ఇంట్లో పడుకోబెట్టానని చెప్పింది. అన్నం తినిపిద్దామని మనుమడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా, మనీష్ చనిపోయి ఉండటంతో కేకలు పెడు తూ బోరున విలపించింది. శిరీషపై అనుమానం వచి్చన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇద్దరు కుమారులను తానే చంపినట్లు ఒప్పుకుంది. శిరీషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
జమ్మూ కశ్మీర్లో బాపట్ల సైనికుడి మృతి
బాపట్ల టౌన్: జమ్మూ కశ్మీర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సైనికుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. జిల్లా పోలీస్ అధికారులు, సూర్యలంక ఎయిర్ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు, ఎన్సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సివిల్స్ ఇంటర్వ్యూలో ఫెయిలై.. సైబర్ నేరగాడిగా మారి..
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు కిలారు సీతయ్య.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాడు. పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందాడు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అనేక కోచింగ్ సెంటర్లకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి సైబర్ నేరగాడిగా మారాడు. హైదరాబాద్, సైబరాబాద్ల్లో అనేక కేసులు నమోదై ఉన్న ఇతగాడు తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్లకు టోకరా వేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పుణే సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం సీతయ్యను యాప్రాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. సివిల్స్కు ఎంపిక కాకపోవడంతో డిప్రెషన్ ఆంధ్రప్రదేశ్లోని నందిగామకు చెందిన డాక్టర్ సీతయ్య విద్యాభ్యాసం ఏపీ, తెలంగాణల్లో కొనసాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూకేషన్స్ విభాగంలో మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లిన ఇతగాడు అక్కడి ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాడు. బాచుపల్లిలో ఉంటూ కొన్నాళ్లు హైదరాబాద్ శివార్లలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. వివాహమైన తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారిగా మారాలని భావించి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే సెలెక్ట్ కాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లాడు. సీతయ్య ప్రవర్తన మారిపోవడం, ఉద్యోగం కూడా మానేయడంతో భార్య విడాకులు తీసుకుంది. సొంతంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టాలని భావించినా, అది సాధ్యం కాక కొన్ని సెంటర్లకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. బెట్టింగ్ వ్యసనంతో నేరగాడిగా మారి... డిప్రెషన్లో ఉన్న సీతయ్య దాని నుంచి బయటపడటానికి ఆన్లైన్ గేమింగ్ ఆడటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అది వ్యసనంగా మారి భారీస్థాయిలో బెట్టింగ్స్ పెట్టాడు. ఈ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం సైబర్ నేరగాడిగా మారాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ జాబ్ పోర్టల్స్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించిన సీతయ్య..వారిని సంప్రదించి దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. తన వల్లో పడిన వారి నుంచి భారీ మొత్తం వసూలు చేసి వారికి నకిలీ ఆఫర్ లెటర్లు పంపించాడు. కొందరిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా చేశాడు. 2023 నుంచి ఈ పంథాలో మోసాలు చేస్తున్న ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లతోపాటు గచ్చిబౌలి ఠాణాలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లివచ్చినా సీతయ్య పంథా మారలేదు. ఐఐటీ బాంబే ప్రొఫెసర్గా పుణేలో టోకరా పుణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ వీసీకి ఈ ఏడాది జూలైలో ఫోన్ చేసిన ఇతగాడు తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అంతరిక్ష రంగంలో ఆర్టిఫిషియల్ ఆధారిత ప్రయోగాలు చేపట్టే ప్రాజెక్టులకు తాము ఫండ్స్ ఇస్తున్నామని నమ్మించాడు. సదరు ప్రొఫెసర్ ఈ విషయాన్ని వర్సిటీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనతో సంప్రదింపులు జరిపాడు. రూ.28 కోట్ల ఫండ్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి దఫదఫాలుగా రూ.2.46 కోట్లు కాజేశాడు. జూలై 25–ఆగస్టు ఏడు మధ్య ఈ లావాదేవీలు జరగ్గా, తాము మోసపోయామని గుర్తించిన వర్సిటీ అధికారులు ఈ నెల మొదటివారంలో పుణే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీతయ్య ఆచూకీ యాప్రాల్లో గుర్తించిన అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. పుణే కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదివారం వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మహారాష్ట్రలో ఉన్న మరో రెండు వర్సిటీలకు టోకరా వేయాలని సీతయ్య ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్
హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఓ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గురువారం(సెప్టెంబర్ 25వ తేదీ) ఏసీబీ సోదాలు నిర్వహించగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం 18వేలు లంచం అడిగి ఏసీబీకి దొరికిపోయారు రమేష్. . రూ.8వేలు తీసుకుంటు పట్టుబడ్డారు ఇంజినీర్ రమేష్. గతంలో రూ. 10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్లో రమేష్ పని చేస్తున్నారు. -
నెల్లూరు చిన్నారుల అదృశ్యం విషాదాంతం
సాక్షి, నెల్లూరు: ఉయ్యాలపల్లి చిన్నారుల అదృశ్యం ఘటన.. విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఆ తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ పరిణామంతో.. మిస్సింగ్ కేసును మిస్టరీ డెత్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉయ్యాలపల్లి(Uyyalapalli) గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష్ణువర్దన్, శ్రవణ్లు బుధవారం మధ్యాహ్నాం ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేపట్టారు. ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి ఉంటారనే స్థానికులు చెప్పడంతో డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..గురువారం విష్ణువర్దన్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. ఆపై అనుమానంతో కొంత నీటిని బయటకు తోడేయడంతో శ్రవణ్ మృతదేహాం కూడా బయటపడింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
చిత్తూరులో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి?
సాక్షి, పలమనేరు: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్ అడవిలో లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే..గంటావూరుకు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని సీఐ డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్కుమార్.. ఆమెపై కన్నేసి ప్లాన్ చేశాడు. (కిరణ్ ప్రస్తుతం సోమలలో పనిచేస్తున్నాడు) ఫిర్యాదులోని ఫోన్ నంబరును తీసుకుని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డు ఉమాశంకర్కు (ఇప్పుడు పుంగనూరులో విధులు నిర్వహిస్తున్నాడు) తన బాధను తెలుపుకుంది.దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది.ఎస్పీని కలిసి న్యాయం చేయాలని..తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఎలాగూ న్యాయం చేయరని భావించి తాజాగా జిల్లా ఎస్పీగా వచ్చిన తుషార్డూడిని ఇటీవలే కలిసి జరిగిన ఘోరంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్కు అప్పజెప్పారు. సంఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాళెం సీఐని కలవాలని ఆయన చెప్పారు. దీంతో బాధితురాలు బంగారుపాళెం సీఐని కలిసింది. ఆ కానిస్టేబుల్కు అధికార పార్టీ అండదండలు ఉండడం, నిందితుడు పోలీసు కావడంతో అప్పట్లో ఎఫ్ఐఆర్ వేయకుండా కాలయాపన చేశారు. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు బుధవారం చిత్తూరులో ప్రెస్మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే స్పందించిన పోలీసులు బుధవారమే ఎఫ్ఐఆర్ వేశారు. బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని..భర్త వదిలేయడం, న్యాయం కోసం వెళ్తే ఇలా లైంగిక వేధింపులతో బతకడం ఇష్టంలేక రెండు నెలల కిందట మొగిలి సమీపంలోని దేవరకొండలో ఆలయం వద్ద ఆత్మహత్య చేసుకుందామని బాధితురాలు నిర్ణయించుకుంది. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పీఎస్కు చెందిన ఇరువురు కానిస్టేబుళ్లు బాధితురాలిని చూసి అడవిలో ఎందుకున్నావని ఆరా తీశారు. తనది పలమనేరని చెప్పగా తెలిసినవారెవరైనా ఉన్నారా అనగానే.. ఆమెను వేధిస్తున్న కానిస్టేబుల్ నంబరు ఇచ్చింది.దీంతో వారు అతడికి కాల్ చేయగా ఆమె తనకు తెలుసునని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీన్ని అదునుగా భావించిన ఆ కానిస్టేబుల్ ఓ కారులో ఇక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్డ్రింక్ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జరిగిన విషయంపై ఎవరికై నా చెబితే ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో బాధితురాలు ఏం చేయలేకపోయింది.అయితే, బాధితురాలు మీడియా సమావేశానికి ముందే ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తోంది. పోలీసులకైతే ఓ న్యాయం సామాన్యులకైతే మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొందరు కానిస్టేబుళ్ల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోంది. దీనిపై జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వీడియో: కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి..
సాక్షి, కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న తమ కూతురిని అత్తారింటి నుంచి బలవంతంగా సినీఫక్కీలో ఆమె తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారు. అడ్డు వచ్చిన బాధితురాలి భర్త, ఆయన కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెంది జలగం ప్రవీణ్, ఇదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం నచ్చని యువతి తల్లిదండ్రులు ప్రవీణ్ నుంచి తమ కూతురును ఎలాగైనా విడదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్వేత తల్లిదండ్రులు బాల నర్సింహ, మహేశ్వరి, మేనమామ మోహన్, తమ్ముడు సాయితో పాటు మరికొందరు ఉదయం 9 గంటల సమయంలో ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు.ప్రవీణ్తో పాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల కళ్లలో కారం చల్లి, తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేశారు. శ్వేతను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ప్రవీణ్ పాటు ఆయన తల్లికి గాయాలయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమపై దాడికి పాల్పడి శ్వేతను బలవంతంగా కిడ్నాప్ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. -
సైబర్ నేరగాళ్లపై ‘హంటర్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు కీలక ఆధారం అవుతున్న మ్యూల్ ఖాతాలకు, లావాదేవీలకు చెక్ చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) రూపొందించిన ఏఐ టూల్ మ్యూల్హంటర్.ఏఐ వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని ఇప్పటికే దాదాపు 15 బ్యాంకులు వినియోగిస్తుండగా మిగిలిన వాటికీ విస్తరించనున్నారు. ఈ టూల్ ద్వారా అనుమానిత బ్యాంకు ఖాతాలతో పాటు లావాదేవీలను గుర్తించడం, బ్లాక్ చేయ డం తేలికవుతుంది. ఫలితంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఖాతాల ఆధారంగానే స్కామ్స్.. » కాల్సెంటర్లు ఏర్పాటు చేసి మరీ వివిధ రకాలైన సైబర్ నేరాలు చేయిస్తున్న సూత్రధారులు ఇటీవలి కాలంలో విదేశాల్లోనే ఉండి కథ నడుపుతున్నారు. వీళ్లు బా«ధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తమ ఖాతాలు వినియోగించరు. వివిధ మార్గాల్లో దళారుల్ని గుర్తించి వారి ద్వారా చిరుద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులకు ఎరవేస్తారు. వీరి కేవైసీ వివరాలతో, బోగస్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.వీటికి సంబంధించిన డెబిట్ కార్డులు, చెక్బుక్స్ తదితరాలు తీసుకునే దళారులు వాటిని సూత్రధారులకు పంపిస్తూ ఉంటారు. ఈ ఖాతాల (మ్యూల్) ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్లు తీసుకునే వారిని మనీ మ్యూల్స్గా పరిగణిస్తుంటారు. ఈ మనీ మ్యూల్స్కు, వారి ఖాతాలకు చెక్ పెట్టడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.95% కచ్చితత్వం.. ఆర్బీఐహెచ్ గత ఏడాది డిసెంబర్లో ఈ టూల్ను అభివృద్ధి చేసింది. ఇది ఆయా బ్యాంకుల్లో ప్రభావవంతంగా పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను ఈ టూల్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన ఖాతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ అంశంలో దీని కచ్చితత్వం 95 శాతం ఉన్నట్లు తేల్చారు. కొత్తగా తెరిచిన ఖాతాల్లో లేదా వినియోగంలో ఉన్న వాటిలో అకస్మాత్తుగా భారీ మొత్తాలతో లావాదేవీలు జరిగినా అప్రమత్తం చేస్తుంది. నగదు డిపాజిట్ అయినా, విత్డ్రా అయినా అలెర్ట్ చేయడంతో పాటు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంది. ఒకే చిరునామాతో అనేక బ్యాంకు ఖాతాలు తెరిచినా పసిగట్టడంతో పాటు ఈ–కేవైసీనీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏఐ టూల్ ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ అథెంటిసిటీలను తనిఖీ చేయగలదు. నరేష్ మల్హోత్రా కేసు కలకలం ఇటీవలి కాలంలో తరచూ డిజిటల్ అరెస్టు మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, వృద్ధులను టార్గెట్గా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందంటూ, పోలీసు, ఇతర ఏజెన్సీల అధికారులుగా ఫోన్లు, వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు తమ కష్టార్జితం రూ.లక్షల నుంచి రూ.కోట్లు కూడా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చోటు చేసుకున్న నరేష్ మల్హోత్రా ఉదంతం అన్ని దర్యాప్తు ఏజెన్సీలను కదిలించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన మల్హోత్రా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య ‘డిజిటల్ అరెస్టు’లో రూ.23 కోట్లు కోల్పోయారు. అన్ని బ్యాంకులు మ్యూల్ హంటర్ను వినియోగిస్తే ఈ నేరం జరిగేది కాదని, జరిగినా అత్యధిక మొత్తం ఫ్రీజ్ అయ్యేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు ఈ టూల్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. -
పరారీలో ‘గలీజు’ బాబా చైతన్యానంద సరస్వతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బాబా స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)(Swami Chaitanyananda Saraswati)విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమ ఫిర్యాదులో బాబాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి) ఢిల్లీలోని వసంత్కుంజ్( Vasant Kunj) ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారంతా ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. అయితే, చైతన్యానంద సరస్వతి తమతో అసభ్య పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు ఆరోపించారు.విద్యా సంస్థలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 17 మంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఇక, ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేశారు.ఇది కూడా చదవండి: యూపీలో సరికొత్త అధ్యాయం.. ఉమెన్ పోలీసింగ్ పవర్ ఇది..కాగా, విద్యార్థినుల ఫిర్యాదు తర్వాత చైతన్యానంద సర్వసతి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, చివరిగా అతడి లొకేషన్ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్మెంట్లో ఒక కారు గుర్తించిన పోలీసులు.. దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని వెల్లడించారు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈ తరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. -
మాకు ఇక దిక్కెవరమ్మా..!
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇంట్లో చీరతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన రామసాని అనిల్రెడ్డికి చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అక్షయ(32)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. మంగళవారం ఉదయం అక్షయ తనకు తలనొప్పిగా ఉందని, బయట టీ స్టాల్ నుంచి టీ తీసుకురమ్మని భర్తకు చెప్పి పంపించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ బెడ్రూంలో వెంటిలేటర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి అక్షయ ఉరికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. వారు వచ్చి అక్షయను కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త అనిల్రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిసాటి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. భాస్కర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల మధ్య గత ఆరు నెలలుగా కలహాలు మొదలయ్యాయని, ఈ క్రమంలోనే భర్త అనిల్రెడ్డే అక్షయను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. కాగా ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి ఇద్దరు పిల్లల పేరిట రూ.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు స్థిరాస్తినంతా పిల్లలకు రాసిచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. -
‘దటీజ్ యోగి’.. పోలీసింగ్లో సరికొత్త అధ్యాయం!
ఉత్తర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్కౌంటర్లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్పై వెళ్తున ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది. ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.उक्त सम्बन्ध में श्रीमती उपासना पाण्डेय, सहायक पुलिस आयुक्त नन्दग्राम की वीडियो बाइट-@Uppolice https://t.co/VOUOjuBHf8 pic.twitter.com/x9XCNGSqwh— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 22, 2025యోగి ప్రశంసలు దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్ను మహిళా పీఎస్ స్టేషన్ హెడ్ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్లో మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్కౌంటర్లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్లలో 63 మంది క్రిమినల్స్ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త! -
సైబర్ వల..చిక్కితే విలవిల..!
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరిద్దరు కాదు చాలామంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు నష్టపోతున్నారు. పార్ట్టైం, ఫుల్టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆన్లైన్లో ఫేక్ లింక్లు పెట్టి వాటిని క్లిక్ చేసేలా ఆశ చూపించి మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్లు, ఫేక్ లింక్ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు... » బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్, యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్కార్డు, క్రెడిట్కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. » డిజిటల్ లావాదేవీలకు బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లు స్కానింగ్ లేదా ఎంపిన్ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. » ఏదైనా ఫోన్కాల్, ఈ–మెయిల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరా దు. ఒకవేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోం బ్యాంక్ శాఖను సంప్రదించాలి. » ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లలో యూఆర్ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం అధికార వెబ్సైట్లనే ఉపయోగించాలి. » ఏదైనా వెబ్సైట్, అప్లికేషన్లో మీ ఈమెయిల్ను యూజర్ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్ పాస్వర్డ్ను ‘పాస్వర్డ్’ అని పెట్టుకోవద్దు.ఆన్లైన్ ఉద్యోగం పేరుతో మోసం...అనకాపల్లిలో గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్ట్టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో రిజి్రస్టేషన్ కోసం రూ.1,000లు ఫోన్పే చేశాడు. కొద్ది రోజుల్లోనే మణికంఠ ఖాతాలో రూ.1,400 జమ అయ్యాయి. దీంతో పార్ట్టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన ఆ యువకుడు నిర్వాహకులు చెప్పిన విధంగా దపదఫాలుగా రూ.1.80 లక్షలు పంపించాడు. తర్వాత అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు.అచ్యుతాపురం కేంద్రంగా సైబర్డెన్...అచ్యుతాపురంలో ఒక అపార్ట్మెంట్లో సైబర్ డెన్ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కాల్ సెంటర్ను నడుపుతూ ప్రజల వ్యక్తిగత బ్యాంక్ వివరాలు మోసపూరితంగా సేకరించి, ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారిని కూడా టార్గెట్ చేసే ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులను సీఐడీకి అప్పగించారు.ఆన్లైన్ లింక్లు క్లిక్ చేయవద్దు.. బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగరు. అలా అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనే. ఆన్లైన్ లింక్లు వస్తే వాటిని క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే వెంటనే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయొద్దు. ఒకవేళ చేశారంటే మీ బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరినట్టే. ఫేస్బుక్కుల్లో కూడా అందమైన అమ్మాయిల పేరిట హానీ ట్రాప్, లింక్లు పెట్టి మోసం చేస్తారు. అలా జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు తెలియజేయాలి. – సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్నకిలీ ఆన్లైన్ షాపింగ్ వలలో పడొద్దు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే బ్యాంక్ ఖాతాల్లో నగదు ఫ్రీజ్ చేస్తాం. అలా ఫ్రీజ్ చేసిన సొమ్మును అనేక కేసుల్లో బాధితులకు ఇప్పటికే అప్ప గించాం. పండగల సమయాల్లో నకిలీ ఆన్లైన్ షాపింగ్ యాప్ల ద్వారా ఆఫర్లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. – తుహిన్ సిన్హా, ఎస్పీడిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు..నర్సీపటా్ననికి చెందిన ఒక వృద్ధుడు సైబర్ మోసానికి గురయ్యారు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాలో అనాథరైజ్డ్గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయిందని, తక్షణమే రిటర్న్ కొట్టకపోతే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పండి చెక్ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వారి మాటలకు భయపడి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకు తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు. 94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్జిల్లాలో జూలై 1 నుంచి నేటి వరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించారు.జిల్లాలో గత ఆరేళ్లుగాసైబర్ కేసుల వివరాలు» 2021లో 128» 2022లో 217» 2023లో 310» 2024 జూన్ వరకు 201 » 2024 జూన్ నుంచి నేటి వరకు 94 కేసులు -
టీడీపీ నేతల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమ్రెడ్డి, మోహన్రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ‘ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు. దొరువుపాళెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ.. మహిళల పొదుపు సొమ్ము సుమారు రూ.18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి, మా బంధువు దారా కోటేశ్వరమ్మను నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు. ఈ అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నా చావుకు అధికార టీడీపీ నాయకులే కారణం’ అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రలు మింగారు. అనంతరం ఆమె కుప్పకూలిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబుకు మత్తయ్య షాక్
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో మత్తయ్య పేర్కొన్నాడు.ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది. -
డిజిటల్ అరెస్ట్తో రూ. 23 కోట్లు దోచేశారు.. నా జీవితం మీ అందరికీ హెచ్చరిక..!
తాము ఆఫీసర్లమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే డిజిటల్ అరెస్ట్ బారిన పడి కోట్లలో పోగోట్టుకున్నవారు అనేక మందిఉండగా, అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ వృద్ధుడు రూ. 23 కోట్లును పోగొట్టుకున్నాడు. సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్, 75 ఏళ్ల వృద్ధుడు నరేష్ మల్హోత్రాను ఏకంగా నెలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేశారు. దాంతో ఆయన జీవితాంత పొదుపు చేసుకున్న రూ. 23 కోట్లను దోచేసుకున్నారు. నరేష్ మల్హోత్రాకు సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్ ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసి ఒంటరిగా జీవిస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు. ఆయనకు నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్టెల్ మెయిన్ ఆఫీస్ పేరుతో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఆ ఫోన్ కాల్ను మహిళ చేసింది. తన ల్యాండ్లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆ ఫోన్ చేసిన మహిళ తెలిపింది. దీనిలో భాగంగా ఎన్ఐఏ చట్టం అరెస్ట్ చేస్తామని నరేష్ మల్హోత్రాను భయపెట్టింది. మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. మేము మిమ్మల్ని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఆ వృద్ధుడికి ఓ వీడియో కాల్ వచ్చింది. ఈ క్రమంలోనే నరేష్ మల్హోత్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు దోచేసింది ఆ మహిళ. తరువాత నరేష్ మల్హోత్రాపై నకిలీ చార్జిషీట్ తయారు చేసి పంపారు. ప్రతి రెండు గంటలకు తనను విచారిస్తామని ఆమె చెప్పింది. ఇది సీక్రెట్స్ యాక్ట్. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే, మనీలాండరింగ్ నిరోధక ఆరోపణల కింద మిమ్మల్ని అరెస్టు చేస్తారని అని బెదిరించారు. ఇలా నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టు , ఆర్బీఐ పేర్లను వాడుకుంటూ నెలరోజుల్లో రూ. 23 కోట్లు దోచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది భారత దేశంలో అతిపెద్ది డిజిటల్ అరెస్ట్. ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రూ. 12.11 కోట్లను మాత్రం పోలీసులు సీజ్ చేశారు.నా జీవితం మీ అందరికీ హెచ్చరికఅయితే తాను దాచుకున్న డబ్బును ఇలా కొట్టేయడంపై నరేష్ మల్హాత్రా కన్నీటి పర్యంతమవుతున్నారు. తనకు ఈ వయసులో ఇలా జరగడం నిజంగా దురదృష్టమేనని, ఇది మిగతా అందరికీ ఒక హెచ్చరిక, మేలుకొలుపు అవుతుందన్నారు. తాను డిజిటల్ అరెస్ట్ మోసగాళ్లను నమ్మిన కారణంగానే ఇలా జరిగిందని, ఎవరూ కూడా తనలా మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు నరేష్ మల్హాత్రా. -
ప్రియుడి కోసం స్వాతి స్కెచ్.. మతిపోవాల్సిందే!
వివాహేతర సంబంధాల మోజుతో భర్తలను, భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య చూస్తున్నవే. అలాగే.. ప్రేమ మత్తులో తల్లిదండ్రులకు, అయిన వాళ్లకూ ద్రోహాన్ని తలపెడుతున్న జంటలనూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్వాతి తన ప్రేమికుడి కోసం చేసిన పని మాత్రం.. నెక్ట్స్ లెవల్ అంతే!.స్వాతి(21).. స్థానికంగా సెలూన్ నడిపించే మనోజ్(22) అనే యువకుడ్ని గాఢంగా ప్రేమించింది. కానీ, ఇంట్లో వాళ్లు తమ ప్రేమకు ఒప్పుకోరని భయపడింది. ఈ క్రమంలో రోజూ రాత్రి ఇంట్లో వాళ్లు తినే తిండిలో మత్తు మందు మాత్రలు కలుపుతూ వచ్చింది. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో ఊరిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఏకాంతంగా గడపం చేస్తూ వచ్చింది. అలా.. ఓ రోజు స్వాతి కదలికలపై ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. దీంతో..ఆమె మనోజ్ను సలహా అడిగింది. గప్చుప్గా ఇంట్లో వాళ్లను చంపేయమని చెప్పాడు మనోజ్. స్వాతి అన్నంత పని చేయబోయింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. దీంతో.. ఆ ప్రేమ జంట ఓ క్రైమ్ షో స్పూర్తితో మరో భయంకరమైన స్కెచ్ వేసింది.తమ ప్లాన్ను మనోజ్ తన దగ్గరి బంధువు మాంజిత్కు సాయం కోరాడు. మాంజిత్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. సెప్టెంబర్ 17వ తేదీన.. స్థానికంగా పెయింటింగ్ పనులు చేసే యోగేష్.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాడు. అతన్ని గమనించి మనోజ్.. మద్యం ఆఫర్ చేసి అతన్ని జనసంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలవడంతో యోగేష్ సోయి లేకుండా పడిపోయాడు. ఆపై అతన్ని మనోజ్, మాంజిత్లు తమ బైక్పై ఎక్కించుకుని దగ్గర్లోని ఓ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక రాళ్లతో కొట్టి యోగేష్ను దారుణంగా హతమార్చారు. ఆపై యోగేష్ ఫోన్ నుంచి స్వాతి సోదరుడు గౌరవ్కు ఫోన్ చేసి.. కాల్ కట్ చేశారు. అటుపై పోలీస్ హెల్ప్లైన్కు కాల్ చేసి ‘‘యోగేష్, కపిల్(స్వాతి సోదరులు), శోభారామ్(స్వాతి తండ్రి) తనపై దాడి చేస్తున్నారని.. తనను కాపాడాలని’’ వేడుకుంటూ ఫోన్ కట్ చేసి యోగేష్ డెడ్బాడీ దగ్గర పడేసి వెళ్లిపోయారు.తెల్లారి స్మశానంలో శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలతో.. ఈ కేసులో పోలీసులు స్వాతి తండ్రి, సోదరులే నిందితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో.. యోగేష్కు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా తండ్రి, సోదరులు అరెస్ట్ అయినా స్వాతి ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండిపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో.. ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె మనోజ్ను రహస్యంగా కలవడంతో.. అనుమానం అతనిపైకి మళ్లింది. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో.. యోగేష్ హత్యలో మనోజ్ పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు అప్పటికే పరారైన అతని కోసం గాలింపు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం(సెప్టెంబర్ 22వ తేదీ) అతనిపై కాల్పులు జరిపి(కాలికి బుల్లెట్ గాయం అయ్యింది) మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల ఎదుట మనోజ్, మాంజిత్లు నేరం ఒప్పుకున్నారు. అయితే.. ఈ కేసులో మాస్టర్ మైండ్ స్వాతినే అని చెప్పేసరికి పోలీసులు కంగుతిన్నారు. తన తండ్రిని, సోదరులను ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తే కటకటాల పాలవుతారని, అలా తమకు ఏ అడ్డు ఉండబోదని స్వాతి భావించిందట. అలా పాపం అమాయకుడైన యోగేష్ను కూడా చంపేందుకు ఆమెనే ఎంపిక చేసిందట. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. ఈ ఘాతుకం ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో జరిగింది. -
బాయ్ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతూ..
అన్నానగర్(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని ఎరుమనూర్ గ్రామానికి చెందిన దర్శిని (18). ఈమె విరుదాచలం ప్రభుత్వ కొలంజియప్పర్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం బి.ఎ. చదువుతోంది. విరుదాచలం జంక్షన్ రోడ్ బస్టాండ్ సమీపం సెల్ఫోన్ సేల్స్ షాపులో పనిచేస్తోంది. విద్యార్థిని దర్శిని కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సోమవారం ఉదయం సెల్ఫోన్ షాపులో పనిచేస్తుండగా, తన ప్రియుడితో సెల్ఫోన్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సమస్య కారణంగా, వీడియో కాల్లో మాట్లాడుతున్న దర్శిని దుకాణం వెనక్కి వెళ్లి అక్కడి గదిలో తలపాగాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను..!
ప్రొద్దుటూరు క్రైం(కడప జిల్లా): వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి(Venugopal Reddy) కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది. ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు.నిందితుల్లో వేణుగోపాల్రెడ్డి భార్య తరపు బంధువు కూడా..వేణుగోపాల్రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు వేణుగోపాల్రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పరార్.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
సాక్షి, తూర్పుగోదావరి/ఎన్టీఆర్ జిల్లా: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దొంగతనం కేసులో నిందితుడు అయిన ఇతను పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్స్పెక్టర్ తెలిపారు.పైముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 94407 96584 (ఇన్స్పెక్టర్ దేవరపల్లి), 94407 96624 (సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి) ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్లో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. -
భార్య చికెన్ వండలేదని యువకుడి ఆత్మహత్య
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి కిడ్నాప్ కలకలం!
తాడేపల్లి రూరల్: అప్పటిదాక జ్యూస్ షాప్ నడిపి... భార్యతో కారులో ఇంటికి వెళ్తున్న యువకుడిని ఐదుగురు వ్యక్తులు అడ్డుకుని తీసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి స్టేషన్ పరిధి ప్రాతూరు రోడ్డులో జరిగింది. యువకుడి భార్య లక్ష్మీప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డులో కె.స్రవంత్రెడ్డి జ్యూస్ షాప్ నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం స్నేహితుడి కారులో ప్రాతూరులోని ఇంటికి వెళ్తుండగా కుంచనపల్లి దాటాక ఓ కారు వచ్చి అడ్డగించింది. తొలుత ఇద్దరు, తర్వాత ముగ్గురు కిందకు దిగారు.తాము పోలీసులమని, యాక్సిడెంట్ కేసులో నీ భర్తను విచారించడానికి తాడేపల్లి తీసుకెళ్తున్నామని చెప్పారు. కానీ, ప్రాతూరు వైపు వెళ్తుండడంతో లక్ష్మీప్రసన్న అనుమానించింది. తమ కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు. వాహనాన్ని తిప్పుకొని తాడేపల్లి బైపాస్ వైపు వెళ్లాడు. స్రవంత్రెడ్డిని ఒకవైపు, తాము ప్రయాణిస్తున్న కారును తాడేపల్లి వైపు తీసుకువెళ్లారు. రూటు మార్చడంతో... 100కు డయల్ చేసినా స్పందన రాలేదని, సంఘటనపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని లక్ష్మీప్రసన్న తెలిపింది. కాగా, ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్ఐ ప్రతాప్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. స్రవంత్రెడ్డిని తీసుకెళ్లింది పోలీసులే అయి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్రవంత్కు ఎవరితోనూ గొడవల్లేవని, కేసులు లేవని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్.. ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ పెట్టుకుని పిడికిళ్లు బిగించుకుని సోమవారం గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా శ్రీరామవరం ప్రాంతానికి చెందిన కమ్మ రాజు రైతు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రావ్య (20) గుంటూరు అశోక్నగర్లోని నవీన్ లేడీస్ హాస్టల్లో ఉంటూ వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం బీటెక్ చదువుతోంది.చదువులో చురుగ్గా ఉంటూ 85 శాతం మార్కులు సాధిస్తోంది. అయితే, ఆదివారం సాయంత్రం శ్రావ్య తన చిన్ననాటి స్నేహితురాలైన జాగృతికి ఫోన్చేసి తనకు చాలా చికాకుగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ కన్నీరుమున్నీరైంది. దీంతో స్నేహితురాలు ధైర్యం చెప్పింది. అయినా అనుమానంతో జాగృతి.. శ్రావ్య సోదరుడికి ఫోన్చేసి జరిగిన విషయం వివరించింది. అతను తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ఏలూరు వచ్చేయాల్సిందిగా కుమార్తెకు చెప్పింది. అయితే, గురువారం నుంచి సెలవులు కాబట్టి అప్పుడు వస్తానని తన తల్లితో శ్రావ్య చెప్పింది. ఆన్లైన్లో ప్లాస్టర్, ఐరన్ క్లిప్ ఆర్డర్.. కానీ, శ్రావ్య ఆదివారం రాత్రే ఆత్మహత్య చేసుకునేందుకు ప్లాస్టర్ను, ఐరన్ క్లిప్ను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డెలివరి వచ్చింది. హాస్టల్లోని తోటి స్నేహితులు ఆరుబయట మెట్లపై ఎందుకు కూర్చున్నావని శ్రావ్యను అడగటంతో ఆమె దురుసుగా మాట్లాడింది. దీంతో వారంతా లోపలకు వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి నోటికి ప్లాస్టర్, ముక్కుకు ఐరన్ క్లిప్ను పెట్టుకుని రెండు పిడికిళ్లు గట్టిగా బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున తోటి విద్యార్థినులు గదిలో నుంచి బయటకొచ్చి చూసి భయంతో హాస్టల్ వార్డెన్కు సమాచారమిచ్చారు.సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హాస్టల్లో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. తోటి విద్యార్థినులతో వారు మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. శ్రావ్య కుటుంబ సభ్యులు హాస్టల్కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు శ్రావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/సిరిసిల్ల: ఛత్తీస్గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి (67) అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి (63) అలియాస్ వికల్ప్ మృతి చెందారు. ఈ ఘటనపై నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మహారాష్ట్రకు సమీప సరిహద్దులో ముస్ఫర్షి దగ్గరున్న దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం శుక్రవారమే పోలీసులకు అందిందని, దీంతో భద్రతాదళాలు మావోలు తలదాచుకున్న ప్రదేశాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముడుతూ ముందుకు వెళ్లాయన్నారు. సోమవారం ఉదయం ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా, కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి చనిపోయినట్టుగా గుర్తించామని వివరించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, ఒక ఇన్సాస్, ఒక బీఎల్జీ, పేలుడు పదార్థాలతోపాటు మావోయిస్టుల వ్యక్తిగత సామగ్రి, విప్లవ సాహిత్యం స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని పద్ధతి ప్రకారం భద్రతా దళాలు తుదముట్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎక్స్లో పోస్ట్ చేశారు. రెడ్ టెర్రర్కు రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. ఇద్దరూ ఇద్దరే.. 21వ ఆవిర్భావ వేడుకలు మొదలైన రెండో రోజే మావోయిస్టు పార్టీ ఇద్దరు అగ్రనేతలను కోల్పోయింది. అందులో ఒకరైన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె. సత్యనారాయణరెడ్డి తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అన్నమ్మ గృహిణి. సోదరుడు కరుణాకర్రెడ్డి రిటైర్డ్ ఎంఈవో. 1980 దశకంలో అప్పటి పీపుల్స్వార్ పార్టీలో చేరిన సత్యనారాయణరెడ్డి 45 ఏళ్లుగా ఇంటి ముఖం చూడలేదు. ఆయన తండ్రి కిష్టారెడ్డి 2013 జూన్ 8న మరణించాడు. తల్లి అన్నమ్మ 2012 నవంబర్ 14న గోపాల్రావుపల్లెలో అనారోగ్యంతో మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి సిరిసిల్లలో ప్రాథమికవిద్య అభ్యసించి పెద్దపల్లి ఐటీఐలో చదువుకున్నారు. అక్కడే బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణరెడ్డి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించారు. ఈ క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ హత్యకు గురికాగా.. ఆ కేసులో సత్యనారాయణరెడ్డి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో చురుకైన నాయకుడిగా పనిచేస్తూ పీపుల్స్వార్లో చేరారు. చనిపోయే వరకూ కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సెంట్రల్ రీజినల్ బ్యూరో ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ వ్యూహకర్తల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. దండకారణ్యంలో విప్లవ పోరాటానికి పునాదులు వేసిన వారిలో సత్యనారాయణరెడ్డి ఒకరు. అతని తలపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డును ప్రకటించాయి. కట్టా రామచంద్రారెడ్డి : మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, అలియాస్ వికల్ప్కు గుడ్సా ఉసెండీ అనే పేరు కూడా ఉంది. ఈ పేరుతో అనేక దాడుల్లో ఆయన పాల్గొన్నారు. పీపుల్స్వార్ పార్టీకి సంబంధించి ఆర్కే పేరు ఎంత పాపులరో, ఛత్తీసగఢ్లో గుడ్సా ఉసెండీ అనే పేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మా నూతన నేతగా ఎదిగే వరకు దళాల్లోకి కొత్తగా వచ్చిన సభ్యులు గుడ్సా ఉసెండీ పేరు పెట్టుకునేందుకే ఆసక్తి చూపించేవారు. పదవ తరగగతి వరకు కోహెడలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. టీటీసీ పూర్తి అయిన తర్వాత కరీంనగర్ జిల్లా కాటారం మండలం పెంచికలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ప్రాంతంలో పీపుల్స్వార్ ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత బదిలీపై కోహెడ మండలం వరికొలుకు వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుయ్యాడు. అప్పటికే శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్బీ చేసేందుకు ఔరంగబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచే 1989 సంవత్సరంలో భార్య శాంతితో కలసి పీపుల్స్వార్లో చేరేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 12 సంవత్సరాల క్రితం రాయ్పూర్లో భార్య శాంతి, పిల్లలతో సహా లోంగిపోయారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా పీపుల్స్వార్, మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో రామచంద్రారెడ్డి పని చేశారు. ఇతనిపై 40 లక్షల రివార్డు ఉంది. కూతురి వివాహానికి సైతం రాలేదు. డీజీపీ చెప్పినట్టుగానే.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాళ కేశవరావు ఎన్కౌంటర్ 2025 మే 21న జరిగింది. ఈ సమయంలో ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా తమ రాడార్లో ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు ఆపరేషన్లు చేపడుతున్నామని, అలాంటి ఓ ఆపరేషన్లో నంబాల ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే గత మే నుంచి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు చనిపోతున్నారు. – జూన్లో తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, జూలైలో గాజర్ల ఉదయ్ అలియాస్ గణేశ్ చనిపోయారు. – సెప్టెంబరులో అయితే కోలుకోలేని దెబ్బ పడింది. ఒకే నెలలో మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, పర్వేశ్ అలియాస్ సహదేవ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మొత్తం నలుగురు చనిపోయారు. – అంతకుముందు ఏప్రిల్లో ప్రయాగ్మాంఝీ, జనవరిలో చలపతి మరణించారు. – మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోగా, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పార్టీ లైన్తో విభేదించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
కల్చరల్ సెంటర్లో ‘కిట్టీ’ దందా!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎక్కువగా ధనికులు, ప్రముఖులు నివసించే ప్రాంతం. ఇప్పుడది పేకాటరాయుళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిబంధనలకు విరుద్ధంగా లక్షలు కుమ్మరించి జూదం ఆడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అది ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీ కల్చరల్ సెంటర్ (ఎంఎంసీసీసీ). అందులో 350 మంది వరకు సభ్యులుంటే.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని 150 మందికి కొత్తగా సభ్యత్వాలు ఇచ్చారు. ఇలా కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారితో సాంస్కృతిక కేంద్రం కాస్తా జూదశాల అనే అపకీర్తి మూట కట్టుకుంటోందని, ‘కిట్టీ’దందా యథేచ్ఛగా సాగుతోందని అసలైన పాత సభ్యులు వాపోతున్నారు. కమిటీకి తెలియకుండానే..: కాలనీలో నివసించే వారు వారాంతంలో కుటుంబంతో సేద తీరడానికి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవడానికి, వేడుకలు నిర్వహించుకోవడానికి అనువుగా ఈ కేంద్రం ఉండేది. దీనిని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో బయటి వారికి సభ్యత్వం ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు సభ్యత్వ రుసుము కింద సేకరించారు. అలా వచ్చిన నిధులతో పాటు కాలనీలో స్థలాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారు కూడా కొంత మొత్తం వేసుకుని సెంటర్ను అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడది దుర్వినియోగం అవుతోందని, బడా బాబులంతా కల్చరల్ సెంటర్ వేదికగా పేకాట ఆడుతున్నారని, దీంతో కేంద్రం అభివృద్ధి లక్ష్యం దెబ్బతిని, పక్కా జూదశాలగా మారిపోయిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చూడ్డానికి అంతా నిబంధనలు పాటిస్తున్నట్లుగానే ఉంటుందని, కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా, కల్చరల్ సెంటర్ కార్యనిర్వాహక వర్గాన్ని ఏమార్చి లక్షల రూపాయలతో పేకాట ఆడుతున్నారని నిజమైన సభ్యులు కొందరు వాపోతున్నారు. కొత్తగా చేరిన సభ్యులతో పాటు, వారి గెస్టులు కూడా యధేచ్చగా పేకాట ఆడడానికి వస్తున్నారని చెబుతున్నారు. డబ్బులు కన్పించకుండా కాయిన్స్ రూపంలో ఈ జూదం ఆడుతున్నారని తెలుస్తోంది. పేకాట ఆడడానికి వెళ్లేవారు.. నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న వారికి ఫీజు చెల్లించి కాయిన్స్ తీసుకుని వాటి ద్వారా పేకాట ఆడుతున్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అండ చూసుకుని అతని సోదరుడు భరత్తో పాటు సునీల్రెడ్డి, జగదీష్ అనేవారు దీనిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కార్యకలాపాలన్నీ సెంటర్ కమిటీ దృష్టికి రాకుండా జాగ్రత్తగా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. పేకాట ఆడనిచ్చినందుకు కిట్టీ (కమీషన్) తీసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా అక్రమార్జన ఒక్కొక్కరు లక్ష, రెండు లక్షల రూపాయల స్టేక్తో ఆటలు ఆడుతున్నట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేక్ రూ.20 వేలకు మించరాదని నిబంధనలు చెబుతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు లక్ష రూపాయల స్టేక్ చొప్పున 10 ఆటలు ఆడితే.. ఒక ఆటకు ఏడు పాయింట్లు లెక్కిస్తారు. ఒక్కో పాయింట్కు రూ.400 కిట్ చొప్పున 70 పాయింట్లకు రూ.28 వేల కిట్ తీస్తున్నారు. ఇలా ఐదు టేబుల్స్ ఉంటాయనుకుంటే.. 28,000 ్ఠ5 లెక్కన రూ.1.40 లక్షలు కమీషన్ కింద వసూలు చేస్తున్నారన్నమాట. ఇక రూ.2 లక్షల స్టేక్తో ఆడేవారు కూడా ఉన్నారు. రూ.2 లక్షల స్టేక్తో ఆడే ఆటలు కూడా లెక్కగట్టి పాయింట్లు తీస్తారు. ఈ క్రమంలో ఒక టేబుల్పై ఆరు ఆటలు పూర్తయితే ఏకంగా రూ.1.92 లక్షలు వసూలు అవుతుందని, అలాంటివి మూడు టేబుల్స్ ఆడితే ఒక రోజుకు రూ.5.75 లక్షలు కిట్టీ కింద వసూలు చేస్తున్నారని సమాచారం. ఇలా నెలకు దాదాపు కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని, ఇదంతా మేనేజింగ్ కమిటీకి తెలియకుండానే జరుగుతోందని అంటున్నారు. టేబుల్ దగ్గర డబ్బు పెట్టకపోయినా..అక్కడ ఉండే రెండు గదుల్లో డబ్బు దాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ఇటీవలే పోలీసులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం కాగా.. వారు తూతూ మంత్రంగా విచారణకు వచ్చి వెళ్లినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరగడానికి వీల్లేదు ఈ మధ్యనే ఎంఎంసీసీసీ బాగా పాపులర్ అవుతోంది. చాలామంది కల్చరల్ సెంటర్కు వస్తున్నారు. మేము కేవలం కాయిన్స్ మాత్రమే ఇస్తాం. అక్కడ ఎలాంటి డబ్బు చేతులు మారడం ఉండదు. అయితే ఆ కాయిన్స్కు ఎంత మొత్తం పెట్టి ఆడుతున్నారన్నది కనుక్కోవడం కష్టసాధ్యం. గతంలో ఈ విధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. – రాగిడి లక్ష్మారెడ్డి, ఎంఎంసీసీసీ ప్రధాన కార్యదర్శి -
Kerala: భార్యను హతమార్చి.. ఫేస్బుక్ లైవ్లో..
కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్బుక్ లైవ్లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన పునలూర్ సమీపంలోని కూతనాడిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్బుక్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.తరువాత ఐజాక్ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కట్నం డబ్బుల(dowry) కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) కాన్పూర్నగరంలోని కల్నల్గంజ్లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది.బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. చదవండి: నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది! -
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్ఫ్రెండ్కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో యమునా నదిలో దొరికిన ‘సూట్కేసులో యువతి డెడ్బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు. ఆగస్టు 8వ తేదీన కాన్పూర్కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో.. అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో.. జరిగిన విషయాన్ని మరో గర్ల్ఫ్రెండ్కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి మోటార్సైకిల్పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పిండ ప్రదానానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
మార్టూరు: మహళయ పక్షాల్లో చివరిరోజు అయిన ఆదివారం అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటకాలతో పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయన్న నమ్మకంతో ఆలయానికి బయల్దేరిన కుటుంబంలోని ముగ్గురు మార్గంమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కోలలపూడి సమీపంలో జరిగింది. వేగంగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా అడ్డొచి్చన కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సిమెంట్ దిమ్మెలను, డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలివీ.. తిరుపతి పట్టణంలో రేడియేటర్ మెకానిక్ అయిన దామర్ల లక్ష్మణ్ (70), అతని భార్య సుబ్బాయమ్మ (65), కుమారుడు గణేష్ బాబు, అతని భార్య పద్మజ, వారి కుమారుడు హేమంత్ (25)లతో కలిసి కారులో పిఠాపురం ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు బయల్దేరారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రహదారి పక్కన సిమెంట్ దిమ్మెలను ఢీకొని పల్టీ కొట్టుకుంటూ మార్జిన్లోకి దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి డ్రైవింగ్ సీట్లో ఉన్న హేమంత్, తాతయ్య లక్ష్మణ్, నానమ్మ సుబ్బాయమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్బాబు, అతని భార్య పద్మజను పోలీసులు మార్టూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ముగ్గురి మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో పంచనామా చేయించి బంధువులకు అప్పగించారు. గణేష్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఫొటోల సరదా
వాజేడు/అబ్దుల్లాపూర్మెట్: జలపాతాల వద్ద ఫొటోల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన హర్షారెడ్డి, శివరాంరెడ్డి, అభిరామిరెడ్డి, మహాశ్విన్(18), సాక్షిత్, అర్జున్, పూజ, రాకేశ్లు ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలోని దుసపాటి లొద్ది జలపాతం సందర్శనకు వచ్చారు. ఇందులో పూజ, రాకేశ్ భార్యాభర్తలు. కాగా వీరంతా స్నేహితులు. ఈ క్రమంలో జలపాతం వద్ద ఫొటోలు దిగుతున్న కొండిశెట్టి మహాశ్విన్ నీటిలో జారి పడ్డాడు. వెంటనే పూజ అతడిని రక్షించడం కోసం నీటిలోకి దూకింది. మహాశ్విన్ భయంతో ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగారు. వెంటనే హర్షారెడ్డి, శివరాంరెడ్డి నీటిలోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో అర్జున్ నీటిలోకి దూకి పూజ, హర్షారెడ్డి, శివరాంరెడ్డిని కాపాడాడు. మహాశ్విన్ను కాపాడేందుకు తిరిగి నీటిలోకి వెళ్లేలోగానే అతడు గల్లంతయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన మిగతావారు, ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు గజఈతగాళ్లను పంపించారు. మధ్యాహ్నం సమయంలో మహాశ్విన్ మృతదేహం లభించింది. మృతుడు హైదరాబాద్లో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాడు. ఈ ఘటనపై వాజేడు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆనందం కోసం వస్తే.. వారంతా స్నేహితులు. సెలవు రోజు ఆనందంగా గడుపుదామని జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా అందులో ఓ ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బేగంపేట రసూల్పుర ప్రాంతానికి చెందిన క్యామ సాయితేజ (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు తన స్నేహితులైన సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్లతో కలిసి కోహెడ శివారులో ఓఆర్ఆర్ సర్విస్రోడ్డు పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు సాయితేజ నీటిలో జారి పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో మిగతావారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలతో రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సాయితేజ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. -
అమ్మా.. అమానుషం
తుమకూరు, పావగడ: ఎంత కష్టం వచ్చిందో కానీ.. ముద్దులొలికే పసిపిల్లలను తల్లి తన చేతులతో చంపి, తనువు చాలించింది. భర్త, అత్త వేధింపులను తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడిన హృదయ విదారక దుర్ఘటన తుమకూరు జిల్లాలోని పావగడ తాలూకాలోని కడపలకెరె గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. సరిత (25), కుమారుడు పుషి్వక్ (4), కూతురు యుక్తి (2) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. కడపలకెరె గ్రామానికి చెందిన సరితకు స్థానికుడు సంతోష్ తో ఆరేళ్ల కిందట పెద్దలు పెళ్లి చేశారు. భర్త ప్యాసింజర్ ఆటోను నడుపుతుండగా, సరిత గృహిణి. ఆమె అత్త అంజమ్మ పట్టణం లో వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో డీ గ్రూప్ ఉద్యోగి గా పని చేస్తోంది. భర్త, అత్త కలిసి సరితను సూటిపోటి మాటలతో వేధించేవారని సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన సరిత ఇంటిలో ఎవరూ లేని సమయంలో.. కొడుకును కత్తితో గొంతుకోసి హతమార్చింది. తరువాత కూతురికి ఉరివేసి చంపి, ఆపై తాను ఉరికి వేలాడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధుగిరి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదం అలముకొంది. -
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడి మృతి
నారాయణఖేడ్: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం శెల్గిర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బేగరి లక్ష్మణ్ రెండో కుమారుడు ప్రశాంత్ (14)కు ఈనెల 17వ తేదీన దగ్గు, జ్వరం రావడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు యూనుస్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన రెండు ఇంజెక్షన్లు, మందు గోలీలు ఇచ్చి ఇంటికి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో 18వ తేదీన మళ్లీ తీసుకువెళ్లగా సెలైన్ పెట్టి ఇంటికి పంపించారు. అయితే ఫలితం లేకపోవడంతో 19వ తేదీన మళ్లీ ఆయన వద్దకే తీసుకెళ్లగా ఇన్ఫెక్షన్ అయిందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం బీదర్కు తీసుకు వెళుతుండగా మార్గమధ్యలో తన కొడుకు మృతి చెందాడని తండ్రి లక్ష్మణ్ తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు మృతి చెందాడని, అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని లక్ష్మణ్ మనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై కోటేశ్వరరావు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.పది రూపాయల నాణెం గొంతులో ఇరుక్కొని... అస్వస్థతకు గురై విద్యార్థిని మృతి భూదాన్పోచంపల్లి: రూ.10 కాయిన్ గొంతులో ఇరు క్కొని ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. భీమనపల్లి గ్రామానికి చెందిన శేఖర్, జ్యోతి దంపతుల కుమార్తె నిహారిక (11) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. ఈ నెల 18న సాయంత్రం పొరపాటున రూ.10 కాయిన్ నోట్లో వేసుకొంది. అది గొంతులో ఇరుక్కోవడంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు అదేరోజు రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు కాయిన్ను తొలగించారు. మరుసటి రోజు శుక్రవారం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆరోగ్యంగా కనిపించిన నిహారిక రోజుమాదిరిగానే రాత్రి నిద్రపోయింది. శనివారం ఉదయం తల్లిదండ్రులు నిహారికను లేపడానికి ప్రయత్నించగా ఎలాంటి స్పందనాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే నిహారికను తిరిగి అదే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు చెప్పారు. అయితే డాక్టర్లు అనస్థీషియా డోసు ఎక్కువ ఇవ్వడం వల్లనే నిహారిక కోమాలోకి వెళ్లిందని, డాక్టర్ల నిరక్ష్యం వల్లనే తన కుమార్తె మృతిచెందిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
చర్లపల్లి: సంచిలో మృతదేహం కేసు.. ఆ మహిళ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
శంషాబాద్: 12 కోట్ల విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు సమాచారం ఆధారంగా.. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది. డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన ఆ మొత్తం 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి విలువ రూ.12 కోట్ల దాకా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.హైడ్రోపోనిక్ గంజాయి అంటే.. హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.53 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.శిక్ష ఏంటంటే..హైడ్రోపోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి భారతదేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం ఎన్డీపీఎస్ చట్టం 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం శిక్షించబడతారు. ఈ చట్టం కింద బెయిల్ పొందడం చాలా కష్టం. నేరం తీవ్రతను బట్టి కోర్టు విచారణ జరుగుతుంది.గంజాయి రవాణా, విక్రయానికి.. 10–20 సంవత్సరాల జైలు + రూ. 1–2 లక్షల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే గనుక.. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదూ విధించవచ్చు. -
వలపు వల.. వంచించెనిలా!
కర్నూలు: సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన భార్య, భర్త, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మత్తెక్కించే మాటలతో యువకులను ఆకట్టుకొని, ఆ తర్వాత బెదిరించి డబ్బు గుంజుతున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బలరాం నగర్కు చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, మల్లేష్ ప్రేమికురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముఠాగా ఏర్పడి డబ్బున్న వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. వారికి ఫోన్ చేసి తీయనైన మాటలతో ముగ్గులోకి దింపి నగ్న వీడియోలు పంపి బెదిరించి డబ్బులు దండుకునేవారు. కర్నూలుకు చెందిన వ్యాపారి ప్రదీప్ ఈ ముఠా సభ్యుల మాటలను నమ్మి దాదాపు రూ.3.80 కోట్ల నగదు వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికత సాయంతో వారు వినియోగించిన కాల్ డేటా ఆధారంగా రెండో పట్టణ పోలీసులు ముఠా సభ్యుల గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపారు.తక్కువ ధరకే పొలం ఇస్తామంటూ మోసం.. ముగ్గురు ముఠా సభ్యులు కలసి సంయుక్త రెడ్డి పేరుతో ట్విటర్ ఖాతా ద్వారా నగ్నంగా వీడియో కాల్స్ చేసి మత్తెక్కించే మాటలతో నమ్మించి మోసానికి పాల్పడ్డారు. విజయవాడకు సమీపంలో తమకు ఖరీదైన పొలం ఉందని, డబ్బులు అవసరమున్నందున తక్కువ ధరకే ఇస్తామంటూ రూ.3.80 కోట్లు వసూలు చేశారు. రూ.41.26 లక్షలకు రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బు రూ.3.38 కోట్ల నగదును ముగ్గురూ పంచుకుని జల్సా చేశారు.ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముఠా సభ్యులను అరెస్టు చేసి విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. వారి నుంచి 2 కార్లు, మోటర్ సైకిల్, ల్యాప్టాప్, 3 సెల్ఫోన్లు, 5 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
చావు పిలిచింది.. వెళ్లిపోతున్నా..
యాదాద్రి భువనగిరి జిల్లా: ‘తనను పది రోజులుగా చావు పిలుస్తుంది.. నేను చావు వద్దకు వెళ్లిపోతున్న.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’అంటూ ఓ యువకుడు చెరువులో దూకాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు, యువకుడి వాయిస్ రికార్డులో నమోదైన వివరాల ప్రకారం...హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్లో డీమార్ట్ వెనుకాల తన భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నాడు. సురేందర్ హైటెక్ సిటీలోని ఓప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజులుగా సురేందర్ మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఏదేదో మాట్లాడుతుండేవాడు. నిత్యం చావు కల వస్తుందని, తన వద్దకు రమ్మని చావు పిలుస్తుందని, దేవుళ్లు పిలుస్తున్నట్టు పీడ కలలు వస్తున్నాయని, తాను చనిపోతానని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులకు చెబుతుండేవాడు. కాగా కుటుంబసభ్యులు అతని పలు దేవాలయాలు, దైవదర్శనాలకు తిప్పారు. మానసిక పరిస్థితి మెరుగుపడటంతో ఉద్యోగానికి వెళ్లానని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఒప్పుకున్నాడు. నాలుగు రోజులుగా ఉద్యోగానికి వెళ్తున్న సురేందర్.. శుక్రవారం ఉదయం కూడా డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పాడు. క్యాబ్ బుక్ చేసుకొని బీబీనగర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. చావు రమ్మటుంది.. నేను వెళ్తున్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని, తన చావు కార్యక్రమాలు పాత ఇంట్లో చేయాలని, నా చావుకు ఎవరూ కారణం కాదని సెల్ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పంపాడు. ఆ తర్వాత బూట్లు, సెల్ఫోన్ చెరువు కట్టపై పెట్టి చెరువులో దూకాడు. బంధువుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీం చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకకపోవడంతో అక్కడే ఉన్న సురేందర్ భార్య.. భర్త లేనిదే తాను ఉండలేనంటూ చెరువులో దూకింది. అప్రమత్తమైన రెస్క్యూ టీం ఆమెను కాపాడింది. శుక్రవారం రాత్రి వరకు గాలించినా సురేందర్ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశముంది. -
పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
పరిగి: పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకున్న కొడుకు పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూర్ మల్లమ్మ (57)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు కాగా, పెద్ద కుమారుడు ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇతని మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య విడాకులు తీసుకుంది.ఎలాంటి సంపాదన లేకపోవడంతో తల్లికి వచ్చే ఆసరా పెన్షన్ డబ్బులు లాక్కుని నిత్యం మద్యం తాగేవాడు. ఇటీవల పెన్షన్ రావడంతో గత బుధవారం సాయంత్రం డబ్బులు ఇవ్వమని అడగ్గా.. ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై మరుసటి రోజు శుక్రవారం ఇంట్లోనే చనిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. చిన్న కుమారుడు మహిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కూపన్ల కోసం రైతుల పోటాపోటీ
కారేపల్లి/అడవిదేవులపల్లి: ఒక్క బస్తా యూరియా దక్కించుకునేలా కూపన్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 890 బస్తాల యూరియా రాగా, శుక్రవారం కూపన్లు జారీ చేస్తున్నారనే సమాచారంతో మహిళలు సహా పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. కారేపల్లి ఎస్సై బి.గోపి, ఏఓ భట్టు అశోక్కుమార్ ఆధ్వర్యంలో రైతులను నియంత్రించేందుకు శ్రమ పడాల్సి వచి్చంది. రైతుల ఉరుకులు పరుగులు, తోపులాటలో ఒకరిపై ఒకరు పడగా, కొందరు వాహనాలపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.తొక్కిసలాటలో ఏఓ అశోక్కుమార్ కూడా సొమ్మసిల్లడంతో కారేపల్లి పీహెచ్సీకి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చివరకు కూపన్లను జిన్నింగ్ మిల్లులో ఇస్తామని చెప్పడంతో రైతులు అక్కడికి పరుగులు తీశారు. అక్కడికీ వేలాదిగా చేరడంతో అదే పరిస్థితి ఎదురైంది. కొందరు రైతులు కూపన్ల కోసం ఎగబడటంతో హోంగార్డు శంకర్ ఉక్కిరిబిక్కిరై కారేపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి తలదాచుకున్నాడు. ఈక్రమంలో 2,152 కూపన్లను రైతులకు అందజేయగా, మరో 1,600 మంది ఆందోళనకు దిగడంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చచెప్పారు. ఆపై అందరి పేర్లు నమోదు చేసుకుని 1,600 మంది రైతులకు ఇళ్ల వద్దే శనివారం నుంచి కూపన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. 11న తోపులాటలో గాయపడ్డ మహిళ మృతినల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గోన్యాతండాకు చెందిన పాతులోతు దసి (52) ఈనెల 11న రైతు వేదిక వద్దకు యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడింది. ఈ సందర్భంగా రైతుల మధ్య జరిగిన తోపులాటలో క్యూలో ఉన్న దసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు ఆమెను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కుంభవృష్టి.. నీళ్లలో కొట్టుకుపోయి ముగ్గురి మృతి
రాయచోటి: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టి రాయచోటిలో విషాదం నింపింది. పట్టణంలో వరదలా ప్రవహించిన వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు. వర్షపునీటితో రాయచోటిలోని మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్ఎన్ కాలనీ వెనుక భాగాన ఉన్న కాలువలో వృద్ధురాలు(60), ఆమె కుటుంబానికి చెందిన చిన్నారి(5) నీళ్లల్లో కొట్టుకుపోసాగారు. వారిని కాపాడేందుకు స్థానికుడు గంగయ్య (30) ప్రయత్నించాడు. ప్రవాహ వేగానికి ముగ్గురూ కొట్టుకుపోయారు. స్థానికులు గాలించి అక్కడికి సమీపంలోని కల్వర్టు వద్ద ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కె.రామాపురం సమీపంలో ఉన్న 4 కుళాయిల వద్ద నీటి ప్రవాహంలో యామిని (7) కొట్టుకుపోయింది. ఆమె ఆచూకీ లభించలేదు. -
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ పేలుడు!
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ బ్లూషెడ్ వద్ద గ్యాస్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పైప్ లైన్ లీకేజీ వలన వేజల్ పేలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9:20 నిమిషాలకి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. వేజల్ పేలిన సమయంలో లోపల ఎంత మంది కార్మికులు ఉన్నారన్నదానిపై స్పష్టత కొరవడింది. అయితే వందలాది కార్మికులను అధికారులు బయటికి పంపించేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. -
విషాదం: విషవాయువులకు బలైన కార్మికులు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు వద్ద.. బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు మరణించారు. ట్యాంక్లోని విష వాయువును పీల్చడం వల్లనే వారు చనిపోయినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు.ఈ ఘటనలో చనిపోయిన కార్మికులు రాజస్థాన్కు చెందిన సందీప్ కుమార్ (25), తూత్తుకుడి జిల్లాలోని పున్నకాయల్కు చెందిన జెనిసన్ థామస్ (35), తిరునెల్వేలి జిల్లాలోని ఉవరికి చెందిన సిరోన్ జార్జ్ (23)గా గుర్తించారు.ట్యాంక్లో నీరు నిలిచిపోవడం వల్ల విషపూరిత వాయువు పేరుకుపోయాయి. ట్యాంక్లోని విషవాయువులను బయటకు పంపించానికి ముందే.. ముగ్గురు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లోపలికి ప్రవేశించారని భావిస్తున్నారు. అంతే కాకుండా పని అప్పగించడానికి ముందే.. కార్మికులకు ఎటువంటి భద్రతా సామగ్రి ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.మొదటి వ్యక్తి లోపలి వెళ్లిన తరువాత ఉలుకూపలుకు లేకుండా ఉండిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రెండో వ్యక్తి, రెండో వ్యక్తి కోసం వెళ్లిన మూడో వ్యక్తి.. ముగ్గురు ఈ విషవాయువుల ప్రభావానికి బలయ్యారని అధికారులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ మదన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.ఈ సంఘటన తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల మత్స్యకార గ్రామాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పున్నకాయల్, అలందలై, మనప్పాడు, ఉవరి ప్రతినిధులు బార్జ్ యజమాని, కెప్టెన్, బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఒక వినతిపత్రం సమర్పించారు. అంతే కాకుండా మృతుల కుటుంబాలు.. మృతదేహాలను స్వీకరించడానికి నిరాకరించాయి. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు, మొత్తం రూ.12 కోట్లు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. కార్మికుల రక్షణ కోసం పరికరాలను అందించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని వారు ఆరోపించారు. -
పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్
చాగలమర్రి: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్బీల కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ కానగూడూరు నుంచి చాగలమర్రిలోని కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంటుంది. షాజిదా తనకు అనారోగ్యంగా ఉందని.. ఇంటికి వెళ్లడానికి అనుమతివ్వాలని గురువారం ఉదయం 11.30 సమయంలో ప్రిన్సిపాల్ను కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేటు దాటి బయటికి వచ్చిన షాజిదాను.. అక్కడే కాపు కాచి ఉన్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి.. ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి.. కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేశ్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి చాగలమర్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థినిని కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభు త్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో తనతోపాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతడి ని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లొంగిపోవాలని హెచ్చరించినా నిజాముద్దీన్ వినకపోటంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు.. త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మాకు న్యాయం చేయాలి నా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాదిపాటు వెదక గా జాబ్ వచ్చింది. నాలుగేళ్లు పని చేసిన తర్వాత 2023లో ప్రమోషన్తో కాలిఫోర్నియాకు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీవాళ్లు ఆపని చేయలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే, రూమ్మేట్ తరుచుగా ఏసీ బంద్ చేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. మా బాబు స్నేహితుడు రాయచూర్కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ గురువారం ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పిండు. అంతవరకు మాకు సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియాలి. న్యాయం చేయాలి. దీనిపై విదేశాంగమంత్రికి ఫిర్యాదు చేస్తాం. – హసానుద్దీన్, నిజాముద్దీన్ తండ్రి -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ నర్సింహులు గురువారం ఉదయం ముగ్గురు ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని భూత్పూర్ వస్తున్నాడు. అదే సమయంలో హన్వాడకు చెందిన ట్రాలీ ఆటోలో భూత్పూర్ నుంచి కొత్తమొల్గరకు కూల్డ్రింక్స్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు తుల్జాభవానితండా వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఖిల్లాఘనపురం నుంచి వస్తున్న ఆటోలోని ప్రయాణికులు నర్సింహారెడ్డి (56), వంశీ (23), పాత్లావత్ సక్రి (34) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటో నడుపుతున్న డ్రైవర్ నర్సింహులు గాయపడ్డాడు. మరో ఆటోడ్రైవర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ నర్సింహులును అంబులెన్స్లో జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటోడ్రైవర్ నర్సింహులు చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకుని ఆటోను నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాలీ ఆటోడ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. పెద్దల పండుగకు వచ్చి వెళ్తూ.. భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఖిల్లాఘనపురంలో ఉండే చెల్లెలు పెద్దల పండుగ చే యడంతో అక్కడికి వెళ్లాడు. తిరిగి హైదరాబాద్కు వెళ్లే క్రమంలో రో డ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తెలను తీసుకురావడానికి వెళ్తూ.. ఖిల్లాఘనపురం మండలం దొంతికుంటతండాకు చెందిన పాత్లావత్ సక్రి.. జడ్చర్ల సమీపంలోని ఆశ్రమ పాఠశాల నుంచి తన ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీ పనుల కోసం.. ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన వంశీ (23) కూలీ పనులకోసం ఆటోలో వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఖిల్లాఘనపురం ఆటో డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. (VG) -
హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఫ్లోర్ ఇంఛార్జ్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. గడ్డి అన్నారం నారాయణ కాలేజీ బ్రాంచ్లో ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యంచేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులను చితకబాదాడు.తిండి తినలేని స్థితిలో విద్యార్థి ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా, విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కనబెడితే.. గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. -
సిబ్బందిని కట్టేసి రూ. 21 కోట్లు లూటీ
విజయ్పురా (కర్ణాటక): ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించి ఓ బ్యాంకును లూటీ చేసి రూ.20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక విజయ్పురా జిల్లాలోని ఎస్బీఐకి చెందిన చాడ్చాన్ బ్రాంచ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుండగులు దోచుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువ రూ. 21 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కరెంటు ఖాతా తెరవాలంటూ బ్యాంకుకు వచ్చి మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారని పోలీసులు చెప్పారు. దుండగులు బ్యాంకు సిబ్బంది కాళ్లు, చేతులను కట్టేసి రూ.కోటికిపైగా నగదు, రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు నకిలీ నంబర్ ప్లేటు ఉన్న సుజుకీ ఎవా అనే కారులో వచ్చారని విజయ్పురా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి చెప్పారు. చోరీ అనంతరం దుండగులు మహారాష్ట్రలోని పండర్పూర్ వైపు పారిపోయినట్లు తెలిపారు. -
డిజిటల్ అరెస్టుకు మహిళ బలి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసగాళ్ల వేధింపులకు ఓ వృద్ధురాలు బలైంది. హైదరాబాద్ మధురానగర్కు చెందిన మహిళ (76) చంచల్గూడ ఆఫీసర్స్ కాలనీలో ఉన్న మామిడిపూడి నాగార్జున ఏరియా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమెకు ఈ నెల 5న తొలిసారి సైబర్ నేరగాళ్ల నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. బెంగళూరు పోలీసు లోగో, పోలీసు డ్రెస్లో ఉన్న వ్యక్తి ఫొటోతో కూడిన ప్రొఫైల్ పిక్చర్ వినియోగించి సైబర్ నేరగాళ్లు వృద్ధురాలితో మాట్లాడారు. ఆమె ఆధార్ కార్డు వివరాలు దుర్వినియోగం అయ్యాయని, మనుషుల అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీంకోర్టు జారీ చేసినట్లు సీల్తో ఉన్న నకిలీ పత్రాలను షేర్ చేశారు. ఈ కేసు సదాకత్ ఖాన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకు అనుబంధంగా నమోదైందని, అరెస్టు తప్పదని భయపెట్టారు. అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితురాలు సెపె్టంబర్ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న పెన్షన్ సొమ్ము రూ.6.6 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి బదిలీ చేసింది. ఆ బ్యాంకు ఖాతా మహారాష్ట్రలోని ఓ షెల్ కంపెనీ పేరుతో ఉన్నట్లు తేలింది. ఆపై మరో నంబర్ నుంచి బాధితురాలికి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. న్యాయస్థానం జారీ చేసినట్లు తయారు చేసిన నకిలీ నోటీసులు పంపారు. తమ నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు వీడియో కాల్ ఆన్లోనే ఉండాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8 వరకు ఇలా ‘నిర్బంధం’లో ఉండిపోయిన వృద్ధురాలు విషయం ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. ఆ ఒత్తిడితో గుండెపోటుకు గురై కిందపడిపోయారు. కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె ఫోన్ను కుటుంబ సభ్యులు పరిశీలించగా డిజిటల్ అరెస్టు గురించి తెలిíసింది. దీంతో ఆమె కుమారుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ఐటీ యాక్ట్తో పాటు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఏమిటీ సదాకత్ ఖాన్ కేసు? ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన ఘరానా నేరగాడు సదాకత్ ఖాన్. మన దేశం నుంచి అనేకమందిని ఉద్యోగా ల పేరుతో కాంబోడియా తీసుకెళ్లి సైబర్ ముఠాలకు అప్పగించేవాడు. అక్కడ వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించే వారు. సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్ 6న దుబాయ్ నుంచి వచి్చన సదాకత్ ఖాన్ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరు తో ప్రజలను మోసం చేయడానికి ఈ కేసును వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా డిజిటల్ అరెస్టు లేదుదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఓ నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని డిజిటల్ అరెస్టు చేసే విధానం అమలులో లేదు. ఏ పోలీసు అధికారి వీడియో కాల్ చేసి కేసు నమోదైందని చెప్పరు. నిందితుడిగా ఆరోపణలు ఉంటే... ఫోన్ చేసి పోలీసుస్టేషన్కు రమ్మని పిలుస్తారు. ఏ కేసులో అయినా నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే దర్యాప్తు అధికారులను నేరుగా కలిసి తగిన ఆధారాలు సమర్పించాలి. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందాలి. మీ ప్రమేయం లేకుండా ఆధార్, పాన్కార్డు వంటివి దుర్వినియోగమైనా ప్రమాదం ఉండదు. బాధితుల భయమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి అని గుర్తుంచుకోవాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్మేట్స్.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గడ్చిరోలిలో ఎన్కౌంటర్
ముంబై: గడ్చిరోలిలో ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతబలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం ఉదయం మహరాష్ట్ర పోలీసులు,భద్రత బలగాలకు గడ్చిరోలి జిల్లాలోని దండకారణ్యంలో ఎటపల్లి తాలూకాలోని మోదస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి. గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ-నక్సల్ కమాండో దళం సీ-60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుండి పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. సీ-60 దళం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోల ఎదురు కాల్పులు పోలీసులు తిప్పికొట్టారు. ఇద్దరు మహిళా నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారి సైతం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇసుక టిప్పర్ లారీ.. రాంగ్ రూట్ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థినితో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ అనూష (20) ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనాపూర్లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహేశ్వర్రెడ్డితో కలిసి మేడ్చల్ నుండి నగరం వైపు ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ పార్క్ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు కిందపడిపోగా అనూష శరీరంపై నుండి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వర్రెడ్డిని మేడ్చల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
కన్న తల్లినే చెరపట్టే యత్నం
జడ్చర్ల: మద్యం మత్తులో సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్నతల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడో యువకుడు. దీంతో భార్యను కాపాడే ప్రయత్నంలో తండ్రి చేసిన దాడిలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన దంపతులు జడ్చర్ల డీటీసీ సమీపంలో నివసిస్తూ.. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు శ్రీధర్కు మినహా అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శ్రీధర్ (28) కొన్ని రోజులుగా తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బును బలవంతంగా తీసుకుని తాగుడుకు వెచ్చించేవాడు. అనేకసార్లు మద్యం మత్తులో కన్నతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆయన కొడుకును పలుసార్లు మందలించి.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శ్రీధర్లో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవించిన కుమారుడు శ్రీధర్ మధ్యరాత్రి సమయంలో తల్లి దగ్గరకు వచ్చి అత్యాచారం చేయబోయాడు. ఆమె కొడుకు నుంచి తప్పించుకుని ఇంటి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేయగా, చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యతి్నంచాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న భర్త మేల్కొని.. భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో కొడుకు ఆగ్రహంతో తండ్రిని నెట్టి వేయడంతో అతను కింద పడిపోయాడు. ఈ క్రమంలో తండ్రి పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై బాదడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. తర్వాత చలనం లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దమ్ మారో దమ్..
ప్రొద్దుటూరు క్రైం: ‘రేయ్ రాజు ఎక్కడున్నావ్ రా.. నా దగ్గర ‘స్కోర్’ అయిపోయింది. నిన్ననే నువు తీసుకున్నావ్ అంట కదా.. అర్జంట్గా స్కోర్ తీసుకొని సెక్షన్కు రా.. అక్కడికి నేను వస్తున్నాను’ ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన విద్యార్థుల సెల్ఫోన్లను పోలీసులు పరిశీలించగా ఇలాంటి సంభాషణలు కనిపించాయి. వాటిని చూసి పోలీసులు సైతం నివ్వెర పోయారు. గంజాయి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటి నుంచే అందుబాటులో ఉంది. అయితే నాడు వృద్ధులు, భిక్షాటన చేసే వాళ్లు సేవించేవాళ్లు. అప్పట్లో దీన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా వ్యసన పరులు గంజాయి మొక్కలను ఇంటి పెరట్లో పెంచేవారు. అయితే ప్రస్తుతం గంజాయి రూ. లక్షలు కురిపించే వ్యాపారంగా మారింది. వైఎస్సార్ కడప జిల్లా్లలో వ్యాపార కేంద్రంగా పేరు గాంచిన ప్రొద్దుటూరులో గంజాయి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. అన్ని వ్యాపారాల మాదిరే ఇప్పుడు గంజాయి వ్యాపారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం ప్రొద్దుటూరులో కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ఊసేలేదు. ప్రతి శనివారం ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన నిమిత్తం ఇక్కడికి వచ్చే కొందరు వ్యక్తుల వద్ద మాత్రమే దొరికేది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయిని ఆదాయ వనరుగా మార్చారు. కొందరు వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అరకు నుంచి ప్రొద్దుటూరుకు రైళ్లలో తెస్తున్నారు. అక్కడ 1 కిలో రూ. 5000లకు తీసుకొచ్చి ప్రొద్దుటూరులో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. కిలోల లెక్కన కొనుగోలు చేసిన వ్యక్తులు పొట్లాల రూపంలో స్థానికంగా ఉన్న విద్యార్థులకు అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.200, రూ.300 రూ.500లకు విక్రయిస్తున్నారు. గ్రూప్ ప్యాక్ అయితే (విద్యార్థులు పెట్టుకున్న పేరు) రూ. 1000కి విక్రయిస్తారు. ఒక్క పొట్లం గంజాయిని 5–6 మంది కలిసి సేవిస్తారు. గ్రూప్ ప్యాక్ అయితే 10 మందికి పైగా కలిసి ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడప, గండికోట ప్రాంతాలకు కూడా గంజాయిని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అరకొర దాడులతో కట్టడి సాధ్యమా పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి వ్యాపారం సాగుతోంది. విద్యార్థులు సైతం దీని బారిన పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసుల అరకొర దాడులు, నిఘా లోపం కారణంగా గంజాయి కట్టడి కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు పోలీసులు 10 గంజాయి కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ప్రొద్దుటూరు ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేశారు. 13 కిలోలుపైగా గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గంజాయి సేవించే వారికి క్యాన్సర్ ముప్పు గంజాయి ప్రభావం శరీరంలోని అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆయా వ్యక్తులు ఎన్ని సార్లు గంజాయిని తీసుకుంటారనే దానిపై ఇది అ«ధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిలోని టీహెచ్సీ రసాయనం శరీరంలోని అనేక కణజాలాలు, అవయవాలకు చేరుతుంది. టీహెచ్సీ మత్తును పెంచుతుందని, గంజాయిని పీల్చుకున్న వెంటనే ఇది రక్తంతో పాటు మెదడుకు చేరకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పుతాయని అంటున్నారు. తద్వారా నిరాశ, మానసిక సమస్య వస్తుంది. గంజాయి సేవించే వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. గంజాయి సేవించే విధానంలో కొత్త పంథా.. సాధారణంగా గంజాయి పొగను పీల్చుకొని ఆనందం పొందుతుంటారు. అయితే ప్రొద్దుటూరులోని యువకులు కొత్తదనంతో గంజాయిని ఆస్వాదిస్తున్నారు. గంజాయి ఎండు మొక్కలను నీళ్లలో ఉడకబెట్టి వాటి ద్రావణాన్ని తాగుతూ మత్తులోకి వెళ్తున్నారు. కొందరు విద్యార్థులు గంజాయి పొగను పీల్చడానికి పఫ్ స్మార్ట్ మెటల్ బాంగ్ షూటర్ పైప్ను ఉపయోగిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో తెప్పించుకొని మరీ వాడుతున్నారు. ఇంకొందరు యువకులైతే ఓసీబీ పేపర్లో గంజాయి చుట్టుకొని సేవిస్తున్నారు. ఓసీబీ పేపర్లు కూడా స్థానికంగా ఉన్న కొన్ని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇక యువకులు అధిక శాతం సిగరేట్లలో గంజాయి నింపుకొని తాగుతున్నారు. గంజాయినే ఎందుకు వాడుతున్నారంటే.. ‘మార్కెట్లో లభించే అనేక రకాల మద్యం మత్తును కలిగిస్తుంది కదా.. అవన్నీ అందుబాటులో ఉండగా గంజాయికి ఎందుకు అలవాటు పడ్డారు..’ అని గంజాయి కేసులో పట్టుబడిన యువకులను పోలీసులు ప్రశ్నించారు. అందుకు వారు చెప్పిన సమాధానం ఏంటంటే.. ‘ మద్యం తాగితే మహా అంటే రెండు, మూడు గంటలు మత్తులో ఉంటాం. అదీ గాక మద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కానీ గంజాయి పొగను ఒక సారి పీల్చితే రెండు, మూడు రోజుల పాటు అదే మత్తులో ఉంటాం.పైగా తక్కువ ఖర్చుతో ఇది లభిస్తుంది. అందుకే దీనికి అలవాటు పడ్డాం..’అని యువకులు బదులిచ్చారు. కాగా ప్రొద్దుటూరులోని బొల్లవరం బైపాస్రోడ్డు, రామేశ్వరం ప్రభుత్వ పక్కా గృహాల సముదాయ ప్రాంతం, మోడంపల్లె బైపాస్ రోడ్డు తదతర ప్రాంతాల్లో యువకులంతా పోగై గంజాయిని సేవిస్తున్నారు. పట్టణంలోని రామేశ్వరం, జిన్నారోడ్డు, మోడంపల్లె, దస్తగిరిపేట, శ్రీనివాసనగర్, అమృతానగర్ తదితర ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులు అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసు వర్గాల సమాచారం. ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్..ప్రొద్దుటూరులో ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇటీవల ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న పలువురిని అరెస్ట్ చేశా రు. ఇలా అరెస్ట్ అయిన నాలుగైదు కేసుల్లోనూ ఇంటర్, డిగ్రీ, బిటెక్ చదువుతున్న విద్యార్థులే ఉన్నారు. పోలీసుల విచారణలో అనేక విష యా లు వెలుగు చూశాయి. విద్యార్థులు ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్తో ఇన్స్ట్రాగ్రాంలో చాటింగ్ చేస్తున్నారు. గంజాయికి వీరు పెట్టుకున్న పేరు ‘స్కోర్’. వీరంతా కలుసుకునే ప్రాంతాన్ని ‘సెక్షన్’ గా పిలుచుకుంటారు. మొబైల్లోని వారి ఇన్స్ట్రా గ్రాంలను ఎవరైనా చెక్ చేసినా గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ కోడ్ లాంగ్వేజ్ను ఎంచుకున్నారు. గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాంగంజాయి అమ్మకాలపై నిఘా పెట్టాం. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆకస్మిక దాడులు చేస్తున్నాం. ఇటీవల పట్టుబడిన వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. తల్లిదండ్రులు దృష్టి సారించపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. గంజాయికి బానిస అవుతున్న వారు కొత్త పద్ధతుల్లో మత్తును ఆస్వాదిస్తున్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తుంటే మాకు సమాచారం అందించండి. – సురేంద్రారెడ్డి, ప్రొద్దుటూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ -
అడవిలో మృత్యు ఘోష
పాకాల: ఆ అడవిలో ఏం జరిగింది..? పదిహేను రోజుల క్రితం చనిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ మృతదేహాలు ఎవరివి..? ఆ అడవిలోకి ఎందుకెళ్లారు.? ఆత్మహత్య చేసుకునేందుకా ? లేక ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి అక్కడకు తీసుకొచ్చి చంపేశారా..? అసలు ఏం జరిగింది..? గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్న ఆ మృత దేహాలు ఎవరివి..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. తిరుపతిజిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద ఉన్న స్టార్ హోటల్ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో నాలుగు మృత దేహాలను ఆదివారం స్థానికులు గుర్తించారు. ఒక ఆడ, ఒక మగ మృత దేహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరో రెండు గుంతలు తీసి ఏదో పూడ్చినట్టుగా దానిపై రాళ్లు పెట్టడాన్ని గుర్తించారు. బహుశా ఇద్దరు పిల్లలనూ చంపి ఆ గుంతల్లో పూడ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కుటుంబం ఎక్కడిది..? ఎందుకు అక్కడకు వచ్చింది ? ఆత్మహత్య చేసుకున్నారా ? హత్యకు గురయ్యారా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. చీకటిపడటంతో పోలీసులు పూడ్చిన మృతదేహాలను వెలికితీయలేకపోయారు. జాతీయ రహదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో మృతదేహాలు బయటపడడం పోలీసుల్లో కలవరం రేపింది. మృత దేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ముందుగా మృతి చెందిన వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉలిక్కిపడిన పరిసర గ్రామాల ప్రజలు అడవిలో ఒక చెట్టుకు మగ వ్యక్తి మృత దేహం వేలాడుతుండగా, ఆ చెట్టు కిందనే మహిళ మృత దేహం పడుంది. ఆ మృత దేహాలకు సమీపంలోనే రెండు గొయ్యిలు కనిపిస్తుండడం, ఆ గొయ్యిలపై రాళ్లు పెట్టి ఉండటంతో అందులో కూడా మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో మృత దేహాలు బయటపడడంతో ఉలిక్కిపడ్డ పరిసర గ్రామాల ప్రజలు ఘటనా స్థలికి చేరుకుని అయ్యోపాపం..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణ సాగుతోంది ఇలా.. అడవిలో మృత దేహాలు ఎవరివన్న కోణంలో పోలీసులు ముందుగా దర్యాప్తు ప్రారంభించారు. గాదంకి టోల్ప్లాజా వద్ద అనుమానంగా తిరుగుతున్న వారి చిత్రాలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారులకు ఆనుకుని ఉన్న హోటళ్ల వద్దనున్న సీసీ పుటేజీలు, అడవిలో దొరికిన మృత దేహాల వద్ద కనిపించే దుస్తుల రంగులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ముందుగా మృత దేహాలను గుర్తిస్తే ఆ తరువాత మరణానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్న కోణంలో పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు తమిళనాడువాసులు!ఘటనా స్థలంలో పోలీసులకు ఒక నోకియా ఫోన్, కళై సెల్వన్ పేరుమీద ఉన్న తంజావూరు క్రిస్ ఆసుపత్రి ప్రి్రస్కిప్షన్ లభించింది. దీంతో మరణించినవారు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. -
Hyd: ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్ సీజ్
హైదారాబాద్: సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ స్కూల్ను సీజ్ చేసింది. మేధా స్కూల్ అనుమతులు సైతం రద్దు చేసింది విద్యా శాఖ. ఇక ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..!విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ కరస్పాండెంట్ మల్లేల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైస్కూల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
హనీ ట్రాప్లో యోగా గురువు రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్కి తెరతీసింది.అమర్ గ్యాంగ్కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి మహిళ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హతురాలు రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న రోల్డ్ గోల్డ్ వస్తువులను నిజమైన బంగారమని భావించిన నిందితులు.. వాటిని దాచిన లాకర్ కీ ఆమె ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులు హర్ష్, రోషన్లతో పాటు ఝార్ఖండ్లో వీరికి ఆశ్రయం కల్పించన రాజ్ వర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. స్నేహితుడితో కలిసి.. కూకట్పల్లిలోని స్వాన్లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఉండే రాకే‹Ù, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రాజ్ వర్మ పని చేసేవాడు. ప్రతిరోజూ ఇంట్లో కబోర్డులు శుభ్రం చేస్తుండగా నకిలీ బంగారు ఆభరణాలను చూసి, అవి నిజమైనవిగా భావించాడు. తాను పనిచేసే ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని స్నేహితుడు హర్ష్కు చెప్పాడు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భావించిన హర్ష్ పథకం వేశాడు. రేణు హత్యకు రెండు రోజుల ముందే రాజ్తో పని మాని్పంచి, ఆ స్థానంలో తాను పనిలో చేరాడు. అదే అపార్ట్మెంట్లో 14వ అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో ఝార్ఖండ్కు చెందిన రోషన్ పని చేసేవాడు. హర్ష్, రోషన్లు ఇద్దరూ స్నేహితులే. కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు ఈ నెల 10న రాకేష్, అతని కుమారుడు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్లిపోయారు. రేణు అగర్వాల్ ఒంటరిగా ఉండటంతో హర్ష్, రోషన్లు ఇంట్లోకి చొరబడ్డారు. రేణు నోటిలో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, డబ్బులు, బంగారం ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. సుమారు గంటకు పైగా ఆమెను చిత్రహింసలకు గురిచేసినా చెప్పకపోవడంతో.. ఆగ్రహానికి గురైన నిందితులు వంటింట్లోని కుక్కర్తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతుకోసి.. నుదురు, చేతులు, కడుపు, మెడపై 40సార్లు పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు, నగదు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, గడియారాలను ట్రావెల్ బ్యాగ్లో సర్దుకున్నారు. ఈ ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగ్తో యజమాని స్కూటీపై పరారయ్యారు.పోలీసులను చూసి.. ప్లాన్ మార్చి.. ఈ ముఠా నిత్యం రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటుంది. హత్య చేసిన తర్వాత కూడా రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు పయనమయ్యారు. వీరికి హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. దీంతో మార్గంమధ్యలో ఇద్దరు ముగ్గురిని అడిగి స్టేషన్కు దారి తెలుసుకున్నారు. స్టేషన్ బయటే స్కూటీని వదిలేసి.. లోపలికి వెళ్లి రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిపోయారు. రాంచీ వెళ్లేందుకు టికెట్లు తీసుకొని రైలు ఎక్కేందుకు స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేషన్ లోపల పోలీసులు ఉండటంతో అక్కణ్నుంచి బయటికి వచ్చారు. మళ్లీ హఫీజ్పేట చేరుకొని.. రాత్రి 1 గంట సమయంలో క్యాబ్ బుక్ చేసుకొని, రాంచీలోని రాజు వర్మ వద్దకు వెళ్లిపోయారు. రాంచీకి విమానంలో వెళ్లి నిందితుల పట్టివేత సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు పనివాళ్లే నిందితులని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అప్పటికే హత్య కేసు, అనుమానితుల ఊహాచిత్రాలు మీడియాలో వైరల్ కావడంతో నిందితులను రాంచీలో వదిలేసిన క్యాబ్ డ్రైవర్ దీన్ని గమనించాడు. దీంతో వెంటనే క్యాబ్ యజమాని సహాయంతో నిందితులు క్యాబ్ బుక్ చేసుకున్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. వెంటనే సైబరాబాద్ పోలీసులు నిందితుల కంటే ముందే విమానంలో రాంచీకి చేరుకున్నారు. హర్ష్, రోషన్, రాజ్లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, 16 వాచీలు, రెండు సెల్ఫోన్లు, రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.డ్రగ్స్కు బానిస హర్ష్నిందితుడు హర్ష్ డ్రగ్స్కు వ్యవసనపరుడని విచారణలో పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసే సమయంలోనూ హర్ష్ మత్తులో ఉన్నాడని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కోల్కతాలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిషన్, చికిత్స చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హర్ష్పై 2023లోనే రాంచీలో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్థానికంగా జైలులో ములాఖత్కు వెళ్లి, బయటికి వచ్చేటప్పుడు హీరోగా రీల్స్ చేస్తూ ఉండేవాడని, అందుకోసమే చెయిన్స్, ఆయుధాలను కొనుగోలు చేశాడని సీపీ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీపీ అవినాష్ మహంతిని, ఆయన బృందాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు. -
మా కుమారుడిది ముమ్మాటికీ హత్యే.!
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.కాశీపురంలో విషాదఛాయలు నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో కేసు నమోదునవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. -
పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైసూ్కల్ కరస్పాండెంట్ మల్లే ల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైసూ్కల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి పనులకోసం వచ్చి ఇద్దరు ఏలూరు వాసులు గల్లంతయ్యారు. వివరాలు.. ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో పడి నలుగురు మృతిచెందారు. దాబా గ్రామానికి చెందిన మోర్లె నిర్మలాబాయి, ఆమె కుమారుడు గణేశ్, మరో ఇద్దరు బాలికలు వాడై మహేశ్వరి, ఆదె శశికళ శనివారం చికిలి వాగులో ఖాళీ యూరియా సంచులు కడిగేందుకు వెళ్లారు. నిర్మలాబాయి యూరియా సంచులు కడుగుతుండగా ఒక సంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న గణేశ్ ఆ సంచిని తెచ్చేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు అక్కడే ఉన్న బాలికలు శశికళ, మహేశ్వరి కూడా వాగులోకి దిగారు. వారుకూడా నీళ్లలో మునుగుతుండటం గమనించిన నిర్మలాబాయి రక్షించే ప్రయత్నంలో వారితో పాటే మునిగిపోయింది. గమనించిన నిర్మలాబాయి చిన్న కూతురు లలిత అరుస్తూ వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా వాగులో గాలించగా నిర్మలబాయి (33), గణేశ్ (12), మహేశ్వరి (10), శశికళ (8) మృతదేహాలు లభ్యమయ్యాయి. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్, మ«ధుకర్ ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. వాగులో కొట్టుకుపోయి కూలీల గల్లంతు.. వ్యవసాయ పనులు చేసేందుకు వచ్చిన కూలీల్లో ఇద్దరు వా గు ప్రవాహంలో గల్లంతయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు పత్తి పొలంలో కలుపు తీసేందుకు కూలీలను మాట్లాడాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడుకు చెందిన పాలడుగుల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి (55)తోపాటు మరో ఐదుగురు శనివారం వచ్చారు. అయితే, మధ్యాహ్న భోజనం తర్వాత భారీ వర్షం మొదలవడంతో కూలీలంతా ఇళ్లకు బయలుదేరారు. పొలానికి కొద్ది దూరంలోఉన్న అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగు దాటుతున్నా రు. ఈ క్రమంలో ఎగువ నుంచి గుబ్బల మంగమ్మ వాగు, కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో కూలీలు ఒడ్డుకు పరుగులు తీశారు. వీరిలో వెనకాల ఉన్న చెన్నమ్మ, వరలక్ష్మి మాత్రం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అశ్వారా వుపేట ఎస్సై యాయతీ రాజు, అగి్నమాపక శాఖ అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలి వద్ద గాలించినా రాత్రి వరకు కూలీల ఆచూకీ లభ్యం కాలేదు. -
యూకేలో మహిళపై అత్యాచారం.. ‘మీ దేశానికి వెళ్లిపో’ అంటూ హెచ్చరికలు!
లండన్: అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్నారైను హత్య చేసిన ఘటన మరువకముందే.. యూకేలో మరో దారుణం చోటు చేసుకుంది. బ్రిటన్కు చెందిన సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తలు అత్యాచారానికి పాల్పడ్డారు. యూకేలోని ఓల్డ్బరీ టౌన్లో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల బ్రిటన్ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ‘ ఇక మీ దేశానికి వెళ్లిపో’ అంటూ హెచ్చరించడం తీవ్రంగా కలకలం రేపుతోంది. దీనిపై ఫిర్యాదు చేసిన సదరు బ్రిటన్ మహిళ.. వారు జాత్యహంకారవాదులుగా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడింది కచ్చితంగా జాత్యహంకార వాదులేనని తీర్మానించుకున్న పోలీసులు.. దీనికి ప్రజల నుంచి సహకారం కావాలన్నారు. ప్రస్తుతం సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు.. ఫోరెన్సిక్ ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు యూకే పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ ఘటన పాల్పడిన ఇద్దరు అనమానితులను తెల్లవారిగా పోలీసులు గర్తించారు. అందులో ఒకరు క్లీన్షేవింగ్ హెడ్తో డార్క్ కలర్ టీషర్ట్ ధరించగా, మరొకరు గ్రే కలర్ టాప్ను ధరించినట్లు పోలీసుల ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసింది. ప్రధానంగా సిక్కు కమ్యూనిటీని టార్గెట్ చేసే ఈ దాడులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గత నెలలో కొంతమంది సిక్కు యువకుల్ని వేధింపులకు గురి చేసిన ఘటన సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఓ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటం అక్కడ ఉండే సిక్కు మతస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై పోలీస్ పెట్రోలింగ్ను మరింత పెంచుతామని యూకే పోలీసులు స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనను బ్రిటీష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ తీవ్రంగా ఖండిచారు. ఇటీవల కాలంలో బహిరంగంగానే జాత్యహంకార జాడ్యం విస్తృతమైనట్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా స్పష్టం చేశారు. అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె ఇక్కడికి చెందినది కాదంటూ జాత్యహంకార వాదులు చేసిన వ్యాఖ్యలను బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్కు చెందిన మరో ఎంపీ తప్పుబట్టారు. ఇది తీవ్రమైన హింసాత్మక చర్య అని, ఆమె ఇక్కడిది కాదు.. మీ దేశానికి వెళ్లిపో అంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘మన సిక్కు సమాజానికే కాదు.. ప్రతి సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఓల్డ్బరీలోనైనా బ్రిటన్లో ఎక్కడా కూడా జాత్యహంకారానికి ,స్త్రీ ద్వేషానికి స్థానం లేదు’ అని పేర్కొన్నారు. డల్లాస్ ఎన్నారై హత్య: ప్రాణభయంతో నాగమల్లయ్య.. -
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
రేణు అగర్వాల్ కేసు.. పోలీసులు అదుపులో నిందితులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఢిల్లీలో, మరో ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. దీంతో, వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలించారు. తాజాగా నిందితులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. -
కుటుంబం...బ్యాంకు బాధ్యతలు బ్యాలెన్సు చేయలేక పోతున్నా..
అన్నమయ్య జిల్లా: కుటుంబం, బ్యాంకు పరిధిలోని బాధ్యతలను సమన్వయం చేయలేక తనువు చాలిస్తున్నట్లు స్వహస్తాలతో లేఖరాసి తాను పనిచేస్తున్న బ్యాంకులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సంచలనంగా మారింది. రాయచోటిలోని కరూర్ వైశ్యా బ్యాంకులో మేనేజర్ పవన్ కుమార్ నాయుడు (38) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బ్కాంకులోని మరుగుదొడ్డిలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుండుపల్లి మండలం, చప్పిడివారిపల్లికి చెందిన పవన్ కుమార్ నాయుడు ఐదు నెలల క్రితం బ్యాంక్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లిన మేనేజర్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. బ్యాంకు ఉద్యోగులు పిలిచినా పలుకలేదు. దీంతో డోర్ పగులకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి అర్బన్ ిసీఐ బివి చలపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు గల కారణాలు లేఖలో రాసిపెట్టినట్లు తెలిసింది. కుటుంబ బాధ్యతలను, బ్యాంకు పని ఒత్తిడిని సమన్వయం చేసుకోవడంలో విఫలం అయ్యానని రాసినట్లు తెలిసింది. బ్యాంకులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని భార్య అనూష ఆరోపిస్తున్నారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ిసీఐ తెలిపారు. అయితే లేఖలో రాసిన విషయాలతోపాటు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బ్యాంక్ సిబ్బంది, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పంచనామా నిమిత్తం బ్యాంక్ మేనేజర్ మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్ కుమార్ నాయుడుకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. -
Gwalior: పట్టపగలు ‘లివ్ ఇన్’పై.. పోలీసుల నిర్లక్ష్యంతోనే..
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని కాల్చిచంపాడు.రక్తమోడుతున్న భాగస్వామి పక్కన తుపాకీ తిప్పుతూ..శుక్రవారం మధ్యాహ్నం అరవింద్ రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి, ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు.పోలీసులనూ బెదిరించి..నిందితుడు అరవింద్ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు.‘నేను కోర్టు నుండి వస్తుండగా తుపాకీ శబ్దాలు విన్నాను. అతను వరుసగా మూడు బుల్లెట్లను ఆమెపైకి కాల్చడం చూశాను. జనం భయంతో స్తంభించిపోయారు. ఎవరూ అతన్ని పట్టుకునేందుకు సాహసించలేదు’ అని ప్రత్యక్ష సాక్షి, న్యాయవాది ఎంపీ సింగ్ తెలిపారు. పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ సికార్వర్ మాట్లాడుతూ నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో పోలీసులను బెదిరించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.మొదటి వివాహం, పిల్లలను దాచిపెట్టి..నిందితుడు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని, నందినితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని ఎస్పీ ధరమ్వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నారని, గతంలో లివ్ ఇన్లో ఉన్నారని, అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్పై నందిని పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.హత్యాయత్నం నుంచి తప్పించుకున్నా..2024, నవంబర్లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుండి బయటపడింది. ఆమె ఫిర్యాదు దరిమిలా అరవింద్ను అరెస్టు చేసినప్పటికీ, ఆ తరువాత బెయిల్ పొంది, నందినిని వేధిస్తూ వస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.మహిళల రక్షణపై సందేహాలుశుక్రవారం నాడు నందిని మరోమారు ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా, అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు లేవదాస్తోంది.ఘ ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కర్ణాటకలో విషాదం.. గణేష్ నిమజ్జనం వేళ ఎనిమిది మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న మొసలె హోసహళ్లి రైల్వే గేటు సమీపంలో జరిగింది. మొసలె హోసహళ్లి, హిరెహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం కోసం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంతో, నిర్లక్ష్యంగా వచ్చిన కార్గో లారీ.. అక్కడున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మొదట ఓ బైక్ను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్ను ఢీకొని, చివరకు ఊరేగింపులో ఉన్న భక్తులను చిదిమేసింది. ఈ ఘటనతో వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హసన్, హోళెనరసిపుర పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, లారీ డ్రైవర్ భువనేశ్ను బయటకు లాగి చితకబాదారు. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. Visuals ⚠️ Horrific tragedy in Hassan, Karnataka: A speeding tanker truck rammed into a Ganesh festival procession on NH-373 near Mosalehosalli village.4 dead on the spot, 20+ seriously injured. Rescue ops underway. Intentions unknown!! pic.twitter.com/jipF27Frfi— महावीर जैन, ಮಹಾವೀರ ಜೈನ, Mahaveer Jain (@Mahaveer_VJ) September 13, 2025 -
ప్రియుడితో కలసి కన్నబిడ్డ హత్య
శివ్వంపేట (నర్సాపూర్): ప్రియుడితో కలసి రెండేళ్ల కన్నబిడ్డను హత్య చేసి పాతిపెట్టిందో తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందని భావించి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని శభాష్పల్లిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు మమతకు సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, కూతురు తని్వసి (2) సంతానం. కాగా, మమత శభా‹Ùపల్లికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మార్చి నెలలో ఇద్దరూ కలసి పారిపోవడంతో పెద్దలు సర్ది చెప్పి అత్తగారింటికి పంపించారు. మేలో పిల్లలను తీసుకొని మమత తల్లిగారింటికి వచ్చింది. ఆమెలో ఎలాంటి మార్పు రాకపోగా.. రెండోసారి మే 21న కుమారుడిని తల్లిగారి ఇంట్లోనే వదిలేసి కూతురు తన్విసిని తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మమత తండ్రి రాజు ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో దొరికిన మమత, ఫయాజ్ శివ్వంపేట పోలీసులు ఏపీలోని గుంటూరులో మమత, ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురు తని్వసి విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. గొంతు పిసికి హత్య చేసి, పాతి పెట్టినట్లు చెప్పారు. దీంతో శుక్రవారం సాయంత్రం శభాష్ పల్లి గ్రామ శివారులో చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని కనుగొన్నారు. డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్ కమలాద్రి, ఎస్ఐ మధుకర్రెడ్డి సమక్షంలో కుంట కట్టు కాల్వలో పూడ్చిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫయాజ్పై ఇప్పటికే దొంగతనాలు ఇతర నేరాలకు సంబంధించి 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. -
కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్లో దారిదోపిడీ..
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
మందలించినందుకు తల నరికేశాడు
డాలస్: అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్లో దారుణం జరిగింది. భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను తోటి కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడు. తాము పనిచేస్తున్న హోటల్ వద్ద భార్య, కుమారుడి కళ్లెదుటే ఆయన తలను నరికేశాడు. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ప్రాణభయంతో పరుగులు తీసిన నాగమల్లయ్యను వెంటాడి మరీ నరకడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హంతకుడు యొర్డానిస్ కోబోస్–మారి్టనెజ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు. హంతకుడిని క్యూబా జాతీయుడిగా గుర్తించినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేర చరిత్ర కలిగిన మారి్టనెజ్పై గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాహనం దొంగతనం కేసుతోపాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకు వెళ్లాడు. వలసదారుడన్న సానుభూతితో జో బైడెన్ ప్రభుత్వం అతడిని జైలు నుంచి విడుదల చేసింది. నేరస్థుడైన మారి్టనెజ్కు తమ దేశంలోకి అనుమతించేందుకు క్యూబా ప్రభుత్వం నిరాకరించింది. దాంతోనే అమెరికాలోనే ఉంటున్నాడు. నాగమల్లయ్య హత్య విషయంలో నేరం నిరూపణ అయితే మారి్టనెజ్కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్పారు. అసలేం జరిగింది? చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్లోని డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే హోటల్లో మార్టినెజ్ కార్మికుడు. ఇద్దరికీ చాలా రోజుల నుంచే పరిచయం ఉంది. బుధవారం ఉదయం హోటల్ గదిని శుభ్రం చేసే విషయంలో గొడవ మొదలైంది. మారి్టనెజ్, మరో మహిళా కార్మికురాలు కలిసి విరిగిపోయిన మెషీన్తో గదిని ఊడ్చేందుకు ప్రయతి్నస్తుండగా నాగమల్లయ్య వారించాడు. అలా చేయొద్దంటూ మందలించినట్లుగా మాట్లాడారు. దాంతో ఆగ్రహానికి గురైన మారి్టనెజ్ అప్పటికే తన వద్దనున్న కత్తితో నాగమల్లయ్యపై దాడి చేసేందుకు ముందుకొచ్చాడు. ఆందోళన చెందిన నాగమల్లయ్య వెంటనే బయటకు పరుగెత్తారు. ఎవరైనా తనను కాపాడాలని గట్టిగా ఆరుస్తూ పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మారి్టనెజ్ అక్కడికి దూసుకొచ్చి నాగమల్లయ్యను కత్తితో పొడిచేశాడు. ఉన్మాదిలా మారి విచక్షణారహితంగా తల నరికాడు. నాగమల్లయ్య జేబులోని తాళం కార్డును, సెల్ఫోన్ను తీసుకున్నాడు. తెగిపడిన తలను కాలితో రెండుసార్లు దూరంగా తన్నాడు. తర్వాత తలను చేతితో తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. మారి్టనెజ్ను అరెస్టు చేశారు. రక్తంతో కూడిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నాగమల్లయ్య భార్య, కుమారుడు హోటల్లోనే ఉన్నారు. కేకలు విని బయటకు వచ్చారు. నాగమల్లయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని మారి్టనెజ్ బలవంతంగా నెట్టేశాడు. నాగమల్లయ్య తల తెగిపోయేదాకా నరుకుతూనే ఉన్నాడు. ఇదంతా హోటల్ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కళ్లెదుటే జరిగిన హత్యను చూసి నాగమల్లయ్య భార్య, కుమారుడు బిగ్గరగా రోదించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలు బాదుకున్నారు. ఈ హత్య పట్ల హూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. కర్ణాటక వాసి నాగమల్లయ్య నాగమల్లయ్య స్వస్థలం భారత్లోని కర్ణాటక. చాలా ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. డాలస్ డౌన్టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్గా చేరారు. ఆయన చాలా సౌమ్యుడని, గొడవలకు దూరంగా ఉంటారని మిత్రులు చెప్పారు. కుటుంబం అంటే ఆయనకు ప్రాణమని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం బాధగా ఉందన్నారు. నాగమల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన కుమారుడి చదువులకు అయ్యే ఖర్చుల కోసం మిత్రులు నిధుల సేకరణ ప్రారంభించారు. నాగమల్లయ్య అంత్యక్రియలు శనివారం అమెరికాలోనే జరుగుతాయని సమాచారం. -
భార్య, ఆమె ప్రియుడి తలలతో జైలుకు
వేలూరు: భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మలై కొట్టాలంకు చెందిన కొలంజి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి(46)కి, అదే గ్రామానికి చెందిన తంగరాసు(39)తో కొంత కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలియడంతో కొలంజి వారిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తంగరాసు బుధవారం అర్ధరాత్రి కొలంజి ఇంటిపైన లక్ష్మిని కలిశాడు. వారిని గమనించిన కొలంజి.. తీవ్ర ఆగ్రహావేశంతో ఇంట్లోని కత్తితో ఇద్దరి తలలను నరికాడు. వాటిని బ్యాగులో వేసుకొని గురువారం తెల్లవారుజామున బస్సులో వేలూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వారు కల్లకుర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. కల్లకుర్చి పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొలంజిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’
సాక్షి,కర్నూలు: దేవనకొండలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన ఎనిమిది నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి చివరి శ్వాస... ఊహించుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. ‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’ అనే మాటలు చెప్పలేని వయసులో ఉన్నా, ఆ అమాయక బిడ్డ బాధ ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండకు చెందిన నరేష్ గురువారం పొలంలో తన ఎనిమిది నెలల కుమారుడిని నీటిడ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. అనంతరం పోలంలో ఉన్న భార్య శ్రావణిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన బాధితురాలి అత్తమామలు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్కు నేరచరిత్ర ఉంది. ఇప్పటికే మొదటి భార్య హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే, నరేష్ తల్లిదండ్రులు అతడికి రెండో వివాహం జరిపించారు. కానీ వివాహం జరిగిన కొద్దికాలానికే నరేష్ తన రెండో భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్య,భర్తల మధ్య గొడవలు జరిగేవి.ఈ క్రమంలో భార్య శ్రావణిని హతమార్చేందుకు నరేష్ కుట్ర చేశాడు. ఇందులో భాగంగా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి పొలం వెళ్లిన నరేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. ఆపై భార్యపై మారణాయుధాలతో తెగబడ్డారు. నిందితుది దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్ చేశారు. పాక్ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నాడు. భారీ టెర్రర్ మాడ్యుల్ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో, హుజైఫ్ యెమెన్ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. #WATCH | Delhi Police Special Cell busted a Pan-India terror module and arrested five terrorists identified as Ashhar Danish, Sufiyan Abubakar Khan, Aaftab Ansari, Huzaifa Yaman and Kamran Qureshi A large quantity of materials and precursors for making IED have been seized from… https://t.co/uAcHkQ8r58 pic.twitter.com/zoCOqCkCJK— ANI (@ANI) September 11, 2025 -
పాట్నాలో ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత దారుణ హత్య గురయ్యారు. రాజ్కుమార్ రాయ్ను దుండగులు కాల్చి చంపారు. బుధవారం రాత్రి పాట్నాలోని చిత్రగుప్త్ ప్రాంతంలోని మున్నాచక్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్కుమార్ రాయ్.. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాయ్ భూమి కొనుగోలు, అమ్మకాల్లో వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
ఫ్రిడ్జ్లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!
పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.ఏమిటీ పోస్ట్పార్టమ్ సైకోసిక్.. సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजहRead more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025 -
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముహూర్తం కోసం వచ్చి అనంతలోకాలకు..
ఎర్రుపాలెం/కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజల తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తె వివాహం తమ గ్రామానికే చెందిన సాయితో జరిపించారు. ఇక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్కు ఇటీవల వివాహం కుదిరింది. కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న ఓ పూజారి వద్దకు వచ్చి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆపై బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎర్రుపాలెం – తక్కెళ్లపాడు మధ్య ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతుల తలలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరులో శ్రీనివాసరావు, కుమారి మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
లాభాలుండవ్.. లాసే
హైదరాబాద్కు చెందిన ఒకరు వాట్సాప్ ద్వారా ‘బజాజ్ ఫైనాన్షియల్సెక్యూరిటీస్ లిమిటెడ్’అనే పేరుతో ఉన్న నకిలీ గ్రూప్లో చేరాడు. ఈ గ్రూప్ మార్కెట్ ట్రెండ్స్, బ్లాక్ ట్రేడ్స్, ఐపీఓలపై అప్డేట్స్ ఇచ్చేది. గ్రూప్ అడ్మిన్ పురవ్ ఝవేరి, అతని సహాయకురాలు ప్రిషాసింగ్ బాధితుడిని ఒక నకిలీ యాప్లో ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహించారు. దీంతో బాధితుడు మే 30 నుంచి జూలై 9, 2025 మధ్య రూ.3.24 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు విత్డ్రాకు వీలుకాకపోవడంతో టీజీసీఎస్బీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో టీజీసీఎస్బీకి అధికారులు మహ్మద్ రజియుద్దీన్, మహ్మద్ వలియుల్లా, మహ్మద్ జుబైర్ఖాన్లను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన 49 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్టెలిగ్రామ్ గ్రూప్లో చేరగా, ఒక మహిళ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సలహాలు ఇవ్వగా, ఒక నకిలీ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు రూ.3.30 కోట్లు అందులో పెట్టాడు. విత్డ్రా చేయడానికి ప్రయతి్నంచగా, 10 శాతం కమీషన్, ట్యాక్స్ చెల్లించమని కోరడంతో ఇది స్కామ్ అని గుర్తించి టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశాడు. తాజాగా ఆదివారం (సెప్టెంబర్ 7) నమోదైన కేసులో యూసుఫ్గూడకు చెందిన వ్యక్తి రూ.28.76 లక్షలు ఈ తరహా మోసంలో పోగొట్టుకున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సలహాలతో ఓ వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ట్రేడింగ్ ఐపీఓల పేరిట పెట్టుబడి పెట్టేలా చేశారు. మొదట లాభాలు వచి్చనట్టు చూపి తర్వాత డబ్బులు విత్డ్రాకు అవకాశం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశే కొందరి కొంప ముంచుతోంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. పెట్టిన పెట్టుబడికి పదుల రెట్లలో లాభాలు వస్తాయని ఆశపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణానికి భిన్నంగా తక్కు వ సమయంలోనే అనూహ్య లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే అవి పక్కా మోసమే అన్న చిన్న లాజిక్ మిస్సవుతున్న ఎంతోమంది సైబర్ నేరగాళ్లకు రూ.కోట్లు సమర్పించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు పెరిగినట్టు టీజీ సైబ ర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ ఏడాది లో ఆగస్టు 31 వరకు చూస్తే ఈ తరహా కేసులు 17,169 నమోదైనట్టు టీజీసీఎస్బీ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మోసం చేస్తున్నారు... సైబర్ కేటుగాళ్లు అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్లు వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వేదికల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, తద్వారా భారీ లాభాలు పొందే అవకాశాల గురించి మెసేజ్లు పంపుతారు. అందులో లింక్లపై ఎవరైనా క్లిక్ చేస్తే వారికి ఆన్లైన్ పెట్టుబడుల అంశాలపై సలహాలు ఇస్తూ...నమ్మకం పెంచుతారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ కల్పిస్తారు. అవతలి వ్యక్తి తమను నమ్ముతున్నట్టు గుర్తిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేయడం..తాము సూచించిన యాప్లలో పెట్టుబడి పెట్టాలని క్రమంగా ఒత్తి్తడి చేస్తారు. తొలుత లాభాలు వచ్చినట్టుగా నకిలీ మెసేజ్లు చూపుతారు. ఇలా రూ.లక్షల నుంచి మొదలై రూ.కోట్ల వరకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి » తక్కువ సమయంలో అధిక లాభాలు అంటూఊదరగొడుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. » వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే ఎస్ఎంఎస్లలో ఉండే లింక్లపైక్లిక్ చేసి వారిచ్చిన యాప్లలో పెట్టుబడి పెట్టొద్దు. » మీరు పెట్టుబడి పెట్టే ముందు చట్టబద్ధత ఉందా లేదానిర్ధారించుకోవాలి. షేర్లలో పెట్టుబడి డీమాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని మరవొద్దు. అధిక లాభాల ప్రకటనలతోజాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్,లింక్లను నమ్మి తెలియని యాప్లు లేదావెబ్సైట్లలో పెట్టుబడి పెట్టి మోసపోవొద్దు. అధిక లాభాల ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి.మీ డబ్బులు సురక్షితంగా ఉంచుకోండి – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ -
వాట్సాప్ గ్రూపులే టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఆన్లైన్లో ఎర వేసి అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారు. ఈ–కేటుగాళ్లు తాజా గా వేస్తున్న ఎత్తు వాట్సాప్ బల్క్ హ్యాకింగ్. తొలుత ఓ ఫోన్ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఆ నంబర్ ఉన్న వాట్సాప్ గ్రూపు ల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ నంబర్ నుంచి ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్స్ను వాట్సాప్ గ్రూపుల్లోకి పంపి పెద్ద ఎత్తున నంబర్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ నేరాల బాధితుల్లో పోలీసులు సైతం ఉండటం గమనార్హం. గడిచిన పక్షం రోజుల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఓ సబ్–ఇన్స్పెక్టర్ (ఎస్సై), హైదరాబాద్ కమిషనరేట్లో పని చేసే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ) కూడా బాధితులుగా మారారు. అధికారిక వెబ్సైట్ల నుంచి వివరాలు ఈ రకమైన నేరాల కోసం సైబర్ నేరగాళ్లు ప్రధానంగా వాట్సాప్ గ్రూపులను టార్గెట్గా చేసుకుంటున్నారు. పోలీసు సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇటీవల ఇలాంటి గ్రూపులు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో అధికారుల నంబర్లను అధికారిక వెబ్సైట్ల నుంచే సంగ్రహించి ముందుగా వారి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లో వాట్సాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, దాన్ని యాక్టివేట్ చేసేందుకు వెబ్సైట్ నుంచి సేకరించిన అధికారి నంబర్ను వాడుతున్నారు. ఆ నంబర్కు వచ్చే ఓటీపీ కోసం కట్టుకథలు అల్లుతున్నారు. తాము ఓ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పొరపాటున మీ నంబర్ ఎంటర్ చేశామని, ఫలితంగా ఓటీపీ మీకు వచ్చిందని, దయచేసి చెప్తే తన పని పూర్తవుతుందని నమ్మబలుకుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు.. ఆ ఓటీపీ చెప్తున్నారు. ఆ నంబర్తో సైబర్ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సా ప్ యాప్ను యాక్టివేట్ చేయగానే.. బాధితుడి నంబర్తో పనిచేసే వాట్సాప్ వారి ఫోన్ నుంచి సైబర్ నేరగాడి ఫోన్లో యాక్టి వేట్ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘టూ స్టెప్ వెరిఫికేషన్’కు మార్చేస్తున్నారు. ఆపై బ్యాకప్ నుంచి కాంటాక్ట్స్, గ్రూపులు, ఇతర వివరాలు డౌన్లోడ్ చేసుకుని, ఆ గ్రూపుల్లో సదరు అధికారి మాదిరిగా సందేశం పెడుతూ.. ఏపీకే ఫైల్స్ తో కూడిన లింకులు పంపిస్తున్నారు. ఈ సందేశం సదరు అధికారి నుంచే వచ్చినట్లు భావిస్తున్న గ్రూపు సభ్యులు క్లిక్ చేయడంతో ఏపీకే ఫైల్స్ వారి ఫోన్లలోకి చొరబడి, అవీ హ్యాక్ అయిపోతున్నాయి. ఈలోపే తమ ఫోన్లో వాట్సాప్ పని చేయట్లేదని గుర్తించి న సదరు అధికారి.. ఆ యాప్ను డిలీట్ చేసి మరోసారి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయ డానికి ప్రయత్నించినా ఫలితం దక్కట్లేదు. ఈ జాగ్రత్తలు అవసరం వాట్సాప్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు మూడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నా రు. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ నంబర్తో కూడిన వాట్సాప్ను మరోసారి, మరో ఫోన్లో యాక్టివేట్ చేయాలంటే... ఓటీపీతో పాటు యాక్టివేషన్ కోడ్ కూడా అవసరం అవుతుంది. అపరిచితుల, సుపరిచితుల నంబర్ల నుంచి వచ్చే లింకుల్లో ఏపీకే అనే ఫైల్ ఉంటే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. -
కూలిపోయిన బతుకులు
తనకల్లు/ వేంపల్లె : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలి కాస్త ఎక్కువగా వస్తుందన్న ఆశతో జిల్లాదాటి వచ్చారు. రోజంతా టమాట తొలగింపు పనుల్లో అలసిపోయారు. సూర్యుడు అస్తమించే వేళ ఆ రోజు అందిన కూలి తీసుకుని స్వగ్రామాలకు ఆటోలో పయనమయ్యారు. ఇంట్లో బిడ్డల గురించి ఒకరు, భార్య ఆరోగ్యం గురించి మరొకరు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నారు. కానీ ఆటో బోల్తా పడగా వారి జీవితాలు అక్కడే ముగిసిపోయాయి. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో మండలం పరిధిలోని కొక్కంటి సమీపంలోని మించిలవారికోట రోడ్డు వద్ద బోల్తా పడడంతో వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యసాయ కూలీలు పట్టా దేవనాథ్ (45), బత్తల హేమలత (32) మృతి చెందారు.తిరిగి వెళ్తూ.. తిరగిరాని లోకాలకువైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని అగ్రహారంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో టమాట కోసేందుకు వచ్చారు. పని ముగిసిన అనంతరం అదే ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మించిలివారికోట రోడ్డు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బత్తల హేమలతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న బూరుజుపల్లికి చెందిన పట్టా దేవనాథ్, పట్టా బయన్న, శివగంగ, కొండప్పగారిపల్లికి చెందిన పెద్ద గంగులయ్య, బురుజుపల్లికి చెందిన పట్టా బయప్ప, గాయపడ్డారు. షయం తెలుసుకున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాగేపల్లి అశోక్, బాలు, నవీన్, తండేల్ తదితరులు క్షతగాత్రులను తమ ఉచిత అంబులెన్స్లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుట్టా దేవనాథ్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ గోపి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బత్తల హేమలతకు భర్త రామాంజనేయులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శివగంగ, బేబీ, గణేష్లు అనే ముగ్గురు పిల్లలు ఉండగా తల్లి వెంట కుమార్తె శివగంగ కూడా కూలి పనులకు వెళ్లింది. శివగంగకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు దేవనాథ్కు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు బయప్ప, బయన్నలు ఉన్నారు. వీరు డిగ్రీ, ఇంటర్ చదువుకుంటున్నారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
షాకింగ్ ఘటన.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికెళ్లిన మహిళ
ఫరూఖ్బాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖ్బాద్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత(33).. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించిన యువకుడు, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. నిషా సింగ్ అనే మహిళను యువకుడు దీపక్ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది.తమతో మాట్లాడాలంటూ దీపక్, అతని స్నేహితులు ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మాట్లాడానికి నిరాకరించడంతో వారి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ మహిళకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 6న ఈ సంఘటన జరిగింది.మృతురాలి తండ్రి బాల్రామ్ సింగ్ తన కుమార్తెను ఒక వ్యక్తి, అతని స్నేహితులు ఆగస్టు 6న సజీవ దహనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పరిస్థితి గురించి డాక్టర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తాను ఆసుపత్రికి వెళ్ళానని బాధితురాలి తండ్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు."డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ కూతురు చాలా తీవ్రంగా కాలిపోయిందని.. త్వరగా రండి అని చెప్పారు. నేను అక్కడికి చేరుకునేసరికి ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 'నాన్నా నన్ను రక్షించు' అని అరుస్తోంది. దీపక్ తనకు నిప్పు పెట్టాడని చెప్పింది. ఆ వ్యక్తి తనతో మాట్లాడమని, కలవమంటూ బలవంతం చేసేవాడని తన కూతురు చెప్పిందని తండ్రి బాల్రామ్ సింగ్ తెలిపారు. నిషా సింగ్ భర్త మాట్లాడుతూ.. వేధింపులు గురించి తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. -
మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ జ్యూస్ షాప్ వద్ద రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్కుమార్ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్కుమార్ కలిసి కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బీజేపీ ఎంపీ సోదరికి వేధింపులు.. వెలుగులోకి మామ, మరిది అకృత్యాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా బీజేపీ ఎంపీ సోదరికే అత్తింటి వారి నుంచి వేధింపులు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి ఇంట్లో వారి అకృత్యాలు నిలదీసినందుకు మామ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం, ఆమెను వీధిలోకి లాగి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. యూపీలోని ఫరూఖాబాద్ ఎంపీ ముకేశ్ రాజ్పుత్ సోదరి రీనా సింగ్కు 17 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా జిల్లాలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం అనూహ్యం ఘటన చోటుచేసుకుంది. రీనా సింగ్ను తన మామ లక్ష్మణ్ సింగ్, తన భర్త సోదరులు కలిసి.. నడి వీధిలో దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. తనను కొట్టవద్దని ఎంత వారించినా.. ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అనంతరం, తనపై జరిగిన దాడిపై రీనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లుగా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.देखिये योगीबाबा के जंगलराज में जब भाजपा सांसद मुकेश राजपूत की बहन को इस तरह पीटा जा रहा है, तो बाकी महिलाओं का क्या हाल होगा ? उनके ससुर ने बीच सड़क बेरहमी से 4 सेकेंड में 5 डंडे मारे। सांसद की बहन चीखती-चिल्लाती रही। कोई मदद को आगे नही आया । pic.twitter.com/Gukk8Xh34R— Shyam Yadav SP (@shyamyadavsp95) September 8, 2025ఈ సందర్భంగా రీనా సింగ్ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్న సమయంలో మామ, తన మరిది కలిసి బాత్రూమ్ కిటికీ నుంచి ఫోన్లో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై నేను వారిని ప్రశ్నించడంతో నాపై దాడి చేశారు. నా కుమార్తెను కూడా దారుణంగా కొట్టారు. చాలా రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో, రీనా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు బీజేపీ ఎంపీ సోదరి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
భర్తను హత్య చేసిన మూడో భార్య.. కంగుతిన్న రెండో భార్య!
బోపాల్: మూడో భార్య చేతిలో హత్య గురయ్యాడు 60 ఏళ్ల వృద్ధుడు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను వదిలించుకోవాలనే ప్రణాళిక చేసిన మూడో భార్య దాన్ని ప్రియుడితో కలిసి అమలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామంలో చోటు చేసుకుంది. 60 ఏళ్ల భయాలాల్ రజాక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అతని నుంచి విడిపోతే రెండో భార్యగా గుడ్డి బాయ్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలగకపోవడంతో సొంత చెల్లినిచ్చి భర్తకు మూడో వివాహం చేసింది రెండో భార్య. మూడో భార్యగా మున్ని( విమ్లా) వచ్చింది. వీరి మధ్య కొన్నాళ్ల వివాహ సంబంధం బాగానే సాగింది. ఈ క్రమంలోనే వారికి పిల్లలు కూడా కలిగారు. కానీ మూడో భార్య మున్ని.. స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ దాస్ కుష్వాహ్(లల్లూ)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి భర్త భయాలాల్ రజాక్ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. దీనిలో భాగంగా ఆగస్టు 30వ తేదీ అర్థరాత్రి దాటక లల్లూ.. రజాక్ను హత్య చేశాడు. కిరాయి మాట్లాడుకున్న 25 ఏళ్ల ధీరజ్ కోల్తో కలిసి రజాక్ను తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఆపై శారీలో కట్టి ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న బావిలో పడేశారు. అయితే భర్త కనిపించడం లేదని రెండో భార్య గుడ్డి భాయ్ వెతకడం ప్రారంభించిన క్రమంలో ఒక బావిలో శారీలో కట్టేసిన మూట కనిపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చెల్లి మున్నీనే చేసి ఉంటుందని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. -
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
అనకాపల్లి: ఖైదీల పరారీ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.సినీ ఫక్కీలో వార్డెన్పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
బర్త్ డే పార్టీ చేస్తామని పిలిచి.. మహిళపై గ్యాంగ్ రేప్!
కోల్కతా: ప్రస్తుత రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు. చుట్టూ ఉన్న జనం మంచిగా ఉంటున్నారని వారు మనకి అండగా ఉంటారనుకోవడానికి లేదు. వెనకాల గోతులు తీసేవాళ్లు, అవకాశం వస్తే తమ అవసరాలు తీర్చుకునే వాళ్లు ఉంటారనేది గ్రహించాలి. తాజాగా జరిగిన ఘటన అందుకు అద్దం పడుతుంది. తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బర్త్ డే రోజున.. పుట్టిన రోజు తాము చేస్తామని నమ్మబలికిన ఇద్దరు ప్రబుద్ధులు.. సదరు మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో చోటు చేసుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 5వ తేదీ) జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. కోల్కతా నగర పొలిమేర ప్రాంతమైన రీజెంట్ పార్క్ ఏరియాలో ఉంటున్న చందన్ మాలిక్, దీప్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు తెలిసిన ఒక మహిళను బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తామని నమ్మబలికారు. ఆమె వారిని నమ్మడంతో దీప్ ఇంటికి తీసుకెళ్లారు. వారు ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళతానని ఆమె చెప్పడంతో గది తలుపులు మూసివేశారు నమ్మక ద్రోహలు ఆపై ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందులో దీప్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తోంది. దీనిపై ఆమె ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు ఆ నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తనకు చందన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని, అతని తనను కోల్కతా దుర్గా పూజా కమిటీలో హెడ్గా చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలోనే దీప్ను చందన్ పరిచయం చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనను పూజా కమిటీలో జాయిన్ చేస్తానని వారు ప్రామిస్ చేశారని, అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని 20 ఏళ్ల బాధిత మహిళ పేర్కొంది. తన బర్త్ డే సందర్బంగా తనను ఆ వేడుకలు చేస్తామని పిలిచి ఇలా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో స్పష్టం చేసింది. జూన్ 25వ తేదీన కోల్కతాలో లా స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. మనోజిత్ మిశ్రా అనే వ్యక్తి లా విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాజా సంఘటనతో కోల్కతా నగరంలో మహిళల భద్రతపై ఆందోళన నెలకొంది. -
హైదరాబాద్లో కారు బీభత్సం.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ వాహనాన్ని కియా కారు ఢీకొట్టింది. లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో యువతి కశ్వి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.