Crime
-
మహిళకు లైంగిక వేధింపులు.. బిగ్బాస్ కంటెస్టెంట్పై ఫిర్యాదు
ప్రముఖ మలయాళ నటుడు, బిగ్బాస్ ఫేమ్ షియాస్ కరీంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలోని పాలారివట్టం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఆర్థికంగా మోసం చేశాడంటూ విదేశాల్లో నివసిస్తున్న ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన నగ్న చిత్రాలను అశ్లీల వెబ్సైట్లలో పెడతానని బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వద్ద నుంచి రూ.65 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన సోషల్ మీడియా చాటింగ్స్, వాయిస్ రికార్డింగ్లను పోలీసులకు అందించింది. షియాస్ కరీంకు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులను సైతం పోలీసులకు సమర్పించింది. అతని వల్ల తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో ప్రస్తావించింది. వేధింపులు భరించలేకనే పోలీసుల ముందుకు వచ్చానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షియాస్ను అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చెన్నై విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో ఎర్నాకుళంలో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్న కాసరగోడ్కు చెందిన మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడి వేధింపులతో పాటు దాదాపు రూ.11 లక్షలు వసూలు చేశాడని ఆ మహిళ ఆరోపించింది. -
రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్
భోపాల్: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని, భోపాల్ దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆడబిడ్డ ఇంటికి లక్ష్మిలాంటిది అని భావిస్తారు. కానీ తమ కుటుంబానికి, వ్యాపారానికి రెండున్నరేళ్ల పాపను ఇంటికి పట్టిన శనిగా భావించారు. ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. ఏప్రిల్ 18న నేషనల్ హైవేపై వదిలేశారు. కట్ చేస్తే..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షియోపూర్ జిల్లాలోని ఒక హైవేపై తమ రెండున్నరేళ్ల కుమార్తెను వదిలేశారు ఒక వ్యాపారవేత్త కుటుంబం. పోలీసులు ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అయితే వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగు చేశాయి. ఏప్రిల్ 18న షియోపూర్లోని సోయిన్కలాన్లో జాతీయ రహదారి-552పై ఆ పాప ఒంటరిగా కనిపించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక బాలల సంక్షేమ కమిటీ (CWC)కి సమాచారం అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ కమిటీ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుంది.అయితే ఈకేసు విచారణలో అనుమానిత బాలల అక్రమ రవాణా ముఠా వ్యవహారం తెలిసింది. ఆ పాపను వారు దత్తత తీసుకోలేదు, రూ.లక్షకు ఇండోర్లోని ఒక అక్రమ నెట్వర్క్ ద్వారా కొనుగోలుచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బలహీన వర్గాల నుంచి పిల్లలను సేకరించి, దత్తత ముసుగులో కొనుగోలు దారులకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. इस छोटी सी बच्ची को उसके मां-बाप ने श्योपुर के पास एक ढाबे में छोड़ दिया, बच्ची को उन्होंने गोद लिया था फिर कहा कारोबार में नुकसान हुआ तो बच्ची को मनहूस समझने लगे ... अब पता लगा है कि ये सब मानव तस्करी से जुड़े थे इस शख्स ने बच्ची की सूचना पुलिस को दी pic.twitter.com/2cX0TRW6zg— Anurag Dwary (@Anurag_Dwary) April 27, 2026సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు, చిన్నారిని పడేయడానికి ఉపయోగించిన వాహనాన్ని భోపాల్లో గుర్తించారు. తద్వారా గుణకు చెందిన ఒక వ్యాపారవేత్త దంపతులను అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నామని వాదింయినప్పటికీ పోలీసుల సుదీర్ఘ విచారణలో అసలు విషయం ఒప్పుకుని, ఆ బాలికను ఇండోర్కు చెందిన ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, ఆమె సహచరుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.అయితే ఆ పాప ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తమకు అరిష్టం జరుగుతోందని, అందుకే ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశామని వారు ఒప్పుకున్నారు.మరోవైపు ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భోపాల్కు చెందిన ఒక మహిళ, తాను ఆ చిన్నారి మాజీ సంరక్షకురాలినని చెప్పుకుంటూ, ఆ బాలిక శారీరక వేధింపులకు గురైందని పోలీసులకు తెలిపింది. బిడ్డను చూసుకోవడానికి తనను నెలకు రూ. 20,000 జీతానికి నియమించుకున్నారని, అయితే జీతం అందకపోవడంతో తాను పని మానేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఉన్న ఇండోర్కు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారి కన్న తల్లిదండ్రులను గుర్తించి, ఈ దందా పూర్తి స్థాయిని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. హైదరాబాద్ సైకిల్ ట్రాక్లో ఓ మహిళా రన్నర్కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది. భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. This Is Hyderabad! Isn’t This Supposed To Be Safe?? A very agitated runner was seen asking in this video. She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!! Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37— Revathi (@revathitweets) April 27, 2026 -
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు. -
తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధ రాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. -
తుపాకీతో కాల్చుకుని టీచర్ ఆత్మహత్య
బెంగళూరు: కొడగు జిల్లా మడికెరి తాలూకా చేరంబాణె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామవాసి రోహిణి (51) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న బ్యారెల్ తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడే మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మడికెరి గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంబారు చేయలేదని... తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. సౌజన్య పూజారి (22) మృతురాలు. శనివారం ఉదయం తండ్రి కాయగూరలు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి సాంబారు వండాలని చెప్పి వెళ్లాడు. కానీ ఆమె చేయలేదు, భోజనవేళకు వచ్చిన తండ్రి.. ఎందుకు చేయలేదని దండించి, హోటల్ నుంచి సాంబారు తెచ్చుకుందామని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి సౌజన్య ఉరికి వేలాడుతూ ఉంది. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాన్వెజ్ కర్రీ వండలేదని..
కామారెడ్డి టౌన్: మాంసాహారం విష యంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ.. ఇద్దరు చిన్నా రులను అనాథలను చేసింది. క్షణికావేశంలో కొడవలితో భార్య దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), అతడి భార్య లక్ష్మి మధ్య వారంరోజులుగా గొడవ జరుగుతున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో శనివారం రాత్రి నాన్వెజ్ వండాలని శివాజీ కోరగా లక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై దాడి చేసింది. గొంతు, మెడ భాగంలో లోతుగా తెగడంతో శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏడాది, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడం, తల్లి అరెస్ట్ కావడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. -
విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
సాక్షి, నల్లగొండ: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో బయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు.దీంతో ఆ టీచర్ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. -
కట్టుకోబోయేవాడే చంపాడు..
సాక్షి, మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్ ఇటుకలగడ్డతండాకు బైక్పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు.పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రియుడి ఇంటికెళ్లి.. టీవీ సౌండ్ పెంచేసి..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. అతని ఇంటిలోకి చొరబడి భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో కానిస్టేబుల్ భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లేందుకు టిక్కెట్లు కోసం రైల్వే స్టేషన్కు వెళ్లారు. అదే సమయంలో నిందితురాలు సరోజినీ భరద్వాజ్.. దుర్గ్లోని ఆయన ఫ్లాట్కు చేరుకుని కానిస్టేబుల్ భార్య రీనా యాదవ్తో గొడవకు దిగింది,గొడవ బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్ను పెంచిన సరోజినీ భరద్వాజ్.. అనంతరం కత్తి తీసుకుని మొదట నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల కుమారుడు ఆదిత్యపై విచక్షణారహితంగా దాడి చేసింది. తర్వాత నిందితురాలు మిగిలిన ఇద్దరు కుమార్తెలు నైనా, తానియాపై దాడికి ప్రయత్నించగా... తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్ తన బిడ్డలను వదిలేయమని ప్రాధేయపడింది. నిందితురాలి కాళ్లు పట్టుకుని తన కూతుళ్లను పారిపోమని కోరింది. దీంతో ఒక కుమార్తె బాత్రూమ్లో దాక్కుంది, మరొకరు బయటకు పరుగెత్తి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు.కేకలు విని పొరుగువారు వచ్చేసరికి.. నిందితురాలు రక్తంతో తడిసిన కత్తితో తలుపు దగ్గర నిలబడి ఉంది. స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రికి తరలించే లోపే రీనా యాదవ్, ఆమె కుమారుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.భరద్వాజ్, లలితేష్ యాదవ్ మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. శుక్రవారం కూడా ఆమె ఇంటికి రాగా, కానిస్టేబుల్ ఆమెను పంపించివేశారు. కానీ శనివారం ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. నిందితురాలిని అరెస్టు చేశామని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం
కాన్పూర్లో ఒక 24 ఏళ్ల యువ న్యాయవాది తన తండ్రి వేధింపుల కారణంగా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లితండ్రుల ప్రవర్తన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. సూసైడ్ నోట్లో అతను పేర్కొన్న విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ప్రియాంషు శ్రీవాస్తవ అనే యువ న్యాయవాది కాన్పూర్ కోర్టు భవనం ఐదవ అంతస్తు నుండి దూకేశాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయనను హుటా హుటిన ఉర్సులా హార్స్మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాల్యంలో చేదు అనుభవాలు వారి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి, తద్వారా అపరాధ భావం, న్యూనతా భావం, ఒత్తిడి పెరిగిపోతాయని మనస్తత్వ నిపుణులు చెపుతారు. తన తండ్రి చిన్నతనం నుండి తనను ఎలా మానసిక వేదనకు గురిచేశారో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు ప్రియాంషు తన వాట్సాప్ స్టేటస్లో రెండు పేజీల సూసైడ్ నోట్ను పోస్ట్ చేశాడు. శ్రీవాస్తవ తాను రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్లో, తన బాల్యం , కౌమార దశలో తన తండ్రి తనను మానసికంగా వేధించిన వైనాన్ని వివరించాడు. పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న తండ్రి వల్ల మానసిక ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు.మ్యాంగో జ్యూస్ తాగినందుకు శిక్షప్రియాంషుకు 6 ఏళ్ల వయసున్నప్పుడు, ఫ్రిజ్లో ఉన్న మామిడి జ్యూస్ను అనుమతి లేకుండా తాగినందుకు తండ్రి ఆయన బట్టలు విప్పదీసి ఇంటి నుండి బయటకు గెంటివేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన తనను చాలా బాధించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: అంత్యక్రియల్లోబార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!2016లో 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రియాంషు 'ఫిజికల్ ఎడ్యుకేషన్' తీసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి బలవంతం చేసి 'కంప్యూటర్' సబ్జెక్టు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, మాట వినకపోతే పాత శిక్షలే వేస్తానని బెదిరించారని నోట్లో రాశాడు.తండ్రిపై ఆగ్రహంతండ్రి ప్రవర్తన ప్రియాంషు మనసుని చిన్నాభిన్నం చేసింది. అందుకే తన తండ్రి లాంటి వ్యక్తి ఎవరికీ వద్దు దేవుడా అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన మరణం తర్వాత తండ్రి, తన దేహాన్ని తాకడానికి వీల్లేదని కోరుకున్నాడు. అలాగే తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కోరుతూనే, తన మరణం తర్వాత తన తల్లిని వేధించవద్దని వేడుకున్నాడు. ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!పోలీసుల దర్యాప్తుమృతుడి ఆత్మహత్య లేఖలోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్ -
1995లో హత్య.. అనూహ్య రీతిలో ఇప్పుడు దొరికిన యూట్యూబర్
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి 31 ఏళ్ల క్రితం ఓ బాలుడిని హత్య చేశాడు. అనంతరం బెయిల్పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అతడు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... నిందితుడి పేరు సలీమ్ ఖాన్. కొన్నేళ్లుగా సలీమ్ వాస్తిక్ పేరుతో జీవిస్తున్నాడు. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ పేరు తెచ్చుకున్నాడు. ‘ఎక్స్ ముస్లిం’గా తనను తాను ప్రచారం చేసుకున్నాడు.గత నెల ఘాజియాబాద్లో ఇద్దరు వ్యక్తులు సలీమ్ వాస్తిక్పై అతని ఇంట్లో కత్తితో దాడి చేశారు. సలీమ్ నాస్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో సలీమ్ వాస్తిక్ గురించి పోలీసులు ఆరా తీశారు. దీంతో అతడు పేరు మార్చుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సలీమ్ వాస్తిక్ పాత రికార్డులు, వేలిముద్రలు, ఫొటోలను పోలీసులు పరిశీలించారు. అతడు పాత నేరస్తుడని తేల్చారు. అతడికి కిడ్నాప్, దోపిడి కోసం బెదిరింపులు, హత్య ఆరోపణలపై తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష విధించారని తేల్చారు.1995లో బాలుడి కిడ్నాప్, హత్య ఈ హత్య కేసు 1995, జనవరి 20కి సంబంధించినది. సిమెంట్ వ్యాపారవేత్త కుమారుడు సందీప్ బన్సాల్ ఢిల్లీలో పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబం ఎంతగా వెతికినా అతడి కనుగొనలేకపోయింది. మరుసటి రోజు వ్యాపారవేత్తకు ఫోన్ కాల్ వచ్చింది. అతని కుమారుడిని అపహరించామని, సురక్షితంగా విడుదల చేయాలంటే రూ.30,000 డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ సమీపంలో బస్సులో డబ్బు పెట్టాలని, పోలీసులకు సమాచారం ఇస్తే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు. కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. గోకుల్పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.దర్యాప్తు సమయంలో ఆ వ్యాపారవేత్త పొరుగింటి వ్యక్తి కీలక సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు ‘మాస్టర్జీ’ అనే పొడవైన యువకుడితో ఆటోరిక్షాలో వెళ్తున్నట్లు తాను చూశానని తెలిపాడు. దీంతో పోలీసులు సలీమ్ ఖాన్ (ప్రస్తుతం సలీమ్ వాస్తిక్)ను గుర్తించారు. అతను దర్యాగంజ్లోని రామ్జాస్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేవాడు. అతను నేరాన్ని ఒప్పుకొని ముస్తఫాబాద్లోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి మృతదేహం లభించింది.వాస్తిక్కు సహకరించిన అనిల్ అనే వ్యక్తికి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్, గడియారం స్వాధీనం చేసుకొని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు. 1997 ఆగస్టు 5న కర్కర్డూమా కోర్టు సలీమ్ ఖాన్ (అలియాస్ సలీమ్ వాస్తిక్) అనిల్ను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 2000, నవంబర్ 24న సలీమ్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. తర్వాత అతడు పరారయ్యాడు. సలీమ్ ఆ తర్వాత సలీమ్ వాస్తిక్, సలీమ్ అహ్మద్ పేర్లతో జీవించాడు.తదుపరి 26 సంవత్సరాలు హరియాణాలోని కర్నాల్, అంబాలా ప్రాంతాల్లో దాక్కొని వార్డ్రోబ్ తయారీ పనులు చేశాడు. తర్వాత 2010లో ఘాజియాబాద్ లోని ఓ ప్రాంతానికి మారి మహిళల దుస్తుల దుకాణం ప్రారంభించాడు. సలీమ్ సామాజిక కార్యకర్తగా, యూట్యూబర్గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఉగ్రవాదం, మత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలతో ప్రసిద్ధి చెందాడు.జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అతని జీవితం ఆధారంగా ఒక బాలీవుడ్ నిర్మాత బయోపిక్ తీసేందుకు నిర్ణయించాడు. ప్రాజెక్ట్ కోసం రూ.1.5 మిలియన్ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకాక ముందే ఇది జరగకముందే సలీమ్ అరెస్ట్ అయ్యాడు. -
ప్రియుడి పాశవికం… తల్లి, కొడుకు హత్య, చివరికి ఉరి!
అన్నానగర్: సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలో ఉన్న పొట్టి యాపురం పంచాయతీలోని కర్తనౌర్ ప్రాంతానికి చెందిన శివన్. ఇతనికి సత్య (33) అనే కుమార్తె, అశోక్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు. సత్యకు 15 సంవత్సరాల క్రితం కమలాపురం పంచాయతీలోని మారియమ్మన్ కోవిల్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి మహిష(13) అనే కుమార్తె, కిశాంత్ అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మహిష సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, కిశాంత్ 5వ తరగతి చదువుతున్నాడు. ఈ స్థితిలో సత్య తన భర్తతో కలిసి కరుత్తనూరులోని తన తండ్రి భూమిలో చెరకు మిల్లును స్థాపించి, బెల్లం తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉండేది. కరుప్పూర్లోని వెల్లలపట్టి కాలనీ నివాసి, ఆ షోరూమ్లో మేనేజర్గా పనిచేస్తున్న శక్తివేల్కు, సత్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. గత 3 నెలలుగా సత్య శక్తివేల్తో సరిగ్గా మాట్లాడడం లేదు. సత్య వేరొకరితో సంబంధం పెట్టుకుని తనతో మాట్లాడడం లేదని శక్తివేల్ కూడా అనుమానించాడు. శక్తివేల్ శుక్రవారం రాత్రి సత్యను చూడటానికి ఆమె ఇంటికి వెళ్లాడు. శక్తివేల్ తలుపు తడుతూనే ఉండడంతో, కొంతసేపటికి సత్య తలుపు తెరిచింది. అతను తీవ్ర ఆగ్రహానికి గురై, ఇంట్లోని దీపాలను ఆర్పేసి, సత్యను, అతని కొడుకు కిశాంత్ను కత్తితో పదేపదే పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. ఒంటి నిండా గాయాలతో సత్య కేకలు వేస్తూ తన తండ్రి ఇంటి వైపు పరుగెత్తింది. అరుపులు విని అతని తండ్రి, బంధువులు వెంటనే చూడటానికి పరుగెత్తుకొచ్చారు. ఆ సమయంలో కిశాంత్ అనే ఆ బాలుడు తల, మెడ గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సత్య కూడా తీవ్ర గాయాలతో ఉంది. వీరిని అంబులెన్స్లో ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు కిశాంత్ మరణించినట్లు ప్రకటించారు. ప్రథమ చికిత్స అనంతరం సత్యను తదుపరి చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ సత్య మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఓమలూరు డీఎస్పీ సంజీవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న శక్తివేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం జిల్లా, కరుపూర్, వెల్లలపట్టిలోని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శక్తివేల్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో కరుపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శక్తివేల్ మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. -
ఖాకీ కుటుంబంలో హనీ ట్రాప్ చిచ్చు!
సాక్షి టాస్క్ఫోర్స్: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు తరహాలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఏకంగా ఓ పోలీస్ అధికారిపైనే వలపు వల విసిరి, డబ్బు వసూలు చేయడమే కాకుండా, ఆయన కుటుంబంలోనూ చిచ్చు రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ధర్మవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉండే ఓ పోలీస్ అధికారి భార్య నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ అధికారి కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని పైకి చెప్పినప్పటికీ, వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆ పోలీస్ అధికారికి మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని ఓ సచివాలయంలో పని చేసే ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీనికితోడు ధర్మవరానికి చెందిన కొంతమంది దళారులు, చేనేత వ్యాపారులతో ఆ పోలీస్ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు తమ పనులు చేయించుకునే క్రమంలో ఆ అధికారికి అందమైన అమ్మాయిలను ఎరగా వేసి వారి చెప్పు చేతల్లోకి తీసుకున్నట్లు సమాచారం. సచివాలయం ఉద్యోగినితో వివాహేతర సంబంధం విషయం కూడా తెలియడంతో వారు ఆయన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నారు. అప్పు రూపంలో అంటూ రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారు. కొంత కాలం తర్వాత పోలీసు అధికారి తన డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో సమస్యలు మొదలయ్యాయి. డబ్బులు అడుగుతావా అంటూ వారు పోలీసు అధికారికి సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను భార్యకు పంపించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తన భర్త వేరే మహిళలతో ఉన్న వీడియోలు చూసిన భార్య తీవ్ర డిప్రెషన్కు గురైంది. ఆ క్రమంలోనే ఆమె మృతిచెందింది. మృతిౖపెనా స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. మృతదేహాన్ని చూడటానికి వెళ్లినప్పుడు బంధువులు పోలీస్ అధికారిని నిలదీసినప్పటికీ, ఫిర్యాదులో మాత్రం అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీస్ బాస్ రహస్య విచారణ జరిపించి, నివేదికను తెప్పించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. హనీట్రాప్ మూలాలు ఉండడంతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. -
వీడియోలతో బెదిరిస్తూ... పదేళ్లుగా లైంగికదాడి
యలమంచిలి: పదేళ్లుగా ఓ మహిళను లోబరచుకుని మోసం చేసిన సంఘటనపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి చెందిన కుక్కల కూర్మారావు అదే మండలానికి చెందిన ఓ మహిళకు 14 ఏళ్ల వయసుండగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 2016 మే 1న ఆమె ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడి వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు. కూర్మారావు సోదరుడు జ్ఞానేశ్వరరావు ఆ వీడియోలు చూసి తన కోరిక కూడా తీర్చమని ఆమెను వేధించాడు. దీనిపై బాధిత మహిళ కూర్మారావును నిలదీయగా గతేడాది (2025) జూన్ 5న ఆమెకు ఉంగరం తొడిగి... ‘నువ్వు నా భార్య’వని చెప్పి జ్ఞానేశ్వరరావుపై కేసు పెట్టవద్దని బతిమాలాడు. అనంతరం సెప్టెంబర్ 28న ఆమెను పాలకొల్లులో ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాధిత మహిళ గర్భం దాల్చగా ఈ ఏడాది జనవరి 30న హైదరాబాద్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆడ శిశువు పురిట్లోనే చనిపోయిందని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూర్మారావు, అతడి భార్య దుర్గాభవానీ, జ్ఞానేశ్వరరావు, అతడి భార్య లక్ష్మీభవానీపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ యేలేటి మనోహర్ తెలిపారు. -
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్ను ఆశ్రయించింది.తన భర్త ఈశ్వర్రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు. -
చెక్బౌన్స్ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్
సాక్షి, అనంతపురం: చెక్బౌన్స్ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 12న అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా అరెస్ట్ తర్వాత రిమాండ్కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ‘వాల్మీకి’ నిధుల గోల్మాల్లో సుమతి పాత్ర!కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. డొల్ల(షెల్) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. -
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తిరుపతి విషాదం కేసులో ట్విస్ట్
తిరుపతి విషాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న మోహన్.. భార్య, తల్లిని చంపి, ఆపై ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. అయితే అసలు విషయం అది కాదని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. రైల్వే మెయిల్ సర్వీసులో ఉద్యోగం చేసుకుంటున్న పెద్దబ్బ, చంద్రకళ దంపతుల కుమార్తె రేఖ, కుమారుడు మోహన్ ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో వారసుడని మోహన్ను గారాబంగా పెంచారు. పెద్దబ్బ విధుల్లో ఉంటూ మృతి చెందాడు. నిరుద్యోగి అయిన మోహన్ తండ్రి ఉద్యోగంపై ఆశలు పెంచుకున్నాడు. కాగా నారాయణవనంలో క్లినిక్ను ప్రారంభించిన కోడూరుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కుమార్ అక్క కుమార్తె హరితను మోహన్ 15 ఏళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదటి నుంచి గారాబంగా పెరిగిన మోహన్ ఏ పనిపై శ్రద్ధ చూపక సోమరితనానికి అలవాటు పడ్డాడు. తండ్రి ఉద్యోగం వచ్చినా.. కొన్నాళ్లకే దానిని మానేశాడు. దీంతో భార్య హరిత టైలరింగ్ షాపును నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది. కష్టపడి హరిత టైలరింగ్ షాపుతో పాటు బ్యూటీ పార్లర్ను ప్రారంభించి మరో ఐదుగురికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగింది. పనిపై శ్రద్ధ చూపని మోహన్ క్రమంగా స్మార్ట్ ఫోన్కు బానిసైపోయాడు. కబళించిన ఆన్లైన్ గేమింగ్స్మార్ట్ ఫోన్తో గడుపుతూ ఆన్లైన్ రమ్మీకి అలవాటయ్యాడు మోహన్. క్రమంగా గేమింగ్లో నష్టపోతూ ఆన్లైన్లో అప్పులు చేశాడు. అధిక వడ్డీలతో పెరిగిన అప్పును చెల్లించమని ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అప్పులను తీర్చడానికి పుత్తూరులోని ఇంటి స్థలాలను, ఆస్తులతో పాటు భార్య, తల్లి, పిల్లల నగలను తనఖా పెట్టి చెల్లించినా అప్పులు తీరలేదని తెలిసింది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్పై నిలదీసిన తల్లిని, భార్యను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మను, భార్యను కడతేర్చిన నేరంపై జైలుకు వెళితే పిల్లలు ఒంటరైపోతారని భావించిన మోహన్ రైలు కింద పడి బలవర్మణానికి గురై ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోహన్, హరితల ఫోన్ల లాక్ను తీసి పరిశీలిస్తే గాని పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.పిల్లలు ఇంటికి వెళ్లి ఉంటే..?బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ నుంచి పిల్లలను ఉన్నపళంగా ఇంటికి తీసుకు వచ్చిన తండ్రి మోహన్తో పాటు కౌశిక్, హిమనిలు ఇంటికి వెళ్లి ఉంటే బతికి ఉండేవారు. తల్లి చంద్రకళ, ఆ తర్వాత భార్య హరితను చంపిన మోహన్ బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకున్నాడు. నగదును పక్కింటి రాధకు ఇచ్చిన మోహన్ తర్వాత తీసుకుంటానని చెప్పి, పుత్తూరులోని స్కూల్కు వెళ్లి మేనమామ చావుకు వెళ్లాలని చెప్పి కౌశిక్, హిమనిను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఇద్దరిని ఉండమని, స్కూల్ బ్యాగులను ఇంట్లో ఉంచడానికి వెళ్లాడు. తండ్రితో పాటు పిల్లలిద్దరూ ఇంటికి వెళ్లి.. తల్లి, నాన్నమ్మల మృతదేహాలను చూసి, అరుపులు వేసి ఉంటే మోహన్తో పాటు ఇద్దరూ బతికి ఉండే వారు. స్కూల్ వద్ద ఆడుకుంటున్న పిల్లలతో మాటలు కలవడం, తండ్రితో పాటు ఇంటికి వెళ్లకపోవడం పిల్లలకు శాపంగా మారింది. తండ్రితో కలిసి రైలు కింద పడి బలవర్మరణం పొందేవారు కారు. -
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు. ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్ విషయాలు
ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తె, 22 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ మీనా ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొన్ని గంటల ముందే రాజస్థాన్లో మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల నివేదిక ప్రకారం దక్షిణ ఢిల్లీలో కైలాష్ హిల్స్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన 23 ఏళ్ల రాహుల్ మీనా, రెండు రాష్ట్రాల్లో ఇలాంటి భయంకర నేరాల పరంపర వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు రాజస్థాన్లోని అల్వార్లో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.మొదట రాజస్థాన్లో, తర్వాత ఢిల్లీలో ఘాతుకంమంగళవారం రాత్రి రాజస్థాన్లోని అల్వార్లో తన పరిచయస్తుడి భార్యపై రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భర్త ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆ రాత్రి తనపై లైంగిక దాడి చేశాడని రాజస్థాన్ మహిళ అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ చౌదరికి ఫిర్యాదు చేసింది. మరోవైపు నిందితుడు, బాధిత మహిళ భర్తకు మధ్య జూదం కార్యకలాపాల ద్వారా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.ఆ తర్వాత రాత్రికి రాత్రే క్యాబ్ మాట్లాడుకుని ఢిల్లీకి పారిపోయాడు. బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు ఢిల్లీలోని కైలాష్ హిల్స్కు చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి, ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడు.ఆనూ పానూ చూసి, పథకం ప్రకారం బాధితురాలి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి దంత వైద్యురాలు. వీరి ఇంట్లో పది నెలల పాటు పనిచేశాడు. కుటుంబ సభ్యుల అలవాట్లు, ఇంటి భద్రతా వ్యవస్థపై అతనికి పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉదయాన్నే జిమ్కు వెళ్లేవారు. పనిమనుషుల కోసం మెయిన్ డోర్ దగ్గర ఒక 'స్మార్ట్ కార్డ్' (తాళం) దాచి ఉంచేవారు. ఈ విషయం తెలిసిన రాహుల్, వారు జిమ్కు వెళ్లగానే ఆ కార్డుతో లోపలికి ప్రవేశించాడు.తన ఫోన్లలో ఒకదాన్ని రూ. 10వేలకు అమ్మేశాడు. ఆ తరువాత ఆ డబ్బుతో ఒక వ్యాన్ను అద్దెకు తీసుకుని, డ్రైవర్కు రూ. 6,000 ఇస్తానని నమ్మ బలికాడు. కానీ అతనికి డబ్బులివ్వకుండానే ఢిల్లీ చేరుకుని, ఉదయం 6:39 గంటలకు ఇంట్లోకి వెళ్లిన నిందితుడు, కేవలం 40 నిమిషాల్లోనే (7:15 గంటలకు) ఈ ఘాతుకానికి పాల్పడి బయటకు వచ్చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది.నిందితుడికి ఆన్లైన్ జూదానికి (Gambling) బాగా అలవాటు పడ్డాడు. ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పులు చేస్తున్నాడనే కారణంతో రెండు నెలల క్రితమే ఆ కుటుంబం అతడిని పనిలో నుంచి తీసేసింది. ఈ పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు అతడి కోసం వెతుకుతుండగానే, నిందితుడు ఢిల్లీలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.అది తప్పు...కానీవిచారణ సందర్భంగా, "మీరు ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు?" అని కోర్టు నిందితుడిని ప్రశ్నించినపుడు డబ్బు దొంగిలించడానికే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పాడు.మరి మరి ఇతర నేరాలు ఎందుకు చేశావు?" అని అడగ్గా. అది తప్పే.. కానీ ఇప్పుడు తానేమీ చెప్పలేనని’’ బదులిచ్చాడు.రాహుల్ మీనాను, ఢిల్లీ న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ద్వారకాలోని ఒక హోటల్ నుండి అరెస్టు చేసిన అనంతరం, మీనాను న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడిని నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించ డానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసు విజ్ఞప్తిని ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా ఠాకరన్ ఆమోదించారు. మరోవైపు దొంగిలించిన డబ్బు, నగలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. అయితే, కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నారేమోనని పరిశీలించడానికి, అతడిని విచారించడానికి తమకు మరింత సమయం అవసరమని తెలిపారు.ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా! -
మృగాడి వాంఛాగ్ని.. విస్తుపోయిన పోలీసులు
ప్రశాంత ఉదయం ఓ మృగాడి వాంఛాగ్నితో భయానకంగా మారింది. ఆదరించి అన్నం పెట్టిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి వాళ్ల బిడ్డను బలిగొన్నాడు. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటనతో దేశ రాజధాని ఉలిక్కి పడింది. అయితే నిందితుడు రాహుల్ మీనా చెప్పింది విని పోలీసులు సైతం విస్తుపోయారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22) కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. యువతి దారుణ హత్యాచారం కంటే ముందు తన సొంతూరులో మరో మహిళపైనా రాహుల్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంటే.. 24 గంటలు గడవక ముందే రెండు రాష్ట్రాల్లో రెండు ఘాతుకాలకు పాల్పడ్డాడన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఆల్వార్ జిల్లా రాజ్గఢ్కు చెందిన రాహుల్ మీనా(23) తెలిసినవాళ్ల ద్వారా రికమండేషన్తో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనివాడిగా చేరాడు. సర్వెంట్ క్వార్టర్స్లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న అధికారి కూతురిపై కన్నేశాడు రాహుల్. అలా ఎనిమిది నెలల పాటు అదను కోసం ఎదురు చూశాడు. అయితే ఇంటి సరుకుల కోసం ఇచ్చిన డబ్బు గోల్మాల్ చేశాడని.. బయట అధికారి పేరు చెప్పి అప్పులు చేశాడని.. తేలడంతో రాహుల్ను పనిలోంచి తీసేశారు. దీంతో అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే అతని తప్పుడు ఆలోచనలు ఆగలేదు. దీంతో మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యాడు. ఏప్రిల్ 21న.. పొరుగింట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయల్దేరాడు. భార్య ఒంటిపై గాయాలు గమనించిన ఆ భర్త.. ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. ఏప్రిల్ 22న ఉదయం.. ఢిల్లీ చేరుకున్న రాహుల్.. నేరుగా ఆగ్నేయ ఢిల్లీలోని కైలాశ్ హిల్స్ అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఇంతకు ముందు పని చేసిన వాడే కావడంతో సెక్యూరిటీ ఇబ్బందులేవీ అతనికి ఎదురు కాలేదు. ఆ టైంలో ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్కు వెళ్లారు. పని మనిషి కోసం తాళం చెవి బయట ఉంచుతారనే విషయమూ రాహుల్కు తెలుసు. తాళం తీసి లోపలికి వెళ్లిన రాహుల్ నేరుగా పైన గదిలో చదువుకుంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురి(22) దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బతిమాలాడాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి బెడ్ ల్యాంప్, చేతికి దొరికిన వస్తువులతో తల మీద కొట్టాడు. రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను మెట్ల మీద నుంచి కిందకు ఈడ్చుకొచ్చాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆపై.. ఆమె వేలి ముద్రలతో లాకర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే.. వేళ్లకు రక్తం ఉండడంతో అది ఓపెన్ కాలేదు. దీంతో స్క్రూ డైవర్ సాయంతో లాకర్ తెరిచి.. అందులో ఉన్నదంతా తనతో తెచ్చుకున్న బ్యాగులో నింపేసుకున్నాడు. మొబైల్ చార్జర్ కేబుల్తో యువతికి ఉరి వేసి ఊపిరి తీశాడు. యువతితో జరిగిన పెనుగులాటలో ప్యాంట్కు, షూస్కు రక్తపు మరకలు అంటడంతో.. వాటిని అక్కడే పడేసి ఐఆర్ఎస్ అధికారి కొడుకు దుస్తులు, చెప్పులు ధరించి పారిపోయాడు. రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ అధికారి దంపతులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉదయం 6.28 గంటలకు నిందితుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. సుమారు గంట తర్వాత వేరే దుస్తులు, బ్యాగుతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ద్వారకలో గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం సాయంత్రం ఓ లాడ్జిలో దాక్కున్న రాహుల్ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీనా ఫోన్లో పోర్న్ కంటెంట్ అడ్డగోలుగా ఉంది. రోడ్లపై వెళ్లే యువతులను అసభ్యంగా ఫొటోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. రాహుల్కు బెట్టింగ్ యాప్లతో పాటు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని నిర్ధారించారు. అతని నేర చరిత్ర చిట్టాను మరింత లోతుగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. -
అర్ధరాత్రి చెత్త వేయడానికి వెళ్లి... ప్రియుడితో పరార్!
యశవంతపుర( కర్ణాటక): భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఉడాయించిన భార్య ఉదంతం బెంగళూరు బాగలగుంటె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియాంక, శరత్కుమార్ అనే దంపతులు బాగలగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శరత్ పనులకు వెళ్లిన సమయంలో ప్రియాంక కటింగ్ షాపు నిర్వహిస్తున్న ప్రభు వద్దకు వెళ్లి మాట్లాడేది. ఇదే విషయంపై ప్రయాంక, శరత్ల మధ్య గొడవ జరిగేది. ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ఇంటిలోని చెత్తను తీసుకోని చెత్తకుండీలో వేసేందుకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాలేదు. శరత్ బయటకు వెళ్లి ఆరా తీయగా ప్రభు బైక్పై ప్రియాంక వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనంలో తనకు నిద్రమాత్రలు కలిపిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. A woman who left home saying she was going to dispose of garbage has gone missing. Her husband has now made a serious allegation that she may have eloped with a known person. The incident occurred under Bagalagunte police station limits.The husband Sharaath Naik TG has been… https://t.co/xUSeaboUcj pic.twitter.com/OQIMaucxEF— Hate Detector 🔍 (@HateDetectors) April 22, 2026 -
అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్కు సీఐలు..
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ‘నయా హనీట్రాప్’ దందాపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక, హానీట్రాప్ కేసులో లెడీడాన్ రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే, 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హానీట్రాప్ ముఠా.. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి రెండు కోట్లు వసూలు చేసింది.జిల్లాలో హానీట్రాప్ వెలుగులోకి తేవడంతో ఈ దందాపై ఎస్పీ జగదీష్ కొరడా ఝళిపించారు. కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు హనీ ముఠా సభ్యులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదులో అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరినీ వీఆర్కు పంపుతూ బుధవారం డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంకా కొందరు పోలీసులు ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉండడంతోపాటు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఠాలీడరుగా వ్యవ హరించిన రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఎస్పీపై భరోసాతో బాధితులు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.కవ్వించి.. కాటేస్తారు ముఠా లీడర్లు.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వ్యక్తుల కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తారు. తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఏకాంత సమయంలో ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని న్యూడ్గా ఉండేలా చేస్తారు. ఆయన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు. తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. దీంతో బాధి తులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే అదనుగా బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారు. -
ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి!
ప్రొద్దుటూరు క్రైం : తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేందుకు భార్య కిరాయిహంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఈ రాత్రి గడిస్తే కిరాయి హంతకుల చేతిలో భర్త హతమయ్యేవాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్ ఆట కట్టించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. భర్తను చంపేందుకు సుఫారి.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన వాళ్లు రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషిటర్ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సు«ఫారి తీసుకున్న రౌడీషిటర్ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషిటర్ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్ను ప్రొద్దుటూరుకు పిలిపించారు. ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్.. లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారి గ్యాంగ్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు తెలియడంతో అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషిటర్ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం కారణంగా రెండు వాహనాల్లో 11 మంది ప్రాణాల కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. మీర్జాపూర్ జిల్లాలో ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి డ్రామాండ్గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న ట్రక్కుతో పాటు రెండు కార్లను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు ట్రక్కులకు మధ్యలో కార్లు చిక్కుకుని మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు.ఇక, ఈ ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 11 మందిలో ఏడుగురు మీర్జాపుర్ వాసులు కాగా, ఒకరు సోన్భద్ర జిల్లాకు చెందిన వారున్నారు. ముగ్గురు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు మీర్జాపూర్ పోలీసులు తెలిపారు. #BreakingNews: मिर्जापुर में भीषण सड़क हादसा, ट्रक और बोलेरो की टक्कर में जिंदा जले 11 लोग, एक अनियंत्रित ट्रक ने बोलेरो समेत कई गाड़ियों को टक्कर मार दी. टक्कर इतनी भीषण थी कि बोलेरो गाड़ी में आग लग गई और उसमें सवार सभी 11 लोगों की जलकर मौत हो गई. #Mirzapur #RoadAccident #UP https://t.co/xdMOdw4Ed0 pic.twitter.com/8Gi8VQLqSK— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) April 22, 2026 -
తల్లి, భార్య హత్య.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య
నారాయణవనం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం తిరుపతి జిల్లా నారాయణవనం మండలం, వెంకటకృష్ణపాళ్యంలో విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో తల్లి, భార్య హత్యకు గురికాగా, ఇద్దరు బిడ్డలతో కలిసి ఆ ఇంటి యజమాని మోహన్ (45) ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే తల్లిని, భార్యను మోహనే హత్య చేశాడా..? లేక మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్నది మిస్టరీగా మారింది. ఈ ఘోరానికి కారణాలు తెలియరాలేదు. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాళ్యంలో నివాసం ఉంటున్న మోహన్ నెల క్రితం నారాయణవనంలో స్టీల్, సిమెంట్ వ్యాపారం ప్రారంభించాడు. అత ని భార్య హరిత (33) టైలరింగ్తో పాటు బ్యూటీ పార్లర్ నడుపుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు. పుత్తూరులోని ఓ కార్పొరేట్ పాఠశాలలో కుమార్తె హిమని (15) తొమ్మిదో తరగతి, కుమారుడు కౌశిక్ (12) ఏడో తరగతి చదువుతున్నారు. మోహన్ తల్లి చంద్రకళ (65) కూడా వీరితో పాటే ఉంటోంది. సిమెంట్ లోడు కోసం బ్యాంకులో డీడీ కట్టడానికి ఉంచుకున్న నగదును మోహన్ బుధవారం ఉద యం 10.30 గంటలకు పక్కింటి రాధకు ఇచ్చి.. తనకు పని ఉందని తర్వాత తీసుకుంటానని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు మోహన్ ఇంటికి చంద్రకళ అన్న బాలకృష్ణ వచ్చాడు. ఆ సమయంలో చంద్రకళ, హరిత హత్యకు గురై విగతజీవు లుగా పడిఉండడాన్ని చూశాడు. హరిత మెడకు చున్నీ బిగించి ఉండగా, చంద్రకళ శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. మోహన్కు తెలియజేసేందుకు మొబైల్కు కాల్చేయగా కలవలేదు. దీంతో అతని పిల్లలు చదువుతున్న పుత్తూరులోని కార్పొరేట్ పాఠశాలకు ఫోన్చేయగా 11 గంటల సమయంలో మోహన్ పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. మోహన్, పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి పుత్తూరు పరిధిలోని వేపగుంట రైల్వేస్టేషన్ సమీపంలో కాచిగూడకు వెళ్తున్న రైలు కింద పడి మోహన్, ఇద్దరు పిల్లలు హిమని, కౌశిక్ మృతి చెందారని రైల్వే పోలీసులు గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వారం రోజుల్లో పెళ్లి.. బావిలో శవమై తేలిన యువతి
మరిపెడ రూరల్: ఆ ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు.. కానీ విధి మరోలా తలచింది. రెండేళ్ల ప్రేమ, పెళ్లి కోసం చేసిన పోరాటం ఇవన్నీ కళ్లముందే ఉండగా, ఆ యువతి విగతజీవిగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి, అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఇటుకలగడ్డతండాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి. ప్రేమ యుద్ధం చేసి..: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య వెంకన్న, వినోద దంపతుల చిన్న కూతురు సంగీత (19), మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఒప్పించే క్రమంలో సంగీత గతంలో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. చివరకు వారి ప్రేమను ఇరుకుటుంబాలు అంగీకరించి, ఈ నెల 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సంగీత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సంగీత ఇటుకలగడ్డతండాలో ఒక్కతే ఉండగా అరవింద్ బైక్పై వచ్చి యువతిని తీసుకుని తండా శివారులోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మర్నాడు బుధవారం తండా శివారులోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం లభించింది. బావి సమీపంలో రక్తపు మరకలతో ఓ చెప్పులు కనిపించడంతో సంగీత మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. కాబోయే భర్తే తమ కూతురిని అన్యాయంగా హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి తల్లిదండ్రులు వెంకన్న, వినోద ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం
గంజాయి మత్తులో.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అటుపై పైశాచికంగా ప్రవర్తించింది ముస్కాన్ రాజ్పుత్. ఆపై ప్రియుడితో కలిసి జాలీ ట్రిప్ వేసి.. చివరకు భయంతో పోలీసులకు లొంగిపోయింది. మీరట్(ఉత్తర ప్రదేశ్) బ్లూడ్రమ్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.తన కొడుకు హత్యలో ముస్కాన్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తోంది సౌరభ్ రస్తోగీ కుటుంబం. మంగళవారం కోర్టు విచారణ కోసం మీరట్ జిల్లా కోర్టుకు ఆరు నెలల చంటి బిడ్డ రాధతో ముస్కాన్, సాహిల్ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ కోర్టు హాల్లోకి రాగానే సౌరభ్ తల్లి రేణు దేవి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మరో మాట లేకుండా ఇద్దరినీ ఉరి తీయండి. చంటి బిడ్డ చేతిలో ఉందని కనికరించొద్దు. నా బిడ్డ నెలకు రూ.50 ఈమె కుటుంబానికి ఇచ్చేవాడు. ప్రతిగా వాళ్లు వాడ్ని దారుణంగా చంపారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ, వాళ్లను వదిలేసి ఈ ఇద్దరినే అరెస్ట్ చేశారు. అందరినీ శిక్షించాల్సిందే’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుందామె.ఆ సమయంలో న్యాయమూర్తి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని ఆమెకు సూచించారు. ఈ నేరంలో అభియోగాల ఆధారంగా చెరో 32 ప్రశ్నలు వేశారు జడ్జి. అందుకు సాక్ష్యం చూపించాలని సాహిల్ అడగ్గా.. ముస్కాన్ వాటిని తోసిపుచ్చింది. ఆపై కేసు విచారణను వాయిదా వేశారు.బిడ్డను స్వీకరిస్తారా?సౌరభ్-ముస్కాన్లకు ఓ కూతురు ఉంది. ఈ కేసు తర్వాత ఆ బిడ్డ సౌరభ్ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే అరెస్ట్ అయ్యేనాటికి ముస్కాన్ గర్భవతి. రిమాండ్ ఖైదీగా ఉన్న టైంలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ టెస్టులో నిర్ధారణ అయితే స్వీకరిస్తామని రేణు దేవి ఆ టైంలో చెప్పారు. కానీ, ఇప్పుడేమో ముస్కాన్ వల్ల ఆ బిడ్డ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇటు ముస్కాన్ కుటుంబం కూడా ఆ పసికందును స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగీ ఇద్దరూ 2016లో ప్రేమవివాహం చేసకున్నారు. భార్యతో సమయం గడిపేందుకు మర్చంట్ నేవీ జాబ్ను సైతం వదిలేశాడు సౌరభ్. ఇది ఇంట్లో గొడవలకు దారి తీయడంతో ఆమెతో వేరు కాపురం పెట్టాడు. మూడేళ్ల తర్వాత ఇద్దరికీ ఓ పాప పుట్టింది. అదే సమయంలో.. సాహిల్ అనే వ్యక్తితో ముస్కాన్ సంబంధం నడుపుతున్నట్లు సౌరభ్ గుర్తించాడు. ఈ వ్యవహారం దంపతుల మధ్య గడవలకు దారి తీసి.. విడాకుల దాకా తీసుకెళ్లింది. ఆ పంచాయతీ నడుస్తుండగానే.. భార్యలో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు సౌరభ్. ఆపై మర్చంట్ నేవీ ఉద్యోగంలో మళ్లీ చేరాడు సౌరభ్. ఉద్యోగం నిమిత్తం 2023లో బయట దేశాలకు వెళ్లాడు.ఇదే అదనుగా ముస్కాన్, సాహిల్తో వివాహేతర సంబంధం కొనసాగింది. 2025 ఫిబ్రవరి 24న కూతురి పుట్టినరోజు వేడుకల కోసం చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చాడు సౌరభ్. ఇది భరించలేకపోయింది ముస్కాన్. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పెద్ద ప్లానే వేసింది.మార్చి 4వ తేదీన సౌరభ్ తినే తిండిలో మత్తు బిళ్లలు కలిపింది ముస్కాన్. గాఢ నిద్రలోనే జారుకోగానే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్తో నింపేశారు. సౌరభ్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. ఇద్దరూ వారంపాటు షికారుకు వెళ్లారు. కొన్నాళ్లకు డ్రమ్ము నుంచి కుళ్లిన వాసన రావడం.. ఆపై శవం చేయి బయటపడడంతో.. ఆందోళనకు గురైన ముస్కాన్ తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో ముస్కాన్ తండ్రే ఆమెను తమకు అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. అలా.. వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
‘నువ్వు బంగారు బాతువు’.. హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు వైరల్
చాలా తెలివైనోడు...జాగ్రత్త! ఓ కానిస్టేబుల్ ముఠా సభ్యురాలితో ఫోన్లో మాట్లాడిన తీరును పరిశీలిస్తే ట్రాప్కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ‘వాడు చాలా తెలివైనోడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని టీం లీడర్కు చెప్పా. ట్రాప్ చేసే మహిళ అతడి కారులో వెళ్తుంటే వెనుక మరోబైకును ఎందుకు ఫాలో అవ్వమని చెప్పింది..? ఓపెన్ ప్లేస్లోకి వెళ్లాక వెనుక బైకు వస్తుంటే కారులో ఉన్న వ్యక్తికి ఎందుకు అనుమానం రాదు..? ఆయన విషయంలో అదే జరిగింది. అనుమానం వచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఏదో మోసం జరుగుతోందని గ్రహించి ఆ ఏరియా వారిని కనుక్కున్నాడు. విషయమంతా తెలిసిపోయింది. ఆమె ఇదే పని చేస్తోందని అతడికి ఎవరో చెప్పారంట. అతను నా వద్దకు వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. అనుమానం వచ్చి నీ నంబరు బ్లాక్లో పెట్టాడు. జాగ్రత్తగా డీల్ చేయాలి కదా’ అంటూ సంభాషించాడు.స్టేషన్ వద్దకు వచ్చి ఫోన్ చెయ్.. ముఠా సభ్యుల మధ్య విభేదాలు వచ్చి గొడవలు చేసుకున్న సందర్భంలో హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఓ సభ్యురాలికి ఫోన్ చేసి మాట్లాడాడు. ‘మీరు మీరు ఎందుకు కొట్లాడుకుంటారు. నేను ఎస్పీని కలిసి అన్ని విషయాలూ చెబుతానని సదరు మహిళ అంటే... వద్దువద్దు నేను మాట్లాడతా. రెండు రోజులు సైలెంటుగా ఉండు.. ఆమె నీ జోలికి రాకుండా నేను మాట్లాడతా. రేపు ఉదయం మీరు స్టేషన్ వద్దకు రండి. ఫోన్ చేస్తే నేను బయటకు వస్తా. ఆలోపు మీరు వారిని తడుముకోవద్దు. నువ్వు బంగారు బాతువు. నువ్వు ఆమెతో విభేదిస్తే వ్యాపారం జరగదని భావించి ఈరకంగా గొడవ చేసి ఉంటుంది. నాకూ చాలా డబ్బు ఇచ్చినామని చెప్పిండొచ్చు. ఆడపిల్లల సొమ్ము... ఎంత ఇచ్చినా తీసుకున్నాను తప్ప ఇంతేకావాలని నేను అడగలేదు’ అని మాట్లాడిన ఆడియోలు వైరల్ అవుతున్నాయి. రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ‘నయా హనీ ట్రాప్’ దందా ఊహించని మలుపు తిరుగుతోంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ దందాలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీస్ బాస్ (ఎస్పీ) జగదీష్ సీరియస్గా పరిగణించారు. అనంతపురం రూరల్ పరిధిలో వెలుగుచూసిన ఈ హనీట్రాప్ ముఠా... ఆర్థికంగా బలమైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యం చేసుకుని వలపు వల విసిరి నిలువు దోపిడీ చేసింది. ముఠా తీరు భయంకరం హనీ ట్రాప్లో చిక్కుకున్న వారి పట్ల ముఠా సభ్యులు వ్యవహరించే తీరు అత్యత భయంకరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం, అవగాహన కలి్పంచాల్సిన పోలీసులే వారికి సహకరించడం దుమారం రేపుతోంది. పలువురు పోలీసులు తమకు ‘టచ్’లో ఉన్నారనే ధైర్యంతోనే ముఠా బరితెగించినట్లు స్పష్టమవుతోంది. ట్రాప్లో పడిన వ్యక్తులు తిరగబడే పరిస్థితి ఉంటే తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను రంగంలోకి దింపుతారు. పోలీసు డ్రెస్లో ఉన్నవారు అక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తి హడలిపోవడం పరిపాటి. ‘మహిళను ఇబ్బంది పెట్టావు. ఆమె బలత్కారం కేసు పెడితే కచ్చితంగా జైలుకు వెళతావు’ అంటూ బాధితులను బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటిదాకా జిల్లాలో హనీట్రాప్ బాధితుల సంఖ్య వందల్లో ఉన్నట్లు తెలిసింది. మలుపు తప్పిన అంతర్గత విభేదాలు ఇటీవల కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్ దందా వెలుగులోకి వచ్చింది. మరోవైపు హనీట్రాప్ ముఠా సభ్యుల్లో అంతర్గత విభేదాలు బయటపడడం కేసును కొత్త మలుపు తిప్పింది. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గుట్టు రట్టు చేసేదిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. హనీట్రాప్ బాధితులు తమకు న్యాయం చేయాలని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మంగళవారం అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసుల పాత్రపై ఎస్పీ సీరియస్ మరోవైపు ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ముఠా సభ్యులతో మాట్లాడిన సంభాషణ పోలీసు విభాగంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పట్ల ఎస్పీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సహకరించిన ఏ స్థాయి వారినీ ఉపేక్షించ కూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నివేదిక రాగానే బాధ్యులైన సిబ్బందిపై వేటు వేస్తారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురం సమీపంలో ఉన్న ఓ ఎస్హెచ్ఓ కూడా ముఠాకు అన్ని విధాలా సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పోలీసు శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎస్పీ దృషికి వచ్చినట్లు సమాచారం. -
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావడంలేదు!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. -
మురుగన్ మళ్లీ చిక్కెన్!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్లోని బనాస్కంత ప్రాంతంలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి దేవ్ను రెస్క్యూ చేయడంతో మొదలైన ఆపరేషన్లో భారీ శిశువుల అక్రమ రవాణా, విక్రయాల ముఠా గుట్టురట్టు అయింది. సూత్రధారులుగా ఉన్న తెలంగాణకు చెందిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ ముఠాలో కింగ్పిన్గా ఉన్న తెలంగాణకు చెందిన మురుగన్ గత ఏడాది చైతన్యపురి ఠాణాలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. దేవ్ కిడ్నాప్నకు పాల్పడిన గుజరాత్లోని డాంత ప్రాంతానికి చెందిన శైలేష్ గామర్, బాబు భగోరాలను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో... ‘మురుగన్ గ్యాంగ్’నెట్వర్క్ను ఛేదించేందుకు బనస్కాంత పోలీసులు దాదాపు 70 నుంచి 80 ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను సేకరించడంతోపాటు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సాయంతో విశ్లేషించారు. తెలంగాణకు చెందిన బోదాశు నాగరాజే మురుగన్ అని, అతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇతడి కోసం గాలించిన స్పెషల్ టీమ్ సోమవారం కాగజ్నగర్లో పట్టుకుంది. మురుగన్ ఇచ్చి న సమాచారంతో కరీంనగర్ జిల్లా సిరికొండకు చెందిన కాసరపు తిరుపతి, కాసరపు మల్లయ్య, కేలేటి గంగాధర్ గంగరాజన్లను పట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా శిశువుల అక్రమ రవాణా దందాలో ఉన్న మురుగన్ 2025 మార్చి 19న చైతన్యపురి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టై మూడు నెలలు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది విక్రయం... మురుగన్ భార్యకు కూడా మహారాష్ట్రలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్లు బనస్కాంత పోలీసులు అనుమానిస్తున్నారు. మురుగన్ గ్యాంగ్ ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువుల్ని అపహరించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లోని మూడు ఐవీఎఫ్ కేంద్రాలు ఈ శిశు విక్రయాలకు అడ్డాలుగా ఉన్నట్లు బనస్కాంత అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిపై చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. గిరిజనుల బిడ్డలే ఎక్కువగా... మురుగన్ గ్యాంగ్ గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద దంపతులతో ఒప్పందాలు చేసుకుని శిశువు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే ఖరీదు చేస్తోంది. రూ.ఐదు లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సోము, అమూల్య, మల్లేష్, శివరాణి, వెంకటరామారావులతోపాటు విజయవాడకు చెందిన సరోజ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. -
రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు... కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీలో నివసించే దీపక్ పటేల్ టైల్స్ వ్యాపారి. జనవరి 28న భార్య వింధ్య పటేల్తో కలిసి ఇంట్లోని నగల బాక్సులను బెడ్ కింద ఉన్న లాకర్లో పెట్టి తాళం వేశారు. తాళం చెవులను బీరువా లాకర్లో భద్రపరిచారు. గత శనివారం ఆభరణాల కోసం లాకర్ తెరిచి చూడగా ఖాళీ బాక్సులు దర్శనమిచ్చాయి. అవి చోరీకి గురై ఉంటాయని భావించి దీపక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఐ గురుస్వామి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించగా ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి కుమార్తె రియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతోంది. నమ్మకంగా ఉంటూ దీపక్ పటేల్ దగ్గర మేనేజర్గా పనిచేసే సాగర్(34)కు రియా ఆ ఆభరణాలను ఇచ్చినట్లు విచారణలో తేలింది. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్కు డబ్బులు అవసరమని అతడు నమ్మించి నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కుటుంబం పరువు పోతుందని భావించిన ఫిర్యాదుదారుడు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కేసు వాపస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని కొంత నగదు, బంగారం స్వా«దీనం చేసుకున్నామని చైతన్యపురి పోలీసులు తెలిపారు. -
బాయ్ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించిన అమ్మాయి
బెంగళూరు: టెలికాం స్టోర్లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27). కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్ను పిలిచింది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది. కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు. -
కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి
కేరళంలోని త్రిస్సూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరువంబడి డివిజన్కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది. పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.కొనసాగుతున్నసహాయక చర్యలుఅగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్లతో సహా, తగినన్ని అంబులెన్స్లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు. -
పాతబస్తీలో దంపతుల హత్య
చార్మినార్: పాతబస్తీలో దంపతుల హత్య ఉదంతం కలకలం రేపింది. నిందితుడు మృతుడికి స్వయాన అన్న. సుల్తాన్పురాలోని ఓ అద్దె ఇంట్లో అఖిల్ఖాన్(38), అజ్మేరీ బేగం(35) దంపతులు నివాసముంంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అజ్మేరీబేగం ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. గతంలో నూర్ఖాన్ బజార్లో నివసించే వీరు ఇల్లు ఖాళీ చేసి కొంతకాలం క్రితమే సుల్తాన్పురా వచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్ఖాన్ తన అన్న ఆదిల్ఖాన్ వద్ద రూ.7వేలు చేబదులుగా తీసుకున్నట్టు సమాచారం. నెలలు గడుస్తున్నా, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆదిల్ఖాన్ సోమవారం సాయంత్రం 4 గంటలకు తమ్ముడి ఇంటికి వచ్చాడు.రూ. 7వేల విషయంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దాదాపు రెండు గంటల పాటు ఘర్షణ జరిగింది. అయితే రెండురోజుల్లో డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినా, ఆదిల్ఖాన్ వినకుండా అఖిల్ఖాన్ గొంతు, పొట్టలో పొడిచాడు. ఈ గొడవలో తలదూర్చిన మరదలు అజ్మేరీబేగంపై కూడా అప్పటికే కోపంతో ఉన్న ఆదిల్ఖాన్ ఆమెను సైతం కత్తితో పొడిచి హత్య చేశాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఇద్దరినీ చంపేశాను పోలీసులకు చెప్పుకోండి అంటూ.. బిగ్గరగా అరుస్తూ వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.అయితే నిందితుడు ఆదిల్ఖాన్కు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నట్టు సమాచారం. అఖిల్ఖాన్ తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా, నీకు పిల్లలే లేరు కదా... డబ్బు తీసుకొని ఏం చేసుకుంటావు అని అనడంతో ఆదిల్ఖాన్ మనస్తాపానికి గురై తమ్ముడు, మరదల్ని హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అనుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ రాజేశ్, మీర్చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ ఎం.కొండలరావు వచ్చారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చార్మీనార్ ఎమ్మెల్యే మీర్ జుల్పికర్ అలీ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. -
రూ. 2.5 లక్షల లంచం : సోదాల్లో రూ. 37 లక్షలు, భారీగా బంగారం,వెండి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు చెందిన ఉన్నతాధికారి అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీజీసీఏలో పెండింగ్లో ఉన్న అనుమతులు మరియు ఆమోదాలను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన కేసు విచారణలో భాగంగా సీబీఐకి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి.రూ. 2.5 లక్షల లంచం ఆరోపణలతో డీజీసీఏ ఎయిర్వర్దినెస్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న అధికారిని, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని సిబీఐ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 18న కేసు నమోదు చేసిన సీబీఐ లంచం తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన భారీ నగదు , ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు ఏకంగా రూ. 37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు, వెండి నాణేలను గుర్తించారు. వీటితోపాటు పలు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై లోతైన విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి -
అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్
సామాజిక మాధ్యమాలలో టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరెపల్లి చంటి(30)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటిదొరెపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు.కాగా..ఇటీవలే జనార్ధన్ అనే నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 23న పలువురు సోషల్ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్ చేసి.. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 🚔 𝐂𝐑𝐀𝐂𝐊𝐃𝐎𝐖𝐍 𝐎𝐍 𝐂𝐘𝐁𝐄𝐑 𝐁𝐔𝐋𝐋𝐘𝐈𝐍𝐆 🚔The @CyberCrimesCyb Police have apprehended an individual for targeting actress Anasuya Bharadwaj with defamatory and obscene social media content.𝐐𝐮𝐢𝐜𝐤 𝐂𝐚𝐬𝐞 𝐅𝐚𝐜𝐭𝐬:𝐓𝐡𝐞 𝐀𝐫𝐫𝐞𝐬𝐭: Dorepalli Chanti… pic.twitter.com/mLQLVuTw3G— Cyberabad Police (@cyberabadpolice) April 20, 2026 -
కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, కిద్వాయ్ నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందులునిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.UP man kiII twin daughters, wife demands death penalty Shashi Ranjan Mishra, a resident of UP's Kanpur slit throat and kiIIed his 11-year-old twin daughters- Riddhi and Siddhi. He has a 6-year-old son who was sleeping with her mother in separate room. Domestic dispute is… pic.twitter.com/X86b4vvxSC— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరుసీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే 11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. ఘటన పూర్వాపరాలు కాన్పూర్కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త తల్లి గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులుసీసీటీవీ నిఘా, దృశ్యాలు మరో షాకింగ్ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.మనసెలా ఒప్పింది..ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత -
లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!
మహబూబ్ నగర్: అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వెనక నుంచి ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లి, ఐదు నెలల కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అడ్డాకుల శివారులోజాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్రెడ్డి భార్య నందిని (21), ఐదు నెలల కుమారుడు కన్నయ్యతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి తెల్లవారుజామున కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో అడ్డాకుల శివారులోని స్నేహ పరిశ్రమ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టుకుంది. ప్రమాదంలో కారు ఎడమ సీట్లో కూర్చున్న నందిని తల భాగం పూర్తిగా ఛిద్రమై రోడ్డుపై పడింది. నందిని ఒళ్లో కూర్చున్న బాలుడు కారు ముందు భాగంలో ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. ఇక కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రకా‹Ùరెడ్డి సీటు బెల్టు ధరించడంతో ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రకాష్ రెడ్డిని అంబులెన్స్లో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఏదైనా వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎడమ వైపు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీ వెనుక ఢీకొట్టాడా.. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రకాష్రెడ్డిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించినట్లు తెలిసింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెప్పులే ప్రమాదానికి కారణమా! కారు నడిపేటప్పుడు ప్రకాష్రెడ్డి తాను ధరించిన శాండిల్స్ను డ్రైవింగ్ సీటు వద్దే వదిలాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో బ్రేక్ వేయడానికి ప్రయతి్నంచిన సమయంలో శాండిల్స్ బ్రేక్ పెడాల్ కిందకి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే బ్రేక్ వేయడానికి వీలు కాకపోవడంతో కారు వెళ్తున్న వేగంతోనే లారీని ఢీకొట్టి ఉంటుందని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీని కారు తగిలే సమయంలో బ్రేక్ వేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో కాళ్ల వద్ద చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు పెట్టొద్దని, గతంలో కూడా ఇలాగే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నిపుణులు అంటున్నారు. -
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి జైలు పాలయ్యాడు!
కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు. అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
హైదరాబాద్: సంపన్న వర్గాల బాలికలే లక్ష్యంగా వల విసురుతాడు. వారిని ప్రేమలోకి దింపుతాడు. ఆపై వ్యాపారం పేరుతో రూ.లక్షలు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తున్నాడు. ఇలా బాలికలు, యువతులను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆదివారం జూబ్లీహిల్స్కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని గుంటూరుకు చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ (29) కూకట్పల్లిలో ఉంటూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. జూబ్లీహిల్స్కు ఓ బాలికను చంద్రశేఖర్ ఆజాద్ ఎలియాస్ అర్జున్ ఇన్స్టా్రగామ్లో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నాంటూ వెంటబడ్డాడు. తరచూ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం గత ఏడాది ఏప్రిల్లో బాలిక తల్లికి తెలియడంతో చంద్రశేఖర్పై జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన తర్వాత మళ్లీ బాలికను కలుసుకున్నాడు. స్టార్టప్ పెడుతున్నానంటూ ఆమె నుంచి రూ.13.11 లక్షలు వసూలు చేశాడు. రూ.9 లక్షలు గుంజిన కారు డ్రైవర్ భార్య.. బాలికకు తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేయడంతో.. కారు డ్రైవర్తో పాటు ఆయన భార్య ఫోన్ల నుంచి చంద్రశేఖర్కు ఫోన్లు చేసేది. ఈ విషయంలో డ్రైవర్ భార్య.. చంద్రశేఖర్తో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులతో చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రూ.9 లక్షలు వసూలు చేసింది. ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ బాలికతో ప్రేమలో ఉండగానే నార్సింగికి చెందిన మరో యువతితో చంద్రశేఖర్ తిరగసాగాడు. ఇలా ఇద్దరి నుంచి ముగ్గురు యువతులను ప్రేమలోకి దింపి వారిని మోసగించి రూ.లక్షల్లో డబ్బులు లాగేవాడు. ఈ క్రమంలో ఓ కారు కూడా కొనేసి అమ్మాయిలతో తిరుగుతూ తాను ధనవంతుడినంటూ నమ్మబలికేవాడు. బాధిత బాలిక ఇచి్చన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద జూబ్లీహిల్స్ పోలీసులు రెండోసారి చంద్రశేఖర్ను రిమాండ్కు తరలించారు. మరో యువతి ఫిర్యాదు.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ చంద్రశేఖర్పై మరో యువతి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి బంగారు గొలుసు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 69, 318 (2) కింద కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ను నార్సింగ్ ఠాణాకు బదిలీ చేశారు. ప్రేమ పేరుతో చంద్రశేఖర్ ఇప్పటివరకు సుమారు 10 మందిని మోసగించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. -
తాగొచ్చి.. ఆస్పత్రిలో భార్యను చంపేశాడు
ఎమ్మిగనూరు రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రభుత్వాస్పత్రిలో అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన బోయ బెలగల్ రామయ్య కూలి పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. భార్య నరసమ్మను తరచూ డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో నరసమ్మ పెద్దతుంబుళంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. పెద్దకుమార్తె శాంతి ప్రసవం కోసం నరసమ్మ వద్దకు వచ్చింది.శనివారం ఉదయం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న రామయ్య ఆస్పత్రికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం భార్య దగ్గరకు వచ్చి తనతో కాపురానికి రావాలని గొడవపడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో బయటకు వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చి అందరూ చూస్తుండగానే కత్తితో భార్యను పొడిచాడు. దీంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. రక్తం మడుగులో పడిఉన్న నరసమ్మకు డాక్టర్ మల్లికార్జున వైద్య సేవలు ప్రారంభించగా.. అప్పటికే మృతి చెందింది. -
పోలీస్ స్టేషన్లో వ్యక్తి!
సాక్షి టాస్క్ ఫోర్స్: చోరీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, లాకప్ డెత్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకట సుబ్బయ్య(38) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పడగటూరు గ్రామానికి చెందిన తేజ, నరేష్ తో కలిసి బెలుం గ్రామంలో రెక్కీ నిర్వహించి కొత్త ట్రాక్టర్ను అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కర్నూలు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో రికవరీ చేశారు. ఈ కేసులో వెంకటసుబ్బయ్య, తేజను అదుపులోకి తీసుకోగా నరేష్ పరారీలో ఉన్నాడు. మృతుడు వెంకటసుబ్బయ్యపై పోలీస్ స్టేషన్లో దొంగతనం, రెండు కొట్లాట కేసులు ఉన్నాయి. బాత్రూంలో మృతి ట్రాక్టర్ దొంగతనం కేసులో వెంకటసుబ్బయ్యను పోలీసులు శనివారం ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఆదివారం కోర్టులో హాజరు పర్చాలని భావించారు. తెల్లవారు జామున స్టేషన్లోని బాత్రూం వెళ్లి కట్టుకున్న లుంగీతో వెంకటసుబ్బయ్య ఉరివేసుకున్నాడు. బాత్రూంకు అని చెప్పి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి దొంగ తేజ రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు వెళ్లి చూడగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వాస ఇంకా ఉందనే అనుమానంతో సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బయ్యపై మూడు కేసులు ఉండటంతో పాటు తాజాగా ట్రాక్టర్ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో చేతులు కలపడంతో రిమాండ్కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతోనే భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల ఏఎస్పీ మంద జావళి పోలీస్ స్టేషన్కు చేరుకొని వివరాలు సేకరించారు. మృతిపై అనుమానాలెన్నో! వెంకటసుబ్బయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతిచెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూంలో ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. సెటిల్మెంట్ చేశారా? వెంకటసుబ్బయ్య అధికార పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా సెటిల్మెంట్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఎందుకు బేరమాడారనేది చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే వెంకటసుబ్బయ్య కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకోలేదని లాకప్ డెత్ జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. -
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అధికారుల అండ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్–2’ పేరుతో నిర్వహించిన 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ బ్యాంకు అధికారులు, సైబర్ నేరగాళ్లకు మధ్య ఉన్న సంబంధాలను మరోసారి బయటపెట్టిందని అధికారులు ఆదివారం ప్రకటించారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు కాగా, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్జీ శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సరైన పత్రాల్లేకుండానే ఖాతాలు..ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ అక్టోపస్–1’లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఇప్పుడు ‘ఆపరేషన్ అక్టోపస్–2’ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా రూ.150 కోట్ల మేర అమాయకుల ధనాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. 16 ప్రత్యేక బృందాలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, బిహార్ల్లో దాడులు నిర్వహించాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే ’మ్యూల్’ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని వివరించారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అక్రమాలకు సహకరిస్తే, వారిని కూడా నేరస్తులగానే పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే, విలువైన ’గోల్డెన్ అవర్’ను వృథా చేయకుండా తక్షణమే 1930 నంబర్కు లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
‘హలో.. పోలీస్ స్టేషనా? నా కూతుళ్లను చంపేశాను సర్’
కాన్పూర్: కన్న కుమార్తెలన్న ప్రేమ కూడా లేదు. అభం శుభం తెలియని పసివాళ్లన్న జాలి కూడా లేకుండాపోయింది. రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. ఆ తర్వాత, పోలీసులకు ఫోన్ చేసి తన కూతుళ్లను హత్య చేశానని పోలీసులకు చెప్పాడు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. శశి రంజన్ మిశ్రా (48) తన 11 సంవత్సరాల కవల కూతుళ్లను పదునైన ఆయుధంతో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున అతని ఫ్లాట్లో జరిగింది. శశి రంజన్ మిశ్రా మెడికల్ రిప్రెజెంటేటివ్గా పనిచేస్తుంటాడు.బిహార్కు చెందిన అతను భార్య రేష్మా, జంట కూతుళ్లు రిద్ధి, సిద్ధి, కుమారుడు (6)తో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని శశి రంజన్ మిశ్రా అనుమానించాడు. తరచుగా ఆమె కుమారుడితో ఉండాలని, తాను కూతుళ్లను చూసుకుంటానని చెప్పేవాడు.రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. శశి డిప్రెషన్తో బాధపడుతున్నాడు. ఇంట్లో అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కూతుళ్ల గదుల్లోకి ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత శశి కూతుళ్లను నిద్రపొమ్మన్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక కూతురిని బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి గదికి వచ్చి లైట్లు ఆపేశాడని ఆమె తెలిపింది. రెండు గంటల తర్వాత అతను పోలీసులకు కాల్ చేసి తాను హత్య చేశానని తెలిపాడు. ఫ్లాట్కు చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలికలు రక్తపు మడుగులో కనపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన రేష్మా కాన్పూర్లో బ్యూటీ పార్లర్లో పని చేస్తూ శశిని కలిసింది. 2014లో వారి వివాహం జరిగింది. “శశిని అరెస్ట్ చేశాం, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారని చెప్పారు. -
పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్స్టేషన్లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్లోని తన గదిలో స్వప్నిల్తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యను అంతమొందించాలని వేధింపులు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్ప్రెస్వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జితేంద్ర శెల్కే అశోక్కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్ నిర్వహించిన ట్రస్ట్కు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్ చర్చకు దారి తీసింది. మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్ ఖరాత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది. పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ నడిచింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలురాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్ స్కాండల్కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్మెయిల్, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈడీ సోదాలుగడిచిన కొన్నేళ్లలో అశోక్ ఖరాత్ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్ (PMLA) కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 13వ తేదీన నాసిక్లో అశోక్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. కోపర్గావ్ పోలీస్ స్టేషన్లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో క్రాష్ అనాలిసిస్ చేయనున్నట్లు అహిల్యా నగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘార్గే తెలిపారు. -
నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..!
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్లోని ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన నవిత(34) కు 11ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గుప్త సాయిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లు, ఏడు నెలల కుమారులు ఉన్నారు. గతంలో ఓ ఎమ్మెల్యేకు చెందిన డెవలపర్లో ఉద్యోగం చేసిన నవిత సొంతంగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయింది. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పుల ఊబి నుంచి బయటపడిన ఆమె ఉద్యోగం మానేశారు. ఇటీవల మరోసారి అప్పులు చేసి నష్టాల్లో కూరుకుపోయింది. ఈమేరకు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఈనెల 16న ఇద్దరు పిల్లలను కోటపాడులో వదిలి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చింది.పురుగుల మందు తాగి...జనగామ బాలాజీనగర్లో ఓ భవనానికి ‘టు లెట్’ బోర్డ్ ఉండడంతో నవిత పైఅంతస్తుకు వెళ్లి రూములు ఉన్నాయా.. అని అడిగింది. అక్కడ అద్దెకు ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఉందని చెప్పగా, సూపర్వైజర్ వచ్చి వివరాలు ఆరా తీశాడు. అయితే, వెంట ఎవరూ రాలేదని అడిగితే తన సోదరుడు వస్తున్నాడని చెప్పి ఆయనను బయటకు పంపించింది. అనంతరం సమీపంలోని షాప్నకు వెళ్లిన ఆమె పెన్ను, పేపర్ తీసుకుని లేఖ రాసింది. ఆతర్వాత ఎరువుల షాప్నకు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తిరిగి అద్దె అడిగిన భవనంలోకి వచ్చి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చాలాసేపు గడిచినా సవిత బయటకు రాకపోవడం, గదిలో నుంచి వాసన వస్తుండడంతో పక్కన అద్దెకు ఉంటున్న వారు చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి అప్పటికే సవిత మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో నవిత తన భర్తకు ‘నీలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాను.. సారీ..’ అని మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నా, దానిపై పురుగుల మందు పడడంతో చదవడం సాధ్యం కాలేదు. అయితే, లేఖపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా ఇచ్చిన సమాచారంతో ఆమె సోదరుడు, కుటుంబీకులు చేరుకుని ఫిర్యాదు చేశాడు. -
ప్రియుడిపై మోజు సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భర్య!
వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ (38) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్ భరత్కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్ భరత్ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్తో కలిసి సుమన్ భరత్ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు.బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి..లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్భరత్ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్తో కలిసి సుమన్ భరత్కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్ భరత్కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్ బాటిల్తో భరత్ తల వెనక భాగంలో కొట్టగా సుమన్ భరత్ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ భరత్ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్ పికలు, బీర్ బాటిల్ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్బాబు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్నాయక్ను డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు. -
తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్ కుటుంబ సభ్యులు.తిరుగు ప్రయాణంలో దుర్ఘటనఅమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్లలు అద్విక, శ్రీనిధిని అటుగా వెళ్లేవారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతం
రాంచీ: కాల్పుల మోతతో జార్ఘాండ్ అరణ్యాలు దద్దరిల్లాయి. హజారీబాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ముట్టడి అనంతరం భద్రతా బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఖపియా అడవి ప్రాంతంలో 209 కోబ్రా బెటాలియన్ బృందాలు యాంటీ-నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. చీతా రాజేష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, చీతా అభిషేక్ యాదవ్తో కలిసి ఉన్న బృందం మావో యిస్టు గ్రూప్ను ఎదుర్కొంది. నక్సలైట్ బృందానికి సహదేవ్ మహతో నేతృత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మతమార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యంగా ఫోటోతనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ అత్తార్ను మరింత విచారించగా, అప్పటికే మత మార్పిడికి గురైన, టీసీఎస్కు చెందిన సహోద్యోగి గోపాల్ (పేరు మార్పు) అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును 'గుల్షన్'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితుడు దుస్తులు మార్చుకుని, మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.బాధితుడు చెప్పిన సంచలన విషయాలుపోలీసులు సదరు బాధితుడిని విచారించగా, అతన్ని ఎలా ప్రలోభపెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. 2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండవాడు. తోటి ఉద్యోగులు అతని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలు పెట్టారు. బాధితుడి సొంత మతం సరైనది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరుతాయని నమ్మబలికారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితుడు వ్యతిరేకించినా, బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫోటో బాధితుడి వాంగ్మూలం ద్వారా, వర్క్ప్లేస్లో ఉద్యోగులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, క్రమ పద్ధతిలో మత మార్పిడికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
సోషల్ మీడియా పరిచయం.. మహిళపై ఎస్ఐ లైంగిక దాడి
సాక్షి, హనుమకొండ: సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ఎస్ఐ.. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో, సదరు ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ శ్రీకాంత్ కరీంనగర్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్కు 2025 సంవత్సరంలో ఫేస్బుక్ ద్వారా వరంగల్కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో, వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో సదరు మహిళ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న ఎస్ఐ.. ఆమె ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గ్రహించాడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని.. ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఎస్ఐ ప్లాన్ చేశాడు.ఇటీవల శ్రీకాంత్ వరంగల్కు వచ్చి.. బాధితురాలికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ఆమె లొకేషన్ అడిగి తెలుసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమె ఇంటికి వెళ్లిన శ్రీకాంత్.. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అధికారంతో పాటు బలాన్ని ఉపయోగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం, బాధితురాలు ధైర్యం చేసి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్ఐ శ్రీకాంత్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారిపైనే లైంగిక దాడి కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎస్ఐ శ్రీకాంత్పై అంతకుముందు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇసుక వివాదంలో శ్రీకాంత్ సస్పెండ్ అయ్యారు. ఈనెల రెండో తేదీనే శ్రీకాంత్ జమ్మికుంట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన 16 రోజులకే శ్రీకాంత్పై లైంగిక దాడి కేసు నమోదు కావడం గమనార్హం. -
ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య
వాషింగ్టన్ : వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్ఫాక్స్ (Justin Fairfax) (47)హత్య, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, మితిమీరిన మద్యం, ఆర్థిక సమస్యలు, మరోవైపు భార్యతో మనస్పర్థలు, విడాకుల కేసుతో నిరాశకు లోనైన ఫాక్స్ గురువారం తెల్లవారు జామున భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వాషింగ్టన్ శివారులోని అన్నేన్డేల్లో ఉన్న వారి నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు స్టార్గా వెలిగిన జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటల్ డాక్టర్ సెరినా ఫెయిర్ఫ్యాక్స్ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హత్య-ఆత్మహత్య జరిగిన సమయంలో ఆ దంపతుల ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేలపై రక్తసిక్తమైన మృతదేహం పడి ఉండటాన్ని చూసిన వారి 16 ఏళ్ల కుమారుడు, కాల్పుల గురించి తెలియజేయడానికి 911కి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించి హృదయవిదారక ఆడియో వైరల్గా మారింది. ఇంట్లోని బేస్మెంట్లో తన భార్యను కాల్చి చంపి, అనంతరం పై అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు.జస్టిన్ సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. వచ్చే వారం కోర్టు విచారణలో జైలు శిక్ష, కుటుంబ ఇంటి నుండి బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా బాధ్యతారహితమైన ప్రవర్తన ఫలితంగా, ఏప్రిల్ 30 లోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ అవమానభారంతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్ పతనం2019లో జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలు చేయడంతో ఉన్నతమైన అతని జీవితం క్రమంగా పతనంలోకి జారీ పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటూ, గవర్నర్ పదవికి పోటీ చేయాలని చూస్తున్న అతని రాజకీయభవిష్యత్తును ప్రభావితం చేసింది. మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, 2022లో ఆయన పదవినుండి వైదొలగడంతో కుటుంబానికి మరింత దూరమయ్యారు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకోవడంతోపాటు, మద్యానికి బానిసయ్యారు. ఎంతలా అంటే తనను తాను హోమ్ ఆఫీస్లో బంధించుకునేవాడు. అక్కడ ఖాళీ వైన్ సీసాలు, చెత్త, మురికి బట్టల కుప్పల మధ్య దయనీయమైన స్థితిలో నివసించేవాడు. కేవలం ఆహారం, సిగరెట్ల కోసం మాత్రమే బయటకు వచ్చేవాడట.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆయన వృత్తి జీవితం చిన్నాభిన్నం చేశాయి. 2022లో తన పిల్లల గుర్రపు స్వారీ పాఠాల కోసం ఉద్దేశించిన డబ్బును దొంగిలించి ఒక హ్యాండ్గన్ కొన్నాడని, సంచలనాత్మక విడాకుల పత్రాల ద్వారా తెలుస్తోంది. -
టీసీఎస్ కేసు.. ‘కడుపుతో ఉన్నా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి’
మహారాష్ట్ర నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం ఉలిక్కి పడింది. గత నాలుగేళ్లుగా సీనియర్ ఉద్యోగులు ఈ ఘాతుకాలకు పాల్పడ్డారంటూ మొత్తం తొమ్మిది మంది ఫిర్యాదులు చేశారు. సంచలన కేసు కావడంతో సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా.. సంస్థపై మచ్చ పడడంతో టీసీఎస్ ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ తరుణంలో.. సిట్కు ఈ కేసు నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ఝలక్లు ఇస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలు అయ్యి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా.. వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు.. వేధింపుల వ్యవహారంలో హెచ్ఆర్ హెడ్గా నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం భావించింది. అయితే.. ఈ విషయంలోనూ పోలీసులకు మరో ఝలక్ తగిలింది. ఆమె అసలు హెచ్ఆర్ హెడ్ కాదని టీసీఎస్ ప్రకటించింది. ఆమె సాధారణ టెలికాలర్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఆమెను హెచ్ఆర్ హెడ్గా పేర్కొనడం గమనార్హం.హైబ్రిడ్ టెర్రరిస్ట్ కుట్ర?నిదా ఖాన్కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. జైషే (Jaish-e-Mohammed) ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది.నాసిక్ టీసీఎస్ బీపీవో యూనిట్లో పని చేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు, ఒక పురుష ఉద్యోగి తమపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, మత అవమానాలు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ప్రకారం.. టీమ్ లీడర్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు.. ‘‘మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించారు. తప్పుడు హామీలతో ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నారు.హిందూ దేవతలను అవమానించారు, పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను ఎగతాళి చేశారు.నమాజ్ చేయమని బలవంతపెట్టారు, మతాన్ని అవమానించారు. ఉద్యోగులను హోటళ్లకు, రిసార్ట్స్కి రావాలని ఒత్తిడి చేశారు. వీటన్నింటికి తోడు.. చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులనే ప్రొత్సహించింది.ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందులో ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా ఉద్యోగిణి ఉన్నారు. నిదా ఖాన్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉపేక్షించేది లేదని TCS అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. కంపెనీ సీవోవో ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతుందని తెలిపారాయన.ఈ కేసు దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో మత మార్పిడి, లైంగిక వేధింపులపై చర్చలకు దారితీసింది. సుప్రీం కోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి నియంత్రణపై పిటిషన్ దాఖలైంది. ఈ ఉదంతం దేశంలోని సార్వభౌమత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, ఐక్యతకు ముప్పుగా అభివర్ణించిన పిటిషనర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్.. బలవంతపు మత మార్పిడిని ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా ప్రకటించాలని కోర్టును కోరారు. -
గంజాయ్కి యువత చిత్తు !
గంజాయి అంగడి సరుకుగా మారింది. మత్తుతో యువత చిత్తవుతున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి గంజాయి దిగుమతి అవుతోంది. సంబంధిత శాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడేది గోరంతయితే.. వినియోగం కొండంతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చీరాల అర్బన్: చంద్రబాబు సర్కార్ ఏర్పాటు అయ్యాక గంజాయి వినియోగం పెరిగింది. ఏడాదిలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు పదేపదే చెప్పారు. అయితే సాధారణ తనిఖీల్లోనే పెద్ద మొత్తంలో గంజాయి, చాక్లెట్లు పట్టుబడుతుంటే నియంత్రణ ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా విజనరీ ముందు చూపనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎక్కడంటే అక్కడే... గతంలో గంజాయి వినియోగించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. అది కూడా ఎంతో రహస్యంగా వినియోగించేవారు. రైలు మార్గం ఉన్న ప్రాంతాల్లో ఒకింత ఎక్కువగా వినియోగం ఉండేది. అయితే బాబు పాలనలో గంజాయి దొరకని ప్రాంతం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిషేధిత గంజాయి సాగు చేసేది ఒకరు... రవాణా చేసేది మరొకరు. దాన్ని స్థానికంగా అందిపుచ్చుకునేది ఇంకొకరు. అక్కడి నుంచి నిర్ణీత ప్రదేశాలకు తరలించేది వేరొకరు. అంతిమంగా విక్రయించేది మరికొందరు. ఇది ఒక చైన్లా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో కట్టడి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణకుæ అధికారులు దిగారు. స్థానికంగా గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయటంతోపాటు మూలాలలోకి వెళ్లి సాగును సమూలంగా నాశనం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. ఆ క్రమంలో పోలీస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎస్బీ, సెబ్ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దుల వరకు గంజాయి సాగు ఎక్కడ ఉందో ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. గంజాయి లభ్యం కాకుండా ఉక్కుపాదం మోపారు. దాదాపు గంజాయి సాగు, రవాణా, విక్రయాలు తగ్గాయి. విద్యార్థులే లక్ష్యంగా.. గంజాయి విక్రేతలు విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్థానంలో గంజాయిని వారికి అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక తీర ప్రాంతాలలో వారాంతపు రోజుల్లో గంజాయి విక్రయాలు జోరుగా ఉంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. కట్టడి చేయటం సాధ్యం కాదా..? ‘పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే కట్టడి చేయటం కష్టమేమీ కాదు. యాక్షన్ ప్లాన్ లీక్ కాకూడదు. రాజకీయ జోక్యం ఉండకూడదు. అందుకు ప్రజల సహకారం కూడా అవసరంమని’ ఓ అధికారి తెలిపారు. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ జోక్యం ఏదో ఒక స్థాయిలో ఉంది. కట్టడి అనేది మాటలకే పరిమితం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం..
మంత్రాలయం/ మంత్రాలయం రూరల్: రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మందిని బలితీసుకుంది. 13 మందిని క్షతగాత్రులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ వాహనం, ఫ్లైయాష్ మిల్లర్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వ్యవసాయ పనులు ముగియడంతో కర్ణాటకలోని హాసన్, చిక్మంగళూరు జిల్లాలకు చెందిన రైతు, సాగు కూలీలు తమ ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. దీంతో చిక్మంగళూరు జిల్లా తారికెర తాలూకా ఉదేవ గ్రామం, చిక్మంగళూరు, కన్నైనతళ్లి హళ్లి, అన్నేరడు గ్రామం, బూతుపల్లి, హాసన్ జిల్లా బెన్నూరు తాలూకా శెట్టిగెర, దావణగేరి గ్రామాలకు చెందిన 22 మంది రాఘవేంద్రస్వామి దర్శనానికి గూడ్స్ వాహనంలో ఉదేవా గ్రామం నుంచి బుధవారం సాయంత్రం పయనమయ్యారు. మంత్రాలయం వైపు వస్తుండగా.. గమ్యస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో చిలకలడోణ దాటగానే రాయచూరు నుంచి ఎదురుగా వస్తున్న ప్లైయాష్ కాంక్రీటు మిల్లర్ వాహనాన్ని యాత్రికుల వాహనం ఢీకొట్టింది. ఫ్లైయాష్ మిల్లర్ రోడ్డు పక్క పొలంలోకి బోల్తా పడింది. యాత్రికుల వాహనం రోడ్డుపైనే బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని పోలీసులు అంబులెన్స్లలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. 13 మంది క్షతగాత్రులను కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. మృతులు వీళ్లే.. ప్రమాదంలో సునీల్ (29), మీనాక్షమ్మ (52), పుట్టమ్మ (60), లోలాక్షమ్మ (38), ఎస్.కె.వీణ (25), ఆమె కూతురు చిన్నారి నిషిత (3), సుశీల్ కుమార్ (45), జయమ్మ (60) చనిపోయారు. ఇందులో డ్రైవర్ సునీల్, అతని తండ్రి, చెల్లెలు, సుశీల్కుమార్, ఎస్.కె. వీణ, ఆమె కూతురు చిన్నారి నిషితతోపాటు సునీల్ అత్త జయమ్మ, అవ్వ లోలాక్షమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘోర ప్రమాదానికి డ్రైవర్ సునీల్ నిద్రమత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున సాయం చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
చావుబతుకుల్లో ఉంటే రోడ్డున పడేశారు!
పంజగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్రోమాల్లో ఓ వ్యక్తి అనుమా నాస్పద స్థితిలో మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ మెట్రోమాల్ లోని థియేటర్లో హౌస్కీపింగ్ సూపర్వైజర్గా పనిచే స్తున్న పురానాపూల్వాసి సత్యనారాయణ (45) బుధ వారం రాత్రి నైట్డ్యూటీ చేస్తూ గురువారం తెల్లవారు జామున 3:40 ప్రాంతంలో వాంతులు చేసుకొని కింద పడిపోయాడు.గమనించిన తోటి సిబ్బంది సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతన్ని ఉస్మానియాకు తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి మెట్రోమాల్ లోపలకు మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. తన భర్త కిందపడిపోగానే నిమ్స్కు తరలించకుండా సిబ్బంది రోడ్డుపై పడుకోబెట్టారని.. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన భర్త మరణించాడని మృతురాలి భార్య ఆరోపించారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు భారీగా తరలివచ్చి మెట్రోమాల్ థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాన్ని సముదాయించి గురువారం సాయంత్రం మృతదేహాన్ని గాంధీకి తరలించారు. -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
TCS Nasik case టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు,మత మార్పిడి ఆరోపణల కేసులో రోజుకో పరిమాణం చోటు చేసుకుటోంది. ముఖ్యంగా మతమార్పిడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో సంచలన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, హిందూ మహిళలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఘీ కొనసాగుతున్న ఈ ఆందోళనలు, ఆఫీస్పై దాడుల నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు జరిగాయని ఆరోపిస్తూ, ఏప్రిల్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త నిరసనలకు బజరంగ్ దళ్ బుధవారం పిలుపునిచ్చింది. దీనికి తోడ స్థానిక రాజకీయ పార్టీలు కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్ననేపథ్యంలో, నాసిక్ బ్రాంచ్ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని (work from home) కోరింది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ పరిణామం గురించి తెలిసిన ఒక కంపెనీ అధికారి మీడియాకు తెలిపారు. నాసిక్ బీపీఓ యూనిట్ 5000 చదరపు అడుగుల కార్యాలయ స్థలం, ఇక్కడ సుమారు 170 మంది ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేస్తారు. ప్రస్తుతం, టీసీఎస్ కార్యాలయం ఉన్న అశోకా బిజినెస్ ఎన్క్లేవ్ గేటు బయట నాసిక్ పోలీసుల బృందం మోహరించి ఉంది అయితే పోలీసులు ప్రాంగణాన్ని అధికారికంగా సీల్ చేశారన్న వాదనలను కంపెనీ అధికారి ఖండించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్కాగా టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్లో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపిస్తూ మార్చిలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సమయంలో, 2022 మరియు 2026 మధ్య ఎదుర్కొన్న మానసిక మరియు లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే మానవ వనరుల విభాగం చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులు మరో ఎనిమిది ఎఫ్ఐఆర్లను (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) విచారిస్తోంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
సంచలనంగా మారిన టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారంలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులను(మాజీ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ముందుకు వస్తుండడంతో విస్తుపోయే విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఓ పురుష ఉద్యోగి మతం మారాలంటూ తననూ బలవంత పెట్టారని.. ఈ క్రమంతో తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నేనొక హిందువుని. వాళ్లు నా మత విశ్వాసాలను ఎగతాళి చేసేవారు. నేను మొక్కే దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేసేవారు. నైట్ షిఫ్ట్ల సమయంలో బలవంతంగా బయటకు తీసుకెళ్లి నాన్ వెజ్ తినమని వేధించేవారు. వాళ్లకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. వదిలేవాళ్లు కాదు. 2023లో రంజాన్ టైంలో టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి.. నా నెత్తి మీద టోపీ పెట్టి నమాజ్ చేయమంటూ ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి వాటిని కంపెనీ గ్రూపులో షేర్ చేశాడు. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు.నా తండ్రి పక్షవాతం బారిన పడినప్పుడు.. ఇస్లాం మతం స్వీకరిస్తే ఆయన త్వరగా కోలుకుంటాడు అని చెప్పారు. అందుకు ఒప్పుకోకపోయేసరికి.. నాపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ విషయంపైనా వెకిలిగా ప్రవర్తించేవాళ్లు. ‘పిల్లలు కావాలంటే నీ భార్యను పంపు’ అని అసభ్యంగా మాట్లాడేవారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. హెచ్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ వద్దని సర్దిచెప్పింది. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ ఉంటుందని.. ఉద్యోగం పోయినా పోవచ్చని బెదిరించేది అని బాధితుడు తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. బీపీవో కార్యకలాపాలు నిలిపివేత..నాసిక్లో ఉన్న టీసీఎస్ క్యాంపస్లో బీపీవో(BPO) సెంటర్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసుల వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని (Work From Home) గురువారం నుంచి ఆదేశించారు. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ తాత్కాలిక మూసివేత కొనసాగుతుందని తెలిపారు.ఆమెకూ 14 రోజుల రిమాండ్ఈ కేసులో హెచ్ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్, సహోద్యోగి డానిష్ షేక్లను ప్రధాన నిందితులుగా చేర్చారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ పరారీలో ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశ్విని చయ్నాని కూడా కీలక పాత్ర పోషించినట్లు తేలింది. సిట్ విచారణలో.. అశ్విని చయ్నాని ప్రధాన నిందితుడు తౌసిఫ్ అట్టార్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని.. 78 సార్లు ఈ వ్యవహారంపైనే ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారని.. అందులో కుట్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తేలింది. మలేషియా నుంచి ఓ మత పెద్ద సూచనల మేరకు నిందితులు నడుచుకున్నారని తెలుస్తోంది. తాజాగా అశ్వినిని కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు నిందితులంతా నాసిక్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా ఈ వ్యవహారంపై టీసీఎస్ స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.ఉలిక్కిపడ్డ ఐటీ రంగం.. నాసిక్ క్యాంపస్లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు ముందుకొచ్చి.. తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సహా అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ కంపెనీలో జరిగిన ఈ వ్యవహారంతో దేశ ఐటీ రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. టీసీఎస్ సహా అన్ని సంస్థల్లో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిబంధనలు పాటించడంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను జాతీయ ఐటీ ఉద్యోగుల సంఘం కోరింది.తీవ్ర వేధింపులు..2022 ఫిబ్రవరి నుంచి నాలుగేళ్లపాటు వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఉద్యోగులు తమ ఫిర్యాదుల్లో పేర్కొనడం గమనార్హం. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హెచ్ఆర్ విభాగానికి మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఏజీఎం అశ్విని ఆ ఫిర్యాదులను తీసుకోకుండా పక్కన పెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మారు వేషంలో.. ఈ వ్యవహారంపై నాసిక్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆపై సీసీఫుటేజీల ఆధారంగా కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. -
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
బరితెగించిన ఇసుకాసురులు
సిరిసిల్ల క్రైం: సిరిసిల్లలో ఇసుకాసురులు బరితెగించారు. తహసీల్దార్ వాహనం మీదకే ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయతి్నంచారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిరిసిల్లలోని సాయినగర్ రీచ్ నుంచి అధికారికంగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. అయితే ఇలా ట్రాక్టర్లు నడవడంతో దుమ్ము వస్తోందని, నీటిని చల్లాలని స్థానికులు సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు విషయాన్ని తెలిపి నీటిని చల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇసుక రవాణా తీరును పర్యవేక్షించేందుకు బుధవారం సాయినగర్ ఏరియాకు వెళ్లే క్రమంలో ఓ ట్రాక్టర్ ఇసుక లోడ్తో రాంగ్రూట్లో అధిక వేగంతో వెళ్లడం గమనించారు. అనధికారికంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లు ఇక్కడ ఇలా రాంగ్ రూట్లో వెళ్తుంటాయి. కాగా ట్రాక్టర్ను ఆపేందుకు తహసీల్దార్ ప్రయత్నించారు. దీన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ ఇంకాస్త స్పీడ్ పెంచాడు. అయితే తహసీల్దార్ ముందుకెళ్లి ట్రాక్టర్ను నిలువరించగా..డ్రైవర్ ట్రాక్టర్ను ఆపకుండా అధికారి వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అప్రమత్తంగా వ్యవహరించిన తహసీల్దార్ తన వాహనాన్ని పక్కన నిలుపగానే ట్రాక్టర్ డ్రైవర్ దిగి పరారయ్యాడు. తహసీల్దార్ సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీపై కేసు నమోదు చేశారు. ‘ఇసుక రవాణాకు అధికారిక అనుమతి ఉంటే ఓవర్స్పీడ్ ఎందుకు? పైగా అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది..’అని తహసీల్దార్ మహేశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
షాకింగ్ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్తో అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్ చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్లో చేరాడు.బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్An employee of the Pradeep Raikwar Hotel in Bamitha village, Chhatarpur district, Madhya Pradesh, India, lost his life instantly after being electrocuted by a 33 kV power line while attempting to drive a monkey away from the hotel grounds with an iron pipe. pic.twitter.com/W1J5IqOdfj— T_CAS videos (@tecas2000) April 15, 2026 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు. -
టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. అరెస్టు అయిన ఉద్యోగులలో ఒకరి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్ భార్య ఫిర్యాదుదారులలో ఒక మహిళకు, తన భర్తకు మధ్య ఉన్న చెడిపోవడంతోనే ఈ పరిమాణానికి దారి తీసిందని, అదే ఇతరుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించింది ఈ కేసులో తన భర్తతో సహా ఇతర పురుషులందరూ నిర్దోషులని, వేర్వేరు సమస్యలు, కేసులను కలిపివేశారని ఆమె ఆరోపించింది.నిందితుడి భార్య సంచలన ఆరోపణలుకేవలం వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం విఫలం కావడంవల్ల తలెత్తిన వివాదమని ఆమె పేర్కొంది. డానిష్ షేక్, బాధితురాలిగా చెబుతున్న మహిళకు మధ్య సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసంటూ ఆమెపై పలు ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన భర్త (నిందితుడు) కోసం గంటల తరబడి వేచి చూసేదని, ఆమె అతనిపై ఇష్టంతోనే తన ఆహార్యాన్ని, అలవాట్లను మార్చుకుందని ఆరోపించారు.ఉపవాసాలు చేయడం, దుస్తులు మార్చుకోవడం లాంటి ప నులెన్నో చేసిన తన భర్తకు ఆకర్షించిదని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కలత చెందారని ఆమె పేర్కొంది. ఆ సంబంధం ముగిసిన తర్వాత, ఫిర్యాదుదారురాలి తల్లిదండ్రులు కొంతమంది రాజకీయ నాయకులను సంప్రదించి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఇతర పురుషుల పేర్లను కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెను ఒప్పించారని ఆమె ఆరోపించింది.కేసు పూర్వాపరాలు, అరెస్టుల పర్వంపెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తన సహోద్యోగి ఒకరు తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు ప్రారంభమైంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఇలాంటి అనుభవాలే ఎదురైన మరో ఏడుగురు మహిళలు ముందుకు రావడంతో ఈ కేసు మరింత ముదిరింది.మొత్తం 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో, 8 మంది ఉద్యోగులపై మొత్తం 9 FIRలు నమోదయ్యాయి.ఇప్పటివరకు 7 గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమోన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ ,ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. ప్రధానంగా రేప్, మానసిక , లైంగిక వేధింపులతో మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఫిర్యాదులను పట్టించుకోలేదనే కారణంతో HR ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్పై కూడా కేసు నమోదైంది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ COO ఆర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!సిట్ విచారణఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేవలం ఒక మహిళా ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు, విచారణ కొనసాగుతున్న కొద్దీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో మరింత విస్తృతమైంది.ఈ కేసులో ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత కక్షలనే వాదనలు వినిపిస్తుండటంతో సిట్ విచారణ కీలకంగా మారింది.ఇదీ చదవండి: ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?నిదా ఖాన్పై ఆరోపణలుబాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, హెచ్ఆర్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) వాటిని పట్టించుకోలేదని సిట్ వెల్లడించింది. కార్యాలయంలోని లైంగిక వేధింపుల నివారణ (పోష్) కమిటీలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఫిర్యాదులను పక్కన పెట్టి, నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన హెచ్ఆర్ మేనేజర్ నిదాఖాన్ను పోలీసులు కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. -
కన్న కూతురినే కడతేర్చిన తల్లి… ఆపై ఆత్మహత్య
బెంగళూరు: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్ సిటీలో వైట్ఫీల్డ్ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్నోట్ దొరకలేదని సమాచారం. కారణాలపై సందిగ్ధం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది. -
కంజూస్ డాక్టర్
హైదరాబాద్: ఢిల్లీలో కొన్న సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కారుకు తెలంగాణలో రీ రిజిస్ట్రేషన్కు రూ.9 లక్షలు అవుతాయనే కారణంతో అతితెలివి ప్రదర్శించిన ఓ యువ వైద్యుడు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు. శనివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో మద్యం తాగి బీఎండబ్ల్యూ కారు నడుపుతూ పట్టుబడిన యువ వైద్యుడిపై కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అశోక్నగర్లో నివసించే సత్తి గౌతమ్రెడ్డి (27) ఓ ఆస్పత్రిలో వైద్యుడు. మూడు రోజు క్రితం మాదాపూర్లోని పబ్లో మద్యం తాగి బీఎండబ్ల్యూ కారులో ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులకు డ్రంకన్ డ్రైవ్లో చిక్కాడు. మద్యం మోతాదు 137 బీఏసీగా నమోదైంది. వివరాలు చెప్పడానికి గౌతమ్రెడ్డి నిరాకరించడంతో పాటు సంబంధిత పత్రాలు కూడా చూపించలేదు. కారు ముందొక నంబర్, వెనుక మరో నంబర్ ఉండడం చూసి ట్రాఫిక్ పోలీసులు షాక్ తిన్నారు. ఆరా తీస్తే స్టీరింగ్ వద్ద ప్రత్యేకమైన డివైస్ ఏర్పాటుచేసి స్లిప్పింగ్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. బటన్ నొక్కగానే ముందు ఒక నంబర్, వెనుక ఒక నంబర్ మారుతుడటంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు. రూ.9 లక్షలు ఖర్చవుతుందని.. కారు ఒరిజినల్ నంబర్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ అని, డీఎల్ 6 సీఎం 7097గా తేల్చారు. ఢిల్లీ రిజి్రస్టేషన్ నంబర్ను తెలంగాణగా మార్చాలంటే సుమారు రూ.9 లక్షలు ఖర్చవుతుందని భావించిన గౌతమ్రెడ్డి దీనిని తప్పించుకునేందుకు ఇన్స్టాగ్రామ్లో స్లిప్ అప్ రీల్స్ చూసి నంబర్ ప్లేట్లు మార్చే డివైస్ను కొనుగోలు చేశాడు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఢిల్లీ రిజి్రస్టేషన్, తెలంగాణ రిజి్రస్టేషన్ నంబర్ ప్లేట్లను కొనుగోలు చేశాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి నంబర్ ప్లేట్లను మార్చే డివైస్ను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్లో రెండు రాష్ట్రాల రిజి్రస్టేషన్ నంబర్లు తెప్పించుకుని అటు చలానాల నుంచి తప్పించుకుంటున్నాడు. ఇదంతా ‘ఫన్’ కోసమేనంటూ నిందితుడు పోలీసులతో చెప్పాడు. అశోక్నగర్లోని ఆయన నివాసంలో మరో బీఎండబ్ల్యూ కారు ఉంది. ఈ కారుకూ నంబర్ ప్లేట్లు మార్చే డివైస్ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. -
సర్జరీ అని చెప్పి కిడ్నీలు తీసేసారు : తీవ్ర ఉద్రిక్తత
మధ్యప్రదేశ్లోని సత్నాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు సర్జరీ చేయాల్సిన వైద్యుడు తప్పిదంగా కారణంగా ఏకంగా రెండు కిడ్నీలను తొలగించారు. చివరికి పరిస్థితి విషమించడంతో యువకుడు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతతను రాజేసింది.పన్నా జిల్లాలోని దేవేంద్రనగర్కు చెందిన రవి రాజక్కు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. అతని కుటుంబ సభ్యులు చికిత్స కోసం సత్నాలోని ముఖ్తియర్గంజ్లో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 4న పాఠక్ నర్సింగ్ హోమ్లో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి విషమించడంతో, అతడిని రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు రెండవ మూత్రపిండాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత రోగి పరిస్థితి నిరంతరం విషమించి, చివరికి మరణించాడు .మరోవైపు పొరపాటున కిడ్నీలను తొలగించామని డాక్టర్ కూడా ఒప్పుకున్నారు.ऑपरेशन के नाम पर दोनों किडनी निकाल ली..🚨मध्य प्रदेश के सतना में एक अस्पताल में एक बच्चे का पथरी का ऑपरेशन करने के नाम पर डॉक्टर साहब ने उस बच्चे की दोनों किडनी निकाल ली...डॉक्टर साहब अब कह रहे है कि गलती हो गई गलती से किडनी निकाल दी...अब उस बच्चे का क्या होगा इसकी… pic.twitter.com/Y8KMjGiT9Y— ᴋᴀᴛʏᴀʏᴀɴɪ (@ItsKtyni) April 14, 2026 > రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అక్షయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ రోగిని యూరాలజీ విభాగంలో చేర్పించే సమయానికే అతని కిడ్నీ పనిచేసే స్థితిలో లేదని తెలిపారు. చికిత్స ఎక్కువ సత్నాలోనే జరిగిందని, రేవాలో కేవలం డయాలసిస్ మాత్రమే నిర్వహించినట్టు తెలిపారు.మరోవైపు వైద్యులు నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి గిర్ధారిలాల్ రజక్ ఆరోపిస్తూ, తన కుమారుడికి కేవలం మూత్రపిండంలో రాయి సమస్య మాత్రమే ఉందని, కానీ చికిత్సలోనిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. డాక్టర్ పుష్పేంద్ర సింగ్, డాక్టర్ రాజీవ్ పాఠక్ ,డాక్టర్ రాజీవ్ సింగ్ అనే ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.మృతదేహాన్ని కోల్గావాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచి హైవేను దిగ్బంధించారు. ఆ తర్వాత పాఠక్ ఆసుపత్రి బయట మరో నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను మోహరించారు. సుమారు 4 గంటల పాటు సాగిన నిరసన అనంతరం వైద్యులు , మృతుడి కుటుంబ సభ్యుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా, 5 లక్షల రూపాయల చెక్కు , 50 వేల రూపాయల తక్షణ నగదు సహాయం అందించే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దీనితో నిరసన ముగిసింది.రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుండి పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు -
పోలీస్ అధికారినంటూ.. ఏకంగా 67 పెళ్లిళ్లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్కామ్లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్పోర్ట్లో హల్చల్ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జగదీష్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్గా మారింది. ఆగ్రాలోని జగదీష్పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోటిన్నర కట్నం కోసం మధు మాస్టర్ ప్లాన్!
నల్గొండ జిల్లా : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
42 ఏళ్ల వివాహితతో సంబంధం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
అమానుష ఘటన: 16 ఏళ్ల బాలికను..
జార్ఖండ్ రాష్ట్రంలోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని చక్రధర్పూర్లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక మానవ అక్రమ రవాణా వలలో చిక్కుకొని, ఉత్తరప్రదేశ్లో కేవలం రూ.25,000కు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.పోలీసుల వివరాల ప్రకారం.. జనవరి 20న ఆ బాలిక తన పెద్ద అక్కతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత బాలిక కోపంతో మధ్యలోనే విడిపోయి.. చక్రధర్పూర్ రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెను ఒక గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో వలలోకి లాగాడు. అతను ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి జీవితం ఇస్తానని చెప్పి నమ్మించాడు.ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను రైలులో ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లాడు. అక్కడ సీతాపూర్ జిల్లా ఇనాయత్పూర్కు తీసుకెళ్లి, కిషోరీ లాల్ కుయిరి అనే వ్యక్తిని సంప్రదించాడు. తరువాత ఆ బాలికను అమ్మే విషయాన్ని మరో వ్యక్తి సందీప్ కుమార్కు తెలియజేశాడు. చివరికి సందీప్ కుమార్ తన భూమిని తాకట్టు పెట్టి రూ.25,000 చెల్లించి ఆ బాలికను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి, అక్క చాలా రోజుల పాటు వెతికారు. చివరికి ఏప్రిల్ 2న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. టెక్నికల్ సర్వైలెన్స్, సమాచారం ఆధారంగా.. పోలీసులు ఉత్తరప్రదేశ్లోని స్థలాన్ని గుర్తించి దాడి చేసి బాలికను రక్షించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.రక్షణ అనంతరం బాలిక తన వాంగ్మూలంలో.. తనపై నిరంతర శారీరక హింస జరిగిందని తెలిపింది. శరీరంపై కాలిన గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది వైద్య పరీక్షల నివేదిక తర్వాత తెలుస్తుందని చెప్పారు. -
ఢిల్లీలోని ఆ ఇంట్లో చేసేది ఏంటి?
దేశ రాజధాని నగరంలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలో, అజ్మేరీ గేట్ సమీపంలోని ఎస్.ఎన్. మార్గ్లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్ పరిహార్, లుమాకాంత్ పాండే, ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు. పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్ క్యాన్లు, కండోమ్లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్ అని సమాచారం.నగ్నంగా వచ్చెయ్.. నచ్చిన వారితో ఎంజాయ్ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతోంది.దేశరాజధానిలో విచ్చలవిడిగా...గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్ ప్రాంతంలో నకిలీ డేటింగ్ యాప్ ప్రొఫైల్ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు ఆన్ లైన్ దోపిడీ (సెక్స్టార్షన్) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్ రాకెట్లు బయటపడుతున్నాయి.గత ఏడాది మార్చి లో పహర్గంజ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్ రాకెట్ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే మార్చి నెలలో గ్రాండ్ ప్లాజాలోని బ్లిస్ వెల్నెస్ స్పాపై జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్ రాకెట్ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. -
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్గా నిలిచింది మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.మిస్సింగ్ కలకలం?మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్కు వెళ్లామని.. అజ్మీర్లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. -
నాన్న అమ్మకి ఏమైంది..?
అనకాపల్లి: జాతీయ రహదారిపై నక్కపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందింది. ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెటిరో కంపెనీలో పని చేస్తున్న సీతా సురేష్ తన భార్యా పిల్లలను తీసుకుని మోటారు సైకిల్పై అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి ఆస్పత్రికి వస్తుండగా, సారిపల్లె పాలెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్ భార్య షారోన్ రేఖ (38) అక్కడికక్కడే మృతి చెందింది. సురేష్తోపాటు అతని ఇద్దరు పిల్లలు సవ్యశ్రీ, రోషన్లకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పిల్లలు బిక్కమొహం వేసి ఏమైందో తెలియక అమాయకంగా చూడటం స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లముందే కట్టుకున్న భార్య మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు పిల్లలు అమ్మ ఏది నాన్న అంటే ఏం సమాధానం చెప్పాలంటూ సురేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.పొట్టకూటి కోసం విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి హెటిరోలో పనిచేస్తూ బతుకుతున్న సురేష్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. మృతదేహం ముందు భర్త అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. నాన్న అమ్మకి ఏమైంది అంటూ వారు తండ్రిని అడుగుతుంటే సమాధానం చెప్పలేక సురేష్ పిల్లలని పట్టుకుని బోరున విలపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు చెప్పారు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడు విరుధ్నగర్ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. సత్తూర్ దగ్గర ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. క్షతగాత్రులకు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. కొందరు కార్మికులు లోపలే చిక్కుకుని ఉన్నారని యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్నన్ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ఉదయం వరుసగా నాలుగుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ శబ్దం సుమారు 6 కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోయారు. భారీగా మంటలు ఎగసిపడడంతో.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొందరు కార్మికులు పేలుడుతో దూరంగా ఎగిరిపడగా.. సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్యాక్టరీ, గోదాంలకు చెందిన 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు లోపల ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. టపాసులు తయారు చేస్తుండగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంత్రి నాగేంద్రన్ శివకాశి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదని సమాచారం. సహాయక చర్యలు పూర్తయ్యాకే నష్టం వివరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL— ANI (@ANI) April 13, 2026 -
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సురేంద్ర నగర్లో రోడ్డు పక్కన ఉన్న కొందరిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు. గ్యాస్ సిలిండర్తో బాది.. వివరాలు.. అవినాశ్ 5న తన ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్ భార్యను మందలించాడు. బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్ఫోన్ల షాప్ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్ తన క్లినిక్లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్ సిలిండర్తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
ప్రాణాలు నుజ్జునుజ్జు
రంగారెడ్డి జిల్లా: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనచైతన్య వెంచర్కు చెందిన సోహెల్ (18) ఎలక్ట్రీషియన్. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ సాహిల్ (19) ఇంటర్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శనివారం ఉదయం మొయినాబాద్లో ఎలక్ట్రికల్ పని ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. హిమాయత్ సాగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. సోహెల్, షేక్ సాహిల్ ఎగిరి పక్కనే ఉన్న కల్వర్టు వద్ద పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోడల్ని ఇంట్లోంచి లాక్కొచ్చి, రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ దౌర్జన్యం
కాన్పూర్లో వరకట్నం కోసం ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన అమాను దాడి కలకలం రేపింది. మీనాక్షి పాండే అనే మహిళపై ఆమె మామ, రిటైర్డ్ రైల్వే అధికారి దారుణంగా దాడిచేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.భారతీయ రైల్వేలో అధికారిగా పనిచేసిన రమేష్ దూబే, కోడలు మీనాక్షిని వీధిలోకి బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి, చేయి చేసుకోవడం, తన్నుతూ హింసించాడు. హృదయ విదారంగా ఆమె సాయం కోసం అర్థించిన వైనం వీడియోలో రికార్డైంది. ఈ క్రమంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. అయినా వదలకుండా వేధింపుల పర్వాన్ని కొనసాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లు వెత్తింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులున్నప్పటికీ, వారు జోక్యం చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.రూ. 20 లక్షల వరకట్నం కోసం రూ. 20 లక్షల కట్నం తేవాలంటూ గత కొన్నాళ్లుగా భర్త , అత్తమామలు వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మీనాక్షి పాండే అత్తమామలపై సంచలన ఆరోపణలు గుప్పించింది. నిరంతర వేధింపుల పర్వం సాగుతోందని, ఏళ్ల తరబడి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు తనకు విడాకులివ్వకుండానే, హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని కూడా మీనాక్షి ఆరోపించారు.🚨Kanpur Dowry Horror: Retired Railway Official Savagely Beats Meenakshi Pandey - Daughter need help 🙏Incident :A shocking viral video shows retired railway official Ramesh Dubey dragging his daughter-in-law, Meenakshi Pandey, onto the street. He brutally assaulted her,… pic.twitter.com/S5Vd1cdSoN— Ramesh Tiwari (@rameshofficial0) April 11, 2026సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహంఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం, వరకట్నం హింసను నిషేధించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై ఈ హింస ఇంకా కొనసాగుతోందనడానికి ఈ సంఘటన ఒక విషాదకరమైన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, వరకట్న వేధింపులు ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.పట్టపగలు, నడిరోడ్డుపై ఒక మహిళను ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు.కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మీనాక్షి చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్ -
కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
27ఏళ్ల యువకుడితో 57ఏళ్ల టీచర్ వివాహేతర సంబంధం
కర్ణాటక: ప్రభుత్వ టీచర్ని నమ్మించి హత్య చేసిన దుండగుని బాగోతమిది. వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి తాలూకా వంజార్ ఖేడ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి కపాళె ’(57) అనే మహిళను అమర్ (27)అనే యువకుడు హత్య చేశాడు. బీదర్లో నివసిస్తున్న జ్యోతి వారానికి ఒకసారి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కల్మూడ గ్రామంలోని పుట్టింటికి వస్తుండేది. ఈ క్రమంలో నిందితుడు అమర్తో పరిచయమై సన్నిహితంగా మెలిగేవారు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.రూ.20 లక్షలు తీసుకుని..6 రోజుల క్రితం కల్మూడ గ్రామం శివారులో నిర్జన ప్రదేశంలో జ్యోతి శవం కాలిన స్థితిలో లభించింది. జ్యోతి వివాహం చేసుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేది. అమర్ ఆమె వద్ద సుమారు రూ.20 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. డబ్బులు వెనక్కు ఇవ్వాలని జ్యోతి ఒత్తిడి చేయడంతో మాట్లాడదామని నమ్మించి 3వ తేదీన ఆమెను ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కాల్ డిటైల్స్, ఇతర సాక్ష్యాధాల ఆధారంగా అమర్ ఈ హత్య చేశాడని గుర్తించి అరెస్టు చేశారు. -
స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి..
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో పడి 23 ఏళ్ల హర్షిత్ భట్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు మరో మలుపు తిరిగింది. తన కొడుకును స్నేహితులే పథకం ప్రకారం చంపేశారని తల్లి ఆరోపణలు చేయడంతో, ఆ ముగ్గురు స్నేహితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హర్షిత్ ఇందిరాపురంలో ఉంటూ సెక్టార్ 125లోని అమిటీ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. బుధవారం (ఏప్రిల్ 8న) తన ఆరవ సెమిస్టర్ చివరి పరీక్ష రాసిన అనంతరం.. స్నేహితులు వ్యాస్, క్రిష్, హిమాన్షులతో కలిసి సెక్టార్ 94లోని సూపర్ నోవా భవనం వెనుక వైపు ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆగిపోయిన ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ స్థలంలో బేస్మెంట్ కోసం తవ్విన భారీ గుంతలో నీరు నిలిచి ఉంది. ప్రహరీ గోడ గుండా వారు లోపలికి ప్రవేశించారు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వీరంతా ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరీక్షకు ముందు, ఆ తర్వాత కూడా వీరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గుంత దగ్గర బీర్ క్యాన్లు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వీరు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆ నీటి గుంతలోకి దిగారు.మొదట హర్షిత్ నీటిలోకి దిగాడని, ఈదుకుంటూ బురద ఎక్కువగా ఉన్న మధ్య భాగంలోకి వెళ్లి ఇరుక్కుపోయాడని స్నేహితులు చెబుతున్నారు. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి 10 మీటర్ల లోతు నుంచి హర్షిత్ ను బయటకు తీసుకువచ్చి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతన్ని ఆ ముగ్గురే ఉద్దేశపూర్వకంగా చంపేశారని తల్లి దీప్ మాల సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని -
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
మగపిల్లాడి కోసం ఆరుగురిని చంపేశాడు!
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఈ నెల ఒకటిన భర్త తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్పూల్లో ముంచి చంపిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మగ పిల్లాడు కావాలనే ఆశ, ఆడపిల్ల పుడుతుందనే భయంతో గతంలోనే నిందితుడు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని.. అందుకు కుటుంబ సభ్యులు, కొందరు వైద్యులు, సిబ్బంది సహకరించారని తేలింది.అలాగే భార్య మూడోసారి గర్భం దాల్చడంతో మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను హతమార్చినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అంటే మొత్తంగా మగ సంతానం కోసం భర్త కిరాతకుడిగా మారి ఆరుగురిని కడతేర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్తతోపాటు హత్యలకు పరోక్షంగా కారణమైన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రేమ వివాహం..హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన అజహరుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలన్న కోరిక ఉండటంతో 2021, 2022లలో ఫరహాత్ గర్భం దాల్చినప్పుడు అజహరుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు ఫరహాత్కు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. అందుకు పున్నేలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వాహకుడు సట్ల రాజుతోపాటు ఆర్ఎంపీ నరేశ్, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హాస్పిటల్ డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ పూర్ణిమ సహకారం అందించారు.గర్భంలో ఉన్నది ఆడపిల్లలుగా నిర్ధారించుకొని ఫరహాత్కు ఇష్టం లేకున్నా రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఈ క్రమంలో అజహరుద్దీన్ తనకు దూరపు బంధువైన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని, తనకు కుమారుడు కావాలని చెప్పాడు. అయితే ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పింది. మరోవైపు గత నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చగా తిరిగి ఆడపిల్ల పుడుతుందనే భయంతో అజహరుద్దీన్తోపాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాలని ఫరహాత్తో గొడవ పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్య, పిల్లలను చంపి తాను ఇష్టపడిన బాలికను పెళ్లి చేసుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. వేడుకున్నా కరగని తండ్రి మనసుభార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చాలని నిర్ణయించుకున్న అజహరుద్దీన్ ఈ నెల 1న రాత్రి 7:50 గంటలకు ఐస్క్రీం తినిపిస్తానని తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అంతకుముందే అక్కడున్న సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. స్విమ్మింగ్పూల్ వద్ద కొన్ని పనులను భార్యతో చేయించి ఒక్కసారిగా ఆమెను నీళ్లలోకి నెట్టాడు. అనంతరం చిన్న కూతురు అయేషాను పూల్లోకి విసిరేశాడు. భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా నీళ్లలోనే ముంచి చంపేశాడు. పైన ఉన్న పెద్ద కూతురు హుమేరా వద్దు నాన్నా అంటూ కన్నీళ్లతో వేడుకున్నా అతని మనసు కరగలేదు. భార్య, చిన్నకూతురిని చంపాక పెద్ద కూతురిని సైతం నీళ్లలో ముంచి హత్య చేశాడు. -
ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య
ఖాజీపేట: ప్రేమోన్మాది చేతిలో ఓ బాలిక దారుణహత్యకు గురైంది. ఈ దుర్ఘటన వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో శుక్రవారం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది. శుక్రవారం ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.ప్రేమోన్మాదమే హత్యకు కారణంఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కాళ్లుపట్టుకున్న తల్లిదండ్రులు బాలిక హత్యతో శ్రీనివాసులు బంధువులు, గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. ఖాజీపేట పోలీస్స్టేసన్కు తరలివచ్చి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరు సరిగా లేదని ఖాజీపేట బస్టాండ్ కూడలిలో రాస్తా్తరోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు టౌన్లోకి వాహనాలు రాకుండా జాతీయరహదారి నుంచి ట్రాఫిక్ మళ్లించారు. దీంతో బాలిక బంధువులు జాతీయ రహదారి దిగ్బంధించారు. సుమారు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తా్తరోకో చేశారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని భీష్మించారు. ఓ దశలో మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని లాఠీచార్జీ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు యత్నించారు. అయితే బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించారు. రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి తప్పకుండా న్యాయం చేస్తామని దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. మాకు న్యాయం కావాలిమా ఇంటికే వచ్చి నా కూతురి గొంతుకోసి వెళ్లడం దారుణం. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వాడిని వదిలేదే లేదు. మాకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష పడాలి. అంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటాం. – శ్రీనివాసులు–నాగమణి, బాలిక తల్లిదండ్రులు -
చిలకలూరిపేటలో న్యాయవాది హత్య
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన శ్రీరామ హరిప్రసాద్(37) ఒంగోలులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగజ్యోతి, ఏడేళ్ల బాబు ఈశ్వర అకీర, ఆరేళ్ల పాప నవనీత ఉన్నారు. ప్రసాద్ తల్లి తిరుపతమ్మ ఒంగోలు న్యాయస్థానంలో అటెండెంట్గా పనిచేస్తున్న క్రమంలో ముందుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేసిన ఆయన నాలుగేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం హైకోర్టుకు వెళ్లాలంటూ ఇంటి నుంచి స్కూటీపై ఆయన బయలుదేరారు. రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకొని శుక్రవారం తెల్లవారుజామున కోటప్పకొండ రోడ్డులో చిలకలూరిపేట వైపు స్కూటీపై వెళ్లారు. ఆ తర్వాత యడవల్లి గ్రామ సమీపంలో రోడ్డు మార్జిన్ పక్కన సుమారు ఐదు అడుగుల పల్లపు ప్రదేశంలో న్యాయవాది మృతదేహంపై స్కూటీ పడి ఉంది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్కుమార్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎన్నో అనుమానాలు... ముందుగా అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, మృతుడి తలపై గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహంపై ఎవరో స్కూటీని పడవేసినట్లుగా ఉండడం, మృతదేహం పూర్తిగా వాహనం కింద పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు స్కూటీ పడిపోయిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు మార్జిన్లో బండరాయి రక్తంలో తడిసిపోయి ఉండటం న్యాయవాదిని ఎవరైనా బండరాయితో మోది చంపారా అనే అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. దీంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను పిలిపించి విచారణ చేపట్టారు. హైకోర్టుకు వెళతానన్న న్యాయవాది యడవల్లి రూట్లోకి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కోటప్పకొండ వద్ద నుంచి సీసీ పుటేజీల పరిశీలన చేపట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధితో వివాదం భూ వివాదాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో న్యాయవాదికి వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. తన బంధువుల పక్షం నిలబడిన విషయమై ఆయనతో విభేదాలు తలెత్తినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉంటాడని, స్నేహభావంతో మెలిగే ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మరి కొందరి వాదన. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
క్రికెట్ కోచ్కు బెయిల్ నిరాకరణ
ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్కు అప్పీల్ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే, మైనర్ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్ బాలిక కూడా ఇదే కోచ్పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. తప్పుడు ఫిర్యాదునిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్ చేస్తూ బెయిల్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది. -
AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
పోచారం ఐటీ కారిడార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కఠోర నిజాన్ని దాచి.. పోచారానికి చెందిన మనోహర్కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ధార్లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా? -
ఆమె.. అలా మోసపోయింది
సోషల్ మీడియా స్నేహాలు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేసే మరో ఘటన ఇది. పథకం ప్రకారం ఫేస్బుక్లో పరిచయమైన వివాహిత (36)ను హనీట్రాప్ చేసి తాను పెద్ద వ్యాపారినని నమ్మబలికి, మాయమాటలతో లోబర్చుకుని ఆమె వద్ద రూ. కోటి విలువైన బంగారు వజ్రాభరణాలు తీసుకుని ఉడాయించాడో ఓ వ్యక్తి. పోలీసుల కళ్లుగప్పి సుమారు నాలుగేళ్లుగా తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. మూసారాంబాగ్కు చెందిన సూరజ్శర్మ అలియాస్ నితిన్ డైమా (30) కింగ్కోఠిలోని ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. 2022లో ఫేస్బుక్లో జూబ్లీహిల్స్కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకోసాగారు. ఈ క్రమంలో సూరజ్శర్మ.. తాను పెద్ద వ్యాపారినని..అంతేకాక తనకు అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మించాడు. పలుమార్లు ఆమె వద్ద నుంచి రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే వజ్రాభరణాలు, రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. కొద్ది రోజుల దాకా ఆమెతో సన్నిహితంగా ఉండడంతో నామె భర్త, పిల్లలను వదిలి సూరజ్తోనే సహజీవనం చేసింది. అయితే.. పథకం ప్రకారం నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. ఫేస్బుక్ ఖాతాను మూసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదేళ్లుగా సూరజ్ కదలికలపై నిఘా పెట్టారు. ఐదేళ్లుగా ఫోన్ వాడకుండా ఫేస్బుక్ను ఉపయోగించకుండా ఉన్న నిందితుడు.. ఇక తనను అందరూ మరిచిపోయారని భావించి పాత ఫోన్ నెంబరును యాక్టివేట్ చేయించాడు. అనంతరం ఫేస్బుక్లో కూడా యాక్టివ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు.. నిందితుడు మూసారాంబాగ్లో ఓ ఇంట్లో ఉన్నాడని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఆరా తీయగా నిందితుడి అసలు పేరు నితిన్ డైమా అని తేలింది. అతనికి వివాహం జరిగినట్లు కూడా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. :::సాక్షి, బంజారాహిల్స్ -
ప్రాణం తీసిన స్నానం సరదా
సాక్షి, పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష, పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముగ్గురు యువతుల మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవలే ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు రాసి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. -
రేప్ చేసి ఉరివేశారు?
రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్రేప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్లో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్ఎం)గా శిక్షణ పొందుతోంది.తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే! -
11 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు : వైద్యుడికి దిమ్మదిరిగింది!
సాక్షి, పుణే : దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు ఒక 75 ఏళ్ల పుణే వైద్యుడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తన డబ్బు 11 రోజుల్లో రెట్టింపు అవుతుందన్న అత్యాశకు పోయి ఒకటీ రెండూ కాదు, ఏకంగా రూ. 12 కోట్లు పోగొట్టుకున్నాడు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెడివతే భారీ లాభాలొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మ బలికారు. తమ ద్వారా పెట్టుబడి పెడితే, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా రూ. 54 కోట్ల వరకు రాబడి వస్తుందని బాధిత వైద్యుడిని నమ్మించారు. ఆయన ఆసక్తి చూపిన తర్వాత, ఆ సైబర్ మోసగాళ్లు ఆయనను "VIP Stock 24" అనే ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఈ గ్రూప్ ద్వారా, నిందితులు ఎంతో ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించే పెట్టుబడి పథకాలను పంచుకున్నారు. దీంతో మోసపోయిన వైద్యుడు తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయన్న ఆశతో, బాధితుడు అనేక వారాల పాటు డబ్బును బదిలీ చేస్తూనే వచ్చారు. అలా 12.31 కోట్లకు దోచేశారు కేటుగాళ్లు.అసలు ఏం జరిగింది?ఈ ఏడాది జనవరిలో బాధితుడికి ఒక తెలియని నంబర్ నుండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయనే సందేశం వచ్చింది. దీనికి వైద్యుడు ఆసక్తి చూపడంతో, నిందితులు ఆయన్ని "VIP Stock 24" అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంస్థ పేరుతో ఉన్న ఒక నకిలీ ట్రేడింగ్ యాప్ను ఆయన చేత డౌన్లోడ్ చేయించారు. ఆ యాప్లో ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు తప్పుడు గణాంకాలను చూపించారు. మరి కొంతమందికి లాభాలు వచ్చినట్టుగా చూపించారు. దీంతో మార్చి 7 నుండి మార్చి 18 మధ్య కేవలం 8 లావాదేవీల ద్వారా డాక్టర్ 12 కోట్లకు పైగా నిందితులు చెప్పిన 8 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. సుమారు మూడు నెలల పాటు లాభాలొస్తాయని ఆశతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే వచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్లో భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్ట్బెదిరింపులు ఒకానొక దశలో డాక్టర్ మరిన్ని నిధులు పంపడానికి నిరాకరించగా, నిందితులు ఆయన ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఆయన మరిన్ని నిధులు బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో పాటు, ఇంకా డబ్బు కావాలని వారు వేధించడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే! నోట్ : స్టాక్మార్కెట్లో పెట్టుబడి అంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తగినంత అవగాహన నిపుణుల సలహాలు అవసరం. అతి తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే స్కీములను నమ్మి పోసపోవద్దు. తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.సెబీ (SEBI) గుర్తింపు లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం అని గురించాలి. -
వ్యాపారవేత్త హత్య: దుబాయ్లో భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్ట్
హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ రావు ఇందర్జీత్ యాదవ్ను దుబాయ్లో అరెస్టు చేశారు. 2024లో హర్యానాలో ఒక వ్యాపారి హత్య ఆరోపణలతో మధ్యప్రాచ్యానికి పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ అధికారులు యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన నేర చరిత్ర పత్రాలను దుబాయ్ పోలీసులు కోరారు. త్వరలోనే అతడిని భారత్కు రప్పించే (Extradition) ప్రక్రియ పూర్తి చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. యాదవ్పై బిజినెస్ మ్యాన్ హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి బలవంతంగా రుణాలు తీసుకోవడం, ఆయుధాలతో బెదిరించడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా కమీషన్ సంపాదించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అతనిపై హర్యానా , ఉత్తర ప్రదేశ్ పోలీసులు 15కు పైగా కేసులు మరియు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. గత సంవత్సరం ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ గ్యాంగ్స్టర్పై మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.ఎవరీ రావు ఇందర్జీత్ యాదవ్?2006లో స్థాపించిన 'జెమ్ రికార్డ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' (Gems Tunes) అనే సంస్థను స్థాపించాడు. రావు ఇందర్జీత్ యాదవ్ కేవలం ఒక నిందితుడు మాత్రమే కాదు, సంగీత ప్రపంచంలో కూడా సుపరిచితుడయ్యాడు. ఈ సంస్థ హర్యానా, పంజాబీ, హిందీ భాషల్లో పాటలను నిర్మిస్తూ, OTT ప్లాట్ఫారమ్గా కూడా ఉండేది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. 2024 డిసెంబర్లో ఫైనాన్షియర్ మంజీత్ దిఘల్ హత్యలో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపుఇన్స్టాగ్రామ్లో ఇతనికి 15 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాన ఆరోపణలుయాదవ్పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు సుమారు 15కి పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ ఆరోపణల ప్రకారం వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడమే ఇతని పని. హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఇచ్చిన రుణాలను బలవంతపు వసూళ్లు మోసం, వంచన, అక్రమ భూకబ్జా, హింసాత్మక నేరాలు వంటి నేర కార్యకలాపాలలో పాలుపంచు కున్నాడు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల లోన్లను దౌర్జన్యంగా సెటిల్ చేయడం. ఇతను వందల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించే 'స్ట్రాంగ్మ్యాన్'గా వ్యవహరించేవాడు. సింగర్ రాహుల్ ఫాజిల్పురియా ఇంటిపై కాల్పులు, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనల్లో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈడీ దాడులు, పరారీమనీ లాండరింగ్ కేసులో భాగంగా గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 5 లగ్జరీ కార్లు, రూ. 17 లక్షల నగదు. కీలకమైన డాక్యుమెంట్లు మరియు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయలను ప్రైవేట్ రుణ లావాదేవీలు మరియు ఆర్థిక వివాదాలను బలవంతంగా పరిష్కరించుకోవడానికి సహకరించేవాడు. కార్పొరేట్ సంస్థలు , ప్రైవేట్ ఫైనాన్షియర్ల మధ్య రుణ పరిష్కారం కోసం యాదవ్ ఒక వెబ్సైట్ పోర్టల్ను అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్నట్లు కూడా తేలింది.ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్2024 డిసెంబర్లో, ఫైనాన్షియర్ మంజీత్ దిఘాల్ హత్య తరువాత భారత్ నుండి దుబాయ్కి పారిపోయాడు. ఈ హత్యకు హిమాంశు భావు అనే ముఠా బాధ్యత వహించింది. ఆ తరువాత గత ఏడాది జూలైలో, గాయకుడు రాహుల్ ఫాజిల్పురియా నివాసంపై జరిగిన కాల్పుల ఘటనలో యాదవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గురుగ్రామ్లో ఫాజిల్పురియా సహాయకుడు రోహిత్ షౌకీన్ హత్యకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్స్టర్, అతని అనుచరులు ప్రకటించుకున్నారు. ఆ మరుసటి నెలలోనే, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసంపై జరిగిన కాల్పులకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులలో యాదవ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే తాను గ్యాంగ్స్టర్ని కాదని, కుట్రకు బలైయ్యానని, తనపై కుట్ర జరుగుతోందని ఇటీవల దుబాయ్లో చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా? -
మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు
బెంగళూరు: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు. -
ఇంకో మార్గంలేకే ‘ఆత్మహత్య’
(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్లో పేర్కొన్నారు. ఆ మేసేజ్ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. -
తల్లి తిట్టిందని.. సైకిల్ యాత్ర!
కామారెడ్డి టౌన్ : తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి సైకిల్పై పారిపోయాడు ఓ 14 ఏళ్ల బాలుడు. సైకిల్పైనే జాతీయ రహదారిపై 50 కిలో మీటర్లు ప్రయాణం సాగించాడు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్కు చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించడంతో పంతానికి పోయి మంగళవారం మధ్యాహ్నం సైకిల్పై ఇంటి నుంచి బయల్దేరాడు. సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి అర్ధరాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్కు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆపరేషన్ కవచ్ తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి ప్రేమతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తూ ఆందోళనలో ఉన్నవారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ నేరాల నియంత్రణతోపాటు పౌరుల రక్షణే ఆపరేషన్ కవచ్ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్ధరాత్రి వేళ మానవీయ కోణంలో స్పందించి బాలుడి భవిష్యత్తును కాపాడిన దేవునిపల్లి పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి
పెనుగొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలు, బాలికలపై లైంగిక దాడులు నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి 70 ఏళ్ల వృద్ఢుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక నొప్పి అంటూ విలపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి ఆరా తీయడంతో వ్యవహారం బట్టబయలైంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ గ్రామంలో వెలగన వెంకటస్వామి (70) సోడా షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారం చేసుకునే దంపతుల ఏడేళ్ల కుమార్తె ఎల్కేజీ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాలిక సోడా దుకాణానికి వెళ్లడంతో వెంకటస్వామి చాక్లెట్ ఇస్తానంటూ లోపలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలిక రాత్రి సమయంలో అమ్మానొప్పి అంటూ విలపిస్తూ విషయాన్ని తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసాపురం ఇన్చార్జి డీఎస్పీ రఘవీర్ విష్ణు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట ఎస్ఐ కె.వెంకటరమణ ఘటనపై విచారిస్తున్నారు. నిందితుడు వెలగల వెంకటస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!!
చౌటుప్పల్: ఎంబీఏ చదివాడు... గోల్డ్మెడల్ కూడా సాధించాడు...కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్న దొంగ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ సామ్రిచర్డ్ ఎంబీఏలో గోల్డ్మెడల్ సాధించాడు. కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి మన్సూరాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ పలు వ్యాపారాలు చేశాడు. వాటిని విడిచి దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్కు వెళ్తూ చౌటుప్పల్లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని బుధవారం ఉదయం ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అతడి కారును ఆపారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌటుప్పల్లోని కంఠమహేశ్వర కాలనీలో లింగంపల్లి నర్సింహ ఇంట్లో చోరీ చేసింది తానేనని వంశీకృష్ణ ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.2.28లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ మన్మథకుమార్, సీసీఎస్ సీఐ ప్రవీణ్బాబు, ఎస్ఐలు యాదగిరి, వనం సైదులు, కుమారస్వామి పాల్గొన్నారు. కాగా, చోరీ చేసిన సొత్తుతో వంశీకృష్ణ వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతుండేవాడని, పేదలకు దాన ధర్మాలు చేయడం, అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం కూడా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. -
ట్రైనీ పైలట్పై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడి
సనత్నగర్(హైదరాబాద్): పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇన్స్ట్రక్టర్ ఓ ట్రైనీ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరువు తీసి కుటుంబ సభ్యులకు, కెరీర్కు నష్టం కలిగిస్తానంటూ బెదిరించాడు. ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువకావడంతో బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి (20) బేగంపేటలోని ఏవియాకాన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 2025లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయం వైకోం ప్రాంతానికి చెందిన నసీముద్దీన్ అలియా స్ నసీం (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీ న్ను ఒక సోదరుడిగా ఆ యువతి భావించింది. ఈ చనువు తోనే బేగంపేట బ్రాహ్మణవాడీలో ఉండే నసీముద్దీన్ వద్దకు చదువుకోవడానికి తరచూ వెళ్తుండేది. గత ఏడాది డిసెంబర్ 27న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చదువుకోవడం కోసం ఆమె నసీముద్దీన్ వద్దకు వెళ్లింది. అయితే, 7.30 గంటల సమయంలో నసీముద్దీన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ‘ది లీగ్’లో జరిగే ఫుట్బాల్ మ్యాచ్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అప్పటివరకు ఒంటరిగా చదువుకున్న యువతి.. నసీముద్దీన్ రాగానే తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పగా, ఇక్కడే ఉండాల్సిందిగా పట్టుబట్టాడు. తన కుటుంబసభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తన భార్య మోసం చేసిందని, ఆమె నుంచి తరచూ తాను వేధింపులకు గురవుతున్నానని సదరు యువతిని నమ్మబలికాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతిని బెదిరించాడు. దీంతో కొద్దిసేపు ఆమె అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో నసీముద్దీన్ తన జీవితం గురించి ఏడుస్తూ తలుపు గడియ పెట్టి ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు. తాను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అడ్డుకుని అరవకుండా నోరు మూసి, బలవంతంగా లైంగిక దాడి చేశాడు. జరిగిన సంఘటనను మరిచిపోయి ఏమీ జరగనట్లు ఉండాలని కోరాడు. నసీముద్దీన్ బెదిరింపులతో ఆమె భయపడి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత చదువుల కోసం దమ్మాయిగూడలో ఉండే మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో నసీముద్దీన్ దమ్మాయిగూడకు మకాం మార్చి అక్కడ కూడా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. దీంతో మంగళవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్పై బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(ఎఫ్), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏంటి కిరణ్.. ఇలా చేశావ్?
అదనపు కట్నం డిమాండ్ చేస్తూ ఓ యువకుడు పెళ్లికి రెండ్రోజుల ముందు పరారయ్యాడు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. తమకు న్యా యం చేయాలంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆ యువకుడి ఇంటి ఎదుట అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మంగళవారం చోటు చేసుకుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన వీరబోయిన రాజయ్య రెండో కుమారుడు కిరణ్కు, ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పొన్నాల రాజయ్య కూతురితో వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా రూ.26 లక్షలు, రెండున్నర తులాల బంగారం ఇచ్చే ఒప్పందంతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 6న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో రూ.10 లక్షల నగదు, అరతులం బంగారు ఉంగరం, రూ.72 వేల విలువ గల గొర్రెలు ముట్టజెప్పారు. ఆ తర్వాత తనకు అదనంగా మరో రూ.9 లక్షలు కావాలని కిరణ్ డిమాండ్ చేశాడు.తాము అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లికి రెండ్రోజుల ముందు మార్చి 4న కిరణ్ పరారయ్యాడని అతడి తల్లిదండ్రులు తమకు చెప్పడంతో మార్చి 6న జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే కిరణ్ను తల్లిదండ్రులే దాచిపెట్టారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మార్చి 4న కిరణ్పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు! -
హ్యాండ్ బ్రేక్ : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఇండిగో విమానానికి ప్రమాదం జరిగింది. పార్కింగ్ బేలో ఉన్న విమానాన్ని డ్రైవర్ లేని ఒక వాహనం (SUV) వచ్చి ఢీకొట్టింది.అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, మంగళవారం కోల్కతా విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్బస్ A320 (ఫ్లైట్ 6E 6663) విమానాన్ని ఒక క్యాటరింగ్ ట్రక్కు ఇండిగో విమానాన్ని ఢీకొట్టడంతో, ఆ విమానానికి స్వల్ప నష్టం వాటిల్లింది.ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయ టార్మాక్పై నిలిపి ఉంది. వాహనంలో మనుషులు లేనప్పటికీ ఇది ముందుకు వచ్చి విమానాన్ని ఢీకొట్టిందని ఇండిగో ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ విమానం కోల్కతా నుంచి గౌహతికి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాన్ని కార్యకలాపాలకు తిరిగి అనుమతించే ముందు, క్షుణ్ణమైన తనిఖీలు , అవసరమైన నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా దీన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో సంస్థ గౌహతి వెళ్లడానికి వేరే విమానాన్ని ఏర్పాటు చేసింది.అయితే ఈ వాహనానికి డ్రైవర్ హ్యాండ్బ్రేక్ వేయకుండా దిగిపోయాడు. దీనివల్ల ఆ వాహనం దానంతట అదే కదులుతూ వెళ్లి విమానం కుడి ఇంజిన్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ లేరు. కాబట్టి ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. -
న్యాయవాది దారుణ హత్య
కేవీ పల్లె: న్యాయవాది దారుణహత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం పాతవడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట శివకుమార్ కథనం ప్రకారం.. పాతవడ్డిపల్లెకు చెందిన పూజారి యల్లయ్య (36) పీలేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్గా చేస్తున్నారు. సోమవారం పాతవడ్డిపల్లెలో యల్లయ్య ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరోచోటకు మార్చే విషయమై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు వర్గం ఆయనతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో యల్లయ్యపై శ్రీనివాసులు వర్గం విచక్షణా రహితంగా దాడి చేసింది. కర్రలు, రాళ్లతో కొట్టి న్యాయవాది యల్లయ్యను హత్య చేశారు. అడ్డువెళ్లిన యల్లయ్య తల్లిదండ్రులు రెడ్డెమ్మ, వెంకటరమణపైనా దాడికి పాల్పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్కు తరలించారు. యల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు వర్గంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా.. యల్లయ్య భార్య 6 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో వారిపిల్లలు రితిక (7), గోకుల్కృష్ణ (5) అవ్వాతాత దగ్గర ఉంటున్నారు. తండ్రి హత్యకు గురికావడం, అవ్వాతాతలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరడంతో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటున్నారు. -
షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి
మెయిన్ రోడ్కాకుండా షార్ట్ కట్లో వెళ్లాలనే నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధాన రహదారిలోంచి కాకుండా, వేరే రూట్లో వెళితే తొందరగా ఇంటికి చేరుకోవచ్చని భావించారు. కానీ అదే మృత్యువుకు షార్ట్కట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. నాసిక్ జిల్లాలోని దిండోరి తహసీల్లో శుక్రవారం అర్ధరాత్రి, కారు బావిలో పడిపోవడంతో, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది సభ్యులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర విషాదం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఆరుగురు పిల్లలతో కలిసి ఒకే కారులో దిండోరిలో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి బయలుదేరారు. షార్ట్కట్లో వెళ్లాలని కారు నడుపుతున్న సునీల్ నిర్ణయించుకున్నాడు. ఇదే ఘోర తప్పిదంగా మారిపోయింది. నివేదికల ప్రకారం వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బావి గోడను ఢీకొట్టి అందులోకి దూసుకు పోయింది. బావిలో 40 అడుగుల లోతు వరకు నీరు ఉంది. కారు బావిలో పడిపోయిన శబ్దం విన్న స్థానికులు అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. నివాసితులు సహాయక చర్యలకు ప్రయత్నించి నప్పటికీ, చీకటి బావి లోతు వారికి చాలెంజ్గా మారింది. అగ్నిమాపక సిబ్బంది లైట్లను ఉపయోగించి వాహనాన్ని గుర్తించారు. తాళ్ల సాయంతో కారును బావి నుండి బయటకు లాగారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కారులో ఉన్నవారందరూ కన్నుమూశారు.మృతులలో సునీల్ దర్గుడే (32), అతని భార్య రేష్మా (27), కుమార్తె గుణవంతి (11), సునీల్ వదిన ఆశా (32), ఆమె పిల్లలు శ్రేయాష్ (11), శ్రావణి (11), శ్రద్ధ (13), సృష్టి (14), మరో బంధువు సమృద్ధి (7) ఉన్నారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులలో ఒకరైన సునీల్ దర్గుడేపై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు అభియోగాలు మోపగా, బావి యజమాని రాజేంద్ర రాజేపై నిర్లక్ష్యం కేసు పెట్టారు. ఇదీ చదవండి: రనౌట్ వివాదం : అంపైర్ను పొడిచి చంపేశాడురహదారికి ఇంత దగ్గరగా ఉన్న రాకాసిలా నోరుతెచుకుని ఉన్న అంత పెద్ద బావిని నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బావిని చాలా ఏళ్ల క్రితం నిర్మించారు, కానీ బావిని మూసివేయలేదు. ఈ విషయంపై పౌర అధికారులు, బావి యజమాని మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషాద ఘటనం తరువాత ఈ బావిని పూడ్చివేసే పనులను స్థానిక అధికారులు మొదలు పెట్టారు. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి -
కిడ్నీ ఇస్తావా, రూ. 30 లక్షలు తెస్తావా, మహిళకు కట్నం వేధింపులు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఒక మహిళ ఎదుర్కొన్న కట్న వేధింపుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేపుతోంది. పెళ్లి సమయంలో భర్త అనారోగ్యాన్ని దాచి పెట్టడమే కాకుండా, భార్యను కిడ్నీ ఇస్తావా, రూ. 30 లక్షలు తెస్తావా అంటూ వేధించిన కథనం తాజాగా వైరల్గా మారింది.ఎన్టీవీ కథనం ప్రకారం గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనలో కాన్పూర్కు చెందిన ఒక మహిళ, తన భర్త , అత్తమామలపై అత్యంత భయంకరమైన ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం 2023, జూన్ 22న లక్నోకు చెందిన నిశాంత్ కుమార్తో బాధిత మహిళ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబం భారీగా నగలు, రూ. 8 లక్షల నగదు మరియు 'మహీంద్రా థార్' కారును కట్నంగా ఇచ్చారు.అయితే పెళ్లి అయిన కొన్న రోజులకు నిశాంత్ తీవ్ర అనారోగ్యం గురించి భార్యకు తెలిసింది. పెళ్లయ్యాక భర్త తనతో శారీరక సంబంధానికి ఆసక్తి చూపేవాడు కాదు. అత్త తన గదికి వచ్చి ఇద్దరి మధ్య పడుకునేది.. అలాగే, మామగారు అనుమతి లేకుండా గదిలోకి రావడం, ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. మరోవైపు అతని నిరంతరం మందులు తీసుకుంటూ, బాత్రూంలో ఎక్కువ సమయం గడిపేవాడు. దీంతో అనుమానం వచ్చి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చి మెడికల్ రిపోర్టులు చూడగా, భర్త నిశాంత్కు రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్పై ఉన్నాడని తెలిసింది. ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని అత్తమామల్ని నిలదీయగా, "నీ కిడ్నీ అయినా ఇవ్వు లేదా పుట్టింటి నుండి రూ. 30 లక్షలు అయినా తీసుకురా" అని అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు నిశాంత్కు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆ విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసు.దీంతో ఆవేదన చెందిన ఆమె 2024 అక్టోబర్ 11న తన అత్తవారి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె కాన్పూర్లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పుట్టింటికి వెళ్లేటపుడు తన అత్తమామలు తన బ్యాగ్ను తనిఖీ చేసి, అందులోంచి నగలను తీసుకున్నారని ఆ మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె పుట్టింటికి తిరిగి వెళ్లి, అప్పటి నుంచి అక్కడే నివసిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, వరకట్నం వేధింపులు, మానసిక హింస, బెదిరింపుల సెక్షన్ల కింద ఆమె భర్త, అత్తమామలపై చకేరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్చార్జ్ అజయ్ ప్రకాష్ మిశ్రా తెలిపారు. -
రనౌట్ వివాదం : అంపైర్ను పొడిచి చంపేశాడు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లో రనౌట్ నిర్ణయం అంపైర్ ప్రాణం తీసింది. స్థానిక మ్యాచ్లో 21 ఏళ్ల క్రికెట్ అంపైర్ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించాడు అజిత్. ఇందులో భాగంగా అఇత్ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో 26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండిగాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్ సోదరుడు వాపోయాడు. కిషోర్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు!
కర్ణాటక: పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
తమ్ముడికి రూ.26 లక్షల అప్పు ఇచ్చిన అక్క..!
హైదరాబాద్: తమ్ముడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వివాహిత అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్కు చెందిన లావ్యణ్య(35) తన తమ్ముడు స్వామికి ఇతరుల వద్ద అప్పుచేసి రూ.26 లక్షలు ఇచ్చింది. అయితే ఆ డబ్బు స్వామి తిరిగి ఇవ్వక పోవడంతొ లావణ్య తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈనెల 4న పుట్టింటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి భర్త ప్రపాద్ డ్యూటీ నుంచి ఇంటికి తాళంవేసి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఓ లేఖ లభించింది. తమ్ముడికి ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందుతున్నా.. అని రాసిఉంది. దీంతో భర్త ప్రసాద్ సోమవారం మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం శ్రీనగర్కాలనీ: యువతి అదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.రమ్య(20) మధురానగర్ లక్కీ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఈనెల 3న ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని సోదరుడు నవీన్కు ఫోన్ చేసింది. యువతి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పాటు హాస్టల్కు కూడా తిరిగి రాకపోవడంతో నవీన్ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్.. వ్యక్తిఅదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్రహ్మశంకర్నగర్కు చెందిన మహేశ్(38) గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. మార్చి 28న మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్రహ్మణితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులతో పాటు పలు ప్రదేశాల్లో వెతికనా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మరణంలోనూ కలిసే పయనం
కొంగుముడులు వేసుకుని, ఏడడుగులు నడిచి, నాతిచరామి అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ రెండు జంటలూ బహుశా మరువలేదేమో! కడవరకూ కలిసే తమ పయనాన్ని సాగించాయి. మరణంలోనూ పరస్పరం వీడలేక.. కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో ఆనందంగా గడిపి.. కారులో తిరుగు ప్రయాణమైన ఓ జంట.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో హైదరాబాద్ బయలుదేరిన మరో జంట.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలూ అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికంగాను తీరని విషాదాన్ని నింపాయి. కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్ రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్నైట్ ఫంక్షన్కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్ కారు నడుపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్ ఉన్నారు.ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్ కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్ తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రూరల్ ఎస్సై వి.కిశోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు. కళ్ల ముందే జలసమాధి తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీరి్ణంచుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్ లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్ దంపతుల పలకరింపులు ఇంకా మరువక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆ దంపతుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. -
మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట!
సుండుపల్లె: రెండు నెలల్లో వివాహ బంధంతో ఒక్కటి కావాల్సిన ఆ యువజంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడడంతో వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, సుండుపల్లె ఎస్ఐ ఎస్కెఎం హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుండుపల్లెకు చెందిన మొగల్ అనీషా (18) కొంతకాలంగా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఆమె తల్లి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. అనీషాకు అదే గ్రామానికి చెందిన షేక్ అస్లాం(20)తో ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిగింది. అస్లాం ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతని తండ్రి కూడా కువైట్లో ఉపాధి పొందుతున్నాడు. అనీషా, అస్లాంకు ఈ ఏడాది జూన్లో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఆదివారం సాయంత్రం అనీషా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అస్లాం తీవ్ర మనస్తాపానికి గురై తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భార్యాభర్తలు ఇలా తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె, కాబోయే అల్లుడి మధ్య ఏం జరిగిందో తమకు తెలియదని అనీషా తండ్రి జలీల్ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. యువజంట మరణానికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు వారి ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తున్నారు. -
ప్రాణాలపై పిడుగు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులు పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. 8 మందికి గాయాలయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యువాతపడగా, ఐదుగురు గాయపడ్డారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బిహార్కు చెందిన కన్నయ్య(18) మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న బిహార్ వాసులు ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే మండలం యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలీ బొందలపాటి నాగయ్య(60) ప్రాణాలు విడిచాడు. అలాగే, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా, ఆయనపై పిడుగుపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అలాగే, ముండ్లమూరు మండలం వేములబండ పొలాల్లో పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కనిగిరి సమీపంలో పిడుగు పడి బిహార్కు చెందిన కార్మికుడు దుర్గేష్కుమార్ (24)మరణించాడు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని పొలాల్లో పిడుగులు పడి కూలీలు వి.పార్వతి(40), డి.సింహాచలం (38) ప్రాణాలు విడిచారు. గాయపడిన ముగ్గురుని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నెత్తురోడిన రోడ్లు
గంగవరం/రేణిగుంట: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సోమవారం సాయంత్రం జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి థర్డ్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న యుగంధర్(47), హరీష్(35)తోపాటు రజని, గురుమూర్తి, కిరణ్కుమార్, డ్రైవర్ జగదీష్ మొత్తం ఆరుగురు కలసి బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆదివారం స్కార్పియో కారులో తిరుపతికి వస్తుండగా మార్గమధ్యలో చిత్తూరు జిల్లా గంగవరం బైపాస్ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న చంద్రగిరి మండలానికి చెందిన యుగంధర్, తిరుపతికి చెందిన హరీష్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటకు చెందిన వంశీ(30), మునిరాజ (30) బావబామ్మర్ది. వీరు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి శెట్టిగుంటకు వెళ్తుండగా రేణిగుంట–కడప రహదారిపై మామండూరు సమీపంలో కోడూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.కాలువలోకి కారు దూసుకెళ్లి దంపతుల మృతిశుభకార్యానికి వెళ్లి వస్తుండగా అదుపు తప్పిన కారు కాలువలో కారు ముందు భాగం ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే మృతి మండపేట రూరల్ మండలంలో విషాద ఘటనకపిలేశ్వరపురం (మండపేట): శుభకార్యానికి వెళ్లి అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీకటి కావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మండపేట రూరల్ మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటి పాకల వద్ద జరిగింది. వివరాలు.. బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), బోగిళ్ల కిరణ్మయి (36) తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి కాకినాడలో శుభకార్యానికి హాజరై స్వగ్రామం మండపేట మండలం వెలగతోడుకు బయలుదేరాడు. సతీష్ కారు నడుపుతుండగా పక్క సీటులో భార్య కిరణ్మయి కూర్చున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చీకట్లో కారు అదుపు తప్పడంతో ముందు భాగం కాలువలో కూరుకుపోయింది. సతీష్, కిరణ్మయి అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లలో కూర్చున్న సతీష్ కొడుకులు మోక్షజ్ఞ, జితేష్.. అతని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మను స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి కాపాడారు. సతీష్ రాజమహేంద్రవరంలోని పేపర్మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మకు సతీష్ ఒకడే కొడుకు. అన్యోన్యంగా జీవిస్తున్న కొడుకూ కోడలు ఒకేసారి మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మండపేట సీఐ పి.దొరరాజు తెలిపారు. -
టీచర్.. మా నాన్నను చంపేశారు
చౌడేపల్లె: ‘మా నాన్నను చంపేశారు..? రండి మేడం చూపిస్తా’ అని ఐదేళ్ల బుడతడు అంగన్వాడీ టీచర్కు చెప్పాడు. చిన్నారి మాటలు విన్న ఆమె ఖంగుతిని విషయాన్ని పోలీసులకు, స్థానికులకు చెప్పింది. పోలీసులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడగా ఆ బాలుడి తండ్రి హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. సంచలనం కలిగించిన ఈ ఘటన అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన గాందీ(35) రాసతి దంపతులు ఏడాది క్రితం చౌడేపల్లి మండలం ఊటూరు సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీ పనికి చేరారు. వీరికి సందీప్(5) కుమారుడు ఉన్నాడు. అయితే బోయకొండ వద్ద గల ఆర్ఆర్ కాలనీకి చెందిన నరసింహులుతో రాసతికి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. గాందీకి ఈ విషయం తెలిసి పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భార్యకు చెప్పాడు. ప్రయోజనం లేకపోవడంతో అతను సొంతూరు వెళ్లిపోయాడు. పది రోజుల క్రితం మళ్లీ ఆర్ఆర్ కాలనీకి వచ్చాడు. తనతో పాటు రావాలని భార్యను బతిమలాడినట్లు తెలిసింది. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న గాందీని కొందరు స్నేహితులు పక్షిరాజపురం సమీపంలోకి తీసుకెళ్లారు. అయితే తన తండ్రి గాందీని కొందరు కొట్టి చంపడం చూశానని బుడతడు సందీప్ అంగన్వాడీ టీచర్కు చెప్పడం.. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హత్యగా నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి చేత రాసతినే చంపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని గాంధీ శరీరంపై గాయాలను పరిశీలించారు. బాలుడితో మాట్లాడి కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించారు. మృతుడి భార్య రాసతి పరారీలో ఉండగా ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలుడికి ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు. -
17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు
బీహార్లో చోటుచేసుకున్న భారీ దోపిడీ అక్కడి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారికి చెందిన రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని, అత్యంత పకడ్బందీగా, సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్న వైనం కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజధాని పాట్నాలో దనాపూర్లోని ఖాగౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, దుండగులు బంగారు వ్యాపారి సిబ్బంది నుండి 17 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయలు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంస్థ కేవీ & సన్స్ లో మహేష్ మమ్తోరా, ప్రిన్స్ రాన్పారియా అనే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల డెలివరీ ఇచ్చేందుకు రైలులో బీహార్కు వెళ్లారు. అక్కడ వారు రైల్వే స్టేషన్లో దిగీ దిగగానే, పక్కా ప్లాన్తో మోటార్సైకిళ్లు, కారులోవచ్చిన సుమారు ఎనిమిది మంది దుండగులు వీరిని చుట్టుముట్టారు.ఇదీ చదవండి: నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!అదీ కస్టమ్స్ శాఖ అధికారులుమంటూ వారిని చుట్టుముట్టారు. విచారణ జరపాలంటూ వారిని భయపెట్టారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనగానే బాధితులు కూడా నిజమైన అధికారులు కావొచ్చని భ్రమపడ్డారు. దీంతో బాధితులను కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత వారిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, వారి వద్ద ఉన్న రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం, దుండగులు అక్కడి నుండి ఉడాయించారు. ఆ తర్వాత తేరుకున్న బాధితులు సంస్థ యజమానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.ప్లాన్ తోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాజ్కోట్లోని 'సోని బజార్' వ్యాపారుల మధ్య ఆందోళన మరియు అలజడిని రేకెత్తించింది. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి -
ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి
గుజరాత్లోని అహ్మదాబాద్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. తల్లితండ్రులు ఆసుపత్రిలో ప్రాణాపాయ చికిత్స పొందుతున్నారు. నగరవ్యాప్తంగా అనేక హోటళ్లలో ఆహారం కలుషితమైన ఘటనలు పదేపదే నమోదవుతున్న నేపథ్యంలో మరో విషాదం తీవ్ర ఆందోళన రేపుతోంది.ఈ ఘటన చంద్ఖేడా ప్రాంతంలో జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. వీరు మార్కెట్ నుంచి రెడీ మేడ్ దోస పిండిని (ఖీరు) కొనుగోలు చేశారు ఆ పిండితో చేసిన దోసెలు తిన్న తర్వాత, కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహా (మూడు నెలల పసికందు), మిశ్రి(నాలుగేళ్ల బాలిక) చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు తల్లి భవనా ప్రజాపతి, తండ్రి విమన్ ప్రజాపతి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే, సాధారణంగా పసిపిల్లలకు ఘన ఆహారం ఇవ్వరు కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్కు గురైన తర్వాత తల్లి బిడ్డకు పాలివ్వడం వల్లనే మూడు నెలల పసికందు ప్రభావితమై ఉండవచ్చని భావిస్తున్నారు.“మా అబ్బాయి రాత్రి సుమారు 8:00 గంటలకు ఐఓసీ రోడ్డులోని ఘనశ్యామ్ డెయిరీ నుంచి పిండి తెచ్చాడు. దానితో దోసె వేసుకుని తిన్నాడు. మరుసటి రోజు ఉదయం, అతనికి వాంతులు మొదలవడంతో ఆసుపత్రిలో చేర్పించాం. ఆ తర్వాత, ఆహారం వల్ల అనారోగ్యం వచ్చిందని తెలియని అతని భార్య కూడా అదే పిండిని తిని, వారి చిన్నారికి దోసె తినిపించింది. మరుసటి రోజు నుంచి, వారికి కూడా వాంతులు మొదలయ్యాయి’’ అని విమల్ తండ్రి, గౌరీశంకర్ తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు కోడలు కేడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, చంద్ఖేడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆహార నమూనాలను సేకరించారు. మరణానికి మరణినాకి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించుకోవడానికి, పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) సహాయాన్ని కూడా కోరారు. ఫుడ్ పాయిజనింగ్ కేసు, పిండిలో కల్తీ, లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!ఈ ఘటనపై ఘనశ్యామ్ డైరీ యజమాని కేతన్ పటేల్ ఇలా అన్నారు, తాముతిరోజూ సుమారు 100 నుండి 125 కిలోల ఖీరును విక్రయిస్తాం, చాలా వినియోగదారులున్నారు, దీన్ని ఘనశ్యామ్ డైరీలోనే తయారు చేస్తాం. ఒకవేళ ఆ పిండి నిజంగానే పాడై పోయి ఉంటే, పలువురు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులొచ్చి ఉండేవి. ఈ ఒక్క ఫిర్యాదు తప్ప, మరెవరి నుండీ ఇటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. దర్యాప్తునకు తాము సహకరిస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్లో ఇండస్ట్రీమరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆహార విభాగం అధికారి డాక్టర్ తేజస్ షా మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్లో ఇండస్ట్రీ
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది. సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ, మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు. View this post on Instagram A post shared by Subashini balasubramaniyam (@subashini_balasubramaniyam)ఎవరీ సుభాషిణి సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే, ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని సక్సెస్ఫుల్ కరియర్కు బాటలు వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్తో ఆమెకు మంచి బ్రేక్త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన నటి నిలిపింది. ఈ సీరియల్లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది. -
పోలీసుల ముందే భార్య హత్య.. జహీరాబాద్లో దారుణం!
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్కు చెందిన కవిత (29) అనే మహిళ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్ తో ఉన్నట్లు గుర్తించారు.దీంతో కవితను తిరిగి జహీరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
షార్ట్ ఫిలిం షూట్ : మునిగిపోయిన ముగ్గురు స్నేహితులు
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షూట్ కోసం వెళ్లిన ముగ్గురు యవకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్స్టా ద్వారా పరిచమయ్యారు. షార్ట్ ఫిలిమ్స్పై ఆసక్తితో ఒకరికొకరు సాయం చేసుకోవాలని భావించారు. ఈనేపథ్యంలో కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నది వద్ద షార్ట్ ఫిలిం చిత్రీకరించేందుకు వెళ్లారు. అక్కడ షూట్ చేస్తుండగా, ముగ్గురూ అనూహ్యంగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హరిబాబు(25), హర్షవర్ధన్(22) మృత దేహాలను వెలికితారు. కృష్ణచైతన్య(20) ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇదీచదవండి: 5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం -
5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలకు సంబంధించిన మరో సంఘటన కలకలం రేపుతోంది. పూణేలోని ఒక మెరైన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్బాల్ బోర్డు ఫ్రేమ్ మీద పడి 20 ఏళ్ల క్యాడెట్ తీవ్ర గాయాలపాలై మరణించాడు.ఘటన వివరాలుపూణేలోని టోలానీ మెరైన్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విశాల్ వర్మ, ఆదివారం ఉదయం వ్యాయామం కోసం క్యాంపస్లోని బాస్కెట్బాల్ కోర్టుకు వెళ్లాడు. బాస్కెట్బాల్ హూప్ను పట్టుకుని పుల్-అప్స్ (Pull-ups) తీస్తుండగా, ఒక్కసారిగా ఆ ఇనుప ఫ్రేమ్ మొత్తం అతనిపై కుప్ప కూలిపోయింది.ఈ ప్రమాదంలో విశాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు మరియు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ భారీగా రక్తస్రావం కావడంతో,అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.విశాల్ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందినవాడు. 2024లో ఈ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అతని బి.టెక్ కోర్సు 2028లో పూర్తి కావాల్సి ఉంది.ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ కనుంగో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అసలు ఆ ఫ్రేమ్ ఎలా కూలిపోయింది అనే దానిపై మేము విచారణ జరుపుతాము" అని ఆయన తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇనుప ఫ్రేమ్ తుప్పు పట్టిపోయిందా? లేదా అమర్చడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో ఇన్స్పెక్టర్ సంతోష్ పాటిల్ విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్నిర్వహణలో లోపాలు యువ క్రీడాకారుల ప్రాణాలను బలి అవుతున్నారు. గత ఐదు నెలల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం ఇది మూడవసారి. ఇటీవల హర్యానాలోని రోహ్తక్లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు హార్దిక్ రాఠీ కూడా ఇలాగే బాస్కెట్బాల్ పోల్ మీద పడటంతో మరణించాడు. అలాగే హర్యానాలోని బహదూర్గఢ్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు కూడా ఇటువంటి ప్రమాదానికే బలైపోయిన సంగతి విదితమే. విషాదంగా మారుతున్న వరుస ప్రమాదాలు దేశంలోని విద్యాసంస్థలు మరియు క్రీడా ప్రాంగణాల్లోని పరికరాల భద్రత ,నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇదీ చదవండి: ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం? -
Madhapur: మైండ్స్పేస్ వద్ద ఘోరప్రమాదం
హైదరాబాద్: మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచి్చన ఓ డీసీఎం డ్రైవర్ స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని జూబ్లీహిల్స్ (దాదాపు ఐదు కిలోమీటర్లు) వరకు డీసీఎం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డాడు. శనివారం అర్థరాత్రి రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహేశ్వరంలో నివాసముంటున్న అబ్దుల్ బాసిత్ (26), అతని భార్య హనియా అయేషా (22)లు కూకట్పల్లిలో సినిమా చూసి శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఓ డీసీఎం అతివేగంగా వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అయేషా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. భర్త అబ్దుల్ బాసిత్కుగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కింద ద్విచక్రవాహనం ఇరుక్కుపోయిన విషయాన్ని డ్రైవరు గమనించకుండా 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కొందరు గిగ్ వర్కర్లు గమనించి డీసీఎంను ఆపడంతో డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ సహాయకుడు పట్టుబడటంతో అతనికి దేహశుద్ధి చేశారు. చూస్తే డ్రైవర్ అసలు స్పృహలో ఉన్నాడా, లేడా అని అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో డీసీఎం, ద్విచక్రవాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. -
విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం
వేంపల్లె : వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కదిరి డిపోకు చెందిన బస్సు వేంపల్లె నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కదిరి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లె నుంచి కదిలిన బస్సుకి ఎదురుగా టిప్పర్ రావడంతో వేరే రోడ్డు గుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో... ఆ ప్రాంతంలో కిందకి ఉన్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కండక్టర్ లక్ష్మీ నారాయణమ్మ, డ్రైవర్ ఎస్ఎం వలిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. బస్సుకు వైర్లు తగలగానే విద్యుత్ లైన్ ట్రిప్ అవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా..? ప్రస్తుతం చాగలమర్రి – రాయచోటి రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీరన్నగట్టుపల్లె వద్ద కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడంతో ఇడుపులపాయ రూరల్ ఫీడర్కు చెందిన 11 కేవీ హైటెన్సన్ విద్యుత్ వైర్లు బస్సుకు తగలడంతో దగ్ధమైందని పలువురు అంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే బస్సు దగ్ధమవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పనులు జరిగే ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించిన తర్వాత పనులు చేయాల్సి ఉండగా వాటిని తొలగించకుండానే కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. మరోవైపు ఇక్కడ ఒక్క సూచిక బోర్డూ ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డు పెట్టక పోవడంతోనే ఆర్టీసీ బస్సు డ్రెవర్ వేరే దారిలో వెళ్లేందుకు యత్నించడం వల్ల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి కూడా పనులు చేసే సమయంలో టిప్పర్ తగిలి వైర్లు తెగిపోయాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు. రోడ్డు పనులు చేసే సమయంలో ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందనే వాదన వినిపిస్తోంది. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మందస/శ్రీకాళహస్తి రూరల్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళంలో తల్లీ కూతురు మరణించగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం పంచాయతీ పెద్దకేశుపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. మడియా కృష్ణవేణి(35), ఆమె కుమార్తె మడియా లోకేశ్వరి(15) ఆవులకు నీళ్లు పెట్టేందుకు పశువుల శాలకు వెళ్లగా అదే సమయంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు వదిలారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో పిడుగుపాటుకు కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో కలవగుంట గ్రామంలో కల్లుగీత కార్మికుడు వి.కామరాజు (35) తాటిచెట్టు ఎక్కి కల్లు దించుతున్నాడు. ఒక్కసారిగా తాటిచెట్టుపై పిడుగు పడడంతో కామరాజు చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రవీకరించారు. మృతుని సొంత ఊరు ఏర్పేడు మండలం, పరమాలపల్లి గ్రామం. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
పుంగనూరు: చౌకదుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ శనివారం ఆటోలో ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెంది న 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అటవీ ప్రాంతంలోకి తీసు కెళ్లి దాడి చేసి అత్యాచారం చేశాడని, తిరిగి ఆటో లో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలాడని బాధిత కు టుంబం ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్స్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో ఉన్న ‘క్వేక్ అరేనా పబ్’లో గురువారం రాత్రి జరిగిన ‘బ్లాక్ కాఫీ’ఈవెంట్లో పాల్గొన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది డ్రగ్స్ వాడినట్లు పాజివిట్ వచ్చింది. ఇది జరిగిన రెండు రోజులకే శనివారం రాత్రి గోల్కొండ సమీపంలోని తారామతి బారాదారి వంతు వచ్చింది. ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పేరుతో నిర్వహించిన ఈవెంట్పై ఈగల్, హెచ్–న్యూ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఇక్కడ 35 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఈవెంట్ నిర్వాహకుడైన అంతర్జాతీయ డీజే, భార్యభర్తలు, మోడల్ ఉండడం గమనార్హం. దీని నిర్వాహ కుల్లో ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ డైలాన్ కూడా ఉన్నారు. ఈ ఖరీదైన పార్టీకి సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి నలుగురి నుంచి పది మంది వరకు గ్రూపులుగానూ హాజరుకావచ్చంటూ రూ.1.25లక్షల నుంచి రూ.50 వేల వరకు రేటు నిర్దేశించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమైంది. దీనిపై సమాచారం అందుకున్న ఈగల్ అధికారులు నిర్వాహకులతో పాటు అతిథుల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈవెంట్ నిర్వాహకుల్లో కీలకంగా ఉన్న అంతర్జాతీయ డీజే జాసన్కు డ్రగ్స్ వినియోగించిన చరిత్ర ఉండడంతో అప్రమత్తమయ్యారు. హెచ్–న్యూ పోలీసులతో కలిసి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పై ఆకస్మిక దాడి చేశాయి.ఈవెంట్కు హాజరైన వారి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, అధ్యయనం చేసిన బృందాలు అనుమానితులుగా ఉన్న 35 మందిని గుర్తించాయి. వీరి నుంచి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీళ్లు గంజాయితో పాటు కొకైన్ వాడినట్లు నిర్ధారించి హైదరాబాద్ నార్కోటిక్స్ ఠాణాలో కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిలో అంతర్జాతీయ డీజే జాసన్, మోడలింగ్తో పాటు యాక్టింగ్ చేసే సర్వర్, ట్రేడింగ్ వ్యాపారి నిహార్, ఈయన భార్య ఆషి, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా కంపెనీలో ఎనలిస్ట్ అభినాష్ ఉన్నారు. వీరిపై నమోదు చేసిన కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ల కింద ఆరోపణలు జోడించారు. నిందితులకు తల్లిదండ్రులు, సంబం«దీకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. ఈ డ్రగ్ ఎక్కడ నుంచి ఖరీదు చేశారనే అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు. -
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో క్రికెట్ ఆట విషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. జరిగిన ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్లో చిక్కుకుపోయింది. అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్ను అడ్డగించి డ్రైవర్ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. -
నువ్వు హీరోయిన్లా ఉన్నావు.. మోడల్ను చేస్తా..!
కర్ణాటక: నువ్వు హీరోయిన్లా ఉన్నావు, నిన్ను పెద్ద మోడల్ను చేస్తాను అని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు, గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్ చేయించాడు. లైంగిక దాడి వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఓ యువతి, జిమ్ ట్రైనర్గా పనిచేసే యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుబ్లీ నగరంలో ఇది మతం రంగు పులుముకుని లవ్ జిహాద్గా రూపాంతరం చెందింది. హిందు సంఘాల నాయకులు నిందితున్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించడం, దీంతో యువతి ఇంటిపై యువకుని కుటుంబీకులు దాడులు చేయడంతో శాంతిభద్రతల సమస్య నెలకొంది. స్నేహితురాలి సోదరుని జిమ్... ఈ వ్యవహారం పాత హుబ్లీ ఠాణా పరిధిలో సంచలనం కలిగిస్తోంది. వివరాలు.. కాలేజీలో చదివే బాధిత యువతి (20) స్నేహితురాలి సోదరుడు జిమ్ నడుపుతున్నాడు. స్నేహితురాలి సూచన మేరకు తాను జిమ్లో మూడేళ్ల కిందట చేరినట్లు యువతి తెలిపింది. ఈ క్రమంలో నిందితుడు సమీర్తో తనకు మాయమాటలు చెప్పి ప్రేమ నాటకం ఆడినట్లుగా బాధితురాలి పేర్కొంది. ఒక రోజు ఇంటికి పిలిపించుకొని మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి లైంగిక దౌర్జన్యం చేశాడు. సదరు దృశ్యాలను మొబైల్లో రికార్డు చేసుకున్నాడు. అంతేగాక ఆ దృశ్యాలను చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తు తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. తననే కాకుండా ఎందరినో ఇదేరీతిలో మోసగించాడని కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో యువతి బంధువులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం పట్టలేక సమీర్ ఇంటికి వెళ్లి అతన్ని చితకబాది స్థానిక ఠాణాలో అప్పగించారు. ఆ ఆరోపణలు అబద్ధం.. సమీర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యువతి, అతడు ప్రేమించుకుంటున్నారని, ఆరోపణలన్నీ అబద్ధమని చెప్పారు. తమపై దాడి జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్ శశికుమార్ స్పందిస్తూ ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. హిందూ యువతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రేమ పేరుతో లైంగిక సంబం«ధం పెట్టుకొని మోసగిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు, ఆమె బంధువులు చెప్పారు. సమీర్ కుటుంబీకులు తమ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో పాటు చంపేస్తామని బెదిరించారని యువతి తండ్రి చెప్పారు. యువతీ యువకుని వీడియోలు వైరల్ అయ్యాయి. -
క్యూఆర్ కోడ్.. కాగితం ముక్కలు.. ఇవే పట్టించాయి!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ నెల ఏప్రిల్ 1న రాత్రి ఆగ్రాలోని సైయాన్ ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులకు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం సవాలుగా మారింది. అయితే, మృతుడి చేతిపై ఉన్న 'లోకేంద్ర' అనే పేరు గల టాటూ (పచ్చబొట్టు) మాత్రం చెరిగిపోకుండా ఉంది.మరుసటి రోజు లోకేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన సోదరుడు రాత్రి ఇంటికి రాలేదని.. చివరిగా మహేష్ ప్రజాపతితో కలిసి కనిపించాడని పోలీసులకు తెలిపాడు. హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ఐదు బృందాలతో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో పోలీసులకు మద్యం బాటిళ్లతో పాటు కొన్ని కాగితం ముక్కలు లభించాయి. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు లోకేంద్ర భార్యను, ఆమె ప్రియుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధరమ్ వీర్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.మహేష్కు లోకేంద్ర భార్యతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఇటీవల వీరి వ్యవహారం.. లోకేంద్రకు తెలియడంతో అతను భార్యను నిలదీశాడు. దీంతో తమ అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయలుదేరగానే.. అతని భార్య మహేష్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దారిలో లోకేంద్రను కలిసిన మహేష్, మద్యం తాగుదామని ఆహ్వానించాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో లోకేంద్ర అంగీకరించాడు. వీరితో పాటు ధరమ్ వీర్ కూడా చేరాడు. పొలాల్లో మద్యం తాగుతున్న సమయంలో మహేష్, ధరమ్ వీర్ కలిసి లోకేంద్ర గొంతు నులిమి స్పృహ తప్పేలా చేశారు. ఆపై అతనిపై పెట్రోల్ పోసి.. గడ్డి కప్పి నిప్పు పెట్టినట్లు మహేష్ పోలీసులకు వివరించాడు.పశ్చిమ ఆగ్రా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య కుమార్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో దొరికిన కాగితం ముక్కల ద్వారా దర్యాప్తు మొదలైందని.. ఆ ప్రాంతంలోని ఒక పండ్ల వ్యాపారి అటువంటి కాగితాలను వాడుతుంటాడని తెలిసిందని చెప్పారు. అలాగే, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ల ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించి.. అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన బృందాలను ఆయన అభినందించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. -
పాఠశాల నుంచి వస్తూ.. అనంత లోకాలకు
హైదరాబాద్ : తండ్రితో బైక్పై వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని స్కూల్ బ్యాగ్ ఆర్టీసీ బస్సుకు తట్టుకోవడంతో కిందపడి ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో ఆ కన్నతండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డుపై నీరు పేరుకుపోవడం.. పక్కనే కారు పార్క్ చేయడంతో.. బైక్ను తప్పించబోవడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఊదురు గ్రామానికి చెందిన కంచి ప్రసాద్, సునీత దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–58లోని ప్లాట్నెంబర్ 1143లో వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. వీరి కూతురు కీర్తిక (14) వెంగళరావునగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి, కుమారుడు సాయి (11) ఆరో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే ప్రసాద్ శనివారం కూతురు, కొడుకును మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బైక్పై తీసుకువస్తున్నాడు. బైక్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1556 వద్దకు రాగానే గుంతలు తేలిన రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో పక్కకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్ చేసి ఉన్న కారును తప్పించేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకొచి్చంది. బస్సుకు కీర్తిక స్కూల్ బ్యాగ్ తట్టుకోవడంతో ఆమె కిందపడింది. టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్కు, సాయికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తిరుపతిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని మెట్రో స్టేషన్ రోడ్డంతా గుంతలమయమై మురుగునీరు పారుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు పూడ్చకపోవడం, మురుగు సమస్యకు చెక్ పెట్టకపోవడంతో శనివారం రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత పడింది. దీనికి తోడు రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన కారు కూడా ఈ ఘటనకు కారణమైందని, జీహెచ్ఎంసీ అధికారులపైనా కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివా హం జరిగింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె, శుక్రవారం రాత్రి అత్తారింటికి చేరుకుంది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా, పెళ్లైన నెల రోజులకే అఖిల బలవన్మరణానికి పాల్పడటం కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు -
వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చేదారిలేక..
గాలివీడు: అధిక వడ్డీలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరూ తనువు చాలించారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శెట్టివారిపల్లెలో నివాసం ఉంటున్న మారువేణి మల్లికార్జున (35), అతని భార్య రాణి (30) కుటుంబ అవసరాల కోసం పరిసర ప్రాంతాల వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ అప్పుల భారం తగ్గ లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం.. అప్పులు తీర్చేదారి లేక శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి 108 ద్వారా రాయచోటి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం మల్లికార్జున మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ రాణి కూడా శనివారం రాత్రి తుది శ్వాస విడిచింది. కాగా తాము ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డీకి ఇచ్చినవారి వేధింపులే కారణమని చికిత్స పొందుతున్న సమయంలో రాణి వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలకు ఎవరు దిక్కుఅంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకురాలిపై హత్యాయత్నం
పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్రెడ్డితో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్ సైకిల్పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు ‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్రెడ్డిని నిలదీశారు. -
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన లహరిక (31), మాసా యిపేటకు చెందిన ఆర్ఎంపీ రాజేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో గతేడాది డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ కావడంతో రాజేశ్ లహరికను సర్పంచ్గా నిలబెట్టగా విజయం సాధించింది. అయితే వారి ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణ గలేదు.దీంతో లహరిక ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇంతలో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలు నిర్వ హించాలని నిర్ణయించింది. దీంతో రాజేశ్ నర్సా పూర్కు వెళ్లి లహరికను ఈనెల 1న తీసుకు వచ్చా డు. గురువారం గ్రామ సభలో సర్పంచ్ లహరిక పాల్గొన్నారు. అయితే శుక్రవారం ఉద యం తన ఏడేళ్ల కొడుకు ప్రజ్వల్ను తీసుకుని గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. అనంతరం ఇంటికి చేరు కున్నారు. ఇంతలో ప్రజ్వల్ తన తండ్రికి ఫోన్చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన రాజేశ్ లహరికను ఖానాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. -
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది. లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది. వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు క్లాస్మేట్స్ తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్ చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
నవ జంట బతుకులో కల్లోలం
దొడ్డబళ్లాపురం: కొత్తగా పెళ్లయిన జంటను కారు ప్రమాదం విచ్ఛిన్నం చేసింది. ఎన్నో కలలతో శ్రీకారం చుట్టిన కొత్త జీవితం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో భార్య, బంధువు దుర్మరణం చెందారు, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా శెట్టిగెరె వద్ద బెంగళూరు–హైదరాబాద్ హైవేలో జరిగింది. రక్షిత రెడ్డి (23), పవన్రెడ్డి (30) మృతులు కాగా, రక్షితరెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డాడు.ఎలా జరిగింది?రక్షిత, రాజశేఖర్ ఇద్దరూ బెంగళూరులో ఐటీ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరికి గత నవంబర్లో వివాహమైంది. ఏపీలోని అనంతపురానికి చెందిన వీరు గురువారం నాడు కారులో బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్నారు. శెట్టిగెరె వద్ద వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, రక్షిత, బంధువు పవన్ తీవ్ర గాయాలతో దుర్మరణం చెందారు. గాయపడిన రాజశేఖర్ని స్థానికులు బెంగళూరుకు తరలించారు. ప్రమాదంతో హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.


